mixed doubles
-
అన్నింటికంటే ‘మిక్స్డ్’ ముందు!
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గేమ్ ఫార్మాట్ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో మిక్స్డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది. -
ఒలివియా–జాన్ పీర్స్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
ఆరంభ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో ‘మిక్స్డ్ డబుల్స్’ ఫైనల్ కాస్తా ఆ్రస్టేలియన్ల సమరంగా మారింది. కోర్టులో ఇవతల... అవతల... నలుగురూ ఆ్రస్టేలియన్లే ట్రోఫీ కోసం ‘ఏస్’లు దూశారు. చివరకు ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిస్తే... సహచర ద్వయం కింబర్లీ బిరెల్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్తో తృప్తి పడింది. ఇరు జోడీలు ‘వైల్డ్కార్డ్’ ఎంట్రీతోనే సొంతగడ్డపై గ్రాండ్స్లామ్ ఆడటం గమనార్హం. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా అ్రస్టేలియన్లే తలపడిన తుది పోరులో పీర్స్–ఒలివియా జోడీ 3–6, 6–4, 10–6తో స్మిత్–బిరెల్ జంటపై గెలిచింది.ఒలివియా–పీర్స్ జంటకు 1,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 95 లక్షల 36 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 22 ఏళ్ల ఒలివియాకిదే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్. 36 ఏళ్ల పీర్స్ ఖాతాలో ఆ్రస్టేలియన్ ఓపెన్ (2017) పురుషుల డబుల్స్ టైటిల్, 2022లో యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఉన్నాయి. -
రన్నరప్ రుత్విక–రోహన్ జోడీ
బెంగళూరు: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని రన్నరప్గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో రుత్విక శివాని (పీఎస్పీబీ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) ద్వయం 17–21, 18–21తో ఆయుశ్ అగర్వాల్–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన శ్రియాంశి వలిశెట్టి కూడా రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో శ్రియాంశి 15–21, 16–21తో దేవిక సిహాగ్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం.రఘు (కర్ణాటక) 14–21, 21–14, 24–22తో మిథున్ మంజునాథ్ (రైల్వేస్)పై గెలిచి జాతీయ చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో రఘు ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జోడీ 21–18, 20–22, 21–17తో ప్రియా దేవి (మణిపూర్)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్‡్ష మొహమ్మద్ (ఉత్తరప్రదేశ్)–సంస్కార్ సరస్వత్ (రాజస్తాన్) ద్వయం 12–21, 21–12, 21–19తో టాప్ సీడ్ నవీన్–లోకేశ్ (తమిళనాడు) జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. -
రుత్విక–రోహన్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ సాధించింది. గచ్చిబౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు దక్కడం విశేషం. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–17, 21–19తో హరిహరన్–తనీషా క్రాస్టో (భారత్) జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్ టైటిల్ ఇషారాణి బారువా (భారత్)కు లభించింది. ఫైనల్లో ఇషారాణి 21–15, 9–21, 21–17తో రక్షిత శ్రీ (భారత్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో తరుణ్ రెడ్డి 11–21, 14–21తో భారత్కే చెందిన రిత్విక్ సంజీవి చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ 19–21, 17–21తో పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రియా కొంజెంగ్బమ్–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 21–18, 21–13తో ఆరతి సారా సునీల్–వర్షిణి (భారత్) జోడీపై గెలిచింది. -
US Open 2024: సెమీస్లో ఓడిన బోపన్న జోడీ
యూఎస్ ఓపెన్ 2024లో భారత్ పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ బోపన్న-అల్దిలా సుత్జియాది(ఇండోనేషియా) జోడీ 3-6, 4-6 తేడాతో అమెరికా జంట డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్సెండ్ చేతిలో ఓటమిపాలైంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న- సుత్జియాది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై 7-6(7-4), 2-6, 10-7 తేడాతో విజయం సాధించి సెమీస్కు చేరింది.అంతకుముందు పురుషుల డబుల్స్లోనూ బోపన్న- ఎబ్డెన్ జోడీ మూడో రౌండ్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. రెండో సీడ్గా బరిలోకి దిగిన బోపన్న – ఎబ్డెన్ జోడీ.. మాగ్జిమో గొంజాలెజ్, అండ్రెస్ మొల్తెనీ జోడీ చేతిలో 1-6, 5-7 తేడాతో ఖంగుతింది.పురుషులు సింగిల్స్ విషయానికొస్తే.. వరల్డ్ నెంబర్వన్ జనెక్ సినర్ క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టాడు. సెమీస్ బెర్త్ కోసం సినర్ మాజీ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
Singapore Smash 2023: క్వార్టర్ ఫైనల్లో మనిక జోడీ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది. మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు. -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ
Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. అలా సెమీస్కు చేరి.. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. ఇలా సెమీస్కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్గా సిరాజ్ ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..? In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage! She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC — #AusOpen (@AustralianOpen) January 25, 2023 -
‘మిక్స్డ్’ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ
తన కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ్రస్టేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా–రోహన్ బోపన్న (భారత్) జోడీ 7–5, 6–3తో జైమీ ఫోర్లిస్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–బోపన్న ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. జీవన్–బాలాజీ ద్వయం సంచలనం చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత డబుల్స్ జోడీ జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జీవన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–6 (8/6), 2–6, 6–4తో ఐదో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్కు చేరుకుంది. -
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరింది. బెంగళూరులో శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–17, 14–21, 21–16తో షేక్ గౌస్–మనీషా (భారత్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో అశ్విని పొన్నప్ప–సాయి ప్రతీక్ (భారత్)లతో సిక్కి–రోహన్ తలపడతారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో రుత్విక 21–16, 19–21, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో తాన్యా హేమంత్తో రుత్విక ఆడుతుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 15–21, 18–21తో చలోంపన్–నాంథకర్న్ (థాయ్లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్లోని సూరత్లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్లో రజతం... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకే చెందిన స్నేహిత్తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్షిప్లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్ను నిర్వహించారు. -
భారత జోడీకి స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత్కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్డ్ డబుల్స్లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్లో, అండర్–19 బాలికల సింగిల్స్లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాలు లభించాయి. -
బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర.. కొడుకుతో కలిసి తల్లి ప్రపంచ రికార్డు
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని కొందరు అంటారు. వయసు ఎక్కువైతే ఆట ఆడొద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఎలాంటి ఆటైనా సరే వయసుతో సంబంధం ఉండదు(క్రికెట్, ఫుట్బాల్ లాంటివి మినహాయిస్తే). 99 ఏళ్ల వయసులోనూ కొందరు తాతలు, బామ్మలు పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ 2022లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన 64 ఏళ్ల మహిళా ప్లేయర్ స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్ చాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్ చరిత్రలో ఒక మ్యాచ్లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె జత కట్టింది ఎవరితో తెలుసా.. తన కన్నకొడుకు మిషా జిల్బర్మన్. అవునండీ స్వెత్లానా, మిషా జిల్బర్మన్లు తల్లి కొడుకు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్లో ఇజ్రాయెల్కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్మన్ ద్వయం.. ఈజిప్ట్కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్కు చేరుకున్నారు. మ్యాచ్లో తొలి సెట్ను తల్లి కొడుకు పోగొట్టుకున్నప్పటికి.. మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. ఇక 64 ఏళ్ల స్వెత్లానా.. ఆమె కొడుకు మిషా జిల్బర్మన్ను బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు అభినందనల్లో ముంచెత్తారు. ''64 ఏళ్ల వయసులో స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్లో మరో విజయాన్ని సాధించింది. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్లో తొలి మ్యాచ్ ఆడింది.ఈ విజయం మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్కు చెందిన స్వెత్లానా జిల్బర్మన్ 1986లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్డ్ డబుల్స్లో విజయాలు సాధించింది. #MondayMotivation At 6⃣4⃣ years old, Svetlana Zilberman 🇮🇱 has won her first #BWFWorldChampionships opening round match. 👏👏 She made her competition debut in 2⃣0⃣0⃣9⃣. 😮#Tokyo2022 📸 @badmintonphoto https://t.co/Ne3CgUTS9o pic.twitter.com/4odEEV3o5m — BWF (@bwfmedia) August 22, 2022 చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్కు -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్హాల్–లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్హాల్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
HAMBURG OPEN 2022: ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది. లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
వింబుల్డన్లో సంచలనం.. సెమీస్కు దూసుకెళ్లిన సానియా జోడీ
లండన్: వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్లు సంధించడంతో పాటు పవర్ఫుల్ ఫోర్హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్-నీల్ స్కుప్స్కీ.. ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్లోకి ప్రవేశించడంతో కెరీర్ను టైటిల్తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మహిళల డబుల్స్లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్లో 13వసారి..! -
క్వార్టర్స్లో సానియా జంట
లండన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో రౌండ్లో డోడిగ్ (క్రొయేషియా)–లటీషా చాన్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్ (క్రొయేషి యా) జంటకు వాకోవర్లభించింది. -
Deaflympics 2022: షేక్ జాఫ్రీన్, భవాని జోడీలకు పతకాలు ఖాయం
బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో షేక్ జాఫ్రీన్ (ఆంధ్రప్రదేశ్), భవాని కేడియా (తెలంగాణ) తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో షేక్ జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ (భారత్) జంట 6–1, 6–1తో టుటెమ్– ఎమిర్ (టర్కీ) జోడీపై నెగ్గగా... భవాని–ధనంజయ్ దూబే (భారత్) జోడీకి జర్మనీ జంట నుంచి ‘వాకోవర్’ లభించింది. -
Australian Open: మిక్స్డ్ డబుల్స్ విజేత.. డోడిగ్- క్రిస్టినా.. ప్రైజ్మనీ ఎంతంటే..
