Phones
-
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్టాప్లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్టాప్లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్వాచ్లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ఫోన్లో లభిస్తుంది. -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్లు వాడే ఫోన్లు, నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!
ముంబై: కై–ఓఎస్ ప్లాట్ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ కీప్యాడ్తో జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్తో పాటు రిలయన్స్ డిజిటల్డాట్ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 2.4 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
ఫోన్ల వాడకంపైనే ప్రశ్నలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరసగా రెండోరోజు మంగళవారం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై సుమారు పది గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రధానంగా పది ఫోన్లు వినియోగించారన్న ఆరోపణలపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తుగ్లక్ రోడ్లోని నివాసం నుంచి భర్త అనిల్ వెంట రాగా బయటకు వచ్చిన కవిత.. మీడియాకు విజయ సంకేతం చూపుతూ ఈడీ కార్యాలయానికి బయలు దేరారు. ఈడీ తన చార్జిషీటులో కవిత 6209999999 నంబరును ఆరు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న ఆరు ఫోన్లలో, 8985699999 నంబరును నాలుగు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న నాలుగు ఫోన్లలో వినియోగించారని ఆరోపించింది. దీంతో ఆ పది ఫోన్లను కవిత మంగళవారం ఈడీకి అందజేశారు. మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రశ్రేణి నేతలతో కవిత సంభాషించారని, పాలసీ విధానం ముందుగానే వాట్సాప్లో లీకయిందన్న ఆరోపణల నేపథ్యంలో కవిత ఫోన్లు పరిశీలించే నిమిత్తం వాటిని తీసుకురావాలని కోరినట్లు తెలిసింది. కాగా కవిత నుంచి తీసుకున్న ఫోన్లను క్లోనింగ్ నిమిత్తం పంపినట్లు సమాచారం. మూడు వాంగ్మూలాలపై సంతకాలు దర్యాప్తు అధికారి జోగిందర్, ఓ మహిళా అధికారి సహా మరో ముగ్గురు అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ ఫోనును ఎప్పుడు వినియోగించారు? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వినియోగించారు? తక్కువ కాలంలో ఎక్కువ ఫోన్లు వినియోగించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే కోణంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మొత్తం మూడుసార్లు విచారణ సందర్భంగా మూడు వాంగ్మూలాలు నమోదు చేసిన ఈడీ అధికారులు వాటిపై కవితతో పాటు ఆమె న్యాయవాది సంతకాలు కూడా తీసుకున్నట్టు సమా చారం. ఇలావుండగా ఇంతకుముందే ఒక ఫోన్ను ఈడీకి ఇచ్చిన కవిత.. ఈరోజు 10 ఫోన్లు ఇవ్వడంతో మొత్తం 11 ఫోన్లు ఇచ్చినట్టయ్యింది. నేడు విచారణ లేనట్టేనా? విచారణ అనంతరం రాత్రి 9.40 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. పిడికిలి ఎత్తి, విజయ సంకేతం చూపుతూ, చిరునవ్వుతో శ్రేణులకు అభివాదం చేస్తూ నివాసానికి చేరుకున్నారు. తదుపరి విచారణ తేదీని ఈడీ ఇంకా ప్రకటించలేదు. అయితే బుధవారం విచారణకు రమ్మనలేదని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఈడీ కార్యాలయానికి భరత్ కవితను విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవిత విజ్ఞప్తి మేరకే ఈడీ అధికారులు భరత్ను పిలిచినట్లు తెలిసింది. అయితే కవిత తరఫున తదుపరి విచారణలో పాల్గొనడానికి సంబంధించిన ప్రక్రియ నిమిత్తం పిలిచారా? లేక కవిత న్యాయవాది సమక్షంలో సమాధానాలు చెబుతానంటే పిలిచారా? అనేది తెలియలేదు. -
ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ..
న్యూఢ్లిలీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడో రోజు విచారణకు ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్లు ధ్వంసం చేశానని తనపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను అధికారులకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? అని ప్రశ్నించారు. 'దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది. కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఏమీ అడగకుండానే ఏ పరిస్థితుల్లో, ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం.' అని కవిత లేఖలో ఘాటు విమర్శలు చేశారు. చదవండి: ఈడీ ముందుకు మూడోసారి.. పాత ఫోన్లన్నీ అప్పగించిన కవిత.. -
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
టార్గెట్ సెల్ఫోన్స్ ! ఏటా వేల సంఖ్యలో గల్లంతు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి. కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు... రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల పిక్పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ.... ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. పెండింగ్ భయంతోనే అధికం... జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు. (చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్) -
‘నో ఫోన్’ జోన్లుగా టెన్త్ పరీక్ష కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. దీంతో పాటు టెన్త్ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. గతంలో జారీ చేసిన సూచనలకు కొనసాగింపుగా.. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సూచనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కొత్త నిబంధనలివీ.. ► పరీక్షల విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, నాన్ టీచింగ్, ఇతర శాఖల సిబ్బంది (ఏఎన్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్లు సహా పోలీసు సిబ్బంది) పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు. ► స్మార్ట్ వాచ్లు, డిజిటల్ వాచ్లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, ఫిట్నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలి. సిబ్బంది లేదా అభ్యర్థుల వద్ద పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఏదైనా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలి. ► మిగిలిన పరీక్షల కోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ల జంబ్లింగ్ను సమీక్ష చేయాలి. వారు పనిచేసే పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా ఉండకుండా చూసుకోవాలి. ► పరీక్ష కేంద్రంలోని మిగిలిన అన్ని ప్రశ్న పత్రాలను సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డీవో, ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేసిన పేపర్ సీల్తో సీలు చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. ► పరీక్ష హాల్లో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసిన వెంటనే అందులోని అన్ని పేజీలలో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం నంబర్ను అభ్యర్థులతో రాయించేలా ఇన్విజిలేటర్లందరికీ సూచించాలి. ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలలో రోల్ నంబర్, సెంటర్ నంబర్ తప్పనిసరిగా రాసేలా విద్యార్థులందరి ప్రశ్నపత్రాలను తనిఖీ చేయాలి. ► పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఏపీ పబ్లిక్ పరీక్షలను (మాల్ ప్రాక్టీస్ నివారణ) చట్టం 25/1997ను దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులందరిపై కఠినంగా అమలు చేయాలి. చట్టంలోని కఠినమైన నిబంధనలపై విస్తృత ప్రచారం చేయాలి. -
వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్ఫోన్ బ్రాండ్స్పై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్మీ,వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ లపై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ఈ బ్రాండ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ►రెడ్మీ నోట్ 10ఎస్ ధర రూ. 16,999 కంటే తక్కువ ►వన్ప్లస్ నార్డ్ 2పై డిస్కౌంట్లతో ►రెడ్ మీ 9ఏ స్పోర్ట్స్ రూ. 8,499 కంటే తక్కువ ►రెడ్మీ 9 యాక్టీవ్ రూ.రూ. 10,999 కంటే తక్కువ ►వన్ ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ పై డిస్కౌంట్లతో ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ ►డిస్కౌంట్లో రెడ్ మీ నోట్ 11టీ ►టెక్నో స్పార్క్ 8టీ ధర రూ.12,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999 నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది ►ఐక్యూ జెడ్ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ ►రెడ్మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది ►వన్ ప్లస్ 9ఆర్ పై డిస్కౌంట్లు ►ఐక్యూ జెడ్ 3 రూ. 22,990 కంటే తక్కువ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్టాప్లు, హెడ్సెట్,స్మార్ట్వాచ్లు 70 శాతం డిస్కౌంట్లో పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లపై ఆఫర్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్,అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్లపై నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై ఎక్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..! -
అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు!
