Advertisement
Jofra Archer
-
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్కప్లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్లలో ఈ డిఫెండింగ్ చాంపియన్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్రన్రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్ టి20 జట్టులో జోఫ్రా ఆర్చర్
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
Bengaluru: స్టంప్ బ్రేక్ చేసిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్.. కర్ణాటక టీమ్లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?! ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్షిప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్, లంకాషైర్ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా బెంగళూరుకు విచ్చేశాడు. ససెక్స్- కర్ణాటక(అండర్ 19, అండర్ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్ సెషన్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేసిన ఆర్చర్ దెబ్బకు స్టంప్ బ్రేక్ అయిపోయింది. ఇక మరో సందర్భంలో బ్యాటర్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసిన వీడియోలను ససెక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్-2024 నాటికి ఇంగ్లండ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. Jofra’s taken another wicket and broken the stump! 🚨 pic.twitter.com/9L7X2u4PEt — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 Wicket - Alsop out lbw, b Archer The KSCA XI’s newest addition looks like a decent player tbf. 😅 pic.twitter.com/KXOTr6AgRI — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 -
IPL 2024: క్యాష్ రిచ్ లీగ్కు దూరం కానున్న స్టార్ పేసర్.. కారణం?
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగం కావొద్దని అతడికి ఈసీబీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా బార్బడోస్కు చెందిన 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్-2023 సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది అతడిని ఎనిమిది కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంఛైజీ. గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరమవుతాడని తెలిసినా పెద్ద మొత్తం అతడి కోసం పక్కకు పెట్టింది. అయితే, ఐపీఎల్-2023కి అతడు అందుబాటులోకి వచ్చినా.. ఆశించిన మేర ఆర్చర్ సేవలను వినియోగించుకోలేకపోయింది. గాయాల బెడద కారణంగా అతడు సింహభాగం మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజా ఎడిషన్లో కేవలం ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్చర్.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తనపై ఖర్చు పెట్టిన మొత్తానికి న్యాయం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేసింది. అయితే, ఆర్చర్ వేలంలో పాల్గొనాలని భావించినా ఈసీబీ అందుకు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు..‘‘ఆర్చర్ పునరాగమనం చేయాలని కోరుకుంటున్న ఈసీబీ.. అతడిని ఏప్రిల్, మే మొత్తం తమ పర్యవేక్షణలోనే ఉండాలని భావిస్తోంది. ఒకవేళ అతడు వేలంలో పాల్గొంటే కచ్చితంగా ఏదో ఒక ఐపీఎల్ జట్టు అతడిని కొనుగోలు చేయడమే కాకుండా ఖర్చు తగ్గ ఫలితం పొందాలని ఆశిస్తుంది. కాబట్టి.. వరల్డ్కప్-2024 జూన్లోనే ప్రారంభమవుతున్న కారణంగా పని భారాన్ని తగ్గించుకునే వీలు ఉండకపోవచ్చు. అందుకే అతడు ఈసారి ఐపీఎల్కు దూరంగా ఉండనున్నాడు’’ అని ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. కాగా జోఫ్రా ఆర్చర్ టీ20 వరల్డ్కప్నకు ముందు ఈసీబీతో రెండేళ్లకు గానూ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆర్చర్కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 కోసం భారత్కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ మోచేయి గాయం కారణంగా..వారంలోపే తిరిగి యూకేకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తమ పేసర్ ఫిట్నెస్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. చదవండి: భారత్కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
IPL 2024: స్టార్ బౌలర్కు షాక్.. 11 మందిని వదిలేసిన ముంబై
