rescued
-
458 మందిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
-
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
ప్రాణాలు తెగించి యువకుడిని కాపాడిన YSRCP ఎమ్మెల్యే
-
ఆపరేషన్ కంబోడియా సక్సెస్.. శభాష్ వైజాగ్ పోలీస్!
సాక్షి, విశాఖ: ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. -
ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ 420 మందిని కాపాడిన పోలీసులు
-
భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వాళ్లంతా సేఫ్
సోమాలియా తీరంలో హైజాక్కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్ సముద్రం) హైజాక్కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది. The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm — ANI (@ANI) January 5, 2024 -
జయహో.. ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ (ఫోటోలు)
-
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS — LaHistoria (@lahistoriaec) July 7, 2023 సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw — LaHistoria (@lahistoriaec) July 7, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
మనసున్న పోలీసాయన.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్గా మారింది. ఒక కుక్క తల కారు బంపర్లో ఇరుక్కుపోవడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దానిని రెస్క్యూ చేసేందుకు అమృత్సర్ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఆ కుక్క తలను కారు బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 8 వేలకుపైగా నెటిజన్లు చూశారు. చాలామంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ, పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అమృత్సర్ పోలీస్ కమిషనర్ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్గా ‘ఇది హదయానికి హత్తుకునే పని. ఒక కుక్క తల.. కారు బంపర్లో ఇరుక్కుపోయింది. అమృత్సర్ పోలీసు అధికారి ఒకరు దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అతను ఎంతో నేర్పుగా, సురక్షితంగా దాని తలను బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ నేపధ్యంలో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాలేదని’ రాశారు. A heartwarming act of compassion! 🙌🚓 In a touching incident, a dog got trapped in a car bumper, Amritsar police official came to the rescue. With great care and skill, safely freed the dog, ensuring its well-being.🐾#LetsBringTheChange #LoveForAnimals pic.twitter.com/HylTFNHu8e — Commissioner of Police Amritsar (@cpamritsar) June 28, 2023 పోలీసు అధికారి మెచ్చుకుంటున్న జనం.. ఈ వీడియోను చూసి కామెంట్ చేస్తున్న నెటిజన్లు కుక్కను కాపాడేందుకు ఆ అధికారి వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ‘ఈ పని వారి యూనిఫారంనకు మరింత గౌరవాన్నిస్తుంది. భగవంతుడు ఆ అధికారిని.. ఇటువంటి గొప్ప పనిచేసినందుకు ఆశీర్వదిస్తాడు’ అని రాశారు. కొందరు యూజర్స్ జంతుప్రేమ గురించి ప్రస్తావించారు. మరో యూజర్ ‘అన్ని ప్రాణుల విషయంలోనూ సానుభూతితో మెలగాలని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అదే మానవత్వమని పేర్కొంటున్నాయి’ అని రాశారు. ఇది కూడా చూడండి: పర్ఫెక్ట్ టైమింగ్:కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా! -
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
చచ్చిపోదామని పట్టాలపై ..ఇంతలో వచ్చింది దేవత ! వైరల్ వీడియో
న్యూఢిల్లీ: జీవితంలో ఆశను కోల్పోవద్దు అని ఎంత చెప్పినా తృణప్రాయంగా ప్రాణాల్ని త్యజిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చివరికి ఆత్మహత్య చేసు కోవడం నేరం అని చెప్పినా కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ఒక్క క్షణం వారిని మృత్యు ముఖ్యం నుంచి తప్పించగలిగితే, సరియైన కౌన్సిలింగ్ ఇప్పించ గలిగితే జీవితం విలువ తెలిసి వస్తుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్న మాట. అయితే తాజాగా చనిపోవాలని పట్టాలపై పడుకున్న వ్యక్తిని తృటిలో ప్రమాదంనుంచి తప్పించిన వైనం ఒకటి వైరల్గా మారింది. (తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!) వెస్ట్ బెంగాల్లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ ఇండియా ట్విటర్ హ్యాండిల్ ఈ ఘటనకుసంబంధించినవీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం రైలు కింద పడిచనిపోవాలనుకున్న యువకుడు చాలాసేపే అక్కడక్కడే తచ్చట్లాడాడు. చివరికి అతివేగంగా దూసుకు రానున్న రైలు కింద పడేలా పట్టాలపై పడుకున్నాడు. అయితే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ సుమతి ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా కదిలి అతగాడిని ట్రాక్పై నుండి లాగాపడేశారు. అంతే క్షణాల్లో అతడు యమపాశంనుంచి తప్పించుకున్నాడు. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) సుమతి నిర్భయంగా ముందుకు కదిలి ఆ వ్యక్తిని ప్రాణాలను కాపాడిన వైనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుడోస్ సుమతి మేడమ్ అంటూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆత్యహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికిపై కేసు నమోదు చేయకుండా, దయచేసి అతనికి సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ వీడియో దాదాపు 264.6 వేల వ్యూస్, 7వేలకు పైగా లైక్స్, 232 రీట్వీట్లను సాధించింది. #RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station. Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg — RPF INDIA (@RPF_INDIA) June 8, 2023 -
వ్యాపారంలో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యులను మూడేళ్లుగా బంధించి..
యూపీలోని చిత్రకూట్లో ఆశ్చర్యకర ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారి కాశీ కేశర్వానీ తన కుటుంబ సభ్యులందరినీ ఇంటిలోనే బంధీ చేశాడు. అతను మూడేళ్లుగా తన భార్య, పిల్లలను ఇంటిలోనే ఉంచాడు. బయటకు వెళ్లనివ్వలేదు. దీనికితోడు ఇంటి కిటికీలను కూడా పూర్తిస్థాయిలో మూసివేశాడు. పిల్లల చేత చదువు మాన్పించేశాడు. ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు తానే తీసుకువస్తున్నాడు. గత మూడేళ్లుగా అతని భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటిలోనే మగ్గిపోతున్నారు. ఇటీవల వీరి ఇంటికి వచ్చిన బంధువులు వీరి ఇంటి తలుపులకు తాళాలు వేసివుండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి, లోపలి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. తరువాత కాశీ భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ టీమ్ సభ్యుడు దీపా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం కాశీ కేశర్వానీ భార్య పూనమ్(45), కుమారుడు రజత్(13) కుమార్తె అర్షిత(14) గత మూడేళ్లుగా ఇంటిలోనే మగ్గుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం కాశీ బావ తన సోదరి, అతని భర్తతో కలిసి చిత్రకూట్ వచ్చాడు. అయితే కాశీ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో చైల్డ్ లైన్తో పాటు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు సంఘటనానికి వచ్చి ఇంటిలోని పరిస్థితులను పరిశీలించారు. ఇంటిలోని ప్రతీగదిలో హోమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక గదిలో సమాధి లాంటి నిర్మాణం ఉంది. దానిపై కత్తి గుచ్చి ఉంది. ఆ గది తలుపులపై ఓం అక్షరంతో పాటు జై మాతా దీ అని రాసివుంది. దీనికితోడు ఆ వ్యాపారి తన ఇంటిలోకి ఏమాత్రం వెలుగు చొరబడకుండా ఉండేందుకు అన్ని కిటికీలను మూసివేశాడు. వ్యాపారి విచిత్ర ప్రవర్తన కారణంగా అతని భార్య మానసిక వ్యాధిగ్రస్తురాలైంది. వారి పిల్లలు శారీరకంగా చాలా బలహీనంగా మారిపోయారు. బాధితులు ముగ్గురు ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాశీ తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇంటి పరిస్థితులు ఇతరులకు తెలియకూడదని భార్యపిల్లలను ఇంటిలోనే బంధించాడు. పిల్లల చేత చదువు మాన్పించాడు. నిత్యావసరాలను తానే తీసుకు వస్తుండేవాడు. వారంతా ఇంట్లో పూజలు చేస్తుండేవారు. ప్రస్తుతం అతనికి కూడా మానసిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi — Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023 (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బొప్పాయి ట్రీ హోటల్లో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఆరు అంతస్తుల హోటల్ ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు యత్నించినా నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఆరో అంతస్తులో వ్యక్తులు చిక్కుకుపోవడంతో వారిని నిచ్చెన, బెడ్షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని రక్షించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పొగ భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముమ్మరంగా సహాయం చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel's kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR — Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023 (చదవండి: కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్) -
బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి
మానకొండూర్: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సంజీవ్నగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది. అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్మోటార్ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్ ఫైర్మన్ ధర్మ్, ఫైర్మన్ పి.సంతోష్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్ ఫైర్మన్ ధర్మ్ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
'నమ్మలేని నిజం': శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా..
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ బృందం నిరంతరం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది. అక్కడున్నవారికి ప్రతి క్షణం ఆ శిథిలాల కింద గుండె పగిలే దృశ్యాలతో తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ ఘటన అవధులు లేని ఆనందాన్ని కొనితెచ్చింది. ఈమేరకు రెస్క్యూ సిబ్బంది భవనాల కింది ఉన్న వారిని రక్షించే పనిలో ఉండగా..ఓ కుప్ప కూలిన భవం కింద ఉన్న వ్యక్తులను కోసం గాలిస్తున్నారు. ఐ తే అనహ్యంగా ఆ శిథిలాల కింద ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారి అందరీ ముఖాల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. అక్కడ ఉన్న వారంతా తమవారిని పోగోట్టుకుని నిరాశలో ఉన్నప్పటికీ.. ఒక కుటుంబమైన తమలా కాకుండా అందరూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా పెద్దలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఆ కుటంబం క్షేమంగా ఉందని తెలియంగానే వారంతా.. గాడ్ ఈజ్ గ్రేట్, ఇది నిజంగా నమ్మలేని నిజం అంటూ ఆనందంతో గట్టిగా నినాదాలు చేశారు. రెస్క్యూ సిబ్బంది వారందర్నీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందించింది. అందకు సంబంధించిన వీడియోని సిరియా డిఫెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన క్షణం అనే క్యాప్షన్ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief. An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT — The White Helmets (@SyriaCivilDef) February 7, 2023 (చదవండి: పాక్లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం) -
జీవితంపై విరక్తితో చనిపోతున్నా.. పేస్బుక్ లైవ్లో చెప్పిన యువకుడు..
