Mohanbabu
-
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్బాబు (Mohanbabu).. మనోజ్ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు)మనోజ్తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ఇంటి నుంచి మనోజ్ను బయటకు పంపాలంటూ మోహన్బాబు ఫిర్యాదు
మోహన్బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్కు నోటీసులు ఇచ్చారు.మోహన్బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్బాబు ఫామ్హౌస్ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్బాబు మెజిస్ట్రేట్ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్ స్టేషన్ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.ఏం జరిగిందంటే? మనోజ్, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్ స్కూల్కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో -
మంచు మనోజ్ అభిమానులపై మోహన్బాబు బౌన్సర్ల దాడి
నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. తిరుపతిలో మోహన్బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ క్యాంపస్లోకి మనోజ్ (Manchu Manoj)- మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు. మనోజ్ వస్తాడన్న సమాచారంతో యూనివర్సిటీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు. సెక్యురిటీ సిబ్బంది ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. మోహన్బాబు, విష్ణు (Manchu Vishnu) యూనివర్సిటీ వద్దే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా మెహరించారు. క్యాంపస్కు చేరుకున్న మంచు మనోజ్ను సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. అవ్వ, తాతల సమాధుల వద్దకు అనుమతించరా, గేట్లు తియ్యండి అంటూ కేకలు పెట్టాడు. ఈ క్రమంలో అవ్వ, తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు గేట్లు ఎక్కిన మనోజ్ అభిమానులపై మోహన్బాబు బౌన్సర్లు దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికీ గాయాలయ్యాయి.ఏం జరిగిందంటే?కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే! విష్ణు- మనోజ్కు మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. తండ్రితో సైతం గొడవలు తారా స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే మోహన్బాబు.. విష్ణుతో కలిసి తిరుపతిలో సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు. అటు మనోజ్.. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్తేజ్తో సంక్రాంతి జరుపుకున్నాడు.ఫ్లెక్సీల దగ్గర మొదలైన గొడవ?పండగ సందర్భంగా మోహన్బాబు యూనివర్సిటీ నుంచి నారావారిపల్లె మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రికి రాత్రి మనోజ్కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారట! ఈ నేపథ్యంలోనే మనోజ్.. యూనివర్సిటీకి ప్రయాణమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనోజ్ కాలేజీలోకి రావొద్దంటూ మోహన్బాబు ఇదివరకే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతిచ్చింది. అనుమతి లేదని చెప్పినా..అటు పోలీసులు సైతం మనోజ్కు నోటీసులు జారీ చేశారు. శాంతిభ్రదతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థాన ఉత్తర్వులను మనోజ్కు అందజేశారు. దీంతో యూనివర్సిటీ లోపలకు వెళ్లకుండానే మనోజ్ నారావారి పల్లెకు చేరుకున్నాడు. అక్కడ మంత్రి లోకేశ్తో భేటీ అయ్యాడు. ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్తో చర్చించినట్లు సమాచారం. అనంతరం అభిమానులతో కలిసి మళ్లీ క్యాంపస్కు చేరుకున్నాడు.చదవండి: నెట్ఫ్లిక్స్లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే! -
మంచువారి అమ్మాయిలు..అరీ & వివీ హ్యాపీ బర్త్డే: తాతను మించిపోతారా!(పోటోలు)
-
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
అర్ధరాత్రి అర్జంట్గా రూ.5 లక్షలు కావాలని అడిగా: మనోజ్
రామ్చరణ్ బర్త్డేను పురస్కరించుకుని అతడి తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ బుధవారం నాడు (మార్చి 27న) అన్నదానం చేశారు. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంచెలంచెలుగా ఎదిగిన చరణ్ను కొనియాడుతూ ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. చరణ్కు ఉన్న గొప్ప గుణం.. మనోజ్ మాట్లాడుతూ.. 'నా ప్రాణ స్నేహితుడు రామ్చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు చెన్నైలో అందరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మేమంతా కలిసి ఉండేవాళ్లం. చిన్నప్పటినుంచి చరణ్కు ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే.. కష్టాల్లో ఉన్నానంటూ ఎవరైనా వస్తే వారికి సాయం చేస్తుంటాడు. ఈ రోజుల్లో అంత పెద్ద మనసు ఎవరికీ ఉండదు. చరణ్ స్నేహితుడిగా తన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. తెలుగింటి పిల్లకు కష్టం ఈ రోజుల్లో విలువైనది స్నేహం. అతడు తన చిన్ననాటి స్నేహితుల నుంచి ఇప్పటి ఫ్రెండ్స్ వరకు అందరితోనూ టచ్లో ఉన్నాడు. స్నేహానికి అంత విలువిస్తాడు. ఒకసారి ఏమైందంటే? దుబాయ్లో ఒక తెలుగింటి ఆడపిల్లకు కష్టమొచ్చింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి చరణ్కు ఫోన్ చేశాను. మిత్రమా, దుబాయ్లో ఓ ఆడపిల్ల చిక్కుకుపోయింది. చిరంజీవి, మోహన్బాబు మధ్యలోకి వెళ్లకూడదు నా వంతు నేను చేశాను. ఐదు లక్షలు తక్కువయ్యాయిరా.. ఏం చేయాలిరా? అని అడిగాను. వెంటనే అకౌంట్ నెంబర్ పంపించు అని క్షణంలో డబ్బు పంపించాడు. అంత గొప్పవాడు. మీ నాన్నలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎలా కలిసుంటారని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలోకి మనం ఎప్పుడూ వెళ్లకూడదు. వాళ్లిద్దరు కూడా అంతే.. కొట్టుకుంటారు, కలిసిపోతారు. క్యూట్ టామ్ అండ్ జెర్రీలాగా! పొరపాటున కూడా వాళ్ల మధ్య మనం దూరకూడదు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు. -
చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్ బాబు ఏం అన్నారంటే
టాలీవుడ్ మెగాస్టార్కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. మెగాస్టార్కు అవార్డు ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు రియాక్ట్ అయ్యారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నానని మోహన్ బాబు తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. భారీ వేడుకకు ప్లాన్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిరు ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ఇంతటి శుభ సందర్భంగా మెగాస్టార్ కోసం చిత్ర పరిశ్రమ నుంచి ఒక వేడుకను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ వివరాలు త్వరలో చెబుతామని దిల్ రాజు చెప్పారు. Congratulations to my dear friend @KChiruTweets on this well-deserved honor! We are all very proud of you for receiving the award. — Mohan Babu M (@themohanbabu) January 26, 2024 Woke up to the fantastic news on Sri. @KChiruTweets garu winning the prestigious #PadmaVibhushan! What a proud moment for Telugu Film Industry! Congratulations @KChiruTweets Garu 💪🏽👌❤️ — Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2024 -
ఏ ధైర్యంతో సినిమాలు చేస్తున్నారు అని ప్రశ్నించిన మోహన్బాబు
-
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. స్పీచ్ వైరల్
విలక్షణ నటుడు మోహన్బాబు క్రమశిక్షణకు మారుపేరు. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. బుధవారం (సెప్టెంబర్ 20) నాడు తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు మోహన్బాబు హాజరయ్యారు. ఈ క్రమంలో తన పక్కనే కూర్చున్న జయసుధ అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా ఫోన్ చూస్తూ ఉంది. ఫోన్తో జయసుధ ఆటలు దీంతో మోహన్బాబు ఈ సమయంలో ఫోన్ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏఎన్నార్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ వంక చూడటం కరెక్ట్ కాదు కదా.. మోహన్బాబు చేసింది కరెక్టేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చొక్కా చించుకుని వెళ్లా ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మోహన్ బాబు ప్రసంగిస్తూ.. 'ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని. మళ్లీ ఆ చొక్కా కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అటువంటిది ఆయన నటించిన మరపురాని మనిషి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఆ తర్వాత ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఓసారి నాగేశ్వరరావు- అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు నేను వెళ్లాను. ఆమె నన్ను చూసి ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించిస్తే ఆయన కసురుకున్నారు. నా కోరిక తీర్చారు వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా? వాడికి ముందే పొగరు. ఎందుకు? వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కోప్పడ్డారు. తర్వాతి రోజు నేను సెట్కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడో విషయం చెప్పాను.. నాకు ఓ కోరికుంది సార్.. ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు సెట్కు వెళ్తే దాసరి, ఏఎన్నార్.. ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా ఆయనతో ఎన్నో సరదా సంఘటనల అనుభూతులున్నాయి. ఏఎన్నార్ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషం' అని చెప్పుకొచ్చారు. ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe — Actual India (@ActualIndia) September 20, 2023 చదవండి: స్టేజీపై యాంకర్తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
రేపే ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్లుక్..
