Milestone
-
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్సేల్గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
రూ. 1.21 లక్షల కోట్లు.. క్విప్ ద్వారా రికార్డ్ నిధులు
న్యూఢిల్లీ: అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులను సమీకరించడంలో కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2024)లో కొత్త రికార్డ్కు తెరతీశాయి. జనవరి నుంచి నవంబర్వరకూ దేశీ కార్పొరేట్లు రూ. 1,21,321 కోట్లు అందుకున్నాయి.దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఇవి అత్యధికంకాగా.. స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం, షేర్ల అధిక విలువలు ఇందుకు సహకరిస్తున్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది క్విప్ ద్వారా రూ. 52,350 కోట్లు మాత్రమే సమకూర్చుకున్నాయి. వెరసి రెట్టింపునకు మించి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. క్విప్ అంటే? లిస్టెడ్ కంపెనీలు సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా వేగంగా నిధులు సమీకరించేందుకు వీలు కల్పించేదే క్విప్. నవంబర్వరకూ 82 కంపెనీలు క్విప్ను చేపట్టాయి. గతేడాది కేవలం 35 కంపెనీలు రూ. 38,220 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది రికార్డుకు కారణమైన కంపెనీలలో ప్రధానంగా వేదాంతా గ్రూప్, జొమాటో, అదానీ ఎనర్జీ, వరుణ్ బెవరేజెస్ తదితరాలను ప్రస్తావించవచ్చు. వేదాంతా, జొమాటో విడిగా రూ. 8,500 కోట్లు చొప్పున అందుకున్నాయి. -
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
డీమ్యాట్ సెక్యూరిటీలు రూ. 500 లక్షల కోట్లు
డీమెటీరియలైజ్డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్ను 18ఏళ్లలో అంటే 2014 జూన్లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది. కృతజ్ఞతలుఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు. – ఎస్.గోపాలన్, ఎన్ఎస్డీఎల్ ఎండీ -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
ఆ మైలురాయి సాధించడమే ఎస్బీఐ లక్ష్యం
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.ఇక కార్పొరేట్ రుణ డిమాండ్కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్లైన్ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
World EV Day 2024: దేశంలో రయ్ మంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫోటోలు)
-
దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. ‘4జీ’లో మరో మైలురాయి
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్ను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్లోనే తయారయ్యాయి.అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్వర్క్కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడేళ్లలో 7 లక్షలు.. ఇండియన్ కార్ ఘనత!
టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2017లో భారత్లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అమ్మకాల మార్కును అధిగమించడానికి కేవలం ఏడేళ్లు పట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని టాటా మోటార్స్ నెక్సాన్పై రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో వంటి వాటిని అధిగమించి, టాటా నెక్సాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1,71,697 యూనిట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,72,139 యూనిట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో 1,24,130 యూనిట్లతో భారత్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది. అయితే టాటా నెక్సాన్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ రెండు నెలల్లో 11వ స్థానానికే పరిమితమైంది.నెక్సాన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్యూవీలో రెవోట్రాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్, 170 ఎన్ఎమ్), రెవోటార్క్ 1.5-లీటర్ డీజిల్ (115 పీఎస్, 260 ఎన్ఎమ్) రెండు ఐసీఈ ఎంపికలు ఉన్నాయి. ఇక ఈవీ వెర్షన్లో 129 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో మీడియం రేంజ్ (ఎంఆర్), 145 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంఆర్ వెర్షన్ రేంజ్ 325 కిలోమీటర్లు, ఎల్ఆర్ వెర్షన్ రేంజ్ 465 కిలోమీటర్లు.నెక్సాన్ ఐసీఈ, ఈవీ వర్షన్లు రెండూ సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. నెక్సాన్ ఐసీఈకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండగా, నెక్సాన్ ఈవీకి భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇక ధర విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఐసీఈ రూ .8 లక్షల నుంచి రూ .15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, ఈవీ రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. -
క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ రికార్డు!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్గా నిలిచింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. లేటుగా ప్రారంభించినా.. క్రెడిట్ కార్డ్లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి. -
వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు
PM Modi WhatsApp Channelప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో మరోసారి తన హవాను చాటుకున్నారు. తాజాగా వాట్సాప్ చానెల్లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్స్క్రైబర్లను దాటేసి మరో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్) ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు. తాజాగా వాట్సాప్ ఛానెల్లో మరో కీలక మైలురాయిని సాధించడం విశేషం 91 మిలియన్ల మంది ఫాలోవర్లతో Xలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్స్లో టాప్ ప్రధాని మోదీ. కాగా, ఫేస్బుక్లో, పీఎం మదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్స్లో చేరిన సంగతి తెలిసిందే. వాట్సాప్ చానెల్లో చేరడం ఆనందంగా ఉంది అంటూ కొత్త పార్లమెంటు భవనం ఫోటోను పోస్ట్ చేశారు మోదీ. సెప్టెంబర్ 13న భారతదేశంతో పాటు, 150కి పైగా దేశాలలో WhatsApp ఛానెల్స్ను ప్రారంభించింది. -