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ యువకుడు తాను చనిపోతానని ఫేస్బుక్ లైవ్ వీడియోలో చెప్పాడు. జీవితంపై విరక్తి వచ్చి, ఒంటరితనం భరించలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. అయితే పోలీసులు ఈ వీడియో చూసిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ యువకుడు ఎక్కడున్నాడో గుర్తించి కాపాడాలని డిప్యూటీ కమిషనర్ స్మార్తన పాటిల్ పోలీసులను ఆదేశించారు. వెంటనే వాళ్లు యువకుడు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వెళ్లారు. అక్కడ వెతుకుతుండగా.. అతడు రోడ్డుపక్కన ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. పోలీసులు వెంటనే అతడ్ని తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ ఇండాల్కర్ అతనికి కౌన్సిలింగ ఇచ్చి ధైర్యం చెప్పారు. దీంతో యువకుడు ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నాడు. అనంతరం పోలీసులు యువకుడ్ని స్నేహితుడికి అప్పగించి ఇంటికి పంపారు. చదవండి: దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త! -
రక్కూన్ దాడి నుంచి కూతురిని రక్షించిన తల్లి
-
కొల్లగొట్టేందుకు వచ్చి పట్టుబడ్డ దొంగలు... కొంపముంచిన ప్లాన్
ఇటీవల దొంగలు దోచుకునేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడ్డ ఉదంతాలు కోకొల్లలు. అంతేందుకు ఇటీవల ఒక దొంగ ఒక దేవాలయంలో దొంగతనానికి వచ్చి కిటికిలో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు. అచ్చాం అలానే ఒక దొంగల ముఠా ఏకంగా బ్యాంక్ని కొల్లగొట్టేందుకు ఒక పెద్ద స్కేచ్ వేశారు. అదే వారిని పట్టుబడేలా చేసింది. వివరాల్లోకెళ్తే....రోమ్లో ఒక ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు నలుగురు దొంగలు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఈ మేరకు రోమ్లోని వాటికన్ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా బ్యాంకుకు చేరుకునేలా సోరంగం తవ్వారు. ఆ సోరంగ గుండా వెళ్లి బ్యాంకును దోచుకోవాలనేది వారి ప్లాన్. ఆ నలుగురు దొంగలు అనుకున్న విధంగానే వెళ్లారు గానీ అందులో ఒక వ్యక్తి మాత్రం ఆ సోరంగం నుంచి బయటపడ లేకపోయాడు. దీంతో తనను రక్షించండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో సదరు దొంగను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ మేరు పోలీసులు సదరు దొంగను రక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో తప్పించుకున్న మిగతా ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దొంగల ముఠాపై పలు దోపిడి నేరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
శభాష్... స్నితికా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మనోహర్ పిల్లలు స్నితికా, వేద్ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు. అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్ఫోన్ అందుకొని గూగుల్లో సెర్చ్ చేసి ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ నంబర్ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది. మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ అంజిరెడ్డి బృందం, ఫైర్ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. ఎలాగైనా కాపాడాలనుకున్నా స్నితికా, ఇంటర్ ఫస్టియర్, కరీంనగర్ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక) -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
100 మంది పోలీసులు.. రెండు గంటలు.. కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నామంటే..??
-
ఆ ముగ్గురూ ఎక్కడ?
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదం నుంచి మంగళవారం ఓ కార్మికుడిని రెస్క్యూ టీం రక్షించింది. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ప్రమాదం జరిగి 40 గంటలవుతున్నా వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాజ్, శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 40 గంటలుగా నీరు, ఆహారం లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. బొగ్గుపెళ్లలను తొలగించడానికి చాలా సమయం పడుతోంది. గల్లంతైన వారి ఆచూ కీ బుధవారం ఉదయం కల్లా తెలియొచ్చని భావిస్తున్నారు. 4 షిఫ్టులుగా వీడిపోయి షిఫ్టుకు 100 మంది గాలింపు చేపట్టారు. ఫ్రంట్ బకెట్ లోడర్ (ఎఫ్బీఎల్) ఆపరేటర్ జాడి వెంకటేశ్, ఓవర్మేన్ పిల్లి నరేశ్, బదిలీ కార్మికుడు రవీందర్, సపోర్టుమేన్ ఎరుకల వీరయ్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. బొగ్గు పెళ్లల సందులోంచి పాక్కుంటూ బయటపడ్డానని ఆయన అన్నారు. యంత్రంతో పనిచేస్తుండగా బొగ్గుపెళ్ల కూలి చీకటైందని, రెస్క్యూ సిబ్బంది అరుపులు విని యంత్రం హారన్ మోగించడంతో తనను బయటకు తీశారని జాడి వెంకటేశ్ చెప్పారు. కాళ్లు బొగ్గుపెళ్లల్లో చిక్కుకొని గాయాలయ్యాయని, నడుం పైభాగంలో దెబ్బలు లేకపోవడంతో బతకగలిగానని రవీందర్ అన్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు గని ప్రమాదంలో చిక్కుకున్న డిప్యూటీ మేనేజర్ చైతన్యతేజ పరిస్థితిపై యాజమాన్యం మాకు సమాచారం ఇవ్వ లేదు. ఓ ఉద్యోగి ప్రమాదంలో చిక్కుకుంటే కుటుంబీకులకు సమాచారం ఇవ్వరా? తేజ ఇంటి పక్కన ఉండేవాళ్లు ఫోన్ చేస్తే వచ్చాం. – చైతన్య తేజ తండ్రి సీతారాములు, మామ వెంకటేశ్వర్లు ట్రైనింగ్ అయిపోతుందన్నాడు ట్రైనింగ్ ఈ రోజుతో అయిపోతుందని సోమవారం చెప్పి గనిలోకి వచ్చాడు. గని ప్రమాదంలో చిక్కుకున్నాడని టీవీలో వార్తలు చూసి ఇక్కడికి వచ్చాను. అన్నయ్య పరిస్థితిపై ఎవరిని అడిగినా చెప్పడం లేదు. రెండురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నాం. సహాయకచర్యలు ముమ్మరంగా చేపట్టి అన్నయ్యను త్వరగా బయటకు తీసుకురావాలి. –వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ సోదరుడు రాకేశ్ గనిలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు -
క్షణం ఆలస్యమై ఉంటే అంతే
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కదులుతున్న రైలు నుండి పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీస్ చాకచక్యంతో రక్షించిన సంఘటన కారవార రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణ శాఖ అధికారి బీఎం దేసాయి (59)ని, కారవార రైల్వే పోలీస్ నరేశ్ రక్షించారు. ఆదివారం దేసాయి ఒకటవ ప్లాట్ఫాం మీద ఉన్న లగేజీ తీసుకోవడానికి కదులుతున్న ట్రైన్ నుండి దిగబోతూ కాలుజారి పట్టాలపై పడబోయాడు. అంతలో ఈ దృశ్యాన్ని చూసిన నరేశ్ తక్షణం అప్రమత్తమై దేసాయిని కాపాడాడు. ఈ వీడియోను కొంకణ రైల్వే శాఖ విడుదల చేసి ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
మృత్యుంజయుడు ఆ బాలుడు
Boy Rescued From the Debris of a Collapsed Building in Chagalamarri: పై చిత్రంలో మట్టి శిథిలాల మధ్య రోదిస్తున్న బాలుడి పేరు చరణ్.. ఎప్పటిలాగే స్కూల్కు వెళ్లి శుక్రవారం సాయంత్రం చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తన స్వగృహానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు వంట రూంలో ఉండగా.. చరణ్ మరో రూంలో సోఫాలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దె తడిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో చరణ్ ఉన్న గది కూలిపోయింది. శిథిలాల కింద బాలుడు కూరుకుపోయాడు. తండ్రి పుల్లయ్య అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతికష్టం మీద బాలుడిని బయటకు తీశారు. చరణ్ స్వల్ప గాయాలతో బయట పడడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఏపీ పోలీసు సమయస్ఫూర్తి.. కెనాల్లో కొట్టుకుపోతున్న నలుగురిని..
సాక్షి, గుంటురు: ఏపీ పోలీసు అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఈ అరుదైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కాగా, అడిగొప్పలా గ్రామపరిధిలో నాగార్జున సాగార్ కెనాల్ ఉంది. కెనాల్ను చూడటానికి నలుగురు వ్యక్తులు ఈనెల (నవంబరు28) వెళ్లారు. ఆతర్వాత ప్రమాదవశాత్తు వారంతా.. కెనాల్లో పడిపోయారు. ఈక్రమంలో.. కొంతదూరం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే, బాధితులు సహాయం కోసం గట్టిగా అరవడాన్ని ఒడ్డున ఉన్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి విన్నాడు. అతను స్థానిక దుర్గి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్కుమార్ వెంటనే స్పందించి.. అక్కడి వారి సహయంతో బట్టలను ఒక తాడులాగా చేశాడు. ఆతర్వాత.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారివైపు విసిరాడు. వారు.. ఆ తాడును పట్టుకుని ఒడ్డుకు చేరుకుని వారి ప్రాణాలకు కాపాడుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ప్రవీణ్కుమార్ చూపిన సమయస్ఫూర్తిని అక్కడివారు అభినందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కానిస్టేబుల్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘హ్యట్సాఫ్ సర్..’, ‘మీ సమయస్ఫూర్తికి సెల్యూట్..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
మృత్యుంజయడు.. ఆరు గంటల పాటు వరద ఉధృతిలో,చుట్టూ పాములు..
