national cricket academy
-
రంజీ క్రికెట్ కింగ్ రషీద్
గుంటూరు వెస్ట్: విజయాలకు అడ్డదారులుండవు. కఠోర సాధనతోపాటు క్రమశిక్షణ ఎంతటి వారినైనా విజయతీరాల వైపు నడిపిస్తాయని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నిరూపిస్తున్నాడు. ఇంతై వటుడింతై అన్నట్లు అండర్–14 చిన్నారుల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి వారితో క్రికెట్ ఆడే అవకాశాల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం మరో విశేషం. దాదాపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాకు రంజీ సారథ్యం లభించడం విశేషం. ఎంఎస్కే ప్రసాద్ తర్వాత రషీదే కావడం గమనార్హం. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ వరకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆడే ప్రతి జట్టుకు నమ్మదగిన బ్యాటర్గా చక్కని సేవలందిస్తున్నాడు. రెండేళ్ల నుంచి చైన్నె సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు స్థానిక ఎన్జీఓ కాలనీలో కుటుంబంతో జీవిస్తున్నాడు.జీవితాన్ని మార్చేసిన అండర్–19 భారత జట్టు స్థానం2021లో అండర్–19 భారత జట్టులో రషీద్ స్థానం సంపాదించడంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. దీంతోపాటు చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపికవ్వడమే కాకుండా ఇండియా –డి జట్టుకు సారథ్యం వహించి తన జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తోపాటు 274 పరుగులు సాధించాడు. 2022లో కోల్కొత్తాలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్, ఏషియన్ పోటీలోనూ చక్కగా రాణించాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో మ్యాచ్లు ఆడుతున్నాడు.కొహ్లి ఆటంటే ఎంతో ఇష్టంరషీద్ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావులేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్లోనూ ఔటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్లో సరి చేసుకుంటాడు. దీని కోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్కు విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్. కోహ్లి ఆడే విధానం, అతడి దృఢ చిత్తం గొప్పవరమని రషీద్ అంటాడు. కోహ్లి ఆటతోపాటు ఫిట్నెస్పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్కు మార్గదర్శకాలని కితాబునిస్తాడు. -
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్లకు ముందు క్యాంప్లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో, ఇంగ్లండ్లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
బెంగళూరులో కొత్త ఎన్సీఏ.. ప్రారంభం ఎప్పుడంటే?
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా నిర్మితమైన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. బెంగళూరు నగర శివారులో సువిశాలమైన ప్రాంగణంలో అత్యున్నత సదుపాయాలతో నిర్మించిన ఎన్సీఏను ఈనెల 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా జరగనుంది. ఈ మీటింగ్ అజెండాలో కార్యదర్శి ఎన్నిక అంశం లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ కానుంది. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ నెలాఖరుదాకా ఉంది. డిసెంబర్ 1 తర్వాతే జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో అప్పటిదాకా బోర్డు కార్యదర్శిగా ఆయన కొనసాగుతారు. దీంతో ఎన్నికపై ఇప్పుడప్పుడే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశమే లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎప్పట్లాగే బోర్డు వ్యవహారాలు, ఆదాయ–వ్యయాలు, వార్షిక బడ్జెట్పై చర్చ జరుగుతుందని బోర్డు అధికారులు చెప్పారు. -
రాహుల్ ద్రవిడ్ గల్లీ క్రికెట్..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్కోచ్గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మిస్టర్ డిఫెండ్బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్సీఏ హెడ్గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్గా పనిచేశాడు. Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW— Johns. (@CricCrazyJohns) August 11, 2024 -
NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్బై.. కొత్త హెడ్ అతడే!
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్సీఏ హెడ్గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్తక్ పేర్కొంది.సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్ను ముగించారు.ఎన్సీఏ హెడ్గా విక్రం రాథోడ్}మరోవైపు.. 2021లో ఎన్సీఏ హెడ్గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.అతడి స్థానంలో ఎన్సీఏ హెడ్గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్తో మరోసారి మాట్లాడనున్నారు.అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ మెంటార్గా రీ ఎంట్రీ?కాగా ఎన్సీఏ హెడ్గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. కెప్టెన్కు గ్రీన్ సిగ్నల్.. కానీ..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్ అందింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ ఐపీఎల్ 2024లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. రాహుల్ మరో రెండు రోజుల్లో జట్టుతో కలుస్తానడి పేర్కొంది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో రాహుల్ కేవలం బ్యాటర్గా మత్రమే కొనసాగాలని కండీషన్ పెట్టింది. ప్రస్తుతం రాహుల్ వికెట్కీపింగ్ భారాన్ని మోస్తే అతని గాయం తిరగబెట్టవచ్చని హెచ్చరించింది. కాగా, రాహుల్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా రాహుల్ ఆ సిరీస్లోని తదుపరి నాలుగు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా కూడా గాయపడిన రాహుల్ ఈ సీజన్కు కూడా దూరమవుతాడని అంతా అనుకున్నారు. అయితే అతను ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో త్వరగా కోలుకుని త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్కు అందుబాటులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. లక్నో సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. జైపూర్లో జరిగే ఈ మ్యాచ్లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. -
శ్రేయస్ అయ్యర్ నాటకం?.. బండారం బయటపెట్టిన ఎన్సీఏ!
NCA email claims Shreyas Iyer "fit and available": ‘‘జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందే’’.. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారడన్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా జారీ చేసిన అల్టిమేటం. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న ఆటగాళ్లు తప్ప ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని జై షా కుండబద్దలు కొట్టాడు. అయినా.. ఇషాన్ బోర్డు ఆదేశాలను పట్టించుకోలేదు. డొమెస్టిక్ టీమ్ జార్ఖండ్ తరఫున బరిలో దిగనూ లేదు. తాజాగా శ్రేయస్ అయ్యర్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇషాన్లా నేరుగా కాకుండా ‘ఫిట్నెస్’ను అడ్డుపెట్టుకుని నాటకాలకు తెరతీశాడంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు రంజీ 2023-24 సీజన్లో ముంబై తరఫున బరిలో దిగాడు అయ్యర్. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. కానీ.. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు నుంచి అయ్యర్ను తప్పించగా.. వెన్నునొప్పి కారణంగానే అతడు జట్టుకు దూరమయ్యాడని వార్తలు వినిపించాయి. వెన్నునొప్పి.. ఆడలేను ఆ తర్వాత నాలుగో టెస్టుకు ప్రకటించిన జట్టులోనూ అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ముంబై తరఫున క్వార్టర్ ఫైనల్స్లో బరిలోకి దిగాలని బోర్డు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని శ్రేయస్ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో బరోడాతో ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్కు అయ్యర్ను ఎంపిక చేయలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉన్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అతడు పూర్తి ఫిట్గా ఉన్నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిసిన తర్వాత అతడు సెలక్షన్కు అందుబాటులో ఉంటాడని రిపోర్టు ఇచ్చాం. తాజాగా అతడు ఎటువంటి గాయాల బారిన పడలేదు. టీమిండియా నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా అతడికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు’’ అని ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ తన ఇ-మెయిల్లో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం.. ఫిట్గా ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ రంజీ బరి నుంచి వైదొలగడానికి నాటకం ఆడాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ చేసిన స్కోరు వరుసగా.. 35, 13, 27, 29. చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్లో..? -
ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ..
Ranji Trophy 2023-24- Mumbai: టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు మైదానంలో దిగనున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఆగష్టులో పృథ్వీ షా గాయపడ్డాడు. మెకాలి నొప్పి కారణంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్నెస్పై దృష్టి సారించాడు. ఇప్పట్లో రాడంటూ వార్తలు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ క్రమక్రమంగా కోలుకున్నాడు. అయితే, పృథ్వీ షాకు ఇప్పట్లో రిటర్న్ టు ప్లే(ఆర్టీపీ) సర్టిఫికెట్ లభించకపోవచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో మరికొన్నాళ్లపాటు అతడు ఆటకు దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పృథ్వీ షా గురించి అప్డేట్ అందించాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశాయి. ‘‘బీసీసీఐ జాతీయ అకాడమీ పృథ్వీ షాకు ఆర్టీపీ సర్టిఫికెట్ జారీ చేసింది. బుధవారమే దీనిని ముంబై క్రికెట్ అసోసియేషన్కు కూడా పంపించింది. ఎన్సీఏ నెట్స్లో అతడు బాగా ప్రాక్టీస్ చేశాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. సెలక్ట్ చేశామన్న సెక్రటరీ మరోవైపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజింక్య నాయక్ పృథీ షా రీఎంట్రీని ధ్రువీకరించాడు. షాను జట్టులో చేర్చామని.. ముంబై తరఫున తదుపరి మ్యాచ్లో అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా అజింక్య రహానే కెప్టెన్సీలో ఫిబ్రవరి 2 నుంచి ముంబై.. బెంగాల్తో మ్యాచ్ మొదలుపెట్టనుంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక. కాగా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్గా పేరొందిన పృథ్వీ షా టీమిండియాలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఛాన్స్లు దక్కించుకోలేకపోయాడు. ఇక షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ టీమిండియాలో రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా పాతుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియా స్టార్ ఓపెనర్కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
శ్రేయస్ అయ్యర్ ఇరగదీశాడు.. 199 పరుగులు..!
