Man of the match
-
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్దీప్ సింగ్ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. విరన్దీప్ 84 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.కాగా, బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు గ్వాలియర్లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టు..అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాచదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్కు సిద్ధం! -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
కోహ్లికి 121 మ్యాచ్లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ — Johns. (@CricCrazyJohns) April 8, 2024 బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్లో నరైన్తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 RCB VS PBKS: ధోని రికార్డును సమం చేసిన కోహ్లి
పంజాబ్ కింగ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా నిలిచిన ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. ఐపీఎల్లో ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్తో కోహ్లి ఆ సంఖ్యను (17) సమం చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మ టాప్లో ఉన్నాడు. రోహిత్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్లో శశాంక్ సింగ్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ (25), సామ్ కర్రన్ (23), జితేశ్ శర్మ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ హాఫ్ సెంచరీతో (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి మ్యాచ్ను ఫినిష్ చేయగా.. అతనికి మహిపాల్ లోమ్రార్ (8 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్వెల్ (3), పాటిదార్ (18), అనూజ్ రావత్ (11) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ (4-0-13-2), రబాడ (4-0-23-2) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతా బౌలర్ల నుంచి వారికి సహకారం లభించలేదు. -
చరిత్ర సృష్టించిన దృవ్ జురెల్
టీమిండియా నయా సంచలనం దృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన రాంచీ టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్కు ముందు భారత వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అజయ్ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జురెల్ అరంగేట్రం సిరీస్ రెండో మ్యాచ్లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్లోని నాలుగో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్తో జరిగిన నాటి మ్యాచ్లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్ మరోసారి ఆ ఫీట్ను రిపీట్ చేశాడు. ఓవరాల్గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్ మోంగియా, వృద్దిమాన్ సాహా, అజయ్ రాత్రా, దృవ్ జురెల్ చెరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్, శుభ్మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. -
కోహ్లి తర్వాతి స్థానంలో షకీబ్.. మూడో స్థానంలో రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో షకీబ్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 42వ సారి మ్యాన్ ఆఫ్్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒక్కడే ఈ విభాగంలో షకీబ్ కంటే ముందున్నాడు. కోహ్లి అత్యధికంగా 63 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటే, షకీబ్ 42 సార్లు, ఆతర్వాత రోహిత్ (37), వార్నర్ (37), గప్తిల్ (34), కేన్ విలియమ్సన్ (28), స్టీవ్ స్మిత్ (26), డికాక్ (25), రూట్ (25), జడేజా (24) వరుసలో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే.. క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్న ఘనత దిగ్గజ క్రికెటర్ సచిన్ సొంతం చేసుకున్నాడు. సచిన్ అత్యధికంగా 76 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాత విరాట్, జయసూర్య (58), కలిస్ (57), సంగక్కర (50), పాంటింగ్ (49), అఫ్రిది (43) వరుసలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా (25), కరీం జనత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, ముస్తాఫిజుర్, షకీబ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లిటన్ దాస్ (35), ఆఫీఫ్ హొస్సేన్ (24), షకీబ్ (18 నాటౌట్) రాణించడంతో 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఓమర్జాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్తో తొలి మ్యాచ్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ 2-0తో ఆఫ్ఘనిస్తాన్ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ను ఆఫ్ఘనిస్తాన్ (2-1), ఏకైక టెస్ట్ మ్యాచ్ను బంగ్లాదేశ్ గెలుచుకున్నాయి. -
ఇంత తక్కువ ప్రైజ్మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక స్పిన్నర్లు చెలరేగడంతో మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఫ్యాన్స్ ఫైర్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. జైస్వాల్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డ్పై తాజాగా నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ప్రస్తుతం దీనిపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియా వేడి వేడిగా చర్చ కూడా మొదలైంది. అసలు ఈ రచ్చ అంతా ఎందుకంటే.. యశస్వి జైశ్వాల్కు రివార్డుగా ఇచ్చిన మొత్తం 500 అమెరికా డాలర్లు కావడమే. ఈ మొత్తం మన భారత కరెన్సీలో సుమారు రూ.41,000 మాత్రమే. ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు కారణం ఇదేనా! ఈ రివార్డ్ మనీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భారత దేశవాళీ క్రికెట్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారితోషికం ఎక్కువ అని సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ బోర్డు పరిస్ధితి ఆర్థికంగా అంతగా బాలేదని చెప్పాలి. వాస్తవానికి టీమ్ ఇండియా కూడా ఈ సిరీస్ ఆడేందుకు ప్రధాన కారణమే వెస్టిండీస్ బోర్డుకు ఆర్థిక సహకారం అందించడమే. ఈ కారణం వల్లే వెస్టిండీస్ బోర్డు రివార్డ్ మొత్తాన్ని 500 అమెరికన్ డాలర్లకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంత తక్కువ మొత్తంలో రివార్డ్ బహుకరించడం నెట్టింట అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనికంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్ అని జోకులు పేల్చుతున్నారు. Only $500? pic.twitter.com/RMLvMvziJu — Apoorv Sood (@Trendulkar) July 15, 2023 చదవండి Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్! -
ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు..
MS Dhoni: 350 వన్డేలు.. 10వేలకు పైగా పరుగులు(10773) .. 321 క్యాచ్లు.. 123 స్టంపింగ్స్లో భాగం.. ఓ వరల్డ్కప్ ట్రోఫీ.. వన్డే ఫార్మాట్లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ట్రాక్ రికార్డు ఇది. అయితే, విచిత్రంగా తన కెరీర్లో వందలాది మ్యాచ్లు ఆడిన మహీ గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మాత్రం 21. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ఓవరాల్గా 33, టీమిండియా ఆటగాళ్లలో ఏడోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఓ మ్యాచ్లో తనకు అన్యాయం చేసి మరీ ధోనికి అవార్డు కట్టబెట్టారంటూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తాజాగా ఆరోపించాడు. ‘‘నిజంగా అది నా దురదృష్టమే. టీమిండియాతో వన్డే సిరీస్లో భాగంగా ఆఖరైన మూడో మ్యాచ్లో వాళ్లను 175 పరుగులకే ఆలౌట్ చేయడంలో నాదే ముఖ్యపాత్ర. ఆ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు మేమే గెలిచాం. ఆ మ్యాచ్ల్లోనూ నేను మెరుగ్గా రాణించా. నా కెరీర్లో అత్త్యుత్తమ గణాంకాలు నమోదు చేశా. నాకు అన్యాయం చేశారు కానీ.. 175 పరుగులలో ఏవో కొన్ని రన్స్ తీసి.. రెండు క్యాచ్లు డ్రాప్ చేసినందుకేమో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నిజంగా ఇది అన్యాయం. అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికిస్తారో తెలుసా? ఓ మ్యాచ్లో జట్టు గెలిచినా ఓడినా సరే.. అత్యుత్తమంగా ఆడిన ప్లేయర్కే ఇవ్వాలి. కానీ ఆ మ్యాచ్లో టీమిండియా గెలిచింది కాబట్టి ధోనికి అవార్డు ఇచ్చారు. అది కూడా క్యాచ్లు వదిలేసినందుకే అనుకుంటా’’ అంటూ అజ్మల్ ధోని ఆట తీరును కించపరిచే విధంగా మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కాడు. నాదర్ అలీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ నంబర్ 1 బౌలర్.. ఒక్క అవార్డు లేదు కాగా అజ్మల్ వన్డే, టీ20లలో వరల్డ్ నంబర్ 1 బౌలర్గా ఎదిగినప్పటికీ ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఒక్క మ్యాచ్లోనూ గెలిచింది లేదు. మరి ధోనిపై మాత్రం ఎందుకంత ఏడుపు!’’ అని తలా ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేస్తున్నారు. 2012-13లో పాకిస్తాన్ భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా.. రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. టీ20 సిరీస్లో దాయాదులు చెరో మ్యాచ్ గెలవగా.. వన్డే సిరీస్ను మాత్రం పాక్ 2-1(తొలి రెండు గెలిచి)తో కైవసం చేసుకుంది. మతిమరుపు వచ్చిందా? ఇక వన్డే సిరీస్లో నాడు ధోని సాధించిన పరుగులు వరుసగా.. 113(నాటౌట్- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 54 నాటౌట్, 36. సయీద్ అజ్మల్ ఆరోపించినట్లు నాటి మ్యాచ్లో రెండు సులువైన క్యాచ్లు వదిలేయలేదు. కేవలం ఒకటి మాత్రమే మిస్ చేశాడు. అంతేకాదు సయీద్ అజ్మల్ ఇచ్చిన క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్కు పంపాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో అజ్మల్ 9.4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి టీమిండియా 167 పరుగులకే కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, 45 ఏళ్ల సయీద్ అజ్మల్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ టీమిండియా 175 పరుగులకు ఆలౌట్ అయిందని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని హైలైట్ చేసిన ధోని అభిమానులు.. ‘‘మతిమరుపులో ఏం మాట్లాడుతున్నావో అర్థం కానట్టుంది. పైగా ధోని గురించి అవాకులు చెవాకులు పేలడం.. ఇదేం బాగాలేదు.. నువ్వు ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది’’అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్మెషీన్ను మించిపోయేలా ఉన్నాడు! -
CSK VS SRH: ఎట్టకేలకు 28 మ్యాచ్ల తర్వాత రిపీటైంది..!