సాక్షి,పెనగలూరు(కడప): పెనగలూరు మండలంలోని సిద్దవరం పంచాయతీకి చెందిన సింహాద్రి దిగువ సిద్దవరం వద్ద చెయ్యేరు నది వరద ఉధృతిలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రమాదకరమైన వరదలోనే ఉన్నాడు. మూడు గంటల పాటు ఆలయంలోనే ఉండి బయటకు రావాలని ప్రయత్నించి వరదనీటిలో కొట్టుకుపోయాడు. ధైర్యంగా చెట్టును పట్టుకొని పైకి ఎక్కి మూడు గంటల పాటు వరదలోనే ఉన్నాడు. చెట్టు సమీపంలో చుట్టూ పాములు కూడా ఉన్నట్టు తెలిపాడు. గాంధీనగర్ ఎస్టీ కాలనీకి చెందిన పెంచలయ్య, దుర్గయ్యలు ధైర్యం చేసి చాంతాళ్ల సహాయంతో చెట్టు వద్దకు వెళ్లి రక్షించారు. ఆరు గంటల పాటు వరద ఉధృతిలోనే ఉండి క్షేమంగా బయటపడడంతో అందరూ మృత్యంజయుడు సింహాద్రి అని అభినందించారు. చదవండి: ఆశలు సమాధి: పదిరోజుల్లో వివాహం.. మహిళా కానిస్టేబుల్ మృతి -
వైరల్ వీడియో: వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డలను రక్షించిన అధికారులు
-
క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్, అయితే..
తమిళనాడు అటవీ అధికారులు ఓ మహిళను ఆమె కూతురిని రక్షించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. రెండు నిమిషాల నిడివిగల ఆ వీడియోలో ఓ మహిళ తన ఒడిలో చిన్నారిని పట్టుకొని జలపాతం పక్కన ఉన్న కొండ వద్ద చిక్కుకుపోగా ఆమెను అటవీ అధికారులు రక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని కల్లవరయన్ కొండల్లో అనైవారి మట్టల్ జలపాతం కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతోంది. చదవండి: 150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్ ఈ క్రమంలో ప్రమాదకరంగా ఉన్న రాయిపై మహిళ తన కూతురితో చిక్కుకుపోయింది. వరద ప్రవాహంతో ఎక్కువగా ఉండడంతో ఆమె ఎటూ వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ రెస్క్యూ అధికారులు కొంతమంది యువకులు తాడు సాయంతో తల్లీబిడ్డలను రక్షించారు. అయితే అటవీశాఖ అధికారులకు సహాయం అందిస్తున్న సమయంలో చివరలో ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. అప్పటికే వీడియో పూర్తయినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు నదికి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్ -
Uttarakhand: ప్రవాహంలో చిక్కుకున్న ఏనుగు
డెహ్రాడూన్: ఉత్తర ఖండ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా మూడోరోజు వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నదులన్ని నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా, గౌలానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో.. హల్దూచుర్, లల్కున్ నదుల మధ్యన పాచ్ల్యాంగ్ అనే ఒక ద్వీపం ఉంది. అక్కడ ఒక ఏనుగు మంద నుంచి తప్పిపోయి ప్రవాహం మధ్యలో చిక్కుకుంది. భీకరంగా ప్రవహిస్తున్న నీటి ఉధృతికి ఏనుగు ముందుకు వెళ్లలేక అక్కడే తిరగసాగింది. అయితే, ఈ దృశ్యాన్ని అభిషేక్ పాండె అనే ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన.. స్థానిక అటవీ డివిజనల్ అధికారి సందీప్ కుమార్.. తన సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఆ తర్వాత ఏనుగును అటవీ మార్గం వైపు వెళ్లేలా చేశారు. ప్రస్తుతం ఏనుగు ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఏనుగు ప్రాణాలు కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వరదల కారణంగా ఆ రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. #Uttarakhand | In a viral video, an elephant was seen stranded on a piece of land in a raging Gaula river, between Halduchaur and Lalkuan. It was later directed towards forest by Forest Department officials.#ClimateChange #ClimateCrisis pic.twitter.com/03eED3oca3 — Abhishek Pandey (@realabhipandey1) October 19, 2021 చదవండి: భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్ -
భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్
డెహ్రాడూన్: ఉత్తర ఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే నైనిటాల్, తపోవన్, చంద్రబాగా నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, బద్రీనాథ్ జాతీయ రహదారిపై లంబగడ్నల్లా వద్ద కొండచరియలు విరిగిపడటంతో.. ఒక కారు రోడ్డుపై చిక్కుకుంది. వెంటనే స్పందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు క్రెన్ సహయంతో కారును సురక్షితంగా బయటకు తీసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే వరదలపై ప్రధాని మోదీ.. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ ధామితో ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రంనుంచి పూర్తిస్థాయి సహాయం అందిస్తామని తెలిపారు. వరదలలో ఇప్పటికే నేపాల్కు చెందిన ముగ్గురు కూలీలతోపాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా చంపావ్ జిల్లా,సెల్ఖోలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం.. ఉత్తర ఖండ్లో 1 నుంచి 12 తరగతివరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం మెరుగుపడే ఎలాంటి పర్యాటకులకు అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా.. చంపావత్లోని చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. #WATCH | Uttarakhand: Occupants of a car that was stuck at the swollen Lambagad nallah near Badrinath National Highway, due to incessant rainfall in the region, was rescued by BRO (Border Roads Organisation) yesterday. pic.twitter.com/ACek12nzwF — ANI (@ANI) October 19, 2021 చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్లో.. చెప్పులతో చితకబాదిన భార్య -
నది మధ్యలో మూడు రోజులు.. మృత్యువును జయించి..
వల్లూరు: వంతెనపై నడిచివెళ్తున్న వృద్ధురాలు అనుకోకుండా పెన్నా నదిలో పడిపోయి ప్రవాహంలో సుమారు 5 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. ధైర్యాన్ని కూడగట్టుకుని నది మధ్యలో గల ఇసుక గుట్టలపైకి చేరింది. మూడు రోజులపాటు ఆ గుట్టలపైనే ఉండిపోయిన ఆమె స్థానికులు, పోలీసుల చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం గంగవరానికి చెందిన పుత్తా రుక్మిణమ్మ (65) భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. సంతానం లేని ఆమె అప్పటినుంచి గంగవరంలోని తన సోదరుని ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి భోజనానంతరం ఇంటినుంచి బయటకు వెళ్లిన రుక్మిణమ్మ గ్రామ సమీపంలో కమలాపురం–ఖాజీపేట మండలాల సరిహద్దున గల వంతెన పైనుంచి పెన్నా నదిలో పడిపోయింది. అక్కడి నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు లోతట్టున చెరువుకిందిపల్లె సమీపంలో నది మధ్యన గల ఇసుక గుట్టలపైకి చేరింది. గురువారం నీటి ప్రవాహం మధ్య ఇసుక గుట్టలపై ఎవరో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ కల్పన అక్కడకు చేరుకుని పుష్పగిరి నుంచి ఈతగాళ్లను రప్పించి ట్యూబుల సహాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆమెకు పీహెచ్సీలో వైద్యం చేయించి బంధువులకు అప్పగించారు. -
ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో మహిళ, క్షణాల్లో స్పందించిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హడావిడిగా కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో జారిపోయి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆ మహిళను వెనక్కిలాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ను ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సౌత్ సెంట్రల్ రైల్వే ట్వీట్ చేసింది. సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ నుంచి బయలు దేరుతున్న ఎమ్ఎమ్ఆర్ స్పెషల్ రైలు ఎక్కేందుకు నసిమా బేగం అనే మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అదే సమయంలో రైలు కదలినప్పటికీ, పరుగున వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు కోల్పోయి ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో పడబోయింది. అయితే అక్కడే విధుల్లో ఉన్న దినేష్ ఆమెను ప్లాట్ఫాం మీదకు లాగేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మరోవైపు రైలులో ఉన్నవారు చైన్ లాగడంతో రైలు ఐదు నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆ మహిళను క్షేమంగా తిరిగి రైలు ఎక్కించారు. నసిమాను కాపాడిన కానిస్టేబుల్ను తోటి ప్రయాణీకులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడారంటూ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్ను అభినందించింది. Timely & Daring #LifeSaving act by RPF staff Aged woman passenger tried to board moving train at Secuderabad stn fell in the gap btwn coach & platform and was being dangerously dragged. On duty RPF constable Sri.Dinesh Singh acted immediately, pulled lady out & saved her life. pic.twitter.com/Me4z0SA7ZW — South Central Railway (@SCRailwayIndia) July 31, 2021 -
వైరల్: ఈ తల్లి బిడ్డకోసం 8 అడుగుల పాము తోక పట్టుకుని..
