kumar vishwas
-
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్, హర్యానా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలు తజీందర్ సింగ్ బగ్గా, కుమార్ విశ్వాస్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. వారు తమ హక్కులు, రాజకీయ హోదాకు అనుగుణంగానే మాట్లాడారని, కేజ్రీవాల్పై విమర్శలు రాజకీయపరమైనవేనని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఆప్ మాజీ నేతలైన తజీందర్ బగ్గా, కుమార్ విశ్వాస్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీలో పన్ను మినాహాయింపు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం తజీందర్ బగ్గా స్పందించారు. సత్యమే గెలుస్తుందని నిరూపితమైందని, అరవింద్ కేజ్రీవాల్కు ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని విమర్శలు గుప్పించారు. చదవండి: నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో.. -
Punjab: సీఎం భగవంత్ మాన్కు కవి వార్నింగ్..
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ పోలీసులు తన ఇంటి ముందు నిల్చున్న ఫోటోలను ట్విటర్లో పోస్టు చేస్తూ.. సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరించారు. ‘ఈ రోజు ఉదయం పంజాబ్ పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చారు. ‘పంజాబ్ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీలో కూర్చున్న వ్యక్తిని హెచ్చరిస్తున్నాను. అతను ఏదో ఒక రోజు నిన్ను(భగవంత్ మాన్) పంజాబ్ ప్రజలను కూడా ద్రోహం చేస్తాడు. నా హెచ్చరికను దేశం గుర్తించుకుంటుంది’ అని ట్వీట్ చేశాడు. सुबह-सुबह पंजाब पुलिस द्वार पर पधारी है।एक समय, मेरे द्वारा ही पार्टी में शामिल कराए गए @BhagwantMann को आगाह कर रहा हूँ कि तुम, दिल्ली में बैठे जिस आदमी को, पंजाब के लोगों की दी हुई ताक़त से खेलने दे रहे हो वो एक दिन तुम्हें व पंजाब को भी धोखा देगा।देश मेरी चेतावनी याद रखे🙏🇮🇳 pic.twitter.com/yDymGxL1gi — Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 20, 2022 అయితే ఈ ట్వీట్లో విశ్వాస్ కేజ్రీవాల్ పేరును ట్వీట్లో ప్రస్తావించలేదు. కాగా కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. విశ్వాస్ ట్వీట్ చేసిన వెంటనే ఆప్ నాయకుడు నరేష్ బల్యాన్ స్పందించాడు.. విశ్వాస్ ఎందుకు అంతలా భయపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు తమరు చెప్పిన దానికి పోలీసులు రుజువు అడుగుతున్నారని, సాక్ష్యాధారాలు ఇచ్చి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలంటూ హితవు పలికారు. काँप काहे रहे हो? जो बोला था चुनाव से पहले आपने उसी का तो सबूत माँगने पहुँची है पंजाब पुलिस, दे दो । बात ख़त्म। ऐसे कैसे चलेगा? मै पंजाब जीत की ख़ुशी में मिठाई खिलाने पहुँचा तो भी आप नही खाये। फ़िलहाल आप पंजाब पुलिस की चेतावनी याद रखो @DrKumarVishwas ! pic.twitter.com/CdbTre5cLU — MLA Naresh Balyan (@AAPNareshBalyan) April 20, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దేశాన్ని విచ్చిన్నం చేసేలా అరవింద్ జ్రీవాల్ మాట్లాడారని ఆరోపించారు. కేజ్రీవాల్, ఆప్కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలకు సంబంధించి విశ్వాస్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతని ఇంటికి పోలీసులు చేరుకున్నారు. -
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
నన్ను ఎందుకు అరెస్ట్ చేయించ లేదు :కేజ్రివాల్
-
కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కుమార్ విశ్వాస్
-
జైట్లీ క్షమించేశారు...!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసంతృప్త నేత కుమార్ విశ్వాస్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన కుమార్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. జైట్లీకి, ఆయన కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి తనను క్షమించాలంటూ తన లాయర్ అమిత్ యాదవ్ ద్వారా కోర్టును కోరారు. కుమార్ క్షమాపణను స్వీకరిస్తున్నట్లు జైట్లీ తరపున కోర్టుకు హాజరైన ఆయన లాయర్లు రాజీవ్ నాయర్, మాణిక్ డోగ్రా తెలిపారు. దీంతో కుమార్ విశ్వాస్పై ఉన్న పరువు నష్టం దావా కేసును ఎత్తివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీవాల్తో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సహా, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్పేయిలు కూడా క్షమాపణలు తెలిపారు. తాజాగా కుమార్ విశ్వాస్ కూడా క్షమాపణలు తెలపడంతో జైట్లీ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. -
