PMAY
-
‘ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి’
కొడంగల్(వికారాబాద్ జిల్లా): ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇల్లు లేని పేదల కోసమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని,. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna). అమృత్ 2 పథకం ద్వారా నిధులు కేటాయింపుపై కొడంగల్ లో మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.నిరుపేదలు ఇళ్లు లేకుండా ఉండకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే చేశారని ఆమె మండిపడ్డారు.పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలి..గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కేవలం కాంగ్రెస్ పార్టీ వారినే పరిమితం చేయొద్దన్నారు. ఈ కమిటీల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎవరైతే నీడలేని పేద ప్రజలు ఉంటారో అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు డీకే అరుణ.జనాభా ఆధారంగానే అమృత్ 2 పథకం నిధులుఅమృత్ 2 పథకం(amrut 2 scheme) కింద దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. ఈ పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ నిధులు వాడుకోవచ్చన్నారు. కొడంగల్ మున్సిపాలిటీకి కూడా రూ. 4.50 కోట్లు మంజూర చేయడం జరిగిందని, మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా చేసుకొనే నిధులను విడుదల చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని, అందులో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్(NREGS) పథకం ద్వారా సీసీ రోడ్డు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవ్వడం జరిగిందన్నారు. -
తెలంగాణలో 80% పట్టణీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రాంతం పట్టణీకరణ చెందిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలోని 28 పట్టణాభివృద్ధి సంస్థల జాబితాతోపాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాల వివరాలను అందజేసింది. గతంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా, పట్టణీకరణ నేపథ్యంలో వాటిని 28కి పెంచిన ఉత్తర్వుల ప్రతులను కూడా జత చేసింది. పట్టణ ప్రాంతాల సంఖ్య, పరిధి బాగా పెరిగినందున ఈసారి ప్రధానమంత్రి ఆవాస్యోజన (పీఎంఏవై) పథకం కింద రాష్ట్రానికి ఇళ్ల యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి భారీగా నిధులు పొందే ఉద్దేశంతో ఈ వివరాలను అందజేసింది. రూ.6 వేల కోట్లు అందేలా..ఇందిరమ్మ పథకం కింద తొలుత 4.20 లక్షల ఇళ్లను పేదలకు ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారంగానే ఉండనుంది. దీంతో కేంద్రం నుంచి ఎన్ని ఎక్కువ నిధులు అందితే అంత భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ను రూ.లక్షన్నరగా, గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ను రూ.72 వేలుగా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం ఇచ్చే పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నర అందితే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. మొదటి విడతలో కేంద్రం నుంచి రూ.6 వేల కోట్ల నిధులు అందుతాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వినతిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముందు ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కోరింది. సంక్రాంతి నాటికి జాబితా..ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే అభివృద్ధి చేసిన మొబైల్ యాప్లో సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద అందిన 80.54 లక్షల దరఖాస్తుల వివరాలను దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి నమోదు చేస్తు న్నారు. దీంతో ఆటోమేటిక్గా అర్హుల జాబితా ను యాప్ సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే వివరాలను కేంద్రం రూపొందించిన పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ వివరాలను కేంద్రప్రభుత్వం సరిచూసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యూనిట్లను మంజూరు చేసి నిధులు విడుదల చేస్తుంది. సమగ్రంగా వివరాల సేకరణదరఖాస్తు పత్రాల్లో నమోదు చేసిన వివరాలు కాకుండా, దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు రాబట్టి యాప్లో పొందుపరుస్తున్నారు. ఏడు ప్రశ్నలకు జవాబులుగా వాటిని సేకరిస్తున్నా.. గతంలో వారి కుటుంబాల్లో ఎవరికైనా పక్కా ఇంటి పథకం కింద లబ్ధి చేకూరిందేమో నన్న అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇల్లు వచ్చినవారు ఆ కుటుంబాల్లో ఉంటే ఆ దరఖాస్తును అనర్హమైందిగా తేలుస్తారు. ఇక ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్కార్డు నంబర్ ద్వారా ఇతర ఆర్థికపరమైన లావాదేవీలతో సరిపోల్చుకునే కసరత్తు కూడా జరుగుతోంది. వెరసి అనర్హులు ఎవరికీ పొరపాటున కూడా జాబితాలో చోటు దక్కుకుండా చూస్తున్నారు. అనర్హులను గుర్తిస్తే నిధుల మంజూరులో కేంద్రం కొర్రీలు విధించే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. పేదల్లో అతి పేదలను గుర్తించేందుకు కొన్ని మార్కులు కేటాయిస్తున్నారు. ఆ మార్కులు ఎక్కువగా వచ్చిన దరఖాస్తులకు ర్యాంకులు ఇచ్చి మొదటి 4.20 లక్షల ర్యాంకులను ఎంపిక చేయనున్నారు. వారినే లబ్ధిదారులుగా గ్రామ సభల ముందు ఉంచి చర్చించి ఖరారు చేయనున్నారు. -
పేదింటికి కేంద్రం చేయూత రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి. రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్లే..చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది. గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.సాయంపై స్పష్టతకు మరింత సమయంరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో ఆశలు ‘డబుల్’!
సాక్షి, సిటీబ్యూరో: ప్రధానమంత్రి ఆవాస్యోజన(పీఎంఏవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయాలని సోమవారం జరిగిన కేంద్ర నూతన మంత్రిమండలి సమావేశం తీసుకున్న నిర్ణయంతో నగర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలోని ప్రజల కోసం రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలనుకున్నా, లక్ష ఇళ్ల పనులను ప్రారంభించి దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.దరఖాస్తులు ఎక్కువ , పూర్తయిన ఇళ్లు తక్కువ కావడంతో లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఆ సందర్భంగా ఇళ్లురాని పలువురు కన్నీళ్ల పర్యంతమయ్యారు.లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాల్లో పాల్గొన్న అప్పటి మంత్రులు కేటీఆర్, తలసాని, తదితరులు ఇప్పుడు ఇళ్లు రాని వారు దుఃఖించవద్దని, దశలవారీగా పేదలందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు దాదాపు 7లక్షల మందికి పైగా ఉండగా,పంపిణీ చేసిన ఇళ్లు 70వేలే. దీంతో తమకెప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారెందరో ఉన్నారు.ఈ నేపథ్యంలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు మంత్రిమండలి నిర్ణయించడంతో వాటికోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయోజనం చేకూరగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లులేని వారికి ఇంటి సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట తాము పేదలకు గృహ సదుపాయం కల్పిస్తామని, స్థలమున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారు.పేరేదైనా కేంద్రప్రభుత్వం సహాయం అందజేయనున్న మూడు కోట్ల ఇళ్లలో నగరానికి కూడా గణనీయమైన సాయం అందగలదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పేరేదైనా, పథకమేదైనా నగరంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి తగిన నిధులందగలవనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త
నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది. -
PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగం
సోలాపూర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్(అర్బన్) కింద ఇళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంత మంది లబ్ధిదారుల ఇంటి కల నిజమయినందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి’ అని చెమర్చిన కళ్లతో మోదీ చెప్పారు. అణగారిన వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపపడానికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే ఒక ఉదాహరణ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్ కింద సోలాపూర్లో చేపట్టిన రాయ్ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టని మోదీ తెలిపారు. 90 వేల ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. #WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others. PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5 — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. దశాబ్దాల కల నెరవేరుతోంది.. మోదీ -
ఏడాది చివరికి పూర్తి ‘ఆవాస్’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాని మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలిచ్చింది. పీఎంఏవై(అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.2 లక్షల కోట్లతో 1.18 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇందులో ఇప్పటికే 76 లక్షల గృహాలు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 42 లక్షల గృహాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం తెలంగాణలో 2.50 లక్షల గృహాలకు మంజూరులివ్వగా, ఇందులో 2.23 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికే కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4,475 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.3,314 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 21.32 లక్షల గృహాలకు మంజూరునివ్వగా, ఇందులో 7.95 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికై కేంద్రం తన వాటాగా రూ.32,499 కోట్లకు గాను రూ.20,045 కోట్లు విడుదల చేసింది. ఇక పీఎంఏవై(గ్రామీణ్) కింద కేంద్రం మొత్తంగా 2.93 కోట్ల గృహాల నిర్మాణాలను మంజూరులివ్వగా, అందులో 2.40 కోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 53 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. -
మతం చూడం.. కులం చూడం..: ప్రధాని మోదీ
గాంధీనగర్: అసలైన లౌకికవాదం అంటే.. తన దృష్టిలో వివక్ష లేకపోవడమేనని గుజరాత్ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారికి నేను చెప్పదల్చుకుంది ఒక్కటే. ప్రజల సంతోషం, వాళ్ల సౌలభ్యం.. పూర్తిస్థాయి హక్కుల కోసం పని చేయడం కన్నా గొప్ప సామాజిక న్యాయం మరొకటి లేదని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం కూడా అదే తోవలో పయనిస్తోందని అన్నారాయన శనివారం గాంధీనగర్(గుజరాత్) మహాత్మా మందిర్లో సుమారు 4 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. సంక్షేమం అందించడంలో తన ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుదందని చెప్పారు. నా దృష్టిలో సెక్యులరిజం అంటే.. వివక్ష లేకపోవడమే. అందుకే కులం, మతం అనే పట్టింపు లేకుండా వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను మా ప్రభుత్వం అందిస్తోంది. ఇలా అందరి సంతోషం, సౌలభ్యం కోసం పని చేసినప్పుడు.. అంతకు మించిన సామాజిక న్యాయం మరొకటి ఉండబోదని చెప్పారాయన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. గుజరాత్లో నిర్మిస్తున్న నివాస సముదాయాలకు శంకుస్థాపన చేశారాయన. ఈ పథకం కింద.. పేదల కోసం నాలుగు కోట్ల నివాసాలు నిర్మించామని, అందులో 70 శాతం నివాసాలను మహిళలకు అందజేయడం ద్వారా మహిళా సాధికారికతను చాటామని తెలిపారాయన. -
భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. చదవండి: పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. -
లబ్ధిదారులకే ఫ్లాట్ల నిర్వహణ పగ్గాలు
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇళ్లులేని పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు) పథకంలో నిర్మించిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మనకు ఇక్కడ అనువైన నిబంధనావళిని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో 88 యూఎల్బీల్లో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో జీ+3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 12 వేల వరకు ఉన్నాయి. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక సంక్షేమ సంఘం చొప్పున ఫ్లాట్ల యజమానులతోనే కమిటీ ఏర్పాటుచేసి వీటి అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కమిటీల ఏర్పాటు తర్వాత ఒక్కో ఫ్లాట్కు రూ.100 నుంచి రూ.150 మధ్య నిర్వహణ రుసుం వసూలు చేసి, వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు.. పీఎంఏవై–యు కింద భోపాల్లో తొమ్మిది అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించగా, రాజ్కోట్లో అంతకుమించి అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి, దిగువ, మధ్యాదాయ వర్గాలకు కేటాయించారు. వాటి నిర్వహణను సైతం వాటి యజమానులకే కేటాయించినప్పటికీ, నిర్వహణ రుసుం భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భోపాల్లో రూ.850, రాజ్కోట్లో రూ.200 ఇక మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్మించిన పీఎంఏవై–యూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్కు రూ.850 చొప్పున సంక్షేమ సంఘం వసూలుచేస్తుండగా, గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి ఫ్లాట్ యజమాని రూ.30 వేల డిపాజిట్తో పాటు ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నారు. ఈ నగదుతో ఆయా సంఘాలు అపార్ట్మెంట్ ప్రాంగణంలోని అంతర్గత పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి మోటార్ల నిర్వహణ, రక్షణ వంటి అంశాలకు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా భోపాల్లోని నివాసాలను టిడ్కో చైర్మన్ జమాన్న ప్రసన్నకుమార్, గృహనిర్మాణ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. గృహాల నిర్మాణం, సౌకర్యాల విషయంలో మన రాష్ట్రమే మెరుగ్గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ పట్టణ పేదల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్ చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి నివాసితులతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటుచేసిన తరువాత లబ్ధిదారులు భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటికోసం భోపాల్లో ప్రతి ఇంటి నుంచి రూ.850 వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అవి నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – జమాన్న ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి
సాత్నా: దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో శనివారం గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతోమంది పన్ను చెల్లింపుదార్లు తనకు లేఖలు రాశారని, ఉచితాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత పథకాల నుంచి దేశం విముక్తి పొందాలని సమాజంలోని ఒక పెద్ద వర్గం ఆశిస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. పీఎంఏవై కింద దేశంలో గత ఎనిమిదేళ్లలో పేదలకు అన్ని వసతులతో కూడిన 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గుడ్న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)–అర్బన్ పథకాన్ని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకూ కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 జూన్లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మంజూరు చేసిన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థన మేరకు పథకాన్ని 2024 డిసెంబర్ 31 కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు) -
గ్రామీణ నిరుపేదల పక్కాఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
ఏజీవర్సిటీ: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్లో నిర్మించిన మోడల్హౌస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూరల్ పార్క్ వద్ద ఉన్న కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్ని సందర్శించి ఉత్పత్తి చేసే ప్రక్రియ, నాణ్యత గురించి ఆరా తీశారు. మంత్రి సమక్షంలో ఎన్ఐఆర్డీపీఆర్, నేషనల్ స్మాల్ ఇండ్లస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
పట్టణాల్లో పీఎంఏవై ఇళ్ల పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది. -
మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే వీరి మధ్య మాటల తూటలు, భౌతిక దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల కింద పశ్చిమ బెంగాల్కు ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాలను తర్వగా విడుదల చేసేలా ఆయా సంబంధిత మంత్రిత్వశాఖలను ఆదేశించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో బెంగాల్ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమత ఆవేదన వ్యక్తపరిచారు. మరోవైపు.. పీఎం ఆవాస్ యోజన నిధుల విషయంపై కూడా మోదీని మమత నిలదీశారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామీణాభివృద్ధి జరగడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వీటికి సంబంధించిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని మమత కోరారు. -
PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు కొనే మధ్య తరగతి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.48,000 కోట్లు కేటాయించింది. 2023 నాటికి దేశంలో సుమారు 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 3 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రాల్లో సుమారు 114.02 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. వీటిలో ఇప్పటి వరకు 53.42 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు కొంటే మీరు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద మీకు ఏకంగా రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మార్చి 31, 2022 నాటికి అర్హులైన కుటుంబాలు లేదా లబ్ధిదారులకు ఇళ్లు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నందున ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం వేగంగా అమలవుతోంది. మరోవైపు రూ.60,000 కోట్లతో 3.8 కోట్ల ఇళ్లకు ట్యాప్ వాటర్ ద్వారా మంచినీటిని అందించనుంది ప్రభుత్వం. పట్టణ సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక అమలు, పాలన కోసం అర్బన్ ప్లానర్స్, ఎకనమిస్ట్లతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనుంది. (చదవండి: 5జీ టెక్నాలజీతో కేంద్రానికి భారీగా ఆదాయం..!) -
వచ్చే ఏడాది చివరికల్లా పీఎంఏవై ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట కాల పరిమితిని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణంపై టీడీపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) పరిష్కరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తాను నిర్దేశించిన కాలపరిమితి మేరకు నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 84వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త జాలా బాలాజీ గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. 45వేల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. 2022 మార్చి నాటికి 75వేలు ఇళ్లు, జూలై 22 నాటికి 70వేలు, డిసెంబర్ 22 నాటికి 72 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరంలేదంటూ ఉత్తర్వులు జారీచేసింది. -
ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి కేంద్రం
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసి పూర్తివివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామంది. తదుపరి విచారణను గురువారానికి (ఈ నెల 28వ తేదీకి) వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని తెలిపారు. ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ఈ సమయంలో ఏఎస్జీ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని చెప్పారు. -
ఇళ్ల విస్తీర్ణంలోనూ రికార్డే
సాక్షి, అమరావతి : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు విస్తీర్ణంలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా, ఇదివరకెన్నడూ ఇంత విస్తీర్ణంలో పేదల ఇళ్లు నిర్మించలేదని స్పష్టం అవుతోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే.. వారు సూచించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. బెడ్రూమ్, హాలు, వంట గది, బాత్ రూమ్, వరండాతో ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు వ్యయం చేసింది. -
గతం కన్నా మిన్నగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరిస్తోందని, నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లను కడుతోందని వారు పేర్కొంటున్నారు. అలాగే గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులను న్యాయస్థానం తీర్పు ఎంతో నిరాశపరిచింది. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే.. ఎన్బీసీ నిబంధనల ప్రకారం ఇంటిలో పడక గది, హాల్ విస్తీర్ణం 167 చ.అ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ఆ విస్తీర్ణం 169.54 చ.అ ఉంటోంది. అంటే పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులకు గాను 97.07 చ.అడుగుల లోనూ, హాల్ విస్తీర్ణం 70 చ.అ గాను 72.47 చ.అడుగుల విస్తీర్ణంలోను ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. అదే విధంగా వంట గది 35.5 చ.అ లకు గాను 35.75 చ.అ ల్లో నిర్మిస్తున్నారు. బాత్రూమ్ విస్తీర్ణం 19.4 చ.అ లకు గాను 20.52 చ.అ ఉండేలా ఇళ్లకు ప్రణాళికను రూపొందించారని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ ఇళ్ల ప్లింత్ ఏరియా 224 చ.అ, కార్పెట్ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్ ఏరియా 340చ.అ, కార్పెట్ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. (సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా ఇంటిలో ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని ప్లింత్ ఏరియాగా పరిగణిస్తారు. -