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్గా రోహిత్ను కొనసాగించిన ముంబై.. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు షాకిచ్చింది. ఆర్చర్తో పాటు మరో 10 మందిని ముంబై మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లు వీరే.. క్రిస్ జోర్డాన్ జోఫ్రా ఆర్చర్ డువాన్ జన్సెన్ హృతిక్ షోకీన్ అర్షద్ ఖాన్ రమణదీప్ సింగ్ రాఘవ్ గోయల్ ట్రిస్టన్ స్టబ్స్ జై రిచర్డ్సన్ రిలే మెరిడిత్ సందీప్ వారియర్ ముంబై ఇండియన్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. రోహిత్ శర్మ (కెప్టెన్) జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ పీయూష్ చావ్లా డెవాల్డ్ బ్రెవిస్ తిలక్ వర్మ టిమ్ డేవిడ్ రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్) అర్జున్ టెండూల్కర్ విష్ణు వినోద్ నేహాల్ వధేరా షమ్స్ ములానీ కుమార్ కార్తికేయ ఆకాష్ మధ్వల్ జాసన్ బెహ్రెండార్ఫ్ -
CWC 2023: ప్రపంచకప్ జట్టుతో స్టార్ పేసర్
స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టుతో పాటు భారత్కు బయల్దేరనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ చీఫ్ సెలక్టర్ లూక్ రైట్ వెల్లడించాడు. ఆర్చర్ గాయం నుంచి పూర్తి కోలుకోనప్పటికీ.. ట్రావెలింగ్ రిజర్వ్గా ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉంటాడని ప్రకటించాడు. టీమ్తో ఉంటూనే ఆర్చర్ రిహాబ్లో కొనసాగుతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే ఆర్చర్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. జట్టుతో పాటు ఉంటే ఆర్చర్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వరల్డ్కప్లో ఏ సమయంలోనైనా అతని సేవలు వినియోగించుకుంటామని అన్నాడు. ఆర్చర్ త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీమ్ చేయాల్సిందంతా చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టును ప్రకటించే సందర్భంలో లూక్ రైట్ ఈ విషయాలను వెల్లడించాడు. కాగా, ఇంగ్లండ్ సెలెక్టర్లు నిన్న ప్రపంచకప్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ఓ కీలక మార్పు చేశారు. స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్.. ఎంతకీ కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఆర్చర్ గత కొన్ని నెలలుగా వేర్వేరు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆర్చర్ గాయాల జాబితాలో కుడి మోచేతి ఫ్రాక్చర్ ప్రధానమైంది. ఈ గాయం కారణంగానే అతను ప్రతిష్టాత్మక యాషెస్ సహా పలు కీలక సిరీస్లు, ఐపీఎల్ను మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్చర్ గాయాల నుంచి కోలుకుంటూ రిహాబ్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సెలెక్టర్ల తాజా నిర్ణయంతో ఆర్చర్ ఇంగ్లండ్ జట్టుతో పాటు వరల్డ్కప్కు వేదిక అయిన భారత్కు వెళ్తాడు. ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్ విల్లీ, సామ్ కర్రన్ ట్రావెలింగ్ రిజర్వ్: జోఫ్రా ఆర్చర్ -
స్టోక్స్ రీఎంట్రీ.. ఇంతలోనే ఇంగ్లండ్ టీమ్కు ఓ బ్యాడ్ న్యూస్
వరల్డ్కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడన్న శుభవార్త తెలిసిన నిమిషాల వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టుకు ఓ బాధాకరమైన వార్త కూడా తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వరల్డ్కప్ ప్లాన్స్లో లేడని ఇంగ్లండ్ సెలెక్టర్ లూక్ రైట్ చెప్పకనే చెప్పాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆర్చర్ను న్యూజిలాండ్ సిరీస్కు కూడా ఎంపిక చేయలేదని.. ఆర్చర్తో తమకు ఉన్న దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా అతని విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోలేమని రైట్ తెలిపాడు. ఆర్చర్ను న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేయనప్పటికీ, అతను ట్రావెలింగ్ రిజర్వ్గా (రిజర్వ్ ఆటగాడి) ఇంగ్లండ్ జట్టుతో పాటు ఇండియాకు బయల్దేరతాడని పేర్కొన్నాడు. ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉందని, ఒకవేళ అతను వరల్డ్కప్ సెకండాఫ్ సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోగలిగితే జట్టుతో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా వరల్డ్కప్కు కూడా ఎంపిక చేయవచ్చని హింట్ ఇచ్చాడు. ఇదే వరల్డ్కప్కు తమ ప్రొవిజనల్ స్క్వాడ్ అని కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరల్డ్కప్లో తమ తొలి మ్యాచ్ను అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్తో ఆడుతుంది. దీనికి ముందు ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తోనే 4 మ్యాచ్ల టీ20 సిరీస్, తదుపరి 4 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ల కోసం ఇంగ్లండ్ సెలెకర్లు రెండు వేర్వేరు జట్లను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్ న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ వన్డే వరల్డ్కప్కు ఇంగ్లండ్ ప్రొవిజనల్ స్క్వాడ్.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ -
రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు!