తాడేపల్లిరూరల్: అపహరించిన సెల్ఫోన్లు ఓఎల్ఎక్స్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన వైనం. తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానది ఒడ్డున స్నానాలు ఆచరించే విద్యార్థులు వారి సెల్ఫోన్లు భద్రపరచిన బ్యాగ్ పోవడంతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. గురువారం తాడేపల్లి సీఐలు శేషగిరిరావు, సాంబశివరావులు వివరాలు వెల్లడించారు. గుంటూరు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 మంది విద్యార్థులు ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి గంగరాజు గెస్ట్హౌస్ సమీపంలో స్నానాలు ఆచరించేందుకు విచ్చేశారు. ఆ సమయంలో 23 మంది విద్యార్థులు తమ వద్ద ఉన్న 24 సెల్ఫోన్లను ఓ బ్యాగ్లో భద్రపరచి ఒడ్డున పెట్టారు. వారు స్నానం చేసి బయటకు వచ్చి చూడగా ఫోన్లు కనిపించలేదు. అదేరోజు తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచన మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఓ.ఎల్.ఎక్స్లో ఫోన్లు అమ్ముతున్నారని సమాచారం రాగా, ఫోన్లు అమ్ముతున్న విజయనగరం జిల్లా, గూర్ల మండలం, గూడెం గ్రామానికి చెందిన కనకం దామోదరంను సంప్రదించారు. నగదును చెల్లించగా అతను సెల్ఫోన్లు తీసుకుని సీతానగరం పుష్కర ఘాట్కు వచ్చాడు. అతని వద్ద 22 సెల్ఫోన్లు ఉన్నాయని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. 22 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సెల్ఫోన్ దొంగతనాల కేసులు ఉన్నాయని, విజయనగరం పోలీసులు కోర్టుకు తీసుకు వెళుతుండగా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఎస్ఐలు రమేష్, వినోద్, సిబ్బంది శివకృష్ణ, బాబూరావు, విష్ణు, కళ్యాణ్, ఐటీ ఫోర్స్ సిబ్బందికి అర్బన్ ఎస్పీ అభినందనలు తెలిపారు. చదివింది ఇంటర్.... టెక్నాలజీలో మాత్రం అదుర్స్ విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన కనకం దామోదరం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఏర్పడడంతో ఇద్దరూ విడిపోయారు. దామోదరం చదువు మానేశాడు. హాస్టల్స్, కాలేజీల వద్ద మకాం వేసి విద్యార్థులతో స్నేహం చేసి వారి వద్ద సెల్ఫోన్లు దొంగిలిస్తాడు. వాటిని ఓ.ఎల్.ఎక్స్లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. ల్యాప్టాప్ ఉపయోగించి తను దొంగిలించిన సెల్ఫోన్లు దానికి కనెక్ట్ చేసి సెకన్లలో లాక్ తీయడాన్ని పోలీసులు గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. -
‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’
లక్నో: ఉత్తరప్రదేశ్ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని దీని పరిణామాలే అత్యాచారాలకు దారి తీస్తాయన్నారు. ఆలీఘర్లో మహిళలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అమ్మాయిలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆమె ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొదట అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతారు ఆ తరువాత వారితో పారిపోతారన్నారు. కాగా రాష్ట్రంలో అత్యాచారం కేసులు గణనీయంగా పెరిగాయి అనే ప్రశ్నకు సమాధానంగా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మహిళా కమిషన్ మాత్రం మీనా కుమారి వ్యాఖ్యలను సమర్థించలేదు. కమిషన్ ఉపాధ్యక్షుడు అంజు చౌదరి, కుమారి వ్యాఖ్యలు తప్పని, అమ్మాయిలను ఫోన్లకు దూరంగా ఉంచినంత మాత్రాన అత్యాచారాలకు తగ్గుదలకు ఇవి పరిష్కారం కాదన్నారు. UP महिला आयोग अध्यक्ष का विवादित बयान, 'फोन पर लंबी बात कर लड़कों के साथ भाग जाती हैं लड़कियां, उन्हें ना दें मोबाइल'#MeenaKumari #UPStateWomenCommission#UPSWC pic.twitter.com/CDccF2kqBx — NBT Uttar Pradesh (@UPNBT) June 10, 2021 చదవండి: ‘‘దేవుడి ఆధార్ కార్డ్ తెస్తేనే.. పంట కొంటాం’’ -
వాట్సాప్ కీలక నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పాత ఓఎస్లు ఉన్న మొబైల్ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్ చేయలేరని వెల్లడించింది. ‘2019, డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్లో వాట్సాప్ అందుబాటులో ఉండదు’ అని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని సూచించింది. వాట్సాప్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం 2.199.177 బీటా వెర్షన్ను తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా చాటింగ్ చేస్తూనే పీఐపీ మోడ్లో వీడియోలను వీక్షించొచ్చు. అయితే బీటా వెర్షన్లో పీఐపీ మోడ్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. -
హలో మీ.. అభ్యర్థిని మాట్లాడుతున్నా..
సాక్షి, జనగామ: రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. ఓటరు దేవుళ్లకు నమస్కారం... అయ్యా.. నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నా.. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ తమ భవితవ్యాన్ని వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు రెండు నెలల నుంచి ప్రచారం మొదలు పెట్టగా... కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు పదిహేను రోజులుగా ఊరూరా తిరుగుతూ హోరెత్తిస్తున్నారు. గెలుపోటములపై గత వారం రోజులుగా ఎవరికి వారే బేరీజు వేసుకుంటున్నారు. తమ నియోజక వర్గంలోని ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరించి, ఫోన్ల ద్వారా సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీని ద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, చేయబోయే కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతంలో నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించే నాయకులు.. ప్రస్తుతం ట్రెండు మార్చేశారు. -
మొబైల్స్కు రూపాయి సెగ..!
దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్ కొనాలంటే తాజాగా రూ.73.34 చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్తో రూపాయి మారకం విలువ 63.88. 2018లో ఇంతవరకు 14% నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్లో ఉంది. ఇక ఎక్కువ మంది భారతీయులు వినియోగించే స్మార్ట్ఫోన్ మార్కెట్పైనా రూపాయి ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశీయ కరెన్సీ వరుసగా క్షీణిస్తూ రావడంతో చైనా కాంపోనెంట్స్పై ఆధారపడిన హ్యాండ్సెట్ తయారీదారులను అయోమయంలోకి నెట్టేసింది. స్మార్ట్ఫోన్లలో వాడే విడిభాగాల్లో 90% దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం. దీంతో ఇంటెక్స్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రస్తుత మోడళ్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇక చైనాకు చెందిన ప్రీమియం బ్రాండ్ వన్ప్లస్ సహా పలు కంపెనీలు తమ స్మార్ట్ఫోన్ల ధరలను రానున్న రోజుల్లో పెంచాలన్న ఆలోచనతో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో తమ హ్యాండ్సెట్ల ధరలను పెంచనున్నట్టు వన్ప్లస్ స్పష్టం చేసింది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి ధరలను సమీక్షించక తప్పదని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కొత్త ఎత్తుగడ... ఈ ఏడాది జూన్ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. మే నెలలో రూపాయి 68కి పడిపోవడంతో మొబైల్స్ తయారీ సంస్థలకు కరెన్సీ తాలూకూ నొప్పి తెలియడం మొదలైంది. దీంతో అవి లాభసాటి కావనుకున్న కొన్ని మొబైల్స్ను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. అదే సమయంలో కొత్త మోడళ్లను, తమకు లాభసాటి అయిన ధరలతో మార్కెట్లోకి విడుదల చేసే పనిని చేపట్టాయి. ఫలితమే జూన్ నుంచి 250 స్మార్ట్ఫోన్ మోడళ్లు విడుదల కావడం. గతేడాది ఇదే కాలంలో విడుదలైన మోడళ్ల సంఖ్య 200 వరకే ఉంది. ‘‘ఇతర సంవత్సరాల మాదిరిగా కాకుండా జూన్ నుంచి మొబైల్స్ విడుదల ఊపందుకుంది. వ్యయాలు పెరిగిపోవడంతో కంపెనీలు కొత్త మోడళ్లతో, కొత్త ధరలతో ముందుకు వచ్చాయి’’ అని ఐడీసీ ఇండియా అనలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ కంపెనీ చర్యను సమర్థించుకున్నారు. పాత మోడళ్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్డడం కంపెనీ ప్రణాళికలో భాగమన్నారు. ‘‘పెరిగిన ధరల భారం మాపై ఉంది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు వ్యయాన్ని కొంత వరకు సర్దుబాటు చేసుకున్నాం. పోటీలో నిలిచేందుకు మొత్తం భారాన్ని కస్టమర్కు బదిలీ చేయడం లేదు’’ అని చైనాకు చెందిన హ్యాండ్సెట్ సంస్థ ట్రాన్సియన్ హోల్డింగ్ సీఈవో అరీజిత్ తల్పాత్ర తెలిపారు. అయితే, వన్ప్లస్ వంటి ఫ్లాగ్షిప్ మోడళ్లకే పరిమితమయ్యే కంపెనీలకు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రముఖ కంపెనీలు సైతం... కరెన్సీ పతనం కారణంగా పెరిగిన వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు షావోమీ, వివో, ఒప్పో, శామ్సంగ్ వంటి ప్రధాన కంపెనీలు కూడా నూతన మోడళ్లను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాయి. రూపాయి క్షీణత తమ అన్ని బ్రాండ్లపై భారాన్ని మోపినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. షావోమీ ఇటీవలే ఆరు మోడళ్లను విడుదల చేసింది. కొరియాకు చెందిన శా>మ్సంగ్ అయితే 12 మోడళ్లను విడుదల చేయగా, ఒప్పో, వివో కంపెనీలు అర డజను వరకు మోడళ్లను విడుదల చేశాయి. అయితే, స్మార్ట్ఫోన్ల విక్రయాలు దసరా–దీపావళి పండగల సీజన్లో ఎక్కువగా జరుగుతాయి. ఏడాదిలో మొత్తం విక్రయాల్లో 30 శాతం, ఫోన్ల విడుదలలో 60 శాతం ఈ సీజన్లోనే జరుగుతాయి. కానీ, ఇదే సమయంలో రూపాయి క్షీణిస్తుండడం మార్కెట్ వర్గాలను అసంతృప్తికి గురి చేస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతి కోసం బల్క్ ఆర్డర్లను ఇస్తుంటే, అక్కడి కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నాయి. రూపాయి రానున్న రోజుల్లో మరింత క్షీణిస్తుందన్న అంచనాలే అక్కడి కంపెనీలు ఆర్డర్లు స్వీకరించకపోవడానికి కారణం. -
ఆండ్రాయిడ్ పీ అప్డేట్తో నోకియా ఫోన్లు?
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ భాగస్వామ్యంతో మార్కెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా స్మార్ట్ఫోన్లు మరో అడుగు ముందుకు వేశాయి. 2018 ఆగస్టునుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేటెట్ వెర్షన్తో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. రాబోయే అన్ని నోకియా ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ‘పి’ తో రాబోతున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ అప్డేట్కు సంబంధించిన ఈ మెయిల్ సంభాషణ లీక్ అయింది. అలాగే నోకియా ప్రతినిధికూడా అనధికారికంగా ఈ అప్డేట్ను దృవీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగస్టుమాసంలో ఆడ్రాయిడ్ పితో రాబోతుందన్న పుకార్లు భారీగా షికారు చేస్తున్నాయి. 2017లో నోకియా స్మార్ట్ ఫోన్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో నోకియా 2, నోకియా 3, నోకియా 5 స్మార్ట్ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేసింది. -
ఫోన్లోనే సెల్ఫీ స్టిక్!
ఫొటో చూసిన వెంటనే విషయం తెలిసిపోతుంది. స్మార్ట్ఫోన్ కేసులో ఇమిడిపోయే ఓ కెమెరా.. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అతికించుకునే వీలు.. తద్వారా సెల్ఫీలకు ఒక కొత్త అర్థం. ఇదీ ఎవో గోక్యామ్ ప్రత్యేకతలు. వైర్లెస్ కెమెరా ఉండే ఈ సెల్ఫీ స్టిక్ను ఐఫోన్లతోపాటు కొన్ని హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లతో మాత్రమే పనిచేస్తుంది. సిలికోన్తో తయారైన ఎవో గోక్యామ్ కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం ఉంటుంది. వైఫై ద్వారా ఫొటోలు తీయవచ్చు. మొత్తం 5 మెగాపిక్సెల్స్ రెజల్యూషన్, 1080పిక్సెల్స్/30 ఫ్రేమ్స్ పర్ సెకన్ వేగంతో వీడియోలు తీయవచ్చు. ఫొటోలు, వీడియోలు మొత్తం మన ఫోన్లోని ఎస్డీ కార్డులో స్టోర్ అవుతాయి. దాదాపు 150 అడుగుల దూరం నుంచి కూడా ఈ కెమెరా పనిచేస్తుంది. ప్రత్యేకమైన యాప్ ద్వారా కెమెరా లెన్స్ ఎటువైపు చూస్తోందో చూసుకోవచ్చు. మార్పులు చేసుకోవచ్చు కూడా. రికార్డు చేసిన ఫొటోలు, వీడియోలను వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియాల్లో షేర్ చేసుకోవచ్చు. అవసరమైతే రెండు మూడు ఎవో గోక్యామ్లను నెట్వర్క్ చేసుకుని వేర్వేరు కోణాల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే వీలుంది! -
మార్చి 31 తరువాత కూడా!