గ్రీన్ ఫీల్డ్ కాలనీల నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణాలను కూడా చేపట్టిన నేపథ్యంలో గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) కింద గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని నిబంధన విధించారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీగా ఖర్చవుతుందని.. అంత వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం సాధ్యం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వాటిలో లబ్ధిదారులు నివాసం ఉండలేరని వివరించారు. అప్పుడు ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణానికి చేసిన వ్యయం నిరర్ధకమవుతుందని, పీఎంఏవై పథకం ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధించలేమన్నారు. గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల్లో కీలకమైన లక్ష్యాన్ని (ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు జీవించేలా పట్టణాలు, గ్రామాలను తీర్చిదిద్దడం) దేశం అధిగమిస్తుందని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. మహత్తర లక్ష్యం... ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2022 నాటికి మురికివాడల్లో నివసిస్తున్న వారితోపాటూ అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యం మహత్తరమైనది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు పీఎంఏవై పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అమలవుతోన్న మహత్తర సంక్షేమ పథకాల్లో పీఎంఏవై పథకం ఒకటి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఎస్డీజీలను దేశం అధిగమిస్తుంది. పీఎంఏవై లక్ష్యం సాధించాలంటే.. ► సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరికీ ఇళ్లు పథకాన్ని కేంద్రం చేపట్టింది. గత ఏడేళ్లగా 308.2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. భారీ ఎత్తున కాలనీల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి కేంద్ర వాటా కింద రూ.2.99 లక్షల కోట్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం మూడు అంశాలపై ఆధారపడింది. అవేమిటంటే.. 1. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం 2.ఆ స్థలంలో పక్కా ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం అందించడం 3.ఆ ఇంటిని నిర్మించుకున్న కాలనీ, లేఅవుట్లలో రహదారులు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి కాలువలు లాంటి కనీస సదుపాయాలను కల్పించడం. మిషన్ పూర్తయ్యేలోగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం.. ► ప్రజాసాధికారతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం తరహాలోనే రాష్ట్రంలో 68,381 ఎకరాలను 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీకే రూ.23,535 కోట్లను ఖర్చు చేశాం. ఇందులో 28.30 లక్షల ఇళ్లను 17,005 గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో రూ.50,944 కోట్లతో చేపట్టాం. ► ఇళ్లను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయడానికి అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ర్యాంకులో అన్ని జిల్లాల్లోనూ ‘జాయింట్ కలెక్టర్, హౌసింగ్’ పేరుతో ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేశాం. ఈ పోస్టుల్లో యువ ఐఏఎస్ అధికారులను నియమించాం. మిషన్ గడువు ముగిసేలోగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే విశ్వాసం ఉంది. కనీస సదుపాయాలు కల్పిస్తేనే లక్ష్యం సాకారం.. ► గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే పీఎంఏవై పథకం లక్ష్యం సాకారం కాదు. రాష్ట్రంలో 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.34,109 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► పీఎంఏవై పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికే రూ.23,535 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి అయ్యే భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు. ► పీఎంఏవై పథకం సాకారం కావాలంటే గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అంశంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడానికి నిధులు ఇచ్చేలా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని కోరుతున్నా. -
PMAY: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. చదవండి: 9.05 లక్షల మందికి జగనన్న తోడు -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
‘త్వరలో లక్ష ఇళ్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్: త్వరలో 1.03 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 52 వేల ఇళ్లు పూర్తి చేశామని, వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయని, మరో 1.03 లక్షల ఇళ్లు 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని సభకు తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలా ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా ఇళ్లను కట్టించి ఇచ్చే పథకం లేదన్నారు. ఇప్పటివరకు ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,054 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో రూ.8,743 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులని, కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.1,311 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బిల్లులు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 9,650 కోట్లు అందించామని, రూ. 400 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనలో ఉందని చెప్పారు. రాంపల్లిలో టన్నెల్ ఫామ్ టెక్నాలజీ, దుండిగల్లో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీలను వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి పీఎంఏవై గ్రామీణ్ కింద రూ. 385 కోట్లకుగాను రూ. 190 కోట్లే విడుదల చేసిందని, ఇదే పథకం అర్బన్ విభాగంలో రూ. 2,305 కోట్లకుగాను రూ. 1,120 కోట్లే ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల మొత్తం వైశాల్యం 12 కోట్ల చదరపు అడుగులన్నారు. 75 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన వారు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే ఈ పథకం కింద సాయం చేస్తామన్నారు. -
పేదల ఇళ్లు 2022కి పూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను షెడ్యూల్ ప్రకారం 2022 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం (గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్) కింద ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, పీఎంఏవై (అర్బన్), ఆశా–ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రధాని మోదీతో సహా అందరికీ ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని విజన్ ప్రకారం.. నూతన ఏడాది 130 కోట్ల మంది భారతీయుల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. కోవిడ్–19 నుంచి కోలుకుని దేశం ఆర్థికంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నా. 2022 నాటికి అందరికీ ఇళ్లు అని ప్రధాని విజన్ నిర్దేశించుకున్నారు. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. తుపానులు, భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను క్రమం తప్పకుండా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు గృహ నిర్మాణ కార్యక్రమంతో అవినాభావ సంబంధం ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పేదలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్చువల్ విధానంలో లైట్ హౌస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారత, ఆర్థిక భద్రత.. పీఎంఏవై (అర్బన్) కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదల్లో చాలామందికి ఇంటి స్థలాలు లేవు. దీంతో సొంతిళ్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 25,433 ఎకరాల ప్రభుత్వ భూమితో సహా మొత్తం 68,677 ఎకరాలను ప్లాట్లుగా చేసి పేదలకు పంపిణీ చేశాం. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆర్థికంగా వెనుకబడ్డ వారికోసం 16,098 కాలనీలను అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లను కట్టించడమే కాదు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.12,410 కోట్లు ఖర్చు అవుతుంది. అందరికీ ఇళ్ల కింద రాష్ట్రానికి 20.21 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. 2022 నాటికి షెడ్యూల్ ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లను లబ్ధిదారులైన మహిళల పేర్లతోనే రిజిస్టర్ చేస్తున్నాం. మహిళా సాధికారత, ఆర్థిక భద్రత దిశగా ఇది దోహదపడుతుంది. ఆర్థిక రంగానికి భారీ ఊతం.. గృహ నిర్మాణ రంగంలో సుస్థిర, పర్యావరణ అనుకూల, విపత్తులను తట్టుకునే గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ను ప్రధానమంత్రి ప్రారంభించడం అభినందనీయం. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్ధ బాగా మందగించింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల వల్ల ఆర్థిక రంగానికి భారీ ఊతం లభిస్తుంది. 30 రకాల వృత్తిదారులకు ఇళ్ల నిర్మాణాల వల్ల ఉపాధి లభిస్తుంది. తాపీ పనిచేసేవారు, కార్పెంటర్లు, ప్లంబర్లు.. ఇలా అనేక మంది ఉపాధి పొందుతారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలుగుతాం. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప ప్రయాణం చేసింది. అర్హులైన వారందరికీ 100 శాతం ఇళ్ల పట్టాలు మంజూరు చేశాం. తొలిదశలో 67 శాతం ఇళ్లను కూడా మంజూరు చేశాం. దీనికి అదనంగా 8.95 లక్షల ఇళ్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మంజూరయ్యాయి. పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన రాష్ట్రాల కింద ఏపీని ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా ప్రణాళిక, చక్కటి సదుపాయాలతో గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పురస్కారాలు దక్కాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రానికి 3 జాతీయ అవార్డులు లభించాయి. బెస్ట్ ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక విభాగంలో 2 అవార్డులు, ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో విశాఖకు మొదటి ర్యాంకు, అవార్డు దక్కింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ బాలశౌరి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తదితరులు క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
సొంత ఇల్లు ఉండాలని... అందులో హాయిగా జీవించాలనీ... తరతరాలకూ అది తమకు స్థిరాస్తిగా నిలవాలనీ ప్రతి ఒక్కరి ఆశ. అందులో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. కానీ నిరుపేదల ఆశలు తీరేదెలా? ఇల్లు కట్టేంత స్థోమత వారికెక్కడిదీ? వీటన్నింటికీ సమాధానమే పీఎం ఆవాస్యోజనా. పట్టణ ప్రాంత పేదలకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ద్వారా అర్హులైనవారికి ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇందుకోసం జిల్లాకు 30,760 యూనిట్లు కేటాయించారు. త్వరలో వీటి పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. విజయనగరం: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలు మంజూరు చేసింది. విజయనగరం జిల్లాలో వీఎంఆర్డీఏ, బుడా పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు, మున్సిపాలిటీలకు 30,760 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వీఎంఆర్డీఏ పరిధిలో 13,950, బుడా పరిధిలో 12384 ఇళ్లతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు 4426 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న నెల్లిమర్ల మండలానికి 7101 గృహాలు, చీపురుపల్లి మండలానికి 3415 గృహాలు, ఎస్కోట మండలానికి 3434 గృహాలు మంజూరయ్యాయి. అదేవిధంగా స్థానిక సంస్థలైన బొబ్బిలి మున్సిపాలిటీకి 453, సాలూరు మున్సిపాలిటీకి 267, పార్వతీపురం మున్సిపాలిటీకి 3706 గృహాలు మంజూరు చేశారు. బుడా పరిధిలోని కురుపాం మండలానికి 431, సాలూరు మండలానికి 4095, పార్వతీపురం మండలానికి 1071, సీతానగరం మండలానికి 1271, బొబ్బిలి మండలానికి 4191, దత్తిరాజేరు మండలానికి 1325 గృహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సొంత ఇల్లు నిర్మించుకోవటానికి పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చాలీచాలనీ అద్దె గదుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గృహాలు మంజూరు చేయడంతో పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణ వ్యయం పెరిగింది. దీన్ని దష్టిలో ఉంచుకుని యూనిట్ విలువలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గృహాలకు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలు రాయితీ ఇస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రానున్నారు. స్థలం ఉన్న వారికి తొలుత ఇళ్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వం ఉగాది నాటికి పేదలకు ఖాళీ స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్థలాలు అందితే మరింత మందికి గృహయోగం కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ గృహ నిర్మాణ పథకంలో కేటాయించిన గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయి. పట్టణాల్లో ఇంటికి రూ.3.5లక్షలుగా నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్రం రూ.లక్ష రాయితీ ఇస్తారు. బ్యాంకు రుణం రూ.75వేలు వస్తోంది. లబ్ధిదారు తన వాటాగా రూ.25వేలు భరించాల్సి ఉంటుంది. పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో కేటాయించిన గృహాలకు ఒక్కో దానికి రూ.2లక్షలు యూనిట్ ధర నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఇస్తుంది. వలంటీర్ల సర్వేద్వారా లబ్ధిదారుల ఎంపిక.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, వైఎస్సార్ అర్బన్ పథకంలో మంజూరైన గృహాలకు అర్హులైనవారిని వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఎంపిక చేస్తారు. వారు నిర్వహించిన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. వీరిలో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం. 30,760 ఇళ్లు మంజూరు.. పీఎం ఆవాస్ యోజన పథకంలో జిల్లాకు 30,760 ఇళ్లు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు కేటాయిస్తాయి. రాష్టంలో వైఎస్సార్ గృహ నిర్మాణ పథకంలో నిధులు మంజూరు చేస్తారు. పట్టణాలు, గ్రామాల్లో వలంటీర్లు చేసిన సర్వే ఆధారంగా పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దీనికి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక ప్రొఫార్మా సిద్ధం చేస్తున్నాం. – ఎస్.వి.రమణ, పీడీ, హౌసింగ్ -
రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రానికి 2,58,648 గృహాల్ని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్)ను పట్టణ గృహ నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో జరిగిన మంజూరు–పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. 57,629 గృహాలు పట్టణ ప్రాంతాల్లో, 2,01,019 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరయ్యాయి. ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ. 7,042.50 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ. 3,879.72 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1,581.39 కోట్లు, లబ్ధిదారుడి వాటా లేదా బ్యాంకు రుణం రూ. 1,581.39 కోట్లు. గత నెలలో మంజూరైన 1,24,624 గృహాలతో కలిపితే మొత్తం 3,83,272 గృహాలు రాష్ట్రానికి మంజూరయ్యాయి. -
డిసెంబర్ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద మంజూరైన గృహాల్లో నిర్మాణంలో ఉన్న వాటిలో 70 వేల గృహాల నిర్మాణం డిసెంబర్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ పరిపాలన, ఏపీటిడ్కో అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో పీఎంఏవై పథకంపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా నిధులతో తక్కువ పెట్టుబడితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆ ఇళ్లకు అవసరమైన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటర్నల్ రహదారుల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు మాట్లాడుతూ.. పట్టణాల్లో పీఎంఏవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 లక్షల గృహాలను కేటాయించగా, 3.93 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైందని, డిసెంబరులోగా 70 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం సంబంధిత అధికారులతో సమీక్షించారు. తొలి విడతలో 60,693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలను ఎప్పటిలోగా అమలు చేసేది స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పట్టణంలో ప్లాస్టిక్ పొట్లాల్లో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి దానిని పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు
న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరాక తొలి ‘ప్రగతి (ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు. ‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ అంశాలపైనా సమీక్ష జరిగింది. -
ఆపద వస్తే అంతే సంగతి
సాక్షి, మల్కాపురం (విశాఖపట్నం): రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొట్టకూటి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే సుమారు ఐదు కిలీమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి వచ్చిన వారు అనేక బాధలు పడుతున్నారు. 48వ వార్డు అచ్చినాయుడులోవ కొండ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 4,600 ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఏడు నెలల నుంచి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సుమారు ఐదు వందల మంది కార్మికులు సివిల్ పనులు, రాడ్బెండింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం కాంట్రాక్టర్ (టాటా)బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చారు. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కార్మికులకు కనీస వసతులు లేవు. వీరికి మరుగుదొడ్లు, సేద తీరేందుకు షెల్టర్గానీ లేవు. ముఖ్యంగా వైద్య సదుపాయం పెద్ద సమస్యగా మారింది. సివిల్ పనులు చేస్తున్న కార్మికులకు ఏదైన ప్రమాదం జరిగిన, మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయినా ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా సదుపాయం లేదు. గత నెల తివారీ అనే వ్యక్తి రాడ్బెండిగ్ పనులు చేస్తుండగా ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తొటి కార్మికులు సైట్ ఇన్చార్జ్కు సమాచారం అందించారు. ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనం లేకపోవడంతో తోటి కార్మికులే చేతుల మీద ఐదు కిలో మీటర్ల కొండ దిగువకు తీసుకువచ్చి వైద్యం చెయ్యించారు. కొండ ప్రాంతంలో పనిచేస్తుండడంతో విషసర్పాలు కాటు వేసినా లేక మరేం ప్రమాదం జరిగినా తక్షణ వైద్యం సాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఒక్కోసారి క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. బతుకు దెరువు కోసం ఇక్కడకు వస్తే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యపై ఏపీ క్విట్కో ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.ఆర్.కే.రాజును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. అత్యవసర పరిస్థితి వస్తే అంతే.. తమ కార్మికులకు ప్రాణాపాయం వస్తే పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఎవరూ లేరు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఐదు కిలీమీటర్లు రావాలి. సమీపంలో వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. – రామ్జీ, బీహార్ కనీస వసతులు కల్పించాలి బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పరిస్థితి చూస్తే భయం కలుగుతోంది. కొండ ప్రాంతంలో తమపై ఏదైనా జంతువులు గానీ, విషసర్పాలు గానీ దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటీ. వైద్య సదుపాయాలు ఇక్కడ కల్పించాలి. - ముఖేష్ తమర్, జార్ఖండ్ -
పీఎంఏవై.. పత్తా లేదోయ్!
హోరున గాలి వీస్తుంటే మట్టి గోడల పక్కన భయంభయంగా బతకాల్సిందే. జోరున వాన కురుస్తుంటే చిల్లులు పడిన రేకుల కింద బకెట్లు మారుస్తూ రోజులు గడపాల్సిందే. ఏనుగుల ఘీంకరింపులు వినిపించిన వేళ తంతే విరిగిపోయే తలుపుల వెనుక నోరు కట్టుకుని మౌనంగా ఉండాల్సిందే. గిరిజన గూడేల్లోని గుడిసెల బతుకుల్లో మార్పు రావడం లేదు. పక్కా ఇంటికి మారాలన్న వారి కల నెరవేరడం లేదు. రెండేళ్లుగా ఊరించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆఖరుకు ఉసూరుమనిపించింది. అర్హులను గుర్తించి ఆ తర్వాతి పనులు ఆపేసింది. ఫలితంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు పూరి గుడిసెల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం, సీతంపేట: ఐటీడీఏ పరిధిలో పీఎంఏవై పథకం దాదాపు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. రెండేళ్లుగా ఈ పథకం ద్వారా ఒక్క ఇంటిని కూడా మం జూరు చేయలేదు. దీంతో గిరిజనులు మళ్లీ ఆ పాత ఇళ్లలోనే కాలం నెట్టుకురావాల్సి వస్తోంది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకం వీరి బతుకులను మార్చలేకపోతోంది. 2017లో ఈ పథకం ద్వారా ఆగమేగాలపై పల్స్ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఇంటింటా సర్వే చేశారు. మండలానికి 3 నుంచి 4 వేల వరకు గృహాలు అవసరమని గుర్తించారు. ఈ మేరకు వినతులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఈ పథకానికి సంబంధించిఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో సుమారు 60 వేల కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవని సర్వేలో గుర్తించారు. కానీ అలా గుర్తించిన వారికి ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వలేదు. కొద్ది నెలల కిందట వచ్చి తిత్లీ తుఫాన్కు ఉన్న రేకులు, పూరిళ్లు ఎగిరిపోవడంతో గిరిజనులు పడుతున్న బాధలు రెట్టింపయ్యాయి. 2016లో కేవలం సీతంపేట మండలానికి సంబంధించి పీఎంఏవైలో మాత్రమే 33 గృహాలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి మరెవరికీ గృహాలు మంజూరు కాని పరిస్థితి ఉంది. ఈ పథకంలో ఒక్కో గృహానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందివ్వాలని గతంలో నిర్ణయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి అతీగతి లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణానిదీ అదే దారి ఎన్టీఆర్ గృహనిర్మాణానిది కూడా దాదాపు ఇదే దారి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఈ పథకం కింద 148 గృహాలు మాత్రమే మంజూరయ్యాయి. పాలకొండ డివిజన్లో 770, టెక్కలి డివిజన్ పరిధిలో 158 మాత్రమే మంజూరయ్యాయి. మొత్తం 1076 మంజూరు కాగా వీటిలో 500ల వరకు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటికి ఎన్నికల హామీల్లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లో గృహాల నిర్మాణానికి రూ.2లక్షల 75 వేలు ఇస్తామని ఇందులో రూ. 1.75 వేలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చ లేదు. కేవలం రూ.లక్షా 50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికితోడు గత కొద్ది రోజులుగా నూతనంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆన్లైన్లో ఏఈల ఆధార్ అథంటికేషన్ నిలిచిపోవడమేనని చెబుతున్నారు. హౌసింగ్ ఏఈ ఏమన్నారంటే... ఈ విషయమై హౌసింగ్ ఏఈ సంగమేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పీఎంఏవై గృహాలకు సంబంధించి గతంలో పల్స్ సర్వే చేశామని ఇంకా ఇళ్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం బిల్లులు చెల్లింపులకు సర్వర్ నిలిచినట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు గిరిజనులకు పూర్తిస్థాయిలో గృహాలు మంజూరు చేయాలని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అలాగే ఉన్న హౌసింగ్ పథకాలకు సైతం దిశానిర్దేశం లేదు. పీఎంఏవై గృహాల మంజూరు లేదు. ఎన్టీఆర్ గృహాలు కూడా ఒక్కో మండలానికి వంద లోపే తూతూ మంత్రంగా మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.– విశ్వాసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే ఇల్లు ఇవ్వడం లేదు గృహం మంజూరు కాక అవస్థలు పడుతున్నాం. పూరిళ్లలో నివసిస్తున్నాం. ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు గృహాలు మంజూరు చేయాలి. – అమావాస్య, అచ్చిభ బిల్లులు రాలేదు కొన్నేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికీ బిల్లులు కావడం లేదు. దీంతో పునాదులు నిర్మించినా బిల్లులు ఇవ్వకపోడంతో కష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి కట్టడం జరిగింది. ప్రభుత్వ కరుణ లేదు.– ఎస్.పట్టాభి, అంటికొండ -
‘డబుల్’ దగా!