భువనేశ్వర్: సాధారణంగా చిన్న పామును చూస్తేనే మనం భయపడిపోతుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 అడుగుల ఉన్న కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారలకు అప్పగించింది. ఈ ఘటన ఒడిశా మయూరభంజ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎలా వచ్చింది గానీ 8 అడుగుల కింగ్కోబ్రా ఒకటి ఓ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంట్లో ఆడుకుంటున్న 2 సంవత్సరాల పిల్లాడు పాము వైపు వెళ్తుండడం తల్లిదండ్రులు గమనించారు. వెంటనే పిల్లాడి తండ్రి స్పందించి కొడుకును పట్టుకోగలిగాడు. అదే క్రమంలో పిల్లాడి తల్లి (సస్మిత) పాము తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చి విసిరేసింది. అనంతరం వాళ్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను పిలిపించి ఆ పాముని అడవిలో విడిచిపెట్టారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. సస్మిత మాట్లాడుతూ.. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందేమోనని భయంతో ఇంతటి ధైర్యం చేసినట్లు తెలిపింది. ఈ పరిస్థితిలో మాకు సహాయం చేసిన అటవీ శాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె ధైర్యాన్ని చూసి అందరూ హడలిపోయారు. ప్రస్తుతం సస్మతి చూపిన ధైర్యానికి చుట్టు పక్కల వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Odisha: A woman rescued a King Cobra who entered a residential area in Mayurbhanj "It was found in front of a house of a local. I rescued it and released it in its habitat with the help of the forest department and Range Officer," said Sasmita Gochhait (05.06) pic.twitter.com/dCfsaAkrSs — ANI (@ANI) June 5, 2021 చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. -
నేను చనిపోతున్నా.. కలకలం రేపిన యువకుడి మెసేజ్
ఉరవకొండ: ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు.. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమయస్ఫూర్తితో కదిలారు. గంటపాటు ఉరుకులు పరుగులు తీశారు. ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడి ఆచూకీ కనిపెట్టి రక్షించారు. ఓ కుటుంబానికి మేలు చేశారు. వివరాల్లోకి వెళితే.. విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన పృథ్వీరాజ్ బుధవారం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అనంతరం తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మెసెజ్ పంపి సెల్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన యువకుడి తండ్రి వేణుగోపాల్ పాల్తూరు ఎస్ఐ రాజేశ్వరికి ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని సీఐ శేఖర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సీఐ వెంటనే పాల్తూరు, ఉరవకొండ, వజ్రకరూరు ఎస్ఐలను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ముగ్గురు ఎస్ఐలు తీవ్రంగా గాలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద యువకుడి ఆచూకీ కనిపెట్టారు. అప్పటికే కాలువలో దూకేందుకు సిద్ధంగా ఉన్న యువకుడిని నిలువరించిన ఎస్ఐలు.. అతన్ని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో సీఐ శేఖర్ యువకుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత యువకుడికీ నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఫిర్యాదు అందిన గంటలోపే యవకుడిని కాపాడిన సీఐ, ముగ్గురు ఎస్ఐలను ఎస్పీ సత్యయేసుబాబు ఫోన్లో అభినందించారు. చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన ఎంతటి విషాదం: నవ దంపతులు కరోనాను జయించారు.. కానీ -
కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం
ఒక మహిళ తన కుక్క పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టింది. యజమాని కొండచిలువ నోటికి చిక్కిన కుక్కపిల్లని కాపాడిన విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైలీ మైల్ ప్రకారం, పదివారల వయసుగల కుక్కపిల్ల 'వాలీ' అదృష్టవసాత్తు కొండచిలువ బారిన పడకుండా తప్పించుకుంది. కొండచిలువ నోటికి చిక్కిన వాలీ బాధతో గట్టిగా అరిచింది. ఆస్ట్రేలియా, క్వీన్లాండ్లోని సన్షైన్ కోస్ట్కు చెందిన కెల్లీ మోరిస్ తన కుక్కపిల్ల అరుపులు వినగానే మేడమీద ఉన్న ఆమె ఏం జరిగిందో చూడటానికి పరుగున వచ్చింది. కుటుంబ సభ్యులతో ఆమె అక్కడికి చేరుకునే సరికి ఒక కొండచిలువ కుక్కపిల్ల మెడను చుట్టుకొని ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాలీని కొండచిలువ నుంచి విడదీయగలిగారు. ఈ క్రమంలో కెల్లీకి కూడా గాయాలు అయినప్పటికీ ఆమె బాగానే ఉన్నారని 'సన్షైన్ స్నేక్ క్యాచర్స్ ఫేస్బుక్ పేజ్' తెలిపింది. (చదవండి: కేంబ్రిడ్జి విభాగానికి భారతీయ శాస్త్రవేత్త పేరు) 'మేము ఒక భయంకర శబ్ధన్ని విన్నాం. వాలీ ఎక్కడైన పడిపోయిందో, చిక్కుకుపోయిందో అనుకుంటూ వచ్చాం. వస్తున్న సమయంలో ఒక హారర్ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది. ఎక్కడ చూసినా వాలీ రక్తం పడి ఉంది. చివరికి తెలిసింది వాడు కొండచిలువకి చిక్కాడు' అని కెల్లీ ఏబీసీ న్యూస్లో తెలిపారు. కుక్కుపిల్లని కాపాడిన తరువాత కొండచిలువను ఒక కవర్లో ఉంచామని కెల్లీ అన్నారు. తరువాత వాలీని వైద్యంకోసం పశువైద్యశాలకి తీసుకెళ్లామని, తీవ్రంగా గాయపడిన వాలీ ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుందని, వాలీకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారని తెలిపారు. -
12 గంటల్లో కిడ్నాపర్ల ఆటకట్టు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్లోని ఓ దంత వైద్యుడి కిడ్నాప్ కేసును సై బరాబాద్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిం దితుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని హైదరాబాద్లోనే పట్టుకోగా, మరొకరిని అనంతపురం జిల్లా పోలీసుల సహకారంతో రాప్తాడు మండలం వద్ద అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ బుధవారం మీడియాకు వివరించారు. సులువుగా డబ్బు సంపాదించాలని.. కిస్మత్పుర గ్రామంలో నివాసముంటున్న దంతవైద్యుడు బెహజాత్ హుస్సేన్ బండ్లగూడలో ఇటీవల మూడు అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ క్లినిక్ను ఇటీవల ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో ఉండే హుస్సేన్ భార్య సమీప బంధువు ముస్తాఫా రెండు నెలల కింద హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో బండ్లగూడలోని హుస్సేన్ డెంటల్ క్లినిక్పై అంతస్తులోని ఫ్లాట్లు అద్దెకు ఉన్నాయని ముస్తాఫా తెలుసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ ఆర్థిక సలçహాదారుగా పనిచేసే ముస్తాఫా అక్కడ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి బ్యాంకుల్లో చాలా రుణాలు చేశాడు. అవి చెల్లించలేక 2019 మార్చిలో భారత్కు తిరిగి వచ్చాడు. పుణే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించి ఆస్ట్రేలియాలో తనతో పాటు పనిచేసిన ముబసిర్ అహ్మద్ అలియాస్ కాలేద్తో కలసి ఆయా ప్రాంతాల్లో తిరిగాడు. అయితే చాలా అప్పులు ఉండటంతో ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించేందుకు హుస్సేన్ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగొచ్చని పథకం రచించాడు. పని మనిషిని పెట్టి మరీ.. ఫలక్నుమాకు చెందిన మహమ్మద్ రహీంను హుస్సేన్ ఫ్లాట్లో హౌస్కీపర్గా పని కుదుర్చుకుని దంత వైద్యుడి కదలికలపై ముస్తాఫా నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు వైద్యుడితో పాటు టెక్నీషియన్ మాత్రమే ఆ క్లినిక్లో ఉన్నట్లు రహీం ఫోన్లో దుండగులకు తెలిపా డు. కిడ్నాప్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, విక్కీ, సల్మాన్లు బుర్ఖాలు ధరించి క్లినిక్లోకి వెళ్లా రు. బొమ్మ పిస్టల్తో బెదిరించి గాయపరి చా రు. టెక్నీషియన్ కాళ్లు, చేతులు కట్టేసి ము ఖానికి గుడ్డ కట్టారు. ఆ తర్వాత వైద్యుడిని ఆయన కారులోనే కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటున్న మహమ్మద్ ఇమ్రాన్, ఇర్ఫాన్ల ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో వైద్యుడి కుటుం బసభ్యులకు రూ.10 కోట్లు ఇస్తే విడిచి పెడతామంటూ వాయిస్ మెసేజ్ పంపారు. అయి తే, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వైద్యుడిని తీసుకెళ్లేందుకు కర్ణాటక ఉడిపికి చెందిన పునీత్, సంజయ్, సిరి, పృథ్వీల బృందం బొలెరో వాహనంలో రాత్రి 12 గంట ల సమయంలో బయల్దేరింది. కాగా, కిడ్నాప్ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్ల కారు అనంతపురం వైపు వెళ్తున్నట్లు నిర్ధారించుకుని, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించారు. సజ్జనార్ పర్యవేక్షణలో 12 బృందాలు కిడ్నాప్ విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చాలెంజ్గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలను పంపారు. దాదాపు 100 మందికిపైగా అధికారులు ఈ కేసును ఛేదించేందుకు రాత్రంతా పనిచేశారు. బండ్లగూడలోని డెంటల్ క్లినిక్ ప్రాంతంలో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నం బర్లు గుర్తించారు. హౌస్కీపర్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కూకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద నివాసముండే మహమ్మద్ ఇమ్రాన్, ఇర్ఫాన్లను, రెడ్హిల్స్లో పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, వికీ దత్తా షిండేలను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు బెంగళూరుకు వెళ్తున్న మార్గంలోని ఏపీ, కర్ణాటక పోలీసులకు వాహనం వివరా లు ఇవ్వడంతో నిఘా పెట్టారు. తెలంగాణ స రిహద్దులోనే దొరకాల్సిన వీరు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబును అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’పోలీసులు తొలుత బొలెరో వాహనాన్ని అనంతపురం పోలీసులు ఆపే ప్రయత్నం చేయ గా, కిడ్నాపర్లు అతివేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్గౌడ్, రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద వాహన తనిఖీ చేశారు. దీంతో కిడ్నాపర్లు కుడి వైపు టర్న్ తీసుకుని బుక్కచెర్ల వైపు వెళ్లారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. అదే సమయంలో ఎస్ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో బుక్కచెర్ల గ్రామ సరిహద్దుల్లో రాళ్లు, ముళ్ల కంపలు అడ్డు పెట్టారు. అటునుంచి బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒక దుండగుడిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా దంత వైద్యుడు హుస్సేన్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. కిరాతకంగా హింసించి, కాళ్లతో తొక్కి, చేతి గోళ్లు పీకేశారు. ఏపీ డీజీపీ అభినందన దంత వైద్యుడిని సురక్షితంగా కాపాడి, కిడ్నాప్ చేసిన దుండగుడిని ధైర్యంగా పట్టుకున్నందుకు అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. -
రైలు ఆపేసి.. ప్రాణాలు కాపాడారు!