త్వరలో జరుగనున్న ఆసియా కప్-2023 కోసం భారత సెలెక్టర్లు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్ ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుని టీమిండియాకు ఎంపికయ్యాడు. అయ్యర్ ఎంపిక, అతని ఫిట్నెస్పై పలువురు మాజీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీకి చెందిన ఓ కీలక అధికారి ఈ అంశాలపై వివరణ ఇచ్చాడు. అయ్యర్తో పాటు గాయం నుంచి కోలుకుని ఆసియాకప్కు ఎంపికైన కేఎల్ రాహుల్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడని స్పష్టం చేశాడు. ప్రోటోకాల్ ప్రకారం బెంగళూరులోని ఎన్సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో ఇరువురు చాలా చరుగ్గా కనిపించారని, వారిద్దరిలో మునుపటి కంటే అధికమైన ఉత్సాహం కనిపించిందని తెలిపాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 150కిపైగా బంతులను ఎదుర్కొని 199 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా అయ్యర్ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడని వెల్లడించాడు. ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఓ ఆటగాడు ఇంతకంటే ఏం చేయాలని ప్రశ్నించాడు. అయ్యర్తో పాటు రాహుల్ కూడా 100 శాతం ఫిట్నెస్ సాధించారని, ఎన్సీఏలో వారిద్దరూ గత రెండునెలలుగా కఠోరంగా శ్రమించారని తెలిపాడు. రాహుల్, అయ్యర్లు పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే సెలెక్టర్లు హడావుడిగా వారిని ఆసియాకప్కు ఎంపిక చేశారన్నది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. ఎన్సీఏలో ఫిట్నెస్ ప్రామాణికాలు చాలా కఠినంగా ఉంటాయని, ఇక్కడ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడమంటే ఆషామాషీ విషయం కాదని తెలిపాడు. ఇకనైనా రాహుల్, అయ్యర్ల ఎంపికపై అనవసర రాద్దాంతాలు మానాలని, వారివురు పూర్తి ఫిట్గా ఉన్నందుకే వారి ఎంపిక జరిగిందని స్పష్టం చేశాడు. కాగా, వరల్డ్కప్ సన్నాహకాల్లో భాగంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఎంపిక హడావుడిగా జరిగిందని పలువురు మాజీలతో పాటు కొందరు నెటిజన్లు సైతం అనుమానిస్తున్నారు. అయితే, తాజాగా ఎన్సీఏ అధికారి వివరణతో అంతా మిన్నకుండిపోయారు. ఇదిలా ఉంటే, ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా కప్-2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 6 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ జరుగనుంది. లంకలోని పల్లెకెలె స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్.. ఇదే మైదానంలో టీమిండియాను ఢీకొంటుంది. -
బెంగళూరుకు పయనమైన రోహిత్, కోహ్లి.. వాళ్లంతా వచ్చేది అప్పుడే!
Asia Cup 2023: ఆసియా కప్-2023 నేపథ్యంలో టీమిండియా సన్నాహకాలు మొదలయ్యాయి. జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు భారత జట్టు ఆటగాళ్లు పయనమయ్యారు. విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ ఆరంభం కానుంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో పాటు స్టాండ్ బైగా సంజూ శాంసన్ను ఎంపిక చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరమై జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం పునరావాసం పొందుతున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ఈవెంట్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో ఏడాది కాలంగా ఆటకు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే పునరాగమనం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్లో భాగంగా.. ఘనంగా కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక బుమ్రా నేతృత్వంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా బుధవారం నాటి ఆఖరి టీ20 ముగిసిన తర్వాత భారత్కు పయనం కానుంది. వీరి సంగతి ఇలా ఉంటే.. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బెంగళూరుకు చేరుకుంటున్నారు. మిగతా వాళ్లు కూడా వచ్చిన తర్వాత ఆగష్టు 29 వరకు ట్రెయినింగ్ క్యాంపు నిర్వహించనుంది బీసీసీఐ. ఆసియా కప్-2023కి ఎంపికైన జట్టులోని సభ్యులు మాత్రమే ఈ శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ మార్గదర్శనంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సెప్టెంబరు 2న శ్రీలంకలో పాకిస్తాన్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది చదవండి: Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్ -
Asia Cup 2023: గ్రౌండ్లో దిగిన రోహిత్ శర్మ.. ఫొటోలు వైరల్
Rohit Sharma Pics Goes Viral: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగాడు. గ్రౌండ్లో పరుగులు తీస్తూ ఫిట్గా కనిపించిన హిట్మ్యాన్.. ఆసియా వన్డే కప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో చివరిగా రోహిత్ వన్డే మ్యాచ్ ఆడాడు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సెంచరీతో చెలరేగిన ఈ ముంబైకర్.. 1-0తో జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్, కోహ్లి భారత్కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్ ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ ప్రాక్టీస్ కోసం కేటాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్, షార్ట్స్లో జాగింగ్ షూ వేసుకుని రోహిత్ స్టైలిష్గా కనిపించాడు. ఇక ఆసియా కప్ టోర్నీకి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆగష్టు 23న అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లుతో కూడిన భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగష్టు 18న మొదలైన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
హ్యాపీ బర్త్డే మచ్చా.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు: పంత్ భావోద్వేగం
Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్నెస్పై దృష్టి సారించి జిమ్లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్డే సెలబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్డే మచ్చా.. థాంక్యూ ‘‘కొంచెం బ్లర్గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్సీఏకు పంత్ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. కాగా ఇప్పటికే ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావ్!'
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్కు అతను బెంచ్కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్కు ఎంపిక కావడంతో బ్యాటింగ్లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు బెంచ్కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ రీఎంట్రీ ..!
-
కొత్త పొద్దుపొడుపు
అవును... భారత క్రికెట్లో ఇది కొత్త పొద్దుపొడుపు. దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్–19 టీ20 వరల్డ్ కప్లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతలుగా నిలిచిన క్షణాలు అలాంటివి. షఫాలీ వర్మ సారథ్యంలో తెలుగమ్మాయి సునీత గొంగడి సహా 15 మంది సభ్యుల టీనేజ్ బాలికల జట్టు తమ విజయంతో దేశ మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్వయంగా దక్షిణాఫ్రికాకు వచ్చి ఫైనల్కు ముందు స్ఫూర్తి నింపిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా సహా అందరి ఆశలనూ, అంచనాలనూ నిజం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పురుషులకు సమానంగా మహిళలకూ వేతనమివ్వాలని గత అక్టోబర్ చివరలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన వేళ... తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏర్పాటైన క్షణాన... వీస్తున్న మార్పు పవనాలకు ప్రపంచ కప్ సాధన ఓ కొత్త జోడింపు. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం 1983లో పురుషుల ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత భారత క్రికెట్ మరింత మెరుగైన రీతిలో సమూలంగా మారిపోయింది. తాజాగా మన బాలికలు సాధించిన విజయం మన మహిళా క్రికెట్కు సరిగ్గా అలాంటి ఉత్ప్రేరకమే. గతంలో మన మహిళా క్రికెట్ జట్టు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరింది. అయితే, ఏ ఫార్మట్లోనైనా మన మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ సాధించడం ఇదే తొలిసారి. బీసీసీఐ మహిళా క్రికెట్పై ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో ఈ విజయం ఒక కొత్త ఉత్సాహం, ఊపునిచ్చాయి. విరాట్ కోహ్లీ తదితరులది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం కాగా, షఫాలీ వర్మ సారథ్యంలోని అండర్–19 వరల్డ్ ఛాంపియన్ బాలికలను రానున్న డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం అనుకోవచ్చు. 2008 బాలుర అండర్–19 వరల్డ్ కప్లో కోహ్లీ బృందం ఇలాగే విజయం అందుకుంది. అదే సమయంలో ఐపీఎల్ రావడంతో రాత్రికి రాత్రి పలువురు లక్షాధికారులయ్యారు. ఆటకు అవతార మూర్తులై, ఇంటింటా పాపులర్ అయ్యారు. భారత క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు మన బాలికల జట్టు ప్రపంచ ఛాంపి యన్లుగా అవతరించిన సమయానికి డబ్ల్యూపీఎల్ కొత్తగా వచ్చింది. త్వరలో తొలి డబ్ల్యూపీఎల్ వేలంతో ఈ క్రికెటర్లలో కొందరు లక్షాధికారులు కానున్నారు. కష్టాలు కడతేరి, ఆర్థిక, సామాజిక హోదా మారిపోనుంది. ఈ మ్యాచ్ల ప్రసార హక్కులు, పలు ఫ్రాంఛైజీల బిడ్లు దాదాపు రూ. 5.5 వేల కోట్ల పైగా పలికినట్టు వార్త. మహిళా క్రికెట్కు ఇవి బంగారు క్షణాలంటున్నది అందుకే. అయితే, ఎన్ని లీగ్లు వచ్చినా అంతిమంగా అగ్రభాగాన నిలిపేది ప్రతిభే. భారత అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఈ ఐసీసీ వరల్డ్ కప్లో మొదటి నుంచి తన సత్తా చాటుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆట మెరుగుపరుచుకుంటూ ఆస్ట్రేలియా (ప్రాక్టీస్ మ్యాచ్లో) సహా అనేక జట్లను అధిగమించి, ఫైనల్స్కు చేరింది. కప్ సాధించింది. మన బాలికల క్రికెట్ ఈ వరల్డ్ కప్ ఘనత సాధించడం వెనుక ఆటగాళ్ళతో పాటు పలువురి పాత్ర ఉంది. జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) శ్రద్ధ, మహిళా కోచ్ నూషిన్ అల్ ఖదీర్ అసాధారణ అంకితభావం లాంటివి అండగా నిలిచాయి. పద్ధెనిమిదేళ్ళ క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత సీనియర్ మహిళా జట్టులో సభ్యురాలైన నూషిన్ ఆకలిగొన్న పులిలా బరిలోకి దిగి, ఈ టీనేజ్ బాలికలను తీర్చిదిద్దారు. పోటీలోని వివిధ జట్ల క్రికెటర్ల కన్నా ప్రతిభావంతులుగా నిలిపారు. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది. కాలగతిలో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యంతో బాలికలు ఉరకలెత్తుతున్నారు. దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగవుతున్నాయనడానికి ఇది ఓ సూచన. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్ అనేక శృంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్ కప్లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో ఈ తొలి అండర్–19 టీ20 కప్లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు... మొత్తం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. దేశంలో ఆడపిల్లలకు ప్రత్యేక క్రికెట్ అకాడెమీలు వెలుస్తున్న రోజులివి. ఈ విజయం వాటికి కొత్త ఉత్తేజం. విజేతలకు ఆత్మవిశ్వాసం పెంచే ఔషధం. పురుషులకు భిన్నంగా తగిన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా అవమానాలు ఎదురైనా, ఆర్థిక – సామాజిక అవరోధాలున్నా – అవన్నీ దాటుకొని వచ్చిన స్త్రీలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఇది... కూతురు సోనా యాదవ్ క్రికెట్ షూస్ కోసం అదనపు షిఫ్ట్లు పనిచేసిన గ్లాస్ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆడబిడ్డ త్రిష శిక్షణ కోసం ఉద్యోగం వదిలి భద్రాచలం నుంచి హైదరాబాద్ మారిన తండ్రి... ఇలా ఎందరో తల్లితండ్రుల త్యాగఫలం. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇది తాజా దర్పణం. బ్యాడ్మింటన్ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్ కొత్త దీపశిఖ. దీన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేయాల్సింది ఆటల సంఘాలు, అధికారంలోని పెద్దలే. -