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానం తలనొప్పి ప్రస్తుతానికి తొలగింది. వివిధ సేవలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధాన గడువైన మార్చి 31వ తేదీ దగ్గరికొస్తుండటంపై ఆందోళన చెందుతున్నవారు ఊపిరి పీల్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానించుకునే గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే, మార్చి 31 తరువాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు, ఆధార్ అనుసంధాన ప్రక్రియను పౌరులు, వినియోగదారులు కొనసాగించుకోవచ్చు. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను మార్చి 31 తరువాత కూడా యథావిధిగా కోరవచ్చని స్పష్టతనిచ్చింది. తత్కాల్ పాస్పోర్ట్కూ అవసరం లేదు వివిధ సేవలు, సంక్షేమ పథకాలతో ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన మార్చి 31 గడువుని పొడిగించేందుకు సిద్ధమని కేంద్రం ఇదివరకే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ‘ ఆధార్ చట్టబద్ధతపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసి, తుది తీర్పు వెలువరించే వరకు.. ఆధార్ అనుసంధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన మార్చి 31 గడువును నిరవధికంగా పొడిగించాలని ఆదేశిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది. మంగళవారం జరిగిన విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు పి.చిదంబరం, కేవీ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఆధార్ చట్టబద్ధత, దానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన సంగతి తెలిసిందే. సబ్సిడీల పంపిణీలో అవాంతరాలు వద్దు ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించడం వల్ల ఆ చట్టంలోని సెక్షన్ 7 పరిధిలోకి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధార్ చట్టంలోని నిబంధన 7 ప్రకారం.. లబ్ధిదారుడి గుర్తింపును ధ్రువీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ వివరాలు కోరొచ్చు. ఆధార్ పొందని వారు కూడా ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని నిరూపించగలిగితే ప్రభుత్వ ప్రయోజనాలు పొందొచ్చు. అలాంటి వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తారు. ఆధార్ చట్టబద్ధతను సవాల్ చేసిన పిటిషనర్లలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తరఫున హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం వాదిస్తూ.. ఆధార్ బిల్లును లోక్సభ స్పీకర్ తప్పుగా మనీ బిల్లుగా పేర్కొని, అది రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆధార్ తప్పనిసరే: యూఐడీఏఐ బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్పోర్టులకు ఆధార్ తప్పనిసరియేనని ఆధార్ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. అయితే ఆధార్ ఇంకా పొందని వారు, దానికి దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ సంఖ్యతో ఆ సేవలు పొందొచ్చని పేర్కొంది. ‘సంబంధిత చట్టాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్పోర్టులకు ఆధార్ తప్పనిసరి అని చెబుతున్న నిబంధన కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ తెలిపింది. -
లావా జెడ్ సిరీస్లో నాలుగు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: లావా ఇంటర్నేషనల్ తాజాగా తమ జెడ్ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్స్ శ్రేణిని ఆవిష్కరించింది. జెడ్60, జెడ్70, జెడ్80, జెడ్90 వంటి నాలుగు ఫోన్లు దీన్లో ఉన్నాయి. వీటి ధర రూ. 5,500 నుంచి రూ. 10,750 దాకా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్స్తో పాటు కంపెనీ మనీ బ్యాక్ చాలెంజ్ను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఫోన్ కొనుక్కున్న కస్టమర్లు.. ఏ కారణం చేతనైనా అది నచ్చకపోయిన పక్షంలో 30 రోజు ల్లోగా వాపసు చేసి, తాము చెల్లించిన సొమ్మును వెనక్కి పొందవచ్చు. అక్టోబర్ 1 నుంచి డిసెంబ ర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుం దని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ విభాగ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మహాజన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ రైనా తెలియజేశారు. -
జీఎస్టీ కాక .. డిస్కౌంట్ల మోత
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం జూలై 1 నుంచి అమలుకాబోతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తుదిగడువు దగ్గర పడే కొద్ది నిల్వలు వదిలించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో పేటియం నుంచి షాప్క్లూస్ దాకా, లెవీస్ మొదలుకొని బజాజ్ ఆటో వరకు, బ్రాండ్స్ నుంచి రిటైలర్స్ దాకా అన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్ను ప్రకటిస్తున్నాయి.అన్ని ఈ- కామర్స్ కంపెనీలు తమ ప్లాట్ఫాం ద్వారా విక్రయాలు జరిపే ఉత్పత్తులపై అధిక మొత్తంలో తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఇవిగో కొన్ని ఆఫర్లు... ► మెడిసిన్స్ పై 20 శాతం తగ్గింపును 1ఎంజీడాట్ కామ్ ప్రకటించింది. ► స్పోర్ట్స్వేర్ బ్రాండ్ పుమా కంపెనీ ఫ్లాట్ 40 శాతం డిస్కౌంట్పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ► వస్త్ర ఉత్పత్తి కంపెనీ అల్లెన్ సోలీ కస్టమర్లకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తోంది. ► లెవీస్ కంపెనీ బై టు గెట్ టు ఆఫర్ను ఇస్తుండగా... ఫ్లైయింగ్ మేషిన్ కంపెనీ 50 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. ► బజాజ్ ఆటో వివిధ మోడల్స్ పై కోనుగోలు దారులకు రూ.4500 దాకా డిస్కౌంట్ను ఆఫర్ చేసింది. ► సెల్ఫోన్లపై పలు డిస్కౌంట్లను పలు కంపెనీలు ప్రకటించనున్నాయి. -
ఇక మొబైల్ ఫోన్లే.. బ్యాంకులు, పర్సులు