‘ఆప్’ రాజస్థాన్ ఇంచార్జ్ తొలగింపు
న్యూఢిల్లీ : రాజస్థాన్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ఆప్ ఇంచార్జ్గా ఉన్న కుమార్ విశ్వాస్ను ఆ పదవి నుంచి తప్పించింది. ఈ విషయాన్ని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు. విశ్వాస్ స్థానంలో దీపక్ బాజ్పాయిని ఇంచార్జ్గా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విశ్వాస్కు తీరిక లేనందువల్లే ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించినట్టు అశుతోష్ తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను దీపక్కు అప్పగించామని, జాబితాపై తుది నిర్ణయం మాత్రం పొలిటికల్ కమిటీ తీసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. అయితే విశ్వాస్కు, పార్టీ సీనియర్ నేతలకు మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ మంత్రికి క్షమాపణలు చెప్పడంపై విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘సీఎం శివగామి, రాయ్ కట్టప్ప’
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు. బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు. పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్చార్జ్గా విశ్వాస్ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. -
'కేజ్రీవాల్.. నువ్వు చనిపోయినవాడితో పెట్టుకోవద్దు'
సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పందాలు పొసగనప్పుడు పార్టీలో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. రాముడు, గౌతమ బుద్ధుడితోపాటు ప్రతి ఒక్కరు తమ యుద్ధం తామే చేసుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ రాజ్యసభ సీట్ల వ్యవహారం గత కొద్ది రోజులుగా చడీచప్పుడు లేకుండా ముందుకెళుతున్న ఆమ్ఆద్మీపార్టీలో ఒక్కసారిగా అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ సీట్ల పంపకం కారణంగా ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో తనకు సీటు కేటాయించకపోవడంపై ఆయన బహిరంగంగా కేజ్రీవాల్ను టార్గెట్ చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ రాజ్యసభ స్థానాలకోసం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మూడు కూడా ఆప్ గెలుచుకునేందుకు అవకాశం ఉన్నవే. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తా అనే ముగ్గురుకి రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ నిజాలు మాట్లాడినందుకు తనను ఇలా శిక్షించారని అన్నారు. ఇలా జరుగుతుందని కూడా తాను ముందే ఊహించానని అన్నారు. గత ఏడాదిన్నర కిందట తనను చూస్తూ కేజ్రీవాల్ ఓనవ్వు నవ్వుతూ తనను రాజకీయంగా దెబ్బకొడతామని అన్నారని చెప్పారు. ఒప్పందాలు కుదరనప్పుడు పార్టీలో కలిసి ఉండటం సాధ్యం కాదని చెప్పారు. 'నేను చనిపోయినవాడినని, నన్ను వీరజవానుగా మిగిలిపోనివ్వనని కేజ్రీవాల్ అన్నారు. కానీ, ఈ రోజు నేను చెబుతున్నాను.. ఆయన(కేజ్రీవాల్) చనిపోయిన శరీరంతో జోక్యం చేసుకోవద్దు.. దుర్వాసనను వెదజల్లవద్దు' అని విశ్వాస్ అన్నారు. కాగా, కుమార్ విశ్వాస్ మద్దతుదారులు పార్టీ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో చేరి తమ నేత విశ్వాస్ను పార్లమెంటుకు పంపించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కాగా, తనపై కుట్రలు చేశారని కుమార్ విశ్వాస్పై కేజ్రీవాల్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
నేను అభిమన్యుడిని.. మరణం కూడా విజయమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సభలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అసమ్మతి నేతలు, భిన్న స్వరాలకు సైతం వేదికపై అవకాశం కల్పించడం గమనార్హం. ఆప్ రాజస్థాన్ ఇన్చార్జ్, అసమ్మతి నేతగా ముద్రపడ్డ కుమార్ విశ్వాస్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. ఎప్పటిలాగే అసమ్మతి గళాన్ని వినిపిస్తూ.. పార్టీ నాయకత్వంపై పరోక్ష వ్యంగ్యాస్త్రాలు, ఆరోపణలు సంధించారు. అధినేత కేజ్రీవాల్పై విరుచుకుపడేందుకు ఈ వేదికను కుమార్ విశ్వాస్ ఉపయోగించుకున్నారు. ‘గత ఏడెనిమిది నెలలుగా నేను మాట్లాడలేదు. అందుకు కారణం స్వేచ్ఛాయుత చర్చలు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరగకపోవడమే. కమిటీ చివరి సమావేశంలో నన్ను మాట్లాడనివ్వలేదు’ అని కుమార్ విశ్వాస్ అన్నారు. తాను ఫుల్టైమ్ రాజకీయ నాయకుడిని కాదని పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ, తాను ఫుల్టైమ్ భారతీయుడిని, పార్ట్టైమ్ రాజకీయ నాయకుడిని అని ఆయన అన్నారు. ప్రతి మహాభారతంలోనూ ధర్మరాజు ఆవశ్యకత ఉందని పేర్కొంటూ.. పార్టీలో అసమ్మతివాదులకు సైతం గళమెత్తే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో తమలో తాము కొట్లాడటం మాని.. ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు పోరాడాలని సూచించారు. ‘20-22 మంది నాపై విరుచుకుపడి దాడి చేశారు. నిన్ను అవమానించి.. పార్టీ నుంచి పారిపోయేలా చేస్తామని బెదిరించారు. నేను పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఈ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నా.. నేను అభిమన్యుడిలాంటివాణ్ని.. మరణం కూడా నాకు విజయమే’ అని కుమార్ విశ్వాస్ ఉద్ఘాటించారు. -
మీరు చస్తే.. పాక్లో సమాధి చేస్తారా?
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ విజయం పట్ల సంబరాలు జరిపిన కశ్మీరీ వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఫరూఖ్ పేరును ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ పరాజయం పట్ల సంబరాలు చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్ వరదల సమయంలో భారత ఆర్మీ వల్ల ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు నేడు భారత పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటివాళ్లకు మాతృభూమి పట్ల ఏమాత్రమైన వీధేయత ఉందా? అని ప్రశ్నించారు. ఇలా సంబరాలు చేసుకునేవారు చనిపోయిన తర్వాత తమ మృతదేహాలు పాకిస్థాన్లో సమాధి చేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వేర్పాటువాద నేత ఫరూఖ్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతంగా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫరూఖ్ పాకిస్థాన్ వెళ్లిపోవాలని, ఇందుకు తాను సహకరిస్తానని ఘాటుగా పేర్కొన్నారు. -
కుమార్ విశ్వాస్ ఒంటరయ్యారా?
న్యూఢిల్లీ : కుమార్ విశ్వాస్పై ఆరోపణలు సంధించేవారి సంఖ్య ఆమ్ ఆద్మీ పార్టీలో రోజు రోజుకు పెరుగుతోంది. కుమార్ విశ్వాస్ బిజెపితో కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే అమానతుల్లా చేసిన ఆరోపణలు సద్దుమణకగముందే తాజాగా ఆయనను బిజెపి మిత్రునిగా అభివర్ణిస్తూ ఆప్ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. కుమార్ విశ్వాస్ను బిజెపికి మిత్రునిగానే కాకుండా ఆప్ ద్రోహిగా, మోసగాడికి ఈ పోస్టర్లు పేర్కొన్నాయి. బిజెపి పట్ల కుమార్ విశ్వాస్ అనుసరిస్తోన్న మెతక వైఖరిని ప్రశ్నిస్తూ ఆప్ నేత దిలీప్ పాండే ట్వీట్ చేసిన కొద్ది రోజులకే వెలుగు చూసిన ఈ పోస్టర్లు కుమార్ విశ్వాస్ గురించిన నిజాన్ని బయటపెట్టినందుకు దిలీప్ పాండేకు కృతజ్ఞతలు తెలిపాయి. పోస్టర్లు ముద్రించిన వారు తమ పేరు బయట పెట్టకుండా కేవలం కుమార్ విశ్వాస్ను పార్టీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమానతుల్లా ఖాన్ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్ విశ్వాస్ను ఆప్ బుజ్జగించి రాజస్థాన్గా ఇన్చార్జిగా చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఇన్చార్జ్ హోదాలో నిర్వహించిన సమావేశంలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చాలా మందికి రుచించడం లేదు. దానితో పార్టీలో పలువురు నేతలు ఆయనపై కత్తులు నూరుతున్నారు.దిలీప్ పాండే వంటి వారు కొందరు బాహాటంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.కొత్తగా పార్టీ ట్రెజరర్గా నియమితుడైన దీపక్ బాజ్పేయి కూడా ఇటీవల ఆయనపై మండిపడ్డారు. గోవా ఎన్నికలలో పార్టీ నేతలు ఐదు నక్షత్రాల హోటళ్లలలో బస చేసి పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపై దీపక్ బాజ్పేయి ట్విట్టర్పై మండిపడ్డారు. నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలతో, విమర్షలతో కుమార్ విశ్వాస్ పార్టీలో ఒంటరైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి బయటకు తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కుమార్ విశ్వాస్ను కొద్ది రోజులలో ఆప్ బహిష్కరిస్తుందని ఆయన అన్నారు కూడా. -
