Key
-
వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయంవాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్మెంట్’ యాడ్ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్మెంట్ యాడ్ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. -
దేశ బడ్జెట్ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!
గృహిణిగా ప్రతి ఇల్లాలు తన ఇంట్లో చేసే ప్రతి పని కుటుంబ బడ్జెట్నే గాక దేశ బడ్జెట్ని కూడా మార్చగలదు. వంటింట్లో మండే గ్యాస్ నుంచి తినే ఆహార పదార్థాలు, తాగిపడేసి బాటిల్ దాక ఆమె చేసే ప్రతి పని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడైనా ఆమె అజాగ్రత్తగా వృధా చేసిందా అది కుటుంబ బడ్జెట్నే కాదు దేశ ఆర్థికవ్యవస్థపైనే భారం పెంచేస్తుంది. ఓ మహిళగా మనం ఆచరిస్తేనే..మన కుటుంబం దాన్ని ఫాలో అవుతుంది. అదికాస్త దేశ బడ్జెట్నే మారుస్తుంది. అదెలాగో చూద్దామా..!ఫుడ్: ఇంట్లో వండిన అన్నం పిల్లలు తినకపోవడం వల్లనో వృధా అయిపోతుందా. ప్రతిరోజూ వండిన అన్నం కూరలు డస్ట్బిన్ పాలు చేస్తున్నారా!. ఇలా దేశంలోని లక్షలాది మంది చేస్తే వృధా అవుతున్న ఆహార పదార్థాల విలువ ఏకంగా ఏటా రూ. 92 వేల కోట్లుకి చేరుతుంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా ఎక్కువ. అంతేగాదు గణాంకాల ప్రకారం..దేశంలోని ప్రతి ఒక్కరూ ఏటా కిలోల కొద్ది ఆహార పదార్థాలను మట్టిపాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి దీన్ని పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో తెలుసా..!. అది మన మన దాకా చేర్చడానికి ఎంతమంది, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వస్తుందో తెలుసుకుంటే కచ్చితం వృధా చేసే సాహసం చేయరు. ఈ రోజు నుంచే ఈ వృధాని నివారిద్దాం.వాటర్: నీళ్లే కదా అని తీసి పారేయొద్దు. ప్రభుత్వం ఈ నీటి కోసం ఏటా రూ.69 వేల కోట్లు పైనే ఖర్చు చేస్తోంది. మనం నిర్లక్ష్యంగా కట్టికట్టనట్లుగా ట్యాప్ని వదిలేస్తున్నాం. ఇది వ్యర్థ జలంగా మారపోతుంది. ఇలా మన దేశంలో వృధాగా వెళ్తున్న నీరు ఏడున్నర కోట్ల లీటర్లని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి 60 శాతం పైగా నీరు మరుగునీరుగా మారిపోతున్నాయి. వీటిని వాడకంలోకి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. మహిళలు ఇక్కడ కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకునేందుకు ముందుకొస్తారు. అలా కుటుంబంతో సహా మొత్తం దేశంలో అందరిలోనే నెమ్మదిగా మార్పు వస్తుంది.కరెంట్: దేశవ్యాప్తంగా కరెండ్ వృథా ఎంతంటే ..రోజూకి ఐదు కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్ శక్తి తయారీకి అయ్యే ఖర్చు చూస్తే ఏకంగా రూ. 12 కోట్లుపైనే. మరీ ఈ భారం పడేది మనపైనే. అలాగే రేపు విద్యుత్ కొరత తలెత్తితే ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే ఇప్పటి నుంచే ఇంట్లో ప్రతి గదిని చెక్ చేసి మరీ లైట్లు, ఫ్యాన్ల స్విచ్లను ఆపేద్దాం.ప్లాస్టిక్ పనిపడదాం: ఇంట్లో ఏ సరకులు తేవాలన్నా క్యారీ బ్యాగ్ తప్పనిసరి. వాటర్ బాటిల్ నుంచి పాల ప్యాకెట్ వరకు ప్రతిదీ ప్లాస్టికే. ఏటా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తగా మారుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత నష్టాన్నీ... కాలుష్యం వల్ల వచ్చే కష్టాన్నీ అన్నింటినీ మనమే భరించాల్సి వస్తోంది. అందువల్ల ఈ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని అలవాటు చేసుకుందాంవంట గ్యాస్: మన వంటింట్లో వెలిగే గ్యాస్ పొయి అంటే మనకు ఎంత నిర్లక్యమో చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఏదో కూర మాడడం లేదా వెలిగించి కట్టడం మర్చిపోవడం వంటివి చేస్తూ అగ్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి కాస్త తెలివితో నాణ్యమైన స్టౌ ఎంచుకుంటే చక్కగా ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చు. మనకు కూడా గ్యాస్కి పెట్టే ఖర్చు తగ్గుతుంది కూడా. ముఖ్యంగా బర్నర్లు, పైపులు, రెగ్యులేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా..ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కోట్లాది రూపాయాలు ఖరీదు చేసే ఇంధనం వృధా కాకుండా నివారించొచ్చు. అందువల్ల ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసే ప్రతి పనిని జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించి.. వృధాకు అడ్డుకట్ట వేస్తే కుటుంబ బడ్జెటే కాదు దేశ బడ్జెట్ని అదుపు చెయ్యొచ్చు..లాభాలు పొందొచ్చు.(చదవండి: Union Budget 2024-25: మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్) -
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు అప్పగించారు. -
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్సాగర్రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్రెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్కుమార్రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
చట్టబద్ధత కల్పించలేం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది. ‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్తో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ విభేదించారు. నాలుగు తీర్పులు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ కౌల్ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు. కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్ కోహ్లీ తరఫున జస్టిస్ భట్ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు. దత్తతపై... అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి కమిటీ స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్ బెనిఫిట్స్ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది. దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎల్జీబీటీక్యూఐఏ++ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్సెక్స్, పాన్సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్ తదితరులు కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా – జస్టిస్ నరసింహ ఎవరేమన్నారు.. అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్అథారిటీ (సీఏఆర్ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా – జస్టిస్ ఎస్.కె.కౌల్ ఎల్జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు -జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ -
కౌలు చెల్లించాల్సింది సీఆర్డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్ నుంచి సీఆర్డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకే... ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండా ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైందని తెలిపారు. మీరు (జస్టిస్ కృష్ణమోహన్) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్) కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్కు సంబంధం లేదని, పిటిషనర్ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్ఈఐఆర్బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్ఈఐఆర్బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ల మార్పులు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ చార్ట్ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్ జాబితాను టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్ సర్వీస్మెన్) రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Updates.. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్ పవార్, స్టాలిన్ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని, త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih — ANI (@ANI) September 1, 2023 ► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Congress MP Rahul Gandhi at INDIA alliance meet in Mumbai "Today, two very big steps were taken. If parties on this stage unite, it is impossible for BJP to win elections. The task in front of us is to come together in the most efficient way. Forming a coordination… pic.twitter.com/SyDw8Tzmhk — ANI (@ANI) September 1, 2023 ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు. #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8 — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx — ANI (@ANI) September 1, 2023 ► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.' అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8 — ANI (@ANI) September 1, 2023 మూడు తీర్మాణాలు.. ► మూడు తీర్మాణాలు 1) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం 2) ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 3) జుడేగా భారత్-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు #WATCH | Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Today, INDIA parties passed three resolutions. One, we the INDIA parties hereby resolve to contest the forthcoming Lok Sabha elections together as far as possible. Seat-sharing arrangements in different states will be… pic.twitter.com/VAEXozqV9S — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut announces names of the 14-member coordination committee -- KC Venugopal (INC), Sharad Pawar (NCP), TR Baalu (DMK), Hemant Soren (JMM), Sanjay Raut (SS-UBT), Tejashwi Yadav (RJD), Abhishek Banerjee (TMC), Raghav Chadha (AAP), Javed Ali Khan… https://t.co/JrhGDqO74I pic.twitter.com/zPyGtxpdND — ANI (@ANI) September 1, 2023 ► సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party president Mallikarjun Kharge and MP Rahul Gandhi arrive at the venue of the meeting of INDIA alliance in Mumbai. pic.twitter.com/xOCth1XXm9 — ANI (@ANI) September 1, 2023 ► భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్కు చేరుకున్నారు. #WATCH | Tamil Nadu CM and DMK leader MK Stalin arrives at the venue of the meeting of the INDIA alliance in Mumbai. pic.twitter.com/UNVMmvUGme — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. Live: INDIA alliance meet Day 2 in Mumbai Live: Opposition bloc to unveil logo Read @ANI | https://t.co/OCbMsEp4Fp#INDIAAlliance #INDIA #OppositionMeeting pic.twitter.com/Tqotpp95UK — ANI Digital (@ani_digital) September 1, 2023 ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు. ► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. ► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. ► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. ► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్ను, రోవర్ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది ‘కీ’లు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్ఈఐఆర్బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్ఈఐఆర్బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. అవరోహణ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్నోట్ జారీ చేసిన టీఆర్ఈఐఆర్బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది. ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్లో మాన్యువల్గా ప్రత్యేక నంబర్తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
లగ్జరీ బీఎండబ్ల్యూ.. తాళంచెవి లేకున్నా స్టార్ట్ చేయొచ్చు.. షావోమీ కీలక ప్రకటన
స్మార్ట్ఫోన్ కంపెనీలు లగ్జరీ కార్లకు డిజిటల్ కీలు రూపొందించే పనిలో పడ్డాయి. యాపిల్ సంస్థ ఇలాంటి కార్ కీ ఫీచర్ను 2020లోనే ప్రకటించింది. ఆ తర్వాత ఒప్పో, వన్ప్లస్, వివోలు కూడా కొన్ని రోజుల క్రితం డిజిటల్ కీలను విడుదల చేశాయి. తాజాగా షావోమీ ప్రీమియం లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లకు డిజిటల్ కీ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో షావోమీ 13 సిరీస్ ప్రకటన సందర్భంగా ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటించారు. ఎంపిక చేసిన బీఎండబ్ల్యూ మోడళ్లకు డిజిటల్ కీలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!) ఈ డిజిటల్ కీలను కార్లను లాక్, అన్లాక్తో పాటు స్టార్ట్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా కారును వేరొకరికి ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ కీ బాగా ఉపయోగపడుతుంది. వారికి అసలైన కీ ఇవ్వాల్సిన పని లేకుండా కేవలం డిజిటల్ కీని మొబైల్ ద్వారా షేర్ చేయొచ్చు. ఈ డిజిటల్ కీని గూగుల్ వాలెట్ వంటి వాటితో అనుసంధానించనున్నారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
-
ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ చర్చించిన అంశాలు ఇవే
-
వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
-
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి
సాక్షి, హైదరాబాద్: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదనే అక్కసుతో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. హిమాయత్నగర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో నివాసం ఉండే వినయ్ తన భార్య సీతల్ ఆగర్వాల్ కిచెన్రూమ్ తాళం చెవి ఇవ్వాలని అడిగాడు. ఆమె తాళం చెవి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో సమీపంలో ఉన్న కత్తెరతో సీతల్పై దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న కుమార్తె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన తల్లి, కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అకారణంగా తమపై దాడికి పాల్పడిన తన భర్త వినయ్పై చర్యలు తీసుకోవాలని సీతల్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక అరెస్ట్
-
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
-
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
కరెంటు తీగలపై కారు తాళాలు తీస్తూ వ్యక్తి దుర్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి. ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు. చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే) -
వారాంతంలో గ్రూప్–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి! ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. చదవండి: కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులే..! -
పుతిన్ మిత్రుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్ సుంగోర్కిన్ నికోలెవిచ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఖబరోవ్స్క్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మృతి చెందే సమయంలో తన సహచరుడు లియోనిడ్ జఖారోవ్తో కలిసి ఉన్నట్లు సమాచారం. రష్యన్ అన్వేషకుడు, ఫార్ ఈస్ట్ పుస్తక రచయిత అయిన వ్లాదిమిర్ అర్సెనీవ్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని సేకరించడం కోసం ఖబరోవ్స్క్ పర్యటిస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసకుంది. సుంగోర్కిన్ రష్యన్ ప్రభుత్వ పత్రిక ప్రావ్దా ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ మేరకు సుంగోర్కిన్ మిత్రుడు జఖారోవ్ మాట్లాడుతూ...ఆ రోజు భోజనం చేద్దాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుంగోర్కిన్ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే...గాలిలోకి తీసువెళ్లాం. కానీ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తాము హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. ఐతే డాక్టర్లు సుంగోర్కిన్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం రష్యన్ జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. సంగోర్కిన్ తన వృత్తిపరమైన నీతికి, విధేయతకు కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అని కన్నీటి పర్యంతమయ్యారు. సుంగోర్కిన్1997 నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇటీవలే రష్యన్ వ్యాపరవేత్త, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ ఇవాన్ పెచోరిన్ అనుమానస్పద స్థితిలో మరణించిన కొద్దిరోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పుతిన్ పై హత్య ప్రయోగం జరిగిందంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలా ప్రముఖులు వరుసగా హఠాత్తుగా మృతి చెందడం బాధాకరం. -
తెలంగాణ: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఐదు మార్కులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక మండలి తాజాగా నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల కీ విడుదల అయ్యింది. మంగళవారం సాయంత్రం కీని వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపిన అధికారులు.. అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలని అభ్యర్థులను కోరారు. అయితే బోర్డు రిలీజ్ చేసిన కీ ప్రకారం.. అభ్యర్థులకు ఐదు మార్కులు కచ్చితంగా జత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యంతరాలపై రేపటి నుంచి(ఆగష్టు 31) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 సాయంత్రం ఐదు గంటల వరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలను.. విడివిడిగా తగిన ఆధారాలతో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి గనుక తీసుకుంటే.. ఇంకొన్ని మార్కులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది!. ఐదు మార్కులు! పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో ఉంచిన కీ ప్రకారం.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు జత చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కీ చివర్లో సదరు విషయాన్ని పరోక్షంగా పేర్కొంది రిక్రూట్మెంట్ బోర్డు. ఇక తెలంగాణలో ఆదివారం (ఆగస్టు 28వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలో.. 91.34 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ సహా 38 పట్టణాల్లో పరీక్ష జరగ్గా.. 6,61,198 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకుని 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు. కీ కోసం క్లిక్ చేయండి -
భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్ను సరళీకరించడం, టారిఫ్లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్ఎఫ్), ఓఆర్ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి. నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయిదు సవాళ్లు.. ‘భారత్లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది. మరిన్ని విశేషాలు.. ♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) గ్రూప్నకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి. ♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది. ♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది. -
క్లౌడ్ బరస్ట్పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘హష్’ రవాణాతో సిటీకి లింకులు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్ ఆయిల్ అక్రమ రవాణా గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచి తీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్ ఆయిల్ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్ కాల్ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు. (చదవండి: డిస్క్ంకు ఉరితాళ్లు!) -
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి, అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ. 2 లక్షలు ఖరీదు చేసే ఈ తాళం పై రాముడి చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపాడు. అయితే ఈ లాక్ని క్షేత్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు సత్యప్రకాశ్ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్లో చేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!) -
ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!