కాన్పూర్ :ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీమానిటైజేషన్ పై చర్చ జరగ్గకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిని కాపాడడానికే ప్రతిపక్షాలు పెద్ద నోట్లపై చర్చనుంచి దూరంగా పారిపోయాయని ధ్వజమెత్తారు. అయితే దేశంలో అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ మరోసారి నొక్కి వక్కాణించారు. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో చివరికి స్పీకర్ పై పేపర్లు విసిరడం అమానుషమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీని విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కాన్పూర్ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మోదీ పేదల కోసం అనేక సంక్షేమ కర్యక్రమాలను చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఆరుశిక్షణ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక శిక్షణ అందించడం నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలే శక్తి యువతలోనే ఉందని అన్నారు. డీమానిటైజేషన్ కష్టాలు త్వరలోనే తగ్గనున్నాయిన భరోసా ఇచ్చారు. దేశంలో వెయ్యి రూపాయల నోటు చలామణీలో ఉన్నపుడు రూ. 500, రూ.100 రూపాయల నోటు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, పెద్దనోట్లు రద్దు నిర్ణయం అనంతరం ఇప్పుడు 100 రూపాయల నోటుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ అన్నారు. మోదీ ప్రసంగంలో కొన్ని అంశాలు విప్లవాత్మకమైన డిమానిటేజేషన్ చరిత్రలో రికార్డు కాకపోవచ్చుకానీ, అవినీతిని రూపుమాపడంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ఘనత ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పేదల అండదండలు ప్రభుత్వానికి ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై లక్కీ డ్రా ద్వారా బహుమతులను పేదలు అందుకోనున్నారు. ప్రతి పక్షాల బలం నాకు తెలుసు.. బ్యాంకు ఆఫీసర్లకు లంచాలిస్తూ వారు ఏదైనా చేయగలరు. కానీ మా పోరాటం కొనసాగుతుంది. నల్లధనం కుబేరులకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ వాడుతున్నాం. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నాం. ఇక మీ మొబైల్ ఫోన్లే మీ బ్యాంకులు , పర్సులుగా మారనున్నాయి. మా అజెండా అవినీతి ఆపడానికి, వారి (ప్రతిపక్షాల) ఎజెండా పార్లమెంట్ అడ్డుకోవడం. జవాబుదారీగా, అవినీతికి వ్యతిరేకంగా ఉండటం కాంగ్రెస్ వల్లకాదు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా విరాళాలు తీసుకునే సమయంలో అవినీతి రహిత రాజకీయాలకు ఉదాహరణగా నిలవాలి. నల్లధనంపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారనంతవరకు గుండారాజకీయాలకు అడ్డుకట్టవేయలేమని మోదీ పేర్కొన్నారు. -
'వైఫై మనల్ని చంపేస్తుంది'
లండన్: టెక్నాలజీ డెవలప్మెంట్ మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆస్కార్ విన్నింగ్ సింగర్ అడెలె ఆందోళన చెందుతోంది. మరో 25 ఏళ్లలో వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీ అందరి మరణానికి కారణమౌతుందని అంచనావెస్తుంది. టెక్నాలజీ మనుషుల జీవితాలను డామినేట్ చేస్తుందని ఇది అంత మంచిది కాదని ఫీమేల్ ఫస్ట్తో మాట్లాడుతూ అడెలె వెల్లడించింది. ప్రజలు నిజానికి వారి ముందున్న క్షణాన్ని ఆస్వాదించకుండా.. ఫోటోలపైనే దృష్టి పెడుతున్నారని అంది. 'గతంలో నేను షో చేస్తున్న సమయంలో ఎవరివద్దా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు. కాబట్టి నేను జనాల కోసం స్టేజిపైకి వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫోన్ల కోసం వెళ్తున్నట్లుగా ఉంది' అని అడెలె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి ఎవరూ చూడటం లేదని.. అందరూ ఫోన్లలోనే ఉంటున్నారని అంది. రాబోయే కాలంలో వైఫై మూలంగా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పుకొచ్చింది. -
‘మూగనోము’ వదిలేదెన్నడు..?
♦ పనిచేయని పోలీసుల సెల్ఫోన్లపై స్పందన కరువు ♦ తాజాగా 30 మంది పోలీసు అధికారుల సెల్ఫోన్లు కట్ ♦ ఎస్పీ దష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం అనంతపురం సెంట్రల్ : పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. పోలీసు శాఖలో సమాచార వ్యవస్థ చిన్నాభిన్నంగా తయారైంది. ఎవరి సెల్ఫోన్లు ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా తాజాగా 30 మంది పోలీసు అధికారుల సెల్ఫోన్లు ఆగిపోయాయి. ప్రతి నెలా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. పోలీసు శాఖలో ఎంపిక చేసిన కానిస్టేబుల్స్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకూ పోస్టుపెయిడ్ (నెలవారి చెల్లింపు) గ్రూప్ సిమ్(సీయూజీ)లను అందజేశారు. సదరు నంబర్లు గ్రామాలు, ఆయా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా వెంటనే పోలీసు అధికారులకు ఫోన్చేసి ప్రజలు తెలియజేస్తున్నారు. అలాంటి ఫోన్ నంబర్లను 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నెలవారి బిల్లులు చెల్లించకపోతుండడంతో బీఎస్ఎన్ఎల్ అధికారులు సేవలు నిలిపివేస్తున్నారు. తాజాగా అనంతపురం వన్టౌన్, శింగనమల, ఇటుకలపల్లి, నార్పల, ఉరవకొండ, తలుపుల, తనకల్లు, కళ్యాణదుర్గం టౌన్, రూరల్, శెట్టూరు, కుందిర్పి, కంబదూరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప, డీ. హీరేహాల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, లేపాక్షి, పెద్దపప్పూరు, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్తో పాటు పలువురు ఐటీ కోర్టీం అధికారుల సెల్ఫోన్లు మూగబోయాయి. ఎక్కువశాతం మండల సబ్ ఇన్స్పెక్టర్ల సెల్ఫోన్లు కట్ చేయడంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు అదుపుచేయడానికి కీలకమైన పోలీస్శాఖలో సమాచార వ్యవస్థ పటిష్టం చేయడంపై జిల్లా ఎస్పీ దష్టి సారించాలని ఆశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మీ స్మార్ట్ఫోన్ పగిలిందా?