IPL 2023: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్పై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు. ముంబై తనపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా ఆర్చర్ న్యాయం చేయలేదని.. అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ముందే తెలిసినా ఐపీఎల్-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేసింది. ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్టౌన్ జట్టుకు ఆడాడు. జోఫ్రా ఆర్చర్ ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు. 8 కోట్లు పెడితే ఏం దక్కింది? ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్లో.. ‘‘జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబై ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా! ఈ సీజన్ నుంచి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిసినా గాయపడిన అతడిని కొనుగోలు చేసింది. అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. కానీ ప్రతిఫలంగా వారికి ఏం లభించింది? అతడు 100 శాతం ఫిట్నెస్ సాధించకలేకపోయాడు. కనీసం ఈ విషయం గురించి ముందే ఫ్రాంఛైజీకి సమాచారం ఇవ్వాల్సింది. అపుడైనా వాళ్లకు.. అతడి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని తెలిసేది. టోర్నీ మధ్యలో చికిత్స కోసమని స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఈసీబీ స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ముంబై ఫ్రాంఛైజీనే ఆర్చర్కు ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. యూకేకు తిరిగి వెళ్లినపుడే ఫ్రాంఛైజీ పట్ల అతడి నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు ఆర్చర్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని పేర్కొన్నాడు. చదవండి: అది కూడా కీలకమే.. పాపం రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది! -
ఆసీస్తో ప్రతిష్టాత్మక సిరీస్కు ముందు ఇంగ్లండ్కు భారీ షాక్!
England Vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా లంకాషైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండర్సన్.. సోమర్సెట్తో మ్యాచ్ సందర్భంగా గజ్జల్లో నొప్పితో విలవిల్లాడాడు. ఓల్డ్ ట్రఫోర్డ్లో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే నొప్పి కారణంగా వైదొలిగాడు. మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లంకాషైర్- సోమర్సెట్ మధ్య మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ గాయం గురించి ఆదివారం ప్రకటన చేసింది. అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం 40 ఏళ్ల ఆండర్సన్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అయితే, జూన్ 1న ఐర్లాండ్తో లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్తో ఇంగ్లండ్ ఆడనున్న ఏకైక టెస్టు నాటికి అతడు జట్టుతో చేరతాడా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొంది. విజయవంతమైన ఫాస్ట్బౌలర్ ఇదిలా ఉంటే.. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి గురించి లంకాషైర్ కోచ్ గ్లెన్ చాపెల్ బీబీసీతో మాట్లాడుతూ.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఏమీ లేదని, త్వరలోనే అతడు కోలుకుండాటని చెప్పాడు. కాగా జూన్ 16 నుంచి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడనున్న ఐదు మ్యాచ్ల యాషెస్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా ఆండర్సన్ టెస్టు క్రికెట్లో 685 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన ఫాస్ట్బౌలర్గా కొనసాగుతున్నాడు. వారితో పాటు తాజాగా ఇక ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఓలీ స్టోన్, బ్రైడన్ కార్స్ తదితరులు గాయాల బారిన పడగా.. తాజాగా ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే 2021-22 యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఐదింట నాలుగు విజయాలతో ఇంగ్లండ్ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్నైనా డ్రా చేసుకుని ఇంగ్లండ్ క్లీన్స్వీప్ గండం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక యాషెస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. జూన్ 7-11 వరకు మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. అర్చర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు. ఇక అర్చర్ స్థానాన్ని ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డన్తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. రూ.2 కోట్ల కనీస ధరకు జోర్డన్తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. "దురదృష్టవశాత్తూ మిగిలిన మ్యాచ్లకు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్ తన ఫిట్నెస్పై దృష్టి సారించేందుకు ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అతడి స్థానాన్ని క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు" అని ముంబై ఇండియన్స్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఈ ఏడాది సీజన్లో జోఫ్రా అర్చర్ అంతగా అకట్టుకోలేకపోయాడు. 5 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 9.50 ఏకానమితో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 స్పెషలిస్టు బౌలర్గా పేరుందిన క్రిస్ జోర్డన్ జట్టులో చేరడం ముంబైకు మరింత బలం చేకూరుస్తుంది. ఇంగ్లండ్ తరపున 87 టీ20లు ఆడిన జోర్డాన్ 96 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్కు జోర్డాన్ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్ -
అర్జున్ నయం.. ఆర్చర్ను నమ్మి తప్పు చేశాడా!