ఐపీఎల్ 2023 సీజన్లో తొలిసారి ఓ సీన్ రిపీటైంది. సన్రైజర్స్-చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్ ఈ రిపీటెడ్ సీన్కు వేదికైంది. ఇంతకీ ఏంటా రిపీటైన సీన్ అనుకుంటున్నారా..? ఇది చదవండి. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి 28వ మ్యాచ్ వరకు ఒక్క ప్లేయర్కు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రెండోసారి దక్కలేదు. అయితే నిన్న జరిగిన లీగ్ 29వ మ్యాచ్లో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ప్రస్తుత సీజన్లో తొలిసారి ఓ ప్లేయర్ రిపీటెడ్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. లీగ్ 12వ మ్యాచ్లో (ముంబై) తొలిసారి ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రవీంద్ర జడేజా, నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. సీఎస్కేతో మ్యాచ్లో 4 ఓవర్లు బౌల్ చేసిన జడ్డూ.. కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినందుకు గాను అతన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. జడేజా టైట్ బౌలింగ్, డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన ఫిఫ్టి కారణంగా సీఎస్కే..సన్రైజర్స్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో పసుపు దండు 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా, గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకుని ఆసీస్తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. పునరాగమనంలో అదరగొడుతూ.. ఇప్పటివరకు (రీఎంట్రీలో) ఏకంగా 5 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, ఓ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ల వివరాలు... సీఎస్కే వర్సెస్ గుజరాత్: రషీద్ ఖాన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ కేకేఆర్: అర్షదీప్ సింగ్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఢిల్లీ: మార్క్ వుడ్ (లక్నో) రాజస్థాన్ వర్సెస్ సన్రైజర్స్: జోస్ బట్లర్ (రాజస్థాన్) ఆర్సీబీ వర్సెస్ ముంబై: డుప్లెసిస్ (ఆర్సీబీ) సీఎస్కే వర్సెస్ లక్నో: మొయిన్ అలీ (సీఎస్కే) గుజరాత్ వర్సెస్ ఢిల్లీ: సాయి సుదర్శన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: నాథన్ ఇల్లిస్ (పంజాబ్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: శార్దూల్ ఠాకూర్ (కేకేఆర్) లక్నో వర్సెస్ సన్రైజర్స్: కృనాల్ పాండ్యా (లక్నో) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: యశస్వి జస్వాల్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్కే) కేకేఆర్ వర్సెస్ గుజరాత్: రింకూ సింగ్ (కేకేఆర్) సన్రైజర్స్వర్సెస్ పంజాబ్: శిఖర్ ధవన్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఆర్సీబీ: పూరన్ (లక్నో) ముంబై వర్సెస్ ఢిల్లీ: రోహిత్ శర్మ (ముంబై) రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే: అశ్విన్ (రాజస్థాన్) గుజరాత్ వర్సెస్ పంజాబ్: మోహిత్ శర్మ గుజరాత్) సన్రైజర్స్ వర్సెస్ కేకేఆర్: హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్) ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ: విరాట్ కోహ్లి (ఆర్సీబీ) పంజాబ్ వర్సెస్ లక్నో: సికందర్ రజా (పంజాబ్) ముంబై వర్సెస్ కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్) రాజస్థాన్ వర్సెస్ గుజరాత్: షిమ్రోన్ హెట్మైర్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ: డెవాన్ కాన్వే (సీఎస్కే) ముంబై వర్సెస్ సన్రైజర్స్: కెమారూన్ గ్రీన్ (ముంబై) లక్నో వర్సెస్ రాజస్థాన్: మార్కస్ స్టోయినిస్ (లక్నో) ఆర్సీబీ వర్సెస్ పంజాబ్: మహ్మద్ సిరాజ్ (ఆర్సీబీ) ఢిల్లీ వర్సెస్ కేకేఆర్: ఇషాంత్ శర్మ (ఢిల్లీ) సీఎస్కే వర్సెస్ సన్రైజర్స్: జడేజా (సీఎస్కే) రీఎంట్రీలో జడేజా గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆసీస్తో తొలి టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆసీస్తో రెండో టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ (సంయుక్తంగా) ఆసీస్తో తొలి వన్డే ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్పై ఐపీఎల్ 2023లో సన్రైజర్స్పై -
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 'ఇలా' తొలిసారి
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్ల్లో 26 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్్ ద మ్యాచ్ అవార్డులకు ఎంపికయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇన్ని వరుస మ్యాచ్ల్లో వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులకు ఎంపిక కాలేదు. ప్రస్తుత ఐపీఎల్లో ఇలా జరగడం శుభపరిణామమని అభిమానులు అనుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు సత్తా చాటడం క్రికెట్ను ఫాలో అయ్యే వాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శన అమోఘంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ల వివరాలు... సీఎస్కే వర్సెస్ గుజరాత్: రషీద్ ఖాన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ కేకేఆర్: అర్షదీప్ సింగ్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఢిల్లీ: మార్క్ వుడ్ (లక్నో) రాజస్థాన్ వర్సెస్ సన్రైజర్స్: జోస్ బట్లర్ (రాజస్థాన్) ఆర్సీబీ వర్సెస్ ముంబై: డుప్లెసిస్ (ఆర్సీబీ) సీఎస్కే వర్సెస్ లక్నో: మొయిన్ అలీ (సీఎస్కే) గుజరాత్ వర్సెస్ ఢిల్లీ: సాయి సుదర్శన్ (గుజరాత్) పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: నాథన్ ఇల్లిస్ (పంజాబ్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: శార్దూల్ ఠాకూర్ (కేకేఆర్) లక్నో వర్సెస్ సన్రైజర్స్: కృనాల్ పాండ్యా (లక్నో) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: యశస్వి జస్వాల్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్కే) కేకేఆర్ వర్సెస్ గుజరాత్: రింకూ సింగ్ (కేకేఆర్) సన్రైజర్స్వర్సెస్ పంజాబ్: శిఖర్ ధవన్ (పంజాబ్) లక్నో వర్సెస్ ఆర్సీబీ: పూరన్ (లక్నో) ముంబై వర్సెస్ ఢిల్లీ: రోహిత్ శర్మ (ముంబై) రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే: అశ్విన్ (రాజస్థాన్) గుజరాత్ వర్సెస్ పంజాబ్: మోహిత్ శర్మ గుజరాత్) సన్రైజర్స్ వర్సెస్ కేకేఆర్: హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్) ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ: విరాట్ కోహ్లి (ఆర్సీబీ) పంజాబ్ వర్సెస్ లక్నో: సికందర్ రజా (పంజాబ్) ముంబై వర్సెస్ కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్) రాజస్థాన్ వర్సెస్ గుజరాత్: షిమ్రోన్ హెట్మైర్ (రాజస్థాన్) సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ: డెవాన్ కాన్వే (సీఎస్కే) ముంబై వర్సెస్ సన్రైజర్స్: కెమారూన్ గ్రీన్ (ముంబై) లక్నో వర్సెస్ రాజస్థాన్: మార్కస్ స్టోయినిస్ (లక్నో) -
MI VS CSK: వారెవ్వా జడ్డూ భాయ్.. నువ్వు సూపర్.. ఎందుకో చదవండి..!
ఇటీవలికాలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్, సీఎస్కే కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట విజయమే పలకరిస్తుంది. గాయం కారణంగా గతేడాది ఓ మోస్తరు విరామం తీసుకున్న జడ్డూ భాయ్, ఆ మధ్యలోనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రివాబాను ఎమ్మెల్యేగా గెలిపించుకుని, ఆతర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలో తొలి మ్యాచ్లోనే (రంజీ ట్రోఫీతో తమిళనాడుపై 8 వికెట్లు) అదరగొట్టిన జడ్డూ భాయ్, ఆతర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సిరీస్లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన అతను, భారత్ గెలిచిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుపొందాడు. అతర్వాత ఆసీస్తోనే జరిగిన వన్డే సిరీస్లోనూ రెచ్చిపోయిన జడేజా, తొలి వన్డేలో ఆల్రౌండర్ ప్రదర్శనతో మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా జడ్డూ మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకుని, ఈ అవార్డుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా బౌలింగ్లో (4-0-20-3) అద్భుత ప్రదర్శన కనబర్చి ఈ అవార్డును దక్కించుకున్నాడు. గత 10 మ్యాచ్ల్లో జడేజా ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగో సారి కావడం విశేషం. మరో విశేషమేమిటంటే.. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా.. అమిత్ మిశ్రా (12), రహానే (12), కేఎల్ రాహుల్లతో సమంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (18) అగ్రస్థానంలో ఉండగా.. ధోని (17), యూసఫ్ పఠాన్ (16), కోహ్లి (14), రైనా (14), గంభీర్ (13) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో ఉన్నారు. -
'నేనేం గాలిలో తేలడం లేదు.. తగలాల్సిన చోట తగిలింది'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్లో ఇది 28వ శతకం. డబుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగిన కోహ్లి తన ఇన్నింగ్స్తో టీమిండియా 571 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం వచ్చేలా చేశాడు. అయితే ఈ టెస్టు సెంచరీకి ముందు కోహ్లిపై మరోసారి విమర్శలు వచ్చాయి. వన్డేలు, టి20ల్లో మాత్రమే కోహ్లిని ఆడించండి.. టెస్టులకు పక్కనబెట్టండి.. అంటూ పేర్కొన్నారు. కానీ కోహ్లి ఎన్నడూ వారి మాటలను పట్టించుకోలేదు. కేవలం బ్యాట్తోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా శతకాలతో రెచ్చిపోయాడు. కానీ ఆసీస్తో టెస్టు సిరీస్లో మాత్రం కోహ్లి ఆకట్టుకోలేదంటూ వార్తలు రాశారు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది కోహ్లి ఆటపై కాదు.. పిచ్ తీరు గురించి. ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో కోహ్లియే కాదు ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంటూ బ్యాటర్లు ఎలా పరుగులు చేయగలరు. పైగా మూడు టెస్టులో ఒకేరీతిలో రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మరి ఇలా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్లు ముగుస్తుంటే కోహ్లి మాత్రం ఎలా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సరైన బ్యాటింగ్ పిచ్ కోసం కోహ్లి ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు మలి టెస్టులోనే ఫలించాయి. అహ్మదాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్పై కోహ్లి తన పవరేంటో చూపించాడు. ఒక్క సెంచరీతో చాలా మంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు తీసుకుంటూ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈ ఒక్క సెంచరీతో నేనేం గాల్లో తేలడం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు. విఫలమయ్యానన్న ప్రతీసారి నిలదొక్కుకుంటూ వస్తున్నా. ఎవరికి తగలాలో వాళ్లకి గట్టిగానే తగిలింది. నేను ఎందుకు ఫీల్డ్లో కొనసాగుతున్నానో చూపించాలనుకున్నా.. చూపించా. ఇక ఆట ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. నా డిఫెన్స్పై నాకు నమ్మకం ఉంది. నాగ్పూర్ టెస్టు నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. బ్యాటింగ్పై ఫోకస్ పెట్టినప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ పూర్తిగా బౌలింగ్కు సహకరించిన తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్లో రాణించేందుకు గతంలోలాగే నా శాయాశక్తులా ప్రయత్నించా. కానీ బ్యాటింగ్ సరిగా చేయకపోవడంతో కొంత నిరాశకు గురయ్యా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
Ravindra Jadeja: కోహ్లి, అశ్విన్లతో సమానమయ్యాడు.. నెక్స్ట్ టార్గెట్ అనిల్ కుంబ్లే
BGT 2023 IND VS AUS 2n Test: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం విధితమే. గాయం కారణంగా (ఆసీస్తో టెస్ట్ సిరీస్కు ముందు) గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్.. వచ్చీ రాగానే టెస్ట్ల్లో తన మార్కు హవాను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 7 వికెట్లతో (5/47, 70, 2/34) పాటు కీలకమైన హాఫ్సెంచరీ చేసిన జడ్డూ.. న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్లో బంతితో భీకర స్థాయిలో విజృంభించి ఏకంగా 10 వికెట్లు (3/68, 26, 7/42) పడగొట్టాడు. ఈ మ్యాచ్లోనూ బ్యాట్తో పర్వాలేదనిపించిన జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన 26 పరుగులు స్కోర్ చేశాడు. 10 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టి, ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించినందుకు గాను జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును జడేజా తన 62 టెస్ట్ మ్యాచ్ల కెరీర్లో తొమ్మిదోసారి అందుకున్నాడు. ఈ అవార్డు అందుకునే క్రమంలో జడ్డూ.. సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిల రికార్డును సమం చేశాడు. కోహ్లి తన 106 టెస్ట్ మ్యాచ్ల కెరీర్లో 9 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకోగా.. అశ్విన్ 90 టెస్ట్ల కెరీర్లో ఇన్నే సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. జడ్డూ మరోసారి టెస్ట్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంటే, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. భారత తరఫున అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జడేజా, అశ్విన్, కోహ్లి వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో 200 టెస్ట్లు ఆడిన సచిన్ 14 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా.. 163 టెస్ట్లు ఆడిన ద్రవిడ్ 11 సార్లు, 132 మ్యాచ్లు ఆడిన కుంబ్లే 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున జడేజా ఈ సిరీస్లోనే ద్రవిడ్ రికార్డును కూడా సమం చేసే అవకాశం ఉంది. ఇండోర్లో మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, అహ్మదాబాద్లో మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం టీమిండియా ఆసీప్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, వైజాగ్, చెన్నైల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. -
Ravindra Jadeja: 'నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా..'
