Mercedes Benz car
-
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్లు, గిప్ట్లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్ను పొందింది. ఎయిర్ ఇన్టేక్స్లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
ఇకపై చిన్న నగరాలకు మెర్సిడెస్ బెంజ్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ చిన్న నగరాలకు విస్తరించనుంది. జమ్ము, కాన్పూర్, పాట్నా వంటి 10 నగరాల్లో 20 వర్క్షాప్స్ ఏర్పాటు చేయనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ఇటువంటి నగరాల నుంచి లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సర్వీస్ కోసం కస్టమర్లు 2 గంటలకు మించి డ్రైవింగ్ చేయకూడదన్న ఆలోచనతో మినీ మెట్రోలపై దృష్టిసారించామని వివరించారు. ప్రస్తుతం ఇటువంటి మినీ మెట్రోలు, చిన్న మార్కెట్ల నుంచి తమ కంపెనీకి 30 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. కాగా, కొత్త జీఎల్ఏ ఎస్యూవీ, ఏఎంజీ జీఎల్ఈ 53 మోడళ్లను కంపెనీ బుధవారం ప్రవేశపెట్టింది. -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్..
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో విజన్ మేబ్యాక్ 6 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శించిన ఈ కొత్త కారు దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. 2016లో కాలిఫోర్నియాలోని పెబుల్ బీచ్లో అడుగుపెట్టి ఈ కారు దాదాపు 7 సంవత్సరాలకు దేశీయ విఫణిలో కనిపించింది. దాదాపు 6 మీటర్ల పొడవున్న ఈ కారు డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కావున ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ లైట్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, 24 ఇంచెస్ వీల్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ 80 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో 750 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక చార్జితో ఏకంగా 500 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ లగ్జరీ బెంజ్ కారు గురించి చాలా వివరాలు తెలియాల్సి ఉంది. -
ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ S680.. భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీలో కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్షిప్ సెడాన్. ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కారుతో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్.. ధర ఎన్ని కోట్లంటే?
రకుల్ ప్రీత్ సింగ్ బీటౌన్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్వే 34', 'కట్ పుట్లి, 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన నటించింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) టాలీవుడ్లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం. తాజాగా ఈ ముద్దుగమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది భామ. అంతేకాకుండా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ లగ్జరీ బెంజ్ కారు విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. (ఇది చదవండి: హౌసులో కొత్త గొడవలు.. లవ్బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఓ లుక్కేసుకోండి!
1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్హాట్ కూపే.. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు. జర్మనీలో స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! నిజానికి ఈ కార్లు లే మాన్స్లో రేసింగ్కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే?
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్వే 34', 'కట్ పుట్లి', 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది భామ. తెలుగులోనూ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిస వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!) తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ భామ.. సరికొత్త మెర్సిడెజ్ కారును తన గ్యారేజ్కు తీసుకొచ్చింది. ఆ వీడియోలో తన కారు పరిశీలిస్తూ కనిపించింది. రకుల్ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు విలువ దాదాపు రూ. 3.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ రకుల్ ప్రీత్ సెలెక్షన్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: కాజోల్తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్–బెంజ్ ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ కొత్త వెర్షన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్స్తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్లో మెర్సిడెస్కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్ కార్లలో ఎన్టీజీ 7 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను పొందుపరిచారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో తయారైన జీఎల్సీ 300 4మేటిక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. -
విండీస్తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే!
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రూ. కోటి! విండీస్తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ ఫినిషింగ్తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్బాల్పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్రూఫ్తో పాటు ఏడు ఎయిర్బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో 11.50 కోట్లు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
సెకండ్ హ్యాండ్ కారు కొన్న 'అత్తారింటికి దారేది' నటుడు..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ను కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అతని కుటుంబ సభ్యులతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్! ) అయితే బోమన్ ఇరానీ కొన్నకారు కొత్తదేం కాదు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కొత్త మోడల్ అయినప్పటికీ.. ఈ కారును సెకండ్ హ్యాండ్లోనే ఆయన కొనుగోలు చేశారు. చాలా మంది సెలబ్రిటీలు ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ కారును బోమన్ ఇరానీ తన ఇంటికి తీసుకెళ్లారు. ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటు ప్రీ-ఓన్డ్ కారును కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్లో, శిల్పాశెట్టికి ప్రీ-ఓన్డ్ కార్లంటే చాలా ఇష్టం ఆమె దాదాపు అన్ని లగ్జరీ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే. కాగా.. బోమన్ ఇరానీ అత్తారింటికి దారేది కీలక పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) View this post on Instagram A post shared by Auto Hangar Advantage (@autohangar.advantage) View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్ప్రూఫ్ సెడాన్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్తో పాటు, కొత్త బుల్లెట్ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్తో 612 పవర్ను, 830 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్లో జీ–క్లాస్ ఎస్యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కియారా అద్వానీ పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిది. కొద్ది నెలల క్రితమే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) కాగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఇటీవలే భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జపాన్ టూర్కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) కాగా.. టాలీవుడ్లో మెగా తనయుడు రామ్ చరణ్తో కలిసి గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. -
నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు
ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. -
ఖరీదైన కారు కొన్న 'చిరుత' బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ నటి నేహా శర్మ మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో క్రూక్ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత వరుసగా యమ్లా పగ్లా దీవానా 2, సోలో, తాన్హాజీతో సహా పలు చిత్రాలలో నేహా శర్మ కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ. కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మ ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. నేహా శర్మ దాదాపు రూ.1.09 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: అదిరిపోయే లుక్తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) నేహా తన ట్విటర్లో రాస్తూ..'మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం. భగవంతుడు మనపట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వారి పెంపుడు కుక్కతో కలిసి తన కొత్త కారును ఇంటికి స్వాగతించారు. కొత్త కారుకు కొబ్బరికాయ కొట్టేందుకు నేహా శర్మ, చెల్లెలు ఐషా శర్మ ఇబ్బంది పడ్డారు. కాగా.. నేహా 'క్రూక్', 'క్యా సూపర్ కూల్ హై హమ్', 'యమ్లా పగ్లా దీవానా 2', 'యంగీస్తాన్', 'తుమ్ బిన్ 2', 'తాన్హాజీ' వంటి అనేక చిత్రాలలో నటించింది. త్వరలోనే నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'జోగిరా సారా రా' చిత్రంలో నటించనుంది. ఇందులో సంజయ్ మిశ్రా, మహాఅక్షయ్ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. May we keep working hard and May God always be kind to us and may we be forever grateful ..#gratitude 🙏 @aishasharma25 pic.twitter.com/DnTFho1wa8 — Neha Sharma (@Officialneha) April 4, 2023 -
కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్
టిక్టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్కి ఇన్స్టాగ్రామ్లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎంజి జిఎల్సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం) మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?) ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi) -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మిర్చి సింగర్.. ఎవరికో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్ సింగ్కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా. మికా తన ఇన్స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. కన్వల్ దీత్ సింగ్ తన ఇన్స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ నటి.. ధరెంతో తెలుసా?
