Navratnas
-
మరో నాలుగు సంస్థలకు నవరత్న హోదా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ), ఎస్జేవీఎన్ (సట్లజ్ జల విద్యుత్ నిగమ్)లకు నవరత్న హోదా దక్కింది. అలాగే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ), రైల్టెల్కు సైతం నవరత్న హోదా లభించింది.‘‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్ 30న ఎన్హెచ్పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’’అని ఎన్హెచ్పీసీ తెలిపింది. కంపెనీకి ఇది చరిత్రాత్మకమని ఎన్హెచ్పీసీ సీఎండీ ఆర్కే చౌదరి అభివర్ణించారు.కంపెనీ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎన్హెచ్పీసీ మినీరత్న కేటగిరీ–1 కంపెనీగా ఉంది. ఎస్జేవీఎన్ సైతం మినీతర్న కేటగిరీ –1గా ఉండడం గమనార్హం. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం మాది పేద కుటుంబం. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త గిన్ని దేముడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా కుమారుడు కూడా కూలి పనులకు వెళ్తున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. నేను విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గిన్నివానిపాలెంలో ఇంటి వద్ద చిన్న టిఫిన్ దుకాణం పెట్టాను. పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న చేదోడు పథకం కింద మూడేళ్లలో రూ.30 వేలు సాయం అందింది. ఆ డబ్బులు వ్యాపారంలో పెట్టాం. వ్యాపారాన్ని అభివృద్ధి చేశాం. అప్పులు తీర్చుకుంటున్నాం. ఆర్థికంగా నిలబడ్డాం. నా భర్తకు 60 ఏళ్లు నిండడంతో ఏడాది నుంచి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. నా కుమారుడి కుమార్తెకు అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. ఈ ప్రభుత్వం మా కుటుంబంలో వెలుగులు నింపింది. – గిన్ని రమణమ్మ, గిన్నివానిపాలెం (ముప్పిడి శ్రీనివాసరావు, విలేకరి, పెదగంట్యాడ, విశాఖపట్నం) వృద్ధాప్యంలో కొడుకులా ఆదుకున్నారు.. నేను లైట్లు, లాంతర్లు, బిందెలు, సిల్వర్ గిన్నెలకు మాట్లు వేస్తూ జీవనం సాగిస్తుంటాను. నేడు గ్యాస్ పొయ్యిలు, స్టీల్ గిన్నెలు వచ్చిన తర్వాత మాకు పని లేకుండా పోయింది. మాకు ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసరికి ఓపిక నశించింది. నేను, నా భార్య మాత్రమే మిగిలాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 17వ వార్డు పరిధిలో ఉంటున్నాం. జీవనం సాగించడానికి పనులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఈ తరుణంలో నాకు పింఛన్ మంజూరైంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత కింద ఇప్పటి వరకు రూ.56,250, వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటి వరకు రూ.10,500 వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛను, నవరత్నాల పథకాలతో ప్రస్తుతం ఏ లోటూ లేకుండా మా జీవనం సాగుతోంది. రేషన్ కార్డుపై బియ్యం, కందిపప్పు వంటివి అందిస్తున్నారు. ఈ వయసులోనూ పిల్లలపై ఆధార పడకుండా నా కాళ్లపై నేను నిలబడ్డాననే ఆత్మ సంతప్తి కలుగుతోంది. జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో ఇంటి నిర్మాణం చేపడతాం. ఈ వృద్ధాప్యంలో కొడుకులా సీఎం జగన్ గారు మమ్మల్ని ఆదుకున్నారు. – కంచు సత్యనారాయణ, పాలకొల్లు (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్) ఉచితంగానే ఖరీదైన వైద్యం నేను దుబాయిలో ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. చిన్నప్పుడే నా బిడ్డలు కందుల సౌమ్య, స్టీఫెన్ ఇద్దరూ తలసేమియా వ్యాధిబారిన పడ్డారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండంలో అమ్మాయి సౌమ్య ఇంటర్, అబ్బాయి స్టీఫెన్ ఐదో తరగతి చదువున్నారు. వారికి ప్రతినెలా రక్తమార్పిడి, వైద్యం కోసం రూ.35 వేలు వరకు ఖర్చయ్యేది. వారికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డాను. గత ప్రభుత్వంలో ఎలాంటి సహకారం అందలేదు. వైఎస్ జగన్అధికారంలోకి రాగానే నా బిడ్డల లాంటి వారికి ప్రతినెలా రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంటానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ప్రతి నెలా నా బిడ్డలిద్దరికీ చికిత్స చేయిస్తున్నాను. ఇటీవల కుమారుడు స్టీఫెన్కు ఆపరేషన్ చేయించాను. కుమార్తె సౌమ్యకు ఆపరేషన్ అవసరమని, భారీగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇటీవల మా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డికి మా సమస్య వివరించాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. –కందుల నయోమయ్య, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా) -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
వచ్చే బడ్జెట్కు ప్రతిపాదనలు పంపండి
సాక్షి, అమరావతి: నవరత్న పథకాలతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి 2024–25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఈ నెల 14లోగా ఆన్లైన్లో పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. మహిళలు, బాలికలకు ప్రత్యేకం గాజెండర్ బడ్జెట్కు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమానికి ఉప ప్రణాళికలను ప్రతిపాదించాల్సిందిగా ఆయా శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రధానంగా రహదారులు, గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. ఈ ప్రతిపాదనలు తప్పనిసరిగా మిషన్ లక్ష్యాల ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలపైనే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేయని పనుల కోసం ఎటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదని సూచించారు. అలాంటి పనులకు బిల్లులను కూడా అంగీకరించబోమని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లేని పనుల ప్రతిపాదనలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదన్నారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల సమర్థ వినియోగం ద్వారా ఫలితాలు సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవి.. ♦ ప్రస్తుత పథకాలను సమీక్షించి.. ఆ పథకాలకు వ్యయం ఎంత అవుతోంది? ఆ మేరకు ఫలితాలు, ప్రయోజనాలు వస్తున్నాయా లేదా పరిశీలించాలి. ప్రయోజనం లేని పథకాలను ఆర్ధిక శాఖతో సంప్రదించి నిలిపివేయాలి. ఇలా ఆదా అయిన సొమ్ముతో కొత్త పథకాలను రూపొందించాలి. ♦ అన్ని శాఖాధిపతుల వేతనాలేతర వస్తువులు, ఇతర వ్యయాలను సమీక్షించి 20 శాతం మేర పొదుపును ప్రతిపాదించాలి. ♦ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల ఉప ప్రణాళికలకు ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించాలి. ప్రస్తుత ప్రతిపాదనలను సమీక్షించి, మార్పులు అవసరం ఉంటే చేయాలి. ♦అన్ని శాఖలు వాస్తవికంగా అంచనాలు వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలి. తప్పనిసరి వ్యయాలైన సబ్సిడీలు, సామాజిక భద్రత పెన్షన్లు మొదలైన వాటికి లబ్ధిదారుల సంఖ్య ఆ«దారంగా తగిన నిధులను ప్రతిపాదించాలి. కన్సల్టెంట్స్, ఔట్సోర్సింగ్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయకూడదు. ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను అత్యంత జాగ్రత్తతో రూపొందించాలి. అంచనాలు, వాస్తవాల మధ్య భారీ వ్యత్యాసాలను నివారించాలి. ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగానే రెవెన్యూ రాబడుల అంచనాలను ప్రతిపాదించాలి. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి పెట్టాలి. అందుకు అనుగుణంగా ఆదాయ వనరుల అంచనాలను పంపాలి. ♦ సవరించిన అంచనాలు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల వ్యయ పురోగతి, మిగిలిన నెలల్లో ఖర్చయ్యే అవకాశం ఆధారంగా సప్లిమెంటరీ గ్రాంట్లు కోసం అదనపు నిధులకు ప్రతిపాదనలు చేయాలి. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బాబు మాట్లాడుతున్నాడు.. మాది నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు గ్రామం. నా భర్త పేరు రామయ్య. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా బాబు జాన్విత్ రెండేళ్ల వయస్సులో శబ్దాలకు స్పందించే వాడు కాదు. ఎంత చప్పుడు చేసినా వాడిలో చలనం ఉండేది కాదు. మా పరిస్థితి చూసి, ఇరుగు పొరుగు వారు కూడా మాకు సాయంగా బాబును వివిధ రకాలుగా శబ్దాలు చేస్తూ పరీక్షించేవారు. అయినా అలానే ఉండిపోయేవాడు. ఒక రోజు ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చూపించాము. అక్కడి వైద్యులు బాబుకు వైద్య పరీక్షలు చేశారు. వినికిడి లోపం ఉందని నిర్ధారించారు. వినికిడి కోసం మందులు వాడుతూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాం. అక్కడి ఉపాధ్యాయులకు జాన్విత్ పరిస్థితి గురించి వివరించాము. దీంతో వాళ్లు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించేవారు. అయినా అబ్బాయి చదువులో వెనుకబడ్డాడు. బాబు భవిష్యత్తు ఏమిటా అని దిగులు పడేవాళ్లం. మా అదృష్టం కొద్ది మా ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం పెట్టింది. అక్కడికి అబ్బాయిని తీసుకువెళ్లాం. పరీక్షించిన ఒక ప్రభుత్వ వైద్యుడు.. బాబుకు సరైన చికిత్స అందించి ఆపరేషన్ చేస్తే వినడంతో పాటు మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఆ వైద్యుడి మాటలు మాలో ఆశలు రేపాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారని సలహా ఇచ్చారు. దీంతో ఒక రోజు నంద్యాల పట్టణంలో మధుమణి ఆస్పత్రిలో సంప్రదించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేశారు. బాబుకు ఇప్పుడు వినిపిస్తోంది. ఆడియో థెరపీ ద్వారా మాటలు వచ్చేందుకు వైద్యులు కృషి చేశారు. మాటలూ వచ్చాయి. జాన్విత్కు ఇప్పుడు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాడు. బడిలో పాఠాలు వీడియో క్లాసెస్ ద్వారా బోధిస్తుండడంతో ఇంతకు ముందు కంటే బాగా అర్థం అవుతున్నాయని చెబుతున్నాడు. ఇపుడు బాబు భవిష్యత్తు గురించి మాకు ఎటువంటి బెంగ లేదు. – రాయపాటి పద్మ, దొర్నిపాడు, నంద్యాల జిల్లా ,(ఎం.హరిహరసాగర్, విలేకరి, నంద్యాల టౌన్) నా ఆ్రస్టేలియా కల సాకారం మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనేది నా కోరిక. భవిష్యత్లో ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, మంచిగా స్థిరపడాలనేది నా ధ్యేయం. నేను పదో తరగతి వరకు పొందూరులోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ విశాఖలో చదివాను. కరోనా సమయంలో విదేశాల్లో చదివేందుకు అవసరమైన సబ్జెక్టుల్లో ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాను. విదేశాల్లో ఉన్న ఉత్తమ కోర్సులు చదివేందుకు అవసరమైన పరీక్షలు పాసయ్యాను. నేను ఎంచుకున్నట్టే ఆ్రస్టేలియాలో మోనష్ యూనివర్సిటీలో సీటు వచి్చంది. సుమారు రూ.60 లక్షల ఫీజులో 8 లక్షలు తగ్గించారు. మిగిలిన రూ.52 లక్షలు ఎలా చెల్లించాలో తెలియక అయోమయంలో పడిపోయాను. ఆ డబ్బు సమకూర్చాలని నాన్నకు చెప్పలేకపోయాను. ఆ్రస్టేలియాలో చదివించే స్థోమత నాన్నకు లేదు. మా నాన్న గురుగుబెల్లి శ్యామలరావు పొందూరులోని వైఎస్సార్ క్రాంతి పథంలో ఎంఎస్సీసీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతం కుటుంబం గడిచేందుకు మాత్రమే సరిపోతుంది. దీంతో దిక్కు తోచలేదు. సీఎం ఆదుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.51,92,106 మంజూరు చేశారు. దీంతో నా గోల్ రీచ్ అవుతానన్న నమ్మకం ఏర్పడింది. 2023 జూలై 10న ఆ్రస్టేలియా వెళ్లాను. జగనన్న మంచి మనసు వల్ల నేను ఇవాళ ఆ్రస్టేలియాలోని మోనష్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నాను. మొదటి సెమిస్టర్ పూర్తయ్యింది. – గురుగుబెల్లి వంశీ, మోనిష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా (పాయక మధుసూదనరావు, విలేకరి, పొందూరు) ఇప్పుడు అప్పుల తిప్పల్లేవు మాది కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ గ్రామం. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏటా పంట పెట్టుబడి కోసం మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుల కోసం కాళ్లరిగేలా తిరిగేవాళ్లం. ఒక్కోసారి అప్పు పుట్టేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇటు వ్యవసాయం వదులుకోలేక అటు పెట్టుబడులు పెట్టుకోలేక మానసికంగా కుంగిపోయేవాళ్లం. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టినా పంట చేతికందుతుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇక అంతేసంగతులు. తుపానులు వచి్చనా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా పెట్టుబడులు, శ్రమ మట్టిలో కలిసిపోయేవి. అప్పులకు వడ్డీలు పెరిగిపోయేవి. అప్పు తీర్చలేక వడ్డీ వ్యాపారుల వద్ద మాట పడేవాళ్లం. మళ్లీ ఆ పొలాన్ని పంటసాగు చేసే స్థితికి తీసుకురావాలంటే, అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు తయారయ్యేది. కళ్లలోంచి నీరు వచ్చేది. మా బాధ ఆ దేవుడికే తెలుసు. సీఎం వైఎస్ జగన్ పుణ్యాన ఇప్పడు ఆ బాధ తప్పింది. ఊర్లో అప్పులు తీర్చలేదన్న అవమానాలు లేవు. గొప్ప రైతుగా తలెత్తుకొని జీవిస్తున్నాను. ఖరీఫ్, రబీ సాగు మొదలెట్టే సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు సాగు చేస్తున్నాము. గతంలో బ్యాంకులు కూడా పంట రుణాలు సకాలంలో ఇచ్చేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.13,500 పెట్టుబడులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా పరిహారం లభిస్తోంది. నాలుగేళ్లుగా అప్పుల బాధలే లేవు. పైగా రైతు భరోసా కేంద్రాల వల్ల ఎప్పటికప్పుడు విలువైన సలహాలు, సూచనలు అందుతున్నాయి. – వన్నూరప్ప, పెండేకల్, కర్నూలు జిల్లా (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు అగ్రికల్చర్) -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్ సర్కార్.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల (5.86 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు. శరవేగంగా రెండో దశ ఇళ్ల నిర్మాణం.. ఇక రెండో దశలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నాలుగు లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో 12,479, రూఫ్ లెవెల్లో 1.03 లక్షలు, పునాది పైదశల్లో 3.94 లక్షల చొప్పున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వేగంగా పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం మరోవైపు.. ఇళ్ల లబ్దిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేస్తోంది. ♦ స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం చేస్తోంది. ♦ ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా> చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్దిచేకూరుస్తోంది. ♦ అలాగే, జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి సకల వసతులను సమకూరుస్తోంది. ♦ ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10 లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని జగన్ సర్కార్ సమకూరుస్తోంది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీపావళి, క్రిస్మస్, జనవరి ఫస్ట్ ఇలా వరుస పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నందున.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి పనులు చకచకా పూర్తిచేయడానికి శ్రమిస్తాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
వందేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వందేళ్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా.. అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.1,08,553 కోట్లతో 28,30,227 మంది పేదలకు 2,023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తొలి దశలో ఇప్పటికే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల కాలనీల్లో రూ.1,200 కోట్లతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు రూ.32,909 కోట్లతో రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ప్రతి లేఅవుట్కు ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని రూ.1.80 లక్షలతో చేపట్టామని, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమెంట్, ఇనుము, మెటల్ తదితర మెటీరియల్ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 7 లోగా నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా ఏఎన్ నారాయణమూర్తి
సాక్షి, విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్రావు నియామకం ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ సీఎండీగా హరనాథ్ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎవరెస్ట్పై ‘నవరత్నాల’ రెపరెపలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ‘నవరత్నాలు’ పతాకం రెపరెపలాడింది. పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాతో విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం కార్ షెడ్ ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మిష్ (28) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ 1వ తేదీన పర్వతారోహణలో విజయాన్ని నమోదు చేసుకుని ఇటీవల నగరానికి తిరిగి వచ్చాడు. విద్యార్థి దశలోనే మార్షల్ ఆర్ట్స్లో సత్తా చాటిన అన్మిష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సహకారంతో శిక్షణ పొంది తన కల నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ను ప్రపంచ శిఖరంపై ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చాడు. కిలిమంజారోపై.. అన్విష్ ఇప్పటికే కిలిమంజారో, అకంకాగోవా పర్వతాలను అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతంపై ‘నో బ్యాగ్స్ డే’, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ జెండాను ఎగుర వేశాడు. మరిన్ని పర్వతాలు అధిరోహిస్తా.. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటి భూమిని కాపాడుకుందాం. ఈ దిశగా ప్రజలంతా కృషి చేయాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్లో ప్రపంచంలో ఎత్తైన మరిన్ని పర్వతాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను. – భూపతిరాజు అన్మిష్ -
కరోనా వేళ ఆదుకున్న నవరత్నాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలందరినీ ఎంతో ఆదుకున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే వాళ్లు ఖర్చు పెట్టుకుంటారని, దీనివలన ఆర్థికంగా అందరికీ బాగుంటుందని మేధావులు చెప్పారని పేర్కొన్నారు. అదేవిధంగా నవరత్నాల పథకాల ద్వారా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. ఇటువంటి పథకాలు తమకెందుకు అమలు చేయడం లేదంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడ్డారన్నారు. జగన్ సీఎం అయ్యాక వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్రంలోని పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లు జమచేశారని చెప్పారు. ఇన్ని పథకాలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్న జగన్ పోలవరం నిర్వాసితుల పట్ల కూడా ఇదే విధానం అమలు చేయాలని కోరారు. 2013లో భూసేకరణ చట్టం రాకముందే భూసేకరణలో అదే విధానాలను దివంగత వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం అయిన వైఎస్సార్ విధానాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే అవి మరింత ముందుకు వెళతాయంటూ మేధాపాట్కర్ కితాబిచ్చారని గుర్తుచేశారు. నదీజలాల వివాదంలో జగన్, కేసీఆర్ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించారు. -
నవరత్నాల జెండాను హిమాలయాలపై ఎగురవేసిన యువకుడు
-
నవరత్నాలతో కాపుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: నవరత్నాలు, కాపు నేస్తం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు భారీగా లబ్ధి చేకూర్చింది. వివిధ పథకాల ద్వారా దాదాపు 35 లక్షల మంది కాపులు ప్రయోజనం పొందారు. ఇదివరకు ఇలాంటి సహాయం ఎవరూ చేయలేదని, ఇంతగా లబ్ధి పొందుతామని తాము ఊహించనే లేదని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రశంసిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందని, రిజర్వేషన్లు కల్పిస్తామని మభ్యపెట్టి పబ్బం గడుపుకుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి జగన్ సర్కారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తమను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాల ద్వారా కాపులకు కేవలం రెండేళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భారీ ఆర్ధిక ప్రయోజనం కల్పించారు. కాపు నేస్తంతో పాటు నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 34.82 లక్షల మంది కాపులకు రూ.9,672.25 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 30.85 లక్షల మందికి నవరత్నాల పథకాల ద్వారా నేరుగా రూ.7,368.20 వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో 3.96 లక్షల మంది కాపులకు రూ.2,304.05 కోట్లు లబ్ధి చేకూర్చారు. కాపు నేస్తం కింద 3.27 లక్షల మంది అక్కలకు రూ.491.79 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. -
ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత
సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ పేదలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం జూన్లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ఖరారు చేసింది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. చదవండి: వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం అంబులెన్స్లు నిలిపేయడం అన్యాయం -
అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలందరికీ నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలకు ఇలా సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా కులాల ప్రస్తావన లేకుండా కేవలం ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎం వైఎస్ జగన్. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక సూత్రం పేదరిక నిర్మూలనే అవుతుంది. అందుకు అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆప్రాతిపదికనే అగ్రవర్ణాల్లోనూ పేదలందరికీ సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. గత సర్కారు హయాంలో పెన్షన్, రేషన్ కార్డు కావాలంటే తొలుత ఏ పార్టీ అని ఆరా తీసేవారు. ఆ తరువాత ఏ కులం? అని ప్రశ్నించేవారు. తమ పార్టీ వారికి లేదంటే తమ కులం వారికే మంజూరు చేసేవారు. అది కూడా లంచం ఇస్తేనే తప్ప కనికరించేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్ కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
సీఎం జగన్ను అభినందించిన సత్య ఎస్ త్రిపాఠి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘నవరత్నా’ల్లోని వైఎస్సార్ రైతుభరోసా, చేయూత, ఆసరా వంటి పథకాలు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని తీసుకువస్తాయన్న నమ్మకం తనకుందని యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి సీఎం వైఎస్ జగన్తో అన్నారు. అలాగే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ సర్కార్ మార్గదర్శకంగా నిలుస్తోందంటూ త్రిపాఠి కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సత్య ఎస్ త్రిపాఠి సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్య ప్రకృతి వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణపై చర్చ జరిగింది. సీఎం జగన్ ఏమన్నారంటే.. యునైటెడ్ నేషన్స్తో కలిసి పనిచేస్తాం ‘ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆర్బీకేల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సి) ద్వారా రైతులకు దీనిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ను కూడా రీసైకిల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు యునైటెడ్ నేషన్స్తో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో భాగస్వామ్య ఒప్పందాలవల్ల రాష్ట్రానికి మేలు జరగడంతోపాటు ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యపడుతుంది. అలాగే, సేంద్రీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు జరుగుతుంది’.. అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో చర్చించారు. వేస్ట్ టూ వెల్త్ అనే అంశంపై త్రిపాఠి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి, ఎలక్ట్రానిక్ వేస్ట్ను ఈ–క్లస్టర్ల ద్వారా సేకరించవచ్చని, ఇందుకుగాను అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సత్య ఎస్ త్రిపాఠిని సీఎం జగన్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
నవరత్నాలు, అభివృద్ధి, ఆస్తుల కల్పన
సాక్షి, అమరావతి: నవరత్నాలు, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశాలతో పాటు అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా 2021–22 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు పారిశ్రామికీకరణ వేగవంతానికి బడ్జెట్లో పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈసారి బడ్జెట్లో మహిళా సాధికారత, పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు సవరణలపై ఆర్ధిక శాఖ అన్ని శాఖలకు మార్గదర్శకాలిచ్చింది. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం నుంచి ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. సంక్షేమ, అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. నిర్వహణ వ్యయం వీలైనంత మేర కట్టడి చేయడంలో భాగంగా రంగాల వారీగా సమీక్షించాలని నిర్ణయించింది. గంపగుత్త కేటాయింపులొద్దు ► వచ్చే బడ్జెట్లో శాఖల వారీగా గంపగుత్త కేటాయింపులకు స్వస్తి పలకాలి. ఏ శాఖలో.. ఏ రంగానికి, ఏ విభాగానికి ఎన్ని నిధులు అవసరమో ప్రత్యేక పద్దుల ద్వారా ప్రతిపాదనలు చేయాలని, అలాగే లింగ నిష్పత్తి మేరకు మహిళలకు కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ లక్ష్యాలు.. ► గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాల్లో మౌలిక వసతుల కల్పన ► పారిశ్రామికీకరణ ద్వారా ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచాలి. ► కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ ఆర్ధిక సాయం పథకాలు తదితరాల కేటాయింపులకు ప్రాధాన్యం. ► నవరత్నాలు, మేనిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, వ్యవసాయ బడ్జెట్కు ప్రాధాన్యం. -
కాలువ గట్టు నుంచి కలల లోగిళ్లలోకి..