♦ ఆన్లైన్లో మరమ్మతు సేవలందిస్తున్న జస్ట్లైక్న్యూ.ఇన్ ♦ ప్రస్తుతం ఫోన్లు, ట్యాబ్లెట్స్; త్వరలో ల్యాప్ట్యాప్స్, స్మార్ట్ వాచీలు కూడా ♦ ఉచిత డెలివరీ, 48 గంటల్లో రిపేరింగ్, 3 నెలల వారంటీ ♦ ఈ ఏడాదిలో ముంబై, చెన్నై, పుణెలకు విస్తరణ ♦ ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో కో-ఫౌండర్ రామకృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా పాడైతే రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి... రిపేరు చేయించటం. రెండోది... దాన్ని వదిలేసి కొత్తది కొనుక్కోవటం. అయితే స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే చాలామంది రిపేరుకే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ మరీ రిపేరుకయ్యే మొత్తం ఎక్కువనుకుంటే మాత్రం... కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ చిక్కేంటంటే రిపేరు ఎక్కడ చేయించాలి అని!!?. ఎందుకంటే దగ్గర్లోని సాధారణ రిపేరింగ్ సెంటర్లో చేయిస్తే తక్కువ ఖర్చవుతుంది. కానీ గ్యారంటీ ఉండదు. ఇక సర్వీస్ సెంటర్కు తీసుకెళితే గ్యారంటీ ఉంటుంది కానీ ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది. ఇదిగో... ఇలాంటి సందిగ్ధాన్నే వ్యాపారంగా చేసుకుంది ‘జస్ట్లైక్న్యూ’ బృందం!!. ఐఐటీ, ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన నలుగురు మిత్రులు అజిత్ పాణిగ్రహి, రాహుల్ అగర్వాల్, రామకృష్ణ చావ, విధి సింఘాల్ రూ.20 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్లో బెంగళూరు కేంద్రంగా జస్ట్లైక్న్యూ.ఇన్ను ప్రారంభించారు. సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి కో-ఫౌండర్ రామకృష్ణ ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి ఏం చెప్పారంటే... 20 బ్రాండ్లు.. 10 వేల రకాల రిపేర్లు.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్ మోడల్స్, ట్యాబ్లెట్స్ను రిపేరు చేస్తున్నాం. 80 శాతం రిపేర్లు స్క్రీన్లు పగులుతున్నవే వస్తున్నాయి. దాదాపు 20 రకాల బ్రాండ్లు, 400 రకాల మోడల్స్లో 10 వేల రకాల రిపేర్లున్నాయి. ఉత్పత్తి పికప్, డెలివరీ రెండూ ఉచితమే. స్టాండ్బై మొబైల్, 3 నెలల వారంటీ ఇవ్వటం మా ప్రత్యేకత. 48 గంటల్లో రిపేర్ చేసి ఇంటికి డెలివరీ చేస్తాం. ఆయా ఉత్పత్తులను రిపేర్ చేసేముందు 25 కోణాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన క్యూసీ రిపోర్ట్ను కస్టమర్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తాం కూడా. ప్రతి నెలా 25 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. ఈ మే నెలలో 2,000 ఉత్పత్తులను రిపేరు ఇందులో 80 శాతం స్మార్ట్ఫోన్లు, 20 శాతం ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మూడేళ్లలో 15 నగరాలకు విస్తరణ.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చే ఆర్డర్ల కోసం కొరియర్ సంస్థ డెల్హివరితో ఒప్పందం చేసుకున్నాం. మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. ఈ ఏడాది ముగింపు నాటికి ముంబై, చెన్నై, పుణె నగరాలకు విస్తరించనున్నాం. సేవల విస్తరణ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో ల్యాప్ట్యాప్స్, స్మార్ట్ వాచీల రిపేరింగ్ సేవల్లోకి ప్రవేశిస్తాం. రెండేళ్లలో ఫ్రాంచైజీ మోడల్ లో రిటైల్ ఔట్లెట్ను కూడా ప్రారంభిస్తాం. రూ.3 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల టర్నోవర్ను చేరుకుంటున్నాం. మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది టెక్నీషన్స్. ‘‘గతేడాది జూలైలో ఏంజిల్ రౌండ్లో భాగంగా కోటి రూపాయల నిధులను సమీకరించాం. ఇండిగో కన్సల్టింగ్ మాజీ ఎండీ వికాస్ టండన్, కాపిలరీ టెక్నాలజీస్ సీఈఓ అనీష్రెడ్డి, ఇన్వెస్టరు వికాస్ సాలుగూటి మా సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధులను సమీకరిస్తాం. చర్చలు పూర్తయ్యాయి. ఇందులో ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్బీసీ సెక్యూరిటీస్ ఎండీ హర్ష పప్పు, మైండ్ట్రీ చైర్మన్ కృష్ణ కుమార్, ఒరాకిల్ ఇండియా మాజీ ఎండీ సందీప్ మాథుర్లున్నారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
మళ్లీ నోకియా మొబైల్స్ వస్తున్నాయ్!
మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్ఎండీ గ్లోబల్కు బ్రాండ్ హెల్సింకి/న్యూఢిల్లీ: మళ్లీ నోకియా బ్రాండ్లు ఫోన్లు, ట్యాబ్లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్ఎండీ గ్లోబల్కు ఫాక్స్కాన్ కంపెనీలకు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్ఎండీ గ్లోబల్ లిమిటెడ్కు నోకియా బ్రాండ్ ఎక్స్క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్ను పదేళ్లపాటు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఈ సంస్థ తైవాన్ భాగస్వామి ఎఫ్ఐహెచ్ మొబైల్ ఆఫ్ ఫాక్స్కాన్ టెక్నాలజీలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. 1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత శామ్సంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. 2014లో తన హ్యాండ్సెట్ వ్యాపారాన్ని నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫీచర్ ఫోన్లకు మాత్రం నోకియా బ్రాండ్ను వాడి లూమియా బ్రాండ్ కింద స్మార్ట్ఫోన్లను విక్రయించింది. మైక్రోసాఫ్ట్తో కుదుర్చుకున్న బ్రాండ్ లెసైన్సింగ్ ఒప్పందం ఈ ఏడాది మధ్యకల్లా ముగియనున్నదని అంచనా. -
ఎల్జీ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టింది. కె సిరీస్లో భాగంగా కె7, కె10 శ్రేణి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఎల్జీ. ఇండియాలో కె7 ధర రూ.9,500 కాగా.. కె10 ధర రూ.13,500లుగా కంపెనీ నిర్ణయించింది. కె7 ఆండ్రాయిడ్ వర్షన్లో 5.1 లాలీపాప్తో పనిచేసే ఈ మొబైల్లో స్టోరేజీ కోసం స్లాట్ ఉంది. ప్రకృతి రమణీయత కనిపించేలా ఉన్న డిజైన్ను ఈ ఫోన్ల కోసం వినియోగించారు. కె7 ప్రత్యేకతలు.. 5.0 అంగుళాల స్క్రీన్ ఎఫ్డబ్ల్యూవీజీఏ(854X480) 1.3 జీహెచ్జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 5 మెగా పిక్సళ్ల ఫ్రంట్, రీర్ కెమెరాలు 1 జీబీ ర్యామ్ 2,125 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ ఫ్లాష్ కె10 ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1తో నడిచే ఈ మొబైల్లో స్టోరేజీ సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైన స్లాట్ను ఏర్పాటు చేశారు. 5.3 అంగుళాల స్క్రీన్తో ఫుల్ హెచ్డీ(1280x720) స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 13 మెగా పిక్సల్ రీర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫ్లాష్ -
కోరుకున్న వస్తువులు.. ఇక 4 గంటల్లోనే