భారీగా పెరిగిన పెన్షన్ స్కీముల ఆస్తులు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టు 23న ఈ మైలురాయిని అధిగమించినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. రెండేళ్ల 10 నెలల కాలంలో ఏయూఎం రూ. 5 లక్షల కోట్ల నుంచి రెట్టింపైనట్లు వివరించారు. ఎన్పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 6.62 కోట్ల పైచిలుకు చేరినట్లు మహంతి చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రకటించిన ఎన్పీఎస్ను 2009 నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశ పౌరులు దీన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. మరోవైపు, 2015 జూన్ 1న ఏపీవైని కేంద్రం ఆవిష్కరించింది. 60 ఏళ్లు దాటిన చందాదారులు తాము కోరుకున్నంత నిధిని ఏకమొత్తంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్పై కసరత్తు తుది దశలో ఉందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని మహంతి వివరించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ చందాదారులు 60 ఏళ్లు దాటితే 60 శాతం మాత్రమే విత్డ్రా చేసుకునే వీలుంది. మిగతా 40 శాతం మొత్తం తప్పనిసరిగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. -
వన్ అండ్ ఓన్లీ యాపిల్: కీలక మైలురాయిని అధిగమించిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం యాపిల్ కీలక మైలురాయిని చేరుకుంది. యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్లో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని అధిగమించిన ఏకైక కంపెనీగా నిలిచింది. ఇటీవల యాపిల్ షేర ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ వ్యాల్యూ బాగా పెరిగింది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్ శుక్రవారం 1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 191.34 డాలర్లను తాకాయి. దీంతో యాపిల్ మార్కెట్ క్యాప్ రికార్దు స్థాయికి చేరింది. జనవరి 3, 2022న, ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది కానీ ముగింపులో నష్టపోయింది. ఈ 3 ట్రిలియన్ మార్కును దాటి ఈ ఘనతను సాధించిన ఏకైక కంపెనీ యాపిల్. వచ్చే ఏడాది విక్రయానికి రానున్న విజన్ ప్రో, ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ప్రివ్యూ టెక్ ప్రియులను ఆకట్టుకుంది. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కాగా 2022తో పోలిస్తే ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లాభం యాపిల్కు కలసి వచ్చింది. 2021 తరువాత తొలిసారి 2023 ప్రారంభంలో మార్కెట్ క్యాప్ స్థాయినుంచి 2 ట్రిలియన్ల దిగువకు పడిపోయింది. ఆతరువాత మార్కెట్ పుంజుకోవడంతో యాపిల్ షేరు ఈ ఏడాది దాదాపు 46 శాతం పెరిగడంతో మార్కెట్ క్యాప్ పరంగా టాప్లో నిలిచింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) -
కోటికి పైగా ఐటీఆర్లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
స్టార్షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్
ఎలన్మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలన్ మస్క్ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్లోని స్టార్బేస్లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. గత ఏప్రిల్లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపధ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది. గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి.. అయితే నాడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి, మెక్సికోలో పడేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. తరువాతి ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్షిప్ ప్రయోగం విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Key milestone completed for flight 2 https://t.co/bGmWKOnKEH — Elon Musk (@elonmusk) June 27, 2023 ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. -
సీఏ మిస్కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్కాల్లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
దుమ్మురేపిన నెక్సాన్.. ఉత్పత్తిలో రికార్డు బద్దలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా కార్లలో ఒకటి నెక్సాన్. దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు దీని కున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు. కంపెనీ ఇటీవల నెక్సాన్ ఉత్పత్తిలో ఐదు లక్షల మైలురాయిని చేరుకుంది. 2017 నుంచి సబ్-4-మీటర్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే విజయకేతనం ఎగురవేసింది. నిజానికి 2014 ఆటో ఎక్స్పోలో కనిపించిన టాటా నెక్సాన్ 2017లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది మొదట్లో ఏడు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లతో మొదలైంది. 'నెక్సాన్'లో మొదటి ఇంజిన్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ (109 హెచ్పి & 170 ఎన్ఎమ్ టార్క్) కాగా, రెండవది 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ రెవోటార్క్ (109 హెచ్పి & 260 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభించాయి. 2020లో నెక్సాన్ మార్కెట్లో రీడిజైన్ మోడల్ విడుదలైంది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు జరిగాయి. ఆ తరువాత నెక్సాన్ ఈవీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2020లోనే కంపెనీ రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నెక్సాన్ ఈవీ లాంచ్ చేసింది. ఇది 30.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ సృష్టించింది. ఇక టాటా మోటార్స్ 2022లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విడుదల చేసింది. ఇది దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ అయింది.ఈ అప్డేట్ మోడల్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్తో 453 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధ్రువీకరించారు. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంది. మొత్తానికి టాటా నెక్సాన్ తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను కంపెనీకి తీసుకురావడంలో సహాయపడింది. ఈ మధ్య కాలంలోనే కంపెనీ కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్ వంటి అనేక స్పెషల్ అవతార్లలో కూడా విడుదల చేసి ఉత్పత్తిలో 5 లక్షల మైలురాయిని చేరుకుంది. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
కీలక మైలురాయిని అధిగమించిన హోండా కార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది. ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో భారత్లో రాజస్తాన్లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్వర్క్ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. బైడెన్ పొగడ్తల జల్లు!