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత-ఏ జట్టు హెడ్ కోచ్గా సితాన్షు కోటక్
అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని భారత-ఏ జట్టు రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్కు భారత-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ పర్యటనకు భారత-ఏ జట్టు హెడ్కోచ్ వివియస్ లక్ష్మణ్ దూరమయ్యాడు. వివియస్ లక్ష్మణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా లక్ష్మణ్తో పాటు బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతాలే కూడా న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో సిరీస్కు గుజరాత్ మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ ఆకాడమీ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ను భారత-ఏ జట్టు హెడ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. అతడితో పాటు బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ఈ సిరీస్లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా నవంబర్ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక రెండు మ్యాచ్ల అనంతరం భారత సీనియర్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. తొలి నాలుగు రోజుల మ్యాచ్కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్ రెండో నాలుగు రోజుల మ్యాచ్కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్ భరత్! చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
అడుగులో అడుగు వేస్తున్న జడ్డూ.. వీడియో వైరల్
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలీ సర్జరీ అనంతరం ఎన్సీఏ క్యాంప్లో కోలుకునే పనిలో ఉన్నాడు. కాగా కుడి మోకాలికి బ్యాండేజీతో ఉన్న జడేజా ఫిట్నెస్ రూంలో మెళ్లిగా అడుగులు వేస్తూ కనిపించాడు. అయితే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ఇన్స్టాగ్రామ్లో స్వయంగా షేర్ చేసిన రవీంద్ర జడేజా ''పాపా-పగిలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మోకాలి గాయంతో రవీంద్ర జడేజా అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. ఇప్పటికే ఆసీస్, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్లకు దూరమైన జడేజా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనుండడంతో ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. కాగా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తున్నాడు. తన వైవిధ్యమైన బౌలింగ్తో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన అక్షర్ పటేల్.. రానున్న టి20 ప్రపంచకప్లో కీలకం కానున్నాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) చదవండి: దిల్షాన్ ఆల్రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్లైన్! -
ఆసియా కప్కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్ట్..!
ఆసియా కప్ 2022 కోసం యూఏఈకు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కానున్నారు. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 18న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. అక్కడ వారికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించునున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మెరకు.. "ఆసియా కప్లో పాల్గొనే భారత బృందం ఆగస్టు 18న నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. వారు అక్కడ ఫిట్నెస్ పరీక్షలను ఎదుర్కొనున్నారు. ఇది ఆటగాళ్ల విరామం తర్వాత తప్పనిసరి ప్రోటోకాల్. ఇక ఆగస్టు 20న మా జట్టు ఆటగాళ్లు దుబాయ్కి బయలుదేరుతారు. అక్కడకి చేరుకున్నాక పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనున్నాము" అని అతడు పేర్కొన్నారు. మరోవైపు జింబాబ్వే వన్డే, ఆసియా కప్ రెండు జట్లులోను భాగమైన దీపక్ హుడా, అవేష్ ఖాన్ ఆగస్టు 22న సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి దుబాయ్కు చేరుకుంటారు. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆగస్టు 28 తలపడనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఆసియా కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్! ఇక కష్టమే! -
వెస్టిండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..!
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపికైన భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో అతడు కరీబియన్ దీవులకు ఆదివారం పయనమయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కుల్ధీప్ వెల్లడించాడు. త్వరలో కరేబియన్లో కలుద్దాం, నా సహచర ఆటగాళ్లతో చేరడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ఇనస్టాగ్రామ్ ఖాతాలో కుల్దీప్ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్, ఇంగ్లండ్ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో విండీస్తో వన్డే సిరీస్కు కాకుండా టీ20 సిరీస్కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీ20 సిరీస్కు ముందు కుల్దీప్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది అని జట్టు ఎంపిక సమయంలో సెలక్షన్ కమిటీ పేర్కొంది. ఇక తాజాగా కుల్ధీప్ యాదవ్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "ఆదివారం( జులై 24) కుల్ధీప్కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాం. అందులో అతడు ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి నేరుగా ట్రినిడాడ్కి పయనమయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. ఇక వన్డే సిరీస్ అనంతరం ఐదు టీ20ల్లో విండీస్తో భారత్ తలపడనుంది. చదవండి: IND vs WI: వన్డేల్లో వెస్టిండీస్ ఓపెనర్ అరుదైన ఫీట్.. నాలుగో ఆటగాడిగా..! -
జిమ్లో తెగ కష్టపడుతున్న రాహుల్.. వీడియో వైరల్..!
విండీస్తో టీ20 సిరీస్కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తెగ కష్టపడుతున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్కు అఖరి నిమిషంలో రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్ తిరిగి విండీస్ సిరీస్తో తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే ఈ సిరీస్కు భారత తుది జట్టులో చోటు దక్కాలంటే రాహుల్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్నెస్ సాధించేందుకు జిమ్లో చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా విండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు,5 టీ20ల సిరీస్లో భారత్ తలపడనుంది. జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్ ప్రారభం కానుంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్ చదవండి: NZ vs IRE 2nd T20: ఐర్లాండ్ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కైవసం..! View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్!
గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాల్సిన రాహుల్ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే. అనంతరం అతడు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా త్వరలో వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్తో భారత జట్టులోకి రాహుల్ పునరాగమనం చేయనున్నాడు. విండీస్తో వన్డే సిరీస్కు కాకుండా టీ20 సిరీస్కు రాహుల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడు తన ఫిట్నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చుతున్నాడు. సన్నాహాల్లో భాగంగా భారత మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బౌలింగ్లో రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత కొన్ని నెలలగా గాయం కారణంగా జట్టుకు దూరమైన ఝులన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. జూలన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ మహిళల వన్డే వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై ఆడింది. చదవండి: Lendl Simmons : అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! K L Rahul is batting and Jhulan Goswami is bowling. He is fully fit for West Indies tour 💙🔥 #MenInBlue 📍NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND pic.twitter.com/UAfCxhdimc — 𝘛𝘶𝘴𝘩𝘢𝘳 ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022 -
టీమిండియా టి20 తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఇంగ్లండ్కు వెళ్లనుండటంతో తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ను నియమించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఆడిన తర్వాత జూన్ 19న భారత్ ఐర్లాండ్కు పయనమవుతుంది. అక్కడ జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్లో రెండు మ్యాచ్లు ఆడుతుంది. చదవండి: Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో! -
VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్నయ్యా..