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్లో మ్లాడెనోవిచ్కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్ను సాధించింది. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్కు 155 పరుగులు.. అయినా! Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷 They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన సానియా పోరాటం.. క్వార్టర్స్లో నిష్క్రమణ
Sania Mirza-Rajeev Ram Lose Quarterfinals In Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ ఆస్ట్రేలియన్ జంట జేసన్ కుబ్లర్-జేమీ ఫోర్లిస్ చేతిలో 4-6, 6-7 తేడాతో పరాజయం పాలైంది. Thank you for the memories, @MirzaSania ❤️ The two-time #AusOpen doubles champion has played her final match in Melbourne.#AO2022 pic.twitter.com/YdgH9CsnF0— #AusOpen (@AustralianOpen) January 25, 2022 మ్యాచ్ ప్రారంభం నుంచి సానియా జోడీ అద్భుంగానే ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి అంతకుమించి రాణించడంతో తలవంచక తప్పలేదు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా శకం ముగిసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ను నెగ్గిన సానియా.. ఈ ఏడాది తన కెరీర్కు ముగింపు పలుకనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం -
మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా జోడి శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్కు గుడ్బై చెప్పనున్న సానియా మీర్జా టోర్నీలో శుభారంభం చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- రాజీవ్ రామ్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో వీరి జోడి సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా క్రూనిక్- నికోలా కాకిక్ జోడిపై 6-3,6-7(3) తేడాతో నెగ్గి రెండో రౌండ్లో అడుగెపెట్టింది. కేవలం 69 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన సానియా మీర్జా జోడి తొలి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం -
సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట సంచలనం
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 178వ ర్యాంక్లో ఉన్న సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 21–11, 22–20తో ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను బోల్తా కొట్టించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండో గేమ్లో సిక్కి–ధ్రువ్ జోడీ 15–19తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సిక్కి–ధ్రువ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... వెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 15–21, 16–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) 15–21, 12–21తో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ వరల్డ్ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 21–18, 15–21, 21–16తో క్రిస్టోవ్ పొపోవ్ (ఫ్రాన్స్)పై... హెచ్ఎస్ ప్రణయ్ 22–20, 21–19తో డారెన్ లియు (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ 10–21, 19–21తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 14–21, 20–22తో హిరెన్ రుస్తావితో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్లో అవుట్ మిక్స్డ్ డబుల్స్లో విజయవంతమైన మనిక సింగిల్స్లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
ప్రిక్వార్టర్స్లో సానియా–బోపన్న జంట
లండన్: నాలుగేళ్ల విరామం తర్వాత వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్కే చెందిన రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్లో 6–3, 6–1తో ఐడన్ మెక్హగ్–ఎమిలీ వెబ్లీస్మిత్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సానియా ద్వయం ఐదు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీ స్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)లతో సానియా–బోపన్న ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్లో భార్యాభర్తలైన దివిజ్ శరణ్ (భారత్)–సమంత ముర్రే శరణ్ (బ్రిటన్) జోడీ 6–3, 6–7 (1/7), 3–6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–దరియా జురాక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది. మెద్వెదేవ్ తొలిసారి... పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) అద్భుత పోరాటపటిమ కనబరిచి గట్టెక్కాడు. మూడో రౌండ్లో మెద్వెదేవ్ 6–7 (3/7), 3–6, 6–3, 6–3, 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో మెద్వెదేవ్ 3 గంటల 36 నిమిషాల్లో గెలుపొందాడు. తొలి రెండు సెట్లు చేజార్చుకున్నాక మెద్వెదేవ్ కోలుకున్నాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 16 ఏస్లు సంధించిన మెద్వెదేవ్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. బార్టీ ముందంజ... మహిళల సింగిల్స్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో బార్టీ 6–3, 7–5తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. గంటా 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో బార్టీ ఎనిమిది ఏస్లు సంధించింది. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు మొదలవుతాయి. మంగళవారం నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల నుంచి వంద శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు... ఈ మేరకు ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు కేవలం పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లకే వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. -
‘రాకెట్’ దూసుకెళ్లింది...
మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 3–1తో సింగపూర్ను ఓడించింది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప గెలుపొంది భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలయ్యే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాతో భారత్ తలపడుతుంది. -
‘మిక్స్డ్’ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు అనుకున్న ఫలితం రాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో బోపన్న–తిమియా బాబోస్ (హంగేరి) జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచింది. గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)–మాట్ పావిక్ (క్రొయేషియా) ద్వయంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–బాబోస్ జంట 6–2, 4–6, 9–11తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓడిపోయింది. గతేడాది దబ్రౌస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి ఆమెను ప్రత్యర్థిగా ఎదుర్కొన్నాడు. చెరో సెట్ గెలిచిన తర్వాత నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో బోపన్న జంట 9–8తో మ్యాచ్ పాయింట్ సాధించినా... ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. విజేత దబ్రౌస్కీ–పావిక్ జంటకు లక్షా 75 వేలు (రూ. 90 లక్షల 30 వేలు), రన్నరప్ బోపన్న–బాబోస్ జోడీకి 90 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 46 లక్షల 44 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
గ్రాండ్ స్లామ్కు అడుగు దూరంలో
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి ఫైనల్కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 2-6, (10-5) తేడాతో ఆస్ట్రేలియా జంట సమంతా స్టోసుర్-సామ్ గ్రాత్ల జోడిపై గెలిచి తుది రౌండ్కు చేరింది. గంటా 18 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి చెమటోడ్చి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి సెట్ను కష్టపడి గెలవగా, రెండో సెట్ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్లో సానియా జోడి తన ఫామ్ను అందుకుంటూ స్టోసుర్ జంటను ఓడించింది. ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జంటను స్టోసుర్-గ్రాత్ల జోడి ఓడించి సెమీస్ కు చేరగా, రోహన్ బోపన్న-గాబ్రియాలా డబ్రోస్కి ద్వయంపై సానియా-డో్డిగ్ జో్డి విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా మహిళల డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగిస్ తో కలిసి సానియా సాధించగా, 2009లో ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను మహేశ్ భూపతితో కలిసి సానియా తొలిసారి సొంతం చేసుకుంది. -
మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-4 తేడాతో స్లెజిమండ్-పెవిక్ జోడిపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి ఆకట్టుకుంది. తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సానియా జంట.. రెండో సెట్ను సునాయాసంగా కైవసం చేసుకుంది. -
17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందిరాపార్క్ వేదికగా పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. గురువారం లోపు ఎంట్రీలు పంపించాలి. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9246365620, 9000225533 నంబర్లలో సంప్రదించవచ్చు. -
'భారత్కు కాంస్య పతకాన్ని సాధిస్తాం'