లండన్ : 50 ఏళ్ల క్రితం పోయిన ఓ పురాతన భవనానికి చెందిన తాళం చెవి మళ్లీ వెనక్కు వచ్చింది. 1973 తాళం చెవిని తీసుకెళ్లిన?? వ్యక్తి 2020లో క్షమాపణ లేఖతో సహా దాన్ని భవన నిర్వాహకులకు పంపాడు. ఈ వింత సంఘటన ఇంగ్లాండ్లోని కెంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కెంట్లోని పదకొండవ శాతాబ్దానికి చెందిన సెయింట్ లియోనార్డ్ టవర్కు చెందిన తాళం చెవి 50 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం భవన నిర్వాహకులకు ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ఈ తాళం చెవి ఉంది. దానితో పాటు ఓ క్షమాపణ లేఖ కూడా ఉంది. ( హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..) ‘‘ ప్రియమైన ఇంగ్లీష్ హెరిటేజ్.. సెయింట్ లియోనార్డ్ టవర్కు చెందిన తాళం చెవిని తీసుకోండి. దీన్ని నేను 1973లో తీసుకున్నాను. 2020లో తిరిగిస్తున్నాను. ఆలస్యం అయినందుకు క్షమించండి!’’ అని ఆ లేఖలో ఉంది. దీనిపై పురాతన భవనాలను నిర్వహిస్తున్న చారిటీ సంస్థ ఇంగ్లీష్ హెరిటేజ్ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించింది.. ‘‘50 ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న తాళం చెవిని ఇప్పుడు తిరిగివ్వటం దారుణం. సెయింట్ లియోనార్డ్ టవర్కు చెందిన తాళం చెవిని తిరిగిచ్చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు. ఆలస్యం అయిందని చింతించకండి! వాటి తాళాలను ఎప్పుడో మార్చేశాము.’’ అని పేర్కొంది. ‘‘తాళం చెవి పంపిన ఓ అజ్ఞాత వాసి.. నీ వివరాలను కూడా పంపు’’ అని కోరింది. That awkward moment when you return a key you borrowed for almost 50 years... 🗝 Thank you to the mysterious individual who recently sent us back a key to St Leonard's Tower in Kent. Don't worry about the delay, we changed the locks long ago! 🤭 pic.twitter.com/XtE7vlXRKA — English Heritage (@EnglishHeritage) December 9, 2020 -
‘కీ’ మళ్లీ విడుదల చేస్తాం: ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మళ్లీ ‘కీ’ ని అప్లోడ్ చేస్తామని వెల్లడించింది. అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ట్వీట్ చేశారు. Due to technical reasons, Secretary APPSC has withdrawn the initial key published on 26/9/2020. The key will be uploaded again shortly and the Candidates will be given three days time to raise objections if any. Secretary APPSC is deeply regretful for the Inconvenience caused. pic.twitter.com/1qX9EfSqBi— Gopal Krishna Dwivedi (@gkd600) September 28, 2020 -
అక్టోబర్లో పీజీఈసెట్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 21నుండి 24 వరకు జరిగిన టీఎస్పీజీఈసెట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు టీఎస్పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మ్-డి (పోస్ట్)లో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్పీజీసెట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే అభ్యర్థులు 28 సెప్టెంబర్ 2020 ప్రాథమిక కీతో మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే 28 సెప్టెంబర్ 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 వరకు http://pgecet.tsche.ac.in/ అభ్యర్థులు వెబ్సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఫలితాలు http://pgecet.tsche.ac.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కుమార్ మొలుగారం పేర్కొన్నారు. -
తెలంగాణ ఎంసెట్ ‘కీ’ విడుదల..
సాక్షి, జేఎన్టీయూ: రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ‘కీ’ని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎంసెట్ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్లో 1 లక్ష 19వేల187 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఎంసెట్ ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్ పేపర్ స్కానింగ్ కాపీలనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని తెలిపారు. తుది ‘కీ’ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని, ఎంసెట్ ‘కీ’ సంబంధించిన వివరాలను అభ్యర్థులు https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని గోవర్ధన్ పేర్కొన్నారు. -
ఐఫోన్ ఉండగా.. తాళం చెవి దండగ!
వాషింగ్టన్: మీ కారు డోర్ తీయడానికి తాళం చెవులకు బదులు ఐఫోన్ వాడితే ఎలా ఉంటుంది? అరే.. తాళాలు మర్చిపోయాం అనే బెంగ ఉండదంటారా! అచ్చూ ఇలానే ఆలోచించారనుకుంటా యాపిల్ డెవలపర్స్. కారు తాళం చెవుల స్థానాన్ని ఐఫోన్ తో భర్తీ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేసేస్తున్నారు. (యాపిల్ ఐఫోన్12 ఫైనల్ లుక్?) సోమవారం యాపిల్ నిర్వహించిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈ ఫీచర్ ను బయటకు చూపించారు. 2021లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లలో ఈ ఫీచర్ను యాపిల్ యాడ్ చేయబోతోంది. అతి త్వరలో మిగతా మోడల్స్కు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి కూడా ఫోన్ను చూపితే డోర్ తెరుచుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. (ట్రెండింగ్లో ఇండియన్ యాప్) -
నాకు కెమెరామెన్కు ఎలాంటి లింకూ లేదు
సినిమా: నాకు ఆయనతో సంబంధం అంటగడతారా అని మండి పడుతోంది నటి నిక్కీగల్రాణి. ఇటీవల కథానాయకిగా వెనుక పడ్డ ఈ అమ్మడు అబ్బే అదేం లేదు నేను బిజీగానే ఉన్నాను అని అంటోంది. కలగలప్పు–2, చార్లీచాప్లిన్–2 చిత్రాల తరువాత ఈ అమ్మడు నటించిన కీ చిత్రం 12న తెరపైకి రానుంది. ఇందులో జీవాతో రోమాన్స్ చేసింది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణితో చిట్చాట్ ప్ర: చిత్రం పేరు కీ అనగానే మీకేమనిపించింది? జ:సాధారణంగా కీ అంటే తాళం కప్పకు వాడే చెవి అని అని అనుకున్నాను. అయితే దర్శకుడు చెప్పింది వేరు. మనం ఏ పని చేసినా మంచి జరగవచ్చు, లేదా చెడూ జరగవచ్చునని, దానికే కీ అని అర్థం అన్నారు. కథ విన్న తరువాత నాకూ కీ అనేదానికి అర్థం తెలిసింది. ప్ర: కీ చిత్రంలో మీ పాత్ర గురించి? జ: నేనిందులో దియా అనే యువతిగా నటించాను. ఈ నాగరిక కాలంలో మనం రకరకాల ఆధునిక సెల్ఫోన్లను వాడుతున్నాం. ఒక హ్యాకర్ ద్వారా మన జీవితాలు ఎలా బాధింపునకు గురవుతాయని చెప్పే చిత్రంగా కీ ఉంటుంది. మొబైల్ ఫోన్లు వాడే ప్రతివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుంది. ప్ర:జీవాతో నటించిన అనుభవం? జ: జీవాతో కలిసి నటించడం చాలా సంతోషం. మేమిద్దం కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. అయితే కలగలప్పు–2 చిత్రం ముందుగా విడుదలైంది. జీవా నేను చాలా జాలీగా ఉంటాం. షూటింగ్లో గొడవ పడుతూనే ఉంటాం. అదే విధంగా ఇతరులను ఆట పట్టిస్తాం. షూటింగ్లో అంత జాలీగా ఉంటుంది. ప్ర:చిత్ర దర్శకుడు కలీస్ గురించి? జ: కొత్త దర్శకుడు కలీస్. చాలా జాగ్రత్తగా ఈ కథను ఎంచుకున్నారు. అంతకంటే బాగా తెరకెక్కించారు. అదే విధంగా దీనికి విశాల్ చంద్రశేఖర్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో నాకు జీవాకు ఒక డ్యూయోట్ పాట ఉంది. అది మా ఇద్దరికీ చాలా నచ్చిన పాట. ప్ర: హీరోయిన్లను అందంగా చూపించడానికి ఛాయాగ్రాహకులతో లింక్ పెట్టుకుంటారంటారు. అదే విధంగా మీరూ లింక్ పెట్టుకున్నారా? జ: నాకు కెమెరామెన్కు ఎలాంటి లింకూ లేదు. నేను నా పని చేస్తాను. ఆయన తన పని చేసుకుంటారు. అందుకే తెరపై చూస్తున్నప్పుడు సన్నివేశాలు అందంగా ఉంటాయి. అందుకు కెమెరామెన్లతో లింకు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. అలా అనడం కూడా సరికాదు. ప్ర: చిత్రాలను ఎంచుకునేటప్పుడు మీరు తీసుకునే శ్రద్ధ గురించి ? జ: చిత్రం అన్ని వర్గాల వారిని అలరించాలని నేను భావిస్తున్నాను.ముఖ్యంగా అందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలాంటి కథలకే అధిక ప్రాముఖ్యతనిస్తాను. -
కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’ విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష ‘కీ’ని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్రావు శుక్రవారం విడుదల చేశారు. రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోపు వెబ్సైట్లో ఉన్న ప్రత్యేక ఫార్మాట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అయితే సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్ష కన్నా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను కఠినంగా ఇచ్చారని, అంతేకాకుండా పలు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బోర్డు అధికారులకు కానిస్టేబుల్ అభ్యర్థులు విజ్ఞప్తులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ రాత పరీక్షపై భారీ స్థాయిలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతాయని బోర్డు అధికారులు భావిస్తున్నారు. -
ఏటీఎంకు తాళం వేసి కీ మరిచారు..