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. బుధవారం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆర్చర్ బౌలింగ్ను ఒక ఆట ఆడుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 56 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఆర్చర్ వీక్నెస్ ఏంటో తెలిసిన లివింగ్స్టోన్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్వాగతం పలికాడు. దీంతో దెబ్బకు ఆర్చర్ ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఆర్చర్కు ఇదే తొలిసారి. అసలు వేస్తుంది ఆర్చరా లేక దేశవాలీ క్రికెటర్ ఎవరైనానా అన్న సందేహం కలిగింది. ఏ మాత్రం పసలేని బౌలింగ్తో ఆర్చర్ ముంబై ఇండియన్స్ను ముంచాడు. జాసన్ బెహండార్ఫ్ను కాదని ఆర్చర్ను నమ్మి రోహిత్ తప్పు చేశాడు. పూర్తిగా గతి తప్పిన బౌలింగ్తో ఆర్చర్ మ్యాచ్లో ఇబ్బందులు ఎదుర్కోవడం స్పష్టంగా కనిపించింది. ఇక ఆర్చర్ బౌలింగ్ చూశాకా అర్జున్ టెండూల్కర్ నయం అని చాలామంది అభిమానులు అభిప్రాయపడ్డారు. మూడు మ్యాచ్లు ఆడిన అర్జున్ 9.3 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్తో పోలిస్తే అర్జున్ బౌలింగ్ బెటర్గా ఉందని.. అతనికి అవకాశం ఇచ్చినా బాగుండేదని పేర్కొన్నారు. Liam Livingstone hits 6,6,6 vs Jofra Archer in 3 balls. Liam Livingstone - What a beast, what a striker! pic.twitter.com/Pnx91jGohd — CricketMAN2 (@ImTanujSingh) May 3, 2023 చదవండి: సమయం వస్తే ధోనినే చెప్తాడు.. ప్రతీసారి ఎందుకీ చర్చ! -
ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే.. అగమ్యగోచరంగా ముంబై ఇండియన్స్ పరిస్థితి
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడేలో జరుగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించగా.. ముంబై 3 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో (ఆర్సీబీ, సీఎస్కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తున్న ముంబై టీమ్కు రిలాక్స్ అయ్యే లోపే మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆ తర్వాత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కేకేఆర్తో మ్యాచ్కు సైతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. కేకేఆర్తో మ్యాచ్కు ఆర్చర్ సంసిద్దతపై అతని సహచరుడు టిమ్ డేవిడ్ ఓ క్లూ వదిలాడు. ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు టిమ్ తెలిపాడు. కేకేఆర్తో మ్యాచ్కు ఆర్చర్ అందుబాటులో ఉండేది లేనిది చివరి నిమిషం వరకు చెప్పలేమని పేర్కొన్నాడు. శనివారం ఆర్చర్ కొద్దిసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడని, అనంతరం నెట్స్లో భారీ షాట్లు సైతం ఆడాడని, అయినా ఇదంతా అతను మెడికల్ టీమ్ పర్యవేక్షనలో చేస్తుండటం కొంత ఆందోళనకరమేనని చెప్పుకొచ్చాడు. మరోవైపు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ను ఢీకొనడం పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న పని అని, ఇలాంటి ప్రత్యర్ధిపై బలమైన బౌలింగ్ ఆప్షన్స్ లేకపోత చాలా కష్టమవుతుందని తెలిపాడు. గత 3 మ్యాచ్ల్లో 200 ప్లస్ స్కోర్ చేసిన కేకేఆర్ను నిలువరించాలంటే తమ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని, మ్యాచ్ సమయానికి ఆర్చర్ అందుబాటులోకి వస్తే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని అన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలను నిలువరించడం తమకు కత్తి మీద సామే అవుతుందని పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI VS CSK: 32.25 కోట్లు పెట్టి కొన్నారు, పక్కకు పెట్టారు.. ఎందుకు..?