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి సన్నాఫ్ ఇండియా రెడీ అయ్యారు. సన్నాఫ్ ఇండియా ఎలా ఉంటారో చిన్న లుక్ ద్వారా పరిచయం చేస్తారట. మోహన్బాబు హీరోగా తెరకెక్కుతున్న సోషల్ డ్రామా ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు, లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజాన్ని సరిదిద్దాలని ప్రయత్నించే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్బాబు కనిపిస్తారని టాక్. ఈ సినిమాకు మోహన్బాబు స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. -
అనుమతులకు టైమ్ పడుతుంది
సూర్య హీరోగా మోహన్బాబు, అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రదారులుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్డెక్కన్ అధినేత జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తమిళంలో ‘సూరరై పోట్రు’ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మొదట్నించి తన కెరీర్కు అండగా ఉన్న అభిమానులతో ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు సూర్య. ‘‘ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయని లొకేషన్లలో షూటింగ్ చేయటం, భిన్న భాషలకు చెందిన వ్యక్తులతో పని చేయటం మాత్రమే మా ముందున్న సవాళ్లని అనుకున్నాను. వైమానికరంగం నేపథ్యంలో జరిగే కథ అని తెలిసిందే. నిజమైన ఇండియన్ యుద్ధవిమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వచ్చింది. యన్.ఓ.సి (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) లు ఇంకా రావలసి ఉంది. అందుకే కొన్ని అనుమతుల కోసం ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇప్పుడున్న కరోనా కాలంలో మిగతా అన్ని విషయాలకంటే దేశం తాలూకు ప్రాధాన్యాల మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది. సినిమా విడుదలయ్యేలోపు ట్రైలర్ను, ఈ లెటర్తో పాటు మన స్నేహం, ప్రేమానురాగాలకు గుర్తుగా ఫ్రెండ్షిప్ సాంగ్ను అందిస్తున్నా’’ అన్నారు సూర్య. ఈ చిత్రాన్ని సూర్య, గునీత్ మోంగా నిర్మించారు. -
కంగ్రాట్స్ డాడీ: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైనట్లు వెల్లడించింది. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్పై మోహన్బాబు, ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (చదవండి: 'బిల్లా-రంగా' రీమేక్లో వారసులు) ఇక మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్బాబుకు ఆమె స్టైలింగ్ చేయనున్నారు. కాగా ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా, మోహన్బాబు తనయ, నటి మంచు లక్ష్మి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కంగ్రాట్స్ డాడీ! ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయింట్గా ఎదురు చూస్తున్నా! బెస్ట్ ఆఫ్ లక్, నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తారు’’అంటూ ట్వీట్ చేశారు. Congrats Daddy! I am so so so excited for this one, can't wait for the curtain to raise and gaze at your exceptional performance! Best of Luck to you, I know you're going to rock it!🥰✨🥳#LakshmiManchu #MohanBabu #SonOfIndia #LakshmiUnfiltered #ComingSoon #24Frames — Lakshmi Manchu (@LakshmiManchu) October 23, 2020 For the first time @vinimanchu (@iVishnuManchu 's better half) styling for Collection King Dr. @themohanbabu with #SonOfIndia. Directed by @ratnababuwriter Maestro #Ilaiyaraaja Musical. 🎶@LakshmiManchu @HeroManoj1 #SrilakshmiprasannaPuctures @24FramesFactory #SOI pic.twitter.com/c424pOwR01 — BARaju (@baraju_SuperHit) October 23, 2020 -
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్బాబు అన్నారు. మోహన్బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
మోహన్బాబు న్యూలుక్.. చిరు కోసమే..!
టాలీవుడ్ కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్బాబు న్యూలుక్కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవీ సినిమా కోసమే ఆయన న్యూలుక్తో ఫోటోషూట్లో పాల్గొన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోహన్బాబు నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. చిరు సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్బాబును కొరటాల శివ కలిశాడని, దానికి ఆయన అంగీకరించారని టాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన మోహన్బాబు న్యూలుక్ ఫోటోలు పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. చిరు సినిమా కోసమే ఆయన కొత్త లుక్లో ఫోటోషూట్ చేశారని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఆయన లుక్ను ప్రశంసిస్తున్నారు. కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బిల్లా రంగా’,‘పట్నం వచ్చిన ప్రతివతలు’మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్బాబు విలన్గా నటించారు. ప్రస్తుతం మోహన్బాబు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఆకాశం నీ హద్దురాలో నటిస్తున్నారు. -
సంక్రాంతి సంబరాలు: రంకెలేసిన ఉత్సాహం
సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు. మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది. ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం పందేలను తిలకించిన మోహన్బాబు పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్ అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్ తిలకించారు. మోహన్బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మాంబేడులో.. వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. -
దైవ సన్నిధానంలో శ్రీ స్వరూపానందేంద్ర
సాక్షి, హైదరాబాద్ : విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం ఫిలిం నగర్ దైవ సన్నిధానాన్ని సందర్శించి పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, శ్రీమతి సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ - ‘రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు. నేను రజినీకాంత్ గారు ఒక సారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి వైజాగ్ లోని శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం ని దర్శించుకోవాల్సిందిగా మనవి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి భాద్యతలు ఇవ్వడం మంచి పరిణామం. వారికి దాదాపు భారతదేశం లో 108 మఠాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు ఫిలిం నగర్ దైవసన్నిదానానికి ఎల్లవేళలా ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఫిలిం నగర్ దైవసన్నిధానంలో సినిమా వారు ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం 21 సంవత్సరాలుగా అవిశ్రామంగా కృషి చేస్తుంది. మా పీఠానికి శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు ఎంతో చేయూత నిస్తున్నారు. ఆయన నేను లేకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరు. నా తరువాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించడం జరిగింది. ఫిలిం నగర్ దైవసన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది’ అన్నారు. కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఫిలిం నగర్ దైవసన్నిధానం ఎల్లప్పుడూ కలకలడానికి కారణం భారత దేశంలో అతి తక్కువ సమయంలోనే అన్ని చోట్లా పీఠాలను నెలకొల్పిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహా జ్ఞాని. ఆయన నాకు చాలా కాలంగా పరిచయం. నేను గత 27 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసిన వారు, వారి ఆశీస్సులు నాతోనే ఉంటాయి’ అన్నారు. శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ‘మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళక్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ ఫిలిం నగర్ దైవసన్నిధానం తో చాలా అభినాభావ సంభందం ఉంది. రెండు సంవత్సరాల క్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్ట మైన ప్రదేశం. అక్కడ జవాన్లు మాత్రమే ఉండగలరు. అక్కడ కూడా తెలుగు వారు వచ్చి ఫిలిం షూటింగ్ లు జరుపుతున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందం ఇవ్వడం కోసం అంత కస్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది’ అన్నారు. -
మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్..
సాక్షి, హైదరాబాద్ : ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని, సీనియర్ నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఆయన ఓ పత్రికప్రకటనను విడుదల చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్ మోహన్రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని, దీంతో ప్రజలు ఆశీస్సులు అందజేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. కచ్చితంగా ప్రజలకు జగన్ మేలు చేస్తారని, మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని అభివర్ణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీకి 130స్థానాలు ఖాయం
రేణిగుంట (చిత్తూరు): ఈనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్బాబు అన్నారు. కుమారుడు మంచు విష్ణుతో కలిసి శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసమర్థ పాలనతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఆయన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాద్రి, రైతు విభాగం నేతలు ఆదికేశవులరెడ్డి, హైకోర్టు న్యాయవాది పేరూరు మునిరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు అన్నా రామచంద్రయ్య యాదవ్, వై.సురేష్, ఎన్వీ సురేష్, నైనారు మధుబాల, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు
-
బాబూ.. నీపై ఉన్న కేసుల సంగతేంటి
సాక్షి, భీమవరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా మంచివారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రముఖ సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ ధ్వజమెత్తారు. భీమవరంలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడో వ్యక్తులను కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామకృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని, దీనిని గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు. నిత్యం జగన్పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి ఎన్నికల సభల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడన్నారు. గత ఐదేళ్లుగా తాను ప్రజలకు ఏం చేశానో చెప్పడం లేదని మోహన్బాబు విమర్శించారు. మూడెకరాల ఆసామికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాకున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ సోదరి షర్మిళను కించపర్చే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు సభ్యత లేదంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చి పూర్తిగా మోసం చేశాడని, పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో గ్రంధి శ్రీనివాస్, కనుమూరు రఘురామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, తోట భోగయ్య, రాయప్రోలు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనం, సభలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీహీరో మోహన్బాబు, చిత్రంలో గ్రంధి శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు -
శత్రువుకు సాయం చేసే వ్యక్తి ఆయన : మంచు విష్ణు
సాక్షి, చంద్రగిరి: శత్రువుకు సైతం సాయంచేసే మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ, నటుడు మంచు విష్ణు కొనియాడారు. మంగళవారం రాత్రి ఆయన మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీలో రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. 27 ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నామన్నారు. ఏనాడు తాము రాజకీయాలపై ఆసక్తి చూపలేదని తెలిపారు. అలాంటి తమ సంస్థపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.19కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసినా నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీవిద్యానికేతన్ను నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల మందికి మోహన్బాబు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందికి ఉపాధి కల్పిం చారో ఆలోచించాలని సూచించారు. వైఎస్ హయాంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను తీసుకొచ్చారన్నారు. వాటిని అమలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మాజీ సర్పంచ్ కొటాల పద్మజ, ఎంపీటీసీ సభ్యురాలు పుష్పలత, రాజేంద్రప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు కొటాల చంద్రశేఖర్రెడ్డి, సంస్థల ఏఓ సుదర్శన్నాయుడు పాల్గొన్నారు. -
టీడీపీ ఎన్టీఆర్ది.. హెరిటేజ్ ఫుడ్స్ నాది..