సాక్షి, హైదరాబాద్ : సకాలంలో స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని హైదరాబాద్ పోలీసులు కాపాడారు. ఆత్మహత్య చేసుకోవాలని యత్నించిన ఓ వ్యక్తిని మాల్కాజ్గిరి పోలీసులు రక్షించారు. గతరాత్రి పాల్దియా గోపీ అనే వ్యక్తి మౌలాలీ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై అడ్గంగా పడుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై మీర్పేట పోలీస్స్టేషన్ నుంచి సమాచారం అందగానే రంగంలోకి దిగిన మల్కాజ్గిరి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైలును ఆపేయడంతో వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తదనందరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ట్వీట్ చేశారు. పోలీసులు స్పందించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు కురుస్తున్నాయి. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు సలామ్లు చెబుతున్నారు. చదవండి: ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు -
విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు
సాక్షి, తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ కేరళ కోళికోడ్ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్ వసంత్ సాథే సారధ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే...మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలు మోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం. అయితే ఇంతటి ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) న్యూస్ మినిట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు. (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? ) స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్లోని రెడ్ క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. 'గుర్తు తెలియని కవలలు' పేరుతో జిల్లా అధికారులు పేరుతో వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. వారి సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. -
నది మధ్యలో నరకయాతన
సాక్షి, కాళేశ్వరం: గోదావరి దాటుతున్న ఓ యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఏడు గంటల పాటు నది మధ్యలోనే ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కుంట్లం–3 ఇసుక క్వారీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొల్లూరు ఇసుక క్వారీలో పనిచేసే జీవన్లాల్ సింగ్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలోని క్వారీ వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కుంట్లం–3 క్వారీ నుంచి కొల్లూరుకు కాలినడకన గోదావరి మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరదలో చిక్కుకున్న జీవన్లాల్.. అరుపులు, కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి మధ్యాహ్నం అతని అరుపులు విన్న క్వారీ సిబ్బంది 100కు డయల్ చేశారు. కానిస్టేబుళ్లు సంజీవ్, మధుకర్ అక్కడికి చేరుకుని ఓ నాటు పడవలో ఇద్దరు గజ ఈతగాళ్లతో వెళ్లి జీవన్లాల్ సింగ్ను తీసుకువచ్చారు. (ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి) -
షాకింగ్ వీడియో : చివరిదాకా చూడండి!
కళ్లు మూసి తెరిచేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇలాంటి భీతి గొలిపే ఘటన సౌత్ వెస్ట్ చైనాలోని ఒక నగరంలో చోటు చేసుకుంది. అనూహ్యంగా మంటల్లో చిక్కుకున్న వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కేవలం కొన్ని క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకున్న వైనం వీడియోలో రికార్డైంది. వివరాలను పరిశీలిస్తే.. ఒక మినీ బస్ అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఆ వాహనంనుంచి పొగలు వ్యాపించాయి. అయినా అటుగా వెళ్తున్నవారెవరూ స్పందించలేదు. ఇంతలో భీకరంగా మంటలు అలుముకున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి తక్షణమే స్పందించి ఆ బస్సులో ఉన్నవారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. చివరకు భయంతో బిక్కుబిక్కుమంటున్న ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు. చైనా జినువా వార్తా సంస్థ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. Three passengers trapped in an overturned minibus were rescued by a passing driver in just 50 seconds in southwest China's Chongqing Municipality recently pic.twitter.com/ErmixrvWBV — China Xinhua News (@XHNews) July 3, 2020 -
తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ
అంతేలే పేదల బతుకులు..అశ్రువులే నిండిన కుండలు.. కూలాడితే గాని కుండాడని జీవితాలు.. పిల్లల్ని చదివించాలంటే అప్పులు చేయాలి.. అప్పులు తీరాలంటే అవకాశాలు వెతుక్కోవాలి. ఉన్న ఊరిలో పరిస్థితులు వెక్కిరిస్తే పొరుగూరికి వలస పోవాలి. అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కష్టించి పని చేయాలి. ఆ క్రమంలో అనారోగ్యం బారిన పడితే ఇక అంతే సంగతులు. చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సంకట స్థితినే నవరంగపూర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు చవిచూశారు. ఒడిశా: గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు కుమార్తెతో కలిసి కూలి పనుల కోసం హైదరాబాద్ వలస వెళ్లిన తల్లి అక్కడ జబ్బు పడింది. హాస్పిటల్ ఖర్చుల కోసం, మందులకు తాము పనిచేసే యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇంటికి వెళ్లి వచ్చి అప్పు తీరుస్తానని చెప్పి కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వచ్చింది. జబ్బు విషమించడంతో దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఈ విషయం తెలిసినప్పటికీ కన్నతల్లిని కడసారి చూసేందుకు ఆ బాలిక ఇంటికి రాలేకపోయింది. చివరికి విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించి తన మనిషిని హైదరాబాద్ పంపి ఆ బాలికను విడిపించి తీసుకువచ్చిన సంఘటన జిల్లా ప్రజల హృదయాలను కదిలించింది. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితికి చెందిన అనాది పాణిగ్రహి భర్త మూడేళ్ల కిందట మరణించాడు. ఆమె తన ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాలన్న ఆశతో మైక్రోఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.30 వేలు రుణం తీసుకుంది. ఇద్దరినీ కళాశాలలో చేర్చింది. అయితే తీసుకున్న అప్పు తీరే మార్గం కానరాక పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి తనతో పాటు చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని 5 నెలల కిందట ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. అక్కడ తల్లీకూతుళ్లు ఒక ఇటుకల కంపెనీలో పనికి కుదిరారు. అయితే హైదరాబాద్లో తల్లి అనాది ఆరోగ్యం క్షీణించింది. మందుల కోసం కంపెనీ యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని కుమార్తె సాగరికను ఇటుకల కంపెనీ యజమాని వద్ద తాకట్టు పెట్టి చందాహండి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన కొంత కాలానికే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మరణించింది. అయితే అప్పటికే లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల కుమార్తె సాగరిక తల్లిని చూసేందుకు కూడా ఇంటికి రాలేకపోయింది. గ్రామంలో ఉన్న సాగరిక అక్క ప్రియాంక చెల్లెలి రాక కోసం ఎదురు చూస్తూ విలపిస్తోంది. చదవండి: ప్రియుడు మోసం చేశాడని టీవీ నటి ఆత్మహత్య స్పందించని ప్రభుత్వం హైదరాబాద్లో తాకట్టులో ఉన్న సాగరిక తన గోడును ఒడిశా ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయితే ఎవరూ స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి స్పందించి వెంటనే తన కారులో చందాహండి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చందాహండి సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర హింసను వెంటనే హైదరాబాద్ పంపారు. ఆయన ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల అధికారులతో పాటు ఇటుకల కంపెనీ యజమానితో మాట్లాడి సాగరికను వెంటనే విడిచి పెట్టాలనికోరారు. ఎట్టకేలకు సాగరిక విముక్తి పొంది శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం నవరంగపూర్ చేరుకుంది. లాక్డౌన్ వల్ల పంపలేక పోయాం కాంగ్రెస్ నేతలు ఆమెను ఓదార్చి ఈ విషయం విలేకరులకు తెలియ జేశారు. సాగరిక తన బాధల గాథలను చెబుతూ విలపించింది. అక్కను కలిసి భోరున ఏడ్చింది. హైదరాబాద్లో ఇటుకల బట్టీ యజమాని కె.సుబ్బారావు ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ సాగరిక తల్లి అనారోగ్యం వల్ల ఇంటికి వెళ్లిందని, ఆమె మరణించిన విషయం తెలిసి సాగరికను పంపించాలని భావించామని లాక్డౌన్ కారణంగా పంపించలేక పోయానని చెప్పారు. తల్లిని కోల్పోయి అనాథల్లా మిగిలిన అక్కాచెలెళ్లు ప్రియాంక, సాగరికలను ప్రభుత్వం ఆదుకుని వారిని చదివించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నవరంగపూర్ చేరుకుని భోరున విలపిస్తున్న సాగరిక -
16 గంటలు మృత్యువుతో పోరాటం
పుణే : బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని మహారాష్ట్ర పోలీసులు చాకచక్యంగా రక్షించారు. బుధవారం ప్రమాదవశాత్తూ 200అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని దాదాపు 16గంటల కఠోర శ్రమ అనంతరం గురువారం ఉదయం సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనంధానికి అవధుల్లేవు. అటు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పుణే 70కి.మీ దూరంలో ఉన్న థ్రాడేండేల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి ఫాంథిల్ భిల్ అనే బాలుడు ఆడుకుంటూ సమీపంలోని పొలంలోతవ్విన బోరుబావిలో నిన్న సాయంత్రం 4.30 గంటలకు పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాలుని తల్లిదండ్రులు, ఇతర స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో కలిసి బాలుడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరికి 16గంటల అనంతరం విజయం సాధించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడనీ, వైద్యులతో పరీక్షలు కూడా నిర్వహించామనీ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని తెలిపారు. కాగా బాలుడి తండ్రి పండిట్ భిల్ రహదారి నిర్మాణ కార్మికుడు. -
మనుషులు కాదు..రాక్షసులు
-
ఈ పాప..భలే అదృష్టవంతురాలు
కాన్పూర్: శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు భారీ ప్రమాదంనుంచి ఓ చిన్నారి అనూహ్యంగా మృత్యువును జయించింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భవనం కూలిన ఘటనలో మూడేళ్ల పాప ఆశ్చర్యకరంగా గురువారం ప్రాణాలతో బయటపడింది. పాపను చాకచక్యంగా రక్షించిన అధికారులు ఆమెను తండ్రికి అందించారు. దీంతో పాప క్షేమంపై అప్పటివరకు ఆందోళనతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉగ్వేదానికి లోనయ్యారు. శిథిలాలనుంచి చిన్నారి క్షేమంగా ఆరోగ్యంగా బయపడడంతో అటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా నిన్న (బుధవారం) కాన్పూర్ లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో చనిపోయిన వారి కార్మికులు సంఖ్య ఆరుకు చేరింది. సుమారు 30 మంది గాయపడ్డారు. వెంటనే ఆర్మీ, పోలీసులు రంగంలోకి శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించే చర్యలు చేపట్టారు. అటు ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా, పలువురు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