సాక్షి, అమరావతి: ఈమె శీలం జ్యోతి.. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు కాలువగట్టుపై టార్పాలిన్ను కప్పిన చిన్న పాకలో పదేళ్లుగా ఉంటోంది. భర్త చనిపోగా కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈమెకు సొంత ఇల్లు అన్నది కలలో కూడా ఊహించలేని విషయం. కానీ.. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ జ్యోతి జీవితంలో వెలుగులు నింపింది. ..ఇలా శీలం జ్యోతే కాదు. బుడమేరు కాలువ గట్టుపై దశాబ్దకాలంగా బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. వారికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అంతేకాదు.. వారికి ఇల్లు కట్టించి కూడా ఇవ్వనున్నారు. లక్ష మందికిపైగా పేదల దుస్థితి ఇదీ.. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చింది. విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని నిరుపేదలు దశాబ్దాలుగా కాలువ గట్లు, ఆటోనగర్లోని ఇరుకు సందులు, శివారు ప్రాంతాల్లోని మురికివాడలు, కొండప్రాంతాలు, రోడ్ల పక్కన చిన్నచిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకుని లక్షమందికి పైగా పేదలు ఉంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం అలాంటి లక్షలాది పేదల సొంతింటి ఆశలను నిజం చేసింది. సువిశాలమైన లే అవుట్లలో ఇళ్ల స్థలాలిచ్చింది. అందులో ప్రభుత్వం వారికి బృందావనాన్ని తలపించే రీతిలో ‘వైఎస్సార్–జగనన్న’ కాలనీలు నిర్మించనుంది. రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు, పార్కులు.. ఇలా అన్ని వసతులు సమకూర్చనుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలో వేసిన లే అవుట్ ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. ఓ వైపు కొండలు మరోవైపు తోటలతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అందులో 1,265 ఇళ్ల స్థలాలతో వేసిన లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సమీపంలో వేసిన లే అవుట్ ‘రివర్ వ్యూ’ శోభతో అలరారనుంది. కొండపల్లిలో వేసిన లే అవుట్లు కూడా కార్పొరేట్ కంపెనీలు నిరి్మంచే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి. 2,215.19 ఎకరాల్లో 151 లేఅవుట్లు.. ఈ విధంగా విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పేదల కోసం ఏకంగా 2,215.19 ఎకరాల్లో 151 లే అవుట్లు వేయడం విశేషం. తద్వారా 1,33,470 మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. అప్పుడు ఇంటి కోసం పదేళ్లు తిరిగినా ఇవ్వలేదు మేం బుడమేరు కాలువగట్టుపై చిన్నపాకలో పదేళ్లుగా ఉంటున్నాం. సొంత ఇంటి కోసం పదేళ్లుగా తిరిగాను. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి మా ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాను ఎన్నిసార్లు అడిగినా మాకు ఇల్లు రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కల నెరవేరింది. ఇంతకంటే మాకేం కావాలి. – నాగమణి, ఇబ్రహీంపట్నం మా కుటుంబానికి పండుగరోజు జగనన్న మాకు ఇంటి స్థలం ఇచ్చిన రోజే మాకు పండగ రోజు. అందుకే మాకు స్థలం ఇచ్చిన రోజే అక్కడకు వెళ్లి పూజ చేశాం. నున్నలో సెంటు భూమి రూ.5 లక్షలకు పైగా ఉంది. మేం రూ.లక్ష కూడా పెట్టలేం. అలాంటిది మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి.. ఇల్లు కూడా కట్టించి ఇస్తోంది. – సారేపల్లి కుమారి, నున్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం నోట మాట రావడంలేదు ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన పాకలో ఉంటున్నాం. అడగకుండానే మా ఇంటికి వచ్చి మరీ ఇంటి స్థలం కేటాయించారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఈ సంతోషంతో నోటి నుంచి మాట రావడంలేదు. మాకు ఇంతకన్నా ఏం కావాలి. – మల్లీశ్వరి, నున్న, విజయవాడ రూరల్ మండలం సొంతిల్లు కట్టుకుంటానని అనుకోలేదు రేకుల షెడ్డులోనే సగం జీవితం అయిపోయింది. ఇక ఈ జీవితానికి సొంతింటి యోగం లేదనుకున్నాను. కానీ, జగనన్న నా కల నిజం చేశారు. నాకంటూ ఓ సొంత ఇంటిని ఇస్తున్నారు. ఎందరో పేదలకు మేలు చేసిన సీఎంను ఆ దేవుడు చల్లగా చూడాలి. – పరసా స్వర్ణకుమారి, నున్న గ్రామం విజయవాడ రూరల్ -
ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం
ముగ్గులేస్తాం..గొబ్బెమ్మలు పెడతాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం రోజంతా ఇక్కడే గడుపుతాం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అవధుల్లేని ఆనందం తమ బతుకు చిత్రం మారిపోతుందనే విశ్వాసం జగనన్నను తమ గుండెల్లో పెట్టుకుంటామంటూ ఉద్వేగం – ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ‘మేం ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే చేసుకుంటాం. ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెడతాం. రోజంతా ఇక్కడే గడుపుతాం. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు..’ ఉప్పొంగుతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వణుకూరు దళితవాడ మహిళలు చేసిన వ్యాఖ్యలివి. ‘ఇన్నాల్టికి నిజమైన సంక్రాంతి చూస్తున్నాం బాబూ...’ అని వనిత అంటుండగానే, ‘మేం ఇక లక్షాధికారులం..’ అంది మరియమ్మ. ‘ఇన్నాళ్టికి బతుకు మీదే నమ్మకం వచ్చింది సార్...’ అంటూ తన కూతుర్ని హత్తుకుంది లలిత. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ళు’ పథకం వారిలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. జీవితంపై నమ్మకం పెంచుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి బతుకు చిత్రాన్నే మార్చేస్తోంది. పనికెళ్ళకపోతే పస్తులుండే పేదల ఊరు వణుకూరు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగితేలుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 18 వేల పైచిలుకు ఇళ్ళ స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వణుకూరుతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల లబ్ధిదారుల కోసం ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ బృందం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది. ఇళ్ల స్థలాల్లో ఉన్నవారితో పాటు వణుకూరు గ్రామస్తులు కొందర్ని పలుకరించింది. మా పేదరికం పోయింది.. వణుకూరుకు సరిగ్గా అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఆ ప్రాంతానికి పొద్దున్నుంచీ సూర్యాస్తమయం వరకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వచ్చి పోతూనే ఉన్నారు. ‘మీరు ఎక్కడ్నుంచి? ఏం చేస్తారు? మీ ఫోన్ నంబర్ ఇవ్వండి?’ అంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు. ప్లాట్ల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఎవరికి ఏ ప్లాట్ ఇస్తారో తెలియదుగానీ లబ్ధిదారులు మాత్రం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అది తమ ఊరని మురిసిపోతున్నారు. విజయవాడలో టైలర్ పనిచేసే బొడుగు దీప్తి కుటుంబ సమేతంగా అక్కడి వచ్చింది. ‘ఈ సంక్రాంతితో మా పేదరికం పోయింది. ఇంతమందితో కలసి ఇక్కడ గొప్పగా బతుకుతాననే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..’ అని ఆనందంతో చెప్పింది. 12 ఏళ్ళ చిన్నారి నిహారిక తన తండ్రితో సెల్ఫీ దిగుతూ .. ‘పూరిగుడిసెలో నా పుస్తకాలు తడిచిపోయేవి. సొంత ఇల్లు వచ్చాక నా బుక్స్ అన్నీ ఓ షెల్ఫ్లో పెట్టుకుంటా. రోజూ దాబా మీదకెక్కి చదువుకుంటా..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. జగనన్నే మాకు దేవుడు ‘మనకి ప్లాటొచ్చిందమ్మా... పండక్కి రండి’ అంటూ ఆటోనగర్లో ఉంటున్న వీరన్న తన అల్లుడికి ఫోన్ చేసి ఆనందం పంచుకున్నాడు. కొత్త ప్లాట్ల దగ్గర వాట్సాప్ వీడియో కాల్లో ఆ ప్రాంతాన్ని చూపించాడు. ‘మాకు జగనన్నే దేవుడు... అందుకే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాం’ అని టెన్త్ చదువుతున్న సంకల్ప తన వద్ద ఉన్న ఫోన్ చూపిస్తూ చెప్పింది. ‘ఇంతకాలం మురికివాడలో బతుకు .. ఇప్పుడిక కొత్త వెలుగు’ అంటూ సంజయ్ అక్కడి పరిసరాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఇన్నాళ్లకు ఇల్లొచ్చింది.. ‘ఇదయ్యా ఇప్పటిదాకా మా బతుకు’ .. వణుకూరు ఎస్సీ కాలనీలో తన గుడిసె చూపిస్తూ చెప్పింది బుర్రె ప్రసన్న. గడ్డితో కప్పుకోవడమే కష్టంగా ఉన్న ఆ గుడిసెలోనే ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటోంది. ఇల్లివ్వమని కొన్నేళ్ళుగా నేతల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పిందామె. తన అత్త బతికుండగా సొంతింటి కోసమే తపించిందని, ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లొచ్చింది. ఆమె బతికుంటే మురిసిపోయేది’ అని కన్నీళ్ళు దిగమింగుకుంటూ చెప్పింది. మరో రెండు అడుగులు వేస్తే కృపారావు ఇల్లు కన్పించింది. చుట్టూ పిచ్చి మొక్కలు. అటు వెళ్తుంటే పందులెదురొచ్చాయి. ఇంట్లోకి పాములు రావడం సర్వసాధారణమంట. ఇదే విషయమై కృపారావును కదిలిస్తే.. ’మాకేంటి సార్... ఇప్పుడు మాకు ప్లాట్ వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయాయి’ అంటూ తన భార్య వనిత పడుతున్న ఆనందాన్ని పదేపదే చెప్పారు. ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఆటో నడిపే నేను ఇంటి అద్దె కట్టడానికే కష్టపడుతున్నా. ఇక ఎదిగే పిల్లలకు ఏమిస్తాననే మనాది ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు నామీద నాకే నమ్మకం వచ్చింది. కాదు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించింది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు వస్తుందని ఊహించుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడ నుంచి పోరంకికి ఆటో నడుపుకుంటా. – కామినేని సాంబయ్య, ఆటో డ్రైవర్ నమ్మకాన్ని జగనన్న నిజం చేశాడు పొద్దస్తమానం టైలరింగ్తో కష్టపడే నా భార్య, నేను ఎప్పటికైనా సొంతింట్లో ఉంటామా? అన్పించేది. కానీ జగనన్న ఎన్నికల్లో చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది నిజమైంది. – బొడుగు లోకేష్, ఆర్టీసీ కాలనీ పేరు రాసుకెళ్లారు.. ఇల్లొచ్చిందని చెప్పారు ఎన్నో ఏళ్లుగా కన్పించిన ప్రతి నాయకుడినీ ఇంటి కోసం వేడుకున్నాం. ఎవరూ కనికరించలేదు. ఇటీవల గ్రామ వాలంటీర్ ఇంటికొచ్చి పేరు రాసుకెళ్ళారు. తర్వాత నీకు ఇల్లొచ్చిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే జగనన్నను మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. –బుర్రె ప్రసన్న, వణుకూరు ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేకుండా మా చేతుల మీదుగా పేదవాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. – సాయి దీప్తి, వలంటీర్ పట్టాల పండుగ.. ఆనందం నిండగ.. రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజూ ఇళ్ల పట్టాల పంపిణీ ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిరి్మంచుకుందాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆరో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు.. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం 6,223 మందికి ఇళ్ల పట్టాలివ్వగా..ఇప్పటివరకు పట్టాలు అందుకున్న వారి సంఖ్య 50,809కి చేరింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం 4,598 మందికి పట్టాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో బుధవారం 8,023 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం 3,451 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 5,331 మందికి ఇళ్ల పట్టాలు, 309 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం 3,727 మందికి పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 23,695 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. కొత్తపట్నం మండలం అల్లూరులో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి మంత్రి బాలినేని భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లాలో బుధవారం 13,909 మందికి ఇళ్ల పట్టాలు, 262 మందికి టిడ్కో ఇళ్లకు పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 57,325 ఇంటి పట్టాలు, 287 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం 8,642 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా.. ఇప్పటివరకు పట్టాలు పొందిన వారి సంఖ్య 55,428కు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 7,637 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు 56,372 మంది లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 5,704 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య 54,542కు చేరింది. మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 3,764 మందికి పట్టాల్ని పంపిణీ చేయగా..ఇప్పటివరకు లబి్ధదారుల సంఖ్య 29,764కు చేరింది. విశాఖ జిల్లాలో బుధవారం 30,444 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి పట్టాలు అందజేశారు. టీడీపీకి ఓటేసినా..జగనన్న పట్టా ఇచ్చారు నేను వైఎస్సార్సీపీకి ఓటేయలేదు. ఎప్పుడూ టీడీపీకే ఓటేశా. మా నాన్న, భర్త తెలుగుదేశం పార్టీయే. అయినా మాకు ఇల్లు రాలేదు. జగనన్న మాకు ఇంటి పట్టా ఇచ్చి.. ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఇప్పటికే రూ.18,750 వచ్చాయి. నూతిలో కప్పలా మనం ఉన్నదే ప్రపంచం కాదని నా భర్తకు చెబుతా. గొప్ప నాయకుడిని దేవుడిచ్చాడని చెబుతా. – షేక్ సరోజిని, 23వ వార్డు, తెనాలి -
నవరత్నాలకు దండిగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు ఎలాంటి నిధుల సమస్య రాకుండా చట్ట సవరణలు తెచ్చినట్టు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం శాసనసభలో తెలిపారు. మనబడి, ఆస్పత్రులు, అమ్మ ఒడి, రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధి సంస్థ బిల్లును, ఏపీ విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ సవరణ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ – ఎఫ్ఆర్బీఎం) బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మాత్రమే అప్పుచేసే అవకాశం ఉందని, మన వడ్డీ, మనకు ఉన్న రెవెన్యూ రశీదులు 10 శాతం ఉంటే అప్పు చేయవచ్చని తెలిపారు. ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు సవరణలు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి అనుగుణంగా అప్పు చేసుకునే వెసులుబాటు పరిధి పెరుగుతుందని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రం 2 శాతానికి అనుమతించిందని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి ‘పోలవరం’పై రాజీపడ్డ చంద్రబాబు పోలవరంపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబుది ఆర్భాటపు, ఆవేశపు, అసమర్థ ప్రభుత్వమని, తమది సహనం ఉన్న సమర్థ ప్రభుత్వమని చెప్పారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్యాకేజీకి కక్కుర్తిపడి ప్రత్యేక హోదా అంశంతోపాటు పోలవరం ప్రాజెక్టుపై రాజీపడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ దుర్మార్గపు చర్యే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో సమస్యలను తీసుకువచ్చిందన్నారు. 2014లో కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్గా పోలవరం నిర్మిస్తామన్న కేంద్రం 2016 సెపె్టంబర్లో మాత్రం.. 2014 నాటి ధరలమేరకే భరిస్తామంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. పైగా 2018 జనవరి 12న అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ 2014 నాటి ధరల ప్రకారం నివేదిక సమర్పించాం.. దాన్ని ఆమోదించాలని కోరడం ఏమిటని నిలదీశారు. 27 సార్లు ఢిల్లీ వెళ్లానని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేదని, ఆనాడు కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టును పూర్తి చేసితీరతామని ఆయన చెప్పారు. -
‘వైఎస్సార్ ఆసరా’తో 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి
-
నవరత్నాల అమలులో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో మేరకు నవరత్న పథకాల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద ముందడుగు వేస్తూ పలు కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశ వివరాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాలను సెప్టెంబరు 1న ప్రారంభిస్తారు. ► రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ ప్లస్’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్’ పథకాన్ని అమలు చేస్తారు. ► 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. ► గతంలో కేవలం రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకే పౌష్టికాహారం ఇచ్చే వారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.762 కోట్లే ఖర్చు చేయగా, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచి రూ.1,863 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. డిసెంబరు 1 నుంచి లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం ► శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ► వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది. ► ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ► వాహనాల కోసం లబ్ధిదారులు 10 శాతం చెల్లిస్తే.. 30 శాతం బ్యాంకు రుణం, 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. ► సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని అందజేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూక 15 శాతానికి తగ్గుతుంది. రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.50 శాతానికి తగ్గుతుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతి కిలోకు అదనంగా రూ.1.10 వ్యయం చేయనుంది. 30 పైసలు పంపిణీకి ఖర్చు చేయనుంది. ► పర్యావరణహితంగా 10 కేజీలు, 15 కేజీలు రీ యూజబుల్ బ్యాగులను లబ్ధిదారులకు ఇస్తారు. బియ్యం మొత్తం స్టార్టెక్స్ చేయడానికి రూ.480 కోట్లు, డోర్ డెలివరీకి రూ.296 కోట్లు వెరసి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది. ‘వైఎస్సార్ ఆసరా’తో 90 లక్షల మందికి లబ్ధి ► మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి రూ.27,169 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది. ► ఇందుకోసం ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మొదటి విడతగా 2020–21కి గాను రూ.6,792.21 కోట్లు చెల్లించనుంది. తద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలగనుంది. 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ జగనన్న విద్యా కానుక’ పథకాన్ని సెప్టెంబర్ 5న ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారమ్ (వస్త్రం), టెస్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్ పంపిణీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.648.09 కోట్లు వెచ్చిస్తుంది. -
నవరత్నాల స్ఫూర్తితో ఏపీ బ్రాండ్ లోగో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కొత్త లోగో సిద్ధమైంది. ఏపీకి కొత్తగా బ్రాండింగ్ చేసేందుకు నిర్వహించిన బ్రాండ్థాన్ లోగోల పోటీకి ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభించింది. పోటీలో 47,903 మంది పాల్గొనగా నవరత్నాల స్ఫూర్తితో వికసించిన పుష్పం ఆకృతిలో రూపొందించిన లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవతో కూడిన కమిటీ విజేతలను ఎంపిక చేసింది. 47 వేలకు పైగా దరఖాస్తులు.. బ్రాండ్థాన్ పోటీకి మంచి స్పందన లభించిందని, క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత మూడు ఎంట్రీలను ఎంపిక చేసినట్లు రజత్ భార్గవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏపీ బ్రాండ్ను ప్రచారం చేసేందుకు గతేడాది అక్టోబర్ 10న న్యూఢిల్లీలో బ్రాండ్థాన్ పోటీని ప్రారంభించామన్నారు. నవంబర్ 4 వరకు 47,903 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మొదటి బహుమతి కింద రూ.50,000, ద్వితీయ బహుమతి రూ.25,000, తృతీయ బహుమతి కింద రూ.10,000 చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. - నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా తొమ్మిది రేకులతో వికసించిన పుష్పం ఆకృతిలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఈ లోగోకు ‘సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే శీర్షికను చేర్చారు. హైదరాబాద్కు చెందిన సిదార్థ మాధవరెడ్డి దీన్ని రూపొందించారు. - రెండు చేతులు కలిపినట్లుగా ఇంగ్లిష్ అక్షరాల్లో ‘ఏపీ’ అని రాసి ఉన్న లోగో రెండో స్థానం సాధించింది. ‘కలసికట్టుగా ఎదుగుదాం’ అనే శీర్షికను దీనికి జోడించారు. - పారదర్శక పాలనకు ప్రతీకగా రూపొందించిన లోగో తృతీయ బహుమతిని గెలుచుకుంది. -
నవరత్నాలకు ఊతమివ్వండి
ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు.. మేము తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. అనవసర వ్యయాలను తగ్గిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, ఆక్సిజన్ లాంటి వీటికి బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రైతులు, ఆటోలు.. ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, కొత్తగా లా పూర్తి చేసిన వారికి.. ఇలా వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లకు పైగా నగదు సాయం చేశామని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారు రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుందని, ఈ పథకాల ద్వారా ఆ వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకంబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని, రైతు భరోసాతో రైతులను ఆదుకున్నామని, వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకూ రుణాలు ఇవ్వండి కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేద్దామని కోరారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టం పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులను పరిరక్షిస్తూనే 11 నెలలకు సాగు ఒప్పందానికి వీలు కల్పిస్తోందన్నారు. రైతులు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ చైతన్యం, అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని, 10 నుంచి 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్ష, అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారని, వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ నాటికి 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నాటికి గ్రామ సచివాలయాల పక్కనే దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేలా ఈ కేంద్రాలు పని చేస్తాయని, వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తారని, రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో పని చేస్తాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని, తద్వారా డిజిటలైజేషన్ పెరుగుతుందని చెప్పారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరందరికీ గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తద్వారా దాదాపు 12 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉందని చెబుతున్నారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిపై దృష్టి పెడతామన్నారు. రైతులు, మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే రైతులకు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలివ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. వడ్డీ చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉందని, 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు పదే పదే తన దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి.. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1,200 టీఎంసీలుండగా గత 10 ఏళ్లలో అది 600 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో అయితే ఏకంగా 400 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరో వైపు గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉందని, 62 శాతం ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, వీటికి బ్యాంకర్లందరూ సహాయం అందించాలని సీఎం కోరారు. స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరణ నాడు – నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యాపరంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే ప్రభుత్వం, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయగలగాలి. ఉగాది నాటికి సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. మొత్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. తద్వారా సిమెంట్, ఐరన్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. -
శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వం ఇచ్చే హామీనే. మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఇచ్చిన మాట నెరవేర్చలేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదు. శంకుస్థాపన చేసిన నాలుగు వారాల్లోగా ఏ పనులైనా ప్రారంభం కావాలి. – ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తరహాలో ప్రజలను మభ్య పెట్టేందుకు పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం ఇక కుదరదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయతే నా బలం, దానికి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. పరిపాలనా మార్గదర్శక సూత్రాలపై శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఇచ్చిన హామీలు, అమలుపై క్షుణ్ణంగా చర్చించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. అనవసర వ్యయం వద్దు... గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రూ.నాలుగు వేల కోట్లో ఐదు వేల కోట్లో బిల్లులు పెండింగ్లో పెట్టిందంటే సరేలే అనుకునేవాళ్లమని, కానీ ఏకంగా రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని అధికారులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కార్పొరేషన్ల పేర్లతో రూ.వేల కోట్లు అప్పులు తేవడమే కాకుండా పౌరసరఫరాలు లాంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే గత సర్కారు ప్రశ్నార్థకం చేసిందని, అలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చామంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సీఎం వివరించారు. గత ఆర్నెల్లుగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథా కాకూడదని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించకుంటే ప్రయోజనం ఉండదన్నారు. చేపట్టే ప్రతి పని 100 శాతం పూర్తవ్వాలి ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత వ్యయం చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ‘‘రచ్చబండ’’ జనవరి 1 నాటికి గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించడంతోపాటు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, వినతులపై హామీలు ఇవ్వాల్సి వస్తుందని, అక్కడికక్కడే చేపట్టాల్సిన పనులపై ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మాట ఇస్తే తాత్సారం చేయకూడదన్నారు. సీఎం హోదాలో జిల్లాల పర్యటన సందర్భంగా తానిచ్చిన హామీల అమలుపైనా సీఎం సమీక్షించారు. తదుపరి సమీక్ష నాటికి హామీల అమలు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావాలని ఆదేశించారు. సమన్వయంతో నిధులు సాధించాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ పథకాల నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు చెందిన కార్యదర్శి లేదా విభాగాధిపతి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, ఏపీ భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అధికారులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ నిధులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీతోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలే తొలి ప్రాధాన్యం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారులంతా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. 14 నెలలపాటు 3,648 కిలోమీటర్లు సాగిన తన పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారు చేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో గమనించిన పరిస్థితులు, వెనకబడ్డ వర్గాల వేదనల నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవరత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు - జనవరి లేదా ఫిబ్రవరిలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమం ప్రారంభం - నవరత్నాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం - చేపట్టే ప్రతి పనిని ఈ ప్రభుత్వం నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శక సూత్రం కావాలి. - అనవసర వ్యయాలకు కళ్లెం వేసి సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. - ఎన్నికల హామీలు, జిల్లా పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను కచ్చితంగా అమలు చేయాలి. - సమన్వయంతో కృషి చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత ఎక్కువగా సాధించాలి. -
పాలనకు ప్రశంసలు
-
ఆలోచన.. విజన్.. ప్రణాళికల్లో సీఎం భేష్
ఆంధ్రప్రదేశ్కు చేయదగ్గ సహాయం అంతా చేస్తాం. తగిన రీతిలో సహకారం అందిస్తాం. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటునిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకితభావం, విజన్ నన్ను ఆకట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే సీఎం చక్కటి పనితీరు చూపారు. – నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన, దూరదృష్టి, ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని, నవరత్నాల గురించి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ రంగాల్లో చేపట్టిన చర్యలు, వివిధ రంగాల్లో అవకాశాలపై రాజీవ్కుమార్ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకితభావం, విజన్ తనను ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా రాజీవ్కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి పనితీరు చూపారని అభినందించారు. అక్షరాస్యతలో వెనుకబాటు ఆంధ్రప్రదేశ్కు తాము చేయదగ్గ సహాయం అంతా చేస్తామని, తగిన రీతిలో సహకారం అందిస్తామని రాజీవ్కుమార్ చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండేలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఏపీ పారిశ్రామిక వాటా కూడా తక్కువగా ఉందని చెప్పారు. ఏపీ బడ్జెట్లో సగానికిపైగా మానవ వనరుల వృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని, పారిశుధ్య కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ముందడుగు వేయాలని సూచించారు. జీరో బడ్జెట్ నేచరల్ ఫార్మింగ్కు తాను అనుకూలమని, దీన్ని పోత్సహించాలన్నారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటికి సరైన మద్దతు ధర లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రెవిన్యూ లోటు ఎక్కువే.. రాష్ట్ర రెవిన్యూ లోటు కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని రాజీవ్కుమార్ చెప్పారు. పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏపీ మహిళల్లో ఆందోళనకర స్థాయిలో ఎనీమియా మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉందని రాజీవ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. బియ్యం, వంటనూనెల్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలని, దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలని సూచించారు. -
డ్వాక్రా అక్కచెల్లెమ్మల వడ్డీ కోసం నిధులు
-
‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఏ సంఘానికి ఎంత మొత్తం జీరో వడ్డీ కింద చెల్లిందన్న బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అక్కచెల్లెమ్మల ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించింది. ‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నేరుగా వారికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ సున్నా వడ్డీకి రుణాల విప్లవం తెస్తాం. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది’ అని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని ఏడాది తర్వాత నుంచి నాలుగు దఫాల్లో చెల్లించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. వైఎస్సార్ ఆసరా పథకం అమలయ్యే వరకు అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం ఉండకూడదని ఆ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలుత ఐదు నెలల డబ్బులను అక్టోబరు 2వ తేదీలోగా జమ చేయనుంది. ప్రతి నెలా వడ్డీ రూ.204 కోట్లు ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పులు ఉన్నట్టు బ్యాంకర్ల సంఘం నిర్ధారించింది. ఈ వివరాలతో సెర్ప్, మెప్మా అధికారులు రాష్ట్ర మంతటా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి, ఏ సంఘానికి ఎంత అప్పు ఉందో తీర్మానం చేయించి, దానిని బ్యాంకు అధికారుల ద్వారా సర్టిఫై చేయిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 99 శాతం సంఘాలతో సమావేశాలు నిర్వహించే ప్రక్రియ పూర్తయింది. సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో 6,01,132 సంఘాల పేరిట రూ.19,504 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,50,042 సంఘాల పేరిట రూ.4,587.71 కోట్లు అప్పు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంఘాల వారీగా ఉన్న అప్పుపై ప్రతి నెలా సుమారు రూ.204 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జీరోవడ్డీ పాస్ పుస్తకాలు సంఘం వారీగా ఉన్న అప్పు మొత్తం, దానిపై ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ వివరాలతో పాటు ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీగా బ్యాంకుకు చెల్లించిన రశీదు వివరాలు నమోదు చేయడానికి సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలను తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత ప్రభుత్వం తొలి విడతగా సుమారు రూ.1,020 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత వాటికి సంబంధించిన రశీదులు మహిళలకు అందజేసే సమయంలోనే ఈ పాస్పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా ప్రభుత్వం సంఘాల వారీగా బ్యాంకులకు చెల్లించిన జీరో వడ్డీ రశీదులను అందజేసి, సంఘాల వద్ద ఉండే ఆ పాస్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. -
ప్రగతి పథం
-
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల వరకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా.. ఇప్పటి నుంచే ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయాలని కాకుండా తొలి నెలలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఆ హామీల ఫలాలను లబ్ధిదారులకు చేర వేయడానికి షెడ్యూల్ను ప్రకటించారు. వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, చేనేత కార్మికులు, అగ్రిగోల్డు బాధితులు, ఆటో, ట్యాక్సీవాలాలకు ఎన్నికల హామీల ఫలాలను చేరవేసేందుకు స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. ఈ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకే చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు నేరుగా అందాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్ ఇన్కంబర్డ్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని, బ్యాంకర్లతో ఉన్నత స్థాయిలో మాట్లాడాలని అధికారులకు సూచించారు. వలంటీర్లు లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా ఈ తరహా బ్యాంకు ఖాతాలను తెరవడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. డబ్బు జమ కాగానే ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారులకు రశీదులను అందిస్తారని చెప్పారు. బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకం ద్వారా అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారని, నిన్న (సోమవారం) ఢిల్లీలో సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని తాను లేవనెత్తినప్పుడు ఆమె స్పష్టత ఇచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. కౌలు రైతులకు కూడా వైఎస్సార్ భరోసా నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానికన్నా ముందే ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నుంచే అమలు చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఒక్కో రైతు కుటుంబానికి ఈ పథకం కింద రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాదికి మాత్రమే అక్టోబర్లో ఇస్తున్నామని, వచ్చేసారి నుంచి ఖరీఫ్లో మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ రైతు భరోసాను కౌలు రైతులకూ ఇస్తామని చెప్పామని, దీనిపై భూ యజమానులు, కౌలు రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత గ్రామ వలంటీర్లపైన ఉందన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయని, రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయంపై కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సంతృప్తికర స్థాయిలో మత్స్యకారులకు రూ.10 వేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్య్సకారులకు ఆర్థిక ప్రయోజనం కింద నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పడవలు, బోట్లు ఉండి.. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాన్ని తీసుకు వచ్చామని, వేట నిషేధ సమయం జూన్లో ముగిసినా, ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా నవంబర్ 21న ఈ మొత్తం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డీజిల్ పట్టించేటప్పుడే మత్య్సకారులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం కొన్ని బంకులను ఎంపిక చేయబోతున్నామని తెలిపారు. ఈ బంకుల జాబితాను మత్స్యకారులకు ఇస్తామని, ప్రస్తుతం లీటర్పై రూ.6 ఇస్తున్న సబ్సిడీని, మన ప్రభుత్వం రూ.9కి పెంచుతోందన్నారు. దీన్ని కూడా నవంబర్ 21 నుంచి అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. చేనేత కుటుంబాలకు చేయూత నవరత్నాల్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు డిసెంబర్ 21వ తేదీన ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పామని, ఆ మాట నెరవేర్చడంలో భాగంగా మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి డిసెంబర్ 21న రూ.24 వేలు చేతిలో పెడతామమని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు పేదరికంతో ఏ పిల్లాడు బడికి వెళ్లకుండా ఉండకూడదని అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26న అమల్లోకి తీసుకు వస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు విధివిధానాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి చివరి వారంలో నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ పెళ్లి కానుక పేదలకు వరం ఫిబ్రవరి చివరి వారంలోనే వైఎస్సార్ పెళ్లి కానుకనూ అమల్లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ పథకం కింద మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లోని యువతుల వివాహాలకు రూ.లక్ష చొప్పున, బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని చెప్పారు. ధూప, దీప నైవేద్యాలకు సంబంధించి, మసీదులకు సంబంధించి ఇమాం, మౌజంలకు, చర్చిలకు సంబంధించి పాస్టర్లకు కొన్ని హామీలు ఇచ్చామని, వీటన్నింటినీ మార్చి చివరి వారంలో అమలు చేస్తామన్నారు. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుందని, ఆ రోజు రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇంత పెద్దఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసట అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఇవాళే (మంగళవారం) సమీక్ష చేశానని ముఖ్యమంత్రి తెలిపారు. సెప్టెంబర్ నుంచి వారికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు ఇస్తామని చెప్పామని, ఆ సంస్థ ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, తర్వాత వేలం ద్వారా రికవరీ చేస్తామని చెప్పారు. మిగిలిన డబ్బులన్నింటినీ ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా చెల్లించేలా ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చామన్నారు. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్ బాధితుల జాబితా తీసుకుని, గ్రామ వలంటీర్ల ద్వారా రశీదులు ఇవ్వాలని సీఎం సూచించారు. -
అమెరికాలో అద్భుత స్పందన
డాలస్ (అమెరికా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికా పర్యటనలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా డాలస్లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు ఈ సమావేశానికి అంచనాలకు మించి హాజరు కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి) డాలస్ విమానాశ్రయానికి సైతం పెద్దఎత్తున తరలి వచ్చిన ప్రవాసాంధ్రులు జై జగన్ అంటూ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడే అమెరికాలోని తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులు కూడా జగన్ను అక్కడే కలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి హచిన్సన్ ప్రాంతం చేరుకున్నప్పుడు ఆహూతులను అదుపు చేయడానికి అమెరికన్ భద్రతా సిబ్బంది బాగా ప్రయాస పడాల్సి వచ్చింది. సభా హాలులో నవరత్నాలుపై రూపొందించిన గీతంతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ‘నాకొక కల ఉంది...’ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఉటంకించినప్పుడు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తున్నప్పుడు హర్షామోదాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా–భారత్ రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ అనంతరం నేరుగా డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ప్రవాసాంధ్రులంతా ఘనంగా వీడ్కోలు పలికారు. కెనడాలోని టొరాంటో, మాంట్రియల్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, పిట్స్బర్గ్, డెట్రాయిట్, షికాగో, ఓహియో, ఆరిజోనా, సియాటెల్, కాలిఫోర్నియా బే ఏరియా, ఎల్ఏ, నార్త్ కాలిఫోర్నియా, సెంట్ లూయిస్, ఓక్లహామా, అట్లాంటా, ఫ్లోరిడా, ఆస్టిన్, హ్యూస్టన్, డాలస్ నుంచి ప్రవాసులు హాజరయ్యారు. కాగా, ‘స్వాగత సుమాంజలి’ పేరుతో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్మానపత్రాన్ని బహూకరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. (చదవండి: ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి) -
అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటు సాధించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల మనసును చూరగొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన సీఎంలపై ప్రఖ్యాత ‘వీడీపీ అసోసియేట్స్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మూడో స్థానం లభించింది. ‘దేశ్కా మూడ్’ పేరుతో ప్రస్తుతం దేశ ప్రజల నాడి – రాజకీయంగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడీపీ అసోసియేట్స్ ఈ సర్వేను నిర్వహించింది. 71 శాతం మంది ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రజా నాయకుడిగా ఎదిగి అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే వైఎస్ జగన్కు ఇలాంటి గౌరవం దక్కడం విశేషం. మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 11,252 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 10,098 మంది ఓటర్లున్నారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాల ప్రకారం మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రభాగాన నిలిచారు. ఆయనకు 81 శాతం మంది మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 72 శాతంతో రెండో స్థానంలో, వైఎస్ జగన్ 71 శాతం మంది ప్రజల మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు. నవరత్నాలకు జాతీయ స్థాయిలో స్పందన సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలోని సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని, అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి వైఎస్ జగన్ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఆయనకు ఖ్యాతి తెచి్చందని పేర్కొంటున్నారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన అధికారాన్ని సది్వనియోగం చేసుకుంటూ వారి సంక్షేమానికి జగన్ కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