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరోసారి తన ముద్ర చూపించాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరమైనప్పటికి రీఎంట్రీ మ్యాచ్లోనే అదరగొట్టేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అలరించి ఆల్రౌండర్ అనే పదానికి మరోసారి సరైన నిర్వచనం చెప్పాడు. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జడేజా 70 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్తో కలిసి ఎనిమిదో వికెట్కు 88 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టమైన స్థానంలో నిలిపాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు గానూ జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విజయం అనంతరం జడేజా మాట్లాడాడు. ''అద్భుతమమైన అనుభూతి కలుగుతుంది. దాదాపు ఐదు నెలల తర్వాత క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చి వంద శాతం ప్రదర్శన(బ్యాట్తో పరుగులు, బంతితో వికెట్లు) ఇస్తే ఎవరికైనా సంతోషమే కలుగుతుంది. రీఎంట్రీలో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. రీఎంట్రీకి ముందు ఎన్సీఏలో చాలా కష్టపడ్డా.. అందుకు సహకరించిన ఎన్సీఏ స్టాఫ్తో పాటు ఫిజియోలకు ప్రత్యేక కృతజ్థతలు. ఒక్కోసారి ఆదివారాలు కూడా నాకోసం పనిచేసేవారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో మా పని సులవుగా మారింది. ఆసీస్ ఆటగాళ్లు తప్పు చేశారంటే మాకు చాన్స్ వచ్చినట్లే. దానిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ఇక బ్యాటింగ్లోనూ రాణించడం మంచి పరిణామం. ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నామన్నది ముఖ్యం కాదు.. 5,6,7.. ఇలా ఏ స్థానమైన నాకు పర్లేదు.. ఎందుకంటే చివరికి నా బ్యాట్ నుంచి వచ్చేది పరుగులే కాబట్టి.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
FIFA WC: తండ్రి మారడోనాతో.. కొడుకు మెస్సీతో
అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా, పోలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో పోలాండ్ను ఓడించి ప్రీక్వార్టర్స్కు చేరుకుంది. మ్యాచ్లో ఓటమి పాలైన రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ కూడా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. అర్జెంటీనా మ్యాచ్లో చేసిన రెండు గోల్స్లో ఒకటి జట్టు మిడ్ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్ చేశాడు. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్ అందించాడు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అలిస్టర్కు ఇచ్చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది. అలెక్సిస్ మాక్ అలిస్టర్ తండ్రి కార్లోస్ మాక్ అలిస్టర్ కూడా ఫుట్బాలర్గా జట్టుకు సేవలందించాడు. కార్లోస్ దిగ్గజం మారడోనాతో కలిసి అర్జెంటీనాతో పాటు బోకా జూనియర్స్కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మారడోనాతో కలిసి తండ్రి కార్లోస్ అలిస్టర్ ఆడితే.. ఇప్పటితరం గొప్ప ఆటగాళ్లలో ఒకడైన లియోనల్ మెస్సీతో కలిసి కొడుకు అలెక్సిస్ మాక్ అలిస్టర్ వేదికను పంచుకున్నాడు. అందుకే మెస్సీ అలెక్సిస్ తండ్రిపై ఉన్న గౌరవంతో అతనికి వచ్చిన అవార్డును అలెక్సిస్కు అందించాడు. ఇదే విషయమై అలెక్సిస్ మాక్ అలిస్టర్ స్పందింస్తూ.. ఇది ఎప్పటికి మరిచిపోలేనిది. నా తండ్రి దిగ్గజం మారడోనాతో కలిసి ఆడడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు నా ఆరాధ్య దైవం మెస్సీతో కలిసి ఆడడం మరిచిపోలేని అనుభూతి. అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్న తీరుకు ఫిదా అయ్యా. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రీక్వార్టర్స్కు చేరుకున్న అర్జెంటీనా డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అటు పోలాండ్ డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్తో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు' -
యాదృచ్చికం.. కింగ్ కోహ్లి, సూర్య భాయ్ ఒకేలా..!
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కెరీర్లు ఒకే రకంగా సాగకపోయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఇద్దరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. జట్టులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ..యాదృచ్చికం ఓ విషయంలో ఒకే రకమైన గణాంకాలు కలిగి ఉన్నారు. అదేంటంటే.. పొట్టి క్రికెట్లో ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న ఈ ఇద్దరూ.. తమ టీ20 కెరీర్లో 9వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్లోనే గెలుపొందారు. Fact of the day:Virat Kohli Had Won his '9th T20I M.O.M Award' in his 39th Inning! Suryakumar Yadav Won his '9th T20I M.O.M Award' in his 39th Inning!— IPLnCricket | Everything 'Cricket' & #IPL2023 🏏 (@IPLnCricket) November 24, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ పోటీపడి మరీ పరుగులు సాధించారు. మెగా టోర్నీలో చెరో 6 మ్యాచ్లు ఆడిన ఇద్దరూ.. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 1, 3 స్థానాల్లో నిలిచారు. కోహ్లి 4 హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేయగా.. సూర్య 3 అర్ధశతకాలతో 239 రన్స్ చేశాడు. వీరిద్దరూ రాణించినప్పటికీ.. టీమిండియా వరల్డ్కప్లో సెమీస్ గండాన్ని దాట లేకపోయింది. ఆ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జగజ్జేతగా కూడా అవతరించింది. వరల్డ్కప్ అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇదివరకే భారత జట్టు 1-0 తేడాతో టీ20 సిరీస్ను గెలుచుకోగా.. రేపటి నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో సూర్య భాయ్ సుడిగాలి శతకంతో చెలరేగిపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
Ind Vs Pak: ఏం మాట్లాడాలో తెలియట్లేదు.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి(82 నాటౌట్-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు. నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్ కాల్కులేషన్తో హరీస్ బౌలింగ్లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా' - మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ. 160 పరుగుల లక్ష్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
ఆ అవార్డును మా అమ్మకు అంకితమిస్తున్నా: మెకాయ్
సెయింట్స్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. విండీస్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెద్ మెకాయ్ కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను మెకాయ్ ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్కు పంపి ఆదిలోనే భారత్ను మెకాయ్ దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో మెకాయ్ 17 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మెకాయ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన మెకాయ్.. తనకు దక్కిన ఈ అవార్డును అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. తను ఒక ఉత్తమ ఆటగాడిగా ఎదగడంలో తన తల్లి కీలక పాత్ర పోషించదని మెకాయ్ అన్నాడు. "దేవుడికి కృతజ్ణతలు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు దయ వల్ల ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించగలిగాను. నాకు దక్కిన ప్లేయర్ ఆప్ది మ్యచ్ను మా అమ్మకు అంకిమిస్తున్నా. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. అయినప్పటికీ నన్ను ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఈ అవార్డును తనకి అంకితమివ్వాలి అనుకుంటున్నాను. ఇక తొలి బంతికే వికెట్ సాధించి బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చింది. పవర్ప్లేలో ఎప్పుడూ నేను వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తాను. తొలి టీ20లో నేను అంతగా రాణించలేకపోయాను. అయితే అప్పుడు చేసిన తప్పులను ఈ మ్యాచ్లో సరిదిద్దు కోవడం సంతోషంగా ఉంది" అని మెకాయ్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం(ఆగస్టు2)న జరగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! -
బాబర్ ఆజం ఊహించని చర్య.. ఆ ఆటగాడి కోసం!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన క్రీడా స్పూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజాం(103) సెంచరీతో చెలరేగి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బాబర్ ఆజాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే బాబర్ అందరనీ ఆశ్చర్యపరుస్తూ.. తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షాకు బాబర్ అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబర్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్లో.. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించి జట్టుకు ఖుష్దిల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్పై విజయం చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే!
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో.. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అవేష్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అద్భత ప్రదర్శన చేసిన అవేష్ ఖాన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆసుపత్రిలో తన తల్లికి అవేష్ ఖాన్ అంకితం చేసాడు. "నాకు దక్కిన ఈ అవార్డును ఆసుపత్రిలో ఉన్న మా అమ్మకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె నాకు చాలా సపోర్ట్గా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడాను. ఈ మ్యాచ్కు సంబంధించిన విషయాలను ఆమెతో చెప్పాను. ఈ మ్యాచ్లో నా ప్రదర్శన పట్ల ఆమె సంతోషించింది. దేవుని దయతో, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది అని మ్యాచ్ అనంతరం ఇంటరాక్షన్లో అవేష్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్రైజర్స్ హైదరాబాద్పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్కు లక్నో, గుజరాత్..! Stylish fifty 👌 Game-changing 4️⃣-wicket haul 💥 Special dedication 🤗@Avesh_6 & @HoodaOnFire - stars of the @LucknowIPL's win over #SRH - discuss their favourite moments from the #SRHvLSG clash. 👍👍 - By @ameyatilak Full interview 🎥 🔽 #TATAIPLhttps://t.co/C0nlc61PbZ pic.twitter.com/sUgmRaVTkU — IndianPremierLeague (@IPL) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్..
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021సెకెండ్ ఫేజ్ లో రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే వారి చివరి రెండు విజయాల్లో ఆ జట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఒక స్పిన్నర్ ఇలా వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో పంచుకుంది. కాగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అక్షర్ పటేల్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. చదవండి: T20 World Cup: ఒమన్లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లపై ప్రభావం..! That feeling of becoming the first spinner to win consecutive MOTM awards in IPL, since 2011 😏#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK pic.twitter.com/PQYn7f34AQ — Delhi Capitals (@DelhiCapitals) October 5, 2021 -
అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు
లండన్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీకి ఎంత విలువ ఉందో.. శార్దూల్ ఠాకూర్ ట్విన్ హాఫ్ సెంచరీలకు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు రెండుగా చీలిపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రోహిత్ శర్మ అర్హుడని కొందరు అంటే.. లేదు శార్దూల్కే ఆ అర్హత ఉందని మరికొందరు వాదించారు. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శర్మ తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడంపై మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర ''నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్ ఠాకూర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకంటే శార్దూల్కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్లో తామంతా బ్యాటింగ్లో విఫలమైనప్పుడు శార్దూల్ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ ప్రధాన బ్యాట్స్మెన్ అవుటైన తర్వాత పంత్తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. 100 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నాకంటే శార్దూల్కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా -
ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది కల.. ఈరోజుతో నెరవేరింది