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య భారీ అంచనాల నడుమ నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఆసక్తికర సమరంలో ఓ విషయం హైలైట్ అయ్యింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాళ్లను ఇరు ఫ్రాంచైజీలు బెంచ్కే పరిమితం చేసి పెద్ద సాహసమే చేశాయి. ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు) లేకుండా, సీఎస్కే మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) లేకుండా బరిలోకి దిగి అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. వీరు ముగ్గురు తుది జట్టులో లేకపోవడానికి గల కారణాలను సంబంధిత కెప్టెన్లు టాస్ సమయంలో వెల్లడించినప్పటికీ, అవి పొంతనలేనివిగా తెలుస్తోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాడు ఆర్చర్ గాయపడ్డాడని తొలుత చెప్పి, ఆతర్వాత ముందు జాగ్రత్త చర్యగా అతనికి రెస్ట్ ఇచ్చామని చెప్పగా.. సీఎస్కే సారధి ధోని తమ ఆటగాళ్లు మొయిన్ అలీ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని, స్టోక్స్ మడమ గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు. 32.25 కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల విషయంలో కెప్టెన్లు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో సదరు ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తి చెందని ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగానే గాయాల సాకు చూపించి వారి తప్పించినట్లు తెలుస్తోంది. మొయిన్ అలీ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 23 పరుగులు చేయగా, లక్నోపై ఆల్రౌండ్ ప్రదర్శనతో (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, 4-0-26-4) అదరగొట్టాడు. మొయిన్ అలీ నిజంగా అనారోగ్యం బారిన పడ్డాడని వదిలేస్తే, ఆల్రౌండర్గా సేవలందిస్తాడనుకున్న స్టోక్స్ మాత్రం ఆడిన 2 మ్యాచ్ల్లో తేలిపోయి, తనపై గంపెడాశలు పెట్టుకున్న ఫ్రాంచైజీని, అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ గుజరాత్పై 6 బంతుల్లో ఫోర్ సాయంతో 7 పరుగులు, లక్నోపై 8 బంతుల్లో ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్చర్ విషయానికొస్తే, భారీ అంచనాల నడుమ ఓ సీజన్ ముందుగానే బుక్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్లీష్ బౌలర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక నిరాశపరిచాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు కనీసం నామమాత్ర ప్రదర్శన కూడా చేయకుండా చేతులెత్తేస్తుండటంతో ఫ్రాంచైజీ వారిని తప్పించే సాహసం చేయక తప్పలేదు. అయితే, ఈ విషయంలో ముంబై మాట అటుంచితే, సీఎస్కే మాత్రం సత్ఫలితం రాబట్టిందనే చెప్పాలి. మొయిన్ అలీ, స్టోక్స్ లేకపోయిన టెస్ట్ ప్లేయర్గా ముద్రపడిన వెటరన్ అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను తుది జట్టులోకి తీసుకునే సీఎస్కే సక్సెస్ సాధించింది. అతనితో పాటు జడేజా (3/20), సాంట్నర్ (2/28), తుషార్ దేశ్పాండే (2/31), మగాలా (1/37), రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్) రాణించడంతో ముంబై ఇండియన్స్పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
అదే జరిగితే పుండు మీద కారం చల్లినట్లే..!