పారదర్శకత.. విశ్వసనీయత.. అందరికీ సమన్యాయం అంటూ ఊదరగొట్టే అధికార పార్టీ నాయకులు ప్రజలను నిలువునా ముంచుతున్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ విస్త్రృతస్థాయిలో ప్రచారం చేసిన ప్రభుత్వం.. తీరా ఫ్లాట్ల కేటాయింపుల్లో అస్మదీయులకే పెద్దపీట వేసింది. అప్పులు చేసీ మరీ డీడీలు చెల్లించిన లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఆన్లైన్ కేటాయింపు పత్రాలు చూసి అవాక్కయ్యారు. అంతా అవకతవకలుగా ఉండడంతో నష్టపోయామని గ్రహించిన ‘పీఎంఏవై– ఎన్టీఆర్ నగర్’ లబ్ధిదారులు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. పటమట(విజయవాడ తూర్పు): గూడు లేనివారికి శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం.. నమ్మించి మోసం చేసిందని పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్ పథక లబ్ధిదారులు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించటంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అనుచరులు, టీడీపీ వర్గాల వారికి డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను కేటాయించి, అర్హులైన లబ్ధిదారులకు సింగిల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. 8,285 మంది లబ్ధిదారులు ఓటు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు నగరంలోని ఆయా డివిజన్లలో 8,285 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని ప్రకటించటం, కేటాయింపు పత్రాల్లో కనీసం కమిషనర్ సంతకం కూడా లేకపోవటంతో సోమవారం వీఎంసీ ప్రధానకార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ముట్టడికి లబ్ధిదారులు యత్నించారు. ఇళ్లకేటాయింపులో తమకు 430 చదరపు గజాల ఫ్లాట్ ఇస్తామన్నారని.. అందుకు లబ్ధిదారుల వాటాగా రూ. 25 వేలు చెల్లించాలని చెప్పిన కార్పొరేషన్ అధికారులు, తమ వద్ద నుంచి డీడీలు కూడా తీసుకున్నారని తెలిపారు. తీరా కేటాయింపులు మాత్రం 300 చదరపు అడుగుల ఇళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా టీడీపీ అనుచరులకు ఫ్లాట్ల కేటాయింపులు అధికంగా జరిగాయని, ఆన్లైన్ ప్రక్రియతో పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయని చెప్పిన అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమను మోసం చేశారని మండిపడ్డారు. సాధ్యం కాదు.. ఫ్లాట్ నంబర్ల కేటాయింపులో కీలకంగా ఉన్న కమిషనర్ తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్)డి. చంద్రశేఖర్ లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపారు. తామందరికీ డబుల్బెడ్ రూంలు కేటాయించాలని లబ్ధిదారులు పట్టుపట్టారు. అయితే అది సాధ్యం కాదని ఏసీజీ వివరించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని సంఘటన వద్దకు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు న్యాయం చేసే వరకు చాంబర్ నుంచి కదలమని బైఠాయించటంతో పోలీసు లు రంగప్రవేశంచేసి ఆందోళన కారులను చెదరగొట్టి, అనంతరం వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. అన్యాయం చేశారు మా ఇంట్లో ఆరుగురం ఉన్నాం. కేటాయింపుల సమయంలో మా వద్ద రెండు పడకల గదులకు ఇల్లు మంజూరు జరిగిందని అందుకు రూ.25 వేలు చెల్లిచాలని చెప్పటంతో అప్పుచేసి మరీ చెల్లించాం. తీరా ఇప్పుడు చూస్తే 300 అడుగుల ఇంటిని కేటాయించామని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడుతుంటే కావాలంటే తీసుకోండి.. లేదంటే డీడీలు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది.– షేక్ మస్తాన్బి, లబ్ధిదారురాలు, అజిత్సింగ్నగర్ ఇదేమి చోద్యం నా భార్య సంకు సామ్రాజ్యం పేరిట మాకు ఫ్లాట్ వచ్చింది. దరఖాస్తులో మేము డబుల్ బెడ్ రూంని ఎంపిక చేసుకున్నాం. కేటాయింపు పత్రం కూడా డబుల్బెడ్ ఇంటికి మంజూరయ్యిందని అధికారులు చెప్పారు. కానీ ఆన్లైన్ లాటరీ వ్యవహారంలో సింగిల్బెడ్ రూం అని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడిగితే కావాలంటే తీసుకోండి.. లేదంటే లేదు అని దురుసుగా సమాధానమిస్తున్నారు.– సంకు కోటేశ్వరరావు, లబ్ధిదారుడు, నాలుగో డివిజన్ -
‘పీఎంఏవై కింద రాముడికి ఇల్లు ఇవ్వండి’
లక్నో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీరాముడికి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ అయోధ్య జిల్లా మేజస్ట్రేట్కు లేఖ రాశారు. రాముడు ప్రస్తుతం టెంట్లో ఉంటున్నారని యూపీ ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు.కాగా అయోధ్యలో రామమందిరం ఎప్పుడు నిర్మించినా అది తమ హయాంలోనే జరుగుతుందని, మరొకరితో సాధ్యం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ సంస్కృతే భారత సంస్కృతని అన్నారు. మరోవైపు అయోధ్యలో మందిర నిర్మాణానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. మందిర్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాదని పేర్కొన్నారు. -
‘9 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. లక్ష నిర్మించారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు 9.59 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక లక్ష ఇళ్లు మాత్రమే కట్టిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2015 నుంచి ఇప్పటివరకు 9 లక్షల 59 వేల 847 ఇళ్లు కేటాయించింది. కేంద్ర సాయం కింద 14వేల 414 కోట్ల రూపాయల విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు లక్ష 9 వేల 969 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింద’ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో తెలిపారు. అంతేకాకుండా రాతపూర్వకంగా జావాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం కింద రాష్ట్రానికి 3,267 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 5,298 ఇళ్ల సేకరణ/నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ పథకం కింద 113 కోట్ల రూపాయల నిధులు కూడా రాష్ట్రానికి విడుదల చేసినట్టు చెప్పారు. పీఎంఏవై కింద విడుదల చేసిన 3,267 కోట్ల రూపాయలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2,788 కోట్ల మేరకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని పేర్కొన్నారు. ఆంధ్ర జాలర్లను విడిపించేందుకు చొరవ తీసుకోండి: ఉపరాష్ట్రపతి పాక్ అదుపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ జాలర్లను విడిపించే దిశగా చొరవ తీసుకోవాలని అధికారులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. నవంబర్ నెలలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన 20 మంది జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే పాక్ కోస్ట్ గార్డు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించేందుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరడంతో విదేశాంగ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఏపీ జాలర్లను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నిస్తామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. -
ససేమేరా..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు తీసుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. 3వేల మందికి పైగా దరఖాస్తు చేసినా అందులో నాలుగో వంతు కూడా లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కడప కార్పొరేషన్: పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్ ఫర్ ఆల్ (ఎన్టీఆర్ నగర్)లో అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దీనిని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీనగర్ వద్ద దీనిని మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. మూడు దశల్లో మొత్తం 19,232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉండగా వారికి ఇంటి స్థలాలు వేరొక చోట ఇచ్చేందుకు కలెక్టర్ సమ్మతి తెలిపినట్లు తెలిసింది. రెండో దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2,143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో హౌసింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మాత్రమే మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చి నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇళ్లు ఎప్పుడు పూర్తి అవుతాయనేది అనుమానంగానే ఉంది. ఇదిలా ఉండగా కడపలో కట్టిన ఇళ్లకు లబ్ధిదారులు సుముఖత చూపకపోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఎన్ని ఆశలు కల్పించినా స్పందన అంతంత మాత్రమే... షీర్వాల్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతిలో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రజలను ఎన్టీఆర్ నగర్కు తీసుకెళ్లి ఇళ్లు చూపించి ఆహా, ఓహో అంటూ గొప్పలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా లబ్ధిదారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పుడు కేవలం రూ.500 చెల్లించి ప్లాట్ తీసుకుంటే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను ఇస్తుంది కాబట్టి ఇల్లు మిగిలిపోతుందని కొందరు ఆశలు కల్పించారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కారణాలివే... ఎన్టీఆర్ నగర్లో ప్లాట్లు తీసుకోక పోవడానికి అనేక కారణాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం,సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రానట్లు తెలుస్తోంది. ఇళ్లకు నీటిని సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉన్నాయి. చాలామంది వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు కావాలని బలంగా కోరుకుంటున్నారే తప్ప ఆపార్ట్మెంట్ తరహాలో కట్టే ఇళ్లను ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 3న లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయింపు డిసెంబర్ 3న కడపలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ నగర్లోని ప్లాట్లు కేటాయించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్లో ఈ కేటాయింపులు జరపనున్నారు. అంధులు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కడపలో 2,600 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 670 మంది మాత్రమే లబ్ధిదారుని వాటా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం 940 ఇళ్లు నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నందున మిగిలిన వారిని ఎక్కడి నుంచి తేవాలని అధికారులు సతమతమవుతున్నారు. -