కొలంబో: ''ఈ ప్రదర్శనే నేను కలగన్నది.. ఈరోజుతో నెరవేరింది.. అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాను.. దేశానికి విజయం అందించడం గర్విస్తున్నా'' అంటూ దీపక్ చహర్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్తో అభిమానులకు హీరోగా మారిపోయాడు. దీపక్ చహర్ ఈ ఇన్నింగ్స్ను టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడాడే కాబట్టే అంత క్రేజ్ వచ్చింది. అయినా టీమిండియా ఆడుతోంది.. శ్రీలంకతోనే కదా అని చిన్నచూపు మాత్రం చూడొద్దు. వాస్తవానికి లంక జట్టు ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాతో సమానంగా నిలిచింది. దానికి ఉదాహరణే రెండో వన్డే.. మొదట బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత బౌలింగ్లోనూ విజృంభించి 193 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దీపక్ చహర్, భువనేశ్వర్తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం నమోదు చేసి భారత్కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న చహర్ స్పందించాడు. 'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్ ద్రవిడ్ సర్ చెప్పారు. ఆయన కోచింగ్లో నేను భారత్-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. నా ఇన్నింగ్స్ సమయంలో కోచ్ ద్రవిడ్ డ్రింక్స్ బాయ్గా ఉన్న నా సోదరుడు రాహుల్ చహర్కు బ్యాటింగ్ పరంగా కొన్ని కీలక సూచనలు ఇచ్చి పంపించాడు. డ్రింక్స్ విరామం సమయంలో రాహుల్ నా దగ్గరకు వచ్చి ద్రవిడ్ సూచనలు అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా.ఈరోజుతో అది నెరవేరింది.' అని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Will never forget this moment #teamindia #dream . Thank you so much for your wishes means a lot ☺️🙏 #keepsupporting pic.twitter.com/y0iGLAaaKY — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) July 21, 2021 -
'ఈ అవార్డు నా చిట్టితల్లికి అంకితం'
హరారే: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం జింబాబే దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న పాక్ రెండు టెస్టుల సిరీస్లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. జింబాబ్వేతో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన హసన్ అలీ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఓవరాల్గా 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం పాక్ క్రికెటర్ హసన్ అలీకి 2019లో వివాహమైంది. 'గత ఏప్రిల్ నెలలో హసన్ అలీకి కూతురు పుట్టింది. కూతురు రాక అతని అదృష్టం కలిసొచ్చిందంటూ' ఒక జర్నలిస్ట్ ట్విటర్లో కామెంట్ చేశాడు. దీనిపై హసన్ అలీ రీట్వీట్ చేశాడు. '' నా కూతురు పుట్టినప్పటి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. నా కూతురే దేవుడి రూపంలో నా వెంట ఉంటూ నాకు ఆశీర్వాదం అందించింది. అందుకే ఈరోజు మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అందుకే నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది అవార్డును నా చిట్టితల్లికి అంకితమిస్తున్నా. నా కూతురును చాలా మిస్సవుతున్నా.. కానీ బందుత్వం కంటే దేశానికి ఆడాలనేది నా మొదటి ప్రాధాన్యత.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హసన్ అలీ పాక్ తరపున 12 టెస్టుల్లో 52, 54 వన్డేల్లో 83, 36 టీ20ల్లో 48 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ బ్యాటింగ్లో పవాద్ ఆలమ్ 140 పరుగులతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 134 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా రెండో టెస్టు మే 7 నుంచి 11 వరకు జరగనుంది. చదవండి: మరణించిన క్రికెటర్కు ‘హ్యాపీ బర్త్డే‘ చెప్పిన బోర్డు! -
IPL 2021, RR vs SRH: అదే కథ... అదే వ్యథ
న్యూఢిల్లీ: అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో ఆరో ఓటమిని ఆహ్వానించింది. రాజస్తాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. డేవిడ్ వార్నర్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి విలియమ్సన్కు పగ్గాలు అప్పగించినా హైదరాబాద్ తలరాత మారలేదు. తొలుత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. బట్లర్ (64 బంతుల్లో 124; 11 ఫోర్లు, 8 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ సామ్సన్ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. అనంతరం సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి ఓడింది. మనీశ్ పాండే (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్ లు), బెయిర్ స్టో (21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ముస్తఫిజుర్ (3/20), మోరిస్ (3/29) హైదరాబాద్కు కళ్లెం వేశారు. బట్లర్ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించింది. రషీద్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి టచ్లో కనిపించిన యశస్వి జైస్వాల్ (12) ఆ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతి బట్లర్ ప్యాడ్లకు తగిలింది. రషీద్ అప్పీల్ చేసినా అంపైర్ తిరస్కరించాడు. అయితే అప్పటికే సన్రైజర్స్ తమ వద్ద ఉన్న ఒక్క రివ్యూను కోల్పోవడంతో మళ్లీ రివ్యూ కోరలేకపోయింది. టీవీ రిప్లేలో మాత్రం బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపిం చింది. అప్పటికి బట్లర్ ఏడు పరుగులతో ఉన్నాడు. యశస్వి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సామ్సన్ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి ఖాతా తెరిచాడు. మరో ఎండ్లో బట్లర్ కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఇక్కడి నుంచి గేర్ మార్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకదశలో 30 బంతుల్లో 32 పరుగులు చేసిన అతను... నబీ వేసిన 15వ ఓవర్లో 6, 4, 4, 6 బాదాడు. మరోవైపు శంకర్ బౌలింగ్లో ఫోర్ కొట్టిన సామ్సన్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 150 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 17వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన బట్లర్ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టి20 కెరీర్లో అతడికిదే తొలి శతకం. సందీప్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6, 6 కొట్టిన అతను ఆ ఓవర్ చివరి బంతికి బౌల్డయ్యాడు. చివరి 10 ఓవర్లలో రాజస్తాన్ 143 పరుగులు సాధించింది. ఆరంభం లభించినా... కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్కు తుది జట్టులోనూ చోటు దక్కలేదు. దాంతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన మనీశ్ పాండే... బెయిర్స్టోతో కలిసి సన్రైజర్స్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు. లక్ష్యం భారీగా ఉండటంతో వీరిద్దరూ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. పవర్ప్లేలో హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఈ దశలో ముస్తఫిజుర్ హైదరాబాద్ను దెబ్బ తీశాడు. స్లో డెలివరీతో మనీశ్ను బోల్తా కొట్టించాడు. దూకుడు మీదున్న బెయిర్స్టో... తెవాటియా బౌలింగ్లో లాంగాన్ దగ్గర రావత్ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విలియమ్సన్ (21 బంతుల్లో 20, 1 ఫోర్), విజయ్ శంకర్ (8) వెంటవెంటనే అవుటయ్యారు. నబీ (5 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. దాంతో 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 129/5గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా ఆడకపోవడంతో సన్రైజర్స్కు ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) సందీప్ శర్మ 124; జైస్వాల్ (ఎల్బీ) (బి) రషీద్ ఖాన్ 12; సామ్సన్ (సి) సమద్ (బి) విజయ్ శంకర్ 48; పరాగ్ (నాటౌట్) 15; మిల్లర్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–17, 2–167, 3–209. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 37–0, సందీప్ శర్మ 4–0–50–1, రషీద్ 4–0–24–1, ఖలీల్ 4–0– 41–0, శంకర్ 3–0– 42–1, నబీ 1–0–21–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పాండే (బి) ముస్తఫిజుర్ 31; బెయిర్స్టో (సి) రావత్ (బి) తెవాటియా 30; విలియమ్సన్ (సి) మోరిస్ (బి) కార్తీక్ త్యాగి 20; విజయ్ శంకర్ (సి) మిల్లర్ (బి) మోరిస్ 8; జాదవ్ (బి) మోరిస్ 19; నబీ (సి) రావత్ (బి) ముస్తఫిజుర్ 17; సమద్ (సి) రావత్ (బి) మోరిస్ 10; రషీద్ (సి) మోరిస్ (బి) ముస్తఫిజుర్ 0; భువనేశ్వర్ (నాటౌట్) 14; సందీప్ శర్మ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–57, 2–70, 3–85, 4–105, 5–127, 6–142, 7–142, 8–143. బౌలింగ్: త్యాగి 4–0–32–1, ముస్తఫిజుర్ 4–0–20–3, సకారియా 4–0– 38–0, మోరిస్ 4–0–29–3, తెవాటియా 4–0–45–1. -
మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్
సాక్షి, హైదరాబాద్ : రషీద్ ఖాన్ ఈ పేరు ఇప్పుడు ఐపీఎల్ ట్రెండింగ్లో మారుమోగుతోంది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆల్రౌండర్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్కు విజయాన్ని అందించాడు. అద్భుత ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో 100శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వచ్చిన 5లక్షల మొత్తాన్ని, గతవారం అఫ్గనిస్తాన్ జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. గతవారం జలాలాబాద్లో స్థానిక క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఇందులో ఆరుగురు పౌరులు మరణించగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై గెలిచిన అనంతరం వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడు, అతడి కుమారుడికి రషీద్ అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రికెటర్ రషీద్.. పెద్ద మనసు ఇక్కడ చదవండి. -
వన్డేల్లోనూ తిరిగొస్తా
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ సురేశ్ రైనాకు పునరాగమనంలాంటిది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఈ సిరీస్లో 15, 31, 43 పరుగులు చేశాడు. చివరి టి20లో బౌలింగ్లో కూడా రాణించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో ఇదే జోరు కొనసాగించి వన్డే జట్టులోకి కూడా తిరిగొస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. రైనా భారత్ తరఫున 2015 అక్టోబరులో ఆఖరిసారిగా వన్డే ఆడాడు. ‘తిరిగి జట్టులోకి రావడం నాకు కీలక మలుపులాంటింది. ఇప్పుడు గెలిచిన జట్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మూడో స్థానంలో నాకు అవకాశమిచ్చి దూకుడుగా ఆడమంటూ కోహ్లి నాపై నమ్మకముంచడం వల్లే ఇది సాధ్యమైంది. మున్ముందు శ్రీలంకతో టోర్నీతో పాటు ఐపీఎల్లో కూడా పెద్ద సంఖ్యలో మ్యాచ్లకు అవకాశం ఉంది. గత రెండేళ్లుగా చాలా కష్టపడ్డాను. భారత్కు మళ్లీ ఆడాలనే పట్టుదలతో మైదానంలో, జిమ్లో కూడా తీవ్రంగా శ్రమించాను. వన్డేల్లో నేను గతంలో ఐదో స్థానంలో రాణించాను. రాబోయే మరికొన్ని మ్యాచ్లలో బాగా ఆడితే చాలు వన్డేల్లో కూడా తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’ అని రైనా చెప్పాడు. -
ఆ రికార్డు సచిన్ తర్వాత యువరాజ్దే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటికే ఈ మ్యాచ్తో భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నిలు ఆడిన తొలి ప్లేయర్గా నిలిచిన యువీ, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐసీసీ టోర్నిల్లో భారత్ తరుపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్నరికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా ఆ తరువాతి స్థానంలో యువీ నిలిచాడు. సచిన్ 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకోగా యువీ నిన్నటి దానితో కలిపి 9 అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఐసీసీ టోర్నిల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్గేల్ (11) అందుకొని అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో సచిన్, యువరాజ్లున్నారు. ICC tournaments get the best out of @YUVSTRONG12 . His 9th Man of the Match, only second to Sachin Paaji's 10 . A real champ.#IndvsPak — Mohammad Kaif (@MohammadKaif) 5 June 2017 -
నం.1ను నేలకు దించారు
-
నం.1ను నేలకు దించారు