ఐపీఎల్ 16వ సీజన్ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్కేతో మ్యాచ్కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్కేతో మ్యాచ్కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్కేకు సానుకూలాంశంగా మారనుంది. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్సీబీతో మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్గా ఉన్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్సన్లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది. -
కోహ్లి దెబ్బకు ఆర్చర్కు చిప్ దొబ్బినట్లుంది!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆడిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ శుభారంభం చేసింది. ముంబై ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి(82 నాటౌట్), డుప్లెసిస్(73 పరుగులు) విధ్వంసానికి లక్ష్యం కాస్త చిన్నదైపోయింది. ఇద్దరు కలిసి తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 148 పరుగులు జోడించడంతో ఆర్సీబీకి విజయం సులువైంది. ఇక కోహ్లి ఈ మ్యాచ్లో తన చేజింగ్ పవర్ ఏంటో చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్ అజేయంగా నిలిచాడు. ఈ సంగతి పక్కనబెడితే.. మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి దెబ్బకు ఆర్చర్కు మైండ్ దొబ్బినట్లు ఉంది. ఎందుకంటే మ్యాచ్లో ఆర్చర్కు కోహ్లి చుక్కలు చూపించాడు. దీనికి తోడు టి20 క్రికెట్లో ఇప్పటివరకు కోహ్లికి ఆర్చర్ 64 బంతులు వేయగా.. కోహ్లి 85 పరుగులు పిండుకున్నాడు. ఒక్కసారి కూడా కోహ్లిని ఔట్ చేయలేకపోయాడు. ఇక ఫోటో ఎలా ఉందంటే.. కోహ్లి తన బౌలింగ్ను ఉతికి ఆరేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్పై కూలబడి తనలో తాను నవ్వుకుంటూ వింత ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కనిపిస్తుంది. నిజానికి అది కాకపోయినప్పటికి వెనకాల కోహ్లి ఉండడంతో ఫ్యాన్స్తో కోహ్లి దెబ్బకు ఆర్చర్కు చిప్ దొబ్బినట్లుంది అంటూ క్యాప్షన్ జత చేశారు. అయితే ఆర్చర్ అలా ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్మనిపించాడు. Pic of the day 🥵🔥@imVkohli 👑 • @RCBTweets pic.twitter.com/hoEKmSFf0E — Virat Kohli Trends (@Trend_Virat) April 2, 2023 చదవండి: Virat Kohli: ఆర్సీబీ ఓపెనర్గా అరుదైన రికార్డు.. -
IPL 2023: జోఫ్రా ఆర్చర్తో బుమ్రా ముచ్చట్లు! వీడియో వైరల్
Jasprit Bumrah and Jofra Archer: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఒక్క చోట చేరారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్ వీక్షించేందుకు తరలివచ్చిన వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బుమ్రా, ఆర్చర్ డెడ్లీ కాంబో చూసే అవకాశం మాత్రం ఈసారికి లేదని ఉసూరుమంటున్నారు. కాగా వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా బుమ్రా ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సహా ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ సేవలను కోల్పోనుంది. అయితే, రైట్ ఆర్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో వారికి సరైన ఆప్షన్ లభించింది. ఈ ఏడాది అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ ముంబైలో వాలిపోయి అభిమానులను ఖుషీ చేశాడీ ఇంగ్లండ్ బౌలర్. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఆర్చర్తో బుమ్రా ముచ్చట్లు ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఆదివారం నాటి మ్యాచ్ను వీక్షించేందుకు ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు బ్రబౌర్న్ స్టేడియానికి తరలివచ్చింది. హర్మన్ సేనను చీర్ చేస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సహా పలువురు ముంబై క్రికెటర్లు సందడి చేశారు. ఈ క్రమంలో జోఫ్రాతో బుమ్రా ముచ్చటిస్తున్న దృశ్యాలను ఫ్రాంఛైజీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్కు పైగా లైకులు సాధించింది. దీనిపై స్పందించిన ముంబై పల్టన్ ఫ్యాన్స్.. ‘‘బుమ్రాకు రీప్లేస్మెంట్గా జోఫ్రా.. కానీ మీ డెడ్లీ కాంబో చూసే అవకాశం లేకుండా పోయింది. బుమ్రా భాయ్ కూడా ఆడితే బాగుంటుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ను 8 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 2 నాటి మ్యాచ్తో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్లో ఆర్చర్(గతంలో రాజస్తాన్ రాయల్స్) ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ విన్నర్గా ముంబై ఇండియన్స్ అవతరించి చరిత్ర సృష్టించింది. చదవండి: BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! Shikhar Dhawan: 'మా నాన్న కొట్టాడు.. నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను' WPL 2023: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్మనీ ఎంతంటే! పీఎస్ఎల్ చాంపియన్ కంటే చాలా ఎక్కువ! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా.. క్రైస్ట్చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్గా ఏడాది కాలం పాటు క్రికెట్కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్తో మూడో టెస్ట్కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
IPL 2023: ముంబై ఇండియన్స్కు గుడ్న్యూస్.. బుమ్రా లేకపోయినా..!