అబిడ్స్:చిన్నప్పటి నుంచే అభిరుచికి అనుగుణంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన బౌలింగ్ మిషిన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ అంటోనితో కలిసి ప్రారంభించారు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదవడం తన అదృష్టమన్నారు. చిన్నప్పుడే స్కూల్లో విద్యతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్గా ఎదిగానన్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అయినా చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రికెట్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ ఆంటోని మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో రాణించేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ జాకబ్, అజిత్, రమేష్, బ్రిజ్ మోహన్, పుణ్యవతి, సంపత్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్లు పరోక్ష హెచ్చరికలు పంపారు. త్వరలో నిర్వహించనున్న ఫిట్నెస్ క్యాంప్కు పదిరోజుల పాటు ఎన్సీఏకు అందుబాటులో ఉండాలంటూ తెలిపింది. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్న పాండ్యా ఇటీవలే ఎన్సీఏకు వెళ్లనని ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే సెలెక్టర్ల హెచ్చరికతో పాండ్యా ఎన్సీఏకు వెళ్లనున్నట్లు సమాచారం. మార్చి 26 నుంచి ఐపీఎల్ మొదలుకానున్న నేపథ్యంలో పాండ్యా మరో రెండు రోజుల్లో ఎన్సీఏలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్ మెగావేలానికి ముందు హార్దిక్ను రూ. 15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. ఆ జట్టుకు హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనబెడితే.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీ కానున్నారు. మరోవైపు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం టీమిండియా తర్వాత ఆడబోయే మ్యాచ్లపై దృష్టి పెట్టనున్నాడు. అందులో టి20 ప్రపంచకప్ 2022 కూడా ఉంది. దీనికి ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించాలని.. జట్టు కాంబినేషన్ ఎలా ఉండాలి.. ఆటగాళ్లంతా ఫిట్నెస్తో ఉన్నారా లేదా అనేది చూసుకోనున్నారు. ఈ విషయాలపై ద్రవిడ్, రోహిత్లు ఇప్పటికే చర్చించారని.. ఎవరు టి20 ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉండాలనేది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్ ప్రారంభానికి ముందే పదిరోజులు ఫిట్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంప్కు మొత్తం 25 క్రికెటర్లు హాజరు కానున్నారు. ఎన్సీఏ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫిట్నెస్ క్యాంప్ జరగనుంది. కాగా గాయాలతో లంకతో సిరీస్కు దూరమైన కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్లు ఇప్పటికే ఎన్సీఏలో ఉన్నారు. వారంతా తమ ఫిట్నెస్ను నిరూపించుకునే పనిలో ఉన్నారు. గతేడాది టి20 వరల్డ్కప్ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడని హార్దిక్ పాండ్యాపై రోహిత్ నమ్మకముంచాడు. అతన్ని మరో ఆల్రౌండర్గా పరిగణిస్తూ వచ్చే ప్రపంచకప్లో అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు. కాగా దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ.. ''హార్దిక్ పాండ్యా క్యాంప్లో జాయిన్ కానున్నాడు. ముందు అనుకున్న ప్రకారం హార్దిక్ పాండ్యా లిస్టులో లేడు. కానీ రోహిత్, ద్రవిడ్ సూచనల మేరకు హార్దిక్ పేరును ఖరారు చేశాం'' అంటూ చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ క్యాంప్కు హాజరుకానున్న 25 మంది ఆటగాళ్లు.. రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా. చదవండి: IPL 2022: ఐర్లాండ్ యువ పేసర్కు బంపరాఫర్.. ఏకంగా సీఎస్కే తరఫున.. IPL 2022: ఆర్సీబీలో మహిళా థెరపిస్ట్.. కైల్ జేమిసన్తో సంబంధమేంటి? -
IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్
ఐపీఎల్ ప్రారంభానికి (మార్చి 26) ముందు ప్రాక్టీస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఆటగాళ్లను సానబెడదామనుకున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఉన్న సభ్యులు మినహాయించి బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లంతా (రంజీ ప్లేయర్లు మార్చి 6లోగా) మార్చి 4లోపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించతలపెట్టిన 10 రోజుల ఫిట్నెస్ క్యాంప్కు హాజరు కావాలని బీసీసీఐ ఆదేశించింది. సెలెక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఆటగాళ్ల ఫిట్నెస్, తదితర అంశాలపై దృష్టి సారించేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రకటనకు ముందు ఆటగాళ్లను మార్చి 8లోగా క్యాంపులకు చేరుకోవాలని ఆయా ఫ్రాంచైజీలు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్సీఏ క్యాంప్కు హాజరు కావాల్సిన కీలక ఐపీఎల్ ఆటగాళ్లు : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్. వీరిలో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ గాయాల బారిన పడి ఇప్పటికే ఎన్సీఏలో ఉన్నారు. చదవండి: IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం -
U19 WC: ద్రవిడ్, లక్ష్మణ్ మాస్టర్ ప్లాన్.. వాళ్ళ రాతలు మారిపోతాయి!
న్యూఢిల్లీ: మనోజ్ కల్రా... 2018 అండర్–19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. అయితే నాలుగేళ్ల తర్వాత కూడా అతని కెరీర్ ఊపందుకోలేదు. కల్రా మాత్రమే కాదు... ఎంతో మంది కుర్రాళ్లు వరల్డ్కప్ లాంటి విజయం తర్వాత కూడా ముందుకు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అండర్–19 వయో విభాగానికి, రంజీ ట్రోఫీకి మధ్య ఉన్న అంతరం కారణంగా వారికి సరైన మార్గనిర్దేశనం లేకుండా పోతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వారు అధిగమించలేక వెనుకబడిపోతున్నారు. ఇలాంటి ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ‘19 ప్లస్’ పేరుతో ఉండే ఈ బృందంలో అండర్–19 వరల్డ్కప్ విజేతలతో పాటు అదే వయో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఆటగాళ్లను చేరుస్తారు. పూర్తిగా క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరిస్తూ సాధనతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా (అండర్–25 తదితర) ఆయా రాష్ట్ర జట్ల తరఫున ఆడే అవకాశం కల్పిస్తారు. ఇదంతా ఎన్సీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లు జాతీయ సీనియర్, జూనియర్ సెలక్టర్లతో ఈ అంశంపై చర్చించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. -
యువ క్రికెటర్లకు రోహిత్ పాఠాలు.. ఫోటోలు వైరల్!
Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ బెంగళూరులో ఉన్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకొనేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సెంటర్కువచ్చాడు. ఇక అక్కడ శిక్షణ పొందుతున్న భారత అండర్-19 జట్టుతో రోహిత్ శర్మ ముచ్చటించాడు. యూఏఈ వేదికగా డిసెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో అండర్-19 జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ అండర్ 19 జట్టుతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సమయంలో యువ ఆటగాళ్లకు రోహిత్ విలవైన సూచనలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎలా రాణించాలో, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఆటగాళ్లకు రోహిత్ తెలియజేశాడు. వైట్ బాల్ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్న రోహిత్ శర్మ.. తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచకోవడం రానున్న ఆసియా కప్లో యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "టీమిండియా వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ.. బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్న భారత అండర్-19 జట్టుతో చాలా సమయాన్ని గడిపాడు. ఈ సమయంలో అతడు చాలా విలువైన సూచనలు చేశాడు" అని బీసీసీఐ రాసుకొచ్చింది. ఇక రిహాబిలిటేషన్ సెంటర్లో రోహిత్ శర్మతో పాటు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే! Priceless lessons 👍 👍 📸 📸 #TeamIndia white-ball captain @ImRo45 made most of his rehab time as he addressed India’s U19 team during their preparatory camp at the NCA in Bengaluru. pic.twitter.com/TGfVVPeOli — BCCI (@BCCI) December 17, 2021 -
కొత్త బాధ్యతల్లో మణికట్టు మాంత్రికుడు.. కేటీఆర్ అభినందనలు
VVS Laxman As NCA Director: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ సొగసరి బ్యాటర్, మణికట్టు మాంత్రికుడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్(వీవీఎస్ లక్ష్మణ్) కొత్త బాధ్యతలను చేపట్టాడు. భారత క్రికెట్కు అనుసంధాన సంస్థ అయిన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్గా సోమవారం ఛార్జ్ తీసుకున్న లక్ష్మణ్.. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో తొలి రోజు విధులను నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అతనే స్వయంగా సోషల్మీడియాలో షేర్ చేశాడు. కాగా, లక్ష్మణ్కు ముందు ఎన్సీఏ చీఫ్ పదవిని ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్వర్తించేవాడన్న విషయం తెలిసిందే. ద్రవిడ్కు ప్రమోషన్ రావడంతో లక్ష్మణ్ ఎన్సీఏ బాధ్యతలను చేపట్టాడు. ద్రవిడ్ను టీమిండియా హెడ్కోచ్గా నియమించడంలో కీలకపాత్ర పోషించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే.. లక్ష్మణ్ను సైతం ఒప్పించి మరీ బాధ్యతలు చేపట్టేలా చేశాడు. కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్.. భారత యువ ఆటగాళ్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు ఆటగాళ్లను సానబెట్టే పనిలో ఉంటాడు. కంగ్రాట్స్ బ్రదర్.. :కేటీఆర్ ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు లక్ష్మణ్కు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మీరు, రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం నాకుంది’ అంటూ కేటీఆర్ ట్వీటారు. Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏 I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1 — KTR (@KTRTRS) December 14, 2021 చదవండి: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ -
ఎన్సీఏ హెడ్గా వివిఎస్ లక్ష్మణ్!