► మూడో టెస్టులో భారత్ ఘన విజయం ► 124 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు ► 2-0తో సిరీస్ కోహ్లిసేన సొంతం ► ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్ ► డిసెంబర్ 3 నుంచి నాలుగో టెస్టు దేశమేదైనా.. వేదికేదైనా... గత తొమ్మిదేళ్లుగా నిరాటంకంగా సాగిపోతున్న ప్రపంచ నంబర్వన్ దక్షిణాఫ్రికా జైత్రయాత్రకు భారత్ గండి కొట్టింది. పటిష్టమైన జట్లపై అలవోకగా విజయాలు సాధించిన సఫారీలను స్పిన్ ఉచ్చులో బంధించి తడఖా చూపెట్టింది. అచ్చొచ్చిన వికెట్లపై అచ్చెరువొందే ఆటతీరుతో అద్భుత విజయాలు సాధించింది. ఇదే జోరుతో మూడో టెస్టునూ మూడు రోజుల్లోనే ముగించి 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నాగ్పూర్: ఆట కాస్త ఆలస్యంగా ముగిసినా... ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంచనాలకు అందని జామ్తా పిచ్పై భారత ‘స్పిన్ త్రయం’మరోసారి సంచలన ప్రదర్శన చేసింది. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులోనూ కోహ్లిసేన 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో 89.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆమ్లా (167 బంతుల్లో 39; 2 ఫోర్లు), డు ప్లెసిస్ (152 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు మళ్లీ నిరాశపర్చారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు తీశారు. డిసెంబర్ 3 నుంచి ఢిల్లీలో ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 215 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 79 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: 173 ఆలౌట్. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 18; వాన్ జెల్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 5; తాహిర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 8; ఆమ్లా (సి) కోహ్లి (బి) మిశ్రా 39; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 9; డు ప్లెసిస్ (బి) మిశ్రా 39; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; విలాస్ (సి) సాహా (బి) అశ్విన్ 12; హార్మర్ నాటౌట్ 8; రబడ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6; మోర్కెల్ (బి) అశ్విన్ 4; ఎక్స్ట్రాలు: 18; మొత్తం: (89.5 ఓవర్లలో ఆలౌట్) 185. వికెట్ల పతనం: 1-17; 2-29; 3-40; 4-58; 5-130; 6-135; 7-164; 8-167; 9-177; 10-185. బౌలింగ్: ఇషాంత్ 15-6-20-0; అశ్విన్ 29.5-7-66-7; జడేజా 25-12-34-0; మిశ్రా 20-2-51-3. సెషన్-1 డివిలియర్స్ నిరాశ 32/2 ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ బ్యాట్స్మెన్ను ఆరంభంలోనే అశ్విన్ ఇబ్బందులకు గురి చేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ పరుగులకు కళ్లెం వేశాడు. దీంతో ఓ ఎండ్లో ఆమ్లా నిలకడగా ఆడినా... రెండో ఎండ్లో ఎల్గర్ (18), డివిలియర్స్ (9) ఒత్తిడిని అధిగమించలేకపోయారు. చివరకు 18 బంతుల వ్యవధిలో అశ్విన్ ఈ ఇద్దర్ని పెవిలియన్కు చేర్చాడు. అయితే తొలి గంటలో బాగా ఇబ్బందిపడ్డ ప్రొటీస్ ఇన్నింగ్స్ డు ప్లెసిస్ రాకతో కాస్త కుదుటపడింది. పూర్తి రక్షణాత్మకంగా ఆడిన అతను జడేజా ఓవర్లలో భారీ షాట్లతో ఒత్తిడిని తగ్గించుకున్నాడు. ఆమ్లా కూడా ఇదే ధోరణి అవలంభించడంతో రెండో గంట ఎలాంటి కుదుపు లేకుండా ఇన్నింగ్స్ సాగింది. ఓవరాల్గా మరో వికెట్ పడకుండా ప్రొటీస్ 105/4 స్కోరుతో లంచ్కు వెళ్లింది. ఓవర్లు: 31; పరుగులు: 73; వికెట్లు: 2 సెషన్-2 కీలక భాగస్వామ్యం లంచ్ తర్వాత కోహ్లి... ప్రధానంగా అశ్విన్, మిశ్రాలపైనే ఆధారపడ్డా మధ్యలో వైవిధ్యం కోసం జడేజా, ఇషాంత్లను ప్రయోగించాడు. తరచుగా బౌలర్ల ఎండ్లు మారడం వల్ల ఆమ్లా, డు ప్లెసిస్లు ఇరకాటంలో పడ్డారు. కనీసం సింగిల్స్ తీసే సాహసం కూడా చేయకపోవడంతో తొలి గంటలో (19 ఓవర్లలో 21 పరుగులు) స్కోరు వేగం పూర్తిగా మందగించింది. తర్వాత బంతిని అద్భుతంగా ఫ్లయిట్ చేసిన మిశ్రా డబుల్ బ్రేక్తో సీన్ మార్చేశాడు. ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేశాడు. ఓ చక్కని లెగ్ బ్రేక్కు ఆమ్లా షార్ట్ గల్లీలో క్యాచ్ ఇస్తే... ఫుల్ లెంగ్త్ బంతిని ఆడలేక డు ప్లెసిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాదాపు మూడు గంటల పాటు క్రీజులో ఉన్న ఈ జోడి ఐదో వికెట్కు 72 పరుగులు జత చేసింది. తర్వాత డుమిని (19), విలాస్ (12)లు టీ వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. ఓవర్లు: 31; పరుగులు: 46; వికెట్లు: 2 సెషన్-3 అశ్విన్ హవా టీ తర్వాత ప్రొటీస్ ఇన్నింగ్స్ 52 నిమిషాల్లోనే ముగిసింది. ఇషాంత్, మిశ్రాలతో బౌలింగ్ కొనసాగించిన కోహ్లి... రెండో కొత్త బంతిని అశ్విన్కు అందించాడు. అంతే ఒక్కసారిగా స్పిన్నర్ విలయం సృష్టించాడు. 82వ ఓవర్ తొలి, చివరి బంతులకు డుమిని, విలాస్లను అవుట్ చేసి షాకిచ్చాడు. అశ్విన్ సాధ్యమైనంత ఎక్కువగా టర్న్ చేయడంతో లోయర్ ఆర్డర్కు సవాలుగా మారింది. రెండు ఓవర్లలో రబడతో పాటు మోర్కెల్ (4)ను అవుట్ చేయడంతో సంచలన విజయం భారత్ సొంతమైంది. ఆఖరి స్పెల్లో అశ్విన్ 19 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. ఓవర్లు: 13.5; పరుగులు: 34; వికెట్లు: 4 9 ►2006లో దక్షిణాఫ్రికా చివరిసారి లంక చేతిలో 0-2తో సిరీస్ ఓడింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో విదేశాల్లో ఆడిన 15 సిరీస్ల్లో వరుసగా నెగ్గింది. గతంలో 1980-85 మధ్య విండీస్ వరుసగా 18 సిరీస్ల్లో విజయాలు సాధించింది. 7/ 66 ►జఅశ్విన్ కెరీర్లో ఇదే ఉత్తమ గణాంకాలు. ఒకే మ్యాచ్లో 10 వికెట్లకు పైగా తీయడం ఇది నాలుగోసారి. 55► ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్. క్యాలెండర్ ఏడాదిలో 50కిపైగా వికెట్లు తీసిన 12వ భారతీయ బౌలర్ కూడా అతనే. 2008లో హర్భజన్ 63 వికెట్లు పడగొట్టాడు. 1► 1900 సంవత్సరం తర్వాత ఏ బ్యాట్స్మన్ 40 పరుగుల కంటే ఎక్కువ చేయకుండా ఓ టెస్టులో ఫలితం రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ మొత్తంలో విజయ్ ఒక్కడే 40 పరుగులు చేశాడు. 1► స్వదేశంలో కెప్టెన్గా కోహ్లికి తొలి టెస్టు సిరీస్ విజయం. -
దక్షిణాఫ్రికా శుభారంభం
వెస్టిండీస్తో తొలి వన్డే డర్బన్: కెప్టెన్ ఏబీ డి విలియర్స్ (94 బంతుల్లో 81; 6 ఫోర్లు) మెరుపులకు తోడు బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. కింగ్స్మీడ్ మైదానంలో శుక్రవారం జరిగిన ఈ తొలి వన్డేను డక్వర్త్ లూయిస్ పద్ధతిన 61 పరుగులతో గెలుచుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ప్రొటీస్ ఇన్నింగ్స్కు చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో 48.2 ఓవర్లలో 8 వికెట్లకు 279 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (68 బంతుల్లో 70; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), ఓపెనర్ హషీమ్ ఆమ్లా (66 బంతుల్లో 66; 10 ఫోర్లు) వేగంగా ఆడి స్కోరును పెంచారు. అలాగే 101 ఇన్నింగ్స్లోనే వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. కోహ్లి, రిచర్డ్స్ (114 ఇన్నింగ్స్) రెండో స్థానంలో ఉన్నారు. టేలర్, రస్సెల్లకు రెండేసి వికెట్లు దక్కా యి. ఆ తర్వాత సవరించిన లక్ష్యం ప్రకారం విండీస్ 32 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉండగా సఫారీ పేసర్ల ధాటికి కుప్పకూలింది. 28.2 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో తొలి వికెట్కు ఆరు ఓవర్లలోనే 51 పరుగులు జత చేరాయి. అయితే స్టెయిన్ బౌలింగ్లో గేల్ అవుట్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ పతనం దిశగా సాగింది. రామ్దిన్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. డేల్ స్టెయిన్, ఫిలాండర్, స్పిన్నర్ తాహిర్లకు మూడేసి వికెట్లు దక్కాయి. డివిలియర్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. -
చెన్నై x కోల్కతా
వరుసగా రెండో ఏడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ టైటిల్ ఐపీఎల్ జట్టుకే దక్కనుంది. ఐపీఎల్ జట్లయిన కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంతిమ సమరానికి అర్హత సాధించాయి. సెమీఫైనల్స్లో కోల్కతా ఏడు వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్ జట్టుపై, చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై గెలిచాయి. ఫైనల్ శనివారం బెంగళూరులో జరుగుతుంది. ► సెమీస్లో ఓడిన పంజాబ్, హోబర్ట్ జట్లు ► అవానా ‘హ్యాట్రిక్’ వృథా ► రాణించిన కలిస్ ► బ్రేవో మెరుపు ఇన్నింగ్స్ ► చాంపియన్స్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ చాంపియన్స్ లీగ్లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. టి20ల్లో వరుసగా 14వ విజయం సాధించిన కోల్కతా జట్టు గురువారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన హోబర్ట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (46 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, డంక్ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం నైట్రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాక్ కలిస్ (40 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్తో ముందుండి నడిపించగా... మనీశ్ పాండే (32 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఐపీఎల్లో దాదాపు 200 పరుగుల లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించిన పంజాబ్కు ఈ సారి కలిసి రాలేదు. పటిష్టమైన చెన్నైతో నాటి ప్రదర్శనను ఆ జట్టు పునరావృతం చేయలేకపోయింది. చాంపియన్స్ లీగ్లో వరుసగా నాలుగు మ్యాచ్లు నెగ్గిన ఆ జట్టు సెమీస్లో చేతులెత్తేసింది. రెండో సెమీఫైనల్లో చెన్నై 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ బ్రేవో (39 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డు ప్లెసిస్ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పంజాబ్ బౌలర్ పర్వీందర్ అవానా హ్యాట్రిక్ సాధించాడు. తన రెండో ఓవర్ చివరి బంతికి రైనాను అవుట్ చేసిన అతను...మూడో ఓవర్ తొలి రెండు బంతులకు నేగి, ధోనిలను పెవిలియన్ పంపించాడు. అనంతరం పంజాబ్ 18.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కోరు వివరాలు: హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) గంభీర్ (బి) కుల్దీప్ 39; మైకేల్ (సి) అండ్ (బి) రసెల్ 0; బ్లిజార్డ్ (ఎల్బీ) (బి) పఠాన్ 0; మాలిక్ (నాటౌట్) 66; బిర్ట్ (సి) డస్కటే (బి) నరైన్ 13; వెల్స్ (బి) చావ్లా 3; గల్బిస్ (రనౌట్) 15; హిల్ఫెన్హాస్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140 వికెట్ల పతనం: 1-4; 2-13; 3-46; 4-77; 5-91; 6-135; బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 4-0-24-1; రసెల్ 4-0-24-1; నరైన్ 4-0-24-1; కుల్దీప్ 4-0-31-1; చావ్లా 4-0-35-1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) డోహర్తి 17; గంభీర్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 4; కలిస్ (నాటౌట్) 54; పాండే (సి) మాలిక్ (బి) లాఫ్లిన్ 40; పఠాన్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 141 వికెట్ల పతనం: 1-20; 2-44; 3-107. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-28-0; బొలింజర్ 3.1-0-26-1; డోహర్తి 4-0-28-1; గల్బిస్ 4-0-23-0; లాఫ్లిన్ 4-0-36-1. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) అవానా 14; మెకల్లమ్ (సి) అవానా (బి) పెరీరా 6; రైనా (సి) బెయిలీ (బి) అవానా 6; డు ప్లెసిస్ (బి) అక్షర్ 46; బ్రేవో (సి) మ్యాక్స్వెల్ (బి) అక్షర్ 67; నేగి (బి) అవానా 8; ధోని (సి) కరణ్వీర్ (బి) అవానా 0; జడేజా (నాటౌట్) 27; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182 వికెట్ల పతనం: 1-23; 2-29; 3-41; 4-106; 5-141; 6-141; 7-160. బౌలింగ్: అనురీత్ 4-0-44-0; అవానా 4-0-30-4; పెరీరా 4-0-41-1; కరణ్వీర్ 4-0-36-0; అక్షర్ పటేల్ 4-0-30-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) మెకల్లమ్ (బి) మోహిత్ 0; వోహ్రా (సి) డు ప్లెసిస్ (బి) వోహ్రా 16; సాహా (బి) నెహ్రా 6; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) నెహ్రా 0; మిల్లర్ (బి) అశ్విన్ 22; బెయిలీ (సి) మెకల్లమ్ (బి) నేగి 6; పెరీరా (సి) బ్రేవో (బి) నేగి 0; అక్షర్ (బి) రైనా 31; కరణ్వీర్ (నాటౌట్) 17; అవానా (సి) డు ప్లెసిస్ (బి) రైనా 0; అనురీత్ (సి) రైనా (బి) జడేజా 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 117 వికెట్ల పతనం: 1-3; 2-24; 3-24; 4-24; 5-34; 6-34; 7-61; 8-90; 9-90; 10-117; బౌలింగ్: నెహ్రా 3-0-9-2; మోహిత్ 3-0-14-2; అశ్విన్ 4-0-33-1; నేగి 4-0-28-2; జడేజా 1.2-0-9-1; రైనా 2-0-10-2; బ్రేవో 1-0-12-0. -
బంగ్లాదేశ్ 70 ఆలౌట్
రెండో వన్డేలో 177 పరుగులతో విండీస్ విజయం సెయింట్ జార్జి: వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు తమ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరును నమోదు చే సింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ జట్టు... స్పిన్నర్ నరైన్ (3/13), పేసర్ రోచ్ (3/19) ధాటికి శుక్రవారం జరిగిన మ్యాచ్లో 24.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయ్యింది. ఫలితంగా విండీస్ 177 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాపై విండీస్కిదే అతి పెద్ద విజయం. మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరి వన్డే రేపు (సోమవారం) జరుగుతుంది. ఐదో ఓవర్ నుంచి సాగిన బంగ్లా వికెట్ల పతనాన్ని అడ్డుకునే బ్యాట్స్మెన్ కరువయ్యాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. మిగిలిన పది మంది ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 28 మాత్రమే. వీరిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును సాధించలేకపోగా చివరి ఏడు వికెట్లు కేవలం 13 పరుగుల వ్యవధిలోనే కుప్పకూలాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (67 బంతుల్లో 58; 3 ఫోర్లు; 5 సిక్సర్లు) చెలరేగాడు. డ్వేన్ బ్రేవో (82 బంతుల్లో 53; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్కు 88 పరుగులు జోడించాడు. మిడిలార్డర్లో సిమ్మన్స్ (61 బంతుల్లో 40; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మొర్తజా మూడు, అల్ అమిన్ రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్కు దక్కింది. -
ఓవల్ ను ఛేదిస్తారా!