‘ఆయన శత్రువు కూడా ఈ మాటలు నమ్మరు’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మొన్న ఆయనపై ధిక్కార స్వరం వినిపించి అవసరం అయితే పార్టీని సైతం వీడిపోతానంటూ వ్యాఖ్యానించిన కుమార్ విశ్వాస్ అండగా నిలిచారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అర్థరహితం అని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అయిన విశ్వాస్ అన్నారు. కేజ్రీవాల్ శత్రువు కూడా కపిల్ చేసిన ఆరోపణలు నమ్మబోరంటూ వ్యాఖ్యానించారు. ‘నేను కేజ్రీవాల్తో పనిచేశాను. ఆయన అవినీతికి పాల్పడతారనే విషయాన్నిగానీ, ఒకరి నుంచి లంచం తీసుకుంటారనే విషయాన్నిగానీ నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. కావాలనే కేజ్రీవాల్పై బురద జల్లుతున్నారు. పార్టీలో ఏ నేత అవినీతికి పాల్పడినా వారిని వెంటనే తొలగిస్తానంటూ చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవి, నిర్లక్ష్యంతో ఉద్దేశ పూర్వకంగా చేసినవి. కేజ్రీవాల్ శత్రువు కూడా ఈ ఆరోపణలు నమ్మలేరు’ అని కుమార్ విశ్వాస్ చెప్పారు. -
దిగొచ్చిన కేజ్రీవాల్.. సాహో కుమార్ విశ్వాస్
-
దిగొచ్చిన కేజ్రీవాల్.. సాహో కుమార్ విశ్వాస్
ఎప్పుడూ తన వ్యతిరేకుల విషయంలో ఫైర్బ్రాండ్ కామెంట్లు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగొచ్చారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్ను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గారు. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఇంతకాలం తనకు ఏ మాత్రం అలవాటు లేని రాజీ ధోరణిలోకి వచ్చారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద బహిరంగంగా ధ్వజమెత్తిన కుమార్ విశ్వాస్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసిపోయారని, అందుకే అలా మాట్లాడుతున్నారని పీఏసీ సభ్యుడు అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారని, అందుకు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ముట్టజెబుతున్నారని కూడా ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఆయన ముసుగులో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వం మీద ఆయన విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ఎందుకు తగ్గారు... తాను మోనార్క్నని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎప్పుడూ మండిపడుతుండే అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ఒక నాయకుడి విషయంలో మాత్రం తలవంచారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకులలో కుమార్ విశ్వాస్ కూడా ఒకరు. ఆయన పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. అవినీతి మరకలు ఏమాత్రం అంటని వ్యక్తి. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో.. పొరపాటున ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే సామాన్య ప్రజల్లో కూడా పార్టీ బాగా దెబ్బతింటుందని కేజ్రీవాల్ భావించారు. దానికితోడు ఇటీవల జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ను పోగొట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని కేజ్రీవాల్ భావించారు. అందుకే పార్టీలో కొనసాగాలంటే.. అంటూ ఆయన పెట్టిన షరతులను కూడా ఆమోదించారు. అందుకే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చర్చల తర్వాత బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉంటారని చెప్పారు. -
‘నేను పార్టీలో ఉండాలంటే మూడు కండీషన్లు’
ఢిల్లీ: సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే తాను పార్టీలో ఉంటానంటూ కూడా కేజ్రీవాల్కు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. దీంతో విశ్వాస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. దీంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వాస్ వెళ్లిపోతే పార్టీకి తీరని దెబ్బవుతుందని గ్రహించిన కేజ్రీవాల్ బుధవారం సమావేశం ఏర్పాటుచేసి ఆయన అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో కుమార్ విశ్వాస్ మూడు షరతులు పెట్టినట్లు సమాచారం. అవేమిటంటే.. 1. అవినీతి, జాతీయవాదంపై ఎలాంటి రాజీ పడొద్దు. 2.పార్టీ కార్యకర్తలో నిత్యం కమ్యునికేషన్లో ఉండాలి.. వారి తరుపు వాదనలు కూడా వినాలి. 3.అమనతుల్లా ఖాన్ తొలగింపు అంశంపై తప్పకుండా చర్చ జరగాలి. -
ఆప్లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?