వాషింగ్టన్: కన్జర్వేటివ్ పార్టీలో తన నాయకత్వనికి బహిరంగంగా తిరుగుబాటు రావడంతో లిజ్ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుహ్య రీతిలో తప్పుకోవడం, మరో ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ కావల్సినంత మంది ఎంపీల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. నెలన్నరరోజుల క్రితం లిజ్ట్రస్ చేతిలో ఓడిపోయిన అదే రిషి సునాక్ తిరిగి ప్రధానిగా బ్రిటన్ పగ్గాలు చేపట్టడం విశేషం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో జరిగిన దీపావళి వేడుకలో మాట్లాడుతూ...."సునాక్ విజయం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విజయం ఒక సంచలనాత్మక మైలురాయి. ఆయనకు అధికారిక అభినందనలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. ఈ క్రమంలో వైట్హౌస్ ప్రతినిధి కరీన్ జీన్ పియరీ బ్రిటన్ ప్రధాని సునాక్.. కింగ్ చార్లెస్తో ప్రోటోకాల్ సమావేశం జరిగిన తదనంతరం ఆయనతో బైడెన్ సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: అమెరికా వైట్హౌస్లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
సేల్స్లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్పుట్, 170 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
మహీంద్రా స్వరాజ్ 20 లక్షల మార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సరికొత్త రికార్డును సాధించింది. 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి నూతన మైలు రాయిని అధిగమించింది. ఈసందర్బంగా స్వరాజ్ బ్రాండ్పై కస్టమర్ల విశ్వాసానికి, విశ్వాసానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ సీఈవో హరీష్ చవాన్ ఉద్యోగులు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో 20 లక్షల మార్క్నుటచ్ చేసిన ట్రాక్టర్ను విడుదల చేశారు. 1974లో స్వరాజ్ ట్రాక్టర్ల ఉత్పత్తి ప్రా రంభం అయింది. 10 లక్షల యూనిట్ల తయారీ మార్క్ను కంపెనీ 2013లో నమోదు చేసింది. పంజాబ్లోని రెండు ప్లాంట్లలో 15–65 హెచ్పీ సామర్థ్యం గల ట్రాక్టర్లను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. స్వరాజ్ ట్రాక్టర్ల కోసం మూడవ ప్లాంటును ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతోంది. -
వావ్.. మార్కెట్లో భారీగా పెరుగుతున్న ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి
సాక్షి, ముంబై: దేశంలో స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేయడం విశేషం. కోవిడ్కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య 40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం. బుల్లిష్ మార్కెట్ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్లో డీప్ కరెక్షన్ కారణంగా జూన్లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు -
సీడీఎస్ఎల్ రికార్డు, 7 కోట్లు దాటేసిన డిమ్యాట్ ఖాతాలు
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవలను అందించే సీడీఎస్ఎల్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ నిర్వహణలో డీమ్యాట్ ఖాతాలు 7 కోట్ల మార్క్ను దాటాయి. సీడీఎస్ఎల్ 1999లో కార్యకలాపాలు ప్రారంభించింది. డీమ్యాట్ ఖాతాల ద్వారా ఇన్వెస్టర్ల సెక్యూరిటీల లావాదేవీలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంటుంది. తాము ఏడు కోట్ల ఖాతాల మైలురాయిని అధిగమించడం తమకు మాత్రమే కాకుండా, మొత్తం భారత సెక్యూరిటీల మార్కెట్ ఎకోసిస్టమ్కు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సీడీఎస్ఎల్ ఎండీ, సీఈవో నెహల్ వోరా అన్నారు. యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య పరంగా సీడీఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీ సేవల సంస్థగా ఉంది. మరో సంస్థ ఎన్ఎస్డీఎల్ కూడా ఇదే విధమైన సేవలు అందిస్తుంటుంది. -
టీమిండియాకు 1000వ వన్డే.. కోహ్లిని ఊరిస్తున్న రికార్డు
టీమిండియా మెషిన్గన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. విండీస్తో జరగనున్న తొలి వన్డేలో ఆరు పరుగులు చేస్తే.. స్వదేశంలో వన్డేల్లో 5వేల పరుగులు మార్క్ను అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకముందు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే స్వదేశంలో 5వేల పరుగుల మార్క్ను అధిగమించాడు. సచిన్కు స్వదేశంలో 5వేల పరుగులు మార్క్ను అందుకోవడానికి 121 ఇన్నింగ్స్లు అవసరం అయ్యాయి. అయితే కోహ్లి విండీస్తో తొలి వన్డేలో 6 పరుగులు సాధిస్తే.. కేవలం 96 ఇన్నింగ్స్లోనే ఆ రికార్డును అందుకోనున్నాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తప్పుకున్న తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్తో సిరీస్ ఆడింది. ఆ సమయంలో కోహ్లి టెస్టు కెప్టెన్గా ఉన్నాడు. అయితే ప్రొటీస్ టూర్లో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కోహ్లి తన టెస్టు కెప్టెన్సీ పదవికి గుడ్బై చెప్పాడు. ప్రస్తుతం కోహ్లి టీమిండియా సీనియర్ బ్యాటర్గా కొనసాగుతూ బ్యాటింగ్పై పూర్తిస్థాయి దృష్టి సారించాడు. ఇక టీమిండియా-వెస్టిండీస్ వన్డే సిరీస్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో తొలి వన్డే రద్దు అవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి బీసీసీఐ వాటిని కొట్టిపడేసింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ వన్డే మ్యాచ్ టీమిండియాకు 1000వ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో వెయ్యెవ మ్యాచ్ ఆడుతున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. దీంతో టీమిండియాకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో భోణి చేయాలని టీమిండియా భావిస్తోంది. -