8ఏళ్ల బాలుడ్ని గోతిలో పడేసిన ఆగంతకులు
-
అయ్యో..! ఈ అమ్మాయికి ఎంత కష్టం
బీజింగ్: చైనాలోని యునాన్ ప్రావిన్స్లో జరిగిన ఘటన ఇది. అక్కడి మొజియాంగ్ కౌంటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాలలో చదువుతున్న ఓ పదమూడేళ్ల బాలిక తల గ్లాస్ డోర్ల మధ్యలో ఇలా చిక్కుకుపోయింది. స్కూల్ క్యాంటీన్లో ఆడుకుంటున్న సమయంలో కొందరు మిత్రులు ఆ బాలిక తలను ఇలా గ్లాస్ డోర్ల మధ్యలో ఉంచారు. అయితే.. డోర్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలిక తల సులభంగా బయటకు రాలేదు. బాలికను రక్షించడానికి ఫైర్ సిబ్బంది రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. వారు డోర్ హ్యండిల్స్ను తొలగించడంతో ఆ బాలికను రక్షించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని రక్షించేవరకు కొన్ని గంటలపాటు ఆ బాలిక ఇలా నుంచోనే ఉంది. ఈ ఘటనలో ఆ బాలిక మెడకు స్వల్పంగా గాయాలయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని.. ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదని వారు వెల్లడించారు. -
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
-
మరో మృతదేహం వెలికితీత
-
బిల్డర్పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
-
మరో మృతదేహం వెలికితీత
హైదరాబాద్: హైదరాబాద్లోని నానక్రామ్గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, మరో 8మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా మృతులను శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరిగా గుర్తించారు. శివ తప్ప మిగతా వారంతా విజయనగరం జిల్లా వాసులుగా తేలింది. శిథిలాల కింద ఇరుక్కున్న ఛత్తీస్గడ్కు చెందిన ఓ మహిళ, చిన్నారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించగలిగింది. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్రామ్గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యజమాని గుడుంబా డాన్! నానక్రామ్గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
బిల్డర్పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
హైదరాబాద్: నానక్రాం గూడలో భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం వెనుక సెల్లార్ కోసం తవ్వకాలు జరిపినందునే ఈ ప్రమాదం జరిగినట్లు హోం మంత్రి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్గడ్కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భవన శిథిలాల కింద 12 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల నుంచి ఛత్తీస్గఢ్కు చెందిన శివ అనే యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు వినిపిస్తుండటంతో పైపుల ద్వారా ప్రాణవాయువును పంపిస్తూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తక్కువ స్థలంలో ఆరు అంతస్థులతోపాటు పెంట్హౌస్ నిర్మించిన సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తుసింగ్పై అధికారులను బెదిరించిన ఘటనలకు సంబంధించి పలు పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
హైదరాబాద్: హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్గడ్కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో బొబ్బిలికి చెందిన వాచ్ మెన్ సాంబయ్య, నేతేటి పైడమ్మ, వెంకటలక్ష్మీ, నారాయణమ్మ, పోలినాయుడు, మోహన్, దుర్గారావు, శంకర్లు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జేసీబీల ద్వారా శిథిలాలను రెస్క్యూ టీం తొలగిస్తుంది. -
జవానును రక్షించారు
శ్రీనగర్: బైపాస్ రోడ్డుపై యాక్సిడెంట్ అయి వాహనం ఇరుక్కుపోయిన ఓ జవానును కశ్మీరీ ప్రజలు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్ లోని లాస్జన్ ప్రాంతంలో బైపాస్ పై వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న వాహనంలో ఓ సైనికుడు ఇరుక్కుపోయాడు. మిగిలిన జవానులు అతన్ని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. దీంతో తీవ్రంగా గాయపడిన జవానును అక్కడే ఉన్న కశ్మీరీ యువత ట్రక్కు సాయంతో బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను కొందరు తమ మొబైళ్లలో చిత్రించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం కశ్మీర్ లో పరిస్ధితులు కల్లోలంగా ఉన్న విషయం తెలిసిందే. -
తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి
గత ఏడాది లిబియాలో కిడ్నాప్ అయిన తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి.గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన సి.బలరాం కిషన్ సురక్షితంగా విడుదల కావడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. సుమారు ఏడాదికిపైగా బందీలుగా ఉన్నవారు సురక్షితంగా విడుదలైనట్లు తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు సుష్మ గురువారం ట్విట్ చేశారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. తమవారి జాడకోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు ఏడాదికాలం చూసిన వారి ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు బందీలుగా ఉన్నగోపీకృష్ణ, బలరామకిషన్ లు సురక్షితంగా విడుదలవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారి కుటుంబాల్లో సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ల విడుదలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు తన ట్వీట్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. I am happy to inform that T Gopalakrishna (AP) & C BalaramKishan (Telangana) who were captive in Libya since 29 July 2015 have been rescued. — Sushma Swaraj (@SushmaSwaraj) 15 September 2016 -
60 అడుగుల బావిలో పడిన చిరుత!
పూణె: నగరానికి దగ్గరలోని ఓ గ్రామంలోని బావిలో చిక్కుకున్న చిరుతను అటవీశాఖ అధికారులు కాపాడారు. పింపల్ గావ్ సిద్ధానాధ్ గ్రామం శివారులో ఆదివారం ఉదయం ఓ బావి నుంచి పెద్దగా గాండ్రింపులు వినిపించాయి. వాటిని అనుసరిస్తూ బావి దగ్గరకు వెళ్లిన రైతుకు 60 అడుగుల లోతు బావిలో చిరుతపులి ప్రాణాల కోసం పోరాడుతుండటాన్ని గమనించాడు. చిరుతను చూసిన భయాన్ని తగ్గించుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వైల్డ్ లైఫ్ ఎస్ఎస్ఓతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తొలుత చిరుత శ్రమను తగ్గించడానికి మూడు అడుగుల దుంగను బావిలోకి వేశారు. అప్పటికే బాగా అలసిపోయిన చిరుత.. ప్రాణభయంతో దుంగను గట్టిగా పట్టుకుంది. ఒక పులి బోనుకు తాళ్లు కట్టని అధికారులు గ్రామస్థుల సాయంతో దానిని బావిలోకి దించారు. బోను దగ్గరకు రావడంతో చిరుత దానిలోకి వెళ్లడానికి యత్నించగా.. జారి మళ్లీ నీళ్లలో పడిపోబోయింది. బోనును ఇంకొంచెం కిందకు దించిన అధికారులు ఈసారి చిరుతను బోనులోకి వెళ్లేట్టుగా చేయడంలో సఫలం అయ్యారు. చిరుత బోనులోకి వెళ్లగానే బోనును మూసివేశారు. జున్నూర్ జిల్లాలో ఎక్కువగా బావులు ఉండటం వల్ల తమ నివాసాల నుంచి తప్పిపోయిన వన్యప్రాణులు చెరకు పంటలో తలదాచుకుంటున్నాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ ఖర్మాలే చెప్పారు. అప్పుడప్పుడు ఇలా బావుల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపారు. రక్షించిన చిరుతకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరిగి అడవిలో వదిలేసినట్లు వివరించారు. -
కాబూల్లో కిడ్నాపైన భారత మహిళ క్షేమం
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో గత నెలలో కిడ్నాప్ కు గురైన భారత మహిళ కథ సుఖాంతమైంది. ఆమె ఆచూకీ శనివారం దొరికిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కోత్ కతాకు చెందిన జుడిత్ డిసౌజా (49) కాబూల్ లోని ఆగాఖాన్ ఫౌండేషన్ లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. జూన్ 9 న ఆమెను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. జూన్ 15 న ఆమె ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. దీనిపై సుష్మా స్వరాజ్ డిసౌజా కుటుంబ సభ్యులకు ఆమెను క్షేమంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ అఫ్ఘాన్ అధికారులను కోరింది. అక్కడి భారత అధికారులను సుష్మ అప్రమత్తం చేశారు. అనంతరం ఎట్టకేలకు జూడిత్ ఆచూకీని భారత్-అఫ్ఘాన్ అధికారులు కనుగొని ఆమెను రక్షించారు. ప్రస్తుతం భారత ఎంబసీ సంరక్షణలో ఉన్న జుడిత్.. త్వరలోనే మాతృదేశానికి తిరిగొస్తారని సుష్మ తన ట్వీట్లలో చెప్పారు. ఆమె ఆచూకీని కనుగొనడంలో చురుగ్గా వ్యవహరించిన భారత ఎంబసీ అధికారి మన్ప్రీత్ ఓహ్రాను ఆమె అభినందించారు. చాలా అద్భుతంగా పనిచేశారంటూ ప్రశంసించారు. తన సోదరి క్షేమ సమాచారం తెలిసిన వెంటనే ఆమె సోదరుడు జెరోమ్ డిసౌజా సుష్మాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. I am happy to inform you that Judith D'souza has been rescued. @jeromedsouza — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Judith was abducted in Kabul on 9th June 2016. — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Thank you Afghanistan - for all your help and support in rescuing #Judith. — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Ambassador @VohraManpreet - you have done an outstanding job.#Judith — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Judith D'Souza is with us - safe and in good spirits. She will reach her Motherland at the earliest. Vande Mataram. https://t.co/VAfBWpBAeN — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 -
ఏడు ఏనుగులకు తప్పిన ముప్పు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఏడు ఏనుగులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కాలువలో చిక్కుకున్న వాటిని అటవీ శాఖ అధికారులు గంటపాటు శ్రమపడి వాటిని రక్షించారు. బెంగాల్ లోని జల్పాయ్ గురి నగరంలో వర్షాల కారణంగా అక్కడి నదులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అందులో ఒక నదికి అనుసంధానంగా ఉన్న కాలువలో ఏనుగులు ఉండటం కొంతమంది జాలర్లు గమనించారు. నీటి ప్రవాహానికి అవి తడబడుతుండటం చూసి అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది గంటపాటు శ్రమించి ఐదు పెద్ద ఏనుగులను, రెండు గున్న ఏనుగులను రక్షించారు. ఏనుగులు కూడా నిల్చోలేనంత వేగమైన ప్రవాహంతో అక్కడి కాలువలు పొంగుతున్నాయి. -
మారథాన్ లో కూలిన బ్రిడ్జి!