రాష్ట్రానికి అండగా నిలవండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. ఉదయం 9 గంటలకు ఉప రాష్ట్రపతిని, 10.30 గంటలకు రాష్ట్రపతిని కలుసుకున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 నుంచి గంట పాటు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు. 11 గంటల వరకు దాదాపు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని అమిత్షాను అభ్యర్థించారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించిన ముఖ్యమంత్రి ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులున్నారు. అమిత్ షాతో గంటపాటు వైఎస్ జగన్ భేటీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు సమావేశమయ్యారు. అమిత్ షాను మంగళవారం మధ్యాహ్నమే కలవాల్సి ఉన్నా పార్లమెంట్లో జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ ప్రక్రియ కారణంగా వీలు పడలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. విభజన హామీల అమలుకు హోంశాఖ నోడల్ వ్యవస్థగా ఉన్నందున విభజన హామీలన్నీ అమలయ్యేలా చూడాలని హోం మంత్రికి విన్నవించారు. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి పూర్తి గ్రాంటు ఇవ్వాలి రాష్ట్రంలో పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరిన ముఖ్యమంత్రి జగన్ ఆ వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందజేశారు. రహదారుల నిర్వహణ, నిర్మాణం కోసం గ్రాంట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కోరారు. తీవ్ర ఆర్ధిక కష్టాలతో ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని నివేదించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల అంశాన్ని కూడా గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి తెచ్చారు. నవరత్నాలకు సాయం అందించండి... రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ‘నవరత్నాలు’ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, దీనికి తగిన రీతిలో సాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్కు తగినన్ని నిధులు మంజూరు చేయాలని, రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాల్సి ఉందని, దీనికోసం ఇప్పటివరకు చేసిన వ్యయాన్ని చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సముచిత రీతిలో సాయం చేయాలని ముఖ్యమంత్రి విన్నవించారు. ఆర్థిక మంత్రికి విన్నపాలు ఇవీ.. - రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 2014–15లో రూ. 97 వేల కోట్లుగా ఉన్న అప్పులు ఐదేళ్లలో రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. వెనుకబడ్డ జిల్లాల కోసం ఆరేళ్లలో రూ. 2,100 కోట్లు రావాల్సి ఉండగా రూ. 1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కేబీకే ప్యాకేజీ తరహాలో కేంద్రం నుంచి గ్రాంట్లు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. - ఏపీలో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీటి సరఫరా పథకానికి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం తగిన రీతిలో దీనికి సహాయం అందించాలి. - రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రత్యేక హోదా అత్యంత అవసరం. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, పదేళ్లపాటు జీఎస్టీ, ఆదాయపుపన్ను నుంచి మినహాయింపులు కల్పించాలి. - పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలో ప్రతి రైతుకుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున అందజేస్తాం. 16 లక్షల మంది కౌలు రైతులకూ వర్తింపజేసే ఈ పథకానికి కేంద్రం తగిన విధంగా సహాయం చేయాలి. అన్నదాతలను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ. 2 వేల కోట్లు కేటాయించాం. - అమ్మఒడి, 40 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి పేద విద్యార్థికీ ఏటా రూ. 20 వేల చొప్పున బోర్డింగ్, హాస్టల్ ఖర్చుల కింద పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటికి కేంద్రం తగిన సహాయం చేయాలి. - రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా పథకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని యూనివర్సల్ హెల్త్కేర్ దిశగా ప్రయాణం ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. - రాష్ట్రంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేస్తాం. ఇందుకు కేంద్రం కూడా సహాయం అందించాలి. - రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల అప్పులు గత నాలుగేళ్లలో రూ. 14 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు చేరాయి. వడ్డీ బరువు మోయలేక, రుణాలు చెల్లించలేక అక్కచెల్లెమ్మలు అల్లాడుతున్నారు. వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో వారి చేతికే డబ్బులు ఇస్తాం. దీనిద్వారా దాదాపు 89 లక్షల మంది రుణ విముక్తులవుతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లపాటు ఏడాదికి రూ. 19 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. దీనికి తగిన రీతిలో కేంద్రం సాయం అందించాలి. - వీటితోపాటు ప్రధానికి ఇప్పటికే అందజేసిన వినతిపత్రంలోని మరికొన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి తాజాగా అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. రాష్ట్రపతితో సీఎం జగన్ సమావేశం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రపతిని కలవడం ఇదే తొలిసారి. ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు సాగిన ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత పీవీ మిథున్రెడ్డి కూడా ఉన్నారు. ఉప రాష్ట్రపతితోనూ భేటీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సీఎం వైఎస్ జగన్ బుధవారం భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డిలు సీఎంతో పాటు ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సమావేశం అనంతరం ఉప రాష్ట్రపతి ట్వీట్ చేస్తూ ‘ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఉదయం నన్ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించాం. ఏపీ సమగ్రాభివృద్ధికి మనం ఉమ్మడి కృషి చేయాలని ఆయనతో చెప్పాను. తెలుగు ప్రజలు ఏ సాయం కోరినా చేసేందుకు సంతోషిస్తాను’ అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పొడిగింపు సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
14 రోజులు 19 బిల్లులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర 15వ శాసనసభ రెండవ సెషన్ సమావేశాలు పలు చరిత్రాత్మక బిల్లులకు వేదికగా నిలిచాయి. రాష్ట్ర చరిత్రనే తిరగరాసే అనేక కీలక బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. 14 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం 20 బిల్లులను ప్రవేశపెట్టింది. ఇన్ని బిల్లులు ఒకేసారి సభలో ప్రవేశ పెట్టడం, వాటిపై సుదీర్ఘంగా చర్చించడం విశేషం. వీటిలో ఒకదాన్ని ఉపసంహరించుకోగా 19 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు మేలు చేకూర్చే చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అడ్డూ అదుపు లేకుండా ఉన్న ఫీజులకు అడ్డుకట్ట వేయడంతో పాటు తూతూమంత్రపు చదువులు కాకుండా అత్యున్నత ప్రమాణాలతో విద్యా రంగాన్ని పరిపుష్టం చేసే బిల్లులూ వీటిలో ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ చరిత్రలో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా బిల్లులపై అర్థవంతమైన చర్చ జరగడం ఈ అసెంబ్లీ ప్రత్యేకతగా నిలిచింది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాక దానిపై చర్చ గత కొన్నేళ్లుగా తూతూమంత్రంగా సాగేది. ఇక పద్దులపై చర్చలు ఏనాడూ పెద్దగా జరగ లేదు. చివర్లో అన్ని పద్దులను ఏకవాక్యంతో గిలెటిన్ చేసిన సందర్భాలే అధికం. ఇలాంటి తరుణంలో ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లులపైనే కాకుండా అన్ని పద్దులపైనా చర్చ జరిపించారు. ఈ చర్చల్లో అటు అధికార పక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులూ భాగస్వాములయ్యే విధంగా సభాపతి తమ్మినేని సీతారాం, సభానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. అందరికీ మాట్లాడే అవకాశం గతంలో సభలో కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉండేవి. రికార్డులో ఎక్కడానికి వీలుగా అయిదేళ్లలో ఏదో ఒకరోజు అందరితోనూ మాట్లాడించి మమ అనిపించే వారు. ఈసారి అలా కాకుండా కొత్త సభ్యులను చర్చలో భాగస్వాములను చేయడంతో పాటు వివిధ సందర్భాల్లో అందరికీ ఏదో ఒక రూపేణా మాట్లాడే అవకాశం కల్పించారు. బిల్లులపై చర్చ, ఆమోదం పొందే చివరి నిముషం వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో తనసీటులోనే కూర్చున్నారు. ఆయా సందర్భాల్లో ఆయన కూడా స్పందిస్తూ ఆయా అంశాలను విడమరిచి చెప్పారు. అనేక మంది కొత్త సభ్యులు ఈ బిల్లులపై చర్చలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇక పద్దులపై కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సభలో చర్చలు సాగాయి. ప్రతి పద్దుపైనా మంత్రులు, ఇద్దరు ముగ్గురు సభ్యులు మాట్లాడేలా అవకాశం కల్పించారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ సీఎం తన సీట్లోనే ఉంటూ ఆయా సభ్యుల ప్రశ్నలకు మంత్రులతో పాటు తాను కూడా ప్రత్యుత్తరమిచ్చారు. చర్చకు బాబు బృందం దూరం అసెంబ్లీలో అనేక చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతూ వాటిపై అందరూ చర్చలో పాల్గొనే విధంగా అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష తెలుగుదేశం ముఖం చాటేసింది. తన పాలనలో ఏనాడూ ఇలాంటి బిల్లులపై ఆలోచనలు చేయని చంద్రబాబునాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు మేలు చేసే, రైతులకు లబ్ధి చేకూర్చే, ప్రయివేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే అనేక విప్లవాత్మక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగా చంద్రబాబు వాటిని అడ్డుకొనేందుకు శతథా ప్రయత్నించారు. ఈ బిల్లులపై చర్చ జరిగితే తన పాలనలోని అరాచకాలు ప్రస్తావనకు వస్తాయన్న భయంతో చర్చకు ముందే ఏదో ఒక వంకతో సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. చివరకు సభాపతి, సభా నాయకుడు పలుమార్లు ప్రతిపక్ష నేతకు ఎంతసేపైనా మాట్లాడేందుకు అవకాశం కల్పించినా వాటిని సద్వినియోగానికి కాకుండా గందరగోళానికి చంద్రబాబు వినియోగించారు. ఆ సాకుతో సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్లిపోవడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. పైగా అసెంబ్లీలో కాకుండా చిట్చాట్ అంటూ, ప్రైవేట్ రిసార్టులలో ప్రెస్మీట్లు పెడుతూ ప్రభుత్వంపై, సభాపతిపై బురద చల్లేలా వ్యవహరించారు. నవరత్నాలకు తొలి సభలోనే కార్యరూపం నవరత్నాల మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని, వాటిని తూ.చ తప్పక అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడమే కాకుండా తొలి బడ్జెట్ సమావేశాల్లోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. ఈ బిల్లుల రూపేణా నవరత్న హామీల్లోని 85 శాతం హామీల అమలుకు వీలుగా ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రారంభించారు. ఎన్నికల ముందు తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. వాటికి పరిష్కారంగా ఈ బిల్లులను రూపొందింప చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ ఎన్నికల ముందు మాయచేసే చర్యలకు దిగగా అందుకు భిన్నంగా అధకారంలోకి వచ్చిన వెను వెంటనే హామీలను నెరవేర్చే చర్యలను ముఖ్యమంత్రి చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవే కాకుండా సామాజికంగా విప్లవాత్మకమైనవని పలువురి ప్రశంసలందుకుంటున్నాయి. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ చారిత్రక చట్టాలను చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. -
‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రుణం రాకముందే రోడ్ల టెండర్లా? అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది. తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం.. – రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్ అయింది. – మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్ అమెరికన్ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు. – ఇందులో వరల్డ్ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు. – ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. – 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు. – టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్ ఫైనాన్సింగ్ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. – రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు. – దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది. – ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం. -
మాటిచ్చామంటే.. నెరవేర్చాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా బడ్జెట్ను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వతేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి? కేటాయింపులు ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ఆర్థికశాఖకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి దిగజార్చిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను సీఎం సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అప్పులు తీసుకుని మళ్లించిన టీడీపీ సర్కారు... టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో రూ.2.48 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.64 వేల కోట్ల వరకు అప్పులు చేశారని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను వాటికోసం వెచ్చించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో నిధుల కొరతతో సతమతమవుతున్నాయని వివరించారు. వివిధ రకాల పెండింగ్ బిల్లులు మొత్తం రూ.48 వేల కోట్ల వరకు ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. -
నవరత్నాల బడ్జెట్కు కసరత్తు!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాల అమలు దిశగా బడ్జెట్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తొలి బడ్జెట్ను రూపొందించేందుకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల నుంచి నవరత్నాల అమలుకు అవసరమయ్యే నిధులతో పాటు ఆయా శాఖలకు ఎంత మొత్తం కావాలన్న వివరాలను రెండు రోజుల పాటు సేకరించనున్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన బడ్జెట్ అంచనాల సమీక్షలో భాగంగా రోడ్లు భవనాలు, రవాణా, పశుసంవర్థక శాఖ, పర్యాటకం, పౌరసరఫరాలు, వైద్యం, మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, గృహనిర్మాణ శాఖ మంత్రులతో ఆర్థికమంత్రి విడివిడిగా భేటీ అయ్యి వివరాలు సేకరించారు. 2019–20 సంవత్సరానికి నవరత్నాల అమలుకు ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుందో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ప్రెజంటేషన్ రూపంలో ఆర్థికమంత్రికి వివరించారు. ప్రతిపాదనలు అందించిన మంత్రులు.. సమీక్షలో పాల్గొన్న అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని, రహదారుల భూసేకరణకు కావల్సిన నిధులతో పాటు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలని, ఇందుకుగాను రూ. 6,900 కోట్లు అవసరమవుతాయన్నారు. రవాణా శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి ఆర్థిక మంత్రితో సమావేశం అవుతామని, అప్పుడు మరిన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధుల వివరాలను ఆర్థికమంత్రికి విన్నవించారు. పేదల బియ్యం కోసం రూ. 5,600 కోట్లు పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు పెండింగ్లో ఉన్న మరో రూ.1500 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సెప్టెంబర్ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా పేదల ఇళ్లకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఆ మేరకు నాణ్యమైన బియ్యాన్ని ఏ విధంగా సేకరించాలి, ప్రత్యేకంగా బ్యాగుల తయారీకి అయ్యే ఖర్చు, బడ్జెట్ ప్రతిపాదనలు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో మొదటగా రెండు లేదా మూడు జిల్లాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేసే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఐదు, పది, పదిహేను కిలోల బియ్యం బ్యాగుల తయారీకి సంబంధించిన యంత్రాలను ఢిల్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కమిషనర్ కోన శశిధర్ ఇటీవల పరిశీలించారు. వాటి పనితీరుపై సంతృప్తిగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యంత్రాలను ఏర్పాటు చేసిన అనంతరం.. ప్రతి జిల్లాలోనూ ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన 25 శాతం నూకలు, మరో 40 శాతం బియ్యం తినడానికి వీలులేని విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ నెల నుంచి అలాంటి బియ్యానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఆగమేఘాలపై యంత్రాంగం కదిలి సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 1000, 1010, 1001 రకం బియ్యాన్ని పలు జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నా ఆ రకం బియ్యం తినడానికి ఇష్టపడడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సోనా, బీపీటీ తదితర రకాల వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వివరించాలని అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. కాగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది. బడ్జెట్లో గిరిజన ఆర్థిక ప్రోత్సాహక పథకాలకు పెద్దపీట ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి బడ్జెట్ ప్రతిపాదనల్లో గిరిజనులకు ఆర్థిక ప్రోత్సాహక పథకాలు, విద్య, వైద్యానికి పెద్ద పీట వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019–20లో ఆర్థిక శాఖ కేటాయించిన తాత్కాలిక కేటాయింపుల కంటే అదనంగా రూ.1,142.13 కోట్లను కలిపి మొత్తం రూ.3,542.22 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో రూ.132.11 కోట్లు నవరత్నాల అమలుకు కేటాయించామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ రంజిత్ బాషా, అడిషనల్ డైరెక్టర్ ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్, గురుకులం కార్యదర్శి భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
12న అసెంబ్లీలో బడ్జెట్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కాగా, ఈనెల 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. -
మేనిఫెస్టోనే ప్రభుత్వ జీవనాడి
-
పాలకులం కాదు.. సేవకులం