భారత్లో అమెజాన్ సరికొత్త మైలురాయి..! 100 నుంచి ఏకంగా 10 లక్షల వరకు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో సరికొత్త మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 10 లక్షల మంది విక్రయదారులు అమెజాన్లో ఆన్బోర్ట్ ఐన్నట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 100 నుంచి మొదలు..! 2013లో అమెజాన్ ఇండియా కేవలం 100 మంది విక్రయదారులను ఆన్బోర్డ్ చేసుకోగా..ప్రస్తుతం ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. Amazon.inలో 90 శాతం కంటే ఎక్కువ మంది విక్రేతలు చిన్న, మధ్యస్థ స్థానిక వ్యాపారాలను కల్గి ఉన్నారు. వీరు టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చారు. 2020 జనవరి నుంచి 4.5 లక్షలకు పైగా కొత్త విక్రేతలు అమెజాన్లో చేరారని కంపెనీ పేర్కొంది. చదవండి: సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన 63 మిలియన్ల ఎమ్ఎస్ఎమ్ఈలతో... భారత్లోని పలు ఎమ్ఎస్ఎమ్ఈలపై అమెజాన్ ఇండియా దృష్టిసారించింది. సుమారు 63 మిలియన్ల మధ్యస్థ,చిన్న సూక్ష్మ పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను అమెజాన్ నెలకొల్పింది. స్థానిక రిటైలర్లకు వారి వ్యాపారాల అభివృద్ధికి అమెజాన్ ఎంతగానో సహయం అందించిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు. చదవండి: ఏసర్ ల్యాప్ట్యాప్స్పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
మరో మైలురాయిని దాటిన సింగరేణి
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 200 మెగావాట్ల లక్ష్యాన్ని దాటడం ద్వారా సింగరేణి సంస్థ మరో రికార్డును అందుకుంది. బుధవారం కొత్తగూడెంలో ప్రారంభించిన 37 మెగావాట్ల యూనిట్తో ఆ సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి 219 మెగావాట్లకు చేరింది. సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 13 ప్లాంట్లను సంస్థ పరిధిలోని 8 ఏరియాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు. మూడు దశల్లో ఈ పాంట్ల ఏర్పాటు కోసం పలు కాంట్రాక్టు సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పింది. మొదటిదశలో భాగంగా 129 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను బీహెచ్ఈఎల్ చేపట్టింది. ఆర్జీ–3లో 40, ఇల్లెందులో 39, మణుగూరులో 30, ఎనీ్టపీసీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి ఇప్పటికే విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. ఆర్జీ–3 ఏరియాలోని మరో 10 మెగావాట్ల ప్లాంటు వచ్చే నెలలో పూర్తి కానుంది. ఇక, రెండో దశలో భాగంగా కొత్తగూడెంలో 37, మందమర్రి ఏ బ్లాక్లో 28, బి బ్లాక్లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లు కూడా ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు కొత్తగూడెం ప్లాంటు కూడా ప్రారంభం కావడంతో సింగరేణి సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 219 మెగావాట్లకు చేరింది. ఇక, మూడోదశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లను అదానీ, నోవాస్గ్రీన్ సంస్థలకు సింగరేణి అప్పగించింది. ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జలాశయంపై నీటితో తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను నోవాస్గ్రీన్ ప్రారంభించింది. ఆర్జీ–3 ఓపెన్కాస్ట్ డంప్పై 22, డోర్లీ ఓపెన్కాస్ట్ డంప్పై 10 మెగావాట్లు, కొత్తగూడెం, చెన్నూరు ఏరియాల్లో నేలపై రెండు ప్లాంట్ల (34 మెగావాట్లు)ను నిర్మిస్తున్నారు. వీటి పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ఉత్పాదన ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 122.3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి వాస్తవానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇప్పటివరకు సోలార్ విద్యుదుత్పత్తి చేయడం లేదు. థర్మల్తో పాటు సోలార్ విధానంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది సింగరేణి సంస్థ మాత్రమే. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రిడ్కు అనుసంధానమైన సోలార్ ప్లాంట్ల ద్వారా సెప్టెంబర్ 21 నాటికి 122.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్ను ట్రాన్స్కో లైన్లకు అనుసంధానం చేసి తనకు అవసరమైన మేర వినియోగించుకోవడంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదా అయింది. మొత్తం సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల లక్ష్యం పూర్తయితే ప్రతియేటా రూ.120 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. చదవండి: Dr Jnanesh Thacker: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు -
ఏ ఇతర భారత క్రికెటర్కు సాధ్యం కాని రికార్డు.. కేవలం 71 పరుగుల దూరంలో