చెన్నై: నగరంలో ఆదివారం నిర్వహించిన మారథాన్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళలకు ఎదురయ్యే సమస్యలు, బ్రెస్ట్ కేన్సర్ పూ అవగాహన కల్పించేందుకు పింక్ థాన్ పేరిట దేశంలోనే అతిపెద్ద మహిళా మారథాన్ చెన్నై నిర్వహించారు. ఐల్యాండ్ గ్రౌండ్ నుంచి లైట్ హోస్ వరకు కొనసాగిన ఈ మారథాన్లో కూవం నదిపై చెక్కతో నిర్మించిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో దాని మీద పరుగులు తీస్తున్న మహిళలు నదిలో పడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మహిళల్ని రక్షించారు. గాయపడిన మహిళలకు ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. -
క్షుద్రపూజల పేరుతో బాలికను బలిచ్చే యత్నం
రాజమండ్రి: మూఢ నమ్మకాల ముసుగులో ఓ ఐదేళ్ల బాలికను కొందరు అన్యాయంగా బలి తీసుకునే ప్రయత్నం చేశారు. రాజమండ్రి సైక్లోన్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆరుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తూ బాలికను బలిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను కాపాడి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో చిరుత...
ఇల్లంతకుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి వ్యవసాయబావిలో ఓ చిరుతపులి పిల్ల పడింది. మంగళవారం ఉదయం ఆనందరెడ్డి బావి వద్దకు వెళ్లగా అరుపులు వినిపించడంతో బావిలోకి చూశాడు. బావిలో చిరుత పులి ఉందని గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు వెంటనే అక్కడకు చేరుకుని వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. క్రేన్ సాయంతో బావిలోకి బోను దించినప్పటికీ చిరుత అందులోకి రాకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బయటకు తీశారు. చిరుత నీరసంగా ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహించి వరంగల్కు తరలించారు. చిరుత పిల్ల చిక్కడంతో పెద్దలింగాపూర్, సోమారంపేట శివార్లలోని గుట్టల ప్రాంతంలో మరో మూడు చిరుత పులులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. -
35 అడుగుల మంచులో కూరుకుపోయినా..
సియాచిన్ అంటేనే మృత్యువుకు మరోపేరు. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ఎత్తయిన యుద్ధక్షేత్రంలో కొనఊపిరితో బతికి బయటపడ్డ లాన్స్నాయక్ హనుమంతప్ప ధీరోదాత్త ఉదంతం ఓ మిరాకిల్గా నిలిచింది. వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడు రోజుల క్రితం అక్కడ పహారా కాస్తున్న సైన్యం మంచు తుఫానులో చిక్కుకుంది. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. మీద పడటంతో భారత సైనిక శిబిరం సమాధి అయిన ఘటనలో హనుమంతప్ప ఒక్కడే అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మద్రాస్ రెజిమెంట్కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా మిగతా 9 మంది సైనికులు అసువులు బాశారు. 19,600 అడుగుల ఎత్తయిన మంచు పర్వతం.. 35 అడుగుల మంచు.. మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నిమిషాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి.. ఇవన్నీ ఉన్నా హనుమంతప్ప బయటపడ్డాడు. హనుమంతప్పను సజీవంగా నిలిపింది ఏంటన్నదే ఇపుడు చర్చకు దారితీసింది. మంచులోని గాలిబుడగలే కాపాడాయని నిపుణులు చెబుతున్నారు. అతని నోరు, ముక్కు దగ్గర ఎయిర్ పాకెట్స్ ను గమనించామని రెస్క్యూ ఆపరేషన్ ఆఫీసర్లు తెలిపారు. తాము పేరు పెట్టుకున్న హనుమంతుడే తన బిడ్డను కాపాడాడని అతడి తండ్రి అంటున్నారు. నిరంతర కఠోర వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం బాగా అలవాటు ఉండటం వల్లే హనుమంతప్ప బయటపడినట్లు తెలుస్తోంది. శరీరంలోని పలు భాగాలు గడ్డకట్టుకుపోయి కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను సైనిక వైద్యులు వెంటిలేటర్పై ఉంచారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావడం లేదని.. రక్తపోటు చాలా తక్కువగా ఉందని, కిడ్నీలు, లివర్ పనిచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం విషమంగానే ఉందని, 24గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. దీంతో.. హనుమంతప్ప క్షేమ సమాచారం కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ధీరుడా.. కోలుకో అంటూ ప్రార్థనలు చేస్తోంది. అసలు 1984కు ముందు సియాచిన్పై సైనిక శిబిరాలు ఉండేవి కావు. అయితే, వ్యూహాత్మక ప్రాంతం కావడంతో ఇరుదేశాలు సైనిక శిబిరాలు ఏర్పాటుచేశాయి. వీటిని విరమించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. కానీ ఇంతవరకూ తొలి అడుగు పడలేదు. -
పులులు ఏం చేస్తాయో చూద్దామని...
అలవికాని చోట అధికులమనరాదు అన్న సామెత.. ఆవ్యక్తికి తెలుసో లేదో కాని... ఏకంగా పులులతోనే పెట్టుకునేందుకు చూశాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. జూ సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు... అప్పటిదాకా కేబుల్ కార్ లో కూచుని శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ పైకి వచ్చేప్పటికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్టుంది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్ క్లోజర్ నెట్ పైకి దూకేశాడు. ఇంతకూ బతికాడా లేదా అన్నదేగా మీ సందేహం...? చైనా జంతు ప్రదర్శన శాలలో పులలకు ప్రత్యేక ఎన్ క్లోజర్ ఉంది. సాధారణంగా ఏ జూలో అయినా అలాగే ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. అయితే చైనాలో తుంటరిగాళ్ళను నమ్మకూడదనుకున్నారో ఏమో జూ సిబ్బంది... సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్ క్లోజర్ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్ కార్ ద్వారా (రోప్ వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్ వే ఛైర్ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు. జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనించిన పులులు...ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్ న్యూసెన్స్ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం. పులుల ఎన్ క్లోజర్ లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్ క్లోజర్ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్ చేస్తూ పెన్ లో నానా హంగామా చేశాడు. పులుల మూడ్ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. అవును... ఓ సినిమాలో హీరోగారన్నట్లు.. సింహం పడుకుంటే జూలుతో జడేయాలనుకోవడం, పులితో ఫొటో తీయించుకోవాలనుకోవడం మంచిది కాదు మరి... -
యాక్షన్ సినిమా లెవల్లో కాల్పులు
న్యూఢిల్లీ: ఓ బాలుడిని కాపాడేందుకు పోలీసులకు, దుండగలకు మధ్య యాక్షన్ సినిమా లెవల్లో పోరు నడిచింది. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా స్కూలు ఆవరణ కాల్పులతో దద్దరిల్లిపోయింది. హైడ్రామా అనంతరం ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుండి బాలుడిని కాపాడిన వైనం ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఘజియాబాద్లోని ఓ స్కూల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే విలాసవంతమైన రాజ్ నగర్ ఏరియా నుంచి జై కరన్ అనే 13 ఏళ్ల బాలుడిని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేశారు. ఒకరోజు తర్వాత...జై కరన్ తండ్రి, స్టాక్ ట్రేడర్ వివేక్ మహాజన్ కి బాలుని మొబైల్ నుంచే ఫోన్ చేశారు. అతడిని విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయినా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక వివరాల సేకరణ అనంతరం జై కరన్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా దుండగులు దాగి వున్న స్థలాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక రాయల్ కిడ్స్ ప్లే స్కూల్లో పనిచేసే ఉద్యోగి ఇంట్లో పిల్లాడిని దాచి పెట్టిన సంగతిని తెలుసుకుని ఇంటిపై దాడి చేశారు. సుమారు 20 నిమిషాలపాటు పోలీసులు, దుండగుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పరస్పర భీకర కాల్పుల తరువాత చివరికి దుండగుల ఆట కట్టించారు. 10-12 రౌండ్ల కాల్పులు జరగగా, ఈ ఘటనలో నిందితుడు దిలీప్ గాయపడ్డాడు. సందీప్ కుమార్, దీపక్ ,బిట్టు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జై కరన్ కిడ్నాప్ ఉదంతాన్ని వివరిస్తూ.... 'నన్ను కారులో తీసుకెళ్లి, ఒక ఇంట్లో దాచారు. తుపాకితో బెదిరించి, బాగా కొట్టారు. వాళ్ల అమ్మ నన్ను విడిచిపెట్టమని అంటే ఆమెను కూడా తిట్టారు. తుపాకి గురిపెట్టి ఆమెను భయపెట్టారు. తరువాత ఏదో ఇంజక్షన్ ఇచ్చారని ఆ తరువాత తనకేమీ తెలియదని' పోలీసులకు వివరించాడు. తేలికగా డబ్బు సంపాదించడం కోసం నిందితులు ఈ చర్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. అటు ఈ వ్యవహారంలో స్కూలు యాజమాన్యాన్ని, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శని, ఆదివారాలు స్కూలుకు సెలవు కావడంతో బాలుడి కిడ్నాప్ విషయం తమ దృష్టికి రాలేదని స్కూలు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు
జైపూర్: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని గ్రామస్తులు సురక్షితంగా కాపాడిన వైనం ఆ గ్రామంలో ఆనందోత్సాహాల్ని నింపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సమీపంలో దౌసా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిహార్పుర గ్రామంలో జ్యోతి మీనా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఇంటివద్ద ఆడుకుంటూ సుమారు 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. దాదాపు12 గంటల కఠిన ప్రయత్నాల తర్వాత గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాపను బయటకు తీయగలిగారు. ప్రాథమిక చికిత్స అనంతరం దోసాలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు. ఈ సహాయ కార్యక్రమంలో ఎన్డీఆర్ఆఫ్ దళాలు, జిల్లా రక్షర దళాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్విన గ్రామస్తులు పాపను రక్షించారని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ పవార్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా స్థానికం తయారు చేసిన ఇనుప రాడ్లు, పగ్గాల ద్వారా పాపను రక్షించడంలో గ్రామస్తులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. -
థాంక్యూ రుస్తుం..!