సాక్షి, అమరావతి : చంద్రబాబుది అంతా కరివేపాకు పాలసీ. యూజ్ అండ్ త్రో. అదే ఆయన క్యారెక్టర్. ఎన్టీ రామారావు సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. నాకు చేసిన మోసం అదో చరిత్ర. హెరిటేజ్ ఫుడ్స్ నాది.. నాది.. నాది ఎక్కువ శాతం. చంద్రబాబు, నేను, దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించాం. నేను ప్రధాన భాగస్వామిని. అంటే నాది ఎక్కువ పెట్టుబడి. చంద్రబాబుది తక్కువ పెట్టుబడి. దాగా అనే అయనది మరికొంత తక్కువ పెట్టుబడి. స్థాపించిన కొన్నాళ్ల తరువాత చంద్రబాబు కొన్ని బ్లాంక్ పేపర్లు పంపించి సంతకాలు పెట్టమన్నారు. బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. అప్పట్లో నేను సినిమా హీరోగా అగ్రస్థానంలో ఉన్నాను. కెరీర్ పీక్స్లో ఉండటంతో చాలా బిజీగా ఉన్నాను. అప్పట్లో నాకు ఇన్ని విషయాలు కూడా తెలీవు. స్నేహితుడు అని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశాను. తరువాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారు. తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారి షాక్ తిన్నాను. కోర్టుకు వెళ్లాను. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశాను. ఓ సినిమా తీశాం. ఫెయిల్ అయ్యింది అనుకుని సరిపెట్టుకున్నాను. నా తరువాత దాగానూ అలాగే మోసం చేసి బయటకు పంపేశారు. హెరిటేజ్ సంస్థ విషయంలో చంద్రబాబు మమ్మల్నే కాదు రైతులను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. చంద్రబాబు ఏం చేశారో తెలుసా. కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసేవారు. ఆ డబ్బును తనకు తెలిసిన కొందరు రైతులకు ఇచ్చేవారు. వాళ్లు హెరిటేజ్ కంపెనీలో షేర్లు కొన్నట్టు చూపించేవారు. కొన్నాళ్లకు మళ్లీ ఆ షేర్లను తానే కొనుక్కున్నట్లు డ్రామా నడిపించారు. హెరిటేజ్ సంస్థలో వాటాలు పెట్టినట్టు గానీ వాటిని చంద్రబాబుకు అమ్మినట్టు గానీ ఆ రైతులకే తెలియకుండా వ్యవహారం నడిపారు. రైతులు ఇస్తే పన్నులు ఉండవు. అంత ఘోరాలు చేశారు. ఎన్టీ రామారావును మోసం చేసి టీడీపీని తీసుకున్నట్టుగా.. నన్ను మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారు. దాన్ని రూ.వేల కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం మీద తిరుపతిలో లేదా కాణిపాకంలో గానీ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా? -
ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు
-
ఎన్టీఆర్పై చెప్పులు వేయడం వాస్తవం : మోహన్బాబు
సాక్షి, మంగళగిరి : వైస్రాయ్ హోటల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు మంచు మోహన్బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. ఇది అన్నయ్య టీడీపీ కాదు.. ‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మహోన్నత వ్యక్తి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి. ఆయన మాట చెబితే అది వేదమే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కొన్నివేల మంది ప్రజలకు ఇళ్లు కట్టించారు. కాంగ్రెస్ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి.. పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసని సోనియాను వ్యతిరేకించారు. ఆ తర్వాతే వైఎస్సార్ మరణం చెందారు. దాని వెనుక అనేక అనుమానులున్నాయి. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయను ఆదరించి ముఖ్యమంత్రిని చేసుకుందా. మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కున్నారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారు. రైతులను దారుణంగా మోసం చేశారు. అప్పులు పాలు చేశారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులు ప్రజలకు తెలియకుండా దాచారు. నీ దగ్గరున్న ఎంపీలు అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారు. నీవెలా సత్య హరిశ్చంద్రుడివి అవుతావు చంద్రబాబు? వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయి? బాబుకు ఓటేస్తే ఆయన అనుకూల మీడియా, భూకబ్జాదారులు బాగుపడుతారు. వాళ్లు మళ్లి ప్రజల రక్తం తాగుతారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా? 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.’ అని మోహన్బాబు ప్రజలను కోరారు. -
ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్బాబు
సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్బాబు అన్నారు. శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్బాబుతో పాటు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దాసరి బయోపిక్ తీస్తే సహకరిస్తా దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు. -
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్బాబు
-
‘కొమ్ములు తిరిగిన నటుడైనా సరే.. ఆయన దగ్గరకు రావాల్సిందే’
సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్గా ఉన్న నన్ను కమెడియన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’ అని మోహన్బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు. కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి, ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి మోహన్బాబు విషెస్
బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో క్రిష్ తెరకెక్కించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ బుధవారం విడులైంది. భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఆకాక్షించారు. కొన్ని యాంగిల్స్లో బాలయ్య తండ్రి పోలికలతో ఉండడం అద్భుత విషయమని పేర్కొన్నారు. ‘మంచి దర్శకుడి చేతిలో సినిమా రూపొందడం, స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్ర పోషించడం కూడా అద్భుతం, అమోఘం’ అని బాలయ్యను ప్రశంసించారు మోహన్బాబు. ‘అన్నగారి బయోపిక్ తీయడం.. అందులోనూ మహానటుని కుమారుడు బాలయ్య తండ్రి పాత్ర పోషించడం మామూలు విషయం కాదని’ ట్విటర్లో పేర్కొన్నారు. -
ఆయన నిజమైన లెజెండ్
సాక్షి, హైదరాబాద్: ద్రవిడ అభిమానంకోసం, ద్రవిడ జాతికోసం విప్లవాత్మక పోరాటం చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో దేశం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ,ఇ తర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబిచ్చారు. నటుడు , కవి, రచయిత, హేతువాది అయిన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా, గొప్ప రాజకీయవేత్తగా చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నారు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. నిజమైన లెజెండ్, మాస్ నాయకుడు, నిరంతరం స్పూర్తిగా నిలిచిన నాయుకుడు కరుణానిధి. ఆయనలేని లోటు పూడ్చలేనిదని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. సోదరుడు స్టాలిన్, అళగిరి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి. తన విధానాలతో లక్షలాదిమంది ప్రజలకు చేరువయ్యారు. తన రచనలతో లక్షలామంది ప్రజలకు కరుణానిధి ప్రేరణగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోహన్బాబుఒక ఫోటోనుకూడా షేర్ చేశారు. ఈ భువిని వీడిన ఆయన నిజంగా ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి కరుణాధి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే వుంటారు. మన ద్వారా ఆయన బతికే వుంటారంటూ కరుణానిధి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మరో ప్రముఖ నటి రమ్యకృష్ణన్. అన్ని అసమానతలను ఎదుర్కొన్న ధీరుడు కరుణా నిధిగారు. ఈ అంతులేని విషాదంనుంచి కోలుకునే శక్తిని ఆయన కుటుంబం, తమిళ సోదర, సోదరీ మణులకు ఆ దేవుడు ప్రసాదించాలంటూ తెలుగు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇంకా హీరో విశాల్ కూడా కరుణానిధి మృతిపట్ల ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. కాగా తమిళ రాజకీయ యోధుడు, ద్రవిడ గడ్డ లెజెండరీ నేత, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కన్నుమూశారు. నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు, డీఎంకే శ్రేణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ సోదరులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. A true legend, a leader of masses and always lead by example, Sri. Karunanidhi leaves a huge void. My condolences to Brothers Stalin and Alagiri and their families. He touched millions of lives with his policies, gave hope to millions and inspired millions with his writing. — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 One of my Cherished Photo with Sri. Karunanidhi pic.twitter.com/gcATjLpTVf — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 A person that departs from this earth never truly leaves, for they are still alive in our hearts, through us, they live on. My condolences. #RIPKalaingr pic.twitter.com/qIfflYsgm1 — Ramya Krishnan (@meramyakrishnan) August 7, 2018 -