Kohli 71 Runs Away To Achieve Rare Milestone In T20 Cricket: ఐపీఎల్-2021 సెకండ్ ఫేస్లో సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్మెన్కూ సాధ్యం కాని ఈ రికార్డుకు కోహ్లి కేవలం 71 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి నేటి మ్యాచ్లో ఆ పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటరగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్మెన్ రికార్డుల్లోకెక్కుతాడు. భారత జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున మొత్తం 311 మ్యాచ్లు ఆడిన విరాట్.. ఇప్పటివరకు 133.95 స్ట్రైక్ రేట్తో 9929 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం పొట్టి క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 446 మ్యాచ్ల్లో 14,261 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్కే చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 561 మ్యాచ్ల్లో సెంచరీ, 56 హాఫ్ సెంచరీల సాయంతో 11,159 పరుగులు సాధించాడు. వీరి తర్వాత పాక్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ (436 మ్యాచ్ల్లో 10,808 పరుగులు), ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (304 మ్యాచ్ల్లో 10,017 పరుగులు) వరుసగా 3,4 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్లో అత్యధిక పరుగులు రికార్డు కూడా కోహ్లి పేరిటే నమోదై ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తం 199 మ్యాచ్లు ఆడిన విరాట్ 5 శతకాలు, 40 అర్ధశతకాల సాయంతో 6076 పరుగులు స్కోర్ చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే.. తొలిదశలో జరిగిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఆర్సీబీ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: మంచి పొజిషిన్లో ఉన్నారు.. ఇప్పుడిలా ఎందుకు కోహ్లి: గంభీర్ -
టీమిండియా తొలి ఉమెన్ క్రికెటర్గా
లక్నో: టీమిండియా ఉమెన్స్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఈ ఫీట్ను అందుకున్న రెండో క్రికెటర్గా రికార్డు అందుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అన్నే బోస్క్ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్ను చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్గా ఇంగ్లండ్కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తరపున ఎడ్వర్డ్స్ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 77 పరుగులతో రాణించగా.. మిథాలీ, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 8 పరుగులు చేసింది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే పంత్ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్ Congratulations, Mithali Raj 👏 A modern-day legend. pic.twitter.com/XyI89zWL47 — ICC (@ICC) March 12, 2021 -
నరేంద్ర మోదీ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన మోదీ దేశ ప్రధానిగా వరుసగా రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా అత్యధిక కాలం పనిచేసిన వారి సరసన మోదీ చేరారు. బుధవారం ఆయన ప్రభుత్వాధినేతగా 20వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని, భారత్తో పాటు ప్రపంచం శాంతి సౌఖ్యాలతో విలసిల్లేలా ఆయన మరింత శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో దీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన ప్రధాని మోదీని అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, దివంగత బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ వంటి ప్రపంచ నేతలతో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పోల్చారు. ప్రభుత్వాధినేతగా 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీకి పలువురు బీజేపీ నేతలు, మంత్రులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు నరేంద్ర మోదీ 2001 నుంచి 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చదవండి : ప్రధానితో సీఎం జగన్ భేటీ ఫలప్రదం -
మరో మైలురాయి అధిగమించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను మోదీ అందుకున్నారు. అటల్ బిహార్ వాజ్పేయి పలుమార్లు ప్రధానిగా 2268 రోజులు వ్యవహరించగా మోదీ ఆ రికార్డును చెరిపివేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు అత్యున్నత పదవిని చేపట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు సాధించారు. ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశానికి దిశానిర్ధేశం చేశారు. ఆపై మన్మోహన్ సింగ్ వరుసగా ఐదేళ్లపాటు రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఇక మరో రెండు రోజుల్లో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీలే కావడం గమనార్హం. చదవండి : నిజాయితీగా పన్ను చెల్లించేవారికి లబ్ధి : మోదీ -
ఆధార్ @ 125 కోట్లు
-
చారిత్రక ఘట్టంపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్ ద్వారా వ్యక్త పరిచారు. ‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జననేత దాటారు. Feeling extremely humbled as I complete the 3000km milestone today. Walking alongside my people has been one of the greatest learning experiences. The love & faith you all have shown towards me has been a constant inspiration to move further every single day. — YS Jagan Mohan Reddy (@ysjagan) 24 September 2018 -
టెస్టుల్లో ఇంగ్లండ్ రికార్డు!