ప్రముఖ బుల్లితెర నటి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. బాలీవుడ్ భామ, అనుపమ నటి రూపాలీ గంగూలీ దాదాపు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన కల నిజమైందని రూపాలీ తెలిపింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అత్యధిక పారితోషికం రూపాలీ తన భర్త అశ్విన్ వర్మ, కుమారుడు రుద్రాంశ్ వర్మతో కలిసి షోరూమ్లో ఉన్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కాగా.. రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటిగా పేరు సంపాదించింది. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్','మోనిషా సారాభాయ్' 'అనుపమ'లో సీరియల్స్లో రూపాలి నటించారు. రూపాలీ ప్రారంభంలో రోజుకు రూ.1.5 లక్షలు తీసుకోగా.. ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు తీసుకుంటోంది.'సంజీవని'లో డాక్టర్ సిమ్రాన్ చోప్రా పాత్రను కూడా పోషించారు. ఆ తరువాత 2006లో రియాల్టీ షో బిగ్ బాస్లో పోటీదారుగా పాల్గొన్నారు. అనుపమ సీరియల్లో రూపాలి పరిపూర్ణ గృహిణి, తల్లిగా నటిస్తోంది.'అనుపమ'లో సుధాన్షు పాండే, గౌరవ్ ఖన్నా, అనేరి వజని, మదాల్సా శర్మ, అల్పనా బుచ్, అరవింద్ వైద్య నటించారు. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. పంత్ ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్కు వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అతని కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంత్ను అదే మార్గంలో హరిద్వార్ వెళ్తున్న బస్ డ్రైవర్ సునీల్ కారులో నుంచి బయటకు లాగారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలాంటి ప్రమాదాల నుంచి యూజర్లను కాపాడేందుకే యాపిల్ సంస్థ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ను అభివృద్ధి చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగిస్తున్న యూజర్లు రోడ్డు ప్రమాదాలకు గురైతే అత్యవసర సేవలకు కనెక్ట్ అయ్యేందుకు సహాయ పడుతుంది. యాపిల్ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అంటే ఏమిటి? క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది సెడాన్లు, మినీవ్యాన్లు,ఎస్యూవీలు, పికప్ ట్రక్కులు, ఇతర ప్యాసింజర్ కార్లతో కూడిన ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్ వంటి కారు ప్రమాదాల్ని గుర్తించేందుకు సహాయపడుతుంది. ఆ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ 14 మోడల్స్తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఎస్ఈ (2వ తరం), యాపిల్ వాచ్ ఆల్ట్రా తాజా వెర్షన్ వాచ్ఓఎస్లో సైతం అందుబాటులోకి వచ్చింది. కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఐఫోన్ 14 మోడల్లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్గా ఆన్ ఆవుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగుతుంది. ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చూపిస్తుంది. వెంటనే ఫోన్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ల స్లైడర్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసే పరిస్థితుల్లో లేరంటే 20 సెకన్లలో అదే నెంబర్కు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రమాదంలో ఉన్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు, దగ్గరలో ఉన్న హాస్పటల్స్కు వాయిస్ కాల్స్ వెళతాయి. -
మెర్సిడెస్ బెంజ్కు ఏమైంది? హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు క్రాష్ ఫోటో వైరల్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం తరువాత మెర్సిడెంజ్ బెంజ్కు చెందిన మరో లగ్జరీ కారు ప్రమాదానికి గురి కావడం ఆందోళన రేపుతోంది. సుమారు రూ.1.6 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రమాదానికి గురైంది. ముంబైలో ప్రమాదానికి గురైన ఈ కారు ఫోటోలను కార్ రివ్యూ సంస్థ టీం బీహెచ్పీ షేర్ చేసింది. ముఖ్యంగా కారు ముందుభాగం, బంపర్ ధ్వంసమైన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏమైంది బెంజ్కార్లకు అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి. (అమెజాన్లో పింక్ స్లిప్స్ కలకలం, వేలమందిపై వేటు!) మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారును మెర్సిడెస్-బెంజ్ ఈ ఏడాది కొంత కాలం క్రితం భారత మార్కెట్లో పరిచయం చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయింది. ఒక్కరోజులోనే భారత మార్కెట్ నుంచి 300 ఆర్డర్లను సాధించింది. జర్మనీ మినహా ఇండియాలో మాత్రమే లభ్యమవుతున్న దీని ధర రూ. 1.55 కోట్లకు పైమాటే. 107.8 kWh బ్యాటరీ సామర్థ్యంతో దేశంలో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకంటే ఎక్కువగా సింగిల్ ఛార్జ్పై గరిష్టంగా 857 కిలోమీటర్ల మైలేజీతో 4.1 సెకన్లలో 100 కిమీ/గం వరకు దూసుకుపోతుందని రిలీజ్ సందర్బంగా బెంజ్ వెల్లడించింది. ఇదీ చదవండి: ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? -
మెర్సిడెస్ ఈవీ,మేడ్ ఇన్ ఇండియా.. ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్లో ఈక్యూఎస్ 580 4మేటిక్ తయారీ ప్రారంభించింది. జర్మనీ వెలుపల భారత్లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి భారత్లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం. 14వ మేడిన్ ఇండియా మోడల్గా ఈక్యూఎస్ 580 4మేటిక్ నిలిచింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్లో అత్యధిక దూరం ప్రయాణించే కారుగా ఇది స్థానం దక్కించుకుంది. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లో 15 నిముషాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించ గలిగే స్థాయిలో చార్జింగ్ పూర్తి అవుతుంది. ధర ఎక్స్షోరూంలో రూ.1.55 కోట్లు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
అషురెడ్డి బర్త్డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి
అషురెడ్డి.. సోషల్ మీడియా యాజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్బాస్ షోతో రాత్రి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న ఆమె తరచూ తన హాట్హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ను అలరిస్తోంది. ఇలా నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో ఆమె ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది. ఇదిలా ఉంటే గురువారం ఆమె పుట్టిన రోజు. సెప్టెంబర్ 15 ఆమె బర్త్డే సందర్భంగా తన తండ్రి నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందుకుంది అషు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అషు బర్త్డే సందర్భంగా ఆమె తండ్రి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D అనే మోడల్ కారును బహుమతిగా ఇచ్చాడు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. ఇక తండ్రితో కలిసి కారు ముందు ఫోజులు ఇచ్చిన ఫొటోలు ఆమె తన ఇన్స్టాలో పంచుకుంది. ఇక దీనికి ‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్ప్రైజ్’ అంటై బ్లూ హాట్ ఎమోజీని జత చేసింది. కాగా బర్త్డే సందర్భంగా అషు అందుకున్న ఈ బహుమతి కారు ఖరీదు దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు ఫుల్ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నానంది. ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోతుంది. ఇక ఆమె పోస్ట్పై తన ఫాలోవర్స్ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
కూలీ డబ్బులు ఇవ్వలేదని రూ.కోటి కారు తగలబెట్టాడు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. హెల్మెట్ పెట్టుకొని వచ్చి వీధిలో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి కారును తగులబెట్టడం అందులో స్పష్టంగా కన్పించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4 — The Viral Finder (@TheViralFinder) September 14, 2022 ఇదీ చదవండి: Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో.. -
బెంజ్ కారు కొన్న బిగ్బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా?
బిగ్బాస్ బ్యూటీ, నటి నిక్కి తంభోలి కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొన్నట్లు తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిచింది. ఈ మేరకు ఆమె కారుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను కూడాఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. వీటికి ‘ఎప్పుడు నా ఎదుగుదలలో తోడుగా ఉన్నారు. పడిపోకుండ సపోర్టు ఇచ్చారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పటికి నేను మీ లిటిల్ గర్ల్నే’ అంటూ తండ్రితో దిగిన కారు ఫొటోలను షేర్ చేసింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కాగా నిక్కీ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు ధర దాదాపు రూ. 85.80 లక్షల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయల మధ్యలో ఉండోచ్చని అంచనా. ఇక నిక్కీ కొత్త కారు కొన్న విషయం తెలిసి ఆమె సహా నటీనటులు, బిగ్బాస్ సహా కంటెస్టెంట్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిక్కీ తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె ‘తిప్పర మీసం’, తమిళంలో కాంచన 3 వంటి చిత్రాలతో నటించి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నిక్కీ హిందీ బిగ్బాస్ 14వ సీజన్ షో కంటెస్టెంట్గా ఆఫర్ అందుకుంది. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ గేమ్ షో కంత్రోన్ కే ఖిలాడీ షోలో సైతం నిక్కీ సత్తా చాటుకుంది. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ!
సాక్షి, ముంబై: సూపర్-లగ్జరీ కార్ల విక్రయాలు సూపర్ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బిలియనీర్ల కారణంగా కరోనా సంక్షోభంలో కూడా రూ. 2 కోట్లకు పైగా విలువున్న కార్లను హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత దేశీయ కుబేరులు లగ్జరీ కార్లను ఎగరేసుకుపోతున్నారట. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనాకి ముందున్న గరిష్ట స్థాయిలను అధిగమించే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2018లో భారతదేశంలోని అత్యంత సంపన్నులు రూ. 2 కోట్లకు పైగా ధర కలిగిన 325 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు 2020లో వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్లో పదివేల యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయని ఎకనామిక్స్ టైమ్స్ ఒక రిపోర్టులో తెలిపింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇటాలియన్ సూపర్-లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని, ఆర్థిక అనిశ్చితి పరిస్థితిల్లో కూడా కార్ బుకింగ్స్లో దూసుకుపోతోంది. 2022 మొదటి ఐదు నెలల్లో ఊహించిన దానికంటే ట్రెండ్ బాగా పుంజుకుందని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ని పేర్కొన్నారు. ఈ నెంబర్లు సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ సామర్థ్యం కంటే ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్యను ప్రతిబింబిస్తోందన్నారు. ఇంతకుముందు మూడో/ నాల్గవ తరం వ్యాపారులకు మాత్రమే లగ్జరీ కార్లను విక్రయించాం కానీ ఇపుడు మొదటి తరం వ్యాపారవేత్తలు, మహిళలు, ఇతరులతో తమ కస్టమర్ బేస్ మరింత విస్తరించిందని అగర్వాల్ వెల్లడించారు. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మెర్సిడెస్ బెంజ్ హై-ఎండ్ లగ్జరీ కార్ల వాటా 2018లో 12 శాతంతో పోలిస్తే 2022లో 29 శాతానికి రెండింతలు పెరిగింది. దాదాపు 5వేల మందిలో మూడింట ఒక వంతు మంది తమ లగ్జరీ కారు వినియోగిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. 2021లో 2వేల లగ్జరీ కార్లను విక్రయించిన బెంజ్ చేతిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వాహనాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయిట. కాగా ఇటీవల లంబోర్ఘిని అవెంటడోర్ అవెంటోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని అంచనా ధర సుమారు 8-10 కోట్లు. లిమిటెడ్ ఎడిషన్గా ప్రపంచవ్యాప్తంగా 600 కార్లను రిలీజ్ చేయగా ఇప్పటికే అన్ని కార్లు బుక్ అయిపోయాయి. ఇందులో ఇండియా నుంచి ఒకరు ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: Lamborghini Aventador Ultimae: వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్కార్: హాట్ సేల్ -
మెర్సిడెస్ బెంజ్కు భారీ షాక్!
ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ ప్రకారం.. 2004 - 2015 మధ్య కాలంలో తయారు చేసిన ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సిరీస్తో పాటు ఆర్ -క్లాస్ లగ్జరీ మినివాన్ వంటి కార్లలో ఈ లోపం తలెత్తినట్లు స్పష్టం చేసింది. మెర్సిడెస్ సైతం కార్లను రీకాల్ను ఏఎఫ్పీకి ధృవీకరించింది. కొన్ని సందర్భాలలో బ్రేకింగ్ సిస్టమ్లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఇక బెంజ్ ప్రపంచవ్యాప్తంగా 993,000 వాహనాలు రీకాల్ చేయబడుతున్నాయి. వాటిలో 70,000 వెహికల్స్ జర్మనీలో ఉన్నాయని ఏఎఫ్పీ నివేదించింది. -
మెర్సిడిస్ బెంజ్ కారు కొన్న స్టార్ సింగర్
బేకయాలి, మేరె సోనెయా, పల్ పల్ దిల్కే పాస్, మహియా మజ్ను, ఇష్క్ మేన్.. వంటి ఎన్నో హిట్ సాంగ్స్తో అలరించాడు సాకెత్ టండన్. సింగర్ పరంపరను పెళ్లాడిన ఆయన భార్యతో కలిసి కూడా పలు పాటలు ఆలపించాడు. బాలీవుడ్లో టాప్ సింగర్గా రాణిస్తున్న సాకెత్ తాజాగా కొత్త కారు కొన్నాడు. కుటుంబ సమేతంగా షోరూమ్కు వెళ్లి మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి కొత్త కారు ముందు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సాకెత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కొత్త మెర్సిడిస్ కారును మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం. మాకు సపోర్ట్గా ఉంటూ మామీద ప్రేమ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలు, ఆశీర్వాదాల వల్లే మేము ముందుకు సాగుతున్నాం అని రాసుకొచ్చాడు. దీనికి అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sachet-Parampara (@sachetparamparaofficial) View this post on Instagram A post shared by Sachet Tandon (@sachettandonofficial) చదవండి: టాలీవుడ్లో విషాదం, హీరో సత్య మృతి లవ్ బ్రేకప్..తల్లయిన నటి -
యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!!
కేరళకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పద్మశ్రీ అవార్డ్ గ్రహిత,వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియాను గుర్తు చేస్తున్నారు. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బెంజ్ కార్లతో పాటు మరెన్నో బహుమతుల్ని అందిస్తూ హాట్ టాపిగ్గా నిలుస్తున్నారు. కేరళకు చెందిన ఏకే షాజీ మైజీ డిజిటల్ రీటైల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సంస్థలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సీఆర్ అనీష్ 22ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 22 సంవత్సరాలుగా వ్యాపారవేత్త ఎకె షాజీతో కలిసి పనిచేస్తున్న సీఆర్ అనీష్ విధేయతకు గుర్తుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ 220 డి కారును ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రియమైన అనీ గత 22 సంవత్సరాలుగా మీరు నాకు బలమైన స్తంభంలా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ వ్యాపారవేత్త ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు బ్లాక్ లగ్జరీ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన ఫోటోల్ని జత చేస్తూ ఇన్స్ట్రాగ్రామ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. గతంలో ఉద్యోగులకు విశ్వసనీయతకు ప్రతిఫలమివ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం షాజీ తన ఉద్యోగులకు ఆరుగురు చొప్పున కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా, గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించారు. 018లో దీపావళికి తన ఉద్యోగులకు 600 కార్లు ఇచ్చాడు. 3 కోట్ల విలువైన మూడు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీలను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. -
మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇప్పటివరకు ఒక లెక్క.. నేను వచ్చాక మరో లెక్క అంటుంది ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఇప్పటి వరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తాను అని అంటుంది. ఎట్టకేలకు, మెర్సిడెస్ తన విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ మోడల్ ప్రోటోటైప్ వివరలను విడుదల చేసింది. దీనిని ఫార్ములా F1 బృందం నిపుణుల చేత డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ కారుగా నిలిచినట్లు సంస్థ పేర్కొంది. ఈ కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఆగకుండా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని మెర్సిడెస్ తెలిపింది. ఈ కారు అల్ట్రా సన్నని సోలార్ ప్యానెల్స్ తో కూడా వస్తుంది. యుకెలోని మెర్సిడెస్-ఎఎంజి హై పెర్ఫార్మెన్స్ పవర్ ట్రైన్స్ విభాగానికి చెందిన ఎఫ్ 1 నిపుణుల సహాయంతో అభివృద్ధి చేసిన కొత్త కెమిస్ట్రీని బ్యాటరీ కలిగి ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ బ్యాటరీ ఈక్యూఎస్ లోపల బ్యాటరీ కంటే 30 శాతం కంటే తక్కువ బరువు ఉంటుంది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ వెల్లడించారు. మెర్సిడెస్ 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: జియోకు పోటీగా...బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..!) -
తగ్గేదే లే..! పీఎం మోదీ కాన్వాయ్లో పవర్ఫుల్ కారు ? దాని ధర, విశేషాలు..