మోహన్బాబును కలిసిన సురుచి ఫుడ్స్ ప్రతినిధి
హైదరాబాద్: త్వరలో జరిగే వినాయక చవితి కి ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసే గణనాధుడికి 600 కిలోల మహాలడ్డూ సమర్పించనున్నట్లు తాపేశ్వరం కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దైవసన్నిధానం చైర్మన్ మోహన్బాబుతో తమ ప్రతినిధి సమావేశమై ఈ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు. గతేడాది కూడా దైవసన్నిధానం వినాయక చవితి ఉత్సవాలకు 500 కిలోల లడ్డూను అందజేసినట్లు తెలిపారు. తమ ప్రతినిధి వర్మ మోహన్బాబుతో కలిసినప్పుడు ఇందుకు సంబంధించిన లడ్డూ డిజైన్ను, ఎప్పుడు లడ్డూను సమర్పించే తదితర వివరాలు వెల్లడించారన్నారు. 2010 నుంచి ఖైరతాబాద్ గణేషుడికి మహాలడ్డూను సమర్పిస్తూ వచ్చిన తాము భద్రతా కారణాల వల్ల నిలిపివేశామన్నారు. -
టీనేజ్ లవ్స్టోరీ
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘శివకాశీపురం’. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్బాబు పులిమామిడి నిర్మించారు. ప్రియాంక శర్మ హీరోయిన్. పవన్ శేష స్వరపరచిన ఈ సినిమా పాటలను దర్శక–నిర్మాత గుణ్ణం గంగరాజు విడుదల చేశారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఇన్స్ట్రక్టర్గా చేస్తూ, షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్న నన్ను దర్శకుడిగా మార్చారు మోహన్బాబు పులిమామిడిగారు. చక్రవర్తిగారి మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన మనవణ్ణి హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్కు టీనేజ్ లవ్స్టోరీ మిక్స్ చేసి రూపొందించిన చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో సహజంగా ఉంటుంది’’ అన్నారు హరీష్ వట్టికూటి. ‘‘చక్రవర్తిగారి మనవణ్ణి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. సీనియర్ నటి అంజలమ్మగారి తనయుడు చిన్నారావుగారి సమక్షంలో మా ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉంది. అంజలమ్మకు మా సినిమాను అంకితం చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మోహన్బాబు. రాజేష్ శ్రీ చక్రవర్తి, పవన్ శేష, సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
గాయత్రి: బాబు అండ్ కోపై మోహన్బాబు సెటైర్ల వర్షం!
సాక్షి, హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్బాబు తాజా సినిమా ‘గాయత్రి’. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్బాబు డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తోంది. ఓ సీన్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎండగడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరుల తీరుపై మోహన్బాబు వేసిన సెటైర్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘అటవీశాఖ మంత్రికి జాతీయ పక్షి ఏమిటో తెలియదు. క్రీడాశాఖమంత్రికి ఒలింపిక్స్లో మనకెన్ని పతకాలు వచ్చాయో తెలియదు. రవాణాశాఖ మంత్రికి రన్నింగ్ బస్సెలెన్నో తెలియదు. ఛీఛీఛీ.. మంత్రివర్యా.. బీకామ్లో ఫిజిక్స్ చదివానని ఒకడు.. బీఎస్సీలో హెచ్ఈసీ చదివానని ఇంకొకడు.. నేనిచ్చిన పెన్షన్ తీసుకుంటూ.. నేనేసిన రోడ్ల మీద నడుస్తూ.. నాకే ఓటు ఎందుకు వేయరని అడిగేవాళ్లు ఇంకొందరు.. భారతదేశ సార్వభౌమధికారం అని పలుకడం చేతకాక.. సార్వబౌబౌ అనేవాళ్లు ఇంకొందరు.. మీరందరూ మంత్రులూ.. మీకు మేం ఓట్లేసి గెలిపించాం’ అంటూ మోహన్బాబు సెటైరికల్గా పేల్చిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయానా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, సీఎం తనయుడు లోకేశ్ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబాటుకు గురవ్వడాన్ని వ్యంగ్యంగా గుర్తుచేసేలా మోహన్బాబు డైలాగ్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
‘డైలాగ్స్ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’
‘‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి బుధవారం ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్సైట్ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజినీరింగ్ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్బాబుగారే’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ– ‘‘మోహన్బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు. భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు. అవార్డు గ్రహీత మోహన్బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం. ఓరుగల్లు అంటే వరంగల్.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్బాబుగా మార్చారు. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీ హిట్ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్’ స్థాపించిన తొలిసారి మోహన్బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్ వరకూ మోహన్బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్ కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్ హుస్సేన్తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. -
అదిరిపోయే డైలాగ్స్!
డైలాగ్స్ చెప్పడంలో మోహన్బాబు స్టైలే డిఫరెంట్. స్క్రీన్పై ఆయన డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాయత్రి’లో పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. మోహన్బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. టీజర్లో మోహన్బాబు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘మోహన్బాబుగారి నటన ఈ సినిమాకు కొండంత అండ’’ అని చిత్రబృందం చెబుతోంది. అనసూయ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే
... అంటున్నారు మోహన్బాబు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఆ తప్పుని రైట్ అని చెప్పడానికి రాముడితో ఎందుకు పోల్చారు? అనేది తెలియాలంటే ‘గాయత్రి’ సినిమా చూడాల్సిందే. విలక్షణ నటుడు మోహన్బాబు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గాయత్రి పాత్రను నిఖిలా రామన్ పోషిస్తున్నారు. ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మదన్ రామిగాని దర్శకత్వంలో మోహన్బాబు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రంలో మోహన్బాబు పవర్ఫుల్ లుక్ను విడుదల చేశారు. ‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే’ అనే క్యాప్షన్తో ఉన్న పోస్టర్తో విడుదలైన ఈ లుక్ ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఇందులో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సర్వేశ్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్కుమార్ ఆర్. -
ఆసక్తికరంగా ‘గాయత్రి’ ఫ్టస్ట్లుక్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయత్రి'. క్రిస్మస్ సందర్భంగా సోమవారం ఈ మూవీ ఫస్ట్లుక్ని మోహన్బాబు సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ‘ఆ రోజు రాముడు చేసింది తప్పయితే... నాదీ తప్పే’ అనే పవర్ఫుల్ క్యాప్షన్తో ఈ పోస్టర్ విడుదల చేశారు. దీంతో దీనిపై మరింత ఆసక్తికరంగా. ఈ క్యాప్షన్పై అప్పుడే సోషల్మీడియాలో చర్చ మొదలైంది. కాగా మోహన్బాబు- విష్ణు- శ్రేయ-నిఖిలా విమల్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుంది. ఇందులో మోహన్బాబు రోల్ ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నాడు డైరెక్టర్ మదన్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బ్రహ్మానందం, జర్నలిస్ట్గా అనసూయ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో మోహన్బాబు కూతురిగా నిఖిలా విమల్ కనిపించనున్నారట. ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే #Gayatri pic.twitter.com/1nNd6r5c3v — Mohan Babu M (@themohanbabu) December 25, 2017 -
మాయలో పడిపోతానేమో!
ప్రియా చూస్తుంటే నీ కళ్లు... పులకించిపోతోంది నా ఒళ్లు. కాటుకైనా కాకపోతిని నీ కళ్లతో కలగలిసిపోయేందుకు. ఏంటి.. సినిమాలో హీరోయిన్కి హీరో చెప్పాల్సిన డైలాగ్లు ఇక్కడ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి డైలాగ్లు సినిమాలో హీరోలు చెప్పటం చాలాసార్లు విన్నాం. కానీ, మంచు విష్ణు బయట కూడా ఇలాంటి డైలాగ్స్ పలుకుతున్నారు. మ్యాటర్ ఏంటంటే.. మోహన్బాబు నటిస్తూ, నిర్మిస్తున్న ‘గాయత్రి’ సినిమాలో విష్ణు, శ్రియ జంటగా నటిస్తున్నారు. హైదరాబాద్లో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఆ షూటింగ్లో కొన్ని ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారట. అందులో భాగంగా విష్ణు ‘‘నేనిప్పటివరకూ చేసినవాటిలో ఇదో బెస్ట్ లవ్స్టొరీ. శ్రియ నీ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ మాయలో పడిపోయేవాణ్ణి’’ అని శ్రియ కళ్లందాన్ని అభినందించారు. ‘గాయత్రి’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. -
ఎటో వెళ్లిపోయింది మనసు!