బర్మింగ్ హోమ్ : ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకోనుంది. దానికి భారత్తో జరిగే తొలి టెస్టే వేదిక కావడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఆగస్టు 1న ప్రారంభమయ్యే టెస్టు ఇంగ్లండ్కు 1000వ టెస్ట్. ఇప్పటికే అత్యధిక టెస్టులాడిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ 1000 టెస్టుల ఆడిన తొలి జట్టుగా నిలవనుంది. ఇప్పటి వరకు 999 టెస్టు మ్యాచ్లను ఈ ఇంగ్లీష్ జట్టు ఆడింది. ఈ 999 టెస్టుల్లో తన ఫేవరేట్ మ్యాచ్లు మాత్రం 2005 యాషేస్ సిరీస్.. ఎడ్జ్బస్టన్ టెస్ట్ అని, రెండోది 2015 ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ అని ఆజట్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ట్విటర్లో పేర్కొన్నాడు. అత్యధిక టెస్టులాడిన జాబితాలో ఇంగ్లండ్ తొలి స్థానంలో ఉండగా..812 మ్యాచ్లతో ఆస్ట్రేలియా, 535 మ్యాచ్లతో వెస్టిండీస్ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ 522 మ్యాచ్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తన తొలి టెస్టును 1877లో ఆస్ట్రేలియా, మెల్బోర్న్ వేదికగా జేమ్స్ లిల్లీవైట్ సారథ్యంలో ఆడింది. 999 మ్యాచుల్లో 35.73 శాతంతో 357 మ్యాచ్లు గెలిచి 297 మ్యాచ్లు ఓడింది. 345 మ్యాచ్లు డ్రా అయ్యాయి. చదవండి: 4 కాదు... 3 రోజులే ఈ ‘ప్రాక్టీస్’ -
కెప్టెన్సీలో కోహ్లి ఫిఫ్టీ.. విజయాలెన్ని?
నాటింగ్హామ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్.. కెప్టెన్గా కోహ్లికి 50వ వన్డే మ్యాచ్. దీంతో ఈ ఫీట్ అందుకున్న 7వ భారత బ్యాట్స్మన్గా ఈ 29 ఏళ్ల ఆటగాడు గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక 50 మ్యాచ్ల్లో 39 విజయాలందించి.. తొలి 50 వన్డేలకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించి ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 41 విజయాలతో ప్రథమస్థానంలో ఉండగా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ ల్యూయిడ్ 40 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది జనవరిలో మహేంద్రసింగ్ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కోహ్లికి ఆ అవకాశం దక్కిన విషయం తెలిసిందే. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
కోహ్లిని ఊరిస్తున్న మరో రికార్డు!