రియో డి జనీరో: భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో మిశ్రమ ఫలితం వచ్చింది. సానియా మిర్జా, రోహన్ బోపన్న జోడీ ఆదివారం తెల్లవారుజామున జరిగిన తొలి సెమీస్ పోరులో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం చేతిలో 2-6, 6-2, 10-3 (టై బ్రేక్) తేడాతో ఓటమి చెందింది. తొలి సెట్ ను సునాయాసంగా సొంతం చేసుకున్న సానియా-బోపన్న జోడీ రెండో రౌండ్ నుంచి తడబాటుకు గురైంది. దీంతో ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గిన అనుభవమున్న వీనస్ తన జోడీతో కలిసి చెలరేగిపోయింది. బోపన్న మీడియాతో మాట్లాడుతూ.. తొలి సెట్ కోల్పోయినా వీనస్ జోడీ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. ఈ క్రెడిట్ అంతా వీనస్ కే చెందుతుందన్నాడు. ముఖ్యంగా వీనస్ సర్వీస్ తమను ఇబ్బంది పెట్టిందని బోపన్న పేర్కొన్నాడు. ఓటమి నుంచి త్వరగా కోలుకుని కాంస్య పతకం నెగ్గడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మాట్లాడుతూ.. ఈ ఓటమి నుంచి కోలుకుని బరిలో దిగడం చాలెంజింగ్ గా ఉంటుందని పేర్కొంది. అయితే సాధ్యమైనంత త్వరగా మానసికంగా, శారీరకంగానూ కోలుకుని మరుసటి మ్యాచ్కు సిద్థంగా ఉంటామని చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మొదట స్కోరు చేసిన విషయాలు గుర్తించి, ఎక్కడెక్కడ పాయింట్లు కోల్పోయాయో వాటిని సరిదిద్దుకోవాలని అభిప్రాయపడింది. -
క్వార్టర్స్కు దూసుకెళ్లిన సానియా, బోపన్న
రియో ఒలింపిక్స్లో టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్, పీర్స్ జాన్ జోడీపై శుక్రవారం వేకువజామున జరిగిన పోరులో 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో సానియా, బోపన్న ద్వయం విజయం సాధించింది. రెండు సెట్లలోనూ ఆసీస్ జోడీ పోరాడినా సరైన సమయాలలో అనవసర తప్పిదాలకు దూరంగా ఉన్న భారత ద్వయాన్నే విజయం వరించింది. ఈ విజయంతో సానియా, బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. పురుషులు డబుల్స్ లో బోపన్న, పేస్ జోడీ, మహిళల డబుల్స్ లో సానియా జోడీ నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
‘టాప్’గా సెమీస్లోకి
♦ లీగ్ దశలో ఢిల్లీ ఏసర్స్కు అగ్రస్థానం ♦ చెన్నై, వారియర్స్, ముంబై కూడా ♦ సెమీస్లోకి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ బెంగళూరు: అగ్రశ్రేణి విదేశీ క్రీడాకారుల నిలకడైన ప్రదర్శన కారణంగా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఢిల్లీ ఏసర్స్ జట్టు అగ్రస్థానాన్ని సంపాదించింది. ఆరు జట్లు పాల్గొన్న లీగ్ దశ పోటీలు బుధవారం ముగిశాయి. నిర్ణీత 25 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఏసర్స్ 20 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఢిల్లీతోపాటు అవధ్ వారియర్స్ (లక్నో), చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్ జట్లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో ఢిల్లీ ఏసర్స్ 5-0 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్ను చిత్తు చేయగా... చెన్నై స్మాషర్స్ 4-1 పాయింట్ల తేడాతో బెంగళూరు టాప్గన్స్పై గెలిచింది. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్గన్స్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్లో అక్షయ్ దేవాల్కర్-అపర్ణ బాలన్ (ఢిల్లీ) జంట 13-15, 11-15తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జోడీ చేతిలో ఓడిపోయి 0-1తో వెనుకబడింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో పీసీ తులసీ 15-11, 8-15, 15-13తో గద్దె రుత్విక శివాని (ముంబై)పై గెలిచింది. ముంబై పేర్కొన్న ట్రంప్ మ్యాచ్లో ఢిల్లీ నెగ్గడంతో ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరగా... ముంబై ఒక పాయింట్ను చేజార్చుకుంది. దాంతో ఢిల్లీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్లో ఇండోనేసియా స్టార్ ప్లేయర్ టామీ సుగియార్తో 15-8, 15-6తో హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై)ను ఓడించడంతో ఢిల్లీ ఆధిక్యం 2-0కు పెరిగింది. పురుషుల డబుల్స్లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హెంగ్ ద్వయం 11-15, 15-12, 15-10తో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటపై నెగ్గడంతో ఢిల్లీ 3-0తో ముందంజ వేసింది. ఇక తాము ఎంచుకున్న పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు రాజీవ్ ఉసెఫ్ 15-7, 15-10తో గురుసాయిదత్ (ముంబై)పై గెలుపొందడంతో ఢిల్లీ 5-0తో భారీ విజయాన్ని దక్కించుకుంది. సింధు అజేయం బెంగళూరు టాప్గన్స్తో జరిగిన పోటీలో పురుషుల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో సోనీ ద్వి కున్కురో 15-10, 10-15, 15-8తో సమీర్ వర్మను ఓడించి చెన్నై స్మాషర్స్కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. పురుషుల డబుల్స్లో హూన్ థియెన్ హౌ-నీల్సన్ ద్వయం 15-7, 15-8తో క్రిస్ అడ్కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జంటపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల రెండో సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 15-4, 15-12తో బ్రైస్ లెవెర్డెజ్పై గెలుపొందడంతో బెంగళూరు 2-2తో స్కోరును సమం చేసింది. అయితే మహిళల సింగిల్స్లో పీవీ సింధు 15-12, 15-7తో ది సుయోపై నెగ్గడంతో చెన్నై స్మాషర్స్ 3-2తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ లీగ్లో సింధు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. బెంగళూరు టాప్గన్స్ ఎంచుకున్న మిక్స్డ్ డబుల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో క్రిస్ అడ్కాక్-పియా జెబాదియా ద్వయం 15-14, 15-12తో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (బెంగళూరు) జంటపై నెగ్గడంతో చెన్నై స్మాషర్స్ 4-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి తొలి సెమీఫైనల్ ఢిల్లీ ఏసర్స్ ్ఠ చెన్నై స్మాషర్స్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం రెండో సెమీఫైనల్ (శుక్రవారం) అవధ్ వారియర్స్ ్ఠ ముంబై రాకెట్స్ రాత్రి గం. 7.00 నుంచి హైదరాబాద్లో -
రాయల్స్ను ఆదుకున్న ఫెడరర్
సింగపూర్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన అద్భుత ఆటతీరుతో యూఏఈ రాయల్స్ను ఆదుకున్నాడు. దీంతో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సింగపూర్ స్లామర్స్ను 27-23 తేడాతో యూఏఈ ఓడించింది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న తమ జట్టును... చివరి సింగిల్స్లో ఫెడరర్ 6-4 తేడాతో వావ్రింకాను ఓడించి గట్టెక్కించాడు. అంతకుముందు మ్యాచ్ల్లో ఇవాన్సెవిచ్ (రాయల్స్) 6-4తో కార్లోస్ మోయా (స్లామర్స్)ను, మహిళల సింగిల్స్లో మ్లదెనోవిక్ (రాయల్స్) నెగ్గగా.. మిక్స్డ్ డబుల్స్లో డస్టిన్ బ్రౌన్, ప్లిస్కోవా (స్లామర్స్) జోడి ఫెడరర్, మదెనోవిక్ను ఓడించడంతో స్కోరు 15-15తో సమమైంది. అయితే పురుషుల డబుల్స్లో ఫెడరర్, నెస్టర్ 6-4తో వావ్రింకా, మార్సెలో మెలోను ఓడించడంతో రెండు పాయింట్ల ఆధిక్యం పొందింది. ఇక చివరి మ్యాచ్లో ఫెడరర్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతర మ్యాచ్లో జపాన్ వారియర్స్ 29-15తో ఫిలిప్పై న్స్ మావెరిక్స్ను ఓడించింది. పురుషుల సిం గిల్స్లో సఫిన్ (వారియర్స్) 6-3తో బ్లాక్ను ఓడించి వారియర్స్కు ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్లో కురుమి (వారియర్స్) 6-1తో గజ్దోసోవాపై.. మిక్స్డ్ డబుల్స్లో పేస్, బరోని జంట 6-2తో గజ్దోసోవా, రోజర్ వాసెలిన్పై గెలిచారు. పురుషుల డబుల్స్లో మావెరిక్ జోడి వాసెలిన్, ట్రీట్ హ్యూ 6-5తో పేస్, లూసిక్పై గెలిచినా.. చివరి పురుషుల సింగిల్స్ లో హెర్బట్ 6-3తో కార్లోవిచ్ను ఓడించి వారి యర్స్కు రెండో విజయాన్ని అందించాడు. -
మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా-సోర్స్ జోడీ తొలిరౌండ్లోనే ఓటమి పాలైంది. అన్సీడెడ్ ఆండ్రియా-లూకాజ్ జోడి చేతిలో 6-3, 6-3 తేడాతో సానియా-సోర్స్ లు ఓటమి చవిచూశారు. ఇదిలాఉండగా.. ఢిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్కు చేరుకుంది. మూడో రౌండ్లో మాటెక్ సాండ్స్ పై 3-6, 7-5, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది. మహిళల డబుల్స్లో సానియా(భారత్)-మార్టినా(స్విట్జర్లాండ్) ద్వయం రెండో రౌండ్ చేరుకున్న విషయం విదితమే. -
నిరాశపరిచిన భారత రెజ్లర్లు