సండేని ఫన్డేగా ఫుల్ జోష్తో దిల్ ఖుష్ అయ్యేలా ఎంజాయ్ చేయాలనుకున్నారు హీరోయిన్ సమంత. కానీ, దర్శకుడు నాగ అశ్విన్ షూట్ ప్లాన్ చేయడంతో సమంత షూట్లో జాయినైపోయారు. వృత్తి పట్ల సమంతకు అంత డెడికేషన్. సెట్లో సమంత యాక్షన్ ఇరగదీసేస్తున్నారు కానీ షూట్ గ్యాప్లోనే ఎటో వెళ్లిపోయింది మనసు అన్నట్లు ఆలోచిస్తున్నట్లున్నారట. అందుకే నాగ అశ్విన్పై సరదాగా సెటైర్ వేశారీ బ్యూటీ. ‘‘ప్రజెంట్ నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ లిస్ట్లో నాగ అశ్విన్ లేరు. సరదాగా గడపాల్సిన నా సండే.. వర్క్ అంటూ సెట్లో గడిచిపోయింది’’ అని సమంత పేర్కొన్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. మెహన్బాబు, దుల్కర్సల్మాన్, సమంత, దర్శకుడు క్రిష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇటీవల 1980 కాలం నాటి లూనా ఫొటోను సమంత బయటపెట్టారు. ఇప్పుడు ఆ కాలంనాటి ఎమ్టీఎస్ ఫొటో ఒకటి (ఇన్సెట్లో చూడొచ్చు) ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
నా కొత్త బండి ఎలా ఉంది
కావాలంటే పడవంత కారులో షికారు చేయవచ్చు. అనుకుంటే విమానంలో ఆనందంగా గగన విహారం చేయవచ్చు. కానీ కథానాయిక సమంత మాత్రం మోపెడ్ ఎక్కుతా. లూనాలో గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే ఎంత లొల్లికైనా డేర్ చేస్తా అంటున్నారీ బ్యూటీ. ఈ గాలింపు, ఈ డేరింగ్ ప్రస్తుతానికైతే రీల్ లైఫ్ కోసమేనండి. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఏవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్నారు. మోహన్బాబు, దుల్కర్ సల్మాన్, సమంత కీలక పాత్రలు చేస్తున్నారు. సమంత జమున పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ‘‘1980కి వెళ్తున్నాం. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవడానికి అర్హమైనవి. అలాంటి సావిత్రిగారు జీవించిన టైమ్ని ఇప్పుడు రీ–క్రియేట్ చేసిన ప్లేస్లో నటించడం ఆనందంగా ఉంది. ఆ కాలం నాటి పీస్ (లూనా) నా చెంతకు చేరడం హ్యాపీగా ఉంది. 1960 అండ్ 1970లలో జరిగే సినిమా ‘మహానటి’’ అని సమంత పేర్కొన్నారు. నా కొత్త బండి ఎలా ఉందో చెప్పండి అన్నట్లు ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
విష్ణు పవర్ఫుల్... శ్రియ స్పెషల్!
ఎవరికి? మంచు మోహన్బాబు ‘గాయత్రి’కి! యస్... ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘గాయత్రి’లో మంచు విష్ణు, శ్రియ నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగులో పాల్గొంటున్నారు కూడా! ఓ రకంగా ప్రేక్షకులకు స్వీట్ సర్ప్రైజే ఇది. సైలెంట్గా, లో ప్రొఫైల్లో ఈ సిన్మా షూటింగ్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత మోహన్బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. తెరపై ఆయనుంటే చాలు. డైలాగులతో, నటనతో చెలరేగుతారు. మరి, ఆయనకు తోడు తనయుడు విష్ణు, శ్రియ అనగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలుగుతోంది. పవర్ఫుల్ పాత్రలో విష్ణు, స్పెషల్ రోల్లో శ్రియ కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడీ సినిమా హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం విష్ణు సెట్స్లో జాయిన్ అయ్యారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ ‘గాయత్రి’ సెట్స్కి విచ్చేసి మోహన్బాబు, విష్ణులను కలసి కాసేపు వారితో ముచ్చటించారు. అనసూయ, ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
సైలెంట్గా.. హిట్ ఖాయం
మోహన్బాబుకు కూతురంటే ఎంతో ప్రేమ... రియల్ లైఫ్లో ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది! ఇప్పుడు రీల్ లైఫ్లోనూ కొంచెం అటువంటి పాత్రనే పోషిస్తున్నారట! కొంత విరామం తర్వాత మోహన్బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘గాయత్రి’. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకుడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్బాబు నిర్మిస్తున్నారు. మొన్న జూలైలో షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి సైలెంట్గా షూట్ కానిచ్చేస్తున్నారు.ఒక్క మేటర్ కూడా బయటకు రానివ్వడం లేదు. అసలు సిన్మా కథ ఏంటని ఆరా తీస్తే... ఇందులో కూతురిపై ఎంతో ప్రేమ గల తండ్రిగా మోహన్బాబు, ఆయన కుమార్తెగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ నటిస్తున్నారని తెలిసింది. కూతురి కోసం తండ్రి ఏం చేశాడనేది కథ అట!! వెరీ హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అట! విలువలతో పాటు కమర్షియల్ అంశాలు ఉన్నాయని సమాచారం! స్ట్రాంగ్ కంటెంట్కి గ్రేట్ యాక్టర్ మోహన్బాబు తోడవడంతో టీమంతా పెద్ద హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. షూటింగులో కొన్ని సీన్లు చూసినోళ్లు కూడా అదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నాగినీడు, ‘సత్యం’ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: చిన్నా, ఫైట్స్: కనల్ కణ్ణన్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
ఘటోత్కచుడు శశిరేఖల హంగామా
శనివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళితే మంచు మోహన్బాబు కనిపించారు... ఘటోత్కచుడి గెటప్లో! మరోపక్క కీర్తీ సురేశ్ ఉన్నారు... శశిరేఖ గెటప్లో! అక్కడ ఏం జరుగుతోందంటే... ‘మాయాబజార్’ షూటింగ్! మరి, దర్శకుడెవరు? కేవీ రెడ్డి గెటప్లో ఉన్న క్రిష్. కేవీ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గెటప్లో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. ‘మాయాబజార్’ని మళ్లీ తీస్తున్నారా? అన్నట్టుంది అక్కడ సీన్! కట్ చేస్తే... ఈ కంప్లీట్ సీన్ని మరొకరు డైరెక్ట్ చేస్తున్నారు. అతనే... నాగ అశ్విన్. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న సినిమా ‘మహానటి’. సావిత్రి నట జీవితంలో మధురమైన చిత్రంగా నిలిచిన ‘మాయాబజార్’లోని కొన్ని సీన్లను ‘మహానటి’ కోసం తీస్తున్నారు. ఈ సీన్ల కోసం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి పర్యవేక్షణలో ‘మాయాబజార్’ సెట్ వేశారు అవినాష్. ప్రస్తుతం ఆ సెట్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇది తెలుసుకున్న సింగీతం సెట్కి వెళ్లారు. కేవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘మహానటి’లో సావిత్రిగా కీర్తీ సురేశ్, ఎస్వీ రంగారావుగా మోహన్బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... కేవీ రెడ్డిగా క్రిష్ నటించనున్నారని ‘సాక్షి’ కొన్ని రోజుల క్రితం తెలిపింది. ఆ వార్తతో పాటు సింగీతంగా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్టు శనివారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘యమదొంగ’లో ఒకసారి, ‘యమలీల–2’లో మరోసారి యముడిగా మోహన్బాబు పౌరాణిక పాత్రలో నటించి, మెప్పించారు. ‘మహానటి’లో ఘటోత్కచుడిగా ఆయన మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మోహన్ బాబు
-
మేస్త్రిని అన్ని తానే అయ్యి చూసుకుంటున్న శిష్యుడు
-
మంచు లక్ష్మితో రాములమ్మ... - దాసరి
‘‘మంచు లక్ష్మి స్పాంటేనియస్ యాక్టర్. నటిగానే కాదు, సామాజిక సేవలోనూ ముందుంది. ‘ప్రేమమ్’ ప్రచార చిత్రాలు చూసి పెద్ద హిట్టవుతుందని చెప్పా. ఆ సినిమా రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడీ ‘లక్ష్మీబాంబ్’ ప్రచార చిత్రాలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్. ఈ ట్రైలర్ చూడగానే లక్ష్మితో రాములమ్మ తరహా సినిమా చేయాలనిపించింది. దీపావళికి ‘లక్ష్మీబాంబ్’ పేలనుంది’’ అని దర్శకరత్న దాసరి అన్నారు. మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రధారిగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన సినిమా ‘లక్ష్మీబాంబ్’. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటల సీడీలను దాసరి విడుదల చేసి, నటుడు-నిర్మాత మోహన్బాబుకు అందజేశారు. ‘‘గుండెల్లో గోదారి’లో లక్ష్మి చక్కగా నటించింది. ఇందులో ఇంకా బాగా చేసింది’’ అని మోహన్బాబు అన్నారు. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్తో పాటు బాగా డ్యాన్సులు చేశా. టీమ్ అంతా కష్టపడి చేశారు. నిర్మాతలు రాజీ పడలేదు’’ అన్నారు మంచు లక్ష్మి. దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. చిత్ర సమర్పకులు గునపాటి సురేశ్రెడ్డి, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ, సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. -