2022లోపు ప్రతి పేదోడికి పక్కా ఇల్లు
సుభాష్నగర్ (నిజామాబాద్అర్బన్): దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2022 లోపు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ సహాయమంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బులను అవసరమైనప్పుడు వాడుకునేలా చట్టబద్ధం చేశామని తెలిపారు. కార్మిక చట్టాల నిబంధనలను సరళతరం చేశామని, కార్మికులకు ఉపయోగపడేలా చట్టాల్లో అనేక మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. -
సొంతింటి సంకటం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గృహ లబ్ధిదారులుఇరకాటంలో పడ్డారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయో లేదో తెలియదు కాని లబ్ధిదారులు మాత్రం వరుసగా మూడు వాయిదాల సొమ్ము చెల్లించాల్సిందేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోఅందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పశ్చిమగోదావరి,భీమవరం టౌన్: ప్రభుత్వం పట్టణాలలో అట్టహాసంగా చేపట్టిన అందరికీ ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. కొన్ని బ్యాంకులు ఇంకా లబ్ధిదారులతో అకౌంట్లు ప్రారంభించుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఇల్లు ఎప్పటికి వస్తుందో తెలియదుగాని ఒక్కసారిగా లబ్ధిదారుని వాటా సొమ్ము మొత్తం చెల్లించాలనడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీప్లస్ 3 తరహాలో ఇళ్లు : సొంతిల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న ఆశయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భీమవరం పట్టణం తాడేరు రోడ్డులో 82 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలంలో జీప్లస్ 3 తరహాలో 9,500 ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత దీన్ని 8,352 గృహాలకు పరిమితం చేసిఏపీ టిడ్కో పర్యవేక్షణలో ఎల్అండ్టీ కంపెనీ నిర్మాణం చేపట్టింది. తొలినుంచీ ప్రహసనమే లబ్ధిదారుల ఎంపిక తొలి నుంచి ప్రహసనంగా మారింది. అర్హులను దరఖాస్తు చేసుకోమని ఆ తర్వాత వివిధ నిబంధనలతో మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ఏడాదికి పైగా ప్రదక్షిణలు చేయించారు. పేదలతో రూ.200 వ్యయం చేయించి పాన్ కార్డులు కూడా చేయించారు. ఇల్లు మంజూరు అయ్యిందో లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు కొంత మందికి ప్లాట్లు కేటాయించినట్లు నంబర్లు ఇచ్చారు. ఈ పథకంలో కేటగిరి ఎ, కేటగిరి బి, కేటగిరి సి గా విభిజించారు. కేటగిరి ఎలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.500 ఒక విడత చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు రుణం రూ.2,64,500. కేటగిరి బిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ. 50,000 ఒక విడతలోగాని నాలుగు విడతల్లోగాని చెల్లించవచ్చు. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు. కేటగిరి సిలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.1,00,000. ఒక విడతలోగాని నాలుగువిడతల్లోగాని చెల్లించ్చవచ్చు. బ్యాంకు రుణం రూ.3.65 లక్షలు. ఒకేసారి చెల్లించాలంటూ.. ఇల్లు మంజూరు కాగానే లబ్ధిదారుడు తొలి విడతగా తన వంతు వాటాను భీమవరం మున్సిపాలిటీ కమిషనర్ పేరిట బ్యాంకుల్లో డీడీ తీసి అందచేశారు. కేటగిరీ ఎలో రూ.500 చెల్లించడంతో లబ్ధిదారుని వాటా పూర్తయ్యింది. ఇక కేటగిరి బి విభాగంలో లబ్ధిదారులు తొలి దఫాగా రూ.12,500, కేటగిరి సీ లబ్ధిదారులు తొలి విడతగా 25,000 చెల్లించారు. తాజాగా ప్రస్తుతం ఒక వాయిదా, డిసెంబర్లో రెండు వాయిదాల సొమ్ము చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఒకేసారి ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పేదల్లో ఆందోళన మొదలైంది. కేటగిరి బిలో 3,520 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో బ్లాక్కు 32 ఫ్లాట్ల వంతున 110 బ్లాకులు నిర్మిస్తారు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు బి.కేటగిరీ విభాగం లబ్ధిదారులు రూ.88 లక్షలు, సి కేటగిరీ విభాగంలో లబ్ధిదారులు రూ.7.4 కోట్లు మొత్తం రూ.7.92 కోట్లు చెల్లించే భారం పేదలపై పడుతోంది. ఆ వెనువెంటనే రెండు కేటగిరీల్లోని లబ్ధిదారులు మరో రూ.3.96 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇది పేదలకు గుదిబండగా మారింది. బ్యాంక్ రుణం పొందేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకూ బ్యాంకులు రుణం మంజూరు చేసే విషయంలో స్పష్టమైన హామీని ఇవ్వలేదు. కొన్ని బ్యాంకులు లబ్ధిదారునితో అకౌంట్లు ప్రారంభించేందుకు కూడా అంగీకరించడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే అన్ని వివరాలతోపాటు ఫ్లాట్ కేటాయింపు పత్రం, లీగల్ ఒపీనియన్, ట్రై పార్టైట్ అగ్రిమెంట్ సేల్ డీడ్ పత్రాలు కూడా అవసరమవుతాయి. ఇంత వరకూ ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు. బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇంటిపై లబ్ధిదారునికి సొంత యాజమాన్య హక్కు కలుగుతుంది. అప్పుడే యాజమాన్యపు దస్తావేజులు అందచేస్తారు. అన్నీ వాయిదాలే 2017 జూన్ 19న ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 15 నెలల వ్యవధిలో పూర్తి చేసి గృహప్రవేశాలు జరిపిస్తామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాయిదాలు పడుతూనే వస్తోంది. గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతోపాటు బాహ్య భౌతిక సదుపాయాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తేనే లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేయగలడు. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదుగాని లబ్ధిదారున్ని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారునితో వాయిదా సొమ్ము డీడీలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వ పరంగా జరిగిన జాప్యానికి ఇప్పుడు ఒకేసారి భారం మోపుతున్నారు. ఒక్కసారిగా ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మహిళలు మున్సిపాలిటీ వద్ద ధర్నా చేశారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావు పేదలతో మాట్లాడుతూ ముందుగానే లబ్ధిదారుని వాటా నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతీ మూడు నెలలకో వాయిదా చెల్లించాలని తొలి వాయిదా 2017లో కట్టారని మిగిలింది చెల్లించక తప్పదన్నారు. ప్రస్తుతం ఒక వాయిదా వచ్చేనెల ఒక వాయిదా, ఇల్లు ఇచ్చే ముందు మరో వాయిదా చెల్లించాలని సూచించారు. బ్యాంకు రుణాలకు వెళ్లాలంటే వాయిదాలు చెల్లించాలన్నారు. పేదల విజ్ఞప్తిని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి తీసుకు వెళతానన్నారు. అయితే పేదలు మాత్రం ఇంటి అద్దె కట్టడానికే ఇబ్బందులు పడుతున్నామని ఒకేసారి తాము వాయిదాలు చెల్లించలేమని బ్యాంకులు కూడా రుణం ఎప్పుడు ఇస్తాయో ఇంత వరకూ స్పష్టత లేదని నిరసన వ్యక్తం చేశారు. అవస్థలు పడుతున్నాం ఇంటి అద్దె చెల్లించలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇంటి ఖర్చులు తగ్గించుకుని మిగిల్చి దాన్ని అద్దెగా చెల్లించాల్సిన పరిస్థితి మాది. ఇల్లు మంజూరైందంటే ఎంతో ఆనందపడ్డాం. కాని ఇప్పుడు ఒకేసారి వాయిదాలు చెల్లించాలంటే రోజుకు ఒక పూటయినా కుటుంబం పస్తులు ఉండాల్సిందే. అప్పులు చేయాలి ఆ బాకీకి వడ్డీ చెల్లించాలంటే ఎన్నో తిప్పలు పడాలి. ఇలాంటి విధానం సరికాదు. పేదలకు వెసులుబాటు కల్పించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలి.– నజీరుద్దిన్, 19వ వార్డు, భీమవరం త్రైపాక్షిక ఒప్పందం పూర్తికావాలి బ్యాంకర్లకు, లబ్ధిదారులకు ఒప్పందం కుదరాలంటే నాలుగు వాయిదాల సొమ్ము చెల్లించి ఉండాలి. ప్రతి మూడు నెలలకు ఒక వాయిదా చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యమైంది. ఇళ్లు త్వరితగతిన కేటాయించాలంటే ట్రైపార్టైట్ (త్రైపాక్షిక ఒప్పందం) పూర్తి కావాలి. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులు వాయిదాల డీడీ అందచేయాల్సి ఉంది. లబ్ధిదారునిపై ఇప్పటి వరకూ ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఈ పాటికే వాయిదాలు చెల్లించి ఉంటే సరిపోయేది.– సుబ్రహ్మణ్యం, ఏపీ టిడ్కో ఈఈ -
ప్రాపర్టీప్లస్ 24th June 2018
-
2022 నాటికి అందరికీ ఇళ్లు
న్యూఢిల్లీ: దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి భారతీయునికి సొంతిల్లు కల్పించేలా ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గృహ నిర్మాణ రంగం నుంచి అవినీతి, దళారుల బెడదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు చవక ధరలో వేగంగా ఇళ్లు నిర్మించేందుకు అధునాతన సాంకేతికత తోడ్పడుతోందని తెలిపారు. ఎన్డీయే నాలుగు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మోదీ మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో ముచ్చటించారు. గత ప్రభుత్వం కన్నా ఎంతో మిన్నగా తక్కువ ధరకు, వేగంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. సమయం తగ్గింది..సాయం పెరిగింది.. ‘లబ్ధిదారులు సొంత ఇళ్లను పొందడంలో అవరోధాలు ఏర్పడకుండా చూసేందుకు అవినీతి, మధ్యవర్తులను తొలగించడానికి కృషిచేస్తున్నాం. అధునాతన సాంకేతికత గృహ నిర్మాణ రంగానికి కొత్త శక్తినిచ్చింది. దాని వల్ల వేగంగా, చవక ధరలకే ఇళ్ల నిర్మాణం పూర్తవుతోంది. ఈ పథకంలో అధిక ప్రాధాన్యం మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకే ఇస్తున్నాం. పీఎంఏవై ప్రజల గౌరవంతో ముడిపడి ఉన్న పథకం. ఈ పథకం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అందరికీ ఇళ్లు కల్పించాలన్న లక్ష్యాన్ని నాలుగేళ్లుగా ఒక దీక్షగా చేపట్టాం. 2022 నాటికి ప్రతి భారతీయుడు సొంత ఇంటిని కలిగి ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పథకం కింద ఒక ఇంటి నిర్మాణానికి పడుతున్న సమయాన్ని 18 నెలల నుంచి 12 నెలలకు తగ్గించాం. ఇంటి పరిమాణాన్ని 20 చ.మీ. నుంచి 25 చ.మీ.