-
ఆప్లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?
ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం నానాటికీ మరింత తీవ్రతరం అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీని వీడిపోయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తనకు తెలుసని, అమానతుల్లా కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆ ముసుగులో ఎవరు మాట్లాడుతున్నదీ తనకు తెలుసని అన్నారు. పరోక్షంగా ఆయన పార్టీ అగ్ర నాయకత్వం మీద విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం తాను మొదట్లో పోస్టర్లు అతికించానని, అందువల్ల తనపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి గానీ, పార్టీ అధ్యక్ష పదవి గానీ ఏమాత్రం అక్కర్లేదని, జాతికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మాత్రం తగిన సమాధానం ఇస్తానని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయినప్పుడు అజిత్ దోవల్, బస్సీలతో కుమార్ విశ్వాస్ పార్టీ చేసుకున్నారని అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. పీఏసీ పదవికి అమనాతుల్లా ఖాన్ రాజీనామా చేసిన తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు గానీ, ఇతర నాయకులు గానీ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయొద్దని, మనందరికీ పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద విశ్వాసం ఉండాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే నేరుగా వెళ్లి కేజ్రీవాల్తో మాట్లాడుకోవాలని, ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని చెప్పారు. ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ పరువు దెబ్బ తింటుందన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటున్నారని, కుమార్ విశ్వాస్ తనతో పాటు పలువురిని బీజేపీలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారని, ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల బేరం కుదిరిందని అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని 37 మంది ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్ను డిమాండ్ చేశారు. -
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
-
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
ఆప్కు కుమార్ విశ్వాస్ రాంరాం! న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో భగ్గుమన్న అంతర్గత అసమ్మతి అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసమ్మతి తీరంలో చేరిన ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ సైతం ఇక కేజ్రీవాల్కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని, ఆప్లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బాహాటంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు ఖండించకపోగా.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అయితే, అధినేత కేజ్రీవాల్ తీరుపై కుమార్ విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ విమర్శించినట్టు తాను బీజేపీ ఏజెంటును కాదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 24గంటల్లోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ అగ్రనేతలు భేటీ అయ్యారు. కుమార్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కాగా, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న కుమార్ విశ్వాస్పై సీనియర్ నేత మనీష్ సిసోడియా మండిపడ్డారు. సమస్య ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. మొత్తానికి రోజురోజుకు ఆప్ నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి. -
ఆప్లో లుకలుకలు, సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో కుమార్ విశ్వాస్ వ్యవహారం ముగిసిపోకముందే...తాజాగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది.ఆప్ను చీల్చేందుకు అమానతుల్లా ఖాన్ కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 40మంది ఎమ్మెల్యేలు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఏసీ అధ్యక్ష పదవి నుంచి అమానతుల్లా ఖాన్ ను తొలగించాలంటూ వారు ఈ సందర్భంగా సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. కాగా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కుమార్ విశ్వాస్ తన సోదరుడి లాంటివాడంటూ కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్లు పార్టీకి శత్రువులని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. -
తమ్ముడితో నాకు గొడవలేంటి: సీఎం