Jofra Archer: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. 2022 మెగా వేలంలో 8 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ అయ్యింది. రానున్న సీజన్కు మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్చర్కు సంబంధించిన ఈ వార్త ముంబై ఇండియన్స్ యజమాన్యానికి, ఫ్యాన్స్కు భారీ ఊరట కలిగిస్తుంది. ఆర్చర్ పూర్తి సీజన్నుకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో పాటు ముంబై ఇండియన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఈసీబీ, ఎంఐ యాజమాన్యం సంయుక్తంగా ఆర్చర్ వర్క్లోడ్ను మేనేజ్ చేస్తాయని వెల్లడించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉన్న ఆర్చర్.. అక్కడ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ తర్వాత నేరుగా భారత్కు చేరుకుంటాడని స్పష్టం చేశాయి. కాగా, జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా దాదాపు 18 నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా ఎంఐ యాజమాన్యం ఆర్చర్ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. గాయం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆర్చర్.. అంతకుముందు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీఎంట్రీలో సౌతాఫ్రికాతో జరిగిన ఓ వన్డేలో ఆర్చర్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ ఆర్చర్ అద్భుతంగా రాణించాడు. ఎస్ఏ20 ఇనాగురల్ లీగ్లో ఆర్చర్ ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ కేప్టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోప్రా అర్చర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా అర్చర్ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో 30 ఏళ్ల అక్రమ్ రికార్డును అర్చర్ బ్రేక్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్లోనే అర్చర్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్కు వన్డేల్లో ఇదే కెరీర్ బెస్ట్ కూడా. తొలి ఇంగ్లండ్ బౌలర్గా.. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్.. 12 ఏళ్ల వోక్స్ రికార్డు బ్రేక్ చేశాడు. చదవండి: IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ -
తిట్టినోళ్లే మెచ్చుకున్నారు.. శెభాష్ జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తాను ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో సౌతాఫ్రికా జట్టుకు రుచి చూపించాడు. గాయంతో ఆటకు దూరమైన ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్లో కూడా ఇవే అత్యంత చెత్త గణాంకాలు. రీఎంట్రీలో చెత్త ప్రదర్శనపై విమర్శలు రావడంతో కెప్టెన్ బట్లర్ ఆర్చర్ను తర్వాతి మ్యాచ్కు పక్కనబెట్టాల్సి వచ్చింది. అయితే ఆర్చర్ ఆ మాత్రానికే కుంగిపోలేదు. రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఇలాంటి ఇబ్బందులను చాలానే ఎదుర్కొన్నాడు. ఇంతలో ఇంగ్లండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావించింది. దీంతో జోఫ్రా ఆర్చర్ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు బట్లర్. ఆర్చర్పై ఉన్న నమ్మకంతోనే అతన్ని తుది టీంలోకి ఎంపిక చేశామని టాస్ సమయంలో బట్లర్ పేర్కొన్నాడు. బట్లర్ మాటలను ఆర్చర్ నిజం చేసి చూపించాడు. రెండేళ్ల పాటు ఆటకు దూరమైన ఆర్చర్ రెండు మ్యాచ్ల వ్యవధిలోనే తన పేస్ పదునును తిరిగి అందుకున్నాడు. 9.1 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లతో సౌతాఫ్రికాను శాసించాడు. ఆర్చర్ వన్డే కెరీర్లో ఇదే బెస్ట్ స్పెల్గా నిలిచిపోనుంది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులిచ్చుకొని తిట్టించుకున్న ఆర్చర్.. వారి నోటితోనే మళ్లీ మెచ్చుకునేలా చేశాడు. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రానా తనను తక్కువ చేసి చూడొద్దని పరోక్షంగా హెచ్చరించాడు. ఇక కీలకమైన వన్డే వరల్డ్కప్కు ముందు ఆర్చర్ ఫామ్లోకి రావడం ఇంగ్లండ్కు సానుకూలమని చెప్పొచ్చు. ఒక్కసారి అతను ఫామ్లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే మ్యాచ్లో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచినప్పటికి తన అవార్డును ఆర్చర్కు ఇచ్చి అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నాడు. చదవండి: శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్కు ఓదార్పు విజయం 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే' -
శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్కు ఓదార్పు విజయం
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో ఇంగ్లండ్కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది. బట్లర్(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రీజా హెండ్రిక్స్ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో టాప్ లేపగా.. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్కప్కు ముందు ఆర్చర్ ఫామ్లోకి రావడం ఇంగ్లండ్కు శుభసూచకం అని చెప్పొచ్చు. -
రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. అయితే రీఎంట్రీలో ఆర్చర్ నాసిరకం బౌలింగ్ ప్రదర్శించాడు. 10 ఓవర్లు వేసిన ఆర్చర్ 81 పరుగులు సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆర్చర్ వన్డే కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలుగా నమోదయ్యాయి. 678 రోజుల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆర్చర్ ఒక ఓవర్లో 20 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్లో ఆర్చర్ ఒక ఓవర్లో ఇన్ని పరుగులు ఇచ్చుకోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడడంతో ఆర్చర్ బౌలింగ్ లైనప్ కాస్త గాడిన పడాల్సి ఉంది. అయితే వేన్ పార్నెల్ రూపంలో ఒక వికెట్ తీయడం ఆర్చర్కు కాస్త ఊరట అని చెప్పొచ్చు. ఇక 2023 వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్ జట్టుకు ఆర్చర్ కీలక బౌలర్గా వ్యవహరించే అవకాశం ఉంది. అప్పటిలోగా మునుపటి ఫామ్ అందుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనున్న మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్కు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. A message from Jofra to you! 🗣 pic.twitter.com/Kj2S7mE0VA — England Cricket (@englandcricket) January 27, 2023 చదవండి: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా 'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది' -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్ను ఢీకొట్టిన కేప్టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
అరివీర భయంకరుడు వచ్చేస్తున్నాడు.. ఇంగ్లండ్ను ఆపడం కష్టమే..!
Jofra Archer Returns To England ODI Squad: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో (27, 29, ఫిబ్రవరి 1) సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో జోఫ్రా చోటు దక్కించుకున్నాడు. జోఫ్రా.. 2021 మార్చిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (ఇండియాపై) ఆడాడు. మోచేయి, వెన్నెముక సర్జరీలు చేయించుకున్న జోఫ్రా.. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే ఓ వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఇంగ్లండ్ లయన్స్-ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ మధ్య జరిగిన ఆ మ్యాచ్లో లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా మునుపటి వేగాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఈసీబీ జోఫ్రాను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. కాగా, జోఫ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ముంబై ఇండియన్స్ జట్టు కూడా సంబురాల్లో మునిగిపోయింది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఫ్రాంచైజీ.. జోఫ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండడని తెలిసినా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జోఫ్రా గాయాల నుంచి కోలుకోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఇదిలా ఉంటే, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్.. జోఫ్రా చేరికతో మరింత బలపడుతుంది. ఇదివరకే పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ టీమ్.. జోఫ్రా ఎంట్రీతో పట్టపగ్గాల్లేకుండా పోతుంది. ఫార్మాట్ ఏదైనా ఇకపై ఇంగ్లండ్ను ఆపడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ తాజాగా పాక్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్కప్లో బట్లర్ సేన.. ఇదే పాక్ను ఫైనల్లో మట్టికరిపించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. సౌతాఫ్రికా టూర్కు ఇంగ్లండ్ జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, మొయిన్ ఆలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డక్కెట్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తొలి సారిగా అర్చర్ బౌలింగ్ చేశాడు. పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్కు అర్చర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్చర్ వికెట్లు ఏమీ సాధించకుండా 38 పరుగులు ఇచ్చాడు. అయితే తన పేస్ బౌలింగ్తో మాత్రం ఇంగ్లండ్ ఓపెనర్ను జాక్ క్రాలీ ముప్పు తిప్పలు పెట్టాడు. కాగా 2021లో అర్చర్ మోచేయికి గాయమైంది. అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్ ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్చర్ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఈ ఏడాది సీజన్కు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అర్చర్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై తరపున ఆడనున్నాడు. అంతకన్నా ముందు దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ముంబై కేప్ టౌన్ తరపున అర్చర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా ముంబై కేప్ టౌన్ జట్టును కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యమే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Jofra Archer perfectly fit and join England team for practice session .#mumbaiindians #IPLretention @JofraArcher #IPLAuction #Mumbai #VijayHazareTrophy #FIFAWorldCup #JoeRoot #BlackStars #BlackStars pic.twitter.com/ehRmOluSCj — Vk Raju (@rajubai93) November 23, 2022