VVS Laxman May Take Charge As NCA Head.. టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సిఏ) చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్సిఏ హెడ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ .. టీమ్ ఇండియా కోచ్గా బిసీసీఐ నియమించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి వివిఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధ్రువీకరించారు. తొలుత ఈ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ నిరాకరించాడని సమాచారం. అయితే గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా చర్చలు జరిపిన తర్వాత లక్ష్మణ్ అంగీకరించారని సమాచారం. మరో వైపు రాహుల్ ద్రవిడ్ విషయంలోనూ ఇదే జరిగింది. టీమ్ ఇండియా కోచ్ బాధ్యతలను తీసుకునేందుకు రాహుల్ తిరస్కరించగా.. గంగూలీ ఒప్పించారని వార్తలు వచ్చాయి. రాబోయే రెండు, మూడేళ్లలో టీమిండియా టి20 ప్రపంచకప్ 2022తో పాటు టెస్టు చాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడనుంది. క్రికెట్ దిగ్గజాలు ఉన్నత పదవులను ఇవ్వడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్దే టైటిల్) -
ఎన్సీఏ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్..!
VVS Laxman To Replace Rahul Dravid As Next NCA Head: నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్గా టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టయిలిష్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆ స్థానాన్ని లక్షణ్తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లక్షణ్ను ఒప్పించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలే నేరుగా రంగప్రవేశం చేశారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్ పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తే, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత క్రికెట్ మరింత వైభవాన్ని సంతరించుకోవాలంటే.. మాజీలు తమ అనుభవాల్ని పంచుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ బాస్ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: మైఖేల్ వాన్పై నిషేధం..! -
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం
BCCI Invites Applications For Team India Head Coach Position: భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలు అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26 ఆఖరి తేదీ కాగా, ఇతర పదవులకు నవంబర్ 3 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. టీమిండియా హెడ్ కోచ్గా భారత మాజీ సారథి రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే పేర్లు దాదాపుగా ఖారారైన నేపథ్యంలో కేవలం ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటింగ్ కోచ్గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. చదవండి: Sania Mirza : భారత్-పాక్ మ్యాచ్ రోజు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతాను.. -
ద్రవిడ్ మాత్రమే దరఖాస్తు చేయడంతో...
న్యూఢిల్లీ: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్ ఆఫ్ క్రికెట్’ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఒక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరో సారి ఎన్సీఏ చీఫ్గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. రెండేళ్ల క్రితం ఎన్సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు. భారత్ ‘ఎ’, జూనియర్ జట్ల కోచ్గా రిజర్వ్ బెంచ్ సత్తా పెంచాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్కే అన్నివైపులా అనుకూలతలు, అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి ఎన్సీఏ పునరావాస శిబిరానికి చేరగా, శుబ్మన్ గిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లంతా పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకుంటే యూఏఈలో జరిగే ఐపీఎల్లో పాల్గొనే అవకాశముంది. -
Rahul Dravid: ఎన్సీఏ డైరెక్టరా లేక టీమిండియా కోచ్ పదవా..?
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్సీఏ డైరెక్టర్గా ద్రవిడ్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ధవన్ సేనకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు. ఈ పరిమిత ఓవర్ల పర్యటనలో ద్రవిడ్ ప్రభావం నామమాత్రమే అయినా.. అతన్ని భవిష్యత్తు టీమిండియా హెడ్ కోచ్గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. రవిశాస్త్రి పదవీకాలాన్ని బీసీసీఐ పొడించడం దాదాపు అసాధ్యమే. ఈ నేపథ్యంలో ఎన్సీఏగా డైరెక్టర్గా, భారత్-ఏ, అండర్-23, అండర్-19, అండర్-16 జట్ల కోచ్గా పని చేసిన అనుభవమున్న ద్రవిడ్ వైపు బోర్డు మొగ్గు చూపే అవకాశం ఉంది. ది వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకోవడం, ఇండియా రిజర్వ్ బెంచ్ను బలంగా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించడం ద్రవిడ్కు కలిసొచ్చే అంశాలు. అందులోనూ ద్రవిడ్ సహచరుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా నూతన హెడ్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు స్పష్టమవుతోంది. -
రోహిత్ ఫిట్గా ఉన్నా..
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శుక్రవారం ఫిట్నెస్ పరీక్ష పాస్ అయిన టాప్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ మరింత స్పష్టతనిచ్చింది. అతను ఆస్ట్రేలియాకు వెళుతున్నాడని... అయితే టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగే విషయంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో భారత జట్టుతో పాటు ఉన్న బోర్డు వైద్య బృందం రోహిత్ ఫిట్నెస్ను పునఃసమీక్షించిన తర్వాతే ఆడే విషయం తెలుస్తుందని స్పష్టం చేసింది. ‘ఐపీఎల్లో గాయపడిన రోహిత్ ఎన్సీఏలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ‘క్లినికల్లీ ఫిట్’గా ఉన్నాడు. అతని బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని పరీక్షించిన ఎన్సీఏ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అతను సుదీర్ఘ సమయం పాటు ఆడే అంశంలో మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్ ముగిసిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం రోహిత్ ఫిట్నెస్ను మళ్లీ పరీక్షిస్తుంది. దీనిని బట్టే మ్యాచ్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. -
రోహిత్ శర్మ ఫిట్
బెంగళూరు: భారత అగ్రశ్రేణి బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించిన పరీక్షలో రోహిత్ సఫలమయ్యాడు. అతను తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగిందని... రోహిత్ ఫిట్నెస్, బ్యాటింగ్ సమయంలో అతని కదలికలతో సంతృప్తి చెందిన ద్రవిడ్ తన నివేదికను బోర్డుకు పంపించినట్లు సమాచారం. బీసీసీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆది లేదా సోమవారాల్లో రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరతాడు. చార్టర్డ్ ఫ్లయిట్లో దుబాయ్ వెళ్లి అక్కడినుంచి సిడ్నీకి పయనమవుతాడు. ఆసీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోహిత్ ముందుగా భారత జట్టుతో సంబంధం లేకుండా 14 రోజుల కఠినమైన క్వారంటైన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను జట్టుతో కలుస్తాడు. జనవరి 7నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్లో కండరాల గాయానికి గురైన అనంతరంనుంచి అతని ఫిట్నెస్, జట్టులోకి ఎంపిక చేయకపోవడం, కెప్టెన్కు సమాచారం ఇవ్వకపోవడంవంటి తదితర అంశాలు వివాదానికి కారణమయ్యాయి. తాజా పరిణామంతో వాటికి ముగింపు లభించింది. -
రోహిత్ శర్మకు లైన్ క్లియర్