కు పెంచాం. ఆర్థిక సాయం ఒక్కో ఇంటికి రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరిగింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో కోటి, పట్టణాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పట్టణాల్లో 47 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం’ అని మోదీ అన్నారు. ఉత్తమ వర్సిటీల్లో మనవీ ఉండాలి.. భారత విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని ఉత్తమ వర్సిటీల సరసన చేరేలా కృషిచేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ విషయంలో గవర్నర్లే చాన్స్లర్ల హోదాలో విశ్వవిద్యాలయాలకు చోదకశక్తిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల మధ్య సామరస్యం, సయోధ్యను ప్రోత్సహించేందుకు గవర్నర్లు చొరవచూపాలని అన్నారు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం ముగిసిన రెండు రోజుల గవర్నర్ల సదస్సులో మోదీ ప్రసంగించారు. విద్యా విషయాల్లో వర్సిటీలు అత్యుత్తమ ప్రమాణాలు సాధించేలా గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు(2022), గాంధీ మహాత్ముడి 150వ జయంతి(2019) లాంటి సందర్భాలు అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరేపకాలుగా పనిచేస్తాయన్నారు. పర్యావరణహితంగా అభివృద్ధి అభివృద్ధి పర్యావరణహితంగా ఉండాలని, ప్రకృతిని పణంగా పెట్టి దాన్ని సాధించకూడదని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతితో సహజీవనం చేయాల్సిన ప్రాధాన్యాన్ని మన సంప్రదాయాలు, ఆచారాలు వివరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన ప్లీనరీ కార్యక్రమానికి మోదీ చైర్మన్గా వ్యవహరించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ..మొత్తం మానవాళికే ప్లాస్టిక్ ముప్పుగా మారేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కేంద్రం పథకంలో తెలంగాణ సున్నాశాతం పనితీరు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది. 0శాతం పనితీరుతో తెలంగాణ రాష్ట్రాల జాబితాలో చివరిస్థానంలో ఉండటం గమనార్హం. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో 43శాతం పనితీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఇక 86శాతం పనితీరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. -
ఆవాస్ యోజనతో సొంతిల్లు సాకారం
పశ్చిమగోదావరి, నిడమర్రు: పట్టణ ప్రాంత ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో సాధారణ వడ్డీరేటుతో పోల్చితే వడ్డీ రాయితీ ఇస్తున్నారు. క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి జిల్లాలోని ఎనిమిది పట్టణాలను ఎంపిక చేసినట్టు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఈ.సుధాకర్ తెలిపారు. పథకం వివరాలు తెలుసుకుందాం.. మొదటిసారి మాత్రమే మొదటిసారి సొంతంగా ఇల్లు కొనుక్కునేవారు మాత్రమే పీఎంఏవై పథకానికి అర్హులు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రుణం తీసుకోవచ్చు. కాకపోతే రాయితీ మాత్రం ఒకరికే వర్తిస్తుంది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలను నిర్మిస్తున్నా రుణం అందుతుంది. అయితే అప్పటికే ప్రభుత్వ పథకాల్లో ఇల్లు తీసుకోని వారు మాత్రమే అర్హులు. ఎవరికిస్తారు జిల్లాలో ఏలూరు, నరసాపురం, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికులు, చిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, హోంగార్డులు తదితర వర్గాల వారు అర్హులు. దాదాపు 30కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ పథకం కింద రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. వీరు అర్హులు.. ♦ 20 ఏళ్లు కాలపరిమితికి రుణం తీసుకునేవారు. ♦ ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయం ఆర్జించేవారికి రూ.3 లక్షల వరకూ రుణం ఇస్తారు. వీరు సుమారు 30 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఇల్లు కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు. ♦ ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలను ఆర్జించేవారికి గరిష్టంగా రూ.6 లక్షల వరకూ రుణం ఇస్తారు. 60 చ.మీ / 850 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్లు, ఇళ్లను సొంతం చేసుకోవచ్చు. ♦ ఏడాదికి రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు సుమారు రూ.9 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ఈ విభాగంలో 90 చ.మీ / 1,275 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు సొంతం చేసుకోవచ్చు. ♦ రూ.12–18 లక్షల మధ్య వార్షిక ఆదాయం లేదా నెలకు రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా జీతమున్న వారికి సుమారు రూ.12 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తారు. వీరు 1,550 చదరపు అడుగుల విస్తీర్ణంగల ప్లాట్లను కొనుక్కోవచ్చు. లెక్కల రూపంలో సుమారు ఇలా.. ♦ రుణం మొత్తం : రూ.10 లక్షలు ♦ వడ్డీ రాయితీ : రూ.2,67,282 ♦ మిగతా రుణం: రూ.7,32,720 ♦ మొదటి ఈఎంఐ: రూ.9,650 ♦ సబ్సిడీ తర్వాత ఈఎంఐ: రూ.7,071 ♦ నెలసరి పొదుపు: రూ.2,579 ♦ వార్షిక పొదుపు: రూ.30,948 ప్రయోజనాలు రూ.3 లక్షల రుణానికి రూ.1,33,640 వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం ముందు రూ.2,895 ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ రాయితీ వచ్చిన తర్వాత నెలకు రూ.1,605 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా ఏడాదికి రూ.15,480 ఆదా అవుతుంది. త్వరితగతిన రుణ మంజూరు పథకంలో దరఖాస్తు చేసుకున్న వారం నుంచి రెండు వారాల్లోపు బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకు అధికారులు అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా బ్యాంకుకు వెళ్లి లేదా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. http//pmaymis.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం పీఎంఏవై పథకం కింద రుణాలివ్వడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఎస్బీఐ అవగాహనా సదస్సుల్లో ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన వారు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయరు. అటువంటివారికి ఈ పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పత్రాలన్నీ సమర్పిస్తే వేగంగా రుణం మంజూరు చేసేలా కృషి చేస్తున్నాం. – ఈ.సుధాకర్, ఏజీఎం, ఎస్బీఐ, ఏలూరు -
పది లక్షల ఇళ్లు కట్టాం..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది నవంబర్ 29 నాటికి పది లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు నిర్మించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్ధేశించారు. మార్చి 2018 నాటికి 50 లక్షల మంది గృహ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా వారి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గ్రామీణాభివృద్ధి శాఖ పలు చర్యలు చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది.57 లక్షల మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో 51.39 లక్షల మంది లబ్ధిదారులు తొలివాయిదాను(బిల్లులు) అందుకున్నారని, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒరిస్సా, రాజస్ధాన్ రాష్ట్రల్లో అత్యధిక గృహాలు పూర్తయ్యాయని, నివాసానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. -
పప్పుధాన్యాల ఎగుమతికి ఓకే
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు కూడా కేబినెట్ అనుమతించింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రైతులు తమ ఉత్పత్తుల్ని మంచి ధరకు అమ్ముకునేందుకు పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత నిర్ణయం దోహదం చేస్తుంది. అలాగే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని చెప్పారు. మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016–17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి. యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీకి... జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది. ఐసీడీఎస్లో నాలుగు పథకాల్ని నవం బర్ 2018 వరకూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో అంగన్వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి. కింది కోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అమలు చేస్తున్న ‘నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్’ పథకాన్ని మార్చి 31, 2020 వరకూ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో 3 వేల కోర్టు గదులు, కింది కోర్టుల్లోని న్యాయాధికారుల కోసం 1800 గృహ సముదాయాలకు రూ. 3,320 కోట్లు వెచ్చిస్తున్నారు. కార్పెట్ ఏరియా పరిమితి పెంపు పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) లో మధ్య తరగతి ఆదాయ వర్గాల(ఎంఐజీ) ఇళ్ల నిర్మాణాలకు కార్పెట్ ఏరియా పెంపునకు కేబినెట్ ఆమోదించింది. ఎంఐజీ–1 కేటగిరీలో (రూ.6 లక్షలు–12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు) కార్పెట్ ఏరియాను 90 చ.మీ.ల(968 చ.అడుగులు) నుంచి 120 చ.మీ.(1291 చ.అ.)లకు, ఎంఐజీ–2 కేటగిరీ(రూ. 12 లక్షలు– 18 లక్షల ఆదాయం)లో పరిమితిని 110 చ.మీ.ల (1184 చ.అ.) నుంచి 150 చ.మీ.లకు(1614 చ.అ.) పెంచారు. ఈ మార్పు జనవరి 1, 2017 నుంచే వర్తించేలా సవరించారు. ఎంఐజీ–1లో 9 లక్షల వరకూ రుణంపై 4% వడ్డీ రాయితీ, ఎంఐజీ–2లో రూ.12 లక్షల వరకూ రుణంపై 3% వడ్డీ రాయితీ అమల్లో ఉంది. -
‘పీఎంఏవై’ గడువు పెంపు
ముంబై: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్ఎస్ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించిందని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలిపారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రూ.6–12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్ఎస్ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12–18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది. -
ఆవాస్ యోజన మరో 15 నెలలు పొడిగింపు
సాక్షి,ముంబయిః ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన కింద మధ్యాదాయ వర్గాలకు ఇచ్చే రూ 2.60 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న ఈ స్కీమ్ను 2019 మార్చి వరకూ పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 2022 నాటికి అందరికీ ఇల్లు ఆశయం నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ను ప్రధాని గత ఏడాది తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం విదితమే. 2022 నాటికి దేశ ప్రజలందరికీ ఇళ్లు సమాకూర్చే లక్ష్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ గృహాల నిర్మాణంలో బిల్డర్లు, ప్రైవేటు ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. -
‘గూటి’ చుట్టూ గజిబిజే..