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ రికార్డు ఊరిస్తోంది. మరో 8 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లి రికార్డు నమోదు చేయనున్నాడు. ఆ రికార్డు మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్-భారత్ తొలి టీ20 మ్యాచ్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక టీ20ల్లో 55 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లి 48.58 సగటుతో 1992 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో కోహ్లి మరో ఎనిమిది పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా 2000 పరుగులు నమోదు చేయడమే కాకుండా భారత్ నుంచి ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపు పొందనున్నాడు. ఇక ఓవరాల్గా ఇప్పటికే ఈ ఘనతను ముగ్గురు బ్యాట్స్మన్ అందుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్ 2271 పరుగులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో 2,140 పరుగులతో కివీస్కే చెందిన మెక్కల్లమ్ ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఈ క్లబ్లో చేరాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్లో మాలిక్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 66 ఇన్నింగ్స్లో మెక్కల్లమ్, 68 ఇన్నింగ్స్లో గప్టిల్, 59 ఇన్నింగ్స్ మాలిక్లు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 8వ స్థానంలో ఉన్న కోహ్లి సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ను 2-0తో గెలుచుకున్న భారత్ అదే ఉత్సాహంతో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్దమైంది. -
ఐపీఎల్లో ధోని అరుదైన ఘనత
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 150 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్తో ధోని ఈ రికార్డు నమోదు చేశాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో చెన్నై 8 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. 2008 సీజన్ నుంచి చెన్నైకి సారథ్యం వహిస్తున్న ధోని.. తన కెప్టెన్సీలో చెన్నై జట్టును రెండు సార్లు చాంపియన్గా.. 4 సార్లు రన్నరప్గా నిలిపాడు. అంతేకాకుండా రెండు సార్లు చాంపియన్స్లీగ్ టైటిల్ అందించాడు. ప్రస్తుత సీజన్లో సైతం టైటిల్ దిశగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కీలక సమయాల్లో మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు తీసుకొని విజయాన్నందిస్తున్నాడు. దీంతో చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
బుల్ రన్:మరో మైలురాయిని అధిగమించిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. అదే తరహాలో కొత్త గరిష్టాల ట్రెండ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నిఫ్టీ తొలిసారి 11వేల మార్క్ను తాకడం ఇవాల్టి విశేషం. అలాగే సెన్సెక్స్ 36వేల మార్క్కు చాలా దగ్గరగా వచ్చేసింది. సెన్సెక్స్ 177 పాయింట్లు ఎగిసి 35,975 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11010 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐవోసీ, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్, యాక్సిస్, యస్బ్యాంక్, ఐబీ హౌసింగ్, టాటా స్టీల్ లాభపడుతుండగా మీడియా షేర్లు నష్టపోతున్నాయి. వీటితోపాటు గెయిల్, ఏషియన్ పెయింట్స్, అంబుజా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నెగిటివ్గా ఉన్నాయి. -
మరో మైల్స్టోన్ అధిగమించిన మెసెంజర్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్కు చెందిన మెసెంజర్ యాప్ మరో రికార్డును సొంతం చేసుకుంది. యూజర్ల సంఖ్యలో మరో కీలకమైన రికార్డును సొంతం చేసుకుంది. గత ఎనిమిది నెలల్లో మొత్తం 200 మిలియన్ల కొత్త యూజర్లను జతచేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. రికార్డు స్థాయిలో 1.2 బిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రతినెలా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు నమోదవుతున్నారని ఫేస్బుక్ హెడ్ ఆఫ్ మెసెంజర్ డేవిడ్ మార్కస్ తెలిపారు.దీంతో వివిధ ఫీచర్లతో విశేష ఆదరణ పొందుతున్న సమీప భవిష్యత్తులో నెలకు 1.5 లేదా 2 బిలియన్ల యూజర్లను సాధించడం అంత కష్టమేమీకాదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నుంచి వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్లకు 200 మిలియన్ల మంది, ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్కు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల యూజర్లు ఉన్నారు. నెలకు 1 బిలియన్ యూజర్లతో ఫేస్బుక్ మూడు యాప్ లను కలిగి ఉండగా, గూగుల్ కుచెందిన 7 యాప్లు ఈ 1 బిలియన్ క్లబ్ లో ఉన్నాయి. మరోవైపు రాబోయే సం.రాల్లో మెసెంజర్ యాప్ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో ఒకవిప్లవం కానుందని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విశ్వాసం. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఫేస్బుక్ తన ఇతర యాప్ ల రెవెన్యూలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1.2 బిలియన్ యూజర్లద్వారా ప్రకటనలపై వచ్చే ఆదాయంపై ఫోకస్ పెట్టనుంది. -
జియో సంచలనం:మూడునెలల్లో 5 కోట్లు