దేశంలోని ముఖ్య నాయకుల రక్షణ విషయంలో ఆయా దేశాల భద్రత సిబ్బంది తీసుకునే చర్యలు మామూలుగా ఉండవు. ఇక దేశాధక్షులు, ప్రధానుల సెక్యూరిటీ విషయంలో అయితే నో కాంప్రమేజ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లో మరో పవర్ఫుల్, సేఫెస్ట్ కారు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ వాహనం అత్యంత భద్రతనివ్వడమే కాదు ప్రపంచంలో ఖరీదైన కార్లలో ఒకటిగా నిలుస్తోంది. మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రధానికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి రాజీకి చోటివ్వదు. శత్రువుల దాడులను తట్టుకునేలా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రక్షణ కల్పించే విధంగా సెక్యూరిటీ, సేఫ్టీ కార్లలో ఉంటాయి. ఇప్పడు ప్రధాని తన కాన్వాయ్లో భాగంగా మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 (Mercedes-Maybach S650) వచ్చి చేరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలుకుతున్నప్పుడు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ దగ్గర తొలిసారిగా కొత్త మేబ్యాక్ 650లో ప్రయాణం చేస్తూ మోదీ కనిపించారు. తాజాగా మోదీ కాన్వాయ్లో ఈ వాహనం మరోసారి ప్రత్యక్షమైంది. ప్రధాని అంటే ఆ లెక్కే వేరు భారత ప్రధానితో పాటుగా, ముఖ్య నాయకుల భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పర్యవేక్షిస్తుంది. ప్రధాన మంత్రితో సహా ఆయా నాయకుల కాన్వాయ్లో వాడే వాహనాలను ఎస్స్పీజే దగ్గర ఉండి ఎంపిక చేస్తుంది. ముందుగా ఆయా కార్ల సెఫ్టీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే ఎస్పీజీ ఓకే చెప్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లో ఇప్పటికే రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూయిజర్, బీఎమ్డబ్ల్యూ-7 సిరీస్లు ఉండగా తాజాగా మెర్సిడెజ్ మేబ్యాక్ వచ్చి చేరింది. ఇప్పుడా కారు విశేషాలు ఏంటో చూద్దాం. పవర్ఫుల్ బాడీ..! మెర్సిడెజ్ మేబ్యాక్ S650 గార్డ్ డిజైన్, బాడీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్తో తయారు చేస్తారు. లిమోసిన్ విండోస్ లోపలి భాగంలో పాలికార్బోనేట్ కోటింగ్తో వస్తాయి. ల్యాండ్మైన్స్ నుంచి రక్షణ కోసం అండర్ బాడీలో భారీ అర్మర్స్ని పొందుపరిచారు. ఎవరైనా విషవాయువుతో దాడి చేసినా లోపల ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం కలగకుండా స్వచ్ఛమైన గాలి అందించే ప్రత్యేక ఏర్పాటు ఈ కారు సొంతం. ఎటాక్ ప్రూఫ్ ప్రధాని కాన్వాయ్లో రెండు మేబ్యాక్ ఎస్650 గార్డ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్లో ఎప్పుడూ రెండు కార్లు ఉంటాయి. అయితే ప్రధాని ఏ కారులో ప్రయాణించే విషయం అక్కడున్న సిబ్బందికి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వరు. రక్షణ చర్యలో భాగంగా ఈ పద్దతిని నేతలందరికీ వర్తింప చేస్తుంటారు. ఇక కారు ఫీచర్ల విషయానికి వస్తే ఎస్600 గార్డ్ కారులాగే S650 గార్డ్ కూడా డైరెక్టివ్ బీఆర్వీ 2009 వెర్షన్ (శత్రుదుర్భేధ్యమైన శ్రేణి) 2 ప్రకారం వీఆర్10 రక్షణ స్థాయిని అందిస్తుంది. వెహికల్ సెఫ్టీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక సెఫ్టీ రేటింగ్ ఇదే. వీఆర్10 రేటింగ్ ఉండటంతో ఈ కారు బాడీ, విండోస్ బుల్లెట్లను తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. అంతేకాకుండా ఎక్స్ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ERV) విషయంలో 2010 రేటింగ్ను కలిగి ఉంది. దీంతో రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్టీలాంటి శక్తివంతమైన పేలుడు సంభవించిన కారులో ఉన్నవారికి భద్రత లభిస్తుంది. ఫైర్ప్రూఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఒక ప్రత్యేక పదార్థంతో పూత ఉండగా...ఇది ఒకవేళ ఎదైనా మంటలు వ్యాపించినట్లయితే వెంటనే ఆటోమోటిక్గా ఫ్యూయల్ వాల్వ్ మూసుకుపోతాయి. ఇందు కోసం బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ వాడే మెటిరియల్ను ఉపయోగించారు. దీంతో ఈ వాహనంలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేదు. భారీ ఆర్మర్డ్ కారు 6.0-లీటర్ V12 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది, ఇది గరిష్టంగా 523 బీహెచ్పీ శక్తిని, 830 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ధర ఎంతో తెలుసా ? ప్రముఖ లగ్గరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ప్రపంచంలోని ముఖ్యమైన నాయకుల కోసం హై సెఫ్టీ వాహనాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్లోని మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 2019లో విడుదలైంది. కొత్తగా వచ్చిన ఫేస్లిఫ్ట్ వెర్షన్ను ప్రధాని కాన్వాయ్లో వాడుతున్నారు. గత సంవత్సరం భారత్లో మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ S600 గార్డ్ను రూ. 10.5 కోట్ల ధరతో విడుదల చేసింది. కాగా కొత్త వెర్షన్ S650 ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువే ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: RRR: ఇంగ్లాండ్ బైక్పై..ఇండియన్ టైగర్ ఎన్టీఆర్...! -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడల్స్లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు. 1.రామ్ చరణ్ దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2.రణవీర్ సింగ్ మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్ కొంపముంచిన చిప్స్...!) 3. అర్జున్ కపూర్ 'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!) 4. కృతి సనన్ ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్తో ఫుల్ స్వింగ్లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. 5. ఆయుష్మాన్ ఖురానా 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు. -
హెచ్సీఎల్ ఉద్యోగులకు ఉచితంగా బెంజ్ కార్లు..!