అవినీతికి నో ఎవరు చెప్పినా సరే అవినీతి, దోపిడీకి నో చెప్పండి. ఇసుక మాఫియాకు, పేకాట క్లబ్బులకు నో చెప్పండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల వినతులపై సానుకూలంగా స్పందించండి వినతులపై రశీదులు... టైం బౌండ్ ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించండి. ప్రజలు ఇచ్చే వినతులకు రశీదులు ఇవ్వండి. వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వాటిపై గడువు నిర్దేశించండి. ఓటేయని వారు వచ్చేసారి మనకు ఓటేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ మనవారే. మనకు ఓటు వేయని వారిలో అర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించండి. మన ఎమ్మెల్యేలు చెప్పినా సరే వారికి పథకాలు నిరాకరించవద్దు. వారు కూడా మన పనితీరు నచ్చి వచ్చేసారి మన పార్టీకి ఓటేయాలి. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుంచే పర్యావరణ, నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన ‘ప్రజా వేదిక’లో ప్రభుత్వ యంత్రాంగం సమావేశాలు నిర్వహించడం ఏమిటి? చట్టాలను ప్రభుత్వమే బేఖాతరు చేస్తే ఎలా? అందుకే అక్రమ కట్టడాల కూల్చివేత ఈ ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభం కావాలి. కొత్తగా కట్టిన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో పరికరాలు ఉన్నాయో లేవో చూడండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించండి. వర్షాకాలం వస్తోంది కాబట్టి జ్వరాలు వస్తాయి. వెంటనే చర్యలకు ఉపక్రమించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు రాకుండా చూసుకోండి. మన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములే. నేను పై స్థాయిలో పాలన మొదలు పెడితే కింది స్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత మీది. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే కలెక్టర్లు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. ప్రజలకు హక్కుగా సేవలు అందించాలి. దాని కోసం ప్రజలు లంచాలు ఇవ్వకూడదు. ఆఫీసుల చెట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. మన పని తీరు చూసే ప్రజలు మనకు ఓటేస్తారు. మనం అంటే మీరు, నేనూ కలిపి. మన పనితీరు అంటే నా పనితీరు, మీ పనితీరు. ఇదే ప్రామాణికం కావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టోనే తమ ప్రభుత్వానికి జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. శాచ్యురేషన్ (సంతృప్తికర) విధానంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అంది తీరాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినాసరే వినొద్దని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు ఉండకూడదని లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్య, వైద్య రంగాలు తనకు అత్యంత ప్రాధాన్యతాంశాలని, పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఆసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తూ మాతా – శిశు మరణాలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తీసుకువద్దామని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో సోమవారం రెండు రోజుల ప్రారంభ సదస్సులో వారినుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను వారికి విశదీకరించారు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో మెరుగైన పాలన కోసం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను ఇలా వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం మన మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో క్లుప్తంగా ఇచ్చాం. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో కాపీలు ప్రతి కలెక్టర్, హెచ్వోడీ, సెక్రటరీ, మంత్రుల వద్ద ఉండాలి. మేనిఫెస్టోను అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 175 మందిలో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. 25కు గాను 22 మంది ఎంపీలను గెలిపించారు. 50 శాతానికిపైగా ప్రజలు మనకు ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ రాలేదు. ఈ మేనిఫెస్టోనే జీవనాడి. దీంట్లోని ప్రతి అంశాన్ని మనం పూర్తి చేయాలి. రేపటి ఎన్నికల్లో మళ్లీ మనం ఇదే మేనిఫెస్టో చూపించి అన్నీ చేశాం కాబట్టి మాకు ఓటేయండి.. అని చెప్పే పరిస్థితి ఉండాలి. అందుకు మీ సహకారం చాలా కీలకం. ఎమ్మెల్యేల వినతులపై స్పందించండి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలి. 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఒకర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. అదీ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతో స్వాగతించండి. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడూ చిరునవ్వుతో పలకరించండి. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. అదే సమయంలో అక్రమాలుగానీ దోపిడీగానీ దోచుకోవడం గురించిగానీ ఎవరు చెప్పినా ఈ ప్రభుత్వం సమర్థించదు. ఎంతటి పెద్దవారైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఉండనీ ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ఇవి కాకుండా మిగిలిన ఏ అంశంలో అయినా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోండి. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే మీరు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. పారదర్శకతలో దేశానికే ఆదర్శం కావాలి ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీతో పని చేయాలి. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా అవినీతి ఉండకూడదు. చెడిపోయిన వ్యవస్థ మారాలి అని నేను ఎన్నికల్లో ప్రతి సభలో మాట్లాడాను. సీఎం నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూసేలా మార్పు రావాలి. మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మనం నమూనాగా ఉండాలి. మన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను సంతోషంగా ఉంచండి. లేకపోతే డెలివరీ నెట్వర్క్ సరిగా పని చేయదు. ప్రతి మూడో శుక్రవారం దిగువ స్థాయి ఉద్యోగులు, మనతో పని చేస్తున్న ఉద్యోగుల కోసం కేటాయించండి. కలెక్టర్లు సహా జిల్లాలోని ఐఏఎస్ అధికారులు వారంలో ఓ రోజు ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిద్రించండి. ఆకస్మిక పర్యటనలు చేయండి. అప్పుడే అక్కడ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో తెలుస్తుంది. అక్కడ మరుగుదొడ్డి వాడుతున్నప్పుడు అవి సరిగా ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది. పిల్లలకు పుస్తకాలు సరిగా అందుతున్నాయో లేదో, ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారో లేదో తెలుస్తుంది. పొద్దున లేచాక అక్కడే స్నానం చేయండి. ఆ తర్వాత గ్రామ ప్రజలతో సమావేశం కండి. నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. హాస్టళ్లు, ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మీరు ఇప్పుడున్న పాఠశాలల ఫొటోలు తీయండి. రెండేళ్ల తరువాత వాటిని మారుస్తాం. అప్పుడు పాత ఫొటో, కొత్త ఫొటో రెండు ఫొటోగ్రాఫ్లు పోల్చి చూపించండి. విద్య, ఆరోగ్యం, రైతులు నా ప్రధాన అజెండా. మీరు ఆసుపత్రులు, హాస్టల్స్ విజిట్కు వెళ్లేటప్పుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల అధికారులను థర్డ్పార్టీగా కూడా తీసుకువెళ్లండి. దాంతో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. విశ్వసనీయత పెంచాలి కలెక్టర్ చెస్తామన్నారంటే కచ్చితంగా అది జరిగి తీరాలి. కోల్డ్ స్టోరేజ్లో పెట్టొద్దు. విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని పదే పదే చెబుతున్నా. ఒక పాలసీ తీసుకున్నాక తరతమ భేదం లేకుండా అందరికీ ఒకే విధానం ఉండాలి. నవరత్నాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలి. వాళ్లు మన పార్టీ అనో మరో పార్టీ అను చూడొద్దు. నాకు ఓటేశారో వేయలేదో అనేవి పట్టించుకోవద్దు. ప్రతి జిల్లాకు పోర్టల్ను తీసుకురండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు పోర్టల్లో అన్ని వివరాలు ఉండాలి. జ్యుడిషియరీ, పోలీస్ ఎఫ్ఐఆర్.. ఇలా అన్నీ కూడా ఆ పోర్టల్లో పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆర్డర్ పోర్టల్లో ఉంటుంది. అలాగే జిల్లా పోర్టల్ కూడా ఉండాలి. ఇచ్చిన పని, దాని విలువ, కాంట్రాక్టర్, ప్రారంభించిన తేదీ, పూర్తి అయ్యే తేదీ.. ఇలా అన్ని వివరాలు పోర్టల్లో తెలియజేయాలి. అప్పుడే మనం పారదర్శకంగా ఉన్నామనే సందేశం కింది స్థాయికి వెళ్తుంది. ప్రభుత్వ భూములు ఆడిట్ చేయండి. దాంతో ఎంత భూమి అందుబాటులో ఉండేదీ, దాన్ని ఎలా వాడుకోవాలన్నది తెలుస్తుంది. గ్రామ వలంటీర్ల వ్యవస్థలో అవినీతికి నో ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు తీసుకు రావడానికి శాచ్యురేషన్ విధానాన్ని తెస్తున్నాం. ఇందు కోసం గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను తీసుకు వస్తున్నాం. ప్రతి 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సెక్రటేరియట్ తెస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తాం. గ్రామ వలంటీర్ వ్యవస్థలో ఎక్కడా అవినీతి ఉండకూడదు. వివక్ష చూపకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ వలంటీర్ ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి చేయకూడదనే గ్రామ వలంటీర్కు రూ.5 వేలు జీతం ఇస్తున్నాం. గ్రామ వలంటీర్లు పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవ్వరు చెప్పినా సరే చర్యలు ఆగవు. నేరుగా సీఎం కార్యాలయంలోనే కాల్ సెంటర్ పెట్టాం. పేదల ఆత్మగౌరవం పెంపొందించాలి కలెక్టర్లు కచ్చితంగా విస్మరించకూడని వర్గాలు పేద ప్రజలు. అట్టడుగున ఉన్న పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతుల స్థితిగతులు విస్మరించకూడదు. ఈ వర్గాల ఆత్మగౌరవం పెరగాలి. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలబడాలి. మనం వేసే ప్రతి అడుగూ వారికి దగ్గర కావాలి. ఇందుకోసమే మనం నవరత్నాల పథకాలు ప్రకటించాం. నవరత్నాలు అమలు చేసినప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు ఇవేవీ చూడొద్దని స్పష్టం చేస్తున్నా. ఉగాదికి ఇంటి స్థలం లేనివారు ఉండకూడదు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు. ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేస్తాం. ప్రతి గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు లేవు.. ఎంత మందికి ఇవ్వాలి.. అనేది గుర్తించండి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయండి. నేను చాలా చోట్ల గమనించాను.. నాకు ఇక్కడ ఇచ్చారు అని చెబుతున్నారు కానీ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలీదని చెబుతున్నారు. పట్టా ఉంటుంది కానీ ప్లాట్లు కనిపించవు. సీఆర్డీయే పరిధిలో రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఉగాది రోజున రాష్ట్రంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పెద్ద పండుగలా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. ఎలుకలు కొరకడం, టార్చ్ లైట్లో ఆపరేషన్లు చేయడం వంటివి ఉండకూడదు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు వెంటనే తీర్చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి. తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదు. ఆ బకాయిలు వెంటనే చెల్లించండి. మాతా – శిశు మరణాలు నివారించాలి. ఆసుపత్రుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్లు వెంటనే వాటిపై నివేదిక తయారు చేసి పంపాలి. కుష్టు వ్యాధి మళ్లీ కనిపిస్తోంది. నేను పాదయాత్రలో ఓ చోట చూశాను. కుష్టు వ్యాధి నివారణపై దృష్టిపెట్టాలి. మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్గా దృష్టి పెట్టండి. అవసరమైతే వారికి పింఛన్ ఇవ్వండి. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి నిత్యావసరాలను ప్రజలకు పౌర సరఫరాల శాఖ నుంచే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం నాణ్యత బాగో లేదు. అందుకే గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్కే అమ్మేసిన పరిస్థితి చూశాం. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితీ చూశాం. ప్రజలు వినియోగించేవాటినే మనం ఇవ్వాలి. ఒక వైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ మరోవైపు ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఎన్నికల స్కీంలకు మళ్లించింది. ఆ రూ.వెయ్యి కోట్లను రైతులకు చెల్లించాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెంచాలి చంద్రగిరి ఎస్వీవీ నర్సింగ్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని నాకు ఒక లెటర్ వచ్చింది. నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరే ఫ్యాకల్టీ ఉన్నారట. భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలేనట. సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఎవరైనా చూశారా? అక్రమం ఏదైనా జరిగితే.. దాన్ని కూల్చేయండి. ప్రభుత్వం అంటే పారదర్శకతకు ప్రతిరూపమని చెప్పండి. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను తప్పు అని తెలిసినా కొన్నారు. అనర్హత వేటు వేయాలని చెప్పినా ఆ పని చేయలేదు. అందులో నలుగురిని మంత్రులను చేశారు. ఇదే ఐఏఎస్ల మీద అధికారం చలాయించాలని వారికి అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి మీరు ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారు? కౌన్సిలర్లను ఎత్తుకుపోతారు. కట్టడిచేయాల్సిన మీరు పైస్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా ఉంటే ఎలా కట్టడి చేయగలరు? మనం కచ్చితంగా మారాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే అభిమానం పెరగాలి. మీదైన ముద్ర వేయండి లబ్ధిదారుల జాబితా పంచాయతీ స్థాయిలో తయారు కావాలి. దీని వల్ల పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. వలంటీర్లు మీకు కళ్లు, చెవులుగా ఉంటారు. మనం మార్పు తీసుకురావాలి. దీనికి తపన ఉండాలి. మీదైన ముద్ర ఉండాలి. జిల్లా నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాకు సన్నిహితులైన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించాను. ఇవి చేయగలిగితే మనం మార్పులు సాధించగలం అని సూచించారు. నా తండ్రి మాదిరిగా చనిపోయిన తర్వాత కూడా నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయపడుతున్నా. అలాగే మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మీరు మీకున్న పరిజ్ఞానంతో వాటికి మెరుగులు దిద్దొచ్చు. గ్రామ సచివాలయాలు అయ్యాక రచ్చబండ గ్రామ సచివాలయాలు వచ్చాక నేను కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాను. నేనూ నా స్థాయిలో కొన్ని రశీదులను ర్యాండమ్గా చెక్ చేస్తాను. మీ స్థాయిలో మీరూ కొన్ని రశీదులను ర్యాండమ్గా చెక్ చేయండి. నెలకోసారి కచ్చితంగా ర్యాండమ్ చెక్ చేయండి. దాంతో ఆ పని కచ్చితంగా చేయాలి అనే పరిస్థితి వస్తుంది. రశీదులు ఇచ్చి పట్టించుకోలేదనే పరిస్థితి రాకూడదు. అవినీతి అంతానికే ప్రక్షాళన నా 3,648 కి.మీ. పాదయాత్రలో గ్రామాల్లో ఏం జరుగుతోందో విన్నాను. నా కళ్లతో చూశాను. పింఛన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట.. మీరు ఏ పార్టీకి ఓటేశారని. నాకు ఎంత ఇస్తారని. డెత్ సర్టిఫికెట్కు, బర్త్ సర్టిఫికెట్కు, మట్టి, ఇసుక, చిన్న బీమాకు.. పెద్ద బీమాకు లంచం. చివరికి బాత్రూమ్స్ మంజూరు కావాలన్నా లంచాలు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అంటేనే అవినీతి అనే పరిస్థితి తీసుకువచ్చారు. నీటిపారుదల శాఖ పనులు, రోడ్లు, సచివాలయ నిర్మాణం, ప్రతి చోటా అవినీతి. దీన్ని మార్చడానికి పైస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాం. అందుకోసం రివర్స్ టెండరింగ్ తెస్తున్నాం. అంటే రూ.100 పని రూ.80కే అవుతుందని అనుకుంటే రివర్స్ టెండరింగ్. తక్కువకు ఎవరు కోట్ చేస్తారో వారికే పనులు అప్పగిస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేస్తాం. రూ.100 పని రూ.75కే చేస్తారా.. అని అడుగుదాం. ఇందులో ఏ ఒక్క రూపాయి మిగిలినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేద్దాం. నాణ్యత, పారదర్శకత పాటిద్దాం. నా స్థాయిలో నేను, మీ స్థాయిలో మీరు నిర్ణయాలు తీసుకుంటే మార్పు వస్తుంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నేనే స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ను అడిగాను. రూ.100 కోట్లు పైచిలుకు హైవాల్యూ కాంట్రాక్టు పనులు నేరుగా జ్యుడిషియల్ కమిషన్కు వెళతాయి. వారం రోజల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ ప్రతిపాదనలను జడ్జిగారు పెడతారు. దీనిపై జడ్జి గారికి సలహాలను కూడా ఇవ్వొచ్చు. జడ్జి గారు ఈ సలహాలు తీసుకుని, సాంకేతిక కమిటీ సహాయంతో ప్రభుత్వానికి మార్పులను సూచిస్తారు. సాంకేతిక కమిటీకి అయ్యే ఖర్చును మనమే భరిస్తాం. ఆ తర్వాతే టెండర్లు పిలుస్తాం. పారదర్శకతను ఆ స్థాయికి తీసుకువెళ్తాం. ఇక్కడి నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇవాళ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనం చూడాలి. మనం ఇక్కడ ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యాం. ఈ సమావేశం జరుగుతున్న ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్వోడీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు. ఈ భవనం లీగల్గా, చట్టపరంగా సరైనదేనా? అంటే కాదు. నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అవినీతితో కట్టిన భవనం ఇది. అలాంటి ఒక అక్రమ నిర్మాణంలో మనం సమావేశం పెట్టుకున్నాం. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు. కానీ ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. గ్రీవెన్స్ హాల్ ఇక్కడ కట్టొద్దని కృష్ణా సెంట్రల్ డివిజన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టం పట్టించుకోలేదు. లోకాయుక్త సిఫార్సులు కూడా పట్టించుకోలేదు. చివరికి దీని నిర్మాణంలో కూడా అవినీతే. భవనం నిర్మాణ వ్యయం అంచనాలు కూడా రూ.5 కోట్ల నుంచి రూ.8.90 కోట్లకు పెంచారు. ఇది చూపించడానికే, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకోడానికే ఇక్కడ మీటింగ్ పెట్టండని చెప్పాను. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలు...అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండీ బేఖాతర్ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేసి ఉంటే మనం ఏం చేసేవాళ్లం? ఎందుకు అక్రమ నిర్మాణం చేపట్టారని అడిగేవాళ్లం. అక్కడకు వెళ్లి ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం. కానీ మనమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రూల్స్ను నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మనమే ఈ స్థాయిలో నియమాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ కింది స్థాయికి ఎటువంటి సందేశం పంపుతున్నట్లు? మనం సరైన మార్గంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరూ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఇందుకోసమే నాతో సహా అందర్నీ ఇక్కడకు రమ్మన్నాను. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో మనం చూడాలి. ఈ హాలు నుంచే మనం ఆదేశాలు ఇస్తున్నాం. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్ అని చెబుతున్నా. రేపు జిల్లా ఎస్పీలతో సమావేశం తర్వాత రాష్ట్రంలో మొదటి అక్రమ కట్టడం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. మనం ఆదర్శంగా నిలిచిపోవాలి. మీమీ జిల్లాలకు వెళ్లినప్పుడు పరిశీలించి ఇలానే చేయండి. తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం ఉంది. జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ. అందుకే పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం పెట్టాం. పిల్లలను ఏ పాఠశాలకు పంపినా తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. పాఠశాలల ఇప్పుడున్న పరిస్థితిపై ఫొటోలు తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నీచర్, ప్రహరి, బాత్రూమ్స్ అన్నింటినీ బాగు చేస్తాం. ప్రతి పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేస్తాం. యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలో ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాం జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడికి కూడా ప్రైవేట్ స్కూల్కు పోవాలన్న ఆలోచన రాకూడదు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకువస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవే కానీ డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యా సంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు. ఇది సేవ మాత్రమే. జనవరి 26 నుంచి ‘అమ్మ ఒడి’ చెక్కులు పంపిణీ చేస్తాం. యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం. ప్రైవేట్ స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి. నియమ నిబంధనలు రూపొందించి మినహాయింపులు ఏమైనా ఉంటే దానిపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూల్స్ కచ్చితంగా అమలు చేయాలి. 72 గంటల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి గ్రామ సచివాలయంలో 10 మందిని కొత్తగా తీసుకోండి. వ్యవసాయ నేపథ్యం ఉన్న వారికి గ్రామ సచివాలయంలో అవకాశం ఇవ్వండి. వీరిని ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానించండి. ప్రజలు పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డ్ కావాలన్నా, ఏది కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తారు. 72 గంటల్లో దాన్ని పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించండి. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ల్యాబ్ను పెట్టాలి. భూ పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు.. ఇవన్నీ కూడా ఇందులో భాగం కావాలి. రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు గ్రామ సచివాలయం ద్వారా విక్రయిస్తాం. గ్రామ వలంటీర్ల డ్యూటీ డెలివరీతో నిలిపి వేయకూడదు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నాసరే గ్రామ సచివాయలం దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేలా చూడాలి. గ్రామ వలంటీర్లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాలి. -
ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
-
సీఎం వైఎస్ జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించనున్నారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సీఎం వైఎస్ జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో అమలులో చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పథకాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి వారం తాను కూడా కలెక్టర్లతో సమీక్షిస్తానని చెప్పారు. డైనమిక్ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో అధికారులు, కలెక్టర్లు సమర్థవంతంగా పని చేయాలన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటల తరబడి సమీక్షలు పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టకూడదని సీఎం భావించినట్లు తెలిపారు. సృజనాత్మక ఆలోచనలు చేయటానికి అధికారులకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించారని చెప్పారు. అందుకే షెడ్యూల్ని అవసరమయిన సమయం మేరకు మాత్రమే నిర్థేశించారని తెలిపారు. అందుకే ఇంత గొప్ప తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్ప తీర్పును ఇచ్చారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చెందిన ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలు ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం, అధికారులు పని చేయాలని సూచించారు. ప్రజల గ్రీవెన్స్ పరిష్కారం వేగంగా జరగడం లేదన్నారు. కలెక్టర్లు అంతా దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సూచించారు. నవరత్నాలతో రాష్ట్రంలో గొప్ప మార్పురాబోతోందని అన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి లేని, పారదర్శకమయిన పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందించాలని చెప్పారు. భూముల రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ రైతులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీలన్ని భర్తీ చేసి సమర్థంగా పనిచేస్తామని చెప్పారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రైతుల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. -