ఇంచియాన్:ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్లో మాత్రం నిరాశ పరిచారు. కృష్ణకాంత్ యాదవ్ కాంస్య పతక పోరులో 0-3తో ఇరాన్ రెజ్లర్ సయూద్ చేతిలో ఓడాడు. ఇక రవీందర్ సింగ్, హర్ప్రీత్ సింగ్ క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఓడి ఇంటిదారి పట్టారు. ఇదిలా ఉండగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్లో భారత జోడీలు శరత్ కమల్- ఆంథోని అమల్రాజ్, హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ తమ ప్రత్యర్థులపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్లో అమల్రాజ్-మాధురిక ద్వయుం, జపాన్ జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ లో మైరాజ్ అహ్మద్ ఖాన్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో తను ఐదో స్థానంలో నిలిచాడు. -
సానియా మీర్జాకు ఘన స్వాగతం
-
సానియా జోడీకి యూఎస్ మిక్స్ డ్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను తొలిసారి సానియా మీర్జా జోడీ కైవసం చేసుకుంది. యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో టాప్ సీడ్స్ సానియా మిర్జా, బ్రూనో సోరెస్ లు 6-1, 2-6, 11-9 తేడాతో అబిగెయిల్ స్పియర్, శాంటియాగో గోంజలెజ్ లపై విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకున్నారు. తొలి సెట్ ను అవలీలగా కైవసం చేసుకున్న సానియా జోడీ.. రెండో సెట్ ను కోల్పోయింది. అయితే గేమ్ ను నిర్ణయించే మూడో సెట్ ను సానియా జోడీ తిరిగి కైవసం చేసుకుని యూఎస్ టైటిల్ ను ఎగురువేసుకుపోయారు. ఈ జోడీ సెమీఫైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్ లపై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ట్రోఫీని సొంతం చేసుకోవడం సానియాకు తొలిసారే అయినా.. ఇంతకుముందు రెండు సార్లు మిక్స్ డ్ విభాగంలో టైటిల్ సాధించింది. 2012 జూన్ 7 వ తేదీన ఇదే విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్న సానియా.. అంతకముందు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను కూడా తనఖాతాలో వేసుకుంది. -
యూఎస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నిలో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్స్ సానియా మిర్జా, బ్రూనో సోరెస్ లు ఫైనల్ చేరుకున్నారు. సెమీ ఫైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్ పై 7-5, 4-6, 10-7 తేడాతో విజయం సాధించారు. ఫైనల్లో సానియా జట్టు అన్ సీడెడ్ జంట అబిగెయిల్ స్పియర్, శాంటియాగో గోంజలెజ్ లతో తలపడనున్నారు. యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. సెమీ ఫైనల్ మ్యాచ్ లో సానియా జట్టుకు అభిగెయిల్, శాంటియాగోలు గట్టి పోటిని ఇచ్చారు. తొలి సెట్ లో విజయం సాధించిన సానియా, బ్రూనోలకు రెండవ సెట్ లో గట్టి షాక్ తగిలింది. చివరి సెట్ లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. -
జ్వాల జోడికి వాకోవర్
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ కోపెన్హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావోను ఎదుర్కొంటారు. గతంలో వీరితో తలపడిన ఆరు సార్లూ భారత జంట ఓటమిపాలైంది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్లో మాత్రం భారత్కు చెందిన అశ్విని పొన్నప్ప-తరుణ్ కోన జోడి తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట అండర్స్ క్రిస్టియన్సెన్-జూలీ హౌమన్ (డెన్మార్క్) 21-16, 27-25తో అశ్విన్-తరుణ్పై విజయం సాధించింది. -
నటుల కంటే కథలు కీలకం