ఆప్ కోటకు బీటలు వారుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలు అందుతుండటంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవరపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించడంతో వెంటనే సీఎం స్పందించారు. తనకు, కుమార్ విశ్వాస్కు అసలు గొడవలేమీ లేవని.. అతడు తన తమ్ముడి లాంటి వాడని చెప్పారు. అయితే ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చి మరీ కుమార్ వివ్వాస్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతున్నారని అమానతుల్లా ఖాన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన వాట్సప్లో ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి.. తనను పార్టీ కన్వీనర్ చేయాలని కుమార్ విశ్వాస్ చెప్పారన్నది ఖాన్ వాదన. ఇదంతా బీజేపీయే చేయిస్తోందని ఆయన అన్నారు. సుమారు 14 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. అతడు నా తమ్ముడు.. కుమార్ విశ్వాస్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని, కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లు పార్టీకి శత్రువులని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ నాయకత్వం మార్పు దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. ఆప్కు వచ్చిన స్థానాలు చాలా తక్కువ. -
ఢిల్లీ సీఎంగా కుమార్ విశ్వాస్!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ను గద్దె దించుతారంటూ జోరుగా సాగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా బీజీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆప్కు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారంతా వేరుకుంపటి పెట్టి ఆప్ కీలక నేత కుమార్విశ్వాస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుబోతున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి పాల్ ఎస్ బగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం 34 ఆప్ ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు పట్టుపట్టినట్లు బగ్గా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఖండిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే పార్టీకి ఓట్లు దక్కలేదని, అయితే ఆత్మ పరిశీలన చేసుకొని తిరగి పుంజుకుంటామని కుమార్విశ్వాస్ తెలిపారు.కాగా సీఎం కేజ్రీవాల్ వాదనకు విరుద్ధంగా.."ఓటర్లు ఓట్లువేయనప్పుడు ఈవీఎం లను విమర్శించడం తగదు" అని ఆయన అన్నారు. -
ప్రజలు మా పార్టీకి ఓట్లు వేయలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ నేతల రాజీనామాలతో ఢీలా పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కేజ్రీవాల్ సామర్థ్యంపై ఆయన సన్నిహితుడు కుమార్ విశ్వాస్ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎదురైన వరుస పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాయకత్వ మార్పు సహా, కఠిన నిర్ణయాలు తీసుకునే విషయాన్ని పార్టీ పరిశీలించాలని కుమార్ విశ్వాస్ కోరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, రాజౌరి ఉప ఎన్నిక, అలాగే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కేజ్రీవాల్ ఆత్మరక్షణలో పడటాన్ని ప్రశ్నించారు. ఈవీఎంల వల్ల ఆప్ ఓడిపోలేదని, ప్రజలు పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పారు. 'ఈవీఎంలను నిందించడం మంచిది కాదు. ఓటర్లకు, కార్యకర్తలకు చేరువ కావడంలో విఫలమయ్యాం. సర్జికల్ దాడులపై కేజ్రీవాల్ వైఖరి తప్పు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించకుండా ఉండాల్సింది. తప్పుడు నిర్ణయాల వల్లే పంజాబ్లో ఆప్ ఓడిపోయింది' అని విశ్వాస్ అన్నారు. -
కేజ్రీవాల్పై కుమార్కు విశ్వాసం పోయిందా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత కుమార్ విశ్వాస్కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విశ్వాసం పోయినట్లుందని సోషల్ మీడియాలో ధుమారం రేగుతోంది. కేజ్రీవాల్ను కుమార్ విశ్వాస్ పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతి మరకలు అంటుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. అవినీతిని అంతమొందిస్తామనే హామీతో ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుని ఆ తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తే ప్రజలు తప్పకుండా నిలదీస్తారని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు, పలువురు నాయకులపై విశ్వాస్ విమర్శనస్త్రాలు ఎక్కుపెట్టారు. ముఖ్యమైన సమస్యలు అన్నింటిని పక్కకు పెట్టి భజన చేయించుకోవడం నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు. వారంతా మోదీ, మోదీ, అరవింద్ అరవింద్ అంటుంటే ఆ భజనల్లో మునిగి తేలుతున్నారని చెప్పారు. ‘మోదీ, మోదీ, అరవింద్ అరవింద్, రాహుల్ రాహుల్, యోగి రాజా ఆగయా, ఏకే రాజ్ ఆగయా అనే భజనల్లో మనమంతా తీరిక లేకుండా ఉన్నాం’ అని నాయకులను విమర్శించారు. అలాగే, కశ్మీర్లో జవానులకు జరుగుతున్న అవమానాలను ప్రశ్నించారు. పలు నియామకాల్లో అవినీతికి పాల్పడిన వ్యక్తులకు చోటు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశించే తాజాగా విశ్వాస్ ఓ వీడియోలో పరోక్షంగా ప్రశ్నించారు.