బెంగళూరు : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో హిట్మ్యాన్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) కాగా ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ సఫలం కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆసీస్- భారత్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది.(చదవండి : అందుకే హార్దిక్ను వద్దనుకున్నాం: కోహ్లి) -
నేడు రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్ష
బెంగళూరు: ఇటీవల వివాదానికి కేంద్రంగా మారిన రోహిత్ శర్మ ఫిట్నెస్ వ్యవహారంపై ఎట్టకేలకు నేడు స్పష్టత రానుంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నేడు రోహిత్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారు. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు కూడా దీనిని పర్యవేక్షిస్తారని సమాచారం. ఫిట్నెస్ పరీక్షలో సఫలమైతేనే అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. అంతా బాగుండి అత ను ఆస్ట్రేలియాకు వెళితే నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. తొలి రెండు టెస్టులకు రోహిత్ దూరం కావడం ఇప్పటికే ఖాయం కాగా... చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండవచ్చు. -
జట్టు కోసం ఎక్కడైనా ఆడతా
న్యూఢిల్లీ: జట్టు అవసరాలకి అనుగుణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గాయం నుంచి కోలుకుంటోన్న రోహిత్... తాను టీమిండియాతో కలిసే సమయానికల్లా జట్టులో తన బ్యాటింగ్ స్థానం ఖరారు అవుతుందని పేర్కొన్నాడు. ‘గతంలో ఎన్నోసార్లు చెప్పిందే మళ్లీ చెప్తున్నా. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమంటే అక్కడ సంతోషంగా ఆడతా. ఓపెనర్గా నా స్థానాన్ని మారుస్తారో? లేదో? నాకు తెలియదు. విరాట్ కోహ్లి భారత్కు వచ్చేశాక ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే అంశంపై ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న మా జట్టు ఓ అంచనాకు వచ్చిందని అనుకుంటున్నా. అక్కడికి వెళ్లాకే నాకూ నా స్థానంపై స్పష్టత వస్తుంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఓపెనర్గా వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ... సంప్రదాయ క్రికెట్లో రాణించేందుకు ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పిచ్లపై పెద్దగా బౌన్స్ ఉండదని వ్యాఖ్యానించాడు. ‘2018 పర్యటనలో ఎంతమంది భారత బ్యాట్స్మెన్ బౌన్సర్లకు అవుటయ్యారు? పెర్త్ మినహా అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలలో బౌన్స్ ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ కొత్త బంతితో స్టార్క్, కమిన్స్, హాజెల్వుడ్ బౌన్స్, స్వింగ్ చేసేందుకే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎక్కువ బంతులు నేరుగా బ్యాట్పైకి వచ్చే అవకాశముంది. ఈ ఫార్మాట్లో రాణించాలంటే ప్రాథమిక అంశాలే కీలకం. అందుకే వాటిపైనే దృష్టి సారించా. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. వాటి నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు’ అని రోహిత్ శర్మ వివరించాడు. మరో నాలుగైదు రోజుల్లోనే... ఇషాంత్, రోహిత్ ఆస్ట్రేలియా రావాలన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పాల్గొనాలంటే భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితులు మారిపోతాయని అన్నారు. క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా భారత్ నుంచి బయల్దేరాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘రోహిత్, ఇషాంత్ టెస్టు సిరీస్ ఆడాలంటే మరో నాలుగు లేదా ఐదు రోజుల్లోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కాలి. లేనిపక్షంలో వారికి ఇబ్బందిగా మారుతుంది. క్వారంటైన్ కారణంగా వారిద్దరు డిసెంబర్ 6–8 వరకు జరిగే తొలి వార్మప్ మ్యాచ్కు దూరం కానున్నారు. ఇంకా ఆలస్యమైతే రెండో వార్మప్ మ్యాచ్ (డిసెంబర్ 11–13)కు కూడా దూర మయ్యే అవకాశముంది. టెస్టు సిరీస్లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్లోనైనా వారిద్దరూ ఆడాల్సి ఉంటుంది. బీసీసీఐ వీలైనంత త్వర గా వారిని ఆస్ట్రేలియా పంపించాలి’ అని రవిశాస్త్రి సూచించారు. -
వంద శాతం ఫిట్గా మారేందుకే..
భారత క్రికెట్కు సంబంధించి ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన అంశం రోహిత్ శర్మ ఫిట్నెస్... ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అతను గాయపడి నాలుగు మ్యాచ్లకు దూరం కావడం... ఫిట్గా లేడంటూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం...ఆపై పూర్తిగా కోలుకోకుండానే రోహిత్ బరిలోకి దిగడం... గంగూలీ హెచ్చరిక, రవిశాస్త్రి వ్యాఖ్య... మళ్లీ టెస్టు జట్టులో చోటు... ఇలా ఎక్కడా అతని గాయంపై స్పష్టత లేకుండా వ్యవహారం సాగింది. చివరకు జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) చేరుకున్న రోహిత్... తొలిసారి తన గాయం తీవ్రతపై పెదవి విప్పాడు. వంద శాతం ఫిట్గా మారేందుకే ఆస్ట్రేలియా వన్డే, టి20లకు దూరమైనట్లు వెల్లడించిన అతను... తన గాయం వివాదంగా మారడం పట్ల అసంతృప్తిని ప్రదర్శించాడు. బెంగళూరు: ఐపీఎల్లో తాను కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విషయాన్ని అటు బీసీసీఐకి, ఇటు ముంబై ఇండియన్స్కు స్పష్టంగా తెలియజేసినట్లు భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ అంశంపై బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అతను చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో బయట అసలు ఏం జరుగుతుందో, అందరూ దేని గురించి చర్చించుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను బీసీసీఐ, ముంబై ఇండియన్స్కి గాయం గురించి స్పష్టంగా వివరించాను. గాయమైన తర్వాత నేను తర్వాతి మ్యాచ్లు ఆడగలనా లేదా అని ఆలోచించాను. అయితే మైదానంలో దిగితే తప్ప దాని తీవ్రత తెలీదు. టి20 ఫార్మాట్లో ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆడగలనంటూ ముంబై యాజమాన్యానికి చెప్పాను. ప్రతీ రోజూ ఫిట్నెస్ మెరుగవుతుండటంతో మళ్లీ బరిలోకి దిగాను. బాగుంటేనే ప్లే ఆఫ్స్ ఆడతానని, లేదంటే తప్పుకుంటానని కూడా వారికి స్పష్టం చేశాను. నా గాయం గురించి, ప్లే ఆఫ్స్లో ఆడటం, ఆస్ట్రేలియాకు వెళ్లడం గురించి ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు అంటే నేను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. ముందు జాగ్రత్త కోసమే... కండరాల గాయం నుంచి తాను చాలా వరకు కోలుకున్నా... మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని రోహిత్ వెల్లడించాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే ఆస్ట్రేలియాకు వెళ్లి టెస్టులు ఆడతానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు నా గాయం తీవ్రత చాలా వరకు తగ్గింది. అయితే మరింత ఫిట్గా మారేందుకు ప్రయత్నిస్తున్నా. టెస్టు ఫార్మాట్లో ఆడాలంటే నా వైపు నుంచి ఎలాంటి లోపం ఉండకూడదని భావించే ఇప్పుడు ఎన్సీఏకు వచ్చా. పూర్తిగా మెరుగయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే 11 రోజుల వ్యవధిలో 6 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న వన్డే, టి20 సిరీస్ల కోసం తొందరపడలేదు. మరో 25 రోజులు నేను శ్రమిస్తే టెస్టులు ఆడగలనని నమ్ముతున్నా. ఇది చాలా సులువైన నిర్ణయం. బయటివారికి ఇది ఎందుకు అంత కష్టంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు’ అని రోహిత్ చెప్పాడు. ఒక్కసారిగా ఫలితాలు రావు... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కవని రోహిత్ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు. ‘మరో జట్టుతో రోహిత్ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు. పొలార్డ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్రైజర్స్కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్ చేసి వికెట్లు తీయగల బౌలర్ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం’ అని రోహిత్ విశ్లేషించాడు. -
వామ్మో ఎన్సీఏనా!