లండన్: క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో ధోని సేన కొత్త చరిత్రను సృష్టించాక సగటు భారతాభిమాని సిరీస్ పై ఆశలు పెంచుకున్నాడు. అయితే మనం ఒకటి తలస్తే.. మన ధోని గ్యాంగ్ మరోటి తలచింది. లార్డ్స్ టెస్టు అనంతరం మంచి ఊపు మీద కనిపించిన ధోనీ గ్యాంగ్ దారుణంగా విఫలమై సిరీస్ పై ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే మూడు, నాల్గో టెస్టుల్లో గెలిచి ఈ సిరీస్ ను తమ చేతుల్లోకి తీసుకున్న ఇంగ్లండ్ ఫైనల్ టెస్టును కైవసం చేసుకుని సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, ధోనీ సేన మాత్రం టెస్టును గెలిచి సిరీస్ ను సమం చేయాలని వ్యూహరచన చేస్తోంది. భారత్ కు సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ఓవల్ లో ఆరంభం కానున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి చవిచూసిన భారత్ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఈ తరుణంలో భారత్ చివరి టెస్టును ఏ రకంగా నెట్టుకొస్తోందో చూడాలి. ఈ టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేస్తారా? లేక ఆ మ్యాచ్ ను కూడా ఇంగ్లండ్ చేతిలో పెట్టి భారత్ కు ఉట్టి చేతుల్తో తిరిగి వస్తారా?అనేది చూడాల్సి ఉంది. -
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?
లండన్: క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి పాలైన భారత్.. ఆధిక్యాన్ని ఇంగ్లండ్ చేతుల్లో పెట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఇంకా భారత్ కు చివరి టెస్టు రూపంలో ఆశలు మిగిలే ఉన్నాయి. ఆగస్టు 15 వ తేదీన ఓవల్ లో జరుగనున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 16 ఇన్నింగ్స్ లలో ఈ ఇద్దరు కలిసి మధ్య 315 పరుగులు మాత్రమే నమోదయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.అలాంటప్పుడు వీరు నాటి దిగ్గజాల స్థానాలను భర్తీ చేయగలరంటే అతిశయోక్తే అవుతుంది.సచిన్ తన తొలి ఇంగ్లండ్ పర్యటనలో 61.25 సగటుతో ఐదు ఇన్నింగ్స్ లలో 245 పరుగులు చేయగా, ద్రవిడ్ తొలి మూడు ఇన్నింగ్స్ లలో 62.33 సగటుతో 187 పరుగులు సాధించాడు. మరీ వారి స్ఫూర్తిని తీసుకుని ఈ ఇద్దరు భారత్ చివరి టెస్టులో రాణిస్తారా?లేక పాత కథే పునరావృతం చేస్తారో వేచి చూడాల్సిందే. -
నవ్విపోదురుగాక...
అదేంటోగానీ... అశ్విన్, జడేజాలకు తిరగని బంతి మొయిన్ అలీ చేతిలో గిర్రున తిరిగింది..! ఏం విడ్డూరమోగానీ.... భారత బ్యాట్స్మెన్ ఎలా ఆడినా బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకే వెళ్లింది..! అదేం వైపరీత్యమోగానీ... మనకు కలిసొస్తుందనుకున్న ప్రతి అంశం ప్రత్యర్థులకు వరంగా మారింది...! బ్యాటింగ్ వికెట్... టాస్ గెలిచాం... జట్టులో టాప్ బ్యాట్స్మెన్... బంతిని స్వింగ్ చేసే బౌలర్లు... నాణ్యమైన స్పిన్నర్లు... నాలుగో టెస్టులో ఇవేవీ భారత్ ఓటమిని అడ్డుకోలేకపోయాయి. రెండో రోజు గనక వర్షం లేకపోతే ఈ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసినట్లే..! ఇంతకంటే ఓ జట్టుకు అవమానం ఏముంటుంది? ఒక్క సెషన్లో 9 వికెట్లు... 13 పరుగుల వ్యవధిలో 5 ‘టాప్’ వికెట్లు... పసికూనలు కూడా ఇంత దరిద్రంగా ఆడరు. తొలి ఇన్నింగ్స్లో సున్నాల రికార్డును మరచిపోయేలా... లార్డ్స్ విజయాన్ని మూడు రోజుల మురిపెంగా మార్చి... మాంచెస్టర్లోనూ ఓటమిని మూట గట్టుకుంది. ఇక ఆఖరి టెస్టులో ఏం చేస్తారో మరి..! ►నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం ►ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు ►సిరీస్లో 2-1 ఆధిక్యం ►మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్రాడ్ ►చివరి టెస్టు 15 నుంచి మాంచెస్టర్: ఇదేం ఆట...! నాలుగో టెస్టులో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే స్కూల్ పిల్లలు వీళ్ల కంటే నయమనిపిస్తోంది. పేరుకు ప్రపంచ స్థాయి క్రికెటర్లు... ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే సమర్థులు... కానీ గల్లీ ఆటగాళ్ల మాదిరిగా కూడా ఆడలేకపోయారు. పరుగులు చేయలేకపోయినా... కనీసం వికెట్లు కాపాడుకోవాలన్న కనీస బాధ్యతను మరిచారు. పరాయి గడ్డపై పరువు పోతుందన్న ధ్యాస లేకుండా ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్లో సిరీస్లో కుక్సేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన ఈ మ్యాచ్లో శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 105.3 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 215 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్ (77), బట్లర్ (70)లు రాణించారు. భువనేశ్వర్, ఆరోన్ చెరో మూడు, పంకజ్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 43 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (46 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అలీ 4, అండర్సన్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్రాడ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఈనెల 15న ఓవల్లో ప్రారంభమవుతుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 152 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ఆరోన్ 37; బెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 58; జోర్డాన్ (సి) ఆరోన్ (బి) భువనేశ్వర్ 13; రూట్ (సి) ధోని (బి) పంకజ్ 77; అలీ (బి) ఆరోన్ 13; బట్లర్ (సి) పుజారా (బి) పంకజ్ 70; వోక్స్ నాటౌట్ 26; బ్రాడ్ రిటైర్డ్హర్ట్ 12; అండర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 9; ఎక్స్ట్రాలు: 29; మొత్తం: (105.3 ఓవర్లలో ఆలౌట్) 367. వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113; 4-136; 5-140; 6-170; 7-304; 8-325; 8-338 (బ్రాడ్ రిటైర్డ్హర్ట్); 9-367. బౌలింగ్: భువనేశ్వర్ 24-7-75-3; పంకజ్ 28-5-113-2; ఆరోన్ 26-4-97-3; అశ్విన్ 14-1-29-0; జడేజా 13.3-1-36-1. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) వోక్స్ 18; గంభీర్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 18; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) అలీ 17; కోహ్లి (సి) బెల్ (బి) అండర్సన్ 7; రహానే (సి) అండ్ (బి) అలీ 1; ధోని (సి) బ్యాలెన్స్ (బి) అలీ 27; జడేజా (సి) జోర్డాన్ (బి) అలీ 4; అశ్విన్ నాటౌట్ 46; భువనేశ్వర్ రనౌట్ 10; ఆరోన్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 9; పంకజ్ (బి) జోర్డాన్ 0; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: (43 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1-26; 2-53; 3-53; 4-61; 5-61; 6-66; 7-105; 8-133; 9-161; 10-161 బౌలింగ్: అండర్సన్ 9-4-18-2; వోక్స్ 9-2-37-1; జోర్డాన్ 12-1-65-2; అలీ 13-3-39-4. ►31 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్లలో భారత జట్టు 66 పరుగులలోపే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి అనుభవం భారత్కు చివరిసారి 1983లో కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఎదురైంది. ►1952 ఇంగ్లండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన టెస్టులోనూ భారత జట్టు రెండు ఇన్నింగ్స్లలో 66 పరుగులలోపే 6 అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 207 పరుగులతో గెలిచింది. ►1967 తర్వాత ఇంగ్లండ్లో జరిగిన టెస్టులో భారత టాప్-7 బ్యాట్స్మెన్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి 191 పరుగులు చేశారు. ►నాలుగో టెస్టు మొత్తం 1,171 బంతుల్లోనే (195.1 ఓవర్లు) ముగిసింది. భారత, ఇంగ్లండ్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. సెషన్-1 పంకజ్కు రెండు వికెట్లు 237/6 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రూట్, బట్లర్ నిలకడగా ఆడారు. రెండో ఓవర్లోనే రూట్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఫీల్డింగ్ వైఫల్యంతో బట్లర్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్స్మన్ 34 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను కోహ్లి ఎడమవైపు డైవ్ చేసినా అందుకోలేకపోగా... 45 పరుగుల వద్ద ధోని సులువైన రనౌట్ మిస్ చేశాడు. అయితే లంచ్కు కొద్ది ముందు పంకజ్ సింగ్ మూడు ఓవర్ల వ్యవధిలో రూట్, బట్లర్ను అవుట్ చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 134 పరుగులు జోడించారు. వోక్స్ (26 నాటౌట్), బ్రాడ్ (12) మరో వికెట్ పడకుండా లంచ్కు వెళ్లారు. ఓవరాల్గా ఈ సెషన్లో భారత బౌలర్ల వైఫల్యం ఇంగ్లండ్కు ఆధిక్యాన్ని సమకూర్చిపెట్టింది. ఓవర్లు: 26; పరుగులు: 88; వికెట్లు: 2 సెషన్-2 తడబడిన భారత్ లంచ్ తర్వాత ఆరోన్ బౌలింగ్లో రెండు వరుస సిక్సర్లు బాదిన బ్రాడ్.. తర్వాతి బంతికే గాయపడ్డాడు. వేగంగా వచ్చిన షార్ట్ పిచ్ డెలివరి హెల్మెట్లో నుంచి దూసుకుపోయి బ్యాట్స్మన్ ముక్కును బలంగా తాకింది. దీంతో అతను రిటైర్డ్హర్ట్ అయ్యాడు. ఓ ఎండ్లో వోక్స్ వేగంగా ఆడినా... రెండో ఎండ్లో అండర్సన్ (9) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్కు 29 పరుగులు జోడించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు విజయ్ (18), గంభీర్ (18) ఆరంభంలోనే తడబడ్డారు. కొత్త బంతితో చెలరేగిన అండర్సన్, వోక్స్లను సమర్థంగా ఎదుర్కొలేకపోయారు. పరుగులు చేయడానికి ఇబ్బందికి గురైన విజయ్...వోక్స్కు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత గౌతీతో జత కలిసిన పుజారా ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. ఓవర్లు: 8.3; పరుగులు: 42; వికెట్లు: 2 (ఇంగ్లండ్) ఓవర్లు: 15; పరుగులు: 33; వికెట్లు: 1 (భారత్) సెషన్-3... 13 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు టీ విరామం తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఓ ఎండ్లో పేసర్లను మార్చి ప్రయోగించిన కుక్... రెండో ఎండ్లో మాత్రం అలీని కొనసాగించాడు. ఈ వ్యూహం అద్భుతంగా పని చేసింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న గంభీర్ను, మరి కొద్దిసేపటికి కోహ్లి (7)ని అండర్సన్ బోల్తా కొట్టిస్తే... అలీ తన వరుస మూడు ఓవర్లలో పుజారా (17), రహానే (1), జడేజా (4)లను పెవిలియన్కు పంపాడు. దీంతో భారత్ 13 పరుగుల తేడాలో 5 కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ధోని (27), అశ్విన్లు కాసేపు ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అలీ మరో అద్భుతమైన బంతితో ధోనిని దెబ్బతీస్తే... ఆ వెంటనే భువనేశ్వర్ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. తర్వాత అశ్విన్ భారీ షాట్లతో ఎక్కువ భాగం స్ట్రయికింగ్ చేశాడు. కానీ వరుణ్ ఆరోన్ (9), పంకజ్ సింగ్ (0)లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జోర్డాన్ వేసిన వరుస బంతుల్లో వీరిద్దరు అవుట్ కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. ఓవర్లు: 28; పరుగులు: 128; వికెట్లు: 9 -
మది నిండా ఆనందం
►క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర ► లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్పై 95 పరుగుల విజయం ► సిరీస్లో భారత్కు 1-0 ఆధిక్యం ► మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ శర్మ పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే... నచ్చిన సెల్ఫోన్ నాన్న కొనిస్తే... మెచ్చిన హీరో సినిమా మార్నింగ్ షో చూస్తే... ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్కు వెయ్యి లైక్లు వస్తే... ఎంత ఆనందం కలుగుతుందో... భారత క్రికెట్ అభిమానికీ అంత ఆనందం కలిగింది. ఇది నిజమేనా..! అని ఆశ్చర్యపోయేలా ధోనిసేన మురిపించింది. క్రికెట్ను ఊపిరిగా శ్వాసించే అభిమానులకు ఇదో సంబరం. ఈ ఆటను మతంలా భావించే దేశానికి ఇదో పెద్ద విజయం. క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం టెస్టు గెలిచిన తర్వాత... సచిన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాని విజయం... ఇన్నాళ్లకు దక్కింది. విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సంతోష సమయంలో... భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక మైదానంలో ఇంగ్లండ్ను 95 పరుగుల తేడాతో ఓడించింది. పేసర్ ఇషాంత్ శర్మ (7/74) సంచలన బౌలింగ్తో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. లండన్: అద్భుతం.. మహాద్భుతం. అవును.. భారత జట్టు మహాద్భుతమే సృష్టించింది. లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్లో గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. తొలి నాలుగు రోజులు ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన రెండో టెస్టు.. చివరి రోజు ఇషాంత్ శర్మ బెబ్బులిలా విజృంభించడంతో ఏకపక్షమైంది. కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ నిప్పులు కురిపించిన ఇషాంత్ బంతులకు ఇంగ్లండ్ కుదేలైంది. ఆట ఆఖరి రోజు రెండో సెషన్లోనే 223 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 95 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయం నమోదు చేసిన భారత్.. ఐదు టెస్టుల ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అద్భుత విజయాన్నందించిన ఇషాంత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: 342 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 7; కుక్ (సి) ధోని (బి) ఇషాంత్ 22; బాలెన్స్ (సి) ధోని (బి) షమీ 27; బెల్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) బిన్ని (బి) ఇషాంత్ 66; అలీ (సి) పుజారా (బి) ఇషాంత్ 39; ప్రయర్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 12; స్టోక్స్ (సి) పుజారా (బి) ఇషాంత్ 0; బ్రాడ్ (సి) ధోని (బి) ఇషాంత్ 8; ప్లంకెట్ నాటౌట్ 7; అండర్సన్ రనౌట్ 2; ఎక్స్ట్రాలు 32, మొత్తం: (88.2 ఓవర్లలో): 223 ఆలౌట్. వికెట్ల పతనం: 1-12, 2-70, 3-71, 4-72, 5-173, 6-198, 7-201, 8-201, 9-216, 10-223. బౌలింగ్: భువనేశ్వర్ 16-7-21-0; షమీ 11-3-33-1; ఇషాంత్ 23-6-74-7; జడేజా 32.2-7-53-1; విజయ్ 4-1-11-0; ధావన్ 2-0-2-0. సెషన్-1: ఆఖరి బంతితో ఆరంభం 319 పరుగుల లక్ష్యంతో.. ఓవర్నైట్ స్కోరు 105/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ రూట్, అలీ ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకుండా ఆచితూచి ఆడారు. తొలుత ఇషాంత్, జడేజాలతో బౌలింగ్ చేయించిన భారత కెప్టెన్ ధోని.. ఆ తరువాత వ్యూహం మార్చి భువనేశ్వర్, షమీలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పార్ట్టైమర్ ధావన్ చేతికీ బంతినిచ్చాడు. అయినా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ క్రీజును అంటిపెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఇన్నింగ్స్ 70వ ఓవర్లో స్కోరు 150 మార్క్కు చేరింది. లంచ్కు ముందు ఇషాంత్ మళ్లీ బంతి పట్టగా.. ఒకే ఓవర్లో రూట్ మూడు ఫోర్లు సాధించి దూకుడు ప్రదర్శించాడు. అయితే ఇషాంత్ వేసిన సెషన్ చివరి ఓవర్, చివరి బంతి ఇంగ్లండ్ పతనానికి నాంది పలుకుతూ అలీ (147 బంతుల్లో 39; 5 ఫోర్లు) వికెట్ను బలిగొంది. దీంతో 101 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరదించుతూ భారత్ లంచ్కు వెళ్లింది. ఓవర్లు: 30; పరుగులు: 68; వికెట్లు: 1 సెషన్-2: ఇంగ్లండ్ పేకమేడలా..! తిరిగి మ్యాచ్ ఆరంభమయ్యాక ఎదురుదాడికి దిగే వ్యూహం అవలంబించిన ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇషాంత్ వేసిన ఊరించే బంతుల్ని పుల్షాట్లుగా మలిచే ప్రయత్నంలో బ్యాట్స్మెన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలుత ఇన్నింగ్స్ 80వ ఓవర్లో పుల్షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ప్రయర్ (12) డీప్ మిడ్వికెట్లో విజయ్ చేతికి చిక్కగా, ఇషాంత్ మరుసటి ఓవర్లో స్టోక్స్ (0), రూట్ (146 బంతుల్లో 66; 7 ఫోర్లు)లు అతణ్ని అనుసరించారు. స్టోక్స్ వరుసగా నాలుగో డకౌట్ నమోదు చేసుకోగా, రూట్ నియంత్రణ లేని షాట్తో ఎనిమిదో వికెట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. మరో మూడు ఓవర్లు గడిచాయో లేదో.. ఇషాంత్ నమ్మశక్యం కాని రీతిలో ధోని క్యాచ్ ద్వారా బ్రాడ్ (8)ను వెనక్కిపంపి ఏడో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు పరుగులు జతయ్యాక.. అండర్సన్ (2)ను జడేజా రనౌట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం పూర్తయింది. 50 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ శిబిరంలో విషాదం చోటుచేసుకుంది. రిజర్వు ఆటగాళ్లతో సహా భారత బృందం మైదానంలోకి వచ్చి ఆనందాన్ని పంచుకుంది. ఓవర్లు: 12.2; పరుగులు: 60; వికెట్లు: 5 మలుపు తిరిగిందిక్కడే..! ఇంగ్లండ్ స్కోరు 173/4. ఐదో వికెట్కు 101 పరుగులు నమోదయ్యాయి. అర్ధసెంచరీతో రూట్, అతనికి అండగా మొయిన్ అలీ క్రీజులో పాతుకుపోయారు. విజయానికి మరో 146 పరుగులు కావాల్సివుంది. దీంతో ఇంగ్లండ్ శిబిరంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, అప్పుడే జరిగింది అద్భుతం. లంచ్కు వెళ్లేముందు చివరి బంతిని ఇషాంత్ జూలు విదిల్చిన సింహంలా విజృంభిస్తూ సంధించాడు. దీంతో అనూహ్యంగా ముఖం మీదికి దూసుకొచ్చిన బంతికి అలీ వద్ద సమాధానమే లేకపోయింది. ముఖానికి బ్యాట్ను అడ్డం పెట్టి పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. అంతే... మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ‘లంబూ’ పంబ రేపాడు! ఎప్పుడో ఆరేళ్ల క్రితం...పెర్త్ మైదానంలో రికీపాంటింగ్లాంటి దిగ్గజాన్ని వణికించిన అద్భుతమైన స్పెల్ అది...ఇషాంత్ శర్మ అంటే అందరికీ అదే గుర్తొస్తుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ఉన్నా...అతని కెరీర్లో అద్భుతాలు పెద్దగా లేవు. 50కి పైగా టెస్టు మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా ఒక సీనియర్గా జట్టు బౌలింగ్కు నాయకత్వం వహించే స్థాయిలో లేడంటూ ఇషాంత్పై విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2011లో వెస్టిండీస్లో సిరీస్ నెగ్గినపుడు 22 వికెట్లతో ఇషాంత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అయితే ఆ తర్వాత అతడి బౌలింగ్ మరీ నాసిరకంగా తయారైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఇషాంత్ మారాడు. ఇక ఆట మారకుంటే కష్టం అనుకున్నాడు. అందుకే తనకు ఓనమాలు నేర్పిన కోచ్ శ్రవణ్ కుమార్ దగ్గరికి మళ్లీ వెళ్లాడు. తన బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు. వేగం ధ్యాసలో పడి కోల్పోయిన లైన్ అండ్ లెంగ్త్ను అంది పుచ్చుకున్నాడు. దాని ఫలితం ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ సిరీస్లో కనిపించింది. రెండు టెస్టుల్లో కలిపి 15 వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్లో ప్రాక్టీస్ మ్యాచ్లలో నోబాల్స్ సమస్య...తొలి టెస్టులో మూడే వికెట్లు...రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వికెట్ పడలేదు! ఇలాంటి స్థితిలో అతను రెండో ఇన్నింగ్స్లో తన విలువేంటో చూపించాడు. 2011లో ఘోర పరాజయం బాధను అనుభవించిన లంబూ... ఈసారి తాను ఊరట చెందడంతో పాటు దేశంలో అందరిలో సంతోషాన్ని నింపాడు. ప్రధాని అభినందనలు ‘భారత జట్టు చాలా బాగా ఆడింది. లార్డ్స్లో అద్భుత విజయం సాధించినందుకు నా అభినందనలు. ఈ ప్రదర్శనపై మేం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నాం’ - నరేంద్ర మోడి ఇంగ్లండ్లో మా ఆటగాళ్లు చాలా మంది టెస్టు క్రికెట్ ఆడలేదు. సమీప భవిష్యత్తులో నేను లార్డ్స్లో టెస్టు ఆడకపోవచ్చు. కాబట్టి జట్టుకే కాకుండా వ్యక్తిగతంగా ఈ విజయం ఎంతో చిరస్మరణీయం. అందరూ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. లంచ్కు ముందు ఆఖరి ఓవర్లో షార్ట్ బంతులు వేయమని నేనే ఇషాంత్పై ఒత్తిడి తెచ్చాను. షార్ట్ బంతులు విసిరి డీప్లో ఫీల్డర్ ఉంచిన మా వ్యూహం ఫలించింది. గతంలో విదేశాల్లో ఓడినప్పటితో పోలిస్తే ఈ జట్టు పూర్తిగా కొత్తగా ఉంది. మా శ్రమకు దక్కిన ఫలితమిది. - ధోని, భారత కెప్టెన్ జట్టు పరిస్థితి మార్చేందుకు నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నేను పరుగులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల నేను బాగా ఆడటం లేదనేది వాస్తవం. అయితే కెప్టెన్గా నేను పనికి రానని భావిస్తే దీనిపై తొందరగా నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు మేం గెలవాలంటే జట్టు మొత్తం ఎంతో పట్టుదల కనబర్చాలి. కుర్రాళ్లు బాగానే ఆడుతున్నా...