హైదరాబాద్: బ్యాంకు ఆవరణలోని ఏటీఎంలో డబ్బులు భద్రపరిచిన బ్యాంకు అధికారులు మిషన్కు తాళం వేసి.. కీని మాత్రం మరిచిపోయారు. తార్నాక విజయపురిలోని ఎస్బీఐ లాలాగూడ బ్రాంచ్లో 2 ఏటీఎం మిషన్లతో పాటు ఒక మనీ డిపాజిట్ మిషన్ను గతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకు అధికారులు ఏటీఎం మిషన్లలో డబ్బులు భద్రపరిచేందుకు తాళాలు తీశారు. డబ్బులు మిషన్లలో పెట్టిన తర్వాత మిషన్కు తాళం వేసి.. కీని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డబ్బు లు డ్రా చేసేందుకు వెళ్లిన స్థానికులు ఏటీఎంకు తాళం కీ అలాగే ఉండటాన్ని గమనించి పోలీసు లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీçసులు తాళం కీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సెలవు కావడం, బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అధికారులను రప్పించేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత బ్యాంకు అధికారులు వచ్చి కీని స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షల ‘కీ’.. అక్రమార్కుల చేతికి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్లైన్ పరీక్షలైన టోఫెల్, పీటీఈ, ఐఈఎల్టీఎస్ల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ‘కీ’లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లాడ్జిల్లో ‘కోచింగ్ సెంటర్లు’ఏర్పాటు చేసి అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో దాదాపు 40 మంది మంచి స్కోర్స్ సాధించి విదేశీ విద్యకు వెళ్లారు. మరో 40 మంది సఫలీకృతులు కాలేకపోయారు. తమ సిరీస్కు చెందిన ‘కీ’లు ఇస్తామంటూ మోసం చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వేట మొదలుపెట్టిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఏజెంట్ కె.కిరణ్కుమార్ను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన ‘కీ’లు తీసుకువచ్చి అందిస్తున్న సూత్రధారి యువరాజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వీరి ద్వారా లబ్ధిపొంది, ఆన్లైన్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకూ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పరీక్ష కోసం అయిన పరిచయంతో... నిజామాబాద్లోని ఆనంద్నగర్కు చెందిన కుర్రా కిరణ్కుమార్ 2013లో అక్కడి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2016 మేలో హైదరాబాద్కు వచ్చి కేపీహెచ్బీలో ఉన్న మలేషియా టౌన్షిప్లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాలని సిద్ధమయ్యాడు. విదేశాల్లో విద్యనభ్యసించాలని భావించే వారు ఐఈఎల్టీఎస్, పీయర్సన్ టెస్ట్స్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) వంటి పరీక్షలు ఆన్లైన్లో రాసి మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్కు పంజాబ్లోని జలంధర్కు చెందిన యువరాజ్ సింగ్తో పరిచయమైంది. పరీక్ష అడ్డదారిలో పాస్ కావడానికి సహకరిస్తానని చెప్పడంతో కిరణ్ అంగీకరించడమే గాక, పరీక్ష రాసే అభ్యర్థుల్ని వెతికే పనిలోపడ్డాడు. 12 గంటల ముందే ‘కీ’ బయటకు... పరీక్షల్లో అడ్డదారిలో స్కోర్ సాధించాలనుకునే వారి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసేవాడు. కిరణ్, యువరాజ్ సగం సగం తీసుకునేవారు. పరీక్షకు ముందు రోజు.. దాదాపు 12 గంటల ముందు యువరాజ్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ని తెచ్చి ఇచ్చేవాడు. వీరిద్దరూ కలసి స్థానికంగా ఉన్న లాడ్జిల్లో గదులు బుక్ చేసి, నగదు చెల్లించిన అభ్యర్థుల్ని తీసుకువచ్చి రాత్రంతా ప్రిపేర్ చేయించేవారు. అయితే మూడు నాలుగు సిరీస్లుండే పేపర్లో ఒక్క సిరీస్ మాత్రమే తెచ్చేవారు. మరుసటి రోజు ఆ సిరీస్ వచ్చిన వారు ఉత్తీర్ణులవుతుండగా... మిగిలిన వారికి సరైన స్కోర్ రావట్లేదు. ఇలా మంచి స్కోర్ పొందిన వారిలో 40 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మోసపోయామని ఫిర్యాదు చేయడంతో... కిరణ్కు రూ.50 లక్షలు చెల్లించిన మరో 40మందికి సరైన స్కోర్ రాలేదు. దీంతో వీరిలో కొందరు కిరణ్పై సైఫాబాద్, మీర్చౌక్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం గత వారం కిరణ్ను పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. ఇతడి విచారణలోనే యువరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి క్వశ్చన్ పేపర్ ‘కీ’ బ్రిటిష్ కౌన్సిల్ నుంచే అందుతున్నట్లు బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా ఈ దందా చేస్తున్న యువరాజ్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో పంజాబ్, హరియాణాల్లో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. వీరి ద్వారా అక్రమంగా లబ్ధిపొంది విదేశాలకు వెళ్లిన 40 మందికి నోటీసు లు జారీచేయాలని భావిస్తున్నారు. మోసపోయినట్లు చెప్తున్న వారూ అక్రమ మార్గంలో స్కోర్ సాధించాల ని ప్రయత్నించిన వారే కాబట్టి వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉం దా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు. -
తాళంతో..వేళాకోళమా..?
భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించింది. శ్రీ మందిరం నిర్వహణలో లోపాలపట్ల సుప్రీం కోర్టు పెదవి విరిచింది. దేవస్థానం పాలనా వ్యవహారాల్లో లోపాల సవరణ కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల నిర్వహణ పరిశీలించాలి. ఈ నెల 30 నాటికి సమగ్ర నివేదికను దాఖలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. జూలై నెల 5వ తేదీన శ్రీ మందిరం నిర్వహణ లోపాలకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. జగన్నాథుని దేవస్థానం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వ్యవహారాన్ని పురస్కరించుకుని కటక్ మహానగరంలో ఉంటున్న మృణాళిని పాఢి అనే మహిళ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 3 ప్రధాన అంశాలతో ఈ కేసు దాఖలైంది. భక్తులు, యాత్రికులకు వేధింపులు, లోపిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ, దేవస్థానం నిర్వహణ లోపం అంశాలపట్ల సుప్రీం కోర్టు దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె వివరించారు. లక్షలాది యాత్రికులు, భక్తులు సందర్శించే ప్రముఖ దేవస్థానాలు మోసాలకు పాల్పడరాదు. భక్తులు సమర్పించే విరాళాలు దేవుని ఖాతాలో దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి తప్ప సేవాయత్లు, ఇతరేతర ఆలయ సిబ్బంది బాగోగుల కోసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వర్గపు జీతభత్యాల్ని దేవస్థానం కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు సునాయాశంగా దైవదర్శనం కల్పించాలి. అర్చకులు ఇతరేతర అనుబంధ వర్గాలు భక్తుల నుంచి దోపిడీ వంటి చర్యలకు పాల్పడడం ఎంత మాత్రం తగదని సుప్రీం కోర్టులో విచారణ జరిపిన జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం అభిప్రాయపడింది. యాత్రికులు, భక్తుల నుంచి ఆలయ వర్గాలు ప్రత్యక్షంగా విరాళాలు, దక్షిణలు గుంజుతున్న ఆచారంపట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసాకు లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దేవస్థానాల ఆర్థిక ప్రణాళిక, వ్యవహారాలు పూచీదారితనంతో కొనసాగాలని అభిప్రాయపడింది. ప్రత్యేక ప్యానెల్తో పరిశీలన దేశంలో ప్రముఖ దేవస్థానాల సాంస్కృతిక, నిర్మాణ శైలి పరిరక్షణ కార్యాచరణ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో పేరొందిన వైష్ణోదేవి, తిరుపతి, షిర్డీ సాయి, సోమనాథ్, అమృతసర్ స్వర్ణ ఆలయాల్లో భక్తులు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దేవస్థానం నిర్వహణ, ఆలయాల సంరక్షణ వగైరా అంశాల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిశీలన నేపథ్యంలో జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో సంస్కరణలకు సిఫారసు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 30 నాటికి నివేదిక శ్రీ మందిరానికి విచ్చేస్తున్న భక్తులు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, భక్తజనం నుంచి బలవంతంగా దక్షిణలు గుంజడం వగైరా అంశాలపై వాస్తవ స్థితిగతులతో సమగ్ర నివేదికను పూరీ జిల్లా జడ్జి ప్రదానం చేయాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీ నాటికి ఈ నివేదిక దాఖలు చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నివేదిక రూపకల్పనలో జిల్లా కలెక్టర్తో పాటు అనుబంధ యంత్రాంగం, శ్రీ మందిరం పాలక మండలి పూర్తి స్థాయిలో జిల్లా జడ్జికి సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. శ్రీ మందిరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వాటి పని తీరు, పర్యవేక్షకుల వివరాల్ని నివేదికలో వివరిస్తారు. నివేదిక పరిశీలకు యామికస్ క్యూరీ జగన్నాథుని దేవస్థాన సంస్కరణలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ, పూరీ జిల్లా జడ్జి నివేదికల పరీశీలనకు యామికస్ క్యూరీగా గోపాల సుబ్రహ్మణ్యంను నియమించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ వివరణ ఆధారంగా జూలై 5వ తేదీన సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపడుతుంది. వాస్తవాల్ని బయట పెట్టండి : గవర్నర్ గణేషీ లాల్ భువనేశ్వర్ : శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వివాదాన్ని పురస్కరించుకుని గవర్నర్ పెదవి కదిపారు. తీవ్ర కలకలం రేకెత్తించిన ఈ సంఘటన వెనక వాస్తవాల్ని బయట పెట్టేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ శుక్రవారం అన్నారు. తాళం చెవి కనబడకుండా పోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ కమిషను ఏర్పాటుకు ఆదేశించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
బ్లాక్బెర్రీ కీ సిరీస్లో మరో ఫోన్
-
అద్భుత ఫీచర్లతో బ్లాక్బెర్రీ కీ2
న్యూయార్క్: బ్లాక్బెర్రీ మరో సరికొత్త ఫోన్తో బ్లాక్బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. టీసీఎల్ లైసెన్స్తో వివిధ మార్కెట్లలో ఈ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న టీసీఎల్ బ్లాక్బెర్రీ కీ సిరీస్లో మరో డివైస్ను న్యూయార్క్లో లాంచ్ చేసింది. కీ1కి సక్సెసర్గా తాజాగా కీ2 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. డీటెక్, లాకర్, పవర్ సెంటర్ లాంటి బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్లు డ్యుయల్ రియర్ కెమెరా, క్వర్టీ (ఫిజికల్) కీబోర్డు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బ్లాక్అండ్ సిల్వర్ కలర్స్ లో లభిస్తున్న దీని ధర సుమారు రూ.43,893గా ఉండనుంది. అమెరికా లో ప్రీఆర్డర్లు మొదలయ్యాయనీ, ఈ నెల చివరినుంచి షిప్పింగ్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. బ్లాక్బెర్రీ కీ2 ఫీచర్లు 4.5 అంగుళాల ఐపిఎస్ డిస్ప్లే 1620×1080 రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 6జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12+12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 3500ఎంఏహచ్ బ్యాటరీ క -
వారితో రొమాన్సే చాలు !
తమిళసినిమా : ఇప్పటికీ హీరోలతో రొమాన్సే చాలనుకుంటున్నాను అంటోంది నటి నిక్కీగల్రాణి. కోలీవుడ్లో గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన ఉత్తరాదిభామ ఈ జాణ. డార్లింగ్, కలగలప్పు–2 చిత్రాలతో తమిళ సినీరంగంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణికి ఇటీవల నటించిన పక్కా చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం కీ, చార్లిన్చాప్లిన్–2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రభుదేవాకు జంటగా చార్లిన్ చాప్లిన్–2 చిత్ర షూటింగ్ను పొల్లాచ్చిలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నిక్కీగల్రాణితో చిన్న ఇంటర్వ్యూ.. ప్ర: ప్రేమ, రొమాన్స్లాంటి పాత్రలతో పాటు యాక్షన్ కథా పాత్రల్లో నటించాలన్న ఆసక్తి లేదా? జ: నిజం చెప్పాలంటే నేను కథ, నా పాత్ర బాగుండాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. అందులో ప్రేమ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయా అన్నది ఆలోచించను. నచ్చిన కథా చిత్రాలను ఎంచుకుని నటించడం వల్లే వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్నాను. ప్ర: ప్రస్తుతం హీరోయిన్కు ప్రాముఖ్యత ఉన్న కథలను తయారు చేసుకుంటున్న క్రియేటర్స్ అధికం అవుతున్నారు. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: ప్రస్తుతానికి అలాంటి కథా చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మరొ కొన్నేళ్లు నేను హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను. నా చుట్టూ తిరిగే కథా చిత్రాలు ఇప్పుడే అవసరం అనుకోవడం లేదు. మరి కొన్ని ఏళ్లు హీరోలతో రొమాన్స్ చేసే పాత్రల్లో నటించి, ఆ తరువాత మీరంటున్న ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల గురించి ఆలోచిస్తాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న కీ, చార్లిన్ చాప్లిన్ 2 చిత్రాల గురించి? జ: నిజం చెప్పాలంటే జీవాకు జంటగా నటించడానికి అంగీకరించింది కీ చిత్రంలోనే. అయితే ఆ తరువాత ఒప్పుకున్న కలగలప్పు–2 చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. కీ చిత్రంలో గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఉండడంతో ఆ చిత్ర విడుదల్లో జాప్యానికి కారణం అని నా అభిప్రాయం. ఇందులో చలాకీగా ఉండే యువతిగా నటిస్తున్నాను. నాకు ఏది అనిపిస్తే అది చేసే పాత్ర. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించని పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక చార్లిన్ చాప్లిన్–2 చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక్క పాటనే చిత్రీకరించాల్సి ఉంది. దర్శకుడు శక్తిచిదంబరం, ప్రభుదేవా వంటి జాలీ అయిన కాంబినేషన్లో నటిస్తున్నాను. చిత్ర షూటింగ్ పండగ వాతావరణంలో సాగింది. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్ర: నెరుప్పుడా, పక్కా చిత్రాలు ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.దీనికి మీ స్పందన? జ: చిత్రం విజయం సాధింస్తుందని భావించే 100 శాతం శ్రమిస్తాం. అలాంటి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందక పోతే బాధే కదా. అయితే దేశవ్యాప్తంగా ఏడాదికి 500లకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో నా చిత్రం ఒకటి అని సరిపెట్టుకుంటాను. -