ప్రపంచ కప్ల హీరోలు యువరాజ్, గౌతమ్ గంభీర్లతో పాటు ఎంతోమంది జాతీయ, దేశవాళీ క్రికెటర్లను రాటుదేల్చిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఇప్పుడో నామమాత్రపు అకాడమీ అయింది. కేవలం పునరావాసం, ఫిట్నెస్ టెస్టులను నిర్వహించే కేంద్రంగా మారిపోయింది. కానీ అసలు ఎన్సీఏను స్థాపించింది వీటికోసం కానేకాదు. కపిల్దేవ్, సచిన్, లక్ష్మణ్, శ్రీనాథ్, కుంబ్లేలాంటి దిగ్గజాలను తయారు చేయడం కోసం. మరిప్పుడు జరిగేది వేరు. వామ్మో ఎన్సీఏనా... అక్కడికెందుకు అనే పరిస్థితి తలెత్తింది. మొత్తానికి అకాడమీకే చికిత్స చేయాల్సిన అవసరం వచ్చిందిపుడు! సాక్షి, క్రీడావిభాగం: బీసీసీఐ దివంగత పాలనాధ్యక్షుడు రాజ్సింగ్ దుంగార్పూర్ ఓ మేధావి. ఆలోచనల్లో, భవిష్యత్తు నిర్మాణంలో ఆయన్ని మించినవాడు భారత క్రికెట్ నియంత్రణ మండలిలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అలనాడు చీఫ్ సెలక్టర్గా ఓ ముంబై కుర్రాడ్ని భారత జట్టుకు ఎంపిక చేస్తే అతను ఏకంగా ‘24 క్యారెట్ గోల్డ్’ (24 ఏళ్లు క్రికెట్ ఆడిన) సచిన్గా విశ్వవిఖ్యాతమయ్యాడు. అనంతరం బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్లో మతమైన క్రికెట్ కోసమే 2000లో ప్రత్యేకంగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని బెంగళూరులో స్థాపించారు. ఆయన లక్ష్యం సచిన్, కపిల్దేవ్, శ్రీనాథ్లాంటోళ్లు మరెంతో మంది రావాలని! ఆయన లక్ష్యం ఉన్నతమైంది కాబట్టే మొదట్లో కుర్రాళ్లు బాగానే రాటుదేలారు. కానీ కాలం గడిచేకొద్దీ అకాడమీ గమనం మారింది. ప్రతిభాన్వేషణ మరిచి దెబ్బలతో వచ్చిపోయే ఆటగాళ్లతో సరిపెట్టుకుంది. అలా పూర్తిగా పునరావాస శిబిరమైంది. ఆ తర్వాత అదీ లేదు. ఓ పరీక్షా కేంద్రంగా... బెంగళూరు అకాడమీ రానురాను గాయాల నుంచి కోలుకునేందుకు వెళ్లే నామమాత్రపు శిక్షణ, సలహా కేంద్రమైంది. అందుకేనేమో వృద్ధిమాన్ సాహా తదితరులు ఎన్సీఏకు మళ్లీ మళ్లీ వెళ్లొచ్చే పనిపడుతోంది. ఇప్పుడేమో కొందరు ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం దండగనే ఉద్దేశంతో సొంతంగా కష్టపడుతున్నారు. దీంతో ఇక ఫైనల్గా ‘ఫిట్నెస్’ పరీక్ష కేంద్రమైంది ఎన్సీఏ. అంతా బాగయ్యాక నాకో టెస్టు పెట్టరూ అని అడిగేలా దిగజారి పోయింది. ఇలా అకాడమీ అర్థమే మారిపోయింది. ఇది పద్ధతి కాదనుకున్నాడో ఏమో ఎన్సీఏ డైరెక్టర్ ద్రవిడ్... బుమ్రాకు కుదరదని చెప్పాడు. చివరకు అధ్యక్షుడు గంగూలీ సర్దిచెప్పడంతో ఈ సమస్య తాత్కాలికంగా సమసింది. ఇంతకీ యో–యో టెస్టు అంటే ఏంటని ఓ క్రికెటర్ని అడిగితే ‘దేశవాళీ క్రికెట్లో బాగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్, వికెట్లు పడగొట్టే బౌలర్లు ఎన్సీఏకు వచ్చాక... అక్కడి కోచ్లు, నిష్ణాతులు, ట్రైనర్లు, డాక్టర్లు, విశ్లేషకులు వాళ్లతో ఓ ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు. అందులో బతికొస్తే యో–యో టెస్టు పాసైనట్లు’ అని అక్కడి ప్రహసనాన్ని వివరించాడు. మొత్తానికి ఓ నాణ్యమైన క్రికెటర్లు తయారు కావాల్సిన అకాడమీ ఇప్పుడిలా అభాసు పాలవుతోంది. సాహా నుంచి భువీ దాకా ఓ ప్రొఫెషనల్ అకాడమీ కాస్తా సాదాసీదా పునరావాస కేంద్రమైంది. టెస్టుల్లో ధోని వారసుడిగా వచ్చిన వృద్ధిమాన్ సాహా భుజం గాయంతో 2018 జనవరిలో ఎన్సీఏలో చేరాడు. తర్వాత తొడకండరాల గాయమైంది. కాస్త కోలుకోగానే మార్చిలో అతను ఫిట్ అని ఎన్సీఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ రెండునెలలు తిరక్కముందే గాయం తిరగదోడింది. అప్పుడు కొత్తగా బొటనవేలి గాయమని నమ్మించే ప్రయత్నం చేసినా... పాత భుజం గాయమేనని తేలింది. ►మరో కపిల్ కాగలడనుకున్న హార్దిక్ పాండ్యాతో కూడా ఎన్సీఏ ఇలాగే ఆడుకుంది. ఆసియా కప్ (2018)లో వెన్నునొప్పికి గురైన పాండ్యా పూర్తిగా కోలుకోకముందే ఫిట్నెస్తో ఉన్నాడని ఐపీఎల్ ఆడించింది. తీరా దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ ఆడే సమయానికి మళ్లీ అదే గాయం తిరగబెట్టింది. దీంతో ఐపీఎల్ కోసమే ఎన్సీఏ ఇలాంటి లెక్కలేని ఫిట్నెస్ నిర్వహించిందనే విమర్శలొచ్చాయి. ►ఇక పేసర్ భువనేశ్వర్ కుమార్కు అసలేమైందో పసిగట్టలేకపోయింది ఎన్సీఏ వైద్యబృందం. ఇతనికి ముందుగా వెన్నుగాయమనే అన్నారు. పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెస్టిండీస్తో టి20 సిరీస్ ఆడగానే మళ్లీ గాయమన్నారు. అసలు అతనికి వెన్నుగాయం కాదని ‘స్పోర్ట్స్ హెర్నియా’ అని టీమిండియా ఫిజియోథెరపిస్ట్ చెబితేగానీ ఎన్సీఏ తెలుసుకోలేకపోయింది. అందుకేనేమో బుమ్రా ఎన్సీఏతో లాభం లేదనుకొని తన వెన్నుగాయం బాగోగులు తనే చూసుకున్నాడు. కేవలం ఫిట్నెస్ టెస్టుకే ఎన్సీఏకు వచ్చాడు. దీనిపై డైరెక్టర్ ద్రవిడ్ తిరస్కరించినా తర్వాత అంగీకరించక తప్పలేదు. భారమంతా దాదా, ద్రవిడ్లపైనే శాశ్వతంగా ఎన్సీఏ లక్ష్యాల్ని చేరుకునే అవసరమొచ్చింది. ఒకనాటి టీమిండియా సహచరులు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు ఇపుడు బోర్డు, అకాడమీ చీఫ్ బాధ్యతల్లో ఉన్నారు. వారిద్దరు కచ్చితంగా ఇటువైపు కన్నేస్తే ఎన్సీఏ రూపురేఖలు బాగుపడతాయి. అందుకే అకాడమీకి నూతన జవసత్వాలు తెచ్చేందుకు బీసీసీఐ ఇటీవల జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. లండన్కు చెందిన ‘ఫోర్టీస్’ వైద్య సంస్థ సలహాదారులతో మెడికల్ ప్యానెల్ను న్యూట్రిషన్ హెడ్, సోషల్ మీడియా మేనేజర్లను నియమించాలని బోర్డు నిర్ణయించింది. పేరున్న వైద్య బృందం ఇకపై ఆటగాళ్ల గాయాల నిర్వహణ–పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అలాగే సోషల్ మీడియా మేనేజర్ వల్ల అకాడమీలోని రోజువారీ కార్యకలాపాలు, వీటిపై వస్తున్న వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని బోర్డు భావించింది. ఇవన్నీ రాహుల్ నేతృత్వం వహిస్తున్న అకాడమీకి అదనపు బలాన్ని తెచ్చిపెడతాయి. దీంతో అతను ఫలితాలను కూడా అందిస్తాడని గంగూలీ నమ్మకం. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఓ భాగంగా ఉన్న ఎన్సీఏ త్వరలోనే బెంగళూరు శివారుకు తరలిస్తారు. అక్కడి సువిశాలమైన స్థలంలో అంతర్జాతీయ స్థాయి ఆధునిక హంగులతో అకాడమీ రూపొందనుంది. -
ఎప్పుడు ఫిట్గా మారతానో చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: టి20 ప్రపంచకప్కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి తాను ప్రస్తుతానికి ఆలోచించడం లేదని భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్గా మారే వరకు బౌలింగ్ ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘స్పోర్ట్స్ హెర్నియా’ కారణంగా వెస్టిండీస్తో సిరీస్కు భువీ దూరమయ్యాడు. స్పోర్ట్స్ వేర్ సంస్థ ‘అసిక్స్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం అతను నగరానికి వచ్చాడు. ‘టి20 ప్రపంచకప్కు తొమ్మిది నెలల సమయం ఉంది. నేను ఫిట్గా మారడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను. అయితే ఎప్పుడు పూర్తిగా కోలుకుం టానో చెప్పలేను. జట్టులో నా స్థానం గురించి ఈ దశలో ఆలోచించడం కూడా అనవసరం. బాగా ఆడటమే నా చేతుల్లో ఉంది. సెలెక్టర్లు ఏం చేస్తారనేది వారిష్టం’ అని అన్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే కోలుకొని సాధన చేసిన భువీ గాయం మళ్లీ తిరగబెట్టింది. ఎన్సీఏలో ఉన్న సౌకర్యాల గురించి కూడా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాను ఏమీ చెప్పలేనని భువీ పేర్కొన్నాడు. ‘ఎన్సీఏ తమ వంతుగా నా రీహాబిలిటేషన్కు ప్రయత్నించింది. లోపం ఎక్కడ జరిగిందో చెప్పలేను. డాక్టర్ను సంప్రదించిన తర్వాతే నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమా కాదా అనేది తేలుతుంది’ అని భువనేశ్వర్ స్పష్టం చేశాడు. -