ఈ ఆనందం మాటల్లో చెప్పలేను: మోహన్ బాబు
విశాఖపట్నం: ‘ఈ ఆనందం మాటల్లో చెప్పలేను.. సినీ జీవితంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచి పోయింది. మా గురువు దాసరి నారాయణరావు, నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన అభిమానుల వల్లే నేను ఇంతవరకు ప్రయాణం సాగించగలిగాను. ఈ 40 ఏళ్ల పండుగ విశాఖలో జరుపుకునే అవకాశం రావడం నా జీవితంలో మర్చిపోలేను’ అని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్బాబు చెప్పారు. 40 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న ఆయనను ఈనెల 17న విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ‘నవరస నటతిలకం’ బిరుదుతో సత్కరించనుంది. ఈ సందర్భంగా నగరానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇదంతా గురువు గారు.. అభిమానుల వల్లే ‘ఆనాడు ఓ మారుమూల పల్లెటూరు నుంచి పొట్ట చేతపట్టుకుని చెన్నై వెళ్లాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఎదురు దెబ్బలు తిన్నాను. మరెన్నో ఒడిదుడుకులు చవిచూశాను. గురువుగారు దాసరి నారాయణరావు నన్ను మోహన్బాబుగా మార్చి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల దయవల్ల ఎన్నో విజయాలందుకున్నాను. మరెన్నో శిఖరాలను అధిరోహించగలిగాను. కళామతల్లికి సేవలో అప్పుడే 40 ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కథానాయకుడిగా, నిర్మాతగా.. ఇలా సినీ జీవితంలో నా ప్రయాణం సాగింది.. సాగుతోంది. ఏ వేషం వేసినా.. ఏ ప్రయోగం చేసినా తెలుగు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో నాతో కలిసి పని చేసిన హీరోలు, హీరోయిన్లు, ప్రస్తుతతరం నటులు, సంగీత దర్శకులు, దర్శకులు ఎంతో బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ వచ్చి అభినందిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు ఈ వేడుకలో పాల్గొని నన్ను ఆశీర్వదించేందుకు తరలివస్తున్నారు.’ అని మోహన్బాబు చెప్పారు. ఆ ఖర్చుతో పేదలకు పట్టెడన్నం పెట్టండి ‘తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. వారికి ఒక్కమాట చెబుతున్నా ఏ ఒక్కరూ పూల దండలతో రావద్దు. పూలదండలు.. బొకేల కోసం ఖర్చుచేసే ప్రతి రూపాయి కూడా ఎలాంటి ఆసరా లేని నిస్సహాయులకు, అన్నార్తుల కోసం వెచ్చించి పట్టెడన్నం పెట్టండి. నేను చాలా సంతోషపడతాను. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం ఎళ్లవేళలా ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు మీ ఆదరాభిమానాలతో కళామతల్లికి సేవ చేస్తూనే ఉంటా’ అని మోహన్బాబు పేర్కొన్నారు. -
మోహన్బాబు 40 సినీవసంతాల వేడుక
డాబాగార్డెన్స్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాధారణ వ్యక్తిగా ప్రవేశించి, క్రమశిక్షణ గల నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన సినీ నటుడు డాక్టర్ మోహన్బాబు 40 సినీ వసంతాల వేడుక విశాఖలో జరగనుంది. వచ్చే నెల 17న కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండవగా నిర్వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శినీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించడానికి మోహన్బాబు కుమారుడు మంచు విష్ణు మంగళవారం విచ్చేసి వేదికను పరిశీలించి ఖరారు చేశారు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానుండడంతో బస ఏర్పాట్లపై మంచు విష్ణు సమీక్షించారు. -
ప్రస్తుతానికి వద్దనుకున్నాను అంతే...
-
'రెండు జతల బట్టలతో మద్రాసు వెళ్లాను’
తిరుపతి : డిసెంబర్ 25న జనం ముందుకు రా నున్న ‘మామమంచు- అల్లుడు కంచు’ సినిమా కుటుంబానికి వినోదాన్ని అందించే మంచి సినిమా అని పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్బాబు అన్నారు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మో హన్ బాబు మాట్లాడుతూ తన నట జీవితంలో 560 సినిమాల్లో నటించానన్నారు. సినీ జీవితం లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో నటించినట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారు కావడంతో బాధ్యతలన్నీ వారికి అప్పగిం చినట్టు చెప్పారు. ఏడాదిలో ఏదో ఒక సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాలో నటిం చినట్టు చెప్పారు. నాతోపాటు మరో నటుడు కావాలనుకున్నప్పుడు ఈ పాత్రకు అల్లరి నరేష్ కరెక్టని మంచు విష్ణు అతన్ని తీసుకువచ్చాడన్నారు. ఆ పాత్రకు అల్లరి నరేష్ న్యాయం చేశారన్నారు. ఇద్దరం పోటీపడి నటించామన్నారు. ఏదో సాధించాలని రెండు జతల బట్టలతో మద్రాసుకు వెళ్లానన్నారు. అయితే ఆదిలోనే నువ్వు చిత్తూరు వాడివి, నీకు భాషరాదని అగౌరవ పరచారన్నారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, నటుడుగా శిఖరాగ్రాన్ని చేరుకున్నానన్నా రు. నా తర్వాత నా తమ్ముడు మోహన్బాబే డైలాగ్ చెప్పడంలో దిట్టని అన్నగారు ఎన్టీఆర్ చేత శభాష్ అనిపించుకున్నానన్నారు. నా ఊపి రి, శ్వాస, ధ్యాస, చివరకు నేను తినే తిండి సినిమాలేనని అన్నారు. సినిమా నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ కథ, సంగీతం, దీనికి తోడు మోహన్బాబు, అల్లరినరేష్ నటన సినిమాకు పెద్ద హైలెట్ అని తెలిపారు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని అభిప్రాయపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ తండ్రి సమానులైన మోహన్బాబు జిల్లా వాసికావడం మనందరి గౌరవాన్ని పెం చిందన్నారు. కేవలం సినీ దిగ్గజమే కాక ఆయనలో మంచి రాజకీయవేత్త, పారిశ్రామిక వేత్త, విద్యావేత్తగా ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం సినీ టెక్నీషియన్లు, ఇతర నటులు నటులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమా ట్రైలర్ను మంచు మనోజ్ ఆవిష్కరించారు. -
మంచులాంటి మనసు
మామది మంచులాంటి మనసు. అల్లుడేమో కంచులాంటివాడు. ఈ మంచులాంటి మామ, కంచులాంటి అల్లుడు చేసే సందడితో సాగే చిత్రం ‘మామ మంచు... అల్లుడు కంచు’. టైటిల్ రోల్స్లో మోహన్బాబు, అల్లరి నరేశ్ నటిస్తుండగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పటి ‘అల్లరి మొగుడు’లో మోహన్బాబు సరసన జతకట్టిన రమ్యకృష్ణ, మీనా ఈ చిత్రంలో ఆయన సరసన నటించడం విశేషం. నరేశ్ సరసన పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను శుక్రవారం విడుదల చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ -‘‘నాయకునిగా, ప్రతినాయకునిగా, సహాయ నటునిగా నాన్నగారు ఇప్పటివరకూ 561 చిత్రాల్లో నటించారు. హీరోగా ఆయనకు ఇది 181వ చిత్రం. నరేశ్కు ఇది 50వ చిత్రం. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అచ్చు-రఘు కుంచె, కెమెరా: బాలమురుగన్, సమర్పణ: అరియాన, వివియాన, విద్యానిర్వాణ. -
ఆడియోవేదికపై స్టెప్పులేసిన సినీతారాగణం
-
మంత్రి డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు డ్రైవర్ నాగరాజుపై ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు సెక్యూరిటీ సిబ్బంది దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఫిలింనగర్లోని మోహన్బాబు ఇంటిముందు ఈ ఘటన జరిగింది. మోహన్ బాబు ఇంటి ముందు డ్రైవర్ నాగరాజు నిలబడ్డాడని నలుగురు బౌన్సర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. నాగరాజు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు మోహన్బాబు ఇంటికి చేరుకుని దాడి చేసిన నలుగురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. -
