Revenue Act
-
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
సాక్షి, అమరావతి: కౌలు చట్టం–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం తలపెట్టేందుకు సిద్ధమైంది. కౌలుదారుడికి సెంటు భూమి ఉన్నా కౌలు రైతుగా గుర్తించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కౌలు చట్టం–2024 పేరిట ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. తద్వారా భూ యజమాని అనుమతి లేకుండానే కౌలు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ ముసుగులో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నచ్చినోళ్లకు పెట్టుబడి సాయం, రుణాలు, నష్టపరిహారం, సబ్సిడీల లబ్ధి చేకూర్చేలా తెరవెనుక ఏర్పాట్లు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కొత్త చట్టం విభేదాలకు ఆజ్యం పోస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలిసిన వ్యక్తులకే తమ భూములను కౌలుకు ఇస్తుంటామని.. తమ అనుమతితో పనిలేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరికి భూములను కౌలుకు ఇచ్చినట్టుగా రాసేసుకుని.. కౌలు కార్డులు జారీచేస్తే వాస్తవ హక్కుదారులమైన తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, తమ భూములపై ప్రభుత్వం తనకు నచ్చినోళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వాస్తవ రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కౌలుదారులు సైతం ఈ నిబంధనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చేస్తున్న సాగుదారులకు కాకుండా కొత్త నిబంధన పేరిట వేరే వ్యక్తులకు కౌలు కార్డులు జారీచేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.కొత్త నిబంధనలతో అసలుకే మోసంపట్టాదార్ పాస్ బుక్ చట్టం–1971 లేదా ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం భూమిపై హక్కు కలిగి ఉండి, వెబ్ల్యాండ్ వంటి భూ రిజిస్టర్లలో నమోదైన కౌలు రైతులు కొత్త చట్టం ప్రకారం కౌలు కార్డులు పొందేందుకు అనర్హులు. అంటే సెంటు భూమి ఉన్నా సరే కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే విషయాన్ని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన యాప్లో నమోదు చేసుకున్న వారు మాత్రమే కౌలు కార్డులు పొందేందుకు అర్హులు. అంటే.. భూమిని వాస్తవ కౌలుదారు కాకుండా వేరే వ్యక్తులు కౌలుకు చేస్తున్నట్టుగా యాప్లో నమోదు చేసుకుంటే వారిని కౌలు రైతుగా గుర్తించే ప్రమాదం ఉంది.యాప్పై అవగాహన లేని కౌలు రైతులు, అమాయకులైన కౌలు రైతులకు ఇలాంటి నిబంధనల వల్ల కీడు జరుగుతుందని రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం పేరిట తెస్తున్న నిబంధనల్లో మరో సమస్య కూడా ఉంది. అసలు రైతు కుటుంబ సభ్యులు, వారి సమీప బంధువులు భూమిని కౌలుకు చేస్తుంటే.. అలాంటి వారు కూడా కౌలు కార్డు పొందేందుకు అనర్హులనే నిబంధన విధించారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుగా అనర్హులవుతారు. కొత్త కౌలు చట్టాన్ని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.ముసాయిదా ఏం చెబుతోందంటే..కౌలు చట్టం–2024 ప్రకారం భూ యజమానుల అనుమతితో పనిలేకుండా చుట్టుపక్కల రైతుల అభిప్రాయాల మేరకు గ్రామసభల్లో కౌలుదారులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. యజమాని మూడు రోజుల్లో సమ్మతి ఇవ్వకుంటే డీమ్డ్ సమ్మితి (భూ యజమాని సమ్మతి తెలిపినట్టు)గా పరిగణించి కౌలు కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తాను ఎవరికీ తన భూమిని కౌలుకు ఇవ్వలేదని భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోరు. చుట్టుపక్కల రైతుల అభిప్రాయాలే ప్రామాణికంగా ఇచ్చే కౌలు కార్డుల ప్రామాణికంగానే పంట రుణాలిస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంట రుణాలు ఇవ్వకూడదని, భూ యజమానులు గత సీజన్లో తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా, అదే సీజన్లో కొత్తగా తీసుకున్న పంట రుణాలను లాంగ్ టర్మ్ రుణాలుగా పరిగణించేలా బ్యాంకులను ఆదేశించేలా నిబంధన పెడుతున్నారు.కౌలు కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలివీఅధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలుదారులు. సెంటు భూమి కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న వారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. కౌలు కార్డులు పొందిన వారు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం పొందవచ్చు. సబ్సిడీపై. విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా సాగు చేసే పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.1.60 లక్షల వరకు పంట రుణాలు పొందవచ్చు. సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే నష్టపరిహారంతో పాటు పంటల బీమా పరిహారం పొందవచ్చు.