హార్దిక్ పాండ్యా ఔట్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్నకు వంద రోజుల సమయం కూడా లేని నేపథ్యంలో టీమిండియాకు అనుకోని దెబ్బ. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్లకు పూర్తిగా దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న పాండ్యాను వైద్యుల బృందం సూచన మేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపుతున్నట్లు బీసీసీఐ గురువారం తెలిపింది. వచ్చే వారం అతడికి ఎన్సీఏలో ప్రత్యేక చికిత్స ఉంటుంది. ఆసీస్తో ఐదు వన్డేల సిరీస్కు పాండ్యా స్థానాన్ని స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయనున్నారు. టి20 జట్టులో మాత్రం పాండ్యా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. స్పిన్నర్లే కీలకం సాక్షి, హైదరాబాద్: రానున్న వన్డే సిరీస్లో స్పిన్నర్లే గెలుపోటములను నిర్దేశిస్తారని ఆస్ట్రేలియా స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ అన్నా డు. గురువారం హైదరాబాద్లో ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. భారత్కు తగ్గట్లు తమకూ స్పిన్ బలం ఉన్న నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా జరుగనుందని శ్రీరామ్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై అతడు ప్రశంసలు కురిపించాడు. ప్రధాన పేసర్లు లేకున్నా కమిన్స్, కూల్టర్నైల్ రూపంలో ఆసీస్కు మెరుగైన వనరులున్నాయని అతడు అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లిని అడ్డుకోవడానికి తమవద్ద ప్రణాళికలు ఉన్నాయని శ్రీరామ్ వివరించాడు. -
'జాతీయ క్రికెట్ అకాడమీ'కి సిరాజ్
ముంబై: ఇటీవల జరిగిన ఐపీఎల్–10 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ యువ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్కు అద్భుత అవకాశం తలుపు తట్టింది. అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎస్సీఏ)లో ఫాస్ట్ బౌలింగ్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. బెంగళూరులో ఈనెల 19 నుంచి రెండు వారాల పాటు ఎంపిక చేసిన యువ బౌలర్లకు ఈ శిక్షణను అందిస్తారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుంది. సిరాజ్తో పాటు బాసిల్ థంపి, నవ్దీప్ సింగ్, నాథూ సింగ్, అనికేత్ చౌదరీ, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్పుత్ ఎన్సీఏ శిబిరంలో పాల్గొంటారు. శిక్షణ సమయంలో ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. ఎన్సీఏ సిబ్బందితో పాటు, భారత ఫిట్నెస్ ట్రైనర్ ఆనంద్ ఆటగాళ్ల ఫిట్నెస్ను పర్యవేక్షిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలకు, జట్లకు దూరంగా ఉంటారు. జాతీయ అకాడమీలో యువ ఆటగాళ్లకిచ్చే శిక్షణ వారి కెరీర్కు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్సీఏ స్పిన్ బౌలింగ్ కోచ్ నరేంద్ర హీర్వాణి అన్నారు. మరోవైపు ఎన్సీఏలో శిక్షణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సిద్ధార్థ్ కౌల్, అనికేత్ చౌదరీ చెప్పారు. -
ధోని వచ్చేశాడు...
బెంగళూరు : జాతీయ క్రికెట్ అకాడమీలో భారత క్రికెట్ జట్టు సందడి మొదలైంది. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో 30 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వన్డే, టి20లకు జట్లకు ఎంపిక కాని క్రికెటర్లు కూడా ఈ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా ఉత్సాహంగా కనిపించాడు. టెస్టు కెప్టెన్ కోహ్లి సహా గాయం నుంచి కోలుకుంటున్న ధావన్ కూడా క్యాంప్లో చేరాడు. టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు ముగ్గురు సహాయక కోచ్ల నేతృత్వంలో ఆటగాళ్లు శిక్షణలో పాల్గొన్నారు. -
ఇద్దరు మనోళ్లే!
భరత్ అరుణ్... రామకృష్ణన్ శ్రీధర్... భారత్కు అండర్-19 ప్రపంచకప్ను గెలిపించిన కోచ్లు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడీని సీనియర్ జట్టుకు అండగా నిలిచేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఇద్దరికీ యాదృచ్ఛికంగా తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. కెరీర్ ఆసాంతం తమిళనాడుకే ఆడినా... అరుణ్ పుట్టింది విజయవాడలో. అలాగే మైసూర్లో పుట్టినా... శ్రీధర్ తన ఫస్ట్క్లాస్ క్రికెట్ మొత్తం హైదరాబాద్ తరఫునే ఆడి ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు అరుణ్ చీఫ్ కోచ్ కాగా, శ్రీధర్ అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఆర్. శ్రీధర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 44 ఏళ్ల ఆర్. శ్రీధర్ హైదరాబాద్ తరఫున దాదాపు 12 ఏళ్ల కెరీర్లో 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. 15 లిస్ట్ ‘ఎ’ మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో దేశవాళీలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001నుంచే కోచింగ్ వైపు మళ్లి, సుదీర్ఘ కాలం పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్లలో ఒకడిగా శ్రీధర్ పని చేశాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అసిస్టెంట్ కోచ్గా పని చేసిన అతను, ఈ ఏడాది కూడా అదే బాధ్యత నిర్వర్తించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ ఫీల్డింగ్ కోచ్గా పని చేసిన తర్వాత శ్రీధర్కు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. అనంతరం ఈ సీజన్ కోసం ఆంధ్ర జట్టు కోచ్గా కూడా ఎంపిక చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో తొలిసారి భారత సీనియర్ జట్టుతో కలిసి పని చేసే అవకాశం లభించింది. భరత్ అరుణ్ పేస్ బౌలర్ అయిన అరుణ్ 1979లో రవిశాస్త్రి కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించిన అండర్-19 జట్టు సభ్యుడిగా తొలిసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1986-87లో భారత్ తరఫున కేవలం 2 టెస్టులు ఆడిన అతను 4 వికెట్లు తీశాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 48 మ్యాచ్ల్లో 110 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మన్గా కూడా గుర్తింపు ఉన్న అరుణ్ 1987-88లో రంజీ ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్లో సౌత్జోన్ తరఫున సెంచరీ (149) చేయడంతో పాటు డబ్ల్యూవీ రామన్తో కలిసి 221 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం అతని కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2008నుంచి ఇటీవలి వరకు ఎన్సీఏలో కోచ్గా ఉన్న అరుణ్... ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అకాడమీ కోచింగ్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కోచ్గా ఉన్న అతను ఈ ఏడాది కూడా టీమ్కు కోచ్గా వ్యవహరించాడు. -
మోసపోయిన బీసీసీఐ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూ వివాదంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దాదాపు రూ.50 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సబ్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఈ స్కామ్కు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయం దగ్గర కుర్కి అనే ప్రదేశంలో బీసీసీఐ 49 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుపై కర్ణాటక పరిశ్రమల అభివృద్ధి సంస్థ బోర్డు (కేఐఏడీబీ)తో బీసీసీఐ తరఫున గురుదత్ షాన్బాగ్ అనే వ్యక్తి సంతకం చేశాడు. అయితే షాన్బాగ్కు అటు బీసీసీఐతో కానీ ఇటు ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో కానీ సంబంధం లేదని ఎన్సీఏ సబ్ కమిటీ తేల్చింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంపై బీసీసీఐ రూ.49,97,60,000 చెల్లించిన అనంతరం ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో పలు పిల్స్ నమోదు కావడంతో బోర్డు పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నెల జూన్ 20న హైకోర్టు కూడా ఈ డీల్ చట్ట వ్యతిరేకమని తీర్పునిచ్చింది. దీంతో తాము ఒప్పందం విషయంలో మోసపోయామని బీసీసీఐ గ్రహించింది. డీలింగ్ అనంతరం షాన్బాగ్ కూడా పత్తా లేకుండా పోయాడు. అతనితో సంబంధం ఉన్న మాజీ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) ఏకే ఝాపై బోర్డు అధికారులు దృష్టి సారించారు. ‘అసలు ఈ మొత్తం వ్యవహారంలో షాన్బాగ్ ఎలా ప్రవేశించాడనే విషయం అంతుచిక్కడం లేదు. ఇదే విషయాన్ని ఝాను కూడా ప్రశ్నించాం. ఎవరికీ అతడి నేపథ్యం ఏమిటో తెలీదు. అయితే అతడు ఝా కార్యాలయంలో ఎక్కువగా కనిపించేవాడని తెలిసింది’ అని బోర్డు ఆఫీస్ బేరర్ ఒకరు తెలిపారు. ఈ ఉదంతంతో ఝాను బీసీసీఐ నుంచి తప్పించగా గురువారం ఈ మొత్తం వ్యవహారాన్ని వర్కింగ్ కమిటీకి ఎన్సీఏ తెలిపింది. బీసీసీఐ ప్రతినిధిగా షాన్బాగ్ సంతకం చేస్తున్నప్పుడు అప్పటి కోశాధికారి ఇంత భారీ మొత్తాన్ని ఎలా విడుదల చేశారనేది పెద్ద ప్రశ్న.