మామిడి తోటలో నకిలీ తాళం చెవి తయారీ
బ్యాంకు చోరీ ఉదంతంలో నకిలీ కీ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసులు చేపట్టిన విచారణ ఫలితాన్ని ఇచ్చింది. 24 గంటల వ్యవధిలోనే చోరీకి పాల్పడిన బ్యాంకు సిబ్బందితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఇంట్లో దాచిన 32.70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు: పోలీసులు ఊహించినట్టే నకిలీ తాళం చెవితోనే బంగారం చోరీ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉద్యోగి ఇంట్లో ఉంచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శిబిచక్రవర్తి మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరువళ్లూరు జేఎన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ చోరీలో ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 32.70 కిలోల బంగారం చోరీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బ్యాంకులో ఉంచిన నగలు చోరీకి గురైనట్టు తెలియడంతో ఖాతాదారుల ఆందోళనలు, పోలీసుల మోహరింపు తదితర సంఘటనలతో సోమవారం అర్ధరాత్రి వరకు బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే చోరీ జరిగిన తీరుపై పోలీసులకు ఏర్పడిన అనుమానంతో బ్యాంకు సిబ్బందిపైనే ఫోకస్ పెట్టారు. తాళాలు పగులగొట్టకుండా చోరీ ఎలా చేసి ఉంటారని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ శిబిచక్రవర్తి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలకమైన ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా బ్యాంకు సిబ్బందికి ఉచ్చుబిగించి విచారణ చేపట్టారు. మేనేజర్ శేఖర్, డిప్యూటీ మేనేజర్లు రంజన్, భాను, ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథన్ను వేర్వేరుగా విచారించారు. విచారణలో విశ్వనాథన్ కీలక నిందితుడిగా గుర్తించారు. నకిలీ తాళాలు తయారీ శుక్రవారం బ్యాంకు ముగిసిన తరువాత కావాలనే తాళాలు వేయకుండా వదలిపెట్టారా లేదా నకలి కీ తయారు చేసి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ సాగించారు. మొదట దశలో నకిలీ కీ తయారుచేసి ఉంటారనే కోణంలో విశ్వనాథన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వనాథన్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. బ్యాంకు కాంప్లెక్స్లో ఉన్న నీల్ గ్రీస్ సంస్థలో పనిచేసే జయగణేష్, అదే కాంప్లెక్స్లో ప్లంబర్గా పనిచేసే గౌతమ్ స్నేహితులని వారితో కలసి బ్యాంకులో చోరీకి పథకం వేసినట్టు ఒప్పుకున్నాడు. సెవ్వాపేట సమీపంలోని మామిడితోటలో వారం రోజుల పాటు శ్రమించి నకిలీ తాళం చెవి తయారు చేసినట్టు విశ్వనాథన్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని మరింత లోతైన విచారణ చేస్తున్నామన్నారు. నగలు స్వాధీనం నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం విశ్వనాథ్ ఇంట్లో దాచి ఉంచిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సిబ్బందితో కలసి లెక్కింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బ్యాంకు చోరీ వ్యవçహారం 24 గంటల వ్యవధిలోనే కొలిక్కి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చోరీ చేసిన బంగారు నగలు రూ.9 కోట్ల విలువ చేస్తాయని నిర్ధారించారు. -
ఇల్లంతా సదిరి.. తాళంచెవి ఎత్తుకెళ్లాడు
మంచిర్యాలక్రైం: పట్టణంలోని తిలక్నగర్లో ఆదివారం చోరీ జరిగింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఇల్లంత సదిరేసి ఎక్కడా ఏం దొరకక పోయేసరికి ఇంటి తాళంచెవి ఎత్తుకెళ్లిపోయాడు. పైగా తాళంచెవులు నాదగ్గర ఉన్నాయని రాసిన చిట్టీని డోర్కు అతికించి వెళ్లిపోయాడు. దీంతో వీడెం దొంగరా బాబోయ్ అంటూ కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాధితుని కథనం ప్రకారం పట్టణంలోని తిలక్ నగర్కు చెందిన మహ్మద్ బాబర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హైదరాబాద్ వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిచూసే సరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. పైగా డోర్కు ఇది తాలం చెవి నాదగ్గర ఉంది అని రాసి ఉంచాడు. గతంలో సైతం ఇదే ఇంట్లో ఇదే తరహాలో చోరీ జరిగిందని బాధితుడు బాబర్ తెలిపాడు. కాగా ఎలాంటి సొత్తు చోరీకి గురి కాకపోవడం గమనార్హం. బాబర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
టెట్ 'కీ'పై 16 వేల అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ప్రాథమిక కీపై 16వేల అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. తుది కీ విడుదలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, ఈ నెల 16న ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో టీఆర్టీ ఎస్జీటీ ‘కీ’
సాక్షి, ఎడ్యుకేషన్ : టీఎస్పీఎస్సీ పిబ్రవరి 25న నిర్వహించిన టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్ష కు నిపుణులతో రూపొందించి కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో అందుబాటులో ఉంది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే కీ ని అంతిమంగా పరిగణించాలి. టీఆర్టీలో మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే సాక్షి ఎడ్యుకేషన్.కామ్లో కీ అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం కీ కోసం క్లిక్ చేయండి ఇంగ్లిష్ మీడియం కీ కోసం క్లిక్ చేయండి -
చింపాంజీతో జీవా
తమిళసినిమా: చింపాంజీతో కలిసి వినోదాల విందునివ్వడానికి నటుడు జీవా సిద్ధం అవుతున్నారు. ఆయనతో వర్ధమాన నటి శాలినిపాండే జోడి కడుతోంది. కీ చిత్రంతో త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న నటుడు జీవా తాజా చిత్రానికి రెడీ సిద్ధం అయిపోతున్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర హైయస్ట్ కామెడీ థ్రిల్లర్ కథతో భారీ వ్యయంతో నిర్మించినున్న ఈ చిత్రానికి గోరిల్లా అనే టైటిల్ను నిర్ణయించారు. తెలుగు చిత్రం అర్జున్రెడ్డి ఫేమ్ శాలినిపాండే నాయకిగా నటించనున్న ఇందులో నిజ చింపాంజీ టైటిల్ పాత్రలో నటించనుంది. దీనికి డాన్శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ చింపాంజీలు చాలా తెలివిగా, జాలీగా ఉండడానికి కారణం వాటి అల్ల రితనమేనన్నారు. అలాంటి ఇతివృత్తంతో రూపొందించనున్న చిత్రం గెరిల్లా అని వివరించారు. ఇందులో జీవా, శాలినిపాండే హీరోహీరోయిన్లుగా నటించనుండగా థాయ్లాండ్కు చెందిన చింపాంజీ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిపారు. ఈ చింపాంజీకి థాయ్లాండ్లోని సాముట్ అనే సంతు శిక్షణ కేంద్రంలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలు హెంగోవర్–2, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వంటి చిత్రాల్లో నటించిన చింపాంజీలు ఈ కేంద్రంలోనే శిక్షణ పొందాయన్నది గమనార్హం. గెరిల్లా చిత్రం పూర్తి వినోదాత్మకంగానూ, అదే సమయంలో చాలా థ్రిల్లింగ్గానూ ఉంటూ ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. చిత్ర షూటింగ్ను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి విక్రమ్వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. -
‘టీఎస్పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా?
హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయ నియామకాల మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్స్ ఎప్పుడు నిర్వహించేది క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ మాతృభాష అయిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం మెయిన్స్ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియక గందరగోళంగా ఉందని అంటున్నారు. అలాగే, ఇతర సబ్జెక్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన రెండు రోజుల్లోనే ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ లాంగ్వేజెస్కు స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయి వారం గడుస్తున్నా ‘కీ’ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఫైనల్ కీని కూడా ఆ సబ్జెక్టులకు ప్రకటించారని, నేడు గానీ, రేపు గానీ వాటి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు తెలిపిందని, కానీ, ఇప్పటి వరకు తమకు ప్రాథమిక కీని ప్రకటించకపోవడం అన్యాయం అని వాపోతున్నారు. నేడు, రేపో ఫలితాలు రానుండటంతో ఇప్పటికే మెయిన్స్ ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఉన్నందున మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ పోస్టుల వారు చదువుకుంటారని, కానీ, తమ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ ఇటీవల లాంగ్వెజెస్కు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ని విడుదల చేయడంతోపాటు తమకు మెయిన్స్ పరీక్షల షెడ్యూలు కూడా ప్రకటించాలని వారు ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నారు. ముందు చెప్పినట్లుగా కాకుండా పాత షెడ్యూల్ స్థానంలో సవరణ చేసిన మెయిన్స్ పరీక్షల కొత్త షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్ర్కీనింగ్ టెస్టు ఫలితాలు వెల్లడి కాకపోవటం, ఈ నెల 29 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో చదువుకునేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పరీక్షలను 15 నుంచి 20 రోజులు వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, లాంగ్వెజెస్ పరీక్షలకు సంబంధించిన కీ విడుదల కాకపోవడం, మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో వారు తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
20న ఏపీసెట్ కీ విడుదల
ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) -2016 ప్రాథమిక కీని ఈనెల 20న ఏపీసెట్ వెబ్సైట్ www.apset.net.in లో ఉంచుతున్నట్లు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీ ని ఈనెల 25 వరకూ వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు పరీక్షలో వచ్చిన ప్రశ్నలపై ఎటువంటి సందేహాలున్నా ఈనెల 25వ తేదీలోగా apsetau@gmail.com మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపాలి. విద్యార్థులు తమ పరీక్ష హాల్టికెట్, ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని తెలుపుతూ సంబంధిత ఆధారాలను ఈమెయిల్కు జతపరచాలి. 25వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించరు. -
తొలిదశ ఉద్యమమే కీలకం
నల్లగొండ కల్చరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో 1969లో నిర్వహించిన ఉద్యమమే కీలకమైందని 69 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రహరి రామరాజు, మారం సంతోష్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2004 నుంచి మొదలైన తెలంగాణ మలి విడత ఉద్యమానికి 69 ఉద్యమమే స్ఫూర్తిదాయకమన్నారు. అప్పటి ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సముచితంగా గౌరవించడం లేదని, వారందరిని గుర్తించి వెంటనే వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుల మల్లయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, ఏళ్ల చంద్రారెడ్డి, కంది సూర్యనారాయణ, లక్ష్మారెడ్డి, మనోహర్రావు, టి.సుజాత, ఎ.జయమ్మ, సీతారాంరెడ్డి, వెంకటయ్య, కాశయ్య, హమీద్ఖాన్, సురేష్, లక్ష్మయ్య, ముస్తఫా, రాములు, సత్యనారాయణ, సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధిలో కీలకం కావాలి
డీపీఆర్సీ సభ్యులకు అదనపు కమిషనర్ సుధాకర్ సూచన సామర్లకోట : పంచాయతీల అభివృద్దిలో జిల్లా పంచాయతీ రీసోర్సు సెంటర్(డీపీఆర్సీ) సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు కమిషనర్ కె.సుధాకర్ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలడీపీఆర్సీ సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పంచాయతీల సిబ్బంది పనిలో లోపాల్ని గమనించి, సవరించాల్సిన బాధ్యత డీపీఆర్సీ సభ్యులపై ఉందన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ పంచాయతీ, పన్నుల సవరణ, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తరువాత మండల స్థాయిలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీలల్లో 21 రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పించామని, ఆ వ్యవధి చాలక పోతే మరో వారం పొడిగిస్తామని తెలిపారు. ఈ సెంటర్లలో సిబ్బంది సక్రమంగా పని చేసేలా చూడవలసిన బాధ్యత విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లపై ఉందన్నారు. డీపీఆర్సీ సెంటర్లలో ండే డీఎల్పీఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేసి, ఆయా జిల్లాలకు మంచిపేరు తీసుకు రావాలని సూచించారు. ప్రిన్సిపాల్ తోట కైలాస్గిరీశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఫ్యాకల్టీలు కె.ప్రభాకర్, రామోహనరావు, ఇ.నాగలక్ష్మి, సిల్వియా, జె.రాంబాబు, గోపాలరావు, సత్యవాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. -
ఎస్ఐ రాత పరీక్ష కీ విడుదల
21 లోగా అభ్యంతరాలు నివేదించాలి: రిక్రూట్మెంట్ బోర్డు సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) ప్రిలిమినరీ రాత పరీక్ష కీ పేపర్ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 539 పోస్టులకు ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వీటిలో సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాలకు సంబంధించిన కీని బోర్డు వెబ్సైట్లో ఉంచింది. కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించిన కీ పేపర్ను విడుదల చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్లో కనిపించట్లేదు. దీన్ని మంగళవారం ఉదయంలోగా సరిచేస్తామని అధికారులు తెలిపారు. సివిల్కు సంబంధించిన పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా దొర్లినట్లు పీఆర్బీ గుర్తించింది. ప్రశ్నపత్రం కోడ్-ఎలో 148, కోడ్-బిలో 163, కోడ్-సిలో 169, కోడ్-డిలో 153 ప్రశ్నను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇచ్చిన 200 ప్రశ్నలకు 199 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. కీ పేపర్లో అభ్యంతరాలుంటే ఈ నెల 21లోగా జ్ఛుడౌఛ్జ్ఛఛ్టిజీౌటచిటజీః్టటఞటఛ.జీ మెయిల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. -
వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
22 వరకు అభ్యంతరాల స్వీకరణ 27న జేఈఈ ఫలితాలు.. అందుబాటులో ప్రశ్నపత్రాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష కీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ నెల 3న జరిగిన ఆఫ్లైన్, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష కీ పేపర్లను సోమవారం http://jeemain.nic.in వెబ్సైట్లో ఉంచింది. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోగా తెలియజేయాలని సూచించింది. వాటికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం వేర్వేరుగా లింక్లను ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్వర్డ్ పొందుపరిచి కీలను పొందొచ్చని తెలిపింది. అలాగే జేఈఈ మెయిన్ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా అందుబాటులో ఉంచింది. ఆఫ్లైన్ పరీక్షకు సంబంధించిన ఈ, ఎఫ్, జీ, హెచ్ కోడ్ ప్రశ్న పత్రాలు, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచింది. ఇక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 30న లేదా అంతకన్నా ముందే విడుదల చేస్తామని వివరించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 59,731 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29 నుంచి అడ్వాన్స్డ్కు దరఖాస్తులు ఈనెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్లో అత ్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. ఐఐ టీల్లో ప్రవేశాల కోసం మే 22న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. వాటి ఫలితాలను జూన్ 12న ప్రకటించి, జూన్ 20న సీట్లు కేటాయించనుంది. -
ఐసిస్ చేతిలోని నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాక్
-
ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2015 కీను ఆదివారం విడుదల చేశారు.ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు ఎంసెట్ కీను విడుదల చేశారు. ప్రస్తుతం తాము విడుదల చేసిన ఎంసెట్ కీను WWW.apeamcet.org వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపారు.దీనిపై విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఫ్యాక్స్ నంబర్ 088423405కు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఈనెల 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మెడికల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
బ్యాంకు లాకరు కీ పోతే..