కొత్త వివాదాలకు ఆజ్యంపరిసర రైతులు మౌఖికంగా ధ్రువీకరిస్తే కౌలు కార్డులు ఇవ్వొచ్చన్న నిబంధన గ్రామాల్లో భూ యజమానులు, కౌలు రైతుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న వాదన వినిపిస్తోంది. అన్నదాత సుఖీభవతో పాటు ఇతర సంక్షేమ ఫలాల కోసం ఎలాంటి భూమి లేనివారు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిబంధన సాకుతో స్థానిక అధికారులను ప్రలోభపెట్టి అడ్డగోలుగా కార్డులు పొందడం, వాటిద్వారా సంక్షేమ ఫలాలు స్వాహా చేయడం వంటి అవకతవకలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.కార్డులు జారీచేసే వరకు రుణాలివ్వకూడదన్న నిబంధనతో సకాలంలో పంట రుణాలు పొందే అవకాశం సాగుదారులైన భూ యజమానులకు లేకుండా పోతుందంటున్నారు. డబుల్ ఫైనాన్స్ ఇవ్వలేమని, గతంలో తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న తర్వాత వాటిని లాంగ్ టర్మ్ రుణాలుగా మార్చడానికి నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. కౌలుదారుడు రుణం తీసుకుని చెల్లించలేని పక్షంలో, వ్యక్తిగత అవసరాల కోసం భూమిని తనఖా లేదా, అమ్ముకునేటప్పుడు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను భూ యజమానులు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
సమగ్ర భూచట్టం..రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు!
రాష్ట్రంలో భూముల వివాదాలు, సమస్యలను పరిష్కరించడం కోసం సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెచ్చే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 భూ చట్టాలన్నింటినీ కలిపి.. రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం)గా రూపొందించాలని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఇది అమల్లోకి వస్తేనే రాష్ట్రంలోని భూముల పరిపాలన, హక్కుల కల్పన, వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. దాన్ని కేవలం ఒక్క భూహక్కుల రికార్డుల చట్టం–1971ని సవరించి తెచ్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. దీనితోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని భూచట్టాలను కలిపి కొత్తగా సమగ్ర చట్టాన్ని తెస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ‘కోడ్’ ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2016లోనే రెవెన్యూ కోడ్ను అమల్లోకి తెచ్చారు. అది దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా దాదాపు ఒకే తరహా చట్టంతో రెవెన్యూ పాలన చేస్తున్నాయని భూచట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలోనూ కొత్త సమగ్ర చట్టం కోసం ఇటీవలే మంత్రులు, సీనియర్ అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశమంతా రెవెన్యూ కోడ్ వైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలోనూ ఆ దిశలో ప్రయత్నాలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్ఓఆర్, కౌలుచట్టం, ఇనామ్ల రద్దు, అసైన్డ్ భూముల చట్టం వంటివన్నీ రద్దు చేసి ఒకే చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక కూడా అందించారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే.. వాస్తవానికి తెలంగాణలో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకునే ప్రయత్నం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే మొదలైంది. నాటికి ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను నల్సార్ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో మేరకు రెవెన్యూ చట్టాలను పునఃసమీక్షించిన నల్సార్ వర్సిటీ 30 పేజీలతో కూడిన సమగ్ర భూచట్టాల ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఈ ముసాయిదా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. భూ వి వాదాలు తగ్గేలా, పాలన సులభతరం చేసేలా, గందరగోళానికి తావులేకుండా ఉండే సమగ్ర భూచట్టాన్నిరూపొందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హక్కుల చిక్కులు తీర్చేదిశగా.. భూచట్టాల నిపుణులు చేస్తున్న సూచనలివీ.. భూసమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు సర్వేకు ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాలా తక్కువ సమయంలోనే సర్వే చేయవచ్చు. ఇందుకోసం సర్వే, హద్దుల చట్టం–1923 స్థానంలో కొత్త చట్టం తేవాలి. ఈ సర్వే పూర్తయ్యేలోపు భూలావాదేవీ జరిగిన ప్రతిసారీ సంబంధిత భూమిలో సర్వే జరగాలి. సర్వేయర్ల కొరతను నివారించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి.. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. – భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తేవాలి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం చేయాలి. – భూసంబంధిత అంశాల విషయంలో ఒకే చట్టం ఉండి.. ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. అమలు చేసే వారికీ సులభంగా ఉంటుంది. అన్ని భూచట్టాలను కలిపి రెవెన్యూ కోడ్గా రూపొందించాలి. – ధరణి పోర్టల్లో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రికార్డులన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించాలి. ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలు గుర్తించి.. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి వాటిని పరిష్కరించాలి. – భూవివాదాల పరిష్కార చట్టాన్ని తెచ్చి జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ జడ్జి లేదా రెవెన్యూ నిపుణుల నేతృత్వంలో అవి పనిచేయాలి. – కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కచి్చతంగా చట్టాల్లో మార్పు రావాలి. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి. – పేదలకు భూసమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవడంలో సాయం అందించేందుకు పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి. భూవిధానం, వినియోగం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలి. ఇందుకోసం భూపరిపాలనను మెరుగుపర్చాలి. భూఅకాడమీ ఏర్పాటు చేసి భూపరిపాలనలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు జరపాలి. – ఈ అన్ని చర్యలు తీసుకునేందుకు వీలుగా భూకమిషన్ను ఏర్పాటు చేయాలి. రైతులు, సామాన్య ప్రజల డిమాండ్లు ఇవీ.. – భూములను రీసర్వే చేయాలి. భూరికార్డులను సవరించి అందరికీ అందుబాటులో ఉంచాలి. – పేదలకు భూములను పంపిణీ చేయాలి. కౌలు దారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. – సాదాబైనామా భూములను క్రమబదీ్ధకరించాలి. పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి. – రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న వారికి పట్టాలివ్వాలి. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. – అన్యాక్రాంతమైన గిరిజన, అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలి. మహిళలకు భూహక్కులు కలి్పంచాలి. పారాలీగల్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ధరణితోపాటు ఇతర సమస్యలూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేవలం ధరణి పోర్టల్ను సరిచేస్తే భూవివాదాలన్నీ సమసిపోతాయనే అభిప్రాయం కనిపిస్తోంది. కానీ ధరణి మాత్రమే సర్వరోగ నివారిణి కాదు. దాని చుట్టూనే చర్చ జరగడం సమంజసం కాదు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలోనే ‘ల్యాండ్ క్యారవాన్’ పేరుతో రాష్ట్రంలో దాదాపు మూడువేల కిలోమీటర్లు ప్రయాణించి పదివేల మందికిపైగా రైతులను, భూయజమానులను కలిసి నివేదిక రూపొందించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టం (రెవెన్యూ కోడ్)గా రూపొందించడం, భూములను రీసర్వే చేయడం, జిల్లాకో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడం ఈ నివేదికలో ప్రధానమైనవి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు -
పెరిగిపోతున్న భూసమస్యలు.. కొత్త రెవెన్యూ చట్టంలో లోపాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజి్రస్టేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012–13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబదీ్ధకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయని తెలుస్తోంది. ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోని తీసుకోవాలి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు -
Telangana: కొత్త రెవెన్యూ చట్టం.. రెండేళ్లయినా బాలారిష్టాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012– 13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దర ఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లా లోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయని తెలుస్తోంది. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. -
సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి. 12 రోజుల్లోనే 7 లక్షల మంది కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. 1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే.. సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు. భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త చట్టంలో అధికారాలేవీ..? అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.) సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
మైనార్టీల భూములపైనా లింగమనేని పంజా
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం. ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్ఎస్ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్ : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, ఆ ట్రిబ్యునళ్లకు క్వాసీ జ్యుడీషియల్ అధికారాలివ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రెవెన్యూ కోర్టులకు వచ్చే కేసులు పెరగడం, ధరణి పోర్టల్ అమలు నేపథ్యంలో సమస్యలు వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లను శాశ్వత ప్రాతిపదికన ఉంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటికే దాదాపు 20 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. వాటితోపాటు చిన్నచిన్న ఫిర్యాదులు, ధరణి అమలు ద్వారా వస్తున్న సమస్యలు, సంధికాలంలో వచ్చిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో చెప్పినట్లు ఈ ట్రిబ్యునళ్లకు నిర్ణీత కాలపరిమితి విధించకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలన్న రెవెన్యూ ఉన్నతాధికారుల సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి భూ సమగ్ర సర్వేనే మార్గమని, వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర భూ సర్వే ద్వారా గరిష్ట స్థాయిలో భూ వివాదాలు పరిష్కారం అయ్యాక మాత్రమే ట్రిబ్యునళ్లపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