నవరత్నాల అమలే ప్రధాన అజెండా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా నేడు (సోమవారం) కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలి కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా పవిత్రంగా భావిస్తామని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతామని వైఎస్ జగన్ గత నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు వృద్ధులు, వితంతువులు, తదితరులకు పింఛన్ను రూ.2,000 నుంచి రూ.2,250కి పెంచుతూ సంతకం చేశారు. ఇలా ఆరంభమైన హామీల అమలు ప్రక్రియ తొలి కేబినెట్ సమావేశంతో వేగం పుంజుకుంది. ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, పారిశుధ్య కార్మికులకు వేతనాన్ని రూ.18 వేలకు పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని జూలై నుంచి 27 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి సాగు ఖర్చులకు రూ.12,500 వచ్చే ఏడాది మే నుంచి ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా ఈ ఏడాది రబీ నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా ప్రతి అంశంపై స్పష్టతతో ముందుకెళుతున్న సీఎం వైఎస్ జగన్ తన ప్రభుత్వ ప్రాధామ్యాలు వివరించడంతోపాటు పాలన ఎలా ఉండాలో నేడు జరిగే కలెక్టర్ల సమావేశంలో వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. సుస్పష్టమైన అజెండా.. గతానికి పూర్తి భిన్నంగా కలెక్టర్ల సదస్సును సత్ఫలితాలనిచ్చే చర్చా కేంద్రంగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. కలెక్టర్ల సదస్సుకు ఖరారు చేసిన అజెండానే దీనికి నిదర్శనమని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. ‘గత ఐదేళ్లలో ఐదు మిషన్లు, ఎనిమిది గ్రిడ్లు, కన్వర్జెన్స్, సంతులిత వృద్ధి, సంతృప్త స్థాయి అంటూ కేవలం గణాంకాలు, టేబుళ్లు, గ్రాఫిక్స్తో ఎవరికీ ఏమీ అర్థం కాని విధంగా, నిర్దేశిత లక్ష్యం లేకుండా కలెక్టర్ల సదస్సులు జరుగుతూ వచ్చాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించడానికి అధికారులు, ఒకరిద్దరు మంత్రులు ప్రయత్నించినా మీరు అర్థం చేసుకోవడం లేదు. మనం లక్షలాది మందికి ఫోన్ చేస్తే వారు ఇలా చెప్పారంటూ బుకాయిస్తూ, నోరు మూయిస్తూ వచ్చారు. దీంతో సమస్యలను చెప్పడమే మానేసిన మంత్రులు, కొందరు అధికారులు సీఎం చంద్రబాబును పొగడటం, ఆయన తాను హైదరాబాద్ను అభివృద్ధి చేశానని, హైటెక్ సిటీని కట్టానంటూ స్వోత్కర్షగా సాగుతూ వచ్చాయి. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి కలెక్టర్ల సదస్సుకే స్పష్టమైన అజెండా ఖరారు చేసింది. ప్రజలకు ఇచ్చిన నవరత్నాల అమలు సీఎం తన తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. వీటి అమలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. సదస్సు అజెండాలో కూడా నవరత్నాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలను చేర్చారు. అత్యంత ముఖ్యమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో తేవాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది మహిళలకు ఇంటి స్థల పట్టాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం ఇందుకు ఏమి చేయాలో దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్ల స్థల పట్టాల జారీకి అర్హుల ఎంపిక, విధివిధానాలను ప్రధాన అజెండాగా చేర్చారు. భూ యజమానులకు నష్టం జరగకుండా కౌలు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా వారికి రుణ అర్హత కార్డుల జారీ, ఇతర చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఈ అంశాన్ని ప్రాధాన్య అంశంగా చేర్చాయి. 108, 104 అంబులెన్సుల సేవలను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీ అమలు దిశగా ఇప్పటికే వైద్య రంగంలో సంస్కరణల కోసం నిపుణుల కమిటీని వేసిన సీఎం.. కలెక్టర్లకు దిశానిర్దేశం కోసం అజెండాలో ప్రాధాన్యం కల్పించారు. తొలి కలెక్టర్ల సదస్సు అజెండా చాలా సుస్పష్టంగా, ప్రాధామ్యాల ప్రకారం ఉంది. ఇది కొత్త సీఎంకు ఉన్న విజన్కు నిదర్శనం’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. తొలి చర్చ గ్రామ సచివాలయాలపైనే.. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశంతోనే కలెక్టర్ల సదస్సులో తొలి చర్చకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. తెల్ల రేషన్కార్డు ఉండి, వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే వారిని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడంతోపాటు 104, 108 అంబులెన్సు సేవలను మెరుగుపర్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నందున కలెక్టర్ల సదస్సులో దీన్ని రెండో అంశంగా చేర్చారు. కరవు నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్థక శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి, తదితర అన్ని అంశాలను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సదస్సులో వివరించనున్నారు. వర్షాలు ఆరంభమైన నేపథ్యంలో పంటల సాగుకు ప్రభుత్వం అందించాల్సిన సహకారం, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా చర్యలను తెలియజేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వాగతోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. తర్వాత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు, అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభోపన్యాసం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం ఉంటాయి. అనంతరం సీఎం వైఎస్ జగన్ కీలకోపన్యాసం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యాలు, అధికారులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. తర్వాత పరిపాలనలో గ్రామ సచివాయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. వైద్య రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, నిత్యావసర సరుకుల డోర్ డెలివరీపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కరవు నేపథ్యంలో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై లైన్ డిపార్టుమెంట్ల అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. వీటిపై చర్చ ముగిసిన తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీల సంయుక్త సమావేశం ఉంటుంది. -
గ్రామ-వార్డు వలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్పోర్టల్
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం http://gramavolunteer. ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్పోర్టల్ను ఏర్పాటు చేసింది. గ్రామ వలంటీర్ల నియామకాల విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసి.. ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏస్థాయిలోనూ అవినీతికి తావులేకుండా చేసే ఉద్దేశంతో పాటు కులమత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసమే ప్రభుత్వం గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వలంటీర్ల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో నంబరు 104లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా గ్రామ వలంటీర్లను ఏ జిల్లాలో ఎంత మందిని నియమించాలన్నది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీలలో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. స్థానికతే ప్రధాన అర్హత... గ్రామ స్థానికతే వలంటీర్లుగా నియామకానికి ప్రాథమిక అర్హతగా ఉత్తర్వులో స్పష్టం చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు దరఖాస్తుకు కనీసం పదో తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు జూలై 11 నుంచి 25 తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వేతనాలకు ఏటా రూ.1,200 కోట్లు మంజూరు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లుగా నియమితులయ్యే వారికి నెలకు రూ. 5 వేల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఏటా రూ.1,200 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతున్నట్టు సీఎస్ ఉత్తర్వులో తెలిపారు. ఆగస్టు ఒకటి నాటికి రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును ఎంపికచేసి వారికి మండలాల వారీగా ఆగస్టు 5వ తేదీ నుంచి 10 వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం 15వ తేదీ నుంచి వారందరూ కేటాయించిన విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు రాష్ట్ర స్థాయిలో వలంటీర్ల నియామక ప్రక్రియ పర్యవేక్షణకుగాను అధికారులతో రెండు కమిటీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నియమించారు. జిల్లాలో వలంటీర్ల ప్రక్రియ పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుధాకరరావు, కమిషనర్ ఓఎస్డీ దుర్గాప్రసాద్, స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏవో సాంబశివరావులతో కమిటీని నియమించారు. వలంటీర్ల నియామకంలో అధికారులకు తలెత్తే సందేహాలను ఈ కమిటీ నివృత్తి చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడితే జిల్లా అధికారులు వాటిని తెలియజేసిన వెంటనే పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖలో ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీజీఎస్లో పనిచేసే ముగ్గురు నిపుణులతో కలిపి మరో కమిటీని నియమించారు. అర్బన్ వలంటీర్ల నియామకానికి శ్రీకారం నవరత్నాల పథకాలను పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరవేయడానికి వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వలంటీర్ను నియమించనున్నారు. నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలను, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కోరింది. వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.5 వేల చొప్పున చెల్లించేందుకు ఏడాదికి రూ.486 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలి. వీరి ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో http:// wardvolunteer.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ వలంటీర్లకు సంబంధించిన షరుతులే వీరికీ వర్తిస్తాయి. -
ఇది అందరి ప్రభుత్వం
నవరత్నాల అమలు మా ప్రభుత్వ అజెండా. మేనిఫెస్టో ప్రతిరోజూ కనిపించేలా ఉండాలని ఆదేశాలిచ్చా. మా మేనిఫెస్టోలో మూడింట రెండొంతుల వాగ్దానాల అమలుకు రంగం సిద్ధం చేశాం. ఇదే మాట నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించామని చెబుతున్నా. మాకు ఓటు వేయని ప్రజలు కూడా నిండు మనసుతో దీవించాలని వినమ్రంగా కోరుతున్నాను. – సీఎం వైఎస్ జగన్ నీతివంతమైన పాలన అందిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. అవినీతిని అంతం చేస్తేనే అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. అప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రోల్ మోడల్గా నిలుస్తాం. మనకు 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. రోడ్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా పనుల్లో పారదర్శకత తీసుకు వచ్చి అవినీతికి అడ్డుకట్ట వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచం అంతా ఇదే చెబుతోంది. అందుకే ప్రపంచంలో తక్కువ అవినీతి ఉన్న డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, సింగపూర్ తదితర దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. నాకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఏవోవో మాట్లాడిన వారి మాటలు చూశాం. వారి మంత్రివర్గంలో సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాలూ చూశాం. 2020లో, 2050లో ఇంకా 2070లో ఏం జరుగుతుందో నేను వారిలా చెప్పడం లేదు. సామాజిక వర్గాల వారీగా న్యాయం చేసి చూపించా. సాక్షి, అమరావతి: ‘వ్యక్తులు, వర్గాలు, పార్టీలు ఇవన్నీ ఎన్నికల వరకే. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరూ మనవాళ్లే. ప్రతి వర్గం వారికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలి. ఈ దిశగానే ఈ ప్రభుత్వం పని చేస్తుంద’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ వర్గానికో మాత్రమే పనిచేసే ప్రభుత్వం కాదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ప్రజలు, దేవుడు మెచ్చి కనీవినీ ఎరుగని రీతిలో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల తన పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని, వారి సమస్యలు తీర్చేందుకే నాడు హామీలిచ్చానని చెప్పారు. జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. పాదయాత్రలో చెప్పిందే చేస్తున్నాం ‘కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. నాడు పాదయాత్రలో కూడా పదే పదే ఇదే విషయం చెప్పాను. అవినీతిని నిర్మూలిస్తేనే ఆదాయం పెరుగుతుంది. అవినీతికి అడ్డుకట్ట వేయగలిగితే దేశంలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పని చేస్తున్నాం. ఈ మూడు వారాల పాలన కూడా ఇదే మాదిరిగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా ఇసుక, మట్టి, రేషన్కార్డు, ఇల్లు.. కుల, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము.. చివరకు మరుగుదొడ్డి కోసం కూడా లంచాలు తీసుకుని ఐదేళ్లూ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. ఇలాంటి వ్యవస్థను పై నుంచి కింది దాకా పూర్తిగా మార్చాలన్న నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాం. ఈ పని చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో.. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుస్తానని ప్రజలను అడిగాను. ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు. ప్రజలు మాకు 50 శాతం ఓట్లు వేసి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీలు సీట్లు ఇచ్చారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే నా లక్ష్యం. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. దేశమంతా మనవైపు చూసేలా పారదర్శకమైన పాలన అందిస్తాం. టెండర్ల పరిశీలనకు ఒక జడ్జిని ఇవ్వమని హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరాం. టెండర్లు నేరుగా జడ్జికే ఇస్తాం. వారం రోజుల పాటు పబ్లిక్కు అందుబాటులో పెట్టండి. మాకు వ్యతిరేకులైన వారు ఇచ్చే సలహాలు సైతం తీసుకోండని చెప్పాం. ఆ జడ్జి గారి వద్ద ఉన్న టెక్నికల్ టీం ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుంది. జడ్జి గారు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తాం. టెండర్లకు ముందే సలహాలు తీసుకుంటాం. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాలకు అడ్డుకట్ట వేస్తాం. పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు కళ్లారా చూశాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి పేద, ప్రతి రైతు, పేదింటి అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబాలు పడే కష్టాలను, కన్నీళ్లను చాలా దగ్గరగా చూశాను. వారి కష్టాలు నేను విన్నాను. వీరందరికీ కష్టాలు రానివ్వకుండా చూడాలన్నదే నా తపన. అందుకే ఇక్కడ నిలుచున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఏం కోరుకుంటున్నారో నేను విన్నాను. మంచి చేస్తాను. నవరత్నాలతో పేదవారికి మంచి చేయాలని ఆరాట పడుతున్నాను. అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా జీవించగలిగితే నాకు ముఖ్యమంత్రిగా సంతృప్తికరంగా ఉంటుంది. సామాజిక న్యాయంతో దేశంలోనే నంబర్1గా నిలిచేలా పాలన సాగించడానికి శ్రీకారం చుట్టాము. మంత్రి మండలి ఏర్పాటులోనే 13 సామాజిక వర్గాలకు చోటు కల్పించాం. నామినేటేడ్ పనుల్లోనూ సామాజిక న్యాయం వర్ధిల్లేట్లుగా చేస్తాం. నా సొంత సామాజిక వర్గానికి మంత్రి పదవులు తగ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలోను, రాష్ట్రాధికారంలోనూ వాటా ఇచ్చి ఒక విప్లవానికి శ్రీకారం చుట్టానని గర్వంగా చెబుతున్నాను. నామినేటేడ్ పదవుల్లోనే కాదు.. నవరత్నాల ద్వారా ప్రతి వర్గానికి సామాజిక, ఆర్థిక న్యాయం చేస్తాం. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాకూడదు ఓటు రాజకీయాలు చేయం. మేనిఫెస్టో అంటే వందల పేజీల పుస్తకాలు పెట్టకుండా, కేవలం రెండే రెండు పేజీలతో మా మేనిఫెస్టో రూపొందించాం. అది ఎప్పుడూ కనిపించే విధంగా రూపొందించాం. నా చాంబర్లో కూడా మేనిఫెస్టో కనిపించేలా ఏర్పాటు చేశాం. మంత్రులు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నారు. అధికారులందరి ఛాంబర్లలో ఈ మేనిఫెస్టో ఉండాలని చెప్పాం. మేనిఫెస్టో అన్నది చెత్త బుట్టలో పడేసే కార్యక్రమం మాదిరిగా కాకుండా ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తాం. రైతు భరోసా కింద రూ.12,500 ప్రతి రైతుకు లబ్ధి కలిగేలా రైతు భరోసా పథకం ఏర్పాటు చేస్తున్నాం. చెప్పినదానికంటే ముందుగానే ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తాం. బోర్లు వేసి చాలా మంది నీళ్లు పడక అప్పుల పాలయ్యారు. ఇకపై అలా కాకుండా నియోజకవర్గానికి ఒక బోర్వెల్ మెషీన్ లెక్కన మొత్తం 200 బోర్వెల్ మెషీన్లు కొనాలని ఆదేశించాం. ఏ రైతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని ఈ బడ్జెట్ నుంచే దానిని అమలు చేస్తాం. గత ప్రభుత్వం హయాంలో రైతులకు సున్నా వడ్డీ పథకం అభాసుపాలైంది. ఇకపై అలా కాకుండా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రైతులకు, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. 2016 మే నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ బంద్ అయింది. చంద్రబాబు పాలన నుంచి మళ్లీ రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తాం. రైతులకు సంబంధించిన బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది. కరువు, వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. ఇన్ఫుట్ సబ్సిడీలను చంద్రబాబు చెల్లించలేకపోయారు. బాబు చెల్లించని ఇన్ఫుట్ సబ్సిడీ రూ.2 వేల కోట్ల సొమ్మును విడుదల చేస్తూ సంతకాలు పెట్టాను. రైతులకు ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి రాకుండా రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి కూడా రూ.2 వేల కోట్లు వస్తుంది. ఇదే బడ్జెట్లో దీనిని పెడతాం. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అన్నిరకాలుగా రైతుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇవ్వలేక పోయారు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. గత ప్రభుత్వం స్కూళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. జూన్ మొదటి వారంలోనో, రెండవ వారంలోనో పాఠశాలలు తెరిస్తే సెప్టెంబర్ దాటినా కూడా పుస్తకాలు అందించలేదు. మధ్యాహ్న భోజనం పథకంలో సరుకులు కొనుగోలు చేస్తే బిల్లులు కూడా ఇవ్వలేదు. 6 నెలల నుంచి 8 నెలల పాటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. విద్యార్థులకు యూనిఫాం గత సంవత్సరం నుంచి ఇవ్వని పరిస్థితి. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించని దుస్థితి. ఈ పాఠశాలల రూపు రేఖలు మార్చబోతున్నాం. రెండేళ్లలోపే స్కూళ్లను మార్చిచూపుతాం. అవసరమైన వన్నీ కూడా సమకూరుస్తాం. అవ్వా తాతలకు భరోసా నాలుగు నెలల క్రితం వరకు అవ్వా తాతలకు పింఛన్ ఎంత ఇస్తున్నారు అని అడిగితే వెయ్యి రూపాయలు అని చెప్పేవారు. మరికొందరు ఏమీ రావడం లేదని చెప్పేవారు. నేను పాదయాత్రలో పింఛన్ రూ.2 వేలు ఇస్తామంటే ఈయన ఆ మాత్రం పెంచారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,250కి పెంచుతూ సంతకం చేశాను. ప్రతి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పింఛన్ను తీసుకెళ్తాం. తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ ఎన్నికలు వచ్చే వరకు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ నాడూ రాలేదు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్న హామీని నెరవేర్చుతూ మేము వారి వేతనాలు పెంచాం. డ్వాక్రా యానిమేటర్ల వేతనం రూ.10 వేలకు పెంచాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం పెంచాం. పారిశుధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వాళ్లు చేసే పని ఎవ్వరూ చేయలేరు. నిజంగా వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాంటి వారిని గత సర్కారు ఉద్యోగం నుంచి తొలగించే దుర్మార్గానికి ఒడిగట్టింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. పారిశుధ్య కార్మికులకు మేలు చేసే దిశగా వారి వేతనాలు రూ.18 వేలకు పెంచాం. ఆర్టీసీని విలీనం చేస్తామని కార్మికులకు మాట ఇచ్చాం. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ఇందుకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి అర్హతలు, సర్వీసు ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తాం. ఔట్ సోర్సింగ్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. ఎలక్ట్రిసిటీ మీటర్ల బిల్లింగ్ కోసం ఔట్సోర్సింగ్ వారిని నియమించి ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏజెన్సీలకు దోచిపెట్టింది. ఇకపై అలా ఉండదు. ప్రభుత్వం ఇచ్చేది నేరుగా ఆ ఉద్యోగులకు చేరేలా ఆదేశాలు జారీ చేశాం. బిల్లింగ్ కోసం ఒక్కో విద్యుత్ మీటర్కు రూ.4 ఇస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చింది కేవలం ఒక్క రూపాయి.. నుంచి రూపాయిన్నర మాత్రమే. వైద్యం అందక ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదు రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారందరికీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఎవరైనా డబ్బుల్లేక వైద్యం అందలేదు అనే కారణంతో మృతి చెందకూడదు. ఈ లక్ష్యంతో పని చేస్తాం. దీనికోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించని పరిస్థితి. 108, 104 వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రోగులు, బాధితులు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వాహనం రాలేని పరిస్థితి. అందుకే 350 కొత్త 108 అంబులెన్స్లు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. మండలానికి ఒక వాహనం లెక్కన 650 కొత్త 104 అంబులెన్స్లు కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య నిపుణులతో మెడికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక ఇచ్చేందుకు రెండు నెలలు గడువు ఇచ్చాం. ఏంచేస్తే మంచిదో చెప్పమన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా మార్చితే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పాలని సూచించాం. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తామని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసి రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పండుగలా ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అగ్రిగోల్డు బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్షరాల 9 లక్షల మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను నిలువునా ముంచింది. గ్రామ సచివాలయాలతో సత్వర లబ్ధి అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఆ రోజు నుంచే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, గ్రామ వలంటీర్లను తీసుకొచ్చి వ్యవస్థలో మార్పు తెస్తాం. లబ్ధిదారుడికి మంచి జరిగేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్లో ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గర్వంగా చెబుతున్నాను. అగస్టు 15 నుంచి ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ను నియమిస్తాం. రూ.5 వేల గౌరవ వేతనంతో 4 లక్షల మందిని నియమిస్తున్నాం. అవినీతి, పక్షపాతం ఎక్కడా లేకుండా ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేస్తాం. వలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకే రూ.5 వేలు వేతనం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల 1 నుంచి ఇది అమలవుతుంది. సీపీఎస్ రద్దు చేస్తామని మాట చెప్పాం. దానిని రద్దు చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేశామని గర్వంగా చెబుతున్నాం. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కులములని మహాకవి చెప్పారు. అవినీతికి, అన్యాయానికి పాల్పడితే ఎంతటి వారైనా సహించేది ఉండదు. రాష్ట్ర విభజన ఎవరు చేశారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలుసు. గత ఐదేళ్లుగా గాయాలు మానలేదు. గత పాలకులు రక్తం పిండారు. ఆర్థిక వ్యవస్థను సర్వనాశం చేశారు. అస్తులు పోయి అప్పులు మిగిలాయి. రంగాల వారీగా.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవ, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెకులు.. ఇలా ఆయా రంగాల పరిస్థితిని సభలోనే ప్రజల ముందుంచుతా. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షసాధింపులు ఉండవు. కానీ అవినీతికి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష తప్పదు. పేదలు పేదలుగా ఉండటానికి, చదువుకునే శక్తిలేని పిల్లలు ఉండటానికి వీలు లేదు. సమానత్వం అందకుండా ఉండటానికి వీలు లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాను కూడా సహకరించాలని కోరుతున్నాను. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తున్నాను. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ గత ప్రభుత్వం ప్రైవేటు స్కూలు యాజమాన్యాలకు అమ్ముడు పోయింది. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉన్నా ఏ ఒక్క స్కూల్లోనూ ఇది అమలు కాలేదు. ఆ దిశగా ప్రయత్నమూ జరగలేదు. ఈ దృష్ట్యా విద్యా హక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. స్కూళ్లు, కాలేజీల్లో పేదలకు భారం లేకుండా ఫీజులు తగ్గిస్తాం. దీనికోసం ‘ఫీ రెగ్యులేటరీ, క్వాలిటీ మానిటరింగ్ కమిషన్లను ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్టాలు తెస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రాని వారున్నారు. జాతీయ సగటు 26 శాతం మాత్రమే. దేశంలో మనమే వెనుకబడ్డాం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరక్షరాస్యతను రూపుమాపుతాం. జనవరి 26న (గణతంత్ర దినోత్సవం రోజున) రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం మధ్య ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చెల్లిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతిని పెకలిస్తాం నీటి పారుదల రంగంలో ఏ ప్రాజెక్టును తీసుకున్నా అవినీతే. ఆ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి పనిమీదా అధ్యయనం జరుగుతుంది. అంచనాలు ఎలా పెంచారో ఇంజినీర్లు తేలుస్తారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆ వర్క్ను మారుస్తాం. ఫ్రీ క్వాలిఫికేషన్ ద్వారా ఎక్కువ మంది టెండరింగ్లో పాల్గొనే విధంగా పారదర్శకంగా మార్పులు చేస్తాం. తద్వారా 15 నుంచి 20 శాతం రేట్లు తగ్గుతాయి. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, మంత్రులు ఎవరైనా సరే.. అందరూ ప్రజా సేవకులే. ప్రతి ఒక్కరూ నీతిమంతంగా ఉండాలి. అవినీతిని మాత్రం సహించేది లేదు. పేదలకు మంచి బియ్యం ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో ఆ బియ్యాన్నే పేదలకు ఇవ్వాలని ఆదేశించాం. చౌక దుకాణాల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యతను మారుస్తాం. మనందరం తినే బియ్యాన్నే పేదలకు ఇస్తాం. ఆ బియ్యాన్ని 5, 10, 15 కేజీల చొప్పున ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తాం. వేలిముద్రలు పడటం లేదని ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి రాకుండా చేస్తాం. వేలి ముద్రలు పడకపోతే వీడియో స్క్రీనింగ్ తీసుకోండని చెప్పాం. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేపట్టాం. ఎక్కడా కూడా అవినీతి, అన్యాయం జరుగకుండా ఉండేందుకు ఆదేశాలు ఇస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగిందని ఫోన్ చేస్తే ఆ గ్రామ వలంటీర్ను తొలగిస్తామని గర్వంగా చెబుతున్నాం. ఇందుకోసం నేరుగా సీఎం కార్యాలయంలో టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేస్తాం. ఎన్నికల తర్వాత అందరూ మనవాళ్లే. రాష్ట్రంలోని దాదాపు 40 వేల పాఠశాలల ప్రస్తుత పరిస్థితిని ఫొటోలు తీయండని చెప్పాం. వాటి పరిస్థితి సరిదిద్ది మళ్లీ రెండేళ్ల తర్వాత కొత్త ఫొటోలు చూపిస్తాం. బాత్రూం మొదలు నీళ్లు, ఫర్నీచర్.. ఇంకా ఏమేం కావాల్లో అన్నీ ఇస్తాం. అన్ని స్కూళ్లనూ ఇంగ్లిష్ మీడియంగా మారుస్తాం. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా అమలు చేస్తాం. ప్రభుత్వ స్కూళ్లు.. నారాయణ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా చేస్తాం. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు బడ్జెట్ పెంచుతాం. -
నవరత్నాలు అమలు దిశగా ప్రభుత్వ నిర్ణయాలు
విజయనగరం గంటస్తంభం : నవరత్నాల హామీలను వందశాతం అమలుచేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, గవర్నర్ తన ప్రసం గంలో ఈ విషయం స్పష్టం చేశారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక శనివారం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన ఆమె ఇక్కడి జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్, పార్వతీపురం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
సాక్షి, అమరావతి, విజయవాడ / గన్నవరం: కొత్తగా కొలువు తీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. నెల తిరక్కముందే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 60 శాతంపై విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్న విషయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలుతోనే ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగుల గురించి, అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైనదనే విషయాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ విధానాలను, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా వివరించనున్నారు. ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక సభ వాయిదా పడుతుంది. శనివారం, ఆదివారం సభకు సెలవు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమ, మంగళవారాల్లో చర్చ అనంతరం సీఎం వైఎస్ జగన్ సమాధానం ఉంటుంది. విజయవాడకు చేరుకున్న గవర్నర్ ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.25 గంటలకు గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ కార్యదర్శి ఆర్పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ.ఇంతియాజ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో వి.కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కాగా, విజయవాడలో గవర్నర్ను సీఎం జగన్మోహన్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. -
మేనిఫెస్టో అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేసే విధంగా బడ్జెట్ను రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరూ అభివృద్ధి చెందేలా బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్లో తన చాంబర్లో బుగ్గన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రతీ రూపాయి వృథా కాకుండా చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్డడం అతి ముఖ్యమైన పని అని తెలిపారు. ఆర్థిక అంశాలపై పట్టురావడానికి కారణమైన స్వర్గీయ సోమయాజులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్థిక మంత్రి పదవి అప్పచెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఈ స్థాయికి రావడానికి కారణమైన డోన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, కార్యదర్శి ఎం.రవిచంద్ర తదితరులు మంత్రి బుగ్గనకు శుభాకాంక్షలు తెలిపారు. మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి నవరత్నాల్లో మహిళలకు కానుకగా ప్రకటించిన దశలవారీ మద్యపాన నిషేధం అమలుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాల్గవ బ్లాకులోని తన చాంబర్లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. తక్షణం బెల్ట్షాపులను తొలగించాల్సిందిగా బ్రాందీ షాపుల యజమానులను ఆదేశించారు. అందరూ నిజాయతీగా ఉండాలని, ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన శాఖలోని ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. బీసీల అభ్యున్నతే మా లక్ష్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతే తమ లక్ష్యమని, ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్లోని తన చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నవరత్నాలతో పాటు ఏలూరు బీసీ గర్జనలో ప్రకటించిన డిక్లరేషన్ను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. బీసీ సంక్షేమానికి సేవ చేసుకునే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలోని 2.10 లక్షల మంది రజకులు, 80 వేల మంది నాయీబ్రాహ్మణులకు ఏటా రూ. 10,000 ఇచ్చే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. త్వరలో భూముల రీ సర్వే డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో భూములను రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. 1908 తర్వాత భూముల సర్వే జరగలేదని, ఇప్పుడు రీ సర్వే చేయడం ద్వారా కోర్టులు, వివాదాల్లో ఉన్న అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 25 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి అనుగుణంగా భూ సేకరణ చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి భూములను చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా పీవోపీ కింద పెట్టారని, ఈ సమస్య పరిష్కరించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భూ సేకరణ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం కాకుండా పరిహారం చెల్లించే రోజు ఉన్న మార్కెట్ ధరను వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తూ తొలి ఫైలుపై మంత్రి సంతకం చేశారు. ఒప్పందం సమయానికి చెల్లింపు సమయానికి ఉన్న ధరల వ్యత్యాసం వల్ల భూయజమానులు నష్టపోతున్నారని, దీనికి అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిళ్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్లోని తన చాంబర్లో విశ్వరూప్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, మరో రెండు సర్కిళ్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. మిగిలిన 8 జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 850 కోట్లు మురిగిపోయాయని, సాంఘిక సంక్షేమానికి రూ. 4,500 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు వెనక్కి తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేస్తుందని చెప్పారు. సీఎం ఆశయాల మేరకు గురుకులాలు, హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి సొంతిల్లుండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పేర్కొన్నారు. ఇందు కోసం సుమారు 28 లక్షల గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయం నాల్గవ బ్లాక్లో మంత్రి తన చాంబర్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో వంద శాతం ఇందిరమ్మ గృహాలు నిర్మించామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మంత్రిగా రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆ శాఖ అధికారులు రంగనాథరాజుకు అభినందనలు తెలిపారు. పర్యాటక ఆదాయంపై దృష్టి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ను నియమిస్తామన్నారు. పర్యాటక రంగంపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించిన అనంతరం బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధ్యాత్మికం, ప్రకృతి, బీచ్, మౌంటైన్ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హిందీ, ఇంగ్లీçషు భాషలపై పట్టు ఉన్న గైడ్లను నియమించుకోనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్ హాల్తో కూడిన శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ట్రాన్స్పోర్ట్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ట్రాన్సుపోర్టు, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల భోజన విరామ సమయంలో ఆయన నేరుగా మీడియా పాయింట్కు వచ్చి జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్నారు. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) వ్యవస్థాపక నాయకుడిగా పనిచేశారని, అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులతో తనకు సాన్నిహిత్యం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. జర్నలిస్టులతో తనకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, వారి కష్టాలు తనకు తెలుసన్నారు. జర్నలిస్టులకు స్థలాలు, ఇళ్లు, చాలీచాలని జీతాలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని నాని హామీ ఇచ్చారు. తుడా చైర్మన్గా చెవిరెడ్డి నియామకం తిరుపతి పట్టణ అభివృద్ధి అథారిటీ (తుడా) చైర్మన్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 2004వ సంవత్సరంలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తుడా చైర్మన్గా చెవిరెడ్డిని నియమించారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆయనను అదే పదవిలో నియమించడం విశేషం. ప్రస్తుతం తుడా చైర్మన్గా ఉన్న జి.నరసింహ యాదవ్ రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. -
అందరికీ తీపి కబురు
ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఆచరణలో చూపించారు. నవరత్నాల పథకాల అమలుకే అగ్రప్రాధాన్యమని మంత్రులకు తేల్చిచెప్పారు. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిజానికి ఎన్నికల హామీల అమలుకు ఐదేళ్ల సమయం ఉన్నా.. ఆయన ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించకుండా కార్యాచరణ ప్రారంభించారు. మంత్రివర్గ తొలి సమావేశంలోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక భారం అవుతుందేమోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలకు మేలు చేయడం కంటే ఏదీ ముఖ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యాలుగా తమ ప్రభుత్వ అజెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిరోజుల్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు తీపి కబురును అందించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వందలాది హామీలను చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేసింది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాగ్దానాల అమలుకు తొలి సంతకంతో శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతలా పవిత్రంగా భావించి అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్.. తొలి కేబినెట్లోనే మేనిఫెస్టో హామీల్లో అత్యధికం అమలు ప్రారంభించారు. కేబినెట్ నిర్ణయాల పట్ల అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి రూ.12,500 రైతు కుటుంబానికి ఏటా పెట్టుబడి సాయం మేనిఫెస్టోలో ఏముంది ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఐదేళ్లలో రూ. 50 వేలు ఇస్తాం. మే నెలలోనే రూ.12500 ఇస్తాం. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు. రైతులకు ఉచితంగా బోర్లు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. కేబినెట్ నిర్ణయం వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పగా ఈ రబీ సీజన్ నుంచే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ డబ్బును తమ అప్పునకు బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు. గతంలో ఏముందంటే ? గతంలో రైతులకు ఇలాంటి పథకమే లేదు. ఎంత ప్రయోజనం: రైతు కుటుంబానికి ఏటా రూ. 12,500 అందుతుంది. ప్రస్తుతం వడ్డీలేని రుణాలు అమలు కావడంలేదు. అయితే రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పటి వరకూ రైతులకు ఉచితంగా బోర్లు వేసే విధానం లేదు. రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు ప్రతి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచడం కోసం 200 రిగ్గులను కొనాలని కేబినెట్ నిర్ణయించింది. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత బోరు వేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధి. రూ.2000 కోట్లు ఇప్పటి వరకూ ప్రీమియం చెల్లించి బీమా చేయించుకున్న రైతులకే పంటల బీమా వర్తిస్తోంది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతు పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించనుంది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇప్పించే బాధ్యతను కూడా సర్కారు తీసుకోనుంది. ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లు కనీస మద్దతు ధరకు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో సర్కారే కొనుగోలు చేయనుంది. వ్యవసాయ ప్రగతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ఇందుకు చర్యలు తీసుకోవడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు. నాణ్యమైన బియ్యం పంపిణీ - మేనిఫెస్టో : మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల సభల్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. - కేబినెట్ నిర్ణయం: సెప్టెంబర్ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ. - ప్రస్తుతం : డీలర్ల వద్దకు వెళ్లి కార్డుదారులు బియ్యం తెచ్చుకోవాలి. వేలిముద్రలు పడటంలేదంటూ కొందరికి ఇవ్వడంలేదు. ఇచ్చే బియ్యం కూడా నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికిరావడంలేదు. దీంతో చాలామంది తక్కువ రేటుకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ఎఫ్సీఐకి అమ్మే ప్రక్రియ సాగుతోంది. - ప్రయోజనం : నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే అందరూ వండుకుని తింటారు. బ్లాక్ మార్కెటింగ్ ఉండదు. ఐదారు నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరలకు ఇవ్వడంవల్ల 1.47 కోట్ల మంది తెల్లకార్డుదారులు ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారులు 1.47 కోట్ల మంది పింఛను పెంపు - మేనిఫెస్టో : ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం. అవ్వాతాతల పింఛను రూ. 3వేల వరకూ పెంచుతూ పోతాం. - కేబినెట్ నిర్ణయం : ప్రస్తుతం పింఛను రూ. 2,000 నుంచి రూ. 2,250కి పెంపు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకూ పెంపు. పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. - ప్రస్తుతం : రూ. వెయ్యి మాత్రమే ఉన్న పింఛనును ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన తర్వాత బాబు సర్కారు రూ. 2,000కు పెంచింది. అయితే పింఛను వయసును బాబు సర్కారు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. దీనివల్ల లక్షలాది మంది పింఛనుకు అనర్హులుగా మారారు. - ప్రయోజనం : పింఛను వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంవల్ల అదనంగా 5 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. పింఛను పెంపు లబ్ధి పొందేవారి సంఖ్య మొత్తం 59 లక్షలకు చేరనుంది. పింఛను పెంపు వల్ల లబ్ధిపొందేవారి సంఖ్య 59 లక్షలు అమ్మ ఒడి - మేనిఫెస్టో: పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం. - కేబినెట్ నిర్ణయం: పిల్లలందరినీ చదివించి విజ్ఞానవంతులను చేయాలన్న లక్ష్యంతో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 చెక్కు గ్రామ, వార్డు వాలంటీరు ద్వారా ఇంటి వద్దే అందించే ఏర్పాటు. దీనిని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయాలి. - ప్రస్తుతం: చాలామంది పిల్లలను బడికి పంపించే స్థోమత లేక కూలి పనులకు పంపిస్తున్నారు. - ప్రయోజనం: తెల్లరేషన్ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా అందే మొత్తం రూ.15,000 అంగన్వాడీలకు.. - మేనిఫెస్టో: అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు తెలంగాణలో ఉన్న గౌరవ వేతనం కంటే రూ. వెయ్యి అధికంగా చెల్లింపు - కేబినెట్ నిర్ణయం: అంగన్ వాడీ టీచర్లు, కార్మికులకు రూ. వెయ్యి గౌరవ వేతనం పెంపు - గతంలో ఏముంది: అంగన్వాడీ టీచర్లకు రూ. 10500, కార్యకర్తలకు రూ. 6000 గౌరవ వేతనం ఉంది. - ప్రయోజనం: అంగన్వాడీ టీచర్లకు రూ. 11,500, కార్యకర్తలకు రూ. 7,000 గౌరవ వేతనం అమలు. డ్వాక్రా యానిమేటర్లకు.. - మేనిఫెస్టో: డ్వాక్రా యానిమేటర్లకు రూ.10 వేల గౌరవ వేతనం. - కేబినెట్ నిర్ణయం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు రూ. 3,500 నుంచి రూ. 10 వేలకు గౌరవ వేతనం పెంపు. - ప్రస్తుతం: గతంలో వీరికి నయాపైసా కూడా గౌరవ వేతనం లేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం వీరికి రూ. 3,500 గౌరవ వేతనం ఇస్తామంటూ జీవో ఇచ్చారు. - ఎంత ప్రయోజనం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు గౌరవ వేతనం భారీగా పెరగనుంది. 104, 108 మెరుగుకు - హామీ 104, 108 అంబులెన్సు సేవల మెరుగునకు చర్యలు - కేబినెట్ నిర్ణయం: ప్రతి మండలంలో 104, 108 వాహనాలు ఒక్కోటి చొప్పున ఏర్పాటు. ఎక్కడ నుంచి ఫోను వచ్చినా 20 నిమిషాల్లో ఈ అంబులెన్సులు అక్కడకు చేరే విధంగా చర్యలు. 104 అంబులెన్సుల్లో సిబ్బంది ఏర్పాటు.. మందుల కల్పన. - ప్రస్తుతం: అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి చేరుకోవడానికి ఫోన్ చేసినా గంటల తరబడి అంబులెన్సులు రాని పరిస్థితి. - ప్రయోజనం: అత్యవసర వైద్యం కావాల్సివచ్చినప్పుడు ఆస్పత్రికి చేరుకోవడం కోసం రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఫోన్ చేసినా 20 నిమిషాల్లో అంబులెన్సు చేరుకుని క్షతగాత్రులు/ గర్భిణులు, వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి చేర్చే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల తక్షణ వైద్యం లభించి ప్రాణాలను కాపాడేందుకు వీలు. అర్హులందరికీ ఇళ్లు - మేనిఫెస్టో : ఇంటి స్థలం లేని అర్హులందరికీ ఇంటి స్థలాలు. మహిళల పేరునే రిజిస్ట్రేషన్. ఇళ్లు కూడా కట్టిస్తాం. - కేబినెట్ నిర్ణయం : ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అయినా ఇంటి స్థలం లేని కుటుంబానికి మహిళ పేరుతో ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి స్థల పట్టా ఇస్తే బ్యాంకు రుణం రాదు. అందువల్ల వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇళ్లు కూడా ప్రభుత్వమే కట్టించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో పేదలకు ఇళ్లు నిర్మించాలి. అగ్రిగోల్డ్ మేనిఫెస్టోలో ఏముంది.. రూ.1,150 కోట్లు కేటాయించి ప్రభుత్వ గణాంకాల ప్రకారం బాధితులకు (డిపాజిటర్లకు) చెల్లింపులు జరిపిస్తాం. - కేబినెట్ నిర్ణయం: రూ. 20 వేల లోపు డిపాజిట్దారులకు ఈ మొత్తం చెల్లించే ఏర్పాటు. అగ్రిగోల్డ్కు చెందిన విలువైన భూములను ప్లాట్లుగా మార్చి వేలం ద్వారా విక్రయించి బాధితులకు చెల్లించేందుకు కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ప్రతీ డిపాజిట్దారుకు న్యాయం చేసే దిశగా చర్యలు. ప్రభుత్వం కేటాయించిన మొత్తం 1,150 కోట్లు - గతంలో ఏమి జరిగింది: బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడం ద్వారా ప్రయోజనం పొందాలని గత పాలకులు ప్రయత్నించారు. చివర్లో ఎన్నికల ముందు ఓట్ల కోసం రూ. 250 కోట్లు మంజూరు చేసినట్లు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు తప్ప నిధులు ఇవ్వలేదు. - ఎంత ప్రయోజనం : ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్లతో తక్షణం తొమ్మిది లక్షల మంది పేద డిపాజిట్దారులకు లబ్ధి చేకూరనుంది. కోర్టు అనుమతితో బహిరంగ వేలం ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. లబ్ది పొందే డిపాజిటర్లు 9 లక్షల మంది ఆశా కార్యకర్తలు - మేనిఫెస్టో: ఆశా వర్కర్లకు రూ. 10 వేల గౌరవ వేతనం. - కేబినెట్ నిర్ణయం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంపు. - ప్రస్తుతం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 3,000 - ప్రయోజనం: 42 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. గ్రామ సచివాలయాలు - మేనిఫెస్టో: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు. - కేబినెట్ నిర్ణయం: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం. పారదర్శకంగా నోటిఫికేషన్ల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపిక. ఆగస్టు 15వ తేదీకల్లా నియామకాల ప్రక్రియ పూర్తి. - ప్రస్తుతం: ప్రస్తుతం సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వాల్సిన దుస్థితి. టీడీపీ వారికే పథకాలు ఇచ్చే దుస్థితి. - ప్రయోజనం: ఏదైనా పథకం కింద, లేదా పత్రాల కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే పరిష్కారం. సర్కారులో ఆర్టీసీ విలీనం - మేనిఫెస్టో: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ. - కేబినెట్ నిర్ణయం: మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ సూత్రప్రాయ నిర్ణయం. ఇందు కోసం ఆర్థిక, రవాణా శాఖల మంత్రులతో కమిటీ. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి ఆర్టీసీ మెరుగుకు చర్యలు. డీజిల్ ధరల పెరుగుదలవల్ల కలిగే నష్టాల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు. - ప్రస్తుతం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయోజనం: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రయోజనం కలుగనుంది. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. సర్కారు స్కూళ్ల రూపురేఖల మార్పు - మేనిఫెస్టో : ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాలు ప్రజలముందుంచి రెండేళ్ల తర్వాత అభివృద్ధి చేసి మళ్లీ వాటి పరిస్థితిని ప్రజల ముందు పెడతాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించడంతో పాటు ప్రమాణాలు పెంపు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు. - కేబినెట్ నిర్ణయం: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నింటి ఫొటోలు తీసి స్కూళ్ల రూపురేఖలను మార్చాలి. పాఠశాలలను అభివృద్ధి చేసిన తర్వాత ఫొటోలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం చేసింది చూపించాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అయితే ఏళ్ల తరబడి దీని అమలుకు గత పాలకులు చర్యలు తీసుకోలేదు. ఇక నుంచి దీనిని అమలు చేయాలి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి. రాష్ట్ర విద్యా పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణతో పాటు ప్రమాణాల మెరుగుకు చర్యలు. 25% ప్రతి ప్రయివేటు విద్యా సంస్థ పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు - ప్రస్తుతం: ప్రభుత్వ స్కూళ్లు దయనీయంగా ఉన్నాయి. - ప్రయోజనం: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగవడం. విద్యా ప్రమాణాలు పెంచడంవల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు విద్యాసంస్థలకు వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన భారం పేదలకు తప్పనుంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అదుపులోకి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు - మేనిఫెస్టో : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతి అమలు. కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసు ఆధారంగా క్రమబద్ధీకరణ. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు. - కేబినెట్ నిర్ణయాలు: జూలై 1 నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. సీపీఎస్ రద్దు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం. దీనిని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధి విధానాల తయారీ. అవరోధాల తొలగింపు కోసం ఆర్థికమంత్రి అధ్యక్షతన కార్యదర్శులతో కమిటీ. అర్హత, అనుభవం ప్రాతిపదికన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. దీని అమలుకు ఆర్థిక, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్య, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీ. - ప్రస్తుతం: సీపీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ అమలు చేయాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేసింది. ప్రయోజనం ఐఆర్ పెంపు 27% లబ్ధిపొందే ఉద్యోగులు 4.20 లక్షలు నెలవారీ లబ్ధి 815 కోట్లు -
సంక్షేమ జెండా.. ప్రగతి అజెండా..
సాక్షి, అమరావతి : నవరత్నాల పథకాలు చుక్కానిగా.. ఎన్నికల మేనిఫెస్టో మార్గనిర్దేశంగా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వ విధానాన్ని ఆవిష్కరించారు. మానవీయత ఇరుసుగా సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించడమే లక్ష్యమని స్పష్టంచేశారు. అందుకోసం రానున్న ఐదేళ్లలో తమ పరిపాలనకు దిక్సూచిగా నిలిచే స్పష్టమైన అజెండాను సోమవారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్దేశించారు. ‘ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత మాదిరిగా పవిత్ర గ్రంథంగా భావిస్తాను. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ అమలుచేస్తాను’.. అని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఆయన తన సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకంతోనే తాను సంక్షేమ ముఖ్యమంత్రినని నిరూపించుకున్న ఆయన.. తన తొలి కేబినెట్ సమావేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. ప్రజా సంక్షేమంపట్ల చిత్తశుద్ధిని, రాష్ట్ర ప్రగతిపట్ల దార్శనికతకు అద్దంపడుతూ వైఎస్ జగన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులు, అధికార యంత్రాంగానికి వివరించారు. నిబద్ధతతో నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో అమలుచేయాలని నిర్దేశించారు. సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అంశాలపై పూర్తి సాధికారతతో చర్చించారు. మంత్రులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పించి ప్రజాస్వామ్య స్ఫూర్తితో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాజన్న సంక్షేమ రాజ్యస్థాపనకు మానవీయత, దార్శనికతతో కూడిన రోడ్మ్యాప్ను రూపొందించారు. నిబద్ధతతో ‘నవరత్నాలు’ అమలు నవరత్నాల పథకాలు చుక్కానిగా తమ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విధానాన్ని ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన ‘నవరత్నాల’ పథకాలను పూర్తి నిబద్ధతతో అమలుచేయాలని ఆయన మంత్రులకు నిర్దేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలుపడ్డ కష్టాలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మానవీయ కోణంలో విశ్లేషించి హేతుబద్ధంగా రూపొందించిన పార్టీ విధాన నిర్ణయమే నవరత్నాల పథకాలు అని ఆయన వివరించారు. ఆ పథకాలపట్ల విశ్వాసంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడతారన్న నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారని గుర్తుచేశారు. ప్రతీ హామీ అమలుచేయాల్సిందే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీ కచ్చితంగా అమలుచేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రజలు మనల్ని నమ్మి అధికారాన్ని ఇచ్చారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.. అని మంత్రులకు చెప్పారు. ‘నా టేబుల్పై మేనిఫెస్టో కాపీ ఉంది. మీ టేబుల్ పైన కూడా ఉండాలి’ అని మంత్రులకు సూచించారు. దీనిపై మంత్రులు పూర్తి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. పూర్తి సాధికారతతో చర్చించిన సీఎం పరిపాలన పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంతటి నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్నారన్నది తొలి మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు అర్ధమైంది. మంత్రివర్గ అజెండాలోని అంశాలతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ పూర్తి సాధికారతతో మాట్లాడటం వారిని ఆకట్టుకుంది. అన్ని అంశాలపై ఆయన ఎంతో కసరత్తు చేసి వివిధ కోణాల్లో విశ్లేషించి మరీ సమావేశానికి వచ్చారు. పింఛన్లు, వివిధ వర్గాలకు జీతాల పెంపుదలతో అదనపు ఆర్థిక భారం, కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం లోటుపాట్లు, రద్దుకు రూపొందించాల్సిన విధాన నిర్ణయం, రైతు భరోసా, అమ్మ ఒడి, రైతులకు వడ్డీలు లేని రుణాలు.. ఇలా ఏ అంశమైనా సరే ఎంతో అవగాహనతో సూటిగా.. స్పష్టంగా మాట్లాడారు. సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తపడ్డారు. మంత్రివర్గ సమావేశాలకుగానీ పరిపాలనా వ్యవహారాల్లోగానీ మంత్రులు ఎంతగా కసరత్తు చేయాలి.. తమ శాఖలపై ఎంతగా పట్టు సాధించాలి.. విధాన నిర్ణయాల అమలులో ఎంతగా భాగస్వాములు కావాలో వైఎస్ జగన్ విపులీకరించారు. విధానాల్లో మానవీయ కోణం సీఎం జగన్ నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆసాంతం మానవీయ కోణం వెల్లివిరిసింది. అజెండాలోనూ.. ప్రాధాన్యతల్లోనూ.. ఆయన మాటల్లోనూ.. వివిధ అంశాలపై చర్చలోనూ.. మంత్రివర్గ నిర్ణయాల్లోనూ అది ప్రధానాంశంగా నిలిచింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు జీతాల పెంపు వంటి దాదాపు 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదాహరణకు.. - ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఆయాలు.. ఇలా పలు వర్గాల జీతాలు పెంచారు. - అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణ సాయం కోసం రూ.1,150 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. - రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల అమలుకు నిర్ణయించారు. - జీతాల పెంపు వంటి అంశాలపై చర్చలో కొందరు మంత్రులు లేవనెత్తిన అంశాలపై.. జగన్ మాటలు ఆయనలోని మానవీయతకు అద్దంపట్టాయి. - పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను నెలకు రూ.18 వేలకు పెంచాలన్న ప్రతిపాదనపై కొందరు అంత జీతాలు పెంచడం ఆర్థిక భారం అవుతుందేమోనని సందేహం వ్యక్తంచేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. ‘అన్నా, పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోదు. అలాంటి వారికి న్యాయం చేయకుంటే దేవుడు మనల్ని క్షమించడు. వారికి జీతాలు రూ.18 వేలకు పెంచుదాం’.. అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. - ఆర్థిక భారంతో పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారకూడదని.. అందుకే అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించామని వైఎస్ జగన్ చెప్పారు. మరీ అంత సీరియస్సా.. - మంత్రిమండలి సమావేశం ప్రారంభంలో మంత్రులు కాస్త గంభీరంగా ఉండడాన్ని సీఎం జగన్ గుర్తించారు. ‘అందరూ మరీ అంత సీరియస్గా ఉన్నారేందన్నా.. కాస్త నవ్వండి.. నవ్వుతూ బాగా పనిచేద్దాం’.. అని వ్యాఖ్యానించి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తెచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో.. సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గ సమావేశాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంపైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో మంత్రులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తన ప్రభుత్వంలో మంత్రులు ఎవరూ డమ్మీలు కారని ఆయన అధికారులకు స్పష్టంచేశారు. పలు కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు వాటిల్లో ఎవరెవరిని నియమించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వీటిల్లో మంత్రులు అవసరంలేదని అధికారులు అనడంతో జగన్ పై విధంగా స్పందించారు. అంతేకాక, ‘వారికి అన్ని అంశాలపైనా అవగాహన ఉంది. పాలనా సంబంధ వ్యవహారాల్లో వారు కూడా క్రియాశీలంగా ఉంటారు. వారు చెప్పిన దానికి అనుగుణంగా పాలన జరగాలి. అధికారులు వారి మాట వినాలి’ అని జగన్ స్పష్టంగా నిర్దేశించినట్లు సమాచారం. సమావేశంలో చర్చించే అంశాలపై మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పొచ్చని సమావేశం ప్రారంభంలోనే సీఎం చెప్పడంతో మంత్రులందరూ క్రియాశీలంగా వ్యవహరించారు. గ్రామ, పట్టణ వలంటీర్ల నియామకం ప్రస్తావనకు వచ్చినపుడు వారి విద్యార్హతలు నిర్ణయించేటపుడు అధికారులు డిగ్రీని కనీసార్హతగా ఉండాలని నిర్ణయించారు. ఓ ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని డిగ్రీ కనీసార్హత గల వారు గ్రామాల్లో దొరకరని, ఇంటర్కు తగ్గించాలని సూచించారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లకు ఇంటర్, పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీని కనీస విద్యార్హతగా నిర్ణయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాలు పెంచే విషయం చర్చకు వచ్చినపుడు.. గిరిజన ప్రాంతాల్లో ఉండే వైద్య వలంటీర్ల జీతాలను కూడా పెంచాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారని తెలిసింది. ఆ అంశం ఎజెండాలో లేకపోయినా జగన్ దానిని పరిగణనలోకి తీసుకుని వారికి ప్రస్తుతం జీతం ఎంతో తెలుసుకున్నారు. రూ.400 నుంచి రూ.4000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. -
మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. సోమవారం ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ సీఎం తొలిసారి ఉద్యోగ సంఘాల నాయకులను కలిసినప్పుడు చెప్పిన మాట ప్రకారం తొలి కేబినెట్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన అనేక సానుకూల నిర్ణయాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. పే రివిజన్ కమిటీ నివేదిక సమర్పించేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం, జులై 1వ తేదీ నుంచి పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు ఎంతో మేలుచేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న సీపీఎస్ రద్దుకు నేడు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసి సాంకేతిక పరమైన తదితర అంశాలపై చర్చించేందుకు కమిటీని నియమించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తూ విధివిధానాలు ఖరారుకు కమిటీ వేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడానికి నిర్ణయించడంతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి నేరుగా జీతం ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల ఆశలకు కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయన్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోన్న నవరత్నాలను, సంక్షేమ పథకాలను ఉద్యోగులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుంటారన్నారు. -
పంటల బీమాకు జగన్ పూచీ!
అది 2018, అక్టోబర్ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు. పొట్ట దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో.. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్హుద్, ఫైలిన్ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఆర్.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు. అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు. – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
జనం తోడుగా రావాలి జగన్...కావాలి జగన్
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడంతో పాటు, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమం జనంతోడుగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలంలోని సిరిగేదొడ్డి, కేఎస్దొడ్డి గ్రామాల్లో చేపట్టిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన కాపు రామచంద్రారెడ్డి... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాలను వంచించారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాలతో సామాన్యులకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరించారు. గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం కొండాపురంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు హాజరయ్యారు. మహిళల నుంచి విశేష స్పందన లభించింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారంటూ వాపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని గాజులపల్లి గ్రామంలో సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమం చేపట్టారు. వైఎస్ జగన్ అమలు చేసే నవరత్న పథకాలే పేదలకు అండగా నిలుస్తాయని ఉషశ్రీచరణ్ తెలియజేశారు. అన్ని వర్గాలూ వైఎస్ జగన్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడగట్ట కిష్టప్ప, మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అందుతుందని తెలియజేశారు. పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ సుధాకర్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్హెచ్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఖాయిలా పీఎస్యూలకు చికిత్స
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ(పీఎస్యూ) కంపెనీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చికిత్స మొదలుపెట్టింది. మహారత్న, నవరత్న దిగ్గజాలతో పాటు ఇతర పీఎస్యూల వద్ద భారీ మొత్తంలో ఉన్న మిగులు నిధులను పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన భారత వాహన తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించామని.. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించనుందని కూడా గీతే పేర్కొన్నారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు ప్రారంభ(సీడ్) ఈక్విటీ నిధులను సమకూర్చడం ద్వారా ఒక జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేయడం.. తద్వారా నష్టజాతక పీఎస్యూల నిర్వహణ, పునరుద్ధరణకు గల అవకాశాలను కమిటీ పరిశీలించనుంది. ‘మహారత్న, నవరత్న హోదా ఉన్న సీపీఎస్ఈలకు చెందిన రూ.2 లక్షల కోట్ల మేర మిగులు నిధులు బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. ఈ కంపెనీలన్నింటికీ సమాన ఈక్విటీ వాటా ఉండేవిధంగా ఒక జేవీ ఏర్పాటు ప్రతిపాదనను మేం రూపొందించాం. దీనిద్వారా ఇప్పుడున్న 70 ఖాయిలా పీఎస్యూల్లో 43 కంపెనీలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది’ అని గీతే వివరించారు. ఏ ఖాయిలా కంపెనీని పునరుద్ధరించాలనేది కొత్తగా నెలకొల్పే జేవీ సమీక్షించి, నిర్ణయించనుందని.. దీనికి సంబంధించి పూర్తి భాధ్యతను జేవీకే ఇవ్వాలనేది తమ ప్రతిపాదనగా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం నిధుల కల్పన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నామని కూడా గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులపై త్వరలో నిర్ణయం... కాగా, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)ను అమలు చేసే ప్రతిపాదనపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యాటరీతో నిడిచే ఎలక్ట్రిక్ వాహనాలను(బస్సులు) ప్రజా రవాణాకోసం వినియోగించాలనేది ఈ మిషన్ ప్రధానోద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని.. జాబితా నుంచి దీన్ని తొలగించడం కోసం ఈ నగరం నుంచే ఎన్ఈఎంఎంపీని ప్రారంభించనున్నట్లు గీతే పేర్కొన్నారు. 2020కల్లా 60-70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని మిషన్ అంచనా వేస్తోంది.