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకుగాను ప్రోత్సాహాకాలను అందిస్తాయి. ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన కంపెనీ ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కోసం భారీ బహుమతులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని టాప్ పెర్పామర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్సీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అప్పారావు వీవీ పేర్కొన్నారు. అట్రిషన్ విధానాన్ని నివారించేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. రీప్లేస్మెంట్ హైరింగ్ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వీవీ అప్పారావు పేర్కొన్నారు. జావా డెవలపర్ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్లో హైర్ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్ ప్రోఫెషనల్స్ను సేమ్ ప్యాకేజ్లపై హైర్ చేసుకోలేమని తెలిపారు. హెచ్సీఎల్లో మంచి రిటెన్షన్ ప్యాకేజ్ ఉందని, ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్ను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్తో సుమారు 10 శాతం మందికి కీలక నైపుణ్యాలు కల్గిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 22 వేల మందిని కొత్తగా ఉద్యోగులను హైర్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హెచ్సీఎల్ కంపెనీలో ఈ తైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ గత త్రైమాసికం కంటే 1.9 శాతం పెరిగి 11.8 శాతంగా నమోదైంది. -
నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్లో రెండు సరికొత్త సెడాన్స్ను భారత్లో గురువారం ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ‘ఈ 53 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.02 కోట్లు కాగా ‘ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.70 కోట్లు. ఏఎంజీ శ్రేణిలో అత్యంత వేగంగా ప్రయాణించే సెడాన్ ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ అని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. 9 స్పీడ్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్, 612 హెచ్పీ, 850 ఎన్ఎం టార్క్తో 4.0 లీటర్ వీ8 బైటర్బో ఇంజిన్ను దీనికి పొందుపరిచారు. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. 435 హెచ్పీ, 520 ఎన్ఎం టార్క్తో ట్విన్ టర్బోచార్జింగ్తో ఎలక్ట్రిఫైడ్ 3.0 లీటర్ ఇంజిన్ను ఈ 53 4మేటిక్ ప్లస్కు జోడించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వైడ్స్క్రీన్ కాక్పిట్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్ స్టీరింగ్ వీల్, ఎంబక్స్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 94 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆన్లైన్లోనూ కారును కొనుగోలు చేయవచ్చు. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
ముంబై: మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ విభాగానికి ఏ-క్లాస్ లిమోసిన్ మోడల్ కారును గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.39.90 లక్షలు (ఎక్స్షోరూమ్). ఈ మోడల్ ఏ200, ఏ200డి, ఏఎంజీ ఏ 35 4ఎంఏటీఐసీ... మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాగా, మోడల్ ధరలపై జూలై 1 తర్వాత రూ. లక్ష దాకా పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ ట్రాన్స్మిషన్, ఇంజిన్లపై కంపెనీ ఎనిమిదేళ్ల పాటు వారెంటీని ఇస్తుంది. భారత్లో విలాస కార్లను కోరుకునే కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూసిన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మోడల్ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడం తమకెంతో ఆనందంగా ఉందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మారి్టన్ ష్వెంక్ తెలిపారు. చదవండి: భారత మార్కెట్లోకి బీఎండబ్య్యూ 220ఐ స్పోర్ట్ -
మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో రెండు కార్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సంస్థ నేడు 2021 జీఎల్సీని మోడల్ ని భారతదేశంలో 57.40 లక్షల ధరతో లాంచ్ చేసింది. 2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్సిలో ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ మసాజ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాతో పార్కింగ్ ప్యాకేజీ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ మోడల్ జీఎల్సీ 200, జీఎల్సీ 220డీ 4 మాటిక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 4-సిలిండర్ 2.0-లీటర్ ఎం264 పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇది 197 హెచ్పి గరిష్ట శక్తిని, 320ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అదే జీఎల్సీ 220డి 4 మ్యాటిక్ 4 సిలిండర్ 2.0-లీటర్ ఓఎమ్654 డీజిల్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇది 194హెచ్పి గరిష్ట శక్తిని, 400ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్లు 9 జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడ్డాయి. జీఎల్సీ 200 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదే జీఎల్సీ 220డి 4 మాటిక్ 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2021 జిఎల్సి 200 ఇండియాలో ఎక్స్-షోరూమ్ ధర రూ.57.40 లక్షలు కాగా.. అదే జీఎల్సీ 220డి 4 మాటిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.57.40 లక్షలుగా ఉంది. మెర్సిడెస్ 2021 జీఎల్సీ నావిగేషన్ సిస్టమ్, అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, పార్కింగ్ స్థానాలను కనుగొనే సరికొత్త 'మెర్సిడెస్ మి కనెక్ట్' టెక్నాలజీని కలిగి ఉంది. క్లాసిక్, ప్రోగ్రెసివ్ మరియు స్పోర్టి డిస్ప్లే ఎంపిక గల ఆల్-డిజిటల్ 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు 2021 జిఎల్సిలో మసాజ్ ఫంక్షన్తో ఫ్రంట్ సీట్లను తయారు చేశారు. ఇందులో ఉన్న మీడియా ద్వారా మసాజ్ ఫంక్షన్లను సర్దుబాటు చేసుకోవచ్చు. మిడ్-సైజ్ లగ్జరీ ఎస్యూవీ 360 డిగ్రీల కెమెరా, రివర్సింగ్ కెమెరాతో పాటు మూడు అదనపు కెమెరాలను కలిగి ఉంది. 'మెర్సిడెస్ మి' యాప్ సహాయంతో 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ ఇంజిన్ను ఆటోమేటిక్ గా స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఇందులో ఉన్న 2021 జీఎల్సీ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనం కారును ఎక్కడ పార్క్ చేసామో సులభంగా తెలుసుకోవచ్చు. 'మెర్సిడెస్ మి' యాప్ సహాయంతో వాహనాన్ని లాక్ చేయడం లేదా అన్లాక్ చేయడం, దాని హెడ్ల్యాంప్లు మెరుస్తూ, కిటికీలు, సన్రూఫ్లను తెరవడం లేదా మూసివేయడం వంటివి ఆటో మెటిక్ గా మనం ఆపరేట్ చేయవచ్చు. 2021 మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ రెండు కొత్త బ్రిలియంట్ బ్లూ, హైటెక్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. -
బెంజ్ కొత్త ఎడిషన్ కారు.. ధర ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన అగ్రశ్రేణి ఎస్ క్లాస్ విభాగంలో సరికొత్త మాస్ట్రో ఎడిషన్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద మోడల్ ధర రూ.1.51 కోట్లుగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్లో ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ టెక్నాలజీ తాజా వర్షెన్ను అప్లోడ్ చేశారు. మొమరీ ప్యాకేజ్తో ముందు సీట్లను ఏర్పాటు చేయడంతో పాటు పనోరమిక్ సన్రూఫ్ను లాంటి అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. కస్టమర్లకు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్లను రూపొందించడమే ఈ కొత్త ఏడాదిలో తమ లక్ష్యమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగపు ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ సరికొత్త మాస్ట్రో ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉండే అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్షిప్ల వద్ద లభ్యమవుతాయి. -
కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ..