మ్యాన్హోల్లో చిక్కుకుపోయిన వీధికుక్కను ఓ పాదచారి కాపాడిన వైనం ఫేస్బుక్లో కొన్ని లక్షల లైకులను కొట్టేసింది. రష్యాలోని వరోని నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన వాదిమ్ రుస్తుం దారిన వేగంగా వెళ్తుండగా.. నిస్సహాయంగా అరుస్తున్న కుక్క అరుపులు వినిపించాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందు అర్థం కాలేదు. శ్రద్ధగా విన్న తర్వాత తను నడుస్తున్న పేవ్మెంట్ అడుగు నుంచి ఆ అరుపులు వస్తున్నాయని గమనించాడు. హృదయవిదారకంగా ఉన్న ఆ కుక్క అరుపులు విన్నాక దాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్న రుస్తుం.. సిటీ అధికారులను సంప్రదించాడు. కానీ, వాళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక తానే స్వయంగా రంగంలోకి దిగాడు. మ్యాన్హోల్ను జాగ్రత్తగా తెరిచి, కుక్కను బయటకు తీశాడు. దీంతో రెండు రోజులపాటు బందీగా ఉన్న ఆ కుక్క.. హాయిగా తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది. అన్నట్టు ఈ కుక్క ప్రెగ్నెంట్ అట. కుక్క అదృష్టమో లేక దాని కడుపులో ఉన్న బుజ్జి కుక్కపిల్లల అదృష్టమో గానీ రెండు రోజులు తర్వాత క్షేమంగా బతికి బయటపడిందా శునకమాత. రుస్తుం ఈ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సదరు కుక్కమాత చిక్కుకుపోయిన ఆ మ్యాన్హోల్ గత మూడు వారాలుగా తెరిచి ఉందట. సెప్టెంబర్ 18న హౌసింగ్ అధికారులు లోపల చిక్కుకుపోయిన కుక్కను గమనించకుండానే దాన్ని మూసేనట్టు సమాచారం. -
టీనేజీ బాలికలను రక్షించిన పోలీసులు: తల్లి అరెస్ట్
థానే: మహారాష్ట్ర థానే మునిర్పాద ప్రాంతంలోని వ్యభిచార గృహాల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. అనంతరం వారిని స్వచ్చంధ సంస్థకు తరలించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి వారి తల్లిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె వద్ద నుంచి రూ. 4 వేల నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళల అక్రమ రవాణతోపాటు పలు కేసులు బాలిక తల్లిపై నమోదు చేసినట్లు ఉన్నతాధికారి వివరించారు. ఈ నెల 8వ తేదీని దాయ్గఢ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలికల తల్లి కూడా ఉందని పోలీసులు చెప్పారు. అయితే తమను వ్యభిచారంలోకి దిగాలంటూ తల్లి తమను బలవంతం చేస్తున్నట్లు సదరు టీనేజీ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వాళ్ల తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
18 మంది బాలకార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : ఓ కంపెనీలో పని చేస్తున్న 18 మంది బాల కార్మికులకు రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మంగళ్లపల్లి గ్రామంలో ఉన్న రోహిణీ ఫీడ్ కంపెనీలో రెవెన్యూ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది బాలకార్మికులు పనిచేస్తుండటంతో వారిని రెస్క్యూ హోంకు తరలించి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బాధితులంతా బీహర్కు చెందిన వారిగా సమాచారం. -
యమునా నదిలో చిన్నికృష్ణయ్య
ఫతేబాద్: ఆగ్రాకు సమీపంలోని సిలావాలి గ్రామంలో అద్భుతం జరిగింది. యమునా నదిలో కొట్టుకుపోతున్న నాలుగు రోజుల పసికందును పశువుల కాపరి కాపాడాడు. స్థానిక పశువుల కాపరుల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల సమయంలో యమునా నదిలో ఒక చిన్న బుట్ట తేలుతూ పోతోంది.. ఏమిటబ్బా అని పరికించి చూస్తే ఆ బుట్టలో పసిగుడ్డు..ఇంతలోనే సన్నగా ఏడుస్తున్నశబ్దం వినిపించింది. అంతే.. క్షణం కూడా ఆలోచించకుండా నదిలో దూకి బాబును రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు. అసలు బాబు బతికి ఉన్నాడా లేడా అని భయపడ్డా.. అదృష్టవశాత్తూ పిల్లవాడు బతికే ఉన్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు పిల్లవాడిని ఒడ్డుకు చేర్చిన రామ్జీ లాలా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పసిగుడ్డును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. స్థానిక స్ఎన్ మెడికల్ కాలేజీలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లవాడికి ప్రాణాపాయం లేదని.. ఎక్కువ సేపు ఎండకు, చల్లగాలికి ఎక్స్పోజ్ కావడంతో చర్మానికి అలర్జీ వచ్చిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి, పిల్లవాడి తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నామని ఫతేబాద్ ఏఎస్పీ సోమన్ బర్మా తెలిపారు. మరోవైపు ఈ చిన్ని కృష్ణయ్యను దత్తత తీసుకునేందుకు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ సిబ్బందిని ఇప్పటికే చాలా మంది సంప్రదిస్తున్నారట. -
ఇద్దరు మహిళలను రక్షించిన లేక్ పోలీసులు...
రాంగోపాల్పేట్ (హైదరాబాద్ సిటీ): వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం... ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన యువతి (23) ఎంబీఏ చదువుతోంది. తండ్రి వదిలి వేయడంతో తల్లితో కలిసి తాత ఇంట్లో ఉంటోంది. కాగా, కొద్ది రోజులుగా ఆమె నడుం నొప్పితో బాధపడుతోంది. బోన్ క్యాన్సర్ కావచ్చనే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆ యువతి గురువారం ట్యాంక్బండ్కు వచ్చి హుస్సేన్ సాగర్లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు అడ్డుకున్నారు. మరో ఘటనలో...రాజేంద్రనగర్ అత్తాపూర్కు చెందిన సీహెచ్ శివరాణి(50) ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్. ఈమె భర్త జీహెచ్ఎంసీలో పనిచేస్తూ 15 ఏళ్ల క్రితం మరణించగా పెద్ద కుమారుడికి అతని ఉద్యోగం ఇచ్చారు. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడు తనను పట్టించుకోకపోవడంతో శివరాణి చిన్న కుమారుడి దగ్గర ఉంటోంది. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు చిన్నకోడలితో ఆమె చిన్నచిన్న విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురవుతున్న శివరాణి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
బాలకార్మికురాలిని రక్షించిన అధికారులు
-
గోతిలోగున్న ఏనుగు
-
నిన్నకిడ్నాప్కి గురైన చిన్నారి ఆచూకి లభ్యం
-
బోరుబావిలో పడ్డ 65ఏళ్ల వృద్దుడు
-
బాలుడు షోయబ్ను రక్షించిన పోలీసులు
-
హమ్మయ్య.. గండం గడిచింది!
చోడవరం(కొండపి), న్యూస్లైన్: జిల్లాలో ముంచుకొచ్చిన వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని శుక్రవారం అధికార యంత్రాంగం శ్రమించి రక్షించింది. టంగుటూరు మండల పరిధిలో చోడవరం గ్రామానికి కిలోమీటర్ దూరాన ఉన్న ముసి నది ఒడ్డున పొగాకు పంట వేశారు. రాజమండ్రికి చెందిన కూలీలు పొలాల వద్దే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతంలో అప్పటికే నీరు చేరుకుంది. రైతులు మాత్రం ప్రతి రోజూ పొలం పనులు చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తున్నారు. గురువారం యథావిధిగా పొలాలకు వెళ్లగానే వరద ముంచుకొచ్చింది. ఉధృతి ఎక్కువవడంతో రాత్రికి కూడా అక్కడ నుంచి బయట పడలేకపోయారు. ఇలా కూలీలతో సహా మొత్తం 350 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోయారు. ఉదయానికి పొలాలన్నీ మునిగి నీటి మట్టం మరింత పెరిగింది. దీంతో సెల్ఫోన్ల సాయంతో అధికారులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు పరిస్థితి సమీక్షించి ఉన్నతాధికారులకు వివరించారు. వెంటనే ఆర్డీఓ బాపిరెడ్డి, సీఐ అశోక్వర్థన్, ఎస్సై సోమశేఖర్లు రంగంలోకి దిగారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముసి అవతలి ఒడ్డున ఉన్న బాధితులను బోట్ సాయంతో రక్షించారు. వరదలో చిక్కుకున్నవారిని కాపాడాల్సిందిగా కలెక్టర్ను కోరినట్లు వైఎస్ఆర్సీసీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ చెప్పారు.