-‘అందరికీ ఇళ్లు’ పథకంలో తొలగని అయోమయం -స్పష్టత లేమితో వాయిదాల చెల్లింపులో లబ్ధిదారుల నిర్లిప్తత -గడువు రెండుసార్లు పెంచినా అంతంత మాత్రపు స్పందన -ఫ్లాటు రేటుపై విమర్శలతో మెట్టు దిగిన సర్కారు -టెండర్లు పూర్తయిన తర్వాత ధరల్లో మార్పులు మండపేట : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్న నానుడే.. ఆ రెండు కార్యాలూ ఎంత బరువుబాధ్యతలతో కూడినవో చెపుతుంది. అలాంటప్పుడు.. సర్కారు ‘ఇల్లు కట్టి ఇస్తాం’ అంటే సామాన్యులు, మధ్యతరగతి వారు ఎగిరి గంతేయాలి. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం’ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పథకం ఆదిలోనే అనేక సందేహాలకు నిలయంగా మారింది. ‘సరికొత్త టెక్నాలజీ’ అంటూ.. రియల్టర్ల బాటలో.. ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువగా ఫ్లాట్ రేటు ధర నిర్ణయించిన సర్కారు తొలి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సర్కారే భారీ దోపీడీకి రంగం సిద్ధం చేస్తుండటంపై ‘సాక్షి’ దినపత్రికలో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. నెలవారీ బ్యాంకు వాయిదాలపై స్పష్టత లేకపోవడం, షీర్వాల్ టెక్నాలజీపై ఆందోళన, మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపడం మొదలైన కారణాలతో తొలి విడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అభాసు పాలవుతున్న సర్కారు బ్యాంకు రుణం విషయంలో దిగి వస్తోంది. గత ప్రభుత్వాలు సెంటున్నర స్థలంలో ఇంటి కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తే, సొంతంగా కొంత మొత్తాన్ని వేసుకుని పేద వర్గాల వారు రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్లతో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ ప్రకారం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి ఇచ్చే రూ.3 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే సరికొత్త టెక్నాలజీ అంటూ సామాన్యుల దోపిడీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు సర్కారు. చదరపు అడుగుల పేరిట ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి, వసతుల భారాన్ని పేదలపైనే మోపజూసింది. అందుకోసం లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంకు రుణాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, 430 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాటుగా విభజించింది. జి ప్లస్-3 కింద జిల్లాలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. తొలి విడతగా రూ.1,457.62 కోట్లతో 19,242 ఫ్లాట్లు మంజూరు చేసింది. కాకినాడ నగర పరిధిలో 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరంలో 4,200, పెద్దాపురంలో 1,724, సామర్లకోటలో 1,048, రామచంద్రపురంలో 1,088, మండపేటలో 4,064, పిఠాపురంలో 874, అమలాపురంలో 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. ఇంతవరకూ వాయిదాలు కట్టింది 11,346 మందే.. అయితే ఆ కేటగిరీల్లోని ఫ్లాట్లకు ఎంత వరకూ బ్యాంకు రుణం చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకూ లబ్ధిదారులకు స్పష్టతను ఇవ్వడం లేదు. వసతుల భారాన్ని తమపైనే మోపడంపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తొలివిడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కేటగిరీ-1లో లబ్ధిదారుని వాటా రూ.500 ఒకే వాయిదాగా, రెండవ కేటగిరీలో లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు రూ.12,500లు చొప్పున నాలుగు విడతలుగా, కేటగిరీ-3లో లబ్ధిదారుని వాటా రూ.లక్షకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చెల్లించాలి. జూలై 20లోగా తొలి విడత వాయిదాలు చెల్లించాలని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గడువు జూలై 31 వరకు పొడిగించింది. అప్పటికి ఫలితం లేకపోవడంతో తాజాగా ఈ నెల 14 వరకు మరోమారు గడువిచ్చింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 11,346 మంది లబ్ధిదారులు మాత్రమే తొలి విడత వాయిదాలు చెల్లించారు. వీరిలో కేటగిరీ-1కు 3,413 మంది డీడీలు చెల్లించగా, కేటగిరీ-2కి 1,346 మంది, కేటగిరీ-3కి 6,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు రుణభారం తగ్గింపు.. సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ధర తగ్గించడం జరగదు. అయితే అధిక ధరలు నిర్ణయించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న సర్కారు దిగిరాక తప్పలేదు. ఆయా కేటగిరీల్లో లబ్ధిదారుని వాటా మాత్రం యథావిధిగా ఉంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన 40 రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్యాంకు నుంచి తీసుకునే రుణ భారాన్ని తగ్గించింది. వసతుల కల్పనకు ఫ్లాటుకు రూ.1.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఇటుకలతో ఇల్లు నిర్మిస్తే చదరపు అడుగు రూ.వెయ్యి వరకు మాత్రమే అవుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వాయిదాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. -
ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
- సొమ్ములు కట్టినా ఎదురుచూపులే.. - పీఎంఏవైలోనూ అర్హులకు మొండిచెయ్యి - సిఫారసులకు, పచ్చచొక్కాలకే గృహయోగం కాకినాడ : ‘అర్హత’కు ప్రాతిపదిక ఏమిటి? పేదరికమా? అధికార పార్టీ జెండా పట్టుకోవడమా? ప్రభుత్వం మారిపోతే అర్హులు ‘అనర్హులు’గా మారిపోతారా? జిల్లా కేంద్రం కాకినాడలో అర్హత కలిగిన గృహనిర్మాణ లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇల్లు మంజూరు చేస్తామంటే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వేలాది రూపాయలు అప్పులు చేసి, ప్రభుత్వానికి చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏడెనిమిదేళ్లుగా ఇల్లు మంజూరవుతుందని వెయ్యి కళ్లతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఐహెచ్ఎస్డీపీ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దీనికి దాదాపు 1,750 మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ములు కూడా చెల్లించారు. వీరిలో తొలివిడతగా అప్పట్లో 816 మందికి ఏటిమొగ, పర్లోపేట ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మందీ ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.86 వేల వరకు డీడీలు తీసి అప్పట్లోనే గృహనిర్మాణ శాఖకు అందజేశారు. అలా వీరంతా చెల్లించిన రూ.3 కోట్ల వరకు సొమ్ము గృహనిర్మాణ శాఖలో మూలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం కుంటుపడడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక సొంతింటి ‘కలే’నని లబ్ధిదారులు డీలా పడుతూ వచ్చారు. ఇళ్లు ఎప్పుడు మంజూరైనా సొమ్ములు కూడా చెల్లించిన తమకే ప్రాధాన్య క్రమంలో ముందుగా అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎంఏవైలో మొండిచెయ్యి ‘అందరికీ ఇళ్లు’ పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితమే వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లబ్ధిదారులను పక్కన పెట్టి పచ్చచొక్కాలతో కూడిన జాబితా బయటకు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా 4,600 ఇళ్లు మంజూరైనా పాత జాబితాలో ఉన్న చాలామందికి చోటు దక్కకకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. పారదర్శకత ఏదీ? పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా తీసుకుని రాజకీయాలకు దూరంగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను కూడా సమన్వయం చేసుకుని అర్హులకు ఇళ్లు దక్కేలా కృషి చేశారు. ప్రస్తుతం అలాంటి విధానానికి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు చక్రం తిప్పి సొంత పార్టీ కార్యకర్తలకు, సొమ్ములు ఇచ్చినవారికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా చేసుకుపోవడంతో అర్హులకు మొండిచెయ్యే మిగిలింది. గ్రీవెన్స్సెల్ ఎందుకూ? కలెక్టరేట్లో గ్రీవెన్స్సెల్కు నిత్యం ఎంతోమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తే ఇక గ్రీవెన్స్సెల్ వల్ల ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుని డబ్బులు కూడా కట్టినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ న్యాయం చేయాలి ఏడేళ్ల క్రితం ఇంటికోసం దరఖాస్తు చేశా. రూ.26 వేలు డీడీ కూడా తీసి ఇచ్చా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు వస్తుందని ఎంతో ఎదురు చూసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి. - టి.సత్యనారాయణ, లబ్ధిదారు నచ్చినవారికి ఇస్తున్నారు గృహనిర్మాణాల్లో అర్హత కలిగిన పాత లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి. వేలకు వేలు అప్పులు చేసి సొమ్ములు కట్టాం. తీరా ఇళ్లు వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టి నచ్చినవారికి ప్రాధాన్యం ఇనిస్తున్నారు. - బి.వెంకటలక్ష్మి, లబ్ధిదారు వడ్డీలు కట్టలేకపోతున్నాం ఇల్లు వస్తుందని మూడు విడతలుగా రూ.83 వేలు ప్రభుత్వానికి చెల్లించాను. అప్పులు చేసి కట్టడంతో టైలరింగ్ వృత్తిపై ఆధారపడుతున్న నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి, ఇళ్లు మంజూరు కాని పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి. - వాయివాడ రమణ, లబ్ధిదారు -
44 కోట్ల మందికి గృహాలు
న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 44 కోట్ల మందికి సొంతిల్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటితోపాటు ఎల్పీజీ, కరెంటు, నీటి కనెక్షన్లు కూడా ఇవ్వాలని భావిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మైదాన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.1.30 లక్షలు, కొండప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం నేరుగా బదిలీ చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్జీత్ సిన్హా చెప్పారు. దీంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12 వేలు అదనంగా ఇస్తామన్నారు. సొంతింటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.18 వేలు ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తామని తెలిపారు. తొలుత 33 కోట్ల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీన్నిప్పుడు 44 కోట్లకు పెంచామన్నారు. ఆవాసాలు లేనివారికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని, తాత్కాలిక గృహాల్లో నివసించేవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారుల్లో 60% మంది ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చూస్తున్నా రు. నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడేళ్లలోగా జమ అవుతాయని చెప్పారు. -
పట్టణ ఇళ్ల కోసం రూ.404 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రకటించిన 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-హౌస్ ఫర్ ఆల్' పథకం కింద తెలుగు రాష్ట్రాల్లో పట్టణ గృహనిర్మాణాల కోసం రూ.404.68 కోట్లు విడుదలయ్యాయి. ఏపీకి రూ. 225.62 కోట్లు తెలంగాణకు రూ.179.06 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడత ఎంపిక చేసిన పట్టణాల్లో నిధుల ద్వారా పేదల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆ పట్టణాలకే మళ్లీ అవకాశం: అందరికీ ఇళ్లు పథకం తొలి విడత కింద తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట పట్టణాలను కేంద్రానికి ప్రతిపాదించింది. గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్ఏవై) కింద ఈ పట్టణాలను ఎంపిక చేసి నిధులు సైతం కేటాయించింది. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆ ప్రాజెక్టులతో పాటే ఆర్ఏవైను రద్దు చేసింది. అయితే, ఆర్ఏవై కింద ఈ పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపికపై సర్వేలు చేసి వుండటంతో, ఆ సమాచారాన్నే 'హౌస్ ఫర్ ఆల్'కి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పట్టణాల్లో హౌస్ ఫర్ ఆల్ అమలుకు లబ్ధిదారులను గుర్తించడం కోసం సర్వే చేసేందుకు పురపాలకశాఖ ప్రణాళికలు రచిస్తోంది. నోడల్ ఏజెన్సీగా మెప్మా రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వ్యవహరించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.