న్యూఢిల్లీ : బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని తిలక్ నగర్లో చోటుచేసుకుంది. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు) రాధిక అనే 10 నెలల చిన్నారి తన ఇంటి కిందనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఆడుకుంటుంది. అదే సమయంలో అఖిలేష్ అనే డ్రైవర్ మెర్సిడిస్ బెంజ్ కారును రివర్స్ తీశాడు. ఈ క్రమంలో కారు వెనక భాగం బాలికను ఢీకొంది. తీవ్రగాయాలైన బాలికను డీడీయూ ఆసుపత్రికి తరలించగా, బాలిక మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారు యజమాని జస్బీర్ సింగ్గా గుర్తించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) -
కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్..!
బాలీవుడ్ సెలబ్రిటీలు లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే పలు బెంజ్ కార్లను కలిగి ఉన్న కంగనా రనౌత్ .. తాజాగా మెర్సిడెజ్ బెంజ్కు చెందిన స్పోర్ట్స్ యుటిలీటీ వెహికల్ని కొనుగోలు చేశారు. అధునాతన ఫీచర్లు గల ఈ కారు పక్కన నుంచుని ఆమె ట్వీట్ చేశారు. మనాలీలో ఈ ‘క్వీన్’ ఇటీవల ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్లలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడికి షాపింగ్ చేసే తీరికే ఉండదట. దాంతో ఆమె చెల్లెలు రంగోలి, మేనేజర్ రూ.61.75 లక్షల ఈ ఎస్యూవీని గిఫ్టుగా కొనిచ్చారట. ఈ విషయాన్ని రంగోలీ ట్విటర్లో తెలిపారు. బేస్ 250 డి మోడల్కు చెందిన ఈ బెంజ్ కార్లు.. బాలీవుడ్ ప్రముఖ నటీనటులు హ్యుమా ఖురేషీ, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వద్ద ఉన్నాయి. ఇక కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' విడుదలై సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. కంగానా వద్ద బీఎండబ్ల్యూ-7 సిరీస్ సెడాన్ కారు కూడా ఉంది. -
ఉద్యోగులకు రూ.3 కోట్ల బెంజ్ కార్లు గిఫ్ట్
సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ వారి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఐతే ఈసారి కూడా అంతే కాస్ట్లీ గిఫ్ట్లను తన ఉద్యోగులకు ఇచ్చాడు ఆ వ్యాపారి. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు. ఈ సీనియర్ ఉద్యోగులు కంపెనీలో చేరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీ బహుకరించారు ఆ వజ్రాల వ్యాపారి. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీ ఆన్-రోడ్డు ధర ప్రస్తుతం సూరత్లో కోటి రూపాయలుగా ఉంది. నీలేష్ జాదా (40), ముఖేష్ చందర్ (38), మహేష్ చంద్పర(43)లు చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు. డైమాండ్స్ను కట్ చేయడం నుంచి తమ పనిని నేర్చుకున్న ఈ ఉద్యోగులు, ప్రస్తుతం కంపెనీలో సీనియర్ ఉద్యోగులని, ఎంతో నమ్మకమైన ఉద్యోగులుగా వీరు నిలుస్తున్నట్టు దోలకియా చెప్పారు. సూరత్లో ఈ బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు ఈ బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. సావ్జి దోలకియా ఫోటో దోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు. అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు. కొందరికి ప్లాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇచ్చారు. ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్గా ఇచ్చారు. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 5500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.6000 కోట్లుగా ఉంది. 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో మాత్రమే సూరత్ వచ్చిన దోలకియా, ఇప్పుడు వజ్రాల వ్యాపారిగా రూ.6000 కోట్ల టర్నోవర్కు పడగెత్తారు. -
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
-
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
సాక్షి, చెన్నై: కలలు కనండీ.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండీ అని మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యవసాయదారుడు రూపాయి రూపాయి కూడబెట్టి తన ఎనిమిదేళ్లనాటి కళను 88 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురానికి చెందిన రైతు పేరు దేవరాజన్. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన 8 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి ఓ బెంజ్ కారుని చూసి, ఎలాగైనా దానిని కొనాలనుకున్నారు. అప్పుడు అతనికి కనీసం ఆ కారు పేరు కూడా తెలియకపోవడంతో లోగోను మనసులో పదిలపరుచుకున్నారు. ఇటీవల దేవరాజన్ చెన్నైలోని బెంజ్ కారు డీలర్ అయిన ట్రాన్స్ కార్ ఇండియాలో ఈ మధ్యే రూ.33 లక్షలు పెట్టి మెర్సిడీజ్ బెంజ్ బీ క్లాస్ కారును కొన్నారు. దేవరాజన్ కథ తెలిసిన ట్రాన్స్ కార్ ఇండియా దీనిని ఓ వీడియో తీసి యూట్యూబ్లో షేర్ చేసింది. ఆయనతో ఓ కేక్ కూడా కట్ చేయించారు. ‘దేవరాజన్ లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అంటూ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని రూపొందించింది. ఆశయం గొప్పదైతే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఈ రైతు నిరూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