ముంబై: సంచలనాలకు కేంద్రంగామారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్ , ఉచిత డాటా అఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న జియో తాజాగా అయిదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించింది. జియో లాంచ్ చేసిన తరువాత కేవలం మూడునెలల్లో (83 రోజులు) ఈ రికార్డు స్థాయి ఖాతాదారులను నమోదు చేసింది. మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ కు 50 మిలియన్ల ఖాతాదారుల మైలు రాయిని దాటడానికి12 ఏళ్లు పడితే, వోడాఫోన్, ఐడియాకు 13 సం.రాలు పట్టిందని విశ్లేషకులు లెక్కలు చెప్పారు. అతివేగంగా వృధ్ది చెందుతున్న సంస్థగా రిలయన్స జియో ఇన్ఫోకాం నిలిచిందని తెలిపారు. పరిశ్రమ అంచనాలకు మించి నిమిషానికి వెయ్యి కస్టమర్ల చొప్పున సాధిస్తోంది. రోజుకు సగటున 6 లక్షల ఖాతాదారులను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్ , స్కైప్ లను మించిన ఆదరణ పొందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో అతి పెద్ద డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థగా అవతరించిందని పేర్కొన్నాయి. మరోవైపు జియో సిమ్ లతో టెలికాం రంగంలో పెను ప్రకంపనాలను నాంది పలికిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ టెలికాం కంపెనీలు ట్రాయ్కి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఉచిత ఆఫర్ను మరో మూడు నెలలపాటు (2017 మార్చి వరకు) పొడిగించారు. మరోవైపు డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడున్న ఉచిత సర్వీస్తోపాటు వెల్కమ్ ఆఫర్- 2017 ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే దేశంలోని టెలికాం దిగ్గజాలకు కష్టకాలమే అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి నిజంగా రిలయన్స్ అధినేత మరో సంచలనానికి తెర తీస్తారా లేదా తెలియాలంటే మాత్రం డిసెంబర్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే. -
మరో మైలురాయిని అధిగమించిన ఫ్లిప్కార్ట్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో మైలురాయిని అధిగమించింది. వంద మిలియన్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ఫామ్పై నమోదుచేసుకున్నట్టు ఫ్లిప్కార్ట్ బుధవారం ప్రకటించింది. ఈ మైలురాయిని తాకిన మొదటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా ఫ్లిప్కార్ట్ నిలిచినట్టు ఈ కంపెనీ బుధవారం పేర్కొంది. 2016 మార్చిలో 75 మిలియన్ రిజిస్ట్రర్ యూజర్ల స్థాయిని తాకిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఈ ల్యాండ్మార్కును క్రాస్ చేసినట్టు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం 100 మిలియన్ల రిజిస్ట్రర్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ఫామ్ కలిగిఉన్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. భారత్లో వైర్లెస్, వైర్లైన్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లలో రిజిస్ట్రర్ కస్టమర్ బేస్ మొత్తం 63 శాతం ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడంలో తమ ప్లాట్ఫామ్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ కృషే మిలియన్ల భారతీయ యూజర్లను ఆన్లైన్ షాపింగ్ చేయడానికి దోహదం చేస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు బిని బన్సాల్ తెలిపారు. తమ ఫ్లాట్ఫామ్పైకి ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తోడ్పడుతున్నట్టు చెప్పారు. -
'ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయి'
ముంబై: సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం తన కెరీర్లో అతిపెద్ద మైలురాయి అవుతుందని బ్రిటిష్ మోడల్, నటి అమీ జాక్సన్ అన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్తో కలసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని అమీ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో ఓ థియేటర్లో ఈ చిత్రాన్ని చూసిన అమీ ప్రేక్షకుల స్పందన బాగుందని చెప్పారు. 2010లో తమిళ చిత్రం 'మద్రాసపట్టణం' ద్వారా అమీ తన కెరీర్ ప్రారంభించారు. 2012లో' ఏక్ దీవాన థ' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. చాలామంది స్టార్స్తో కలసి నటించాలని ఉందని, ఈ జాబితా పెద్దదేనని అమీ అన్నారు. -
బాలీవుడ్ కు అనుష్క ?
చెన్నై : అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్న కవి వర్ణన నటి అనుష్కకు చక్కగా సరిపోతుంది. దక్షిణాది వెండితెరపై వెలిగిపోతున్న హీరోయిన్ అనుష్క. ఒక్క ఓర చూపుతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టగల ఈ నగుమోము సుందరి ఇతర నటీమణులు కాజల్, సమంత, ఇలియానలతో పోటీ పడినా ప్రస్తుతం తనదే పై చేయి అనిపించుకుంటున్నారు. అయితే వాళ్లంతా బాలీవుడ్లో పాగా కోసం తహతహలాడుతున్నారు. ఒకటి, రెండు చిత్రాల్లో నటించిన సరైనా గుర్తింపు రాకపోవడంతో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నటి అనుష్కకు మాత్రం బాలీవుడ్ మోహం లేదట. ప్రస్తుతం తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అనుష్క హిందీ చిత్రాలకు కాల్షీట్స్ కేటాయించే పరిస్థితి లేదు. 2015 వరకూ ఈ భామ షెడ్యూల్ బిజీ. అనుష్క తమిళంలో నటించిన ఇరండాం ఉలగం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ చిత్రం తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న అనుష్క హిందీ చిత్రాల్లో నటించి తీరాలన్న ఆలోచన గాని, ఆసక్తి గాని తనకు లేదంటున్నారు. అన్ని కొలిసొచ్చి మంచి కథ, పాత్ర అయితే హిందీలో నటించే విషయం గురించి ఆలోచిస్తానని అనుష్క అంటున్నారు.