పెద్ద మనిషి
‘పెదరాయుడు’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్బాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ... ‘పెదరాయుడు’ మూడు విషయాలు చెప్పింది... అన్నదమ్ములు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా మెలగాలి? సమన్యాయం ఎలా పాటించాలి?... ఈ సూత్రాలనే ఈ పెద్దమనిషి పాటిస్తున్నాడు.. నష్టం వస్తే డబ్బు పోతుంది... అప్పుడు జీవితం మొదలుపెట్టిన పూరి గుడిసెకే మళ్లీ వెళ్లొచ్చు.. కానీ, డబ్బు దాచిపెట్టుకుని, మోసం చేస్తే మన గుండెల్లో మనమే ఉండలేం అంటారు ఈ పెద్దమనిషి. ‘పెదరాయుడు’ ప్రారంభమైన వైనం? ‘తమిళంలో ‘నాట్టామై’ అనే చిత్రం విడుదలైంది. చూడరా...’ అని రజనీకాంత్ అంటే. ‘ఎందుకురా’ అన్నా. ‘నువ్వు ముందు చూడరా’ అన్నాడు. చూసి, ‘బాగుంది’ అన్నాను. ‘ఆ చిత్రాన్ని తెలుగులో చేస్తే బాగుంటుంది. తమిళ నిర్మాతతో నువ్వు మాట్లాడుకో. డబ్బు సంగతి నాకు సంబంధం లేదు. కానీ, తెలుగులో తీస్తే మాత్రం గొప్పగా ఆడుతుంది’ అన్నాడు. సరే.. రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత రజనీ, ‘ఈ సినిమాలో ఉన్న పాపారాయుడు పాత్ర నేను వేస్తాను రా’ అన్నాడు. ‘అది చిన్న పాత్ర కదరా..’ అంటే.. ‘కాదురా.. నేను చేస్తా’నంటూ గెటప్ వేసుకొచ్చి మరీ చూపించాడు. మంచి స్నేహానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఈ చిత్రానికి సంబంధించి మర్చిపోలేని విషయం ఏదైనా? ప్రతిరోజూ గుర్తుంచుకోదగ్గదే. షూటింగ్ మొదలుపెట్టిన రోజునే నేను గుర్రం మీద నుంచి పడిపోయాను. నడుముకి దెబ్బలు తగులుతాయని భయపడ్డాను కానీ, మెడకి దెబ్బ తగిలింది. ఇలా షూటింగ్ సమయంలో చాలా గాయాలయ్యాయి. ఎంతో కష్టపడి చేశాం. ఈ చిత్రవిజయానికి కారణాలు? అద్భుతమైన కథ, దానికి తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంవల్లే మంచి విజయం సాధించగలిగాం. చిత్రదర్శకుడు పినిశెట్టి రవిరాజా నాకు బాగా నచ్చిన వ్యక్తి. కెమెరామ్యాన్ పీఎస్ ప్రకాశ్ ఇప్పుడు లేరు. ఆయన వండర్ఫుల్. కోటిగారు మంచి పాటలిచ్చారు. ‘కదిలే కాలమా..’ నేను ఇష్టపడి పెట్టిన పాట. బాగుంటుందో లేదోనని రవిరాజా అంటే, లేదు బాగుంటుందన్నాను. ‘పెదరాయుడు’ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, సినిమా రిజల్ట్ తేడా అయితే సమస్యలపాలయ్యేవారని కొంతమంది అంటుంటారు? ఈ సినిమా అప్పుడు ఆర్థిక ఇబ్బందులేవీ లేవు. ‘మేజర్ చంద్రకాంత్’ అప్పుడు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాను. దాంతో, ‘ఇప్పుడు నాతో సినిమా ఎందుకు? వద్దు?’ అని అన్నగారు తారక రామారావుగారు అన్నారు. ఆయనతో సినిమా తీయాలనేది నా పట్టుదల. అందుకని, ఆయన చెప్పినా కూడా వినకుండా మొండిగా, పట్టుదలగా ఆ సినిమా తీశాను. ఏ స్థాయిలో ఆడిందో తెలిసిందే. ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెట్టింది. మీ కెరీర్లో ఆర్థికపరమైన రిస్కులు చాలానే తీసుకున్నారు.. నటుడిగా కష్టపడి సంపాదించిన డబ్బుని నిర్మాతగా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు భయం అనిపించలేదా? నా కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ ఇప్పటివరకూ వెనకడుగు వేసిన సందర్భాలు లేనే లేవు. ‘పూరి గుడిసె నుంచి బంగ్లా స్థాయికి వచ్చాం.. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే మళ్లీ పూరి గుడిసెకే వెళతాం.. అయితే ఏంటి?’ అనుకునేవాణ్ణి. మహా అయితే సంపాదించిన డబ్బు పోతుంది? డబ్బు లేదు అంటారు కానీ.. మోసగాడు అని ఎవరూ అనరు కదా. మీ ముగ్గురు పిల్లలు లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్లో మీ పట్టుదల, మొండితనం ఎవరికి బాగా వచ్చాయి? విష్ణు ఆచి తూచి అడుగులేస్తాడు. బాగా చదువుకున్నాడు. ఇంటలెక్చువల్. మనోజ్ చాలా సెన్సిటివ్. లక్ష్మీప్రసన్న అచ్చంగా నాలానే. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది. ఇలాంటివాళ్లు సమాజంలో నెగ్గుకు రావడం కష్టం. ‘పొగరు’ అంటారు. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే, ‘ఫలానావాళ్లని మోసం చేశారు’ అనే నింద మా మీద ఉండదు. మనసులో ఏది అనిపిస్తే, అది మాట్లాడటంవల్ల వివాదాలు వస్తాయి కదా? ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంట్రవర్సీ. ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మిన్నకుండా ఉండిపోయేవాళ్లు మన్ను తిన్న పాములతో సమానం. అలా ఉండటం మా వల్ల కాదు. బతికినంత కాలం ముక్కుసూటిగా ఉన్నామా? లేదా అన్నదే ముఖ్యం. నాగేశ్వరరావుగారు, రామానాయుడుగారు చనిపోయాక పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది... పెద్ద దిక్కు కోల్పోయాం... నిజమే. ఇప్పుడు పరిశ్రమ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. అందరూ కలిసి కట్టుగా ఉంటే బాగుంటుంది. త్వరలో అది జరుగుతుందని ఆశిస్తున్నా. ఏదైనా సమస్య వస్తే, ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని చాలామంది అంటున్నారు? నేను చాలా సమస్యలు పరిష్కరిస్తుంటాను. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలంటే నాకు చాలా అభిమానం. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంటాను. అలాగే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి, పరిష్కారం కోసం వస్తే, నేను సహాయం చేస్తుంటాను. జయాపజయాల విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? దేనికీ స్పందించను. భారతదేశంలో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన హీరో నాకు తెలిసి లేడు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, కలెక్టర్గారు, అడవిలో అన్న, బ్రహ్మ.. ఇలా వరుసగా ఎనిమిది హిట్ సినిమాల్లో నటించి, నిర్మించాను. వరుస ఫ్లాప్స్ కూడా చూశాను. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ‘ముఖ్యమంత్రి’ అయిపోయాం అనుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్కి భారీగా జనాలు వస్తే, ముఖ్యమంత్రి అయిపోయాం అని భ్రమపడుతున్నారు. కానీ, సినిమా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లా? హిందీ రంగంలో అమితాబ్ బచ్చన్కి ఉన్నంత స్టామినా తెలుగులో మీకు ఉంది. మరి... ఆయన చేసినట్లుగా ‘పీకు’లాంటి సినిమాలు మీరు చేయరేం? ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా మెప్పించాను. ‘రాయలసీమ కాబట్టి నాకు భాష తెలియదు.. సంభాషణలు పలకడం తెలియదు’ అన్నారు. కానీ, తెలుగు భాషను ఎంత బ్రహ్మాండంగా పలుకుతానో, సంభాషణలు ఎలా చెపుతానో తెలిసిందే. మనకు మంచి దర్శకులున్నారు. కానీ, కథారచయితలు తక్కువగా ఉన్నారు. అందుకే ‘పీకు’లాంటి సినిమాలు ఇక్కడ రావడంలేదు. వస్తే, తప్పకుండా చేస్తా. రాజకీయాల విషయానికొస్తే.. ఎమ్మెల్యేలను కొనడం అనే ప్రక్రియ ఎలా అనిపిస్తోంది? మీ ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని చాలా విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి కదా? అవును.. ఓటు వేయొద్దని భయపెడితే తిరగబడి ఓటేస్తున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’లో అది చూపించాం. ఇక, ఎమ్మెల్యేలను కొనడం గురించి అంటారా? ప్రస్తుత రాజకీయాల గురించి నేనేం మాట్లాడను. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడటం సరికాదు. ప్రస్తుతం మీరేదైనా సినిమా చేయాలనుకుంటున్నారా? ఓ మరాఠీ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నా. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తారు. - డి.జి. భవాని -
విలన్గా రాణించాలనే వచ్చా