బెజవాడలో లగ్జరీ కార్లు రయ్...రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లగ్జరీ కార్లు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కార్ల కంపెనీల దృష్టి రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా ఆయా కంపెనీలు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రత్యేక షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, జాగ్వార్, లాండ్ రోవర్, ఫోక్స్వ్యాగన్ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్ ఇప్పటికే రాష్ట్రంలో షోరూంలు ఏర్పాటు చేశాయి. గత నవంబర్లో జాగ్వార్, లాండ్ రోవర్ మంగళగిరి సమీపంలో షోరూమ్లు ఏర్పాటు చేయగా, త్వరలో విజయవాడ సమీపంలో ఆడీ మరోషోరూమ్ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆడీ మోటార్స్కు విశాఖపట్నంలో షోరూమ్ ఉంది. ఇవికాకుండా మరికొన్ని లగ్జరీ బ్రాండ్లు షోరూమ్లు ఏర్పాటు చేయడానికి మార్కెట్ సర్వే చేస్తున్నాయి. గణనీయంగా అమ్మకాలు: రాష్ట్రంలో ఏటా లగ్జరీ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత లగ్జరీ కార్లవైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల అమ్మకాల్లో 15 శాతం నుంచి 16 శాతం వృద్ధి ఉండగా రాష్ట్రంలో 20 నుంచి 30 శాతం వరకు వృద్ధి నమోదవుతోందని డీలర్లు అంటున్నారు. గతేడాది రాష్ట్రంలో అన్ని లగ్జరీ కార్లు కలిపి సుమారు 600కు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో అత్యధిక వాటా మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, ఫోక్స్వ్యాగన్లదే. గతేడాది రాష్ట్రంలో 200 మెర్సిడెస్ బెంజ్, 160 ఆడీ, 131 బీఎండబ్ల్యూ కార్లు అమ్ముడైనట్లు ఆయా డీలర్లు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది చివరలో ప్రవేశించిన జాగ్వార్, లాండ్ రోవర్కు కూడా స్పందన బాగానే ఉన్నట్టు లక్ష్మీ అనికా మోటార్స్ ఎండీ కె.జయరామ్ చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గాయని కార్ల కంపెనీల డీలర్లు అంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది రాష్ట్రంలో 400 బెంజ్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యంలో సగం మాత్రమే చేరుకున్నట్లు మహావీర్ మెర్సిడెస్ బెంజ్ చైర్మన్ యశ్వంత్ జబక్ తెలిపారు. గతేడాది 160 ఆడీ కార్లు, 131 బీఎండబ్ల్యూ కార్లను అమ్మినట్లు బీఎండబ్ల్యూ ప్రతినిధి రవికిరణ్ రెడ్డి పేర్కొన్నారు. -
కొత్త బెంజ్ కార్లు లాంచ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్మేకర్ మెర్సిడెస్ బెంజ్ కొత్త హై ఎండ్మోడల్ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఎంజీ సీఎల్ఏ- 45, జీఎల్ఏ-45 మోడళ్లను అప్గ్రేడ్ చేసి సరికొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు సిలిండర్ల ఇంజీన్తో ఏఎంపీ ఫెరఫామన్స్ మోడల్స్ను విడుదల చేసింది. వీటితోపాటు ఏఎంజీలో ఏరో ఎడిషన్లో రెండు మోడల్స్ను తీసుకొచ్చింది. సీఎల్ఏ 45 ఏరో ధరను రూ.77.69 లక్షలుగాను, జీఎల్ఏ-45 ఏరో ధరను రూ. 80.6 లక్షలు (ఎక్స్-షోరూము)గా నిర్ణయించింది. మెర్సిడెస్ ఏఎంజీసీఎల్- 45 సెడాన్, జీఎల్ఏ-45 ఎస్యూవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర (ఎక్స్-షోరూము) వరుసగా రూ.. 75.20 లక్షలు , రూ. 77.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు వాహనాలు గరిష్టంగా గంటలకు 250కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. భారతదేశంల కార్ల విభాగం వేగంగా వృద్ధి చెందిందని, పరిశ్రమ వృద్ధికి కొత్త మోడల్స్ ఆవిష్కరణ కీలకమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రోలాండ్ ఫోల్గర్ వ్యాఖ్యానించాడు. అంతిమ డ్రైవింగ్ పనితీరుతో ఆకట్టుకునేలా తీసుకొస్తున్న రాడికల్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. -
బెంజ్లో గంజాయ్
-
దర్జాగా వెళ్లిన తండ్రికొడుకులు ఏం చేశారంటే..
న్యూఢిల్లీ: కార్ల అమ్మకం సంగతి దేవుడెరుగు.. టెస్ట్ డ్రైవింగ్లు అమ్మకందార్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. టెస్ట్ డ్రైవింగ్ కోసం అంటూ కార్లు తీసుకెళ్లిన వారు అటే ఉడాయిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో డ్రైవింగ్ టెస్ట్ చేస్తామంటూ ఇద్దరు తండ్రికొడుకులు మెర్సిడీస్ బెంజ్ కారును ఎత్తుకెళ్లారు. చివరకు నానా తంటాలు పడి పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ కార్ల షోరూంకు అనిల్ ఆనంద్(54), సాహిల్ ఆనంద్(23) అనే ఇద్దరు తండ్రి కొడుకులు కారు కొనడానికంటూ వచ్చారు. డ్రైవింగ్ పరీక్ష చేస్తామని మెర్సిడీస్ కారుతో వెళ్లి అటునుంచి అటే ఉడాయించారు. తిరిగి వారిని గుర్గావ్లో పోలీసులు అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేశారు.