palani swamy
-
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్గా కొనసాగుతున్నారు. -
తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ కొత్త ప్లాన్.. అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. Chennai | Former Tamil Nadu CM O Panneerselvam said, "The BJP leadership has been in regular touch with me (in recent times)... Will the AIADMK accept if the BJP asks for replacing (AIADMK general secretary) Palaniswami? Will they replace him? Then how can they ask to change BJP… pic.twitter.com/7xCrBCzHbZ — ANI (@ANI) September 29, 2023 పళణిస్వామిపై సెటైర్లు.. ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీకరిస్తుందా అని ఎదరు ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని విమర్శలు చేశారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని సీరియస్ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఇస్కాన్పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
తమిళనాడులో ట్విస్ట్.. పొల్లాచ్చి కేసులో పళనిస్వామికి షాక్!
సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతులు, మహిళలపై జరిగిన లైంగికదాడి వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ కేసులో బాధితుల పేర్లను వెల్లడించిన పోలీసు అధికారి పాండియరాజన్, ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పళని స్వామి, మాజీ సీఎస్ను విచారించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రానుంది. వివరాల ప్రకారం.. 2019లో కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కేంద్రంగా కొందరు యువకులు ఫామ్ హౌస్లోకి యువతలు, మహిళలను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించి వేధించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 9 మందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే బడాబాబులు, రాజకీయ ప్రముఖుల పిల్లలను ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే విధంగా హైకోర్టులో చెన్నైకు చెందిన బాలచంద్రన్ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో నిందితులను వెనకేసుకు యత్నించిన పోలీసు అధికారి పాండియరాజన్ను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఎం, సీఎస్లను కూడా ఈ కేసులో విచారించాలని, ఇందుకు సంబంధించిన ఉత్వరులు ఇవ్వాలని కోర్టుకు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. -
అన్నాడీఎంకే మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వం ప్లాన్ ఫలించేనా?
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతు కోసం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ పంపిన దరఖాస్తును ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులో ఏక పక్షంలో అభ్యర్థి పేరును సూచించారని, తమ మద్దతుదారు పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం నాటికి 46 మంది నామినేషన్లు వేశారు.ఇందులో కాంగ్రెస్, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే అన్నాడీఎంకేలో విబేధాల నేపథ్యంలో ఆ పార్టీలోని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాలకు చెందిన అభ్యర్థులు ఇంత వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. మంగళవారంతో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్వ సభ్య సమావేశం సభ్యుల మద్దతు సేకరణకు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ శనివారం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రిలోపు ఈ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సర్వసభ్య సమావేశం సభ్యులకు సమాచారం పంపించారు. మెజారిటీ మద్దతు అనుగుణంగా ఎన్నికల కమిషన్ను సోమవారం కలిసేందుకు తమిళ్ మగన్ హుస్సేన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆ దరఖాస్తుకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం శిబిరం ఆదివారం గళం విప్పింది. తీవ్ర వ్యతిరేకత.. దరఖాస్తును ఏక పక్షంగా సిద్ధం చేశారని పన్నీరు శిబిరం నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆ దరఖాస్తులో పళణిస్వామి ప్రకటించిన అభ్యర్థి తెన్నరసు పేరును మాత్రం సూచించారని, తమ అభ్యర్థి పేరును నమోదు చేయలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళ్ మగన్ హుస్సేన్ వ్యవహరిస్తున్నారని, ఈ దరఖాస్తును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన చోట ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని సర్వసభ్య సభ్యుల్లో పళనిస్వామి శిబిరానికి 2,662 మంది మద్దతు ఉంది. అలాగే ముగ్గురు ఎంపీలు, 61 మంది ఎమ్మెల్యేలు, 70 మంది జిల్లాల కార్యదర్శుల మద్దతు కూడా ఆయన ప్రకటించిన అభ్యర్థి తెన్నరసుకే ఉండటం గమనార్హం. ఇక, పన్నీరు సెల్వం శిబిరానికి 148 మంది సర్వసభ్య సభ్యులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు , ఐదుగురు జిల్లాల కార్యదర్శుల మద్దతు మాత్రమే ఉండడం గమనార్హం. మద్దతు తక్కువగా ఉన్నా, రెండాకుల వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చే విధంగా దరఖాస్తును అస్త్రంగా చేసుకుని ఫిర్యాదు చేయడానికి పన్నీరు శిబిరం సిద్ధం అవుతోండడం అన్నాడీఎంకేలో ఆసక్తి రేపుతోంది. -
అన్నాడీఎంకే శిబిరాల్లో కొత్త టెన్షన్ .. ప్రధాని మోదీతో కీలక భేటీ!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో నెలకొంది. బంతిని తమ వద్ద నుంచి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో హడావుడి పెరిగింది. కాంగ్రెస్ డీఎండీకే అభ్యర్థి ఆనందన్ ఇప్పటికే నామినేషన్ వేశారు. గురువారం నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనకా నవనీతన్తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్, కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమాయ్యరు. అలాగే అన్నాడీఎంకేలో పళణిస్వామి, పన్నీరు సెల్వం శిబిరాల మధ్య వార్ ఆ పార్టీ కేడర్ను నిరుత్సాహంలోకి నెట్టింది. పళని శిబిరం అభ్యర్థిగా తెన్నరసు, పన్నీరు శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ పేరు ఖరారు చేసినా రెండాకుల చిహ్నం ఎవరికి చిక్కేనో అన్న ఉత్కంఠతో రోజురోజుకూ తీవ్రమవుతోంది. శివకుమార్ కోర్టులోకి బంతి.. రెండాకుల గుర్తు తమకే అప్పగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని ఇప్పటికే పళనిస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం గురువారం అప్పీలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఈ సమయంలో తమ కోర్టులో ఉన్న బంతిని ఈరోడ్ ఎన్నికల అధికారి శివకుమార్ కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టుకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన నివేదికలో ఆ గుర్తు కోసం తమను ఎవరు సంప్రదించలేదని పేర్కొనడం గమనార్హం. అలాగే చిహ్నం కేటాయింపుల వ్యవహారంలో తుది నిర్ణయం ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి చేతిలోనే ఉందని ఆ నివేదికలో పొందు పరిచి ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరించనున్నదో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. దీంతో ఆ రెండు శిబిరాల అభ్యర్థులు రెండాకుల కోసం ఎదురు చూస్తూ నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. 7వ తేదీ వరకు సమయం ఉండడంతో ఇరు వర్గాలు ధీమాగా ఉన్నాయి. అదే సమయంలో పళని శిబిరం నేత తంబిదురై గురువారం ప్రధాని నరేంద్రమోదీని కలిసినట్టు సమాచారం వెలువడడం గమనార్హం. పోస్టర్ టెన్షన్.. పళని స్వామి శిబిరం బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత వరకు ఆ పార్టీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేయకపోవడంతో ఆయన మద్దతుదారులు కేంద్రంపై కన్నెర్ర చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమిలో ముర్పొక్కు( ముందుస్తు ప్రణాళిక) అన్న పదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటాన్ని కూడా ఆ కూటమి పేరులో తొలగించారు. నేషనల్ డెమోక్రటిక్ ముర్పొక్కు అలయన్స్ (ఎన్డీఎంఏ) అన్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం బీజేపీ వర్గాలను షాక్కు గురి చేశాయి. ఈ సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగమేఘాలపై ముర్పొక్కు అన్న పదాన్ని తొలగించడం గమనార్హం. ఈ విషయంగా అన్నాడీఎంకే నేత జయకుమార్ను ప్రశ్నించగా, ఈరోడ్లో ఏర్పాటు చేసినట్లుందని దాట వేశారు. అయితే, ఈరోడ్ నియోజకవర్గంలో ఒక్కో బూత్కు 5 నుంచి 10 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 30 వేల మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించి, నకిలీ ఓటర్ల భరతం పట్టాలని ఎస్ఈసీ సత్యబ్రత సాహూకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. -
తమిళనాట అన్నాడీఎంకే పాలి‘ట్రిక్స్’.. ఇరకాటంలో బీజేపీ!
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ముక్కలు చెక్కలైన అన్నాడీఎంకేలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే పారీ్టపై పట్టు కోసం నానా పాట్లు పడుతున్న పళని స్వామి, పన్నీరు సెల్వం ఈరోడ్ ఉప ఎన్నికల బరిలో తమ అనుచరులను నిలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం తమ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ధర్మానికి కట్టుబడి బీజేపీ ఏ వర్గానికి మద్దతు ఇస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి పయనమయ్యారు. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర తర్జనభర్జల మధ్య అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి శిబిరం నుంచి మాజీ ఎమ్మెల్యే తెన్నరసు పోటీకి దిగారు. ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ రంగంలోకి వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్కు మద్దతుగా డీఎంకే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక డీఎండీకే అభ్యర్థి ఆనందన్, అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రెండు రోజులు 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులే బరిలో దిగారు. బీజేపీ బరిలో దిగితే.. ఉదయాన్నే పళని తమ అభ్యర్థిని.. ప్రకటించారో లేదో.. సాయంత్రానికి పన్నీరు సెల్వం సైతం తమ వర్గం నేత పేరును వెల్లడించారు. సెంథిల్కుమార్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి పన్నీరు సెల్వం మరోసారి ఆహా్వనం పలికారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో, తమ వర్గం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. హస్తినకు అన్నామలై.. సంకీర్ణ ధర్మంలో భాగంగా అన్నాడీఎంకేకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సహకారం అందించేది పన్నీరు శిబిరానికా, పళని శిబిరానికా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత రెండు రోజులుగా చెన్నైలో ఈ విషయంపై అన్నామలై పార్టీ వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక అధిష్టానంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం గురు లేదా శుక్రవారం బీజేపీ తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. నువ్వానేనా.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు శిబిరాల మధ్య ఉన్న విభేదాలు ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రెండాకుల గుర్తు, బీజేపీ మద్దతు కోసం ఇరు శిబిరాలు గత కొన్ని రోజులుగా పావులు కదుపుతున్నాయి. చివరకు ఎవరు సహకారం అందించినా, అందించకున్నా.. తన బలాన్ని చాటే విధంగా పళణి స్వామి బుధవారం తమ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే, ధన బలం కలిగిన తెన్నరసును రంగంలోకి దించారు. ఇతడి పేరును మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటించారు. అన్నాడీఎంకేలో ఈరోడ్ తూర్పు సీటు కోసం పది మందికి పైగా నేతలు పోటీ పడ్డారని, వీరిలో ఒకరిని ఎంపిక చేయడంలో జాప్యం తప్పలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి 50 వేల మెజారిటీతో విజయకేతనం ఎగుర వేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. తన పేరు ఖరారు చేయడంతో సేలంలో ఉన్న పళనిస్వామిని కలిసి తెన్నరసు ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తప్పక విజయపబావుటా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
తమిళనాడు పాలిటిక్స్లో ట్విస్ట్.. పన్నీర్సెల్వానికి బిగ్ షాక్
Panneerselvam.. పన్నీర్సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన అన్నాడీఎంకే కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. ఇక తాజాగా ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపిక కావడంతో పన్నీర్ చేతి నుంచి ఈ పదవి కూడా చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ఎడపాడి పళనిస్వామి వర్గానికి చెందిన నాయకుడు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్ అప్పావుకు ఎస్పీ వేలుమణి బుధవారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పన్నీర్సెల్వం పదవీచ్యుతులయ్యే అవకాశం ఉంది. కాగా ఈనెల 11వ తేదీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకాగా, పన్నీర్సెల్వంను శాశ్వతంగా బహిష్కరించారు. అదే సమయంలో కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఓపీఎస్ను తప్పించారు. అతని మద్దతుదారులపై కూడా వేటు వేశారు. ఉన్న ఆ ఒక్క పదవీ..? ప్రస్తుతం పన్నీర్సెల్వం చేతులో ప్రస్తుతం ఉండేది ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి మాత్రమే. పార్టీ బహిష్కరణ వేటు వేసినా.. ప్రజాప్రతినిధిగా పన్నీరు సెల్వం అసెంబ్లీలో కొనసాగే అవకాశం మాత్రం ఉంటుంది. దీంతో ఎడపాడి ఆలోచనలో పడ్డారు. ఆ పదవి నుంచి కూడా పన్నీర్ను ఎలాగైనా తప్పించేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పన్నీర్స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం చెన్నై అడయారులోని ఓ ప్రయివేటు హోటల్లో ఎడపాడి మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఉదయకుమార్ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఎడపాడి పళనిస్వామి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష ఉప నాయకుడిగా తిరుమంగలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్బీ ఉదయకుమార్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తరువాత మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చెన్నై సచివాలయంలో స్పీకర్ అప్పావును కలిసి ఉదయకుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈసీ, కోర్టు తీర్పు పైనే.. అన్నాడీఎంకే నుంచి పన్నీర్సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్ను తొలగించినందున వారిని అధికారికంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా పరిగణించే పరిస్థితి ఉండదు. అయితే ఈ అంశంపై ఓపీఎస్ కోర్టు, ఎన్నికల కమిషన్లో పిటిషన్లు వేసి ఉన్నందున ఆ రెండు చోట్ల నుంచి స్పష్టత వచ్చేవరకు ఎమ్మెల్యేల గుర్తింపుపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అలాగే ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి ఈ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయానికి తావులేకుండా చట్ట ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ అప్పావు తెలిపా రు. ఎస్పీవేలుమణి ఓ ఉత్తరం అందజేశారని, అయితే అంతకు ముందే పన్నీర్సెల్వం సమరి్పంచిన వినతిపత్రం పరిశీలనతో ఉందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 11వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల కార్యకర్తలకు పోలీసులు సమన్లు పంపారు. వీటిలో పేర్కొన్న ప్రకారం చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో ఓపీఎస్కు చెందిన 30 మంది బుధవారం హాజరుకాలేదు. అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక 12 మంది పళనిస్వామి మద్దతుదారులు కూడా గురువారం పోలీస్స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. అయితే ఎడపాడి వర్గం కూడా బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలియడంతో.. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. -
పొలిటికల్ వార్: పన్నీరు సెల్వానికి ఊహించని షాకిచ్చిన పళనిస్వామి
పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన ఉనికి కాపాడుకునేందుకు తన మద్దతుదారులతో మూడోసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’లా తయారైంది. జూన్ 23వ తేదీ, జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరగ్గా, తన వర్గీయులతో మూడోసారి సర్వసభ్య సమావేశానికి పన్నీర్ సెల్వం సన్నాహాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఏక నాయకత్వం వివాదంపై ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. పదవి చేపట్టడమే అదనుగా పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు. పొన్నయ్యన్ ఆడియోపై నమ్మకం ఇటీవల మాజీ మంత్రి పొన్నయన్ పేరున విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఎడపాడి నెంబర్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు పార్టీ క్యాడర్లో పెద్ద బలం లేదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో దుమారం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఎడపాడి పార్టీలో కొత్త టీమ్ను నియమించి పొన్నయ్యన్ను ప్రాధాన్యత లేని పదవిలోకి నెట్టారు. పొన్నయ్యన్ మాటలను విశ్వసిస్తున్న పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎడపాడి పళనిస్వామి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా సద్దుమణగకముందే పన్నీర్సెల్వం మరోసారి సన్నద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఎడపాడి వైపు ఉన్నట్లుగా చెబుతున్న కార్యవర్గ సభ్యులకు గాలంవేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలో ఓపీఎస్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలను పదవుల నుంచి ఎడపాడి తప్పించిన అంశాన్ని కూడా చర్చించాలని ఆలోచిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరుగగా, పన్నీర్ ప్రయత్నాలు ఫలిస్తే అది మూడో సర్వసభ్య సమావేశం అవుతుంది. కుట్రలో భాగంగానే తాళం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులను సీఎం స్టాలిన్ అవకాశంగా తీసుకుని తమ పార్టీకి శాశ్వతంగా తాళం వేసేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. అన్నాడీఎంకేను భూస్తాపితం చేసేందుకు ద్రోహులతో స్టాలిన్ చేతులు కలిపారని, అందుకే తమ పార్టీ కార్యాలయానికి సీలు వేశారని విమర్శించారు. పన్నీర్సెల్వం సైతం అన్నాడీఎంకేను అణచివేయాలని కాచుకుని ఉన్నారని, అయితే ఆయన ఆశయం నెరవేరదని ఎడపాడి వ్యాఖ్యానించారు. పోటాపోటీగా వినతిపత్రాలు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదాను సైతం పన్నీర్సెల్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పదవిపై ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్కు వినతిపత్రాలు సమరి్పంచారు. ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఎంపికకై ఎమ్మెల్యేలతో ఈనెల 17వ తేదీ ఎడపాడి సమావేశం అవుతున్నారు. విధి విధానాలను అనుసరించి స్పీకర్ అప్పావుకు ఈ సమాచారం ఇవ్వనున్నారు. -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
దూకుడు పెంచిన శశికళ.. వారితో దోస్తి!
చెన్నై: రాష్ట్రంలో వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్న శశికళ, దివాకరన్ ఏకమవుతున్నట్లు ఆదివారం ఓ వార్త ఆసక్తి కలిగించింది. శశికళ సోదరుడు దివాకరన్, అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న విబేధాల నుంచి కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీ ప్రారంభమైంది. రెండు పార్టీల్లో పెద్దగా బలం, బలగం లేకున్నా వారివురూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ వర్గం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకేలో అన్నా ద్రవిడ కళగం విలీనం కాబోతున్నట్లు, ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన తంజావూరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నాడేఎంకేలో పన్నీర్ సెల్వం వెర్సస్ పళణి స్వామి అన్నట్లు రాజకీయ వివాదం జరుగుతోంది. మరో వైపు శశికళ నాయకత్వంలోని పార్టీకి ఈ వీలినం చూస్తుంటే అన్నాడేఎంకేలో పట్టు బిగించే పనిలో ఆమె దృష్టి పెట్టినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: OPS Vs EPS: పన్నీర్ సెల్వానికి షాక్.. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై పన్నీర్సెల్వంను అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపాలని ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీన జరగున్న జనరల్బాడీ సమావేశాన్ని ఇందుకు వేదికగా మలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రిసీడియం చైర్మన్గా ఎన్నికైన తమిళ్మగన్ హుస్సేన్ సైతం ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వర్గపోరుతో పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేసిన నెపం చూపి క్రమశిక్షణ చర్యగా ఏకంగా పార్టీ నుంచే పన్నీర్సెల్వంను పంపివేసేందుకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా తన సతీమణికి కరోనా సోకడంతో కొన్నిరోజులుగా హోం ఐసోలేషన్లో ఉన్న ఎడపాడి శనివారం బయటకు వచ్చి మద్దతుదారులతో సమావేశమయ్యారు. కాగా, పార్టీలో మెజారీ్ట నాయకులు ఎడపాడివైపు మొగ్గుచూపుతుండగా, వారిని తనవైపు ఆకర్షించేందుకు పన్నీర్ అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నా రు. చెన్నై అడయారు గ్రీన్వేస్ రోడ్డులోని తన ఇంటిలో శనివారం పార్టీ శ్రేణులను కలిసేందుకు పన్నీర్ సిద్ధమయ్యారు. అయితే సాయంత్రం వరకు ఎదురుచూసినా ఏ ఒక్క నేత ఆ వైపు రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. పుదుచ్చేరికీ తాకిన సెగ.. తమిళనాడులో పార్టీ పరిస్థితి ఇలా ఉండగా, ఈ సెగ పుదుచ్చేరికి సైతం వ్యాపించింది. ఏక నాయకత్వం విషయంలో పుదుచ్చేరి తూర్పువిభాగం కార్యదర్శి అన్బళగన్, పడమటి విభాగం కార్యదర్శి ఓంశక్తిశేఖర్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య విబేధాలు నెలకొనగా పార్టీ చీలిపోతుందా.. అని పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. -
పన్నీర్సెల్వానికి చెక్ పెట్టిన పళనిస్వామి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్సెల్వం రాజకీయ ప్రయాణం.. పతనం దిశగా సాగుతోందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పదవీకాలం ముగిసిన దశలో ఆ పార్టీ కోశాధికారి బాధ్యతల నుంచి పన్నీర్సెల్వంను తప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్న తరుణంలో.. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వాహకుల సమావేశం సోమవారం జరిగింది. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్నీర్సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏక నాయకత్వంలో పార్టీని నడపాలని, పన్నీర్సెల్వను పక్కనపెట్టి పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే వ్యూహంతో ఈనెల 23వ తేదీన సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే, కన్వీనర్ హోదాలో ఎడపాడి ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా పన్నీర్సెల్వం 23 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిని వ్యతిరేకిస్తున్నట్లు ఎడపాడి వర్గం తేలి్చచెప్పడంతో పన్నీర్సెల్వం అలిగి వెళ్లిపోయారు. ఎడపాడి వర్గం కోర్కె మేరకు వచ్చేనెల 11వ తేదీన మళ్లీ సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ప్రిసీడియం చైర్మన్ తమిళ్మగన్ హుస్సేన్ అనుమతించారు. ఇక ఆ తరువాత నుంచి ఈపీఎస్, ఓపీఎస్ తన ఎవరికివారు పార్టీపై పట్టుకోసం మ్ముమర ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి? అన్నాడీఎంకే ప్రధాన కార్యవర్గ సమావేశాన్ని చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిసీడియం చైర్మన్ అధ్యక్షత వహించారు. ‘ఏక నాయకత్వమే’, ‘ప్రధాన కార్యదర్శి జిందాబాద్’ నినాదాలతో ఎడపాడికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలోని ఓ ఫ్లెక్సీలో ఉన్న పన్నీర్సెల్వం ఫొటోను ఎడపాడి వర్గం తొలగించింది. వచ్చేనెల 11వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపితీరాలని తీర్మానించారు. సమన్వయ కమిటీ గడువు తీరినందున రానున్న సర్వసభ్య సమావేశంలో కోశాధికారి పదవి నుంచి పన్నీర్సెల్వంను తప్పించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీని నడిపేందుకు ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించుకుని సర్వాధికారాలు ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. పార్టీ కార్యాలయంలో ఎడపాడి సమావేశం జరుపుతున్న సమయంలో తేనీ జిల్లా పెరియకుళంలో ఉన్న పన్నీర్సెల్వం హడావిడిగా చెన్నైకి చేరుకుని తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటను టీటీవీ దినకరన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎడపాడిని వ్యతిరేకించేవారు బహిరంగంగా పన్నీర్సెల్వంతో భేటీ కావచ్చు, ఇందులో రహస్యం అవసరం లేదని దినకరన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు తాము ఎలాంటి కుట్ర చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకు ఏక నాయకత్వమే ఉండాలి, పార్టీ శ్రేణులే ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని శశికళ అన్నారు. సుప్రీంకోర్టులో ఓపీఎస్ కేవియట్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహణపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎవరైనా పిటిషన్ వేస్తే తమ వాదన కూడా వినాలని సుప్రీంకోర్టులో ఓపీఎస్ న్యాయవాది సోమవారం కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో పార్టీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. -
దూకుడు పెంచిన శశికళ.. ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్!
నేతల కిరికిరీ కోట దాటింది.. తకరారు తారస్థాయిని తాకుతోంది.. చివరికి నాయకుల పంచాయితీ పరిధి దాటిపోతోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే.. ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోంది..! బలం కోసం.. బలగం కోసం అగ్రనేతలైన పన్నీరు, పళని స్వామి అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటూ.. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటూ శశికళ, దినకరన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బల ప్రదర్శనకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది..! సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు పార్టీపై పట్టే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. మదురై వేదికగా పన్నీరు సెల్వం బలప్రదర్శన నిర్వహించారు. చెన్నైలో తిష్ట వేసిన పళని శిబిరం పన్నీరుకు వ్యతిరేకంగా వ్యూహరచనలో నిమగ్నమైంది. మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ పురట్చి పయనం పేరిట తిరుత్తణి వైపుగా కదిలారు. ఇక, ఈమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎవరికి వారే.. గత రెండు వారాలుగా అన్నాడీఎంకేలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, చోటు చేసుకుంటున్న మలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక, ఆదివారం ఎవరికి వారు పారీ్టపై పట్టుకు తమ దైన శైలిలో దూసుకెళ్లారు. జూలై 11న జరిగే సర్వ సభ్య సమావేశంతో పార్టీని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సమావేశాన్ని నిర్వహించి తీరాలనే సంకల్పంతో ఆదివారం చెన్నైలో సుదీర్ఘ కార్యచరణలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ సమావేశానికి ముందే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్గా ఉన్న పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారుల జాబితా సిద్ధం చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా అన్నాడీఎంకేకు చెందిన ‘నమదు అమ్మ’ దిన పత్రికలో పబ్లీషర్స్ స్థానంలో పన్నీరు సెల్వం పేరును ఆదివారం తొలగించడం గమనార్హం. తగ్గేదేలే అంటున్న పన్నీరు.. ఢిల్లీ నుంచి ఆదివారం మదురైకు చేరుకున్న పన్నీరు సెల్వం బల ప్రదర్శనకు దిగారు. ఆయన మద్దతు దారులు వేలాదిగా విమానాశ్రయానికి చేరుకుని బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన బలాన్ని చాటే విధంగా కేడర్ తన వెంటే ఉంది అంటూ పన్నీరు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాయకులు లేకున్నా, కార్యకర్తలు అందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సమస్యలకు కారుకులెవ్వరో కేడర్ గుర్తించారని పేర్కొన్నారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత మార్గంలో పయనిస్తున్న తాను నిత్యం కేడర్తో కలిసి మెలిసి ఉన్నానని, వారే ఇప్పుడు తనకు బలం అని ధీమా వ్యక్తం చేశారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించిన ఆయన ప్రత్యేక వాహనంలో మద్దతు దారులతో కలిసి ముందుకు దూసుకెళ్లారు. అలాగే, మదురై వేదికగా మద్దతు దారులతో సమావేశం అయ్యారు. అనంతరం తేని వైపుగా పన్నీరు సెల్వం బల ప్రదర్శన సాగింది. ఇక, ఈనెల 28వ తేదీన రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక ప్రకటన చేయడానికి పన్నీరు సిద్ధం అవుతోన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా పన్నీరు మద్దతుదారుడైన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మరోమారు సర్వసభ్య సమావేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. జులై 11న జరగనున్న సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చిన్నమ్మ ‘పురట్చి’ పయనం అన్నాడీఎంకేను తన గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఇక, రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచనున్నారు. ఆదివారం చెన్నై టీ నగర్లోని నివాసం నుంచి తమిళ హక్కులు, మహిళా సాధికారత నినాదంతో పురట్చి పయనానికి చిన్నమ్మ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక వాహనంలో కోయంబేడు, పూందమల్లి, తిరువళ్లూరు, తిరుత్తణి, కోర మంగళం, కేజీ కండ్రిగ, ఆర్కే పేట, అమ్మయార్ కుప్పం వరకు చిన్నమ్మ పయనం సాగింది. అమ్మయార్ కుప్పం బహిరంగ సభ వేదిక వద్దకు చిన్నమ్మ చేరుకున్నారు. ఇక, చిన్నమ్మ ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం వ్యూహాలకు పదును పెట్టే విధంగా ముఖ్య నేతలతో సమావేశంలో మునిగారు. చిన్నమ్మ తీసుకునే నిర్ణయాలు, ఆమె వేసే అడుగులకు బలాన్ని చేకూర్చే విధంగా తిరువళ్లూరు జిల్లా అయపాక్కం వేదికగా ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో సమాలోచించడం గమనార్హం. అన్నాడీఎంకే ఆత్మగౌరవాన్ని కాపాడుతా: శశికళ తిరువళ్లూరు: అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిస్టంభన తొలగించి పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని శశికళ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం తిరువళ్లూరు జిల్లాకు ఆమె వచ్చారు. ఈ మేరకు పూందమల్లి, నేమం, తిరువళ్లూరు, పాండూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పూందమల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడీఎంకేలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుతా, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నరసింహన్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్రామ్, పార్టీ నేతలు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేనే ప్రధాన కార్యదర్శి.. తిరుత్తణి: కేజీ కండ్రికలో చిన్నమ్మ శశికళ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శి తానే అని స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం పన్నీరు, పళని స్వామికి లేదు అని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అధికారం క్షేత్రస్థాయిలోనే కార్యకర్తలకు మాత్రమే ఉందని వివరించారు. జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకుల్ని అడ్డం పెడ్డుకుని పళని స్వామి ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకు అవకాశం లేదన్నారు. పన్నీరు సెల్వంతో చేతులు కలుపుతారా..? అని ప్రశ్నించగా, వేచి ఉండండీ..! అన్నాడీఎంకేకు మంచి రోజులు రాబోతున్నాయని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు -
Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!
సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. కొడనాడు కేసులో.. వాదోపవాదాలు కొడనాడు ఎస్టేట్లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ బెంచ్లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్షీట్ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు. -
సీఎంతో హీరో విజయ్ భేటీ..!
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్ను రాజకీయాల్లోకి రప్పించడానికి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే విజయ్ వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరు నమోదును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా, తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. అయి తే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అను మతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందం ఉంది. రహస్య భేటీ.. మాస్టర్ చిత్రాన్ని రూ. 143 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్న చిత్ర బృందం వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. విజయ్తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా గతంలో విజయ్ నటించిన అనేక చిత్రాలు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగానే సీఎంతో విజయ్ భేటీ కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..
అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్ తడిసి ముద్దయింది. ముందుగా మార్గదర్శక కమిటీ.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. సీఎం అభ్యర్థి పళని.. పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు. సంబరాల్లో సేన.. పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా.. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. -
ఎవరి లెక్కలు వారివే!
సాక్షి, చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు తమిళ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలు, గెలుపు స్థానాల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ మద్దతు దారులకు సమంగా సీట్లను పంచేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్, కో కన్వీనర్ పళని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక, తమ గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్కు సీట్ల సంఖ్య తగ్గించేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కసరత్తులు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 2021 సార్వత్రిక నగారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్లో మోగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహూ కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 16న నమూనా ఓటరు జాబితా, జనవరి 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటించ బోతున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబరు 15 వరకు ఓటరు జాబితాలో ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా, తమిళ పార్టీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకుని కసరత్తుల వేగాన్ని పెంచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకేలు ముందు ఉండగా, మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. సమానంగానే పంపకాలు.. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు అన్నాడీఎంకే నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి శిబిరాలు సమానంగా సీట్లను పంచుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి 20, పీఎంకేకు 20, డీఎండీకేకు ఓ ఐదు, మిగిలిన మిత్రులకు తలా ఒకటి రెండు అప్పగించి, కనీసం 180 స్థానాల్లో పోటీ లక్ష్యంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి. బీజేపీ కలిసి రాకపోతే పీఎంకేకు మరో ఐదు సీట్లు ఇచ్చి, మిత్రులకు తలా ఓ సీటు కోత పెట్టి, అవసరం అయితే, 200 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోన్నట్లు చర్చ సాగుతోంది. ఏ శిబిరం అయితే, అధిక స్థానాల్లో గెలుస్తుందో, వారే సీఎం అనే ఏకాభిప్రాయానికి సైతం రాబోతున్నారని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఇందు కోసం మరి కొద్ది రోజుల్లో పార్టీ సర్వ సభ్యం సమావేశం కానున్నదని, ఇందులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. సర్వేలను నిజం చేద్దామంటూ.. డీఎంకే ఉదయ సూర్యుడి గెలుపు ఖాయమని ఓ సర్వేలో తేలింది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బృందం ఓ నివేదికను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు ఇచ్చినట్టు సమాచారం. ఇందులోనూ అధికారం డీఎంకేకు ఖాయం అన్నట్టుగా ఉండటం గమనార్హం. అయితే డీఎంకే విజయం సాధించాలంటే అధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆ పార్టీకి మిత్ర పక్షాలు ఎక్కువే అయినా, వారికి సింగిల్ డిజిట్ సీట్లతో సర్దుబాటుకు అవకాశం ఎక్కువే. ఇక్కడ సమస్య అంతా కాంగ్రెస్ రూపంలోనే. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్కు 63, 40 అంటూ సీట్లు కేటాయించినా, గెలిచింది సింగిల్ డిజిట్ మాత్రమే. ఈ దృష్ట్యా, ఈ సారి కాంగ్రెస్ ఆశించిన మేరకు సీట్లను డీఎంకే ఇచ్చే అవకాశాలు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 30 లోపు సీట్లను కాంగ్రెస్కు సర్దుబాటు చేసి, కనీసం 180కు పైగా స్థానాల్లో పోటీ లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్లు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో సీఎం అభ్యర్థి స్టాలిన్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. గెలిపిస్తే...ఇనోవా ఎన్నికల వ్యూహాలకు ఆ పార్టీ నేత మురుగున్ పదునుపెడుతున్నారు. జిల్లాల నేతలతో సమావేశాలు, సమీక్షలు అంటూ వీడియో కాన్ఫరెన్స్లతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని గెలిపించే జిల్లా కార్యదర్శికి ఓ ఇన్నోవా కారు బహుకరించనున్నట్టు మురుగన్ ప్రకటించారు. కనీసం 25 మంది ప్రతినిధులు అసెంబ్లీలో ఈ సారి అడుగు పెట్టాల్సిందేనని, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి ఎన్నికల కసరత్తుల వేగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అన్నాడీఎంకే వద్ద కనీసం 40 నుంచి 50 మేరకు సీట్లను బీజేపీ ఆశించే అవకాశాలు ఉన్నాయి. -
తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు భిన్నం అన్న ఆయన.. కేవలం పార్టీయే కాకుండా ప్రజల పోరాటంగా ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి, దేశానికి సేవలందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు సానుకూలంగా ఉండటం, 23వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ‘కృతజ్ఞతాపూర్వక సమావేశం’ ఏర్పాటు చేశారు. ‘గతంలో ఎన్నో ఎన్నికలు చూశా. కానీ, ప్రస్తుత ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగాయి. ఈసారి ప్రజలే ఎన్నికల పోరాటంలో పాల్గొన్నారు. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందనిపించింది’ అని ప్రధాని అన్నారని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరులకు తెలిపారు. అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘గత ఐదేళ్లలో ఎంతో కృషి చేసి గొప్ప విజయాలు సాధించిన మోదీ సర్కార్ టీంకు కృతజ్ఞతలు. నరేంద్ర మోదీ నేతృత్వంలో నవీన భారత నిర్మాణానికి ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ, జైట్లీ, జేపీ నడ్డా, ప్రకాశ్ జవడేకర్ తదితరులతో పాటు ఎన్డీఏలోని లోక్జన్ శక్తి పార్టీకి చెందిన పాశ్వాన్, అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఉన్నారు. ఎన్డీఏ నేతలకు విందు సాయంత్రం స్థానిక అశోకా హోటల్లో అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన విందుకు శిరోమణి అకాలీదళ్కు చెందిన ప్రకాశ్సింగ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితర కూటమి నేతలంతా పాల్గొన్నారు. వీరందరినీ ప్రధాని మోదీ శాలువా కప్పి సన్మానించారు. ఈ విందు కేవలం మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసింది మాత్రమేనని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేంత మెజారిటీ దక్కినప్పటికీ కొత్త ప్రభుత్వంలో వారిని కూడా కలుపుకుని పోయేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం: మోదీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలని అధికార పార్టీ నేతలు యోచిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎంలపై అనవసర వివాదం సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన 36 పార్టీల నేతలు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. 2022 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశాన్ని సంపన్న, బలమైన, అభివృద్ధి చెందిన, సమ్మిళిత భారత్గా మార్చేందుకు కట్టుబడి ఉంటామంటూ ఈ సందర్భంగా ఒక తీర్మానం చేసినట్లు కేంద్రమంత్రి రాజ్నాథ్ తెలిపారు. ఎన్డీయేతర మూడు పార్టీల నేతలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు పంపినట్లు ఆయన వివరించారు. -
‘అభినందన్కు పరమవీరచక్ర అవార్డు ఇవ్వాలి’
చెన్నై : పాక్ చెరలో వేధింపులు ఎదుర్కొన్ని అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీరచక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని విశ్వాసం, సంయమనం పాటించిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో పాటు ప్రధాని దౌత్యపరమైన వ్యూహాలతో అభినందన్ను పాకిస్తాన్ విడుదల చేసిందని చెప్పారు. మాతృదేశం పట్ల అభినందన్ ప్రదర్శించిన విశ్వాసం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెదరని సంకల్పం దేశవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకుకుందని, పరమవీరచక్ర పురస్కారంతో ఆయనను గౌరవించడం సముచితమని సీఎం పళనిస్వామి ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను పాక్ భారత్కు అప్పగించింది. -
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ట్విస్ట్
-
ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్
సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వీరి సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది. అనేక ఒడిదుడుకుల మధ్య అధికారంలో కొనసాగుతున్న పళనిస్వామి ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం సవాలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేసినా పళని ప్రభుత్వానికి సంకటమే. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో పళనిస్వామి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్టు అయింది. ఎక్కువమంది సభ్యుల మద్దతు పళని సర్కారుకు ఉన్నా.. తగినంత మెజారిటీ మాత్రం లేదు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 114మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18మంది ఎమ్మెల్యేలు దినకరన్కు మద్దతుగా.. పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరి అనర్హత వేటును ఉపసంహరిస్తే.. తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే అవకాశముంది. పళనిని సీఎం పదవి నుంచి దింపేసి.. దళిత ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని దినకరన్ ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీర్పు మరోసారి తమిళనాట రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తోంది. -
నేడు తమిళనాడు బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి హింసాకాండకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కాల్పులపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. స్టెరిలైట్ యూనిట్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్ కర్మాగారానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
ఎప్పుడో సీఎం అయ్యే వాడిని!
సాక్షి,చెన్నై : తలచుకుని ఉంటే, తానెప్పుడో సీఎం అయ్యే వాడినని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. ద్రోహుల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పళని సర్కారు కుప్ప కూలడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఈరోడ్లో కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ నినాదంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం సాగింది. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడారు. కావేరి వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని పళని ప్రభుత్వం పథకం ప్రకారం కపట నాటకాలను ప్రదర్శిస్తున్నాయని మండి పడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను పళని, పన్నీరు తాకట్టుపెట్టేశారని, వాటిని మళ్లీ దక్కించుకోవాలంటే, ఈ ప్రభుత్వం కుప్పకూలాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు తగ్గ సమయం ఆసన్నమైందన్నారు. అనర్హత వేటు వ్యవహారంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పళని సర్కారు కుప్పకూలినట్టేనని, తీర్పు త్వరితగతిన వెలువరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని తాము అభ్యర్థిస్తున్నామన్నారు. ద్రోహుల్ని తరిమి కొడతాం రాజకీయాలంటే ఏమిటో తెలియని పన్నీరు సెల్వంను తీసుకొచ్చి సీఎం పదవిలో చిన్నమ్మ శశికళ కూర్చొబెట్టారన్నారు. అమ్మ మరణం తదుపరి రెండో సారిగా కూడా చాన్స్ ఇస్తే, ఏకంగా అన్నాడీఎంకేని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. పళని స్వామిని సీఎంగా చేస్తే, ఆయన ఏకంగా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి, వారి అడుగులకు మడుగులు వత్తే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తాను తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వాడినని ధీమా వ్యక్తంచేశారు. అయితే, తనకు గాని, తన కుటుంబంలోని వారికి గాని పదవీ ఆశ లేనందున, అన్నాడీఎంకే కోసం అమ్మ వెన్నంటి ఉండి శ్రమించామన్నారు. అయితే, ప్రస్తుతం ఆ పార్టీని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్టు వివరించారు. ఆ ఇద్దరు ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వారిని తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల్ని తమ మీదకు ఉసిగొల్పుతున్నారని, మున్ముందు అదే పోలీసులు ఆ ఇద్దరినీ టార్గెట్ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. -
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిం చారనే ఆరోపణలపై దినకరన్ వర్గానికి చెందిన సేలం మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం సహా నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అలాగే టీటీవీ దినకరన్ సహా 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేంద్రం నీట్ను బలవంతంగా తమిళనాడు విద్యార్థులపై రుద్దుతుందంటూ పలు విమర్శలు చేస్తూ కరపత్రాలను ముద్రించారని పోలీసులు పేర్కొన్నారు. -
క్యాంప్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్?
-
క్యాంప్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్?
సీఎం పళని స్వామి కొత్త వ్యూహం సాక్షి, చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో తాజాగా ఐదుగురు శాసనసభ్యులు పుదుచ్చేరి క్యాంప్ నుంచి జారుకున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంప్ను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కు మార్చాలని దినకరన్ యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో కార్యక్రమాలు, వ్యక్తిగత పనులు, కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి తీసుకున్నట్లు దినకరన్ వర్గానికి చెందిన నేత జగ్గయ్యన్ తెలిపారు. త్వరలోనే వారందరూ వెనక్కు వస్తారని వెల్లడించారు. మరోవైపు దినకరన్ శిబిరం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి క్యాంప్కు వెళ్లకుండా నిరోధించడానికి తమిళనాడు సీఎం పళని స్వామి పలువురు మంత్రులను రంగంలోకి దించినట్లు సమాచారం. -
తమిళ రాజకీయాల్లో రోజుకో మలుపు
-
శశికళ, దినకరన్లపై వేటు
► సీఎం పళని నిర్ణయం ► పార్టీ భేటీకి 30 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం పళని స్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయించారు. వారి అధీనంలోని నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకోవాలని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు వచ్చేనెల 12న పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ భేటీకి 113 మంది ఎమ్మెల్యేలకుగానూ 83 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని ఎన్నికల సం ఘం గుర్తించలేదని, అందువల్ల ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదని పళని చెప్పారు. ఢిల్లీకి పళని, దినకరన్ వర్గాలు సీఎం పళని, దినకరన్ వర్గాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం, ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఈసీని కలవనుంది. పళని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, జూలై 18న అసెంబ్లీలో నిషేధిత గుట్కాల్ని ప్రదర్శిం చారంటూ ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని జారీచేశారు. -
దూకుడుగా దినకరన్
సీఎం పళని, విప్ రాజేంద్రన్పై వేటు సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే నాయకురాలు శశికళను పార్టీ నుంచి సాగనంపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రయత్నాలు వేగవంతం చేసిన నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మరో అడుగు ముందుకు వేశారు. సేలం రూరల్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే తన వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విప్ రాజేంద్రన్ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రకటన జారీచేశారు. దీంతో దినకరన్ తీరును నిరసిస్తూ పలుచోట్ల సీఎం మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. మరోవైపు తనకు ఎవరెవరు మద్దతుగా ఉన్నారో తెలుసుకునేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేక సమావేశానికి సీఎం పళని పిలుపునిచ్చారు. -
చేతులు కలిపారు
► ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల విలీనం ► డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ ► సీఎం, పార్టీ ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ► శశికళ తొలగింపునకు త్వరలో జనరల్ కౌన్సిల్ భేటీకి నిర్ణయం ► శశికళ వర్గం ఎమ్మెల్యేల అసంతృప్తి ► నేడు గవర్నర్తో భేటీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని రెండు కీలక వర్గాలు విలీనమయ్యాయి. మూడు నాలుగు రోజులుగా విలీనంపై చర్చలు కొలిక్కి రాకపోవటంతో పెరిగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. తాజా మార్పుల నేపథ్యంలో దినకరన్, శశికళ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు రేపు గవర్నర్ను కలవనున్నారు. అటు, అన్నాడీఎంకే విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ స్పందించారు. తమిళ ప్రజల నెత్తిన ఈ రెండు వర్గాల నేతలు టోపీ పెడుతున్నారని ట్విటర్ ద్వారా విమర్శించారు. నాటకీయ పరిణామాలు రెండు వర్గాల మధ్య నాలుగు రోజులుగా చర్చలు జరగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. శని, ఆది వారాల్లో పన్నీర్, పళని వర్గాల దూతలు సమావేశమైనా పార్టీ, ప్రభుత్వంలో పదవులపై పట్టుబట్టడంతో కలవటం కష్టమేననే సంకేతాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పన్నీర్సెల్వం మరోసారి తన అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం పళనిస్వామి దూతలుగా వచ్చిన సీనియర్ మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణిలు.. పన్నీర్సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి, పాండియన్కు మంత్రి పదవికి సమ్మతి వ్యక్తం చేశారు. అయితే, శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించాలని పన్నీర్వర్గం మరోసారి పట్టుబట్టడంతో మళ్లీ ప్రతిష్టంభన తలెత్తింది. అటు సీఎం కూడా సోమవారం తన నివాసంలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఇంతలో.. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నట్లు ఇరువర్గాల నుంచి కార్యకర్తలు, మీడియాకు సమాచారం వచ్చింది. అయితే మధ్యాహ్నం 2 కావస్తున్నా.. ఇద్దరు నేతలూ వారి ఇళ్లనుంచి బయటకు రాలేదు. దీంతో కార్యకర్తల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇరువురు నేతలు పార్టీ కార్యాలయానికి బయలుదేరి 3.15 గంటలకు సంయుక్త మీడియా సమావేశంలో చేతులు కలిపారు. ‘మనల్ని ఎవరూ విడదీయలేరు. మనమంతా అమ్మ పిల్లలం’ అని పన్నీర్ సెల్వం తెలిపారు. ‘మనమంతా కలిసిపోయినందుకు నేడు ఎంజీఆర్, అమ్మ చాలా సంతోషిస్తారు. ఆర్నెల్లలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇకపై వాటిని అధిగమిద్దాం’ అని పళనిస్వామి వెల్లడించారు. దీంతో సమావేశ మందిరంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. శశికళ తొలగింపునకు కొన్ని న్యాయ అడ్డంకులున్నందున.. త్వరలోనే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి ముందడుగేయనున్నట్లు తెలిసింది. డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం అనంతరం ఇద్దరు నేతలు మెరీనా బీచ్లోని ఎంజీఆర్, జయలలిత సమాధి వద్దకెళ్లి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం.. పన్నీర్సెల్వం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖలను నిర్వహించనున్నారు. పన్నీర్వర్గానికే చెందిన కే పాండియన్ తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖలను పొందారు. ప్రమాణ చేసిన పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామిని ప్రధాని మోదీ అభినందించారు. ‘తిరు ఓ పన్నీర్సెల్వంతోపాటుగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇదో కొత్త టోపీ.. కమల్: అన్నాడీఎంకే వర్గాల విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. సోమవారం విలీనం జరుగుతుండగానే.. ట్విటర్ దాడి చేశారు. ‘గాంధీ టోపీ, కాషాయ టోపీ, కశ్మీర్ టోపీలను చూశాం. ఇప్పుడు తమిళ ప్రజల నెత్తిన జోకర్ టోపీ పెడుతున్నారు. ఇది చాలా? ఇంకా ఏమైనా కావాలా? తమిళులారా మేల్కొనండి!’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘మరో స్వాతంత్య్ర సంగ్రామం, ముఖ్యంగా అవినీతిపై పోరాటం కోసం మీలో ఎవరికి ధైర్యముంది?’ అని మరో ట్వీట్లో కమల్ తమిళప్రజలను ప్రశ్నించారు. -
విలీన చర్చలు విఫలం
-
విలీన చర్చలు విఫలం
కీలక అంశాలపై పళని, పన్నీర్ వర్గాల మధ్య విభేదాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ వర్గాల విలీనం మరోసారి వాయిదాపడింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారం వేర్వేరుగా జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల నేతలు మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అంతకముందు అమ్మ సమాధి సాక్షిగా విలీనమంటూ ఉదయం నుంచి ప్రచారం సాగింది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేయడంతో ఏ క్షణం ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి చెన్నైలో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీనియర్ నేతలు, మంత్రులు, తమ వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడం వంటి పన్నీర్ వర్గ డిమాండ్లను నేరవేర్చిన నేపథ్యంలో విలీనంపై ఈ భేటీలో చర్చించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్పై కూడా సానుకూలంగానే ఉన్నట్లు పళని వర్గం సంకేతాలిచ్చింది. కాగా శుక్రవారం సాయంత్రం పన్నీర్ సెల్వం కూడా తన వర్గ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పన్నీర్సెల్వం ఎలాంటి ప్రకటన చేసినా వెంటనే స్పందించేందుకు వీలుగా పళని స్వామి సైతం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రివర్గం, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. మెరీనాబీచ్లోని అమ్మ సమాధి సాక్షిగా విలీనంపై ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో రాత్రి 7 గంటల సమయంలో జయ సమాధిని హడావుడిగా అలంకరించారు. పళని, పన్నీర్ కోసం రెండు పుష్పగుచ్ఛాల్ని సిద్ధం చేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు సమాధివద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల నేతలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన చర్చలు రాత్రి 10 గంటలు దాటినా కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగింది. మా నాయకుడు అన్ని వివరాలు చెబుతారంటూ పన్నీర్ సెల్వం వర్గం నేతలు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం, పార్టీలో పరిణామాల్ని శశికళకు వివరించేందుకు దినకరన్ శుక్రవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. వేదనిలయంపై తమకే హక్కు ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. వేద నిలయం తనకు, దీపకు చెందుతుందని, కావాలంటే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని సీఎంకి దీపక్ లేఖ రాశారు. జయ తల్లి సంధ్య రాసిన వీలునామా దీపక్ వద్ద ఉన్నట్లు సమాచారం. -
విలీనంపై కాసేపట్లో ప్రకటన
చెన్నైః ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పన్నీర్సెల్వం గ్రూపు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం పళనిస్వామి అంగీకరిచడంతో విలీనం లాంఛనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మెమోరియల్ను సందర్శించి అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం. జయలలిత మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రెండు గ్రూపుల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి తన మంత్రివర్గ సభ్యులతో విలీనంపై చర్చించగా, పన్నీర్సెల్వం తన నివాసంలో సన్నిహిత నేతలతో సంప్రదింపులు జరిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్ గార్డెన్స్ నివాసాన్ని జయ మెమోరియల్గా మార్చాలనే పన్నీర్ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంతో ఇరు గ్రూపుల విలీనానికి మార్గం సుగమమైంది. -
పళని–పన్నీరు వర్గాల విలీనం!
-
పళని–పన్నీరు వర్గాల విలీనం!
అన్నాడీఎంకేలో వేగంగా మారుతున్న సమీకరణాలు ► దినకరన్ నియామకం చెల్లదని సీఎం నేతృత్వంలో పార్టీ తీర్మానం ► అమ్మ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని ప్రకటన ► శశికళకు వ్యతిరేకంగా గళం ∙15 లోపు విలీన ప్రకటన! సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య మంత్రి పళనిస్వామి– మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నియా మకం చెల్లదని సీఎం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రకటించింది. ఆయన తీసుకునే నిర్ణయాలతో పార్టీకి సంబంధం లేదంటూ గురువారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసింది. అలాగే... ‘అమ్మ’ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అని, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని శశికళకు వ్యతిరేకంగా గళాన్ని విప్పింది. మరోవైపు పన్నీరు శిబిరంతో విలీనంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తానికి ఈ నెల 15లోపు ఇరు వర్గాల విలీనం జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కార్యరూపం దాలుస్తుందని ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ ఇంకా తన నియంత్రణలోనే ఉందని అన్నాడీఎంకే చీఫ్ శశికళ మేనల్లుడైన దినకరన్ చెప్పారు. కాగా, అమ్మ పురచ్చితలైవి శిబిరానికి నిర్వాహకులుగా మరి కొందర్ని నియ మిస్తూ ఆయన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎం పళని స్వామిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దినకరన్ హెచ్చరించారు. కొత్త శిబిరంతో రాజుకున్న రగడ గతంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో పురచ్చితలైవి శిబిరం, సీఎం పళని స్వామి నేతృత్వంలో అమ్మ శిబిరంగా అన్నాడీఎంకే వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. తాజాగా, సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టేలా అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పావులు కదిపే పనిలో పడ్డారు. సీఎం మద్దతుదారులు ఎదురుదాడికి దిగడంతో అమ్మ పురచ్చితలైవి పేరుతో కొత్త శిబిరాన్ని దినకరన్ ప్రకటించారు. దీంతో అమ్మ శిబిరంలో వివాదం ముదిరింది. అలాగే, దినకరన్ దూకుడు పెంచి కొత్త కార్యవర్గాల్ని ప్రకటించే పనిలో పడ్డారు. ఫలితంగా దినకరన్కు చెక్ పెట్టేందుకు సీఎం పావులు కదిపారు. అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్నాడీఎంకే అమ్మ శిబిరం అత్యవసర కార్యవర్గ సమావేశానికి పళనిస్వామి గురువారం పిలుపు నిచ్చారు. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం సాగింది. రాష్ట్ర మంత్రులు, గతంలో జయలలిత ప్రకటించిన మేరకు అన్నాడీఎంకే కార్యవర్గంలోని 36 మందిలో 27 మంది హాజరయ్యారు. ఇందులో నలుగురు పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న దృష్ట్యా, గైర్హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు పన్నీరు సెల్వం శిబిరంలో ఉన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా ప్రకటించారు. ఇందులో కేవలం అమ్మ జయలలిత గతంలో నియమించిన కమిటీ మాత్రమే సంతకాలు చేసింది. ఆ మేరకు అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అని పేర్కొంటూ, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని ప్రకటించారు. ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని తీర్మానించారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పదవికి కొత్త వారిని ఎన్నుకొనే వరకే పరిమితమని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు. కాగా, శశికళ నియామకాన్ని తాము ఇంకా అంగీకరించలేదంటూ ఎన్నికల యంత్రాంగం వివరణ ఇవ్వడం గమనార్హం. ఢిల్లీలో కీలక ప్రకటన! ఇదిలా ఉండగగా, పళని స్వామి, పన్నీరు సెల్వం వేర్వేరుగా గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం అక్కడ జరిగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తదుపరి ఇరువురు నేతలూ కీలక ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. పన్నీరు డిప్యూటీ సీఎం! అమ్మ ఆశయ సాధనే లక్ష్యంగా ఒకే వేదికగా ముందుకు సాగుదామని మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరానికి ఈ సందర్భంగా పళని వర్గం పిలుపునివ్వడం కీలక పరిణామం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీ వైద్యలింగం మీడియాకు వివరించారు. పన్నీరు శిబిరం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తమకు ఆహ్వానం పలికే విధంగా అమ్మ శిబిరం స్పందిం చడంతో తదుపరి కార్యాచరణ దిశగా మద్దతుదా రులతో పన్నీరు మంతనాల్లో మునిగిపోయారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వెళతా మని ఆయన శిబిరం పునరుద్ఘాటించింది. దినకర న్తో చేతులు కలిపిన వారికి ఇది కనువిప్పని పన్నీరు మద్దతుదారుడు కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. విలీనానికి తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన దినకరన్పై వేటు నెరవేరిందన్నారు. విలీనమే జరిగితే పన్నీరు సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్టు తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్ని మునుస్వామి తోసిపుచ్చారు. -
పోతే.. పోనీ!
పళని గొడుగు నీడకు ఎమ్మెల్యే ఆరుకుట్టి n ఆయనే వచ్చారు..ఆయనే వెళ్లారన్న పన్నీరు n మద్దతుదారులతో మంతనాలు తనంతకు తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే..పోనీ.. అంటూ పళని పంచన చేరిన ఎమ్మెల్యే ఆరుకుట్టిని ఉద్దేశించి పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న వారినైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. పార్టీ వర్గాలతో ఆదివారం మంతనాల్లో మునిగినా, మళ్లీ చర్చల నినాదాన్ని పలువురు ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. సాక్షి, చెన్నై :సేలం ఆర్ ఆండ్ బి గెస్ట్ హౌస్ వేదికగా సీఎం పళని స్వామి నేతృత్వంలోని ఎమ్మెల్యే ఆరుకుట్టి అమ్మ శిబిరంలో చేరారు. మరికొందరు ఆయన బాటలో పయనిస్తారనే సమాచారంతో పన్నీర్సెల్వం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సీ ఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట 122 మంది, మాజీ సీఎం పన్నీ రు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం శిబిరంలో ఇటీవల అసంతృప్తి రాజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సైతం పన్నీరుకు తగ్గుతుండడంతో ఆ శిబిరంలోని నేతలు, ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. అసంతృప్తిని బయటపెడుతూ గౌండం పాళయం ఎ మ్మెల్యే ఆరుకుట్టి ఆ శిబిరం నుంచి బయటకు అడుగువేశారు. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని గతంలో ప్రకటించినప్పుడు అందులో అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు ఆ శిబిరం నుంచి బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ దృష్ట్యా, ఇక, ఆ శిబిరం నుంచి జంప్జిలానీల సంఖ్య ఇక పెరగడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. పళని పంచన ఆరుకుట్టి పన్నీరు శిబిరం నుంచి బయట పడ్డ ఆరుకుట్టి ఆదివారం ఉదయం సేలం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఉన్న సీఎం పళని స్వామిని కలుసుకున్నారు. తన మద్దతుదారులు, నియోజకవర్గ నేతలతో కలిసి అమ్మ శిబిరంలో చేరారు. అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు సాగుతానని ప్రకటించారు. ఇక, తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా హితం లక్ష్యంగా తాను అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నానని ఆరుకుట్టి ప్రకటించారు. తనవలే మరెందరో ఆ శిబిరంలో అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా అమ్మ ప్రభుత్వం వైపు రావడం ఖాయం అని ప్రకటించడం గమనార్హం. ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు.. ఆరుకుట్టి బాటలో మరికొందరు అమ్మ శిబిరంలోకి వెళ్లే అవకాశాలున్న సమాచారంతో పన్నీరు సెల్వం మేల్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంట కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. 12మందిలో మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తటస్థంగా ఉండగా, ఆరుకుట్టి హ్యాండిచ్చారు. ఇక, పన్నీరుతో పాటుగా సెమ్మలై, శరవణన్, మనోహరన్, మాణిక్యం, షణ్ముగనాథన్, చిన్నరాజ్, అరుణ్కుమార్, పాండియరాజన్, మనోరంజితం మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు అమ్మ గొడుగు నీడకు చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆరుకుట్టికి అమ్మ శిబిరంలో ఇచ్చే విలువ, ప్రాధాన్యత మేరకు ఈ నలుగురు జంప్ జిలానీ కావడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఆదివారం గ్రీన్ వేస్ రోడ్డులోని తన నివాసంలో ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగారు. ఇందులో కొందరు మళ్లీ అమ్మ శిబిరంతో చర్చలకు సిద్ధం అవుదామన్న నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. అందుకే కాబోలు పన్నీరు సెల్వం సమావేశం మధ్యలో బయటకు వచ్చేసి కారులో వెళ్లి పోవడం గమానార్హం. అంతకు ముందు ఆరుకుట్టి జంప్ గురించి మీడియా సంధించిన ప్రశ్నకు, ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు..పోతే పోనీ.. అంటూ పన్నీరు వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా, ఆగస్టు తర్వాత అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూపంలో ఏదేని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉండబట్టే, బలాన్ని పెంచుకునే విధంగా పన్నీరు శిబిరాన్ని పళని గురిపెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
పళని తంత్రం, దినకరన్ గప్చుప్!
► పన్నీరు సందిగ్ధం ► ఇక, ఆ ముగ్గురే తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి నోళ్లకు తాళం వేయడం లక్ష్యంగా సీఎం పళని స్వామి రాజకీయ తంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు గప్చుప్మని శనివారం సీఎం ఎదుట కూర్చోవడం ఇందుకు నిదర్శనం. ఇక, వివాదం రాజుకుంటుందని ఎదురుచూసిన పన్నీరు శిబిరం చివరకు సందిగ్ధంలో పడక తప్పలేదు. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విష యం తెలిసిందే. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కదిలారు. చిన్నమ్మ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదేశాలతో మిగిలిన వాళ్లు సీఎం పళని స్వామి వెన్నంటే ఉన్నా, తదుపరి పరిణామాలతో అక్కడినుంచి జారుకున్న వాళ్లు పెరిగారు. వీరంతా ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పక్షాన చేరారు. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచి మరీ విరుచుకుపడే పనిలో పడ్డారు. ఈ పరిణామాలు కాస్త సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టాయని చెప్పవచ్చు. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో కేంద్రం మెప్పుపొందే రీతిలో పళని స్వామి అడుగులు వేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మాజీ సీఎం పన్నీరు కూడా కోవింద్కే మద్దతు అన్నారు. అయిష్టంగా దినకరన్ వర్గం కూడా మద్దతు ప్రకటించింది. పళని మార్క్ పాలనపరంగా తన మార్క్ పడే రీతిలో ముందుకు సాగుతున్న పళని స్వామి, పార్టీలోనూ పట్టు సా«ధించే పనిలో ఉన్నారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు 34 మంది గళం విప్పడంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు రాజకీయ తంత్రాన్ని ప్రయోగించినట్టున్నారు. దినకరన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు అడపాదడపా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా..? అన్నట్టుగా స్పందిస్తుండటంతో రాత్రికి రాత్రే వారి నోళ్లకు తాళం వేయడం గమనించాల్సిన విషయం. చెన్నైలో మద్దతు సేకరణకు వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, గప్చుప్మని కూర్చొని సీఎం పళని స్వామి ప్రసంగాలకు చప్పుట్లు కొట్టి ఆహ్వానించడం విశేషం. అంతా పళని దారికొస్తారా..? దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలను అణచివేసే రీతిలో సీఎం తన తంత్రాన్ని ప్రయోగించడంతోనే వారంతా గప్చుప్ అయ్యారని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటుండటం ఆలోచించాల్సిందే. కాగా, కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పతే దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కేంద్రం వద్ద మార్కులు కొట్టే వ్యూహంతో ఉన్న పన్నీరు శిబిరాన్ని ఈ గప్చుప్ సందిగ్ధంలో పడేసినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ సీఎం వద్ద శరణు కోరే పరిస్థితులు మున్ముందు వస్తాయని, పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమ వైపునకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆ ముగ్గురు .. తమకు మిత్రపక్షంగా ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు పళని ప్రయత్నాల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనియరసు, తమీమున్ అన్సారీ, కరుణాస్ అన్నాడీ చిహ్నం మీద గెలిచారు. ఈ ముగ్గురు డీఎంకే వైపు తమ చూపును మరల్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరు కోవింద్ మద్దతు కార్యక్రమానికి కూడా దూరంగా ఉండటంతో, ఇక, వారిని దారిలో తెచ్చుకునేందుకు పళని తంత్రాన్ని ప్రయోగించబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తలా ఓ చిన్న పార్టీకి చెందిన ఈ ముగ్గురు తలొగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆర్కేనగర్ ఉచ్చు
► ‘కేసు’ మోత మోగేనా? ► సీఈసీ సిఫారస్సు ► ఇరకాటంలో సీఎం సహా ఆరుగురు ► నేడు కోర్టుకు విచారణ ఆర్కేనగర్లో నగదు బట్వాడా వ్యవహారం సీఎం పళని స్వామితో పాటు పలువురు మంత్రులు, అభ్యర్థి దినకరన్ మెడకు ఉచ్చుగా మారేనా.. అన్న ప్రశ్న బయలుదేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో పరిణామాలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల మోత మోగేనా అన్న ఉత్కంఠ బయలుదేరింది. ఇందుకు తగ్గ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్థానం భర్తీకి ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గెలుపు లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం దినకరన్, పురట్చి తలైవి శిబిరం మధుసూదనన్, ఎంజీయార్, అమ్మ దీప పేరవై దీప, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్..ఇలా 63 మంది తీవ్రంగానే కుస్తీ పట్టారు. అయితే, దినకరన్ తన అధికార, ధన బలాన్ని ప్రయోగించడం కేంద్ర ఎన్నికల కమిషన్లో ఆగ్రహాన్ని రేపింది. ఐటీ దాడుల్లో లభించిన ఆధారాలు సీఈసీ టేబుల్కు చేరాయి. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టుగా ఆధారాలతో నిరూపితం కావడంతో రాత్రికి రాత్రే ఉప ఎన్నిక రద్దయ్యింది. ఇంతవరకు అన్నీ బాగానే సాగినా, తదుపరి పరిణామాలతో దినకరన్ ఓ జట్టుగా, సీఎం పళనిస్వామి మరో జట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో కొనసాగే పరిస్థితి నెలకొంది. అలాగే, రెండాకుల చిహ్నం కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించి కటకటాల్లోకి సైతం దినకరన్ వెళ్లి రాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్కేనగర్ నగదు బట్వాడా ఉచ్చు ప్రస్తుతం అందరి మెడకు ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న తప్పడం లేదు. ఇందుకు తగ్గ పరిణామాలు చక చకా సాగుతున్నాయి. కేసు మోత మోగేనా చెన్నైకు చెందిన న్యాయవాది వైరకన్ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్ నగదు బట్వాడాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని సీఈసీని వివరాలు రాబట్టే యత్నం చేశారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో నగదు బట్వాడాపై పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. సమాచార హక్కు చట్టం మేరకు ఆయన కోరిన సమాచారాన్ని సీఈసీ అందజేసింది. ఇందులో పేర్కొన్న వివరాల మేరకు సీఎం పళనిస్వామి, మంత్రులు సెంగోట్టయన్, విజయభాస్కర్, సెల్లూరు రాజు, తంగమణి, వేలుమణి, అభ్యర్థి దినకరన్ మీద కేసు నమోదుకు సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇందుకు తగ్గ అధికారిక సమాచారం ఏ అధికారికి సీఈసీ నుంచి రానట్టు తెలిసింది. ఒకవేళ సీఈసీ సిఫారసు చేసి ఉన్నా, దానిని తుంగలో తొక్కినట్టు స్పష్టం అవుతోంది. న్యాయవాది వైరకన్నుకు మాత్రం తమ సమాచారంలో పూర్తి వివరాలను అందజేసి ఉండడం గమనార్హం. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా, సమగ్ర వివరాలను బెంచ్ ముందు ఉంచే అవకాశాలున్నాయి. సీఈసీ సిఫారసు సమాచారంతో సీఎంతో పాటు మంత్రులు, దినకరన్పై కేసుల్ని నమోదు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టే పనిలో ఉండడం గమనార్హం. ఈ విషయంగా డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల్ని నమోదు చేయాల్సిందేని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పురట్చి తలైవి శిబిరం ఎమ్మెల్యే పాండిరాజన్ పేర్కొంటూ, సీఈసీ కేసు నమోదుకు సిఫారసు చేయడం ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, హైకోర్టులో సాగే విచారణ మేరకు కేసుల మోత మోగేనా లేదా, వాయిదాల పర్వం సాగేనా..అన్నది వేచి చూడాల్సి ఉంది. -
చిన్నమ్మ ఉపదేశం
► ఐక్యత కోసం బంధువులకు లేఖాస్త్రం ► ఒకే వేదికగా దినకరన్, దివాకరన్ ► ఆధిపత్యానికి పళని పావులు ► దినకరన్కు చెక్ పెట్టే యోచన సాక్షి, చెన్నై: మనం.. మనం తన్నుకుంటే.. లాభం కమలం పెద్దలకు, సీఎం పళనికి మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలని బంధు జనానికి, కుటుంబీకులకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఐక్యతతో ముందుకు సాగాలన్న శశికళ పిలుపునకు ఆమె సోదరుడు దివాకరన్ స్పందించినట్టున్నారు. దినకరన్తో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక.. దినకరన్కు చెక్ పెట్టడం లక్ష్యంగా సీఎం పళనిస్వామి పావులు వేగంగానే కదుపుతున్నారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల ఎపిసోడ్ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు ఇంటిపోరు, మరోవైపు ముడుపుల వ్యవహారం వెరసి సీఎం పళని స్వామి ఇరకాటంలో పడే పరిస్థితి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి మద్దతిచ్చే యోచనతో పళని దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని తనకు ఆదేశాలు పంపిన ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్కు చెక్పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈనెల 21న పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సిన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనారిటీ విభాగం నేత, ఎంపీ అన్వర్ రాజకు పళనిస్వామి అప్పగించడం గమనించాల్సిన విషయం. పార్టీ వ్యవహారాల్లో దినకరన్ తలదూర్చేందుకు వీలు లేని రీతిలో పళని తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు బీజేపీకి అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ, పార్టీ తరపున ఒకటి రెండు రోజుల్లో ముందుగానే అధికారిక ప్రకటన చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ విప్ ముందుగా జారీ అయిన పక్షంలో, తలా ఓ దిక్కుగా ఉన్న ఎమ్మెల్యేలు ధిక్కరించరని పళనిస్వామి ధీమాగా ఉన్నారని చెప్పవచ్చు. లేఖాస్త్రం సీఎం పళని స్వామి దూకుడు పెంచడంతో బంధు జనాన్ని ఒకే వేదిక మీదకు తెచ్చే బాధ్యతను పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ తన భుజాన వేసుకున్నట్టున్నారు. అక్కడి నుంచి బంధు జనానికి లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఇందులో మనం.. మనం తన్నుకుంటే, లాభం ఢిల్లీలోని కమలం పెద్దలకు, రాష్ట్రంలోని సీఎం పళని స్వామికి మాత్రమేనన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే కాబోలు ఇన్నాళ్లు శశికళ సోదరుడు దివాకరన్ చెప్పినట్టుగా ఆడుతున్న ఎమ్మెల్యేలు పలువురు దినకరన్కు మద్దతుగా శనివారం పెదవి విప్పారు. ఈ ఇద్దరు ఇక ఏమైనట్టేనని, పళనిని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగడం తథ్యమన్న ధీమాను దివాకరన్, దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక, దినకరన్కు మద్దతుగా మరో ఎమ్మెల్యే కదలడంతో సంఖ్య 35కు చేరింది. మద్దతుదారులతో శనివారం కూడా సుదీర్ఘ చర్చలో దినకరన్ మునిగినా, సాయంత్రం బ్రేక్ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వాన్ని కూల్చే విధంగా తమ ప్రయత్నాలు ఉండబోదని, దినకరన్కు పార్టీ వ్యవహారాల అప్పగింత లక్ష్యంగా ఒత్తిడి పెంచనున్నామని ఆయన మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. -
మళ్లీ ఢిల్లీ బాట
► అన్నదాత సిద్ధం ► 18న పయనం ► ఈసారి గోచితో బైటాయింపు ► సీఎంతో అయ్యాకన్ను టీం భేటీ సాక్షి, చెన్నై: అన్నదాతలకు మద్దతుగా రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో మళ్లీ ఢిల్లీ వేదికగా పోరుబాట సాగనుంది. ఈనెల 18వ తేదీ రైతులు ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఇందులో భాగంగా బుధవారం సీఎంతో అయ్యాకన్ను నేతృత్వంలో ప్రతినిధులు భేటీ అయ్యారు. కరువు కోరల్లో చిక్కి తల్లడిళ్లుతున్న తమిళ రైతును ఆదుకోవాలని నినదిస్తూ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం నేత అయ్యాకన్ను ఢిల్లీ వేదికగా 41 రోజుల పాటుగా సాగించిన పోరుబాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఓ తమిళుడి నేతృత్వంలో వివిధ రూపాల్లో సాగిన ఈ నిరసన చర్చకు దారి తీసింది. ఎట్టకేలకు సీఎం పళనిస్వామి, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా పోరు బాటను గత నెలాఖరులో విరమించారు. ఆ సమయంలో కేంద్రానికి నెల రోజుల పాటుగా గడువు ఇచ్చారు. అంతలోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమిళ రైతును ఆదుకునే ప్రకటన చేయాలని విన్నవించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ పోరుబాటకు అయ్యాకన్ను బృందం సిద్ధమైంది. మళ్లీ ఢిల్లీకి : మళ్లీ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధపడ్డ అయ్యాకన్ను బృందం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఉదయం గ్రీన్ వేస్రోడ్డులోని ఇంట్లో సీఎంతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లను సీఎం ముందు ఉంచారు. మళ్లీ పోరుబాట సాగించనున్నామని స్పష్టం చేసి బయటకు వచ్చారు. ఈసందర్భంగా మీడియాతో అయ్యాకన్ను మాట్లాడుతూ రైతు సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకులు జప్తు నోటీసులు జారీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకులు జారీ చేసిన నోటీసులను పరిగణలోకి తీసుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. చెరకు రైతులకు బకాయిల చెల్లింపునకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇక, కేంద్రం మీద ఒత్తిడి పెంచే విధంగా మళ్లీ ఢిల్లీ బాటకు సిద్ధమయ్యామని తెలిపారు. ఈనెల 18వ తేదీ చెన్నై నుంచి గోచితో ఢిల్లీకి బయలు దేరనున్నామని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మూడు వందలకు పైగా రైతు సంఘాలతో ఇప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నామని, వారి మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డట్టు వివరించారు. ఢిల్లీ చేరగానే, అన్ని సంఘాలతో సమావేశం అనంతరం 21వ తేదీ పార్లమెంట్ లేదా, పీఎంవో ముట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, జంతర్ మంతర్ వద్ద గోచితో బైఠాయించి నిరసనల మరింత ఉధృతం చేస్తామన్నారు. -
అన్నాడీఎంకేలో మరో చీలిక?
చెన్నై: జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో మరో కీలక పరిణామం సంభవించబోతోంది. మాజీ మంత్రి తోపు వెంకటాచలం సహా అధికార పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వీరంతా కలిసి మరో చీలిక వర్గంగా ప్రకటించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీంఎం పన్నీరు సెల్వం వర్గాలు అన్నాడీఎంకే పార్టీలో పైచేయి కోసం పావులు కదుపుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మరో కుంపటి పెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఇక విలీన చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. -
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
-
ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ ఓ పన్నీర్ సెల్వం అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీన చర్చలలో భాగంగా ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, వీలైనంత త్వరలో పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మద్దతు లభించింది. అయితే ప్రస్తుతం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళ ఉన్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడే పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కూడా సాధ్యం కాని పనే అవుతుంది. ముందుగా ఎన్నికల కమిషన్కు గతంలో పళనిస్వామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్ను ఎన్నుకున్నట్లుగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నిక నిర్వహించి, అప్పుడు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలి. దీనంతటికీ ఎంత లేదన్నా రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా చేయడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేసి, పళని స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించడం లాంటి అవకాశాలను కూడా చర్చిస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంతవరకు తగ్గడం, రెండోది.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తు మీద పోటీ చేయడం.. తద్వారా జయలలిత వారసత్వం పూర్తిగా తమకు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడం. ఇదే లక్ష్యంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాల విలీనం జరిగితేనే ఇది సాధ్యమని.. ఎన్నికల కమిషన్ జూన్ 16 వరకు సమయం ఇచ్చినా ఈలోపే విలీనానికి సంబంధించిన లేఖలను కూడా ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల గుర్తును క్లెయిమ్ చేసుకుంటే మంచిదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకుల మధ్య చిన్న చిన్న విషయాలలో తప్ప చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
విలీనంపై నేటి నుంచి చర్చలు
-
విలీనంపై నేటి నుంచి చర్చలు
- అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు - పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దినకరన్ ప్రకటన సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్పై వేటుపడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దినకరన్, ఆయన కుటుం బ సభ్యులను పార్టీ, ప్రభుత్వ కార్యకలా పాల కు దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్ మంగళవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకే లోని వైరి వర్గాల విలీనంపై నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. అధికార వర్గానికి సీఎం ఎడపాడి పళనిస్వామి, మరో వర్గానికి మాజీ సీఎం పన్నీర్సెల్వం సారథ్యం వహిస్తూ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇరువురు నేతలు ముఖాముఖిగా చర్చలు జరపకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. చర్చలు ఫలప్రదమైన తరు వాత ఎడపాడి, పన్నీర్ కలుసుకునేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రిగా ఎడపాడి పళని స్వామి అనే కోణంలో చర్చలు ఆరంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి అనే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. వాంటెడ్ దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల కమిషన్కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ విదేశాలకు పారిపోకుండా ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దినకరన్ పేరును ‘వాంటెడ్’ (పోలీసులు గాలిస్తున్న వ్య క్తుల జాబితా) జాబితాలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్కు బుధ వారం రాత్రి 10.45 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న మైలాపూర్కు చెందిన దినకరన్ మద్దతుదారుడు రవిచంద్రన్ ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిం చగా అక్కడున్న వారు అతన్ని అడ్డుకున్నారు. పార్టీకి దూరంపై బాధలేదు: దినకరన్, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండా లని ఆదేశిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై నాకు బాధలేదు. పార్టీ చీలిపోకూడదన్నదే నా అభిమతం. నేను దూరంగా ఉండడం పార్టీకి మేలని భావిస్తే అందుకు కట్టుబడి ఉంటా. కోమాలో తమిళ సర్కార్: స్టాలిన్, ప్రతిపక్ష నేత సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కోమాలో ఉంది. తమిళనాట రైతు సమస్యలు, నీటి ఎద్దడి తాండవం చేస్తుంటే, పాలకులు వారి స్వలాభాన్ని చూసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర చాలని స్పీకర్కు వినతిపత్రం సమర్పించాం. ధర్మయుద్ధంలో తొలి విజయం ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎం కేను జయలలిత 29 ఏళ్లపాటు జయప్ర దంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల పార్టీగా తీర్చిదిద్దారు. అమ్మ మరణం తరువాత పార్టీని శశికళ కుటుంబ సభ్యుల కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడుకునేందుకే ధర్మయుద్ధం సాగిం చాను. రెండువర్గాలూ ఏకమయ్యే దిశగా సాగుతున్న ఈ పయనం మా ధర్మయు ద్ధానికి లభించిన తొలి విజయం. – పన్నీర్సెల్వం, మాజీ ముఖ్యమంత్రి -
పళని మార్క్
► భారీగా బదిలీలు ► సీఎస్ ఆదేశాలు సాక్షి, చెన్నై : పాలన మీద పట్టు సాధించే పనిలో ఉన్న సీఎం ఎడపాడి కే పళనిస్వామి అధికారుల బదిలీలను వేగవంతం చేశారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో పాటుగా పలువురు అధికారుల్ని రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. దీంతో పోలీసు విభాగంలో డీజీపీ మొదలు భారీగా బదిలీలు ఉండొచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో కసరత్తులు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం సీనియర్ ఐఏఎస్లతో పాటుగా మరి కొందరికి స్థాన చలనం కల్పించడం సచివాలయంలో చర్చకు దారి తీసింది. పళని మార్క్ పాలనలో భాగంగా భారీగా ఐఎఎస్ల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగం డైరెక్టర్గా ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సునిల్ పల్లివ్వాల్ను బదిలీ చేస్తూ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సి.కామరాజ్ను సునిల్ పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగానికి బదిలీ చేశారు. తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న టి.ఉదయచంద్రన్ ను పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న సబితను తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. తమిళనాడు మినరల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎం.వల్లలార్ను మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా, ఈ పదవిలో ఉన్న దయానంద్ కటారియను ట్రాన్స్ పోర్టు కమిషనర్గా, పరిశ్రమల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విక్రమ్ కపూర్ను ఎనర్జీ విభాగానికి, పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్య మిశ్రాను పరిశ్రమల శాఖకు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదాలో పబ్లిక్, రిహాబిలిటేషన్ విభాగంలో ఉన్న వి.పళనికుమార్ను తమిళనాడు టూరిజం చైర్మన్ గా, ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ బోర్డులో ఉన్న మహ్మద్ నజీముద్దీన్ ను పర్యావరణ, అటవీ శాఖకు బదిలీ చేశారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న వి.అన్బుసెల్వన్ ను చెన్నై జిల్లా కలెక్టర్గా, ఈ పదవిలో ఉన్న మహేశ్వరని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్గా నియమించారు. తండయార్ పేట డివిజన్ సబ్ కలెక్టర్గా ఉన్న పి.పొన్నయ్యను కాంచీపురం జిల్లా కలెక్టర్గా నియమించారు. తమిళాభివృద్ధి, సమాచార విభాగం కార్యదర్శిగా ఉన్న ఆర్.వెంకటేషన్ ను తమిళనాడు మినరల్స్కు, ట్రాన్పన్స్ పోర్టు కమిషనర్గా ఉన్న సత్యబ్రత సాహును పరిశ్రమలు, పెట్టుబడుల కార్పొరేషన్ కు చైర్మన్ గా, పర్యాటక శాఖ చైర్మన్ గా ఉన్న హర సహాయ మీనను సాల్ట్ కార్పొరేషన్, కాంచీపురం జిల్లా కలెక్టర్ ఆర్.గజలక్షి్మని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. -
ఇక మంత్రులకు కొత్త లగ్జరీ కార్లు
► సీఎం కేపీఎస్ దూకుడు ► కొత్త పథకాలకు శంకుస్థాపనలు ► హోంశాఖ కార్యదర్శి మార్పు ► ఢిల్లీకి మంత్రులు ► జీఎస్టీకీ ఆమోదంతో మైత్రీ రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటే, సీఎం ఎడపాడి పళని స్వామి కేబినెట్ లగ్జరీ సౌకర్యాలతో పాలనా వ్యవహారాల మీద దృష్టి పెట్టినట్టుందన్న విమర్శలు బయలుదేరాయి. మంత్రులకు ఆరు కోట్ల మేరకు ఖర్చుతో కొత్త కార్లను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక, పాలన మీద పట్టు సాధించే దిశగా దూకుడు పెంచే పనిలో పడ్డ పళనిస్వామి, తాజాగా ప్రారంభోత్సవాల వేదికను మార్చడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి బాధ్యతలు స్వీకరించి రెండు వారాలు అవుతోంది. ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, మరోవైపు పాలనా పరంగా పట్టుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం అమ్మ సుపరిపాలన నినా దంతో దూకుడు పెంచారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్లో కీలక అంశాలపై చర్చ సాగించి, అసెంబ్లీలో బడ్జెట్ దాఖలుకు కార్యచరణను సిద్ధం చేశారు. ఈనెల 22వ తేదీ సభలో బడ్జెట్ దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక, నీట్ పరీక్షకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద పంచాయతీ పెట్టేందుకు ఎనిమిది మంది మంత్రులతో కూడిన బృందాన్ని ఈనెల ఎనిమిదో తేదీన ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. అలాగే, శనివారం ఢిల్లీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి జయకుమార్ పాల్గొని, జీఎస్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటించేశారు. పాలన మీద దూకుడు, కేంద్రంతో మైత్రి లక్ష్యంగా ప్రయత్నాల్లో ఉన్న పళని స్వామి, అధికారుల్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు సిద్ధమైనట్టున్నారు. హోం కార్యదర్శి బదిలీ: కొన్నేళ్లుగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చిన అపూర్వ వర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో నిరంజన్ మార్టిన్ ను నియమించారు. మరి కొందరి బదిలీల మీద దృష్టి పెట్టడంతో ఐఏఎస్లలో ఉత్కంఠ పెరిగింది. హోంశాఖ కార్యదర్శిని ప్రాధాన్యత లేని పర్యాటక, దేవాదాయ శాఖకు బదిలీ చేసిన నేపథ్యంలో ఇక, డీజీపీ రాజేంద్రన్ ను కూడా మార్చేస్తారేమో అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది. లగ్జరీగా : అధికారం మీద పట్టులో భాగంగా మంత్రులు చేజారకుండా, అందరికీ కొత్త వాహనాలు అప్పగించి విమర్శలను కొని తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు మంత్రులు వాడుతున్న వాహనాలన్నీ కొత్తగానే ఉన్నాయి. ఆగమేఘాలపై 30 మంది మంత్రులకు తలా రూ. పదిహేను నుంచి 20 లక్షల మేరకు వెచ్చించి కొత్త వాహనాలను అప్పగించడం ఆలోచించాలి్సందే. రాష్ట్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ కొత్త కార్లు అవసరమా అని ప్రశ్నించే వాళ్లూ పెరిగారు. ఇక, ఈ కార్లకు 9999, 6666, 9000 వంటి ఫ్యాన్సీ నంబర్లను తగిలించి ఉండడం గమనించాలి్సన విషయం. మారిన వేదిక : అమ్మ జయలలిత, పన్నీరు సెల్వం సీఎంగా ఉన్నప్పుడు, సచివాలయం వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాలు జరిగేవి. తాజాగా, కొత్త సీఎం వేదికను మార్చడం గమనార్హం. ఈ వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో రూ.1,486 కోట్ల మేరకు కొత్త పథకాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, పలు విభాగాల్లోని అధికారులకు వాహనాల పంపిణీ కార్యక్రమాలు సాగడం గమనార్హం. -
సుదీర్ఘ చర్చ!
► పలు అంశాలపై సమీక్ష ► రెండు గంటల పాటు కేబినెట్ భేటీ ► మూడో వారంలో బడ్జెట్ ఈ నెల మూడో వారంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో తీసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు గంటల పాటు కేబినెట్ భేటీ శుక్రవారం సాగడంతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే పళనిస్వామి బాధ్యతలు చేపట్టినానంతరం పాలన మీద పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడడంతో అందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఇందుకుగాను శుక్రవారం కేబినెట్ మీటింగ్కు పిలుపు నిచ్చారు. సచివాలయంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి వర్గం భేటీ అయింది. ముందుగా దివంగత సీఎం జయలలిత చిత్ర పటం వద్ద నివాళులర్పించినానంతరం మంత్రి వర్గ సమావేశం ప్రారంభవైుంది. రెండు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చతో ఈ సమావేశం సాగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, శాఖల వారీగా నిధుల కేటాయింపులు మీద సమీక్షించి ఉన్నారు. ఈనెల మూడో వారం సభలో బడ్జెట్ దాఖలుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో తేదీని అసెంబ్లీ కార్యదర్శి మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక, హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా, ఏడోవ వేతన కమిషన్ సిఫారసుల పరిశీలనకు నియమించిన కమిటీ అధికారాలు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, కరువు ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేందుకు తగ్గ చర్యల వేగవంతం, ప్రధాన ప్రతి పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ అస్త్రాలపై కూడా చర్చించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, రాష్ట్రంలో అప్పులు, నిధుల వనరుల మీద సమీక్షించి ఉన్నారు. -
పళని బిజీ
► కేంద్ర మంత్రులతో భేటీలు ► వినతి పత్రాల సమర్పణ ► కొన్నింటికి ఆమోదం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి మంగళవారం ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులపై వినతి పత్రాలను సమర్పించారు. హార్బర్–మధురవాయిల్ ఎక్స్ప్రెస్ వే, ఈసీఆర్ విస్తరణ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు మంత్రులు హామీలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు ఆదివారం రాత్రి ఎడపాడి కే పళని స్వామి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులు జయకుమార్, ఉడుమలై కే రాధాకృష్ణన్, సీవీ షణ్ముగం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో కలిసి రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో సీఎం పళనిస్వామి బిజీ అయా్యరు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం మంగళవారం మరింత బిజీ అయ్యారు. ఉదయాన్నే తన మంత్రులతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సహాయ కార్యదర్శి పొన్ రాధాకృష్ణన్ టీ అయా్యరు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారుల విస్తరణ, కొత్త రోడ్లు, హార్బర్ పనులను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఇందులో చెన్నై హార్బర్–మధురవాయిల్ ఎక్స్ప్రెస్ వే, ఈసీఆర్ రోడ్డు విస్తరణ, మధురై అవుటర్ రోడ్డు, రెండు వందల కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి విస్తరణ తదితర పనులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వే, ఈసీఆర్, జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు. లక్ష గృహాలు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో సీఎం పళనిస్వామి భేటీ అయా్యరు. చెనై్నలో సాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు నిధుల కేటాయింపులు, కొత్త మార్గాలు, విమ్కో నగర్ వరకు విస్తరణ పనులకు నిధులు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోయంబతూ్తరు, మధురై నగరాలో్లనూ మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు తగ్గ వినతి పత్రాన్ని సమర్పించారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి నిధులు, చెన్నైలో లక్ష గృహాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చెనై్నలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు మరిన్ని కొత్త పథకాల కోసం విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తామని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తోనూ పళనిస్వామి భేటీ అయా్యరు. నీట్ పరీక్షలకు తమిళనాడును నినహాయించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి త్వరితగతిన చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీకి పళని
నేడు మోదీతో భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి ఆదివారం రాత్రి ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఏడపాడి పళనిస్వామి నిర్ణయించారు. రాష్ట్రంలో హైడ్రో కార్బన్ మంటలు, మిథైన్ తవ్వకాల సెగలు ఓ వైపు సాగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా మేఘదాతులో కర్ణాటక డ్యాం నిర్మాణ పనుల వేగం పెరిగింది. అలాగే, రాష్ట్రానికి రేషన్ ఠిలం అవుతుండడం వెరసి ఎడపాడి పళని స్వామి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అలాగే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం రాజుకునే అవకాశాలు ఉండడంతో, ఇక్కడి సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదికను సీఎం సిద్ధం చేసుకున్నారు. అలాగే, రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్న దృష్ట్యా, నివారణ నిధి, వర్దా రూపంలో ఎదురైన నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా నిధుల్ని రాబట్టేందుకు తగ్గ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడానికి నిర్ణయించారు. అలాగే, తన ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే తీవ్రంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కేంద్రం మద్దతును కూడగట్టుకునేందుకు తగ్గ అస్త్రాలతో ఢిల్లీ పర్యటనకు ఎడపాడి సిద్ధవైునట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ భేటీ నిమిత్తం రాత్రి ఏడున్నర గంటలకు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తదితర అధికారులు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో ఆయనకు గౌరవ వందన సమర్పించేందుకు, ఆహ్వానం పలికేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి అక్కడే బస చేసి ఎడపాడి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చే పిలుపు మేరకు భేటీ కానున్నారు. ప్రధానమంత్రి మోదీకి సమర్పించేందుకు నివేదిక రూపంలో వినతి పత్రాన్ని సిద్ధం చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ఎడపాడి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం లేదా రాత్రికి చెనై్నకు తిరుగు పయనం అవుతారు. ఇక, నెడువాసల్ వేదికగా జరుగుతున్న హైడ్రో కార్బన్ వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారితో బుధవారం భేటీకి ఎడపాడి నిర్ణయించారు. కేంద్రం ఇచ్చే హామీ మేరకు ఉద్యమకారుల్ని ఆయన బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి. -
ఇక సమరమే!
► స్టాలిన్ దూకుడు ► 22న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ►భవిష్యత్ కార్యాచరణ ► ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు అసెంబ్లీ వేదికగా పళని స్వామి ప్రభుత్వంతో సమరానికి సై అన్న, డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి స్టాలిన్ దూకుడున ప్రదర్శించేందుకు నిర్ణయించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా వ్యూహాల్ని రచించారు. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనల దీక్షకు స్టాలిన్ పిలుపునిచ్చారు. పళనిస్వామి ప్రభుత్వం ఇక, ప్రధాన ప్రతి పక్షాన్ని ఎలా ఢీ కొననుందో అన్న ఉత్కంఠ బయలు దేరింది. సాక్షి, చెన్నై : ప్రధాన ప్రతి పక్షం అంటే, ఇక, ఇలాగే ఉంటామన్నట్టుగా అసెంబ్లీలో డీఎంకే ప్రదర్శించిన ఆక్రోశం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ లో డీఎంకే సృష్టించిన వీరంగం కంటే, స్టాలిన్ మీద జరిగిన దాడి చర్చనీయాంశంగా మారింది. చిన్నమ్మ శశికళ మీద ప్రజల్లో ఆగ్రహం తాండవం చేస్తున్న దృష్ట్యా, వారి సేనలకు వ్యతిరేకంగా స్టాలిన్ ఎమ్మెల్యే బృందం ప్రదర్శించిన వ్యూహాలను ఆహ్వానించే ప్రజానీకం ఎక్కువే. ఇక, రాజకీయ పక్షాలు సైతం స్టాలిన్ మీద జరిగిన దాడిని తీవ్రంగానే ఖండిస్తున్నాయి. పీఎంకే యువనేత అన్భుమణి, ఎండీఎంకే నేత వైగో మినహా మెజారిటీ శాతం మంది డీఎంకే చర్యలను సమర్థిస్తున్నారు. బలపరీక్షలో స్పీకర్ తీరును, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అయితే, ఈ దాడిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ను తెర మీదకు తీసుకురావడం గమనార్హం.అలాగే, స్పీకర్ కుల ప్రస్తావనతో సభలో వ్యాఖ్యలు చేయడాన్ని డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. అలాగే సభా నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ ఓటింగ్ నిర్వహించలేదని మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్, పి.పి.దొరైస్వామి వ్యాఖ్యానించడం, స్పీకర్ తీరును దుయ్యబట్టడం డీఎంకెకు కలసి వచ్చే అంశంగా మారాయి. ప్రతి పక్షాలన్నీ తమకు మద్దతుగా స్పంది స్తుండడంతో ఇక, తన మీద పథకం ప్రకారం దాడి జరిగి ఉండడం వెలుగులోకి రావడం, ఇందులో తొమ్మిది మంది ఐపీఎస్ల హస్తం ఉన్నట్టు తేలడాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. అసెంబ్లీ నిబంధనల్ని ఉల్లంఘించి, మార్షల్స్ ముసుగులో చొరబడ్డ తొమ్మిది మంది ఐపీఎస్ల చర్యల్ని, స్పీకర్ ధనపాల్ రచించిన వ్యూహాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఇక సమరమే అని దూకుడు పెంచేందుకు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు: స్పీకర్ చర్యలు ఓ వైపు ఉంటే, మరో వైపు సభలో అన్నాడీఎంకే సభ్యుల మెజారిటీ లెక్కలు తేలడం లేదన్న ప్రచారం ఊపందుకుని ఉండడాన్ని ఆసరాగా చేసుకుని, మళ్లీ బల పరీక్ష లక్ష్యంగా వ్యూహ రచనల్లో స్టాలిన్ నిమగ్నం అయ్యారు. ఇందుకుగాను, ఆదివారం ఉదయం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించా రు. ఇక, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా దూకుడు ప్రదర్శించేందుకు నిర్ణయించారు. బల పరీక్షలో నెగ్గిన విశ్వాస తీర్మానం ఆమోదించ వద్దు అని, దానిని రద్దు చేసి మళ్లీ పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్కు విన్నవించుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం డీఎంకే ఎంపీలు తిరుచ్చిశివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ రాజ్భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్రావుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తన మీద జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాలిన్ ప్రకటన విడుదల చేయడం, తదుపరి దాడికి నిరసనగా ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు పిలుపు నివ్వడం బట్టి చూస్తే దూ కుడు మరింతగా పెరినట్టే అన్నది స్పష్టం అవుతోంది. ఆ రోజున ఉద యం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష సాగనుంది. దాడిని ఖండించే వాళ్లు, సభలో డీఎంకే చర్యల్ని సమర్థించే ప్రజానీకం ఈ నిరసనదీక్షకు తరలి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జిని కలిసేందుకు ప్రయత్నాలు చేపట్టడం, చివరగా కోర్టుకు సైతం వెళ్లేందుకు డీఎంకే కసరత్తు చేసి ఉండడం గమనార్హం. కేసు నమోదు: స్టాలిన్ తన దూకుడుతో ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు ఉరకలు తీస్తుంటే, మరో వైపు పోలీసులు కేసుల నమోదుకు సిద్ధం అయ్యారు. మెరీనా తీరంలో అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారని, ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం సృష్టించారని పేర్కొంటూ, స్టాలిన్ తో , ఇద్దరు ఎంపీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో పాటుగా మొత్తంగా రెండు వేల మంది పై కేసులు రెండు సెక్షన్లలో నమోదు కావడం గమనార్హం. రవిచంద్రన్ కు స్టాలిన్ పరామర్శ: మార్షల్ దురుసుతో గాయపడ్డ ఎగ్మూర్ ఎమ్మెల్యే రవిచంద్రన్ ను డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పరామర్శించారు. నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించి, కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో డీఎంకే సభ్యుల గెంటి వేత ఉద్రిక్తతకు దారితీసిన సమయంలో రవిచంద్రన్ గాయపడ్డారు. -
ఫలించని పన్నీర్ సెల్వం తిరుగుబాటు
-
బలపరీక్ష ఎప్పుడు పెట్టినా ఇంతే!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడం, స్పీకర్ చొక్కా చించి అవమానించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తనకు జరిగిన అవమానానికి తాను ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ముందున్న టేబుల్ను పడగొట్టేసి, ఆయన కుర్చీలో కూర్చుని, బెంచీల మీదకు ఎక్కి, స్పీకర్ను నెట్టేసి.. ఇలా పలు రకాలుగా విధ్వంసం సృష్టించడంతో సభను దాదాపు గంట సేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు డీఎంకే సభ్యులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. వాళ్లను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్కు సూచించారు. అయితే డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. -
బలం ఎవరికో?
► అప్రమత్తంగా పళని ► చివరి ప్రయత్నంలో పన్నీరు ► వ్యతిరేకంగా డీఎంకే ఓటు ► కాంగ్రెస్ నాన్చుడు ► గతం పునరావృతం అయ్యేనా? ► సర్వత్రా ఉత్కంఠ ‘గవర్నర్ ఛాన్స్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, బల నిరూపణ లక్ష్యం’ ఇందులో కే పళనిస్వామి సత్తా చాటేనా, పన్నీరు ప్రయత్నాలకు బలి అయ్యేనా..! అన్న హైటెన్షన్ తమిళనాట నెలకొంది. మరికొన్ని గంటల్లో తేలనున్న బలనిరూపణ మీద తమిళ ప్రజానీకం దృష్టి పడింది. ఈ పరీక్షలో పళని నెగ్గేనా..? గతం పునరావృతం అయ్యేనా..! అన్న ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధికార సమరం క్లైమాక్స్కు చేరింది. చిన్నమ్మ శిబిరమా..? పన్నీరు శిబిరమా..?అని ఆసక్తికరంగా సాగిన ఎపిసోడ్లో శనివారం క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠలో తమిళనాడే కాదు, ప్రపంచ దేశాల్లోని తమిళుడు ఎదురు చూపుల్లో పడ్డారు. కీలక మలుపు తిరిగేనా.. అన్న ఉత్కంఠ సర్వత్రా బయలు దేరింది. చిన్నమ్మ శశికళ విధేయుడు కే పళని స్వామి సీఎం పగ్గాలు చేపట్టిన మూడో రోజు జరగనున్న అసెంబ్లీ వేదికగా జరగనున్న బల పరీక్షలో తీర్పు అనుకులమా...? ప్రతి కూలమా..? అన్న చర్చ శుక్రవారం రాష్ట్రంలో జోరందుకుంది. ఎక్కడ చూసినా అవిశ్వాస చర్చే. బల నిరూపణ లక్ష్యంగా పళని స్వామి తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా అప్రమత్తంగానే వ్యవహరించారు. కూవత్తూరు క్యాంప్నకు చేరుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడారు. చిన్నమ్మ శశికళ సైతం పరప్పన అగ్రహారం చెర నుంచి ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని పళని విస్మరించినట్టు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపింది. బలపరీక్షలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగుర వేయకుండా, విప్ను సైతం పళని జారీ చేయించడం గమనార్హం. ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నా, శాసన సభలో తిరగబడ్డ పక్షంలో పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన పళనిని వీడడం లేదు. చివరి ప్రయత్నంలో పన్నీరు బల నిరూపణలో పళని పతనం లక్ష్యంగా చివరి ప్రయత్నాల్లో పన్నీరు శిబిరం నిమగ్నమైంది. బహిరంగ ఓటింగ్ కాకుండా రహస్య ఓటింగ్ సాగే విధంగా చర్యలకు స్పీకర్ ధనపాల్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తమకు ప్రతికూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న ఆరోపణల్ని సైతం ఆ శిబిరం గుప్పించడం గమనార్హం. శిబిరంలోని ముఖ్య నాయకులతో పన్నీరు సెల్వం సమాలోచనలతో రాజకీయ పావుల్ని కదపడంలో తీవ్రంగానే నిమగ్నం అయ్యారు. కూవత్తూరు క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు దారులతో సంప్రదింపులు సాగించినట్టు, సభలో పళనికి వ్యతిరేకంగా వ్యవహరించే విధంగా విజ్ఞప్తి చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, అన్నాడీఎంకే తమదేనని చాటుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం పళని స్వామిలతో పాటుగా పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో పన్నీరు శిబిరం చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవడం, వివరణ కోరుతూ శశికళ శిబిరానికి ఆదేశాలు ఇవ్వడం పన్నీరు శిబిరంలో కాస్త ఆనందాన్ని నింపింది. అయితే, క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేలు సభలో ఎలా వ్యవహరిస్తారోనన్న కలవరం పన్నీరు శిబిరాన్ని వెంటాడుతున్నది. ఇక , మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తమ శిబిరంలో అడుగు పెట్టడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు తప్పకుండా పన్నీరును ఆదరిస్తారన్న ఆశాభావం పెరిగి ఉన్నది. వ్యతిరేకంగా డిఎంకే : సభలో పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిఎంకేతో పాటుగా, మిత్ర పక్షం ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్నిర్ణయం ఢిల్లీకి చేరడంతో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. గతం పునరావృతం అయ్యేనా : ముఫ్పై సంవత్సరాల తదుపరి తమిళ అసెంబ్లీలో శనివారం బల పరీక్ష జరగనున్నది. తన బలాన్ని నిరూపించుకునేందుకు సీఎం పళని స్వామి సిద్ధం అయ్యారు. సరిగ్గా పద కొండు గంటలకు సభ ప్రారంభం కానున్నది. బల నిరూపణలో రహస్య ఓటింగ్ సాగేనా, లేదా బహిరంగంగానే ఓటింగ్తో ఏదేని వివాదాలు సభలో రాజుకునేనా అన్న ఆందోళన బయలు దేరి ఉన్నది. ఇప్పటి వరకు బల పరీక్షల్లో సీఎంలుగా ఉన్న రాజాజీ, కరుణానిధి నెగ్గారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడిఎంకేలో అధికారం కోసం తీవ్ర సమరమే సాగింది. ఆయన సతీమని జానకీ రామచంద్రన్, జయలలిత మధ్య సాగిన ఈ సమరంలో జానకీ రామంద్రన్ కు అనుకూలంగా ఫలితం వచ్చింది. అయితే, సభలో కుమ్ములాట, ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్రపతి పాలన వైపుగా అడుగులు పడేలా చేశాయి. ఇదే పరిస్థితి తాజాగా పునరావృతం అయ్యేనా...? లేదా, రాజాజీ, కరుణానిధిలు నెగ్గినట్టుగా పళని స్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచేనా అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది. -
ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!
గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం కల్పించారు.. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. అంతవరకు బాగానే ఉంది గానీ, అసెంబ్లీలో బలం నిరూపించుకునే విషయం వచ్చేసరికి మాత్రం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిసార్టులో ఉన్న మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా తనకు మద్దతిస్తారన్న నమ్మకం లేకపోవడమే ఈ ఆందోళనకు కారణం. అందుకే ఆయన చిన్నమ్మ శశికళను చూసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లాల్సిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ అయిన నటరాజ్ శుక్రవారం ఉదయమే ముందుగా పళనిస్వామికి ఝలక్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తాను అమ్మ ఫొటో పెట్టుకుని గెలిచానని, అందువల్ల అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన చెప్పారంటున్నారు. కావాలంటే అమ్మ ఫొటోతో మరోసారి ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామం కారణంగానే పళనిస్వామి బెంగళూరు వెళ్లడం మానుకుని నేరుగా రిసార్టుకు వెళ్లి అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డారంటున్నారు. సెంగొట్టియాన్ లాంటి వాళ్లకు మంత్రిపదవి ఇవ్వడం కూడా అమ్మ భక్తులైన కొంతమంది ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇంతకుముందు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్న సెంగొట్టియాన్కు, రెండోసారి వరుసగా ఎన్నికైన జయలలిత తన కేబినెట్లో అవకాశం కల్పించలేదు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలే అందుకు కారణం. అలాంటి వ్యక్తికి పళనిస్వామి రెడ్కార్పెట్ పరవడం, శశికళ కుటుంబ సభ్యులు కూడా పార్టీ పైన, ప్రభుత్వంలోను పట్టు పెంచుకోవడం లాంటి పరిణామాలను అమ్మ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్లు ఎదురు తిరిగే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఒక్క నటరాజ్ మాత్రమే కాక.. దాదాపు మరో 18 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రిసార్టులో ఎదురు తిరిగినట్లు సమాచారం. ఇదే జరిగితే పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అయితే, నిజంగానే ఈ 18 మంది ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేదా అన్నది మాత్రం బలపరీక్ష తర్వాతే తెలియాల్సి ఉంది. పన్నీర్ క్యాంపులో ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. పళనిస్వామితో కలిపి ఆ వర్గానికి 124 మంది బలం ఉంది. మేజిక్ ఫిగర్ 117. అంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో కనీసం 117 మంది అనుకూలంగా ఓటు వేస్తే తప్ప పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండదు. ఉన్న 124 మందిలో ఒక్క ఎనిమిది మంది అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం కూడా ఉండబోదు. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయి ఉంటే, ఆ ప్రభుత్వాన్ని పడగొడితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు పన్నీర్కు సానుభూతి కూడా పెరుగుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడున్నది మాత్రం శశికళ వర్గీయుడైన పళనిస్వామి కాబట్టి.. ప్రజల్లో ఆ వర్గం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టినా పెద్ద నష్టం ఉండబోదు. అన్నాడీఎంకే ఎటూ రెండు వర్గాలుగా చీలిపోతోంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో సులభంగా తాము గెలిచి రాజమార్గంలో అధికారం చేపట్టవచ్చన్నది స్టాలిన్ వ్యూహంలా కనిపిస్తోంది. ఎటూ కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకే మిత్రపక్షమే కాబట్టి వాళ్లది కూడా అదే నిర్ణయం కావచ్చు. -
చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని
పన్నీర్ని ఒంటరిని చేసిన వైనం చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పురచ్చి తలైవి జయలలిత సమాధి వద్ద నిచ్చెలి చిన్నమ్మ చేసిన శపథంలో మొదటి ఘట్టం విజయవంతమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సీఎం పీఠం దక్కకుండా చేశారు. శశికళ నమ్మిన బంటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిగంటలకే బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఈనెల 18 తేదీనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు.. అదే రోజు బలాన్ని నిరూపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఇచ్చిన 15 రోజుల గడువును కేవలం రెండు రోజులకే కుదించి తన రాజకీయ చతురతను ప్రద ర్శించారు. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల సమయాన్ని సద్వి నియోగం చేసుకొని రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చని భావించిన సెల్వానికి సీఎం ఊహించని షాక్ ఇచ్చారు. జైలు నుంచే చక్రం తిప్పారా? శశికళ జైలుకు వెళ్లినా పన్నీర్కు పదవి దక్కకుండా చేసి తొలిపంతం నెగ్గించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లే ముందే వ్యూహాత్మకంగా తన అనుచరులకు దిశా నిర్దేశం చేసి వెళ్లడం... ఆ తరువాత సీఎం, మంత్రులు ప్రమాణం చేయడంతో చిన్నమ్మ కారాగారం నుంచి ప్రభుత్వాన్ని నడపనుందని తేలిపోయింది. -
పీఎస్లో చోరీ ... కానిస్టేబులే దొంగ
చెన్నై : తాను పనిచేస్తున్న పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ చోరీకి పాల్పడిన చిత్రమైన సంఘటన తిరుపూరులో జరిగింది. తిరుపూరు నల్లూరు రూరల్ పోలీస్స్టేషన్లోని సిబ్బంది హాజరీ రిజిస్టరు పుస్తకం గత నెల చోరీకి గురైంది. చోరీ కేసును పరిశీలిస్తున్న పోలీసులు స్టేషన్లోని సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నోళ్లు వెళ్లబెట్టారు. గత నెల 28వ తేదీ తెల్లవారుజాము 5.45 గంటలకు అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే పళనిస్వామి అనే కానిస్టేబుల్ స్టేషన్లోకి జొరబడి రిజిస్టరునుఎత్తుకె ళ్లడం అందులో రికార్డు అయి ఉంది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు రిజిస్టరులో అతనికి అబ్సెంట్ మార్క్ వేశారు. ఈ అబ్సెంట్ను కప్పిపుచ్చుకునేందుకే రిజిస్టరును దొంగిలించినట్లు తేలింది. పళనిస్వామి ఇంటి నుంచి సోమవారం నాడు రిజిస్టరును స్వాధీనం చేసుకున్నారు. గతంలో పనిచేసిన పోలీస్స్టేషన్లలో సైతం ఇన్స్పెక్టర్ తుపాకీని, మహిళా కానిస్టేబుల్ సెల్ఫోన్ను దొంగిలించిన నేర చరిత్ర ఉంది. సదరు కానిస్టేబుల్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.