అహ్మదాబాద్: స్నాప్ డీల్ లో ఏదైనా మొబైల్ ఫోన్ కొంటే, నాలుగు గంటల్లో మన చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో మొబైల్ కొనుగోలులో స్నాప్ డీల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ విధంగా అన్ని వస్తువులను నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంచాలని స్నాప్ డీల్ నిర్ణయించింది. డెలివరీ టైమ్ ను గతేడాది కంటే 70శాతం పెంచుకున్నామని, ఫోన్లకే పరిమితమైన ఈ నాలుగు గంటల డెలివరీని మరిన్ని వస్తువులకు అందజేయనున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్రవంశీ తెలిపారు. దాదాపు వినియోగదారులు కొనుకునే 99 శాతం ఉత్పత్తులను అదే రోజు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను నాలుగు గంటలోనే అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న గూర్గావ్ కు చెందిన ఈ సంస్థ, దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడులతో 2 మిలియన్ల చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యంతో 2015లో మార్కెట్లోకి ప్రవేశించింది. 2015లో 7 శాతం ఉత్పత్తులను మాత్రమే తన గిడ్డంగి నుంచి అందజేసిన ఈ సంస్థ, ప్రస్తుతం 70శాతం ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తోంది. క్రమేపి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఉత్పత్తులను త్వరగా వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్రవంశీ చెప్పారు. -
ప్రచారం సెల్ చల్
♦ కాలంతో పాటు ప్రచారం పరుగులు ♦ సోషల్ మీడియా, ఫోన్లద్వారా ప్రచారం ♦ చివరి నిమిషం వరకు ఓటు కోసం యత్నాలు నారాయణఖేడ్: ఎన్నికల ప్రచారాన్ని నాయకులు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారం ఈనెల గురువారం సాయంత్రంతో ముగిసి పోయింది. దీంతో పోలింగ్కు ఇంకా ఒక రోజు సమయం ఉండడంతో ఓటర్లను ఎలాగైనా ఆకట్టుకోవాలని ప్రచార మాధ్యమాలను, ఫోన్లను వాడుకుంటున్నారు. ఆయా ప్రధాన పార్టీలకు చెందిన నాయకు లు ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో యువతను, ఉద్యోగులను, ఫోన్ వినియోగదారులకు ఎలాగైనా త్వర గా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సెమ్మెస్లు పంపడంతో పాటు ఫేస్బుక్ ద్వారా సైతం చాటింగ్ చేయడం, తమ ప్రచారాన్ని వారి దగ్గరకు తీసుకెళ్ళేందుకు యత్నిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటరు ఓటువేసే చివరి నిమిషం వరకు తమ ప్ర యత్నాన్ని వృధా కానీయడంలేదు. వీలైనన్ని మార్గాల ద్వారా ఓ టరుకు దగ్గరయ్యేందుకు అభ్యర్థులు, పార్టీల నాయకులు య త్నిస్తున్నారు. దీంతోపాటు ఫోన్స్కాల్స్ ద్వారా కూడా ప్రచారా న్ని నిర్వహిస్తున్నారు. తమను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఫలానా అభివృద్ధి చేస్తానని, తను ఆశీర్వదించాలని, తమ పార్టీని ఆదరించాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. తాము గెలుపొందితే పరి ష్కరించే సమస్యలనూ ప్రచార మాధ్యమాల ద్వారా వివరిస్తున్నారు. యువత సోషల్ మీడియాను అధికంగా వినియోగిస్తుండడంతో నాయకులు ఆ వర్గానికి దగ్గరై ఓటు అభ్యర్థించేందుకు తాము సైతం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఓటేసేందుకు ఈ కార్డులుంటే చాలు! ఈ నెల 13న జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికను పురస్కరించుకొని ఓటరు గుర్తింపు కార్డును తమ వెంట తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఓటర్లు ఎపిక్కార్డు సమర్పించకుంటే తాము ఈ కింద చూపిన ఫొటోతో కూడిన ఏదైనా ఓ కార్డు పోలింగ్ రోజు తమ వెంటే పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ఆధార్ కార్డును ఎన్నికల కమిషన్ సూచించిన 11 కార్డుల జాభితాలో లేదు. ఓటు వేసేందుకు తీసుకెళ్లాల్సిన కార్డులు 1. పాసుపోర్టు, 2. డ్రైవింగ్ లెసైన్స్, 3. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పీఎస్యూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు, 4. బ్యాంకు, పోస్టాఫీస్ జారీచేసిన పాసుపుస్తకం, 5. పాన్కార్డు, 6. ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్కార్డు, 7. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీపథకం కింద జారీచేసిన జాబ్కార్డు, 8. కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యభీమా కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, 10. ఎన్నికల యంత్రాంగం జారీచేసిన ఫొటో స్లిప్, 11. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు అధికారికంగా జారీచేసిన గుర్తింపు కార్డు. -
మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు
♦ 3 ఫోన్లు అందుబాటులో ♦ ధర రూ. 15,499 -25,800 దాకా న్యూఢిల్లీ: లైఫ్ (ఎల్వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లో మొదలయ్యే గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియో టెలికం సర్వీసులకు అనువైనవిగా ఈ 3 హ్యాండ్సెట్స్ను రూపొందించారు. వీటి ధరలు రూ. 15,499 నుంచి రూ. 25,800 దాకా ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం హై ఎండ్ 4జీ మోడల్ అయిన లైఫ్ ఎర్త్ 1 ధర రూ. 25,800. ఇందులో 13 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇక లైఫ్ వాటర్ 1 ధర రూ. 17,399 కాగా వాటర్ 2 రేటు రూ. 15,499. ఈ రెండు మోడల్స్లోనూ 16 జీబీ ఇం టర్నల్ మెమరీ ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లో కూడా లభించే ఈ హ్యాండ్సెట్స్కి.. దేశవ్యాప్తంగా ఉన్న 1,000 పైగా సెంటర్ల ద్వారా సర్వీసులు అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్న రూ. 4,000 కన్నా తక్కువ ఉండే ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు వివరించాయి. ఫ్లేమ్స్ పేరుతో వచ్చే ఫోన్లు ఈ రేటులో ఉండొచ్చని భావిస్తున్నట్లు శివాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ శోభిత్ గోయల్ పేర్కొన్నారు. -
....చూస్తేనే వాంతి వస్తోంది!
సైబర్ సిక్నెస్... ఆధునిక యుగంలో ఓ కొత్త వ్యాధిగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధితో బాధపడేవారు నీరస పడిపోవడంతో పాటు... ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరిలో వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్న జనాభాలో 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది. స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఢెభ్భై ఏళ్ళ అమ్మమ్మలు, తాతలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులతో, స్నేహితులతో టచ్ లో ఉండగల్గుతున్నారు. ''మా కూతురు దుబాయ్ లో, మా అక్క ఫ్రాన్స్ లో, మా బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతున్నాను. వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూడగల్గుతున్నాను'' అంటుంది ఆగ్నేయ వేల్స్ లోని మన్మౌత్ షైర్ దేశానికి చెందిన 76 ఏళ్ళ జూన్. ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. అయితే ప్రస్తుతం జూన్ సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. తైవాన్ లోని కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు. అందులో సగంకంటే ఎక్కువ మంది.. ముఖ్యంగా పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు. ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్ లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్ టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని.. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పో్ర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు. అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ. ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు. వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు. -
జింగిల్స్..జిల్జిల్ జిలా!