హీరోగానూ పేరు రావడం అదృష్టం సినీనటుడు మోహన్బాబు విశాఖపట్నం: సినిమాల్లో విలన్గా రాణించాలనే కోరికతోనే తన ఊరి నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చానని సినీ నటుడు, నిర్మాత ఎం.మోహన్బాబు చెప్పారు. తనది మధ్యతరహా కుటుంబమని, పుట్టుకతో తనకు ఆస్తులు లేవని చెప్పిన ఆయన భగవంతుని దయతో సినీ రంగంలో విభిన్న పాత్రలు పోషించి హీరోగా, నిర్మాతగా ఎదిగానన్నారు. టీఎస్సార్ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి జీరో అయ్యానని... భగవంతుని దయతో ‘అల్లుడుగారు’ సూపర్ డూపర్ హిట్ అయి తనను హీరోగా, నిర్మాతగా నిలబెట్టిందన్నారు. కె.రాఘవేందర్రావు దర్శకత్వంలో దేవత, కొండవీటి సింహం, అల్లుడుగారులాంటి హిట్ చిత్రాలలో నటించానన్నారు. విలన్ కావాలని కోరుకున్నా హీరోగా కూడా ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు. హుద్హుద్ తుపాను కలచివేసింది హుద్హుద్ తుపాన్ తనను కలచి వేసిందని, విశాఖ ప్రజలను ఆదుకోవడానికి తనవంతు సాయంగా రూ.30 లక్షలు తన కుమారుడు మనోజ్కుమార్తో పంపించానని చెప్పారు. మనోజ్, అతని అభిమానులు ఆ డబ్బులతో బాధితులకు అవసరమైన సాయం అందించారని మోహన్బాబు చెప్పారు. తన విద్యాసంస్థల సిబ్బంది అందించిన ఒక నెల జీతాన్ని త్వరలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేస్తానన్నారు. త్వరలోనే తన ఇంజనీరింగ్ సంస్థ విద్యార్థులతో విశాఖలో అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమం చేపడతానన్నారు. -
కుటుంబ కథా చిత్రం ఎర్రబస్సు
తిరుపతి(మంగళం): ఆనాడు ఎస్వీ రం గారావు, రాజబాబు నటించిన తాతామనవడు ఎంతగా సూపర్డూపర్ హిట్ అయ్యిందో అదేవిధంగా దాసరి నారాయణరావు, మంచు విష్ణు నటిం చిన ఎర్రబస్సు సినిమా విజయవంతం అవుతుందని సినీహీరో మంచు మోహన్బాబు పేర్కొన్నారు. తిరుపతి గ్రూప్ థియేటర్లో విడుదలైన ఎర్రబస్సు సినిమాను శుక్రవారం రాత్రి మంచు మోహన్బాబు, ఆయన సతీమణి మంచు నిర్మల, కుమార్తె మంచు లక్ష్మి తిలకించారు. ఈ సందర్భంగా సినీ నటుడు మోహన్బాబు మాట్లాడుతూ తల్లి, తండ్రి, అవ్వ, తాత అనుబంధాల్లోని అనురాగాలను తెలిపే విధంగా ఎర్రబస్సు సినిమాను చిత్రీకరించారని తెలిపారు. ఉమ్మడి కుటుం బంలో ఉన్న ఆత్మీయతలను గుర్తు చూస్తున్న సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టానని తెలిపారు. మా గురువు దాసరి నారాయణరావుతో కుమారుడు మంచు విష్ణు అద్భుతంగా నటించాడన్నారు. షిరిడీ సాయిబాబా, శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తమ కుటుం బ సభ్యులు నటించిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించి, విజయవంతం చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సునీల్చక్రవర్తి దుశ్శాలువ కప్పి, పుష్పగుచ్చంతో మోహన్బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్థియేటర్ మేనేజర్ సిద్ధారెడ్డి, కృష్ణకుమార్, యువసేన నాయకులు సాయి, ప్రదీప్, శశి, మూర్తి, అభిమానులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో వచ్చిన ఇబ్బందేమీ లేదు
హైదరాబాద్: తెలుగు పరిశ్రమకు హైదరాబాద్లో వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుగు సినిమా ప్రముఖులకు కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. తెలుగు సినీ ప్రముఖుల పలువురు ఈ రోజు కేసీఆర్ను కలిశారు. కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. త్వరలో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ మరోసారి సమావేశమవుదామని కెసిఆర్ వారికి చెప్పారు. కెసిఆర్ను కలిసినవారిలో డి.రామానాయుడు, మురళీమోహన్తోపాటు పలువురు నిర్మాతలు, నటులు ఉన్నారు. ఆ తరువాత సినీనటుడు, నిర్మాత మోహన్ బాబు కూడా కెసిఆర్ను కలిశారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ కెసిఆర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడని చెప్పారు. తెలంగాణకు చెందిన పేద ప్రజల భూములను, ప్రభుత్వ భూములను ఎంతో మంది ఆక్రమించారన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కేసీఆర్ను కోరినట్లు తెలిపారు. -
హైకోర్టులో మోహన్బాబుకు చుక్కెదురు
-
పాండవులు పాండవులు తుమ్మెద...
‘పాండవులు పాండవులు తుమ్మెద... పంచ పాండవులోయమ్మ తుమ్మెద’ అంటూ ‘అక్కా చెల్లెలు’ సినిమాలో ‘షావుకారు జానకి పాట పాడుతుంది. చాలా చక్కటి ఫీల్ ఉన్న పాట అది. ఇప్పుడా పాట పల్లవే సినిమా టైటిల్ అయ్యింది. మంచు మోహన్బాబు ఫ్యామిలీ మొత్తం నటిస్తున్న చిత్రానికి ఈ టైటిల్నే నిర్ణయించారు. టైటిల్లోనే ఏదో ఆసక్తి ధ్వనిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోహన్బాబు హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్లు కూడా హీరోలుగా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత నాయికలు. ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. అరియాన-వివియాన సమర్పణలో మంచు విష్ణువర్థన్బాబు - మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థలో ఇది 58వ చిత్రం. మోహన్బాబు విభిన్న గెటప్తో ఉన్న ఫస్ట్లుక్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి, బప్పీలహరి, మణిశర్మ, బాబా సెహగల్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫలణి కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్కుమార్.ఆర్. -
తెప్పపై వినాయకుడి విహారం
కాణిపాకం, న్యూస్లైన్: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై గణేశ.. జై జై గణేశ నామస్మరణతో కాణిపాకం మారుమోగింది. తెప్పోత్సవానికి పుండరీకనాయుడు, శేషాద్రినాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంతనాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్బాబు ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ వెంకటనారాయణ, ఏసీ ఆదికేశవపిళ్లె, ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు. వినాయకుని మహాప్రసాదం వేలం వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఆదివారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచి ఆస్థాన మండపంలో బహిరంగవేలం వేశారు. ఈ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు దేవస్థానం వారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తదుపరి 11రోజులు ఉభయదారుల అధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి వాహనసేవలు నిర్వహించారు. -
వాళ్లు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటామా?
‘‘రాష్ట్ర ప్రజలు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే మనం పండగ చేసుకోవడమా? ప్రేక్షక దేవుళ్ల వరంతో మనం ఆకాశంలో హరివిల్లులా వెలుగుతున్నాం. అంతగా అభిమానిస్తున్న వారు బాధలో ఉన్నప్పుడు మనం పండగ చేసుకుంటే చెడు సంకేతాలు వెళ్లవా’’ అని ప్రశ్నిస్తున్నారు డా. మోహన్బాబు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దక్షిణ భారత పరిశ్రమ చెన్నయ్లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు 24 వరకూ జరుగుతాయి. ఈ వేడుకలను ఉద్దేశించే మోహన్బాబు ఈ ప్రశ్నలను సంధించారు. చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి ఈ వేడుకల విషయంలో పునరాలోచించాలని శనివారం ఓ ప్రకటనలో మోహన్బాబు అన్నారు. -‘‘నూరేళ్ల పండగను వైభవంగా జరపాలని అందరం నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి రెండున్నర గంటలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రూపొందించాలనుకున్నాం. అయితే ఇది జూలై 30కి ముందు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర మన పరిశ్రమకు రెండు కళ్లులాంటివి. ఈ ప్రజలు ఆవేదనలో ఉన్నప్పుడు మనం ఆడిపాడి సినిమా పండగ చేసుకోవడం ఎంతవరకు సబబు? ప్రజల మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉండదా? ప్రజలు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటున్నామనే భావన వారికి కలగదా? అలాగని ఈ వేడుకల్లో మన తెలుగు పరిశ్రమవారు పాల్గొనకూడదని నేను అనను. కానీ ఈ వేడుకను వాయిదా వేస్తే బాగుంటుందని, చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సినిమా నిజం. ప్రేక్షకులు నిజం. మిగతావన్నీ మధ్యలో పడి లేచే కెరటాలే’’ అన్నారు.