సీనియర్ల వైఫల్యమే దెబ్బ తీస్తోంది. ఈ ఓటమి మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. - అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ ధోని జట్టును నడిపించే తీరు, మమ్మల్ని ప్రోత్సహించే తీరు అద్భుతం. నేను తీసిన వికెట్లన్నీ నావి కావు. అవి మా కెప్టెన్కే దక్కాలి. నన్ను బౌన్సర్లు ప్రయత్నించమని అతనే ప్రోత్సహించాడు. మా జట్టు బ్యాట్స్మెన్కు కూడా ఈ విజయంలో కీలక పాత్ర ఉంది. రహానే తొలి ఇన్నింగ్స్ సెంచరీనే జట్టుకు కావాల్సిన ఊపునిచ్చింది. - ఇషాంత్ శర్మ -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రతి మ్యాచ్లోనూ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నేను బెంచ్ మీద ఉన్నప్పుడు కూడా మొత్తం జట్టు సహచరులంతా నాకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. నా మీద నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు’ - అమిత్ మిశ్రా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టి20 ప్రపంచకప్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో దుమ్మురేపింది. అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఒకే ఒక్క ప్రధాన తేడా... అమిత్ మిశ్రా. తొలి రెండు మ్యాచ్ల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెలిచిన మిశ్రా... ఎంతో కష్టం, బాధ తర్వాత ఈ గౌరవాన్ని పొందాడు. ఐదు వన్డేల్లో రికార్డు స్థాయిలో 18 వికెట్లు తీసిన బౌలర్కి... తర్వాత నాలుగు నెలల పాటు మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోతే ఏమైపోతాడు? వేరే ఎవరైనా అయితే ఏమో... అమిత్ మిశ్రా మాత్రం మరింత రాటుదేలుతాడు. ఇది తన బౌలింగ్తోనే చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. నిజానికి ఈ ప్రపంచకప్ ఆరంభంలో భారత్ బలహీనత బౌలింగ్ అనే భావించారు. ఆ బలహీనతే ఇప్పుడు బలంగా మారింది. దీనికి కారణం మిశ్రా. బంతుల్లో వైవిధ్యం... పాకిస్థాన్ మీద 22 పరుగులకు రెండు వికెట్లు... వెస్టిండీస్పై 18 పరుగులకే రెండు వికెట్లు... ఈ రెండు మ్యాచ్ల్లో వికెట్లతో పాటు మిశ్రా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. దీంతో భారత బ్యాట్స్మెన్ పని సులభమైంది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ చాలా వైవిధ్యం చూపించాడు. స్లైడర్, గూగ్లీ, లెగ్ స్పిన్నర్... ఇలా ఓ లెగ్స్పిన్నర్ దగ్గర ఉండే అస్త్రాలన్నీ ప్రయోగించాడు. బంతి వేగంలో మార్పుతో పాటు... బంతిని ఫ్లయిట్ చేసి బ్యాట్స్మెన్ను ఊరించి వికెట్లు కొల్లగొట్టాడు. సాధారణంగా లెగ్ స్పిన్నర్కు టి20 కష్టమైన ఫార్మాట్. భారీగా పరుగులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మిశ్రా మాత్రం ఏనాడూ ఇబ్బంది పడలేదు. ఐపీఎల్లో తొలి సీజన్ నుంచీ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో 118 ఫస్ట్క్లాస్ టి20లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్... 118 వికెట్లు తీశాడు. పుష్కరకాలం తర్వాత... మిత్ మిశ్రా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి 13 సంవత్సరాలయింది. తన వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. 2003లో తొలిసారి భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటికి ధోని ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. 2003 నుంచి 11 సంవత్సరాల్లో మిశ్రా ఆడిన వన్డేలు కేవలం 23 మాత్రమే. నిజానికి 2008 వరకు మిశ్రా పెద్దగా వెలుగులోకి రాలేదు. అనిల్ కుంబ్లే ఉన్నంతకాలం భారత్లో మరో లెగ్ స్పిన్నర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. 2008లో ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టు ద్వారా మిశ్రా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి పర్యటనకూ భారత జట్టులో ఉంటున్నాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ముగ్గురికి చాన్స్ ఉంటేనే... గత ఐదేళ్లుగా జట్టుతో పాటే తిరుగుతున్నా... మిశ్రాకు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. కారణం... జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాల స్థానం సుస్థిరం కావడమే. ఈ ఇద్దరిలో ఒకరిని ఆపి మిశ్రాను ఆడించే పరిస్థితి లేదు. కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు ఆడే అవకాశం వస్తే తప్ప మిశ్రాను తుది జట్టులోకి తీసుకోలేదు. నిజానికి ఇంత మంచి రికార్డు ఉండి, జట్టులో భాగంగా తిరుగుతూ తుది జట్టులో లేకపోతే ఎవరికైనా సహజంగానే నిరాశ కలుగుతుంది. కానీ అమిత్ మిశ్రా మాత్రం దీనిని అధిగమించాడు. ఇక్కడే తన మానసిక ధృఢత్వం బయటపడింది. సహనంతో తనకు అవకాశం లభించేవరకూ వేచి చూశాడు. మిశ్రా తుది జట్టులోకి రాకపోవడానికి ధోనియే కారణమంటూ కెప్టెన్పై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కానీ మిశ్రా మాత్రం అలా భావించడం లేదు. ‘జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంపిక చేస్తారు. ఆ రోజు మ్యాచ్ ఆడే 11 మంది ఎవరనే విషయం మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగా ముందు మాత్రమే నిర్ణయిస్తారు. మహీ భాయ్ నుంచి నాకు చాలా ప్రోత్సాహం ఉంది’ అని మిశ్రా చెప్పాడు. -
తొలి వన్డేలో భారత్ ఓటమి
బ్యాటింగ్లో ఎలాంటి మెరుపులు లేవు. దూకుడు అస్సలే కనిపించలేదు. గతంలో అనేక సార్లు అలవోకగా ఛేదించిన లక్ష్యానికి కనీసం చేరువలోకి కూడా వెళ్లలేక ధోని సేన చేతులెత్తేసింది. మితిమీరిన విశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమో కానీ తొలి వన్డేలో భారత్ బోర్లా పడింది. టెస్టుల్లో ఎంతటి చెత్త ప్రదర్శన కనబర్చినా... వన్డేల్లో మాత్రం భారత గడ్డపై ఉన్న మెరుగైన రికార్డును నిలబెట్టుకుంటూ సిరీస్లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. పుణే: ఏకైక టి20 మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి ఆస్ట్రేలియా వెంటనే కోలుకుంది. ఏడు వన్డేల సిరీస్లో శుభారంభం అందుకుంది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా 72 పరుగుల ఆధిక్యంతో భారత్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ బెయిలీ (82 బంతుల్లో 85; 10 ఫోర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో జట్టును నడిపించాడు. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 72; 8 ఫోర్లు, 3 సిక్స్లు) మరోసారి చెలరేగగా... హ్యూస్ (53 బంతుల్లో 47; 5 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (85 బంతుల్లో 61; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ (47 బంతుల్లో 42; 6 ఫోర్లు), రైనా (45 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్క్నర్ (3/47) రాణించాడు. వాట్సన్, మెక్కే చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్లో భాగంగా రెండో వన్డే బుధవారం జైపూర్లో జరుగుతుంది. ఓపెనర్ల శుభారంభం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హ్యూస్, ఫించ్ ఆచితూచి ఆడారు. తొలుత ఆసీస్ తొలి ఆరు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఏడో ఓవర్ నుంచి ఆసీస్ జోరు మొదలైంది. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఇద్దరు ఓపెనర్లు చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. 54 బంతుల్లో ఫించ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది. కట్టడి చేసిన యువీ, జడేజా 19వ ఓవర్ రెండో బంతికి భారత్కు తొలి బ్రేక్ లభించింది. జడేజా బంతిని ఫ్లిక్ చేయబోయి హ్యూస్ లెగ్స్లిప్లో ఉన్న రైనాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్ పడింది. ఆ వెంటనే ఆసీస్కు యువరాజ్ షాక్ ఇచ్చాడు. తాను వేసిన తొలి బంతికే అతను వాట్సన్ (2)ను పెవిలియన్ పంపించాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత యువీకి ఇదే మొదటి వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న ఫించ్ను కూడా అవుట్ చేసిన యువీ... డెరైక్ట్ త్రోతో వోజెస్ (7)ను రనౌట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ బెయిలీ మాత్రం జోరు తగ్గనివ్వలేదు. చివర్లో ఫాల్క్నర్ (22 బంతుల్లో 27; 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడటంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది. కోహ్లి మినహా భారత ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. క్రీజ్లో నిలదొక్కుకోవడంలో ఇబ్బంది పడిన శిఖర్ ధావన్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రోహిత్ అవుటయ్యాక కోహ్లి, రైనా కలిసి భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు. మూడో వికెట్కు 71 పరుగులు జోడించిన అనంతరం ఫాల్క్నర్ ఈ జోడీని విడదీశాడు. భారీ సిక్స్తో పరుగుల ఖాతా తెరచిన యువరాజ్ (7) ఈసారి ఎలాంటి వీరంగం సృష్టించకుండానే అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న కోహ్లి నిష్ర్కమణ తర్వాత... రవీంద్ర జడేజా (11), కెప్టెన్ ధోని (19) కూడా పెవిలియన్ చేరు కోవడంతో భారత పరాజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) రైనా (బి) జడేజా 47; ఫించ్ (సి) కోహ్లి (బి) యువరాజ్ 72; వాట్సన్ (సి) జడేజా (బి) యువరాజ్ 2; బెయిలీ (సి) రైనా (బి) అశ్విన్ 85; వోజెస్ (రనౌట్) 7; మ్యాక్స్వెల్ (సి) రోహిత్ (బి) వినయ్ 31; హాడిన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; ఫాల్క్నర్ (సి) వినయ్ (బి) ఇషాంత్ 27; జాన్సన్ (నాటౌట్) 9; మెక్కే (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు (లెగ్బై 3) 3; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 304 వికెట్ల పతనం: 1-110; 2-113; 3-146; 4-172; 5-214; 6-231; 7-264; 8-293. బౌలింగ్: భువనేశ్వర్ 7-2-41-0; వినయ్ కుమార్ 9-1-68-1; ఇషాంత్ 7-0-56-1; అశ్విన్ 10-0-55-2; జడేజా 10-0-35-1; కోహ్లి 1-0-12-0; యువరాజ్ 6-0-34-2. భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సి) హాడిన్ (బి) ఫాల్క్నర్ 7; రోహిత్ శర్మ (సి) హ్యూస్ (బి) వాట్సన్ 42; కోహ్లి (ఎల్బీ) (బి) వాట్సన్ 61; రైనా (సి) డోహర్తి (బి) ఫాల్క్నర్ 39; యువరాజ్ (సి) హ్యూస్ (బి) జాన్సన్ 7; ధోని (బి) మెక్కే 19; రవీంద్ర జడేజా (సి) బెయిలీ (బి) ఫాల్క్నర్ 11; అశ్విన్ (సి) వాట్సన్ (బి) మెక్కే 5; భువనేశ్వర్ (సి) వోజెస్ (బి) ఫించ్ 18; వినయ్ కుమార్ (బి) వోజెస్ 11; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు (బై 2, లెగ్బై 4, వైడ్ 5) 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 232 వికెట్ల పతనం: 1-26; 2-66; 3-137; 4-147; 5-166; 6-192; 7-196; 8-200; 9-230; 10-232. బౌలింగ్: జాన్సన్ 10-0-38-1; మెక్కే 10-0-36-2; ఫాల్క్నర్ 8-0-47-3; డోహర్తి 10-1-54-0; వాట్సన్ 8-0-31-2; వోజెస్ 3-0-18-1; ఫించ్ 0.4-0-2-1. -
సాగర్కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
బుల్లితెరపై ‘మొగలి రేకులు’ సీరియల్కితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సాగర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. పి.ఏ.అరుణ్ప్రసాద్ దర్శకుడు. అభి స్టూడియోస్ పతాకంపై బి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రాశి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ చిత్రానికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విపత్కర పరిస్థితులనైనా ఎదిరించి చాకచక్యంగా తన పనిని పూర్తి చేసే సామర్థ్యం కలవాడు మా హీరో. అందుకే ఈ టైటిల్ పెట్టాం’’ అని చెప్పారు. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని సాగర్ అన్నారు. -
సెల్కాన్ సిరీస్ విజేత భారత్