ఎంత జాగ్రత్తగా దాచుకున్నా ఇంటివి కావొచ్చు... వాహనంవి కావొచ్చు.. తాళం చెవులను ఎక్కడో ఒక దగ్గర మర్చిపోవడమో లేక పోగొట్టుకోవడమో లాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. ఇవి మన చేతిలో విషయాలే కాబట్టి డూప్లికేట్ తయారు చేయించుకోవడం లేదా కొత్త తాళం కొనుక్కోవడమో చేస్తుంటాం. మరి.. ఎంతో విలువైన వాటిని భద్రపర్చుకునే బ్యాంకు లాకరు తాళం చెవి పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? కొత్తది తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎంత భారం పడుతుంది? ఇలాంటివి వివరించేదే ఈ స్టోరీ. సాధారణంగా లాకరు తీసుకునేటప్పుడు బ్యాంకును బట్టి ముందుగానే 3 సంవత్సరాల సరిపడా అద్దె, బ్రేకింగ్ చార్జీలు (అత్యవసర పరిస్థితుల్లో లాకరును పగలగొట్టాల్సి వచ్చే సందర్భాల కోసం) కట్టాల్సి ఉంటుంది. తాళం చెవుల విషయానికొస్తే.. లాకరుకు రెండు తాళం చెవులు ఉంటాయి. మనకు ఒకటే ఇస్తారు. రెండోది బ్యాంకు దగ్గర ఉంటుంది. ఈ రెండూ ఉపయోగిస్తేనే లాకరు తెరవడం సాధ్యపడుతుంది. మనకి ఇచ్చే దానికి డూప్లికేటు ఉండదు కాబట్టి తాళం చెవిని అత్యంత జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఎంత జాగ్రత్త పడినా కీ పోయిందంటే.. ఆ విషయాన్ని బ్రాంచి మేనేజరుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. తద్వారా తాళం చెవి దొంగిలించిన వారు దుర్వినియోగం చేయకుండా చూడొచ్చు. ఇక ఆ తర్వాత కొత్త లాకరు ఏర్పాటు చేయడమో లేదా డూప్లికేట్ కీస్ చేయించి ఇవ్వడమో చేస్తుంది బ్యాంకు. ఇందుకోసం సదరు లాకరును తయారీ చేసిన కంపెనీకి బ్యాంకు సమాచారం ఇస్తుంది. ఆ కంపెనీ టెక్నీషియన్ బ్యాంకుకు వచ్చి, అధికారులు, ఖాతాదారుల సమక్షంలో మాత్రమే లాకరును కట్ చేసి తెరుస్తాడు. లాకరులో దాచిన వస్తువుల గురించి వివాదం తలెత్తకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త. ఒకవేళ ఖాతాదారు రాలేకపోయిన పక్షంలో.. బ్యాంకే లాకరును బ్రేక్ చేయించి, అందులోని వస్తువులను సీల్డ్ బాక్సులో ఉంచి కస్టమరుకు తర్వాత అందజేస్తుంది. అయితే, పోయింది చిన్న తాళం చెవే కదా మహా అయితే యాభయ్యో, వందో చార్జీ పడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కొత్త తాళం, కీ కోసం కొన్ని బ్యాంకులు దాదాపు రూ. 1,000 నుంచి రూ. 3,000 దాకా వసూలు చేస్తున్నాయి. అదనంగా సర్వీసు చార్జీలు కూడా ఉంటాయి. లాకరు కంపెనీ టెక్నీషియన్ని రప్పించి, లాకరును చూపించి, డూప్లికేట్ కీ చేయించి ఇచ్చే క్రమంలో ఎదురయ్యే రవాణా, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు మొదలైన వాటిని బ్యాంకు ఈ విధంగా తీసుకుంటుందన్న మాట. అలాగని అన్ని లాకర్లకు ఒకే రేటు ఉండదు. లాకరు సైజును బట్టి కట్టాల్సిన చార్జీల పరిమాణం మారుతుంటుంది. ఇన్ని తలనొప్పులు ఎదురవకుండా ఉండాలంటే.. లాకరు కీని భద్రంగా దాచుకోవడం ఉత్తమం? -
జూనియర్ లెక్చరర్ల 'కీ' తప్పులతడక!
‘అమర్త్య సేన్కు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన అంశం?’ ఈ ప్రశ్నకు జనరల్ నాలెడ్జ్లో కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ‘సంక్షేమ అర్థ శాస్త్రం’ అని జవాబు చెబుతారు. కానీ మన ఘనత వహించిన ఏపీపీఎస్సీ మాత్రం ‘అంతర్జాతీయ వర్తకం’ సరైన సమాధానమంటుంది. ఆ జవాబు పేర్కొన్నవారికే మార్కులేస్తుంది. ఇప్పటికే తప్పుడు ‘కీ’లతో లక్షలాది ఉద్యోగార్థుల జీవితాలతో ఆడుకున్న కమిషన్ తాజాగా జూనియర్ లెక్చరర్స్ ఎకనామిక్స్ కీ లోనూ అదే పంథాలో వ్యవహరించింది. సరైన జవాబులి చ్చిన అభ్యర్థులు నిరుద్యోగులుగానే ఉండగా, తప్పుడు జవాబులిచ్చినవారు ఉద్యోగాల్లో చేరిపోయారు. రెండేళ్ల తరువాత ఇచ్చిన కీ.. 2008లో 1,100 జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ 2011 డిసెంబరు 3న రాత పరీక్ష నిర్వహించింది. వాటి ఫలితాలను 2012 జూన్లో ప్రకటించింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. సెప్టెంబరులో ఎంపిక జాబితాలను ప్రకటించింది. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించకముందే 93 ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సబ్జెక్టు పేపరులో (150 ప్రశ్నలకు 300 మార్కులు) మూల్యాంకనంలో అనుమానాలు ఉన్నాయని, తాము సరైన సమాధానాలు రాసినా మార్కులు రాలేదని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారులకు తెలిపారు. పలుమార్లు ఛైర్మన్ను కలిసి విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక 2012 సెప్టెంబరులో ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశించినా ఏపీపీఎస్సీ మాత్రం ‘కీ’ని ప్రకటించలేదు. ఈలోపే తప్పుడు కీతోనే పోస్టింగ్లు కూడా ఇచ్చేసింది. దీంతో నష్టపోయిన అభ్యర్థులు గత సెప్టెంబరులో ధిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీపీఎస్సీకి ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ట్రిబ్యునల్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లిందే కానీ కీ మాత్రం ఇవ్వలేదు. చివరకు ఈనెల 2న జరిగిన విచారణ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటే కీ ఇస్తామంటూ కోర్టులో చెప్పింది. చివరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో శుక్రవారం కీని ఇచ్చింది. 60 తప్పులతో లబోదిబోమంటున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ శుక్రవారం ఇచ్చిన కీలోని తప్పులను చూసి అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కలిగిన 60 ప్రశ్నలకు తప్పులనే సరైన సమాధానాలని పేర్కొందని, దాంతో 120 మార్కులు నష్టపోయామని చెబుతున్నారు. తప్పుడు సమాధానాలతో తమకు అన్యాయం చేసిందని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిందని వాపోతున్నారు. ‘ఎ’ సిరీస్ ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలకు ఏపీపీఎస్సీ ఇచ్చిన తప్పుడు సమాధానాలు.. భారత దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థాపనకు ఉపయోగపడిన మొదటి పారిశ్రామిక తీర్మానం.. అనే 130వ ప్రశ్నకు ఏపీపీఎస్సీ 1956 తీర్మానం అని ఇవ్వగా.. వాస్తవ సమాధానం 1948 పారిశ్రామిక తీర్మానం. తెలుగు అకాడమీ ముద్రించిన భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు అనే పుస్తకం ఇందుకు ఆధారం. పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంచనా వేయబడిన స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎన్పీ) అనే 8వ ప్రశ్నకు వాస్తవ సమాధానం 9 శాతం కాగా.. కీలో 8 శాతం అని ఇచ్చింది. తెలుగు అకాడమీ ముద్రించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఎకనామిక్స్ పుస్తకమే ఆధారం. ‘ది అప్లూయెంట్ సొసైటీ’ గ్రంథ రచయిత ఎవరు? అనే 9వ ప్రశ్నకు షూమేకర్ అని ఏపీపీఎస్సీ ఇవ్వగా... వాస్తవ సమాధానం జె.కె.గాల్బ్రిత్. ఇందుకు జాన్ కెన్నత్ గాల్బ్రిత్ పుస్తకమే ఆధారం. పుస్తకం కవర్పేజీపైనే అది ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా అనే 149వ ప్రశ్నకు ఏపీపీఎస్సీ విశాఖపట్నం అని ఇవ్వగా సరైన సమాధానం హైదరాబాద్.