రికార్డు చేసిన సందేశాలతో ఓటర్లను ఆకట్టుకోనున్న బీజేపీ - ఫోన్లు, రేడియోల్లో ప్రసారానికి ఏర్పాట్లు - సుపరిపాలన ఇతివృత్తంగా సందేశాల ప్రచారం - సోషల్ మీడియా ప్రచారంలో తామే ముందున్నట్లు ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్ ఖేర్, హేమమాలిని, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో ఢిల్లీవాసులతో ఫోన్లో, రేడియోలో మాట్లాడనున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేసే జనాకర్షణ గల నేతల సందేశాలను రికార్డు చేసి ఢిల్లీలో ఓటర్లకు వినిపించడానికి ఢిల్లీ బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సుపరిపాలన అంశంపై ఢిల్లీవాసులకు ఈ నేతల సందేశాలను వినిపించి ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంపీలతో జరుపుతోన్న ప్రచారం ఈ నెల 20న ముగియనుండడంతో మరో తరహాలో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటోన్న బీజేపీ రేడియోలో, ఫోన్లో ముందే రికార్డు చేసిన సందే శాలు, జింగిల్స్తో పాటు సోషల్ మీడియాలో ప్రచారంపై దృష్టి సారించనుంది. ఈ ప్రచారంలో తాము అసత్య వాగ్ధానాలు చేయబోమని, మోడీ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచుతామని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ చెప్పారు. ప్రచారం కోసం సుపరిపాలనను ఇతివృత్తంగా ఎంచుకున్న బీజేపీ గత ఆరు నెలల్లో కేంద్రం చేపట్టిన జన్ధన్ యోజన, స్మార్ట్ సిటీస్, వై-ఫై కనెక్టివిటీ ఇత్యాది అంశాలను ప్రచారం కోసం ఉపయోగించుకోనుంది. సోషల్ మీడియా ప్రచారంలో తమ పార్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందుందని ఉపాధ్యాయ చెప్పారు. ఆప్ ఫేస్ బుక్ పేజీకి రోజుకు 3 వేల లైక్స్ వస్తుండగా, తమకు పది వేల లైక్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం చేపట్టిన కార్యకమాన్ని డిసెంబర్ 20 తర్వాత మరింత ముమ్మరం చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంగళవారం వరకు కొత్తగా 16 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారని పార్టీ తెలిపింది. -
సీఎం మీతో మాట్లాడతారట..
-
సీఎం మీతో మాట్లాడతారట..
హైదరాబాద్ : నయానో...భయానో రైతులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ యత్నిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని గ్రామాల రైతులకు సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదన్న వారిని ...హైదరాబాద్ రావాలని సీఎంవో అధికారులు ఆహ్వానిస్తున్నారు. మంగళవారం రాత్రి సుమారు 20మంది రైతు నాయకులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడతారట...అంటూ వెంకటపాలెం, నెడమర్రు, నందడం, ఉద్దండరాయునిపాలెం రైతులను ఫోన్లలో సమాచారమిస్తున్నారు. కాగా భూములు ఇవ్వనన్న రైతులతో గురువారం.. చంద్రబాబు చర్చలు జరిపి వారిని బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. -
కొత్త ప్రపంచం 28th Sep 2014
-
కొత్త ప్రపంచం 21st Sep 2014
-
కొత్త ప్రపంచం 14th Sep 2014
-
కొత్త ప్రపంచం 7th Sep 2014
-
కొత్త ప్రపంచం 3rd August 2014
-
టాటాడొకోమోతో ట్రూకాలర్ ఒప్పందం
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన మొబైల్ కాలర్ ఐడీ సేవల సంస్థ ట్రూకాలర్.. టాటా డొకోమోతో ఒప్పందం కుదురుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. దేశంలో ఒక టెలికం కంపెనీతో ట్రూకాలర్ జట్టుకట్టడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఒప్పందం ప్రకారం టాటా డొకోమో ఖాతాదారులు మొబైల్ ఇంటర్నెట్కోసం ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ట్రూకాలర్ సర్వీసులను పొందేందుకు వీలవుతుంది. ట్రూకాలర్ అప్లికేషన్(యాప్).. యూజర్ల అనుమతితో వాళ్ల ఫోన్బుక్లోని నంబర్లను తమ డేటాబేస్లో చేర్చుకుంటుంది. ఎవరైనా మరో ట్రూకాలర్ యూజర్ ఫోన్కాల్ను అందుకున్నప్పుడు అవతలివాళ్ల నంబర్ తమ ఫోన్లో నిక్షిప్తమైలేనప్పటికీ... వాళ్ల పేరును స్క్రీన్పై చూపించడం ఈ ట్రూకాలర్ ప్రత్యేకత. ‘భారత్ మార్కెట్ మాకు చాలా కీలకమైనది. మొత్తం 5.5 కోట్ల మంది సబ్స్క్రయిబర్లలో ఇక్కడినుంచే 3 కోట్ల మంది ఉన్నారు. టాటా డొకోమోతో ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతేంటో ఈ గణాంకాలే చెబుతాయి’ అని ట్రూకాలర్ వైస్ ప్రెసిడెంట్(గ్రోత్ అండ్ పార్ట్నర్షిప్-ఆసియా) కరి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు తమ నంబర్లను సెర్చ్ చేయకుండా చేయడం కోసం యూజర్లు నంబర్లను ట్రూకాలర్ వెబ్సైట్ నుంచి తొలగించుకునే(అన్లిస్ట్) అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సాధారణ సేవలతో పాటు ప్రీమియం సేవలను కూడా టాటా డొకోమో కస్టమర్లు 90 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరించారు. -
మార్కెట్లోకి ఇంటెక్స్ మొబైల్ ఫోన్లు
హైదరాబాద్: ఇంటెక్స్ మొబైల్స్ కంపెనీ రెండు మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. 5 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆక్వా ఐ-7లో డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 32జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ వంటి ఫీచర్లున్న ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5,500 వాల్యూపాక్(2.1 బ్లూటూత్ స్పీకర్) ఉచితమని కంపెనీ పేర్కొంది. ఇక ఆక్వా హెచ్డీ ఫోన్లో 4.7 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ ఉన్న ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే ఫర్హాన్ ఆటోగ్రాఫ్ చేసిన పెన్, కీ చెయిన్ సెట్ ఉచితమని పేర్కొంది. ఈ ఉచిత ఆఫర్లు పరిమిత కాలం వరకేనని వివరించింది.