పెద్ద నటుల కోసం కథలను ఫణంగా పెట్టి మార్పులు చేయడం తనకు ఎంతమాత్రమూ ఇష్టముండదని నటుడు, దర్శకుడు రజత్ కపూర్ అంటున్నాడు. కథే తన సినిమాకు నాయకుడని చెప్పాడు. దర్శకుడిగా రఘు రోమియో, మిక్స్డ్ డబుల్స్, మిథ్య వంటి సినిమాలు ఇతనికి మంచి పేరు తెచ్చాయి. ‘నేను తరచూ సినిమాలు తీసే దర్శకుణ్ని కాదు. స్క్రిప్టు రాయడానికి చాలా సమయం తీసుకుంటాను. మననిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలే ప్రధానాంశంగా నా కథలు ఉంటాయి. ఇవన్నీ సామాన్యుల కోసమే. ఎవరైనా ప్రధాన పాత్ర పోషించవచ్చు. పెద్ద తారల కోసం కథల్లో మార్పులు చేయను’ అని స్పష్టంగా చెప్పాడు. రజత్ తాజాగా ఢిల్లీ నగరం నేపథ్యంగా సాగే ఆఖో దేఖీ సినిమా తీస్తున్నాడు. ఈ హాస్యసినిమా రాజే బావుజీ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రతిరోజూ తాను ఎదుర్కొనే అనుభవాలను దూరంగా ఉండే కుటుంబ సభ్యులతో పంచుకోవడాన్ని ఇందులో చూడవచ్చు. దీని కథ రాయడానికి రజత్కు ఎనిమిదేళ్లు పట్టింది. ‘మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అయితే మన కళ్లతో చూసి లేదా అనుభవించిన వాటిని మాత్రమే నమ్ముతాం. ఇలాంటి కథలు ఎంతో మందికి తట్టిఉంటాయి. ఇది హాస్యంతో కూడిన తాత్విక, కుటుంబ సినిమా’ అని వివరించాడు. ఇందులో ప్రధానపాత్రలో సంజయ్మిశ్రా, రజత్ కనిపిస్తారు. సంజయ్ను దృష్టిలో ఉంచుకొనే ఈ కథ తయారు చేశానని, అతని నటన ఎంతో సహజంగా ఉంటుందని ప్రశంసించాడు. ఆఖో దేఖీని పూర్తిగా ఢిల్లీలోనే తీశారు. ఇది ఈనెల 21న థియేటర్లకు వస్తోంది. తను పుట్టిపెరిగింది పాతఢిల్లీలోనే కాబట్టి సినిమా షూటింగ్ అంతా అక్కడే జరిగిందని, ఇందుకోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నామని చెప్పాడు. దిల్ చాహతా హై, కార్పొరేట్, మాన్సూన్ వెడ్డింగ్, భేజాఫ్రై, దస్విదానియా సినిమాల్లో రజత్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. -
ప్రత్యేక కారణాలు లేవు
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లతో కలిసి ఆడకపోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలేమీ లేవని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. గతంలో కలిసి ఆడినా ప్రస్తుతం కుదరడం లేదని చెప్పింది. అయితే సీజన్ తొలి గ్రాండ్స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్లో హోరియా టెకావ్ (రొమేనియా) తోనే కలిసి బరిలోకి దిగుతానని వెల్లడించింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తమ జోడి ఈ టోర్నీ వరకు కొనసాగుతుందని తెలిపింది. ‘టెకావ్ ప్రపంచస్థాయి డబుల్స్ ప్లేయర్. బ్యాక్హాండ్, భారీ సర్వీస్లు చేయగల సమర్థుడు. మూడు టోర్నీల్లో కలిసి ఆడాలని మేం ముందుగానే అనుకున్నాం. కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్ వరకు మా జోడి కొనసాగుతుంది. మిగతా అంశాలను తర్వాత నిర్ణయించుకుంటాం. క్లే కోర్టుల్లో టెకావ్ మంచి ఆటగాడే అయినా ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఇప్పుడే చెప్పలేను’ అని సానియా వ్యాఖ్యానించింది. -
జ్వాలపై ప్రేక్షకుల అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఆదివారం బంగా బీట్స్తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు జ్వాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి తీవ్ర మనస్తాపం చెందింది. మ్యాచ్ ముగిశాక ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఐబీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఎవరికి వారు సభ్యత నేర్చుకోవాలని సూచించింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితి క్రికెటర్లకు వస్తే మైదానంలో వారు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాం. కానీ నేను కోర్టులో ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. మ్యాచ్ తర్వాతే నా ఆవేదన తెలిపాను. ఈరోజుల్లో ఎవరికి వారు చాలా బిజీగా మారిపోతున్నాం. అందుకే మనం పిల్లలకు కనీస విలువలు, మానవత్వం గురించి చెప్పడం మర్చిపోతున్నాం. మహిళల పట్ల భారత సమాజం ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో భారత్ ఎలా దూసుకెళుతుందో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు మీలో సంకుచిత మనస్తత్వాన్ని తెలుపుతాయి. డాక్టర్గానో ఇంజినీర్ గానో కావడం ముఖ్యం కాదు. ఎవరి పిల్లలకు వారు మంచి సంస్కృతిని నేర్పితే చాలు’ అని జ్వాల పేర్కొంది.