సన్నాలపై తర్జనభర్జన..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యంపై క్వింటాల్కు రూ. 150 చొప్పున బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యమయ్యేలా లేదని రాష్ట్ర మంత్రివర్గం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకాంశాలపై చర్చించిన కేబినెట్ అందులో భాగంగా సన్నాలకు బోనస్ చెల్లింపు సాధ్యాసాధ్యా లను పరిశీలించింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కుదుర్చుకున్న ఎంవో యూలో ఉన్న నిబంధనలు బోనస్ చెల్లింపునకు అడ్డంకిగా ఉన్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరకన్నా రాష్ట్రాలు ఒక్క రూపాయి అదనంగా చెల్లించినా రాష్ట్రాలు సేకరించిన ధాన్యాన్ని సెంట్రల్ పూల్ కింద స్వీకరించబోమని కేంద్రం ఎంవోయూలో పొందుపరిచిన నిబం ధనలు ప్రతికూలంగా మారాయని ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు పేర్కొన్నట్లు తెలియవచ్చింది. ఆర్డినెన్స్తో సాదాబైనామాల పరిష్కారం... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరపడం, మెరూన్ రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది. రద్దైన పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు సాదాబైనామాలకు క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మంతివర్గం చర్చించింది. సాదాబైనామాలకు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో పాత ఆర్ఓఆర్ చట్టంలోని నిబంధనలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త చట్టం కింద సాదా బైనామాలను వన్టైమ్ సెటిల్మెంట్ కింద పరిష్కరించేందుకు ఆర్డినెన్స్ తేవాలనే ప్రతిపాదనను కేబినెట్ చర్చించి ఆమోదించింది. కేబినెట్ ప్రతిపాదించిన ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అసెంబ్లీ ఆరో విడత సమావేశాలు ప్రొరోగ్ అయితేనే ఆర్డినెన్స్ ఆమోదం పొందే అవకాశం ఉండటంతో వెంటనే ప్రొరోగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త రెవెన్యూ చట్టం కింద సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్, ఆస్తి పన్ను బకాయిల మాఫీ అంశాన్ని కూడా కేబినెట్ చర్చించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించవద్దని మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించలేదు. -
సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవచ్చని తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అక్టోబరు 29 నుంచి మంగళవారం వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టు దృష్టి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది. -
తెలంగాణలో రెవెన్యూ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది. విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్)ని జారీ చేయలేదు. సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్–5 (బీ) మేరకు అప్పీల్ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్పై రూల్స్ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు. దరఖాస్తులకు మోక్షం ఎలా? కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్డివిజన్ అర్జీలు పెం డింగ్లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 38 (ఈ), లావణి, ఓఆర్సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నూతన రెవెన్యూ చట్టంలో ఎన్నెన్నో చిక్కుముడులు
భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల చట్టం 2020 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సమ్మతితో తెలంగాణ రాజపత్రం ద్వారా 19.9.2020 నుండి అమలులోకి వచ్చింది. సాధారణ పరిభాషలో అందరూ దీనిని నూతన రెవెన్యూ చట్టంగా పిలుస్తున్నారు. సెక్షన్ 15లోని నూతన చట్టం ద్వారా గత భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల చట్టం 1971 పూర్తిగా రద్దుపరచబడింది. గత చట్టాన్ని, ప్రస్తుత నూతన రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా పరిశీలిస్తే గత చట్టం లోని ప్రాముఖ్యత కలిగిన అంశాలైన సాదా చైనా మాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమ బద్ధీకరణ, తప్పులను సవరించడం, సవరణలను చేయడం, వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గుర్తిం చడం ద్వారా పాస్బుక్ ఇవ్వడం, రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారాన్ని చూపడం నూతన రెవెన్యూ చట్టంలో సంపూర్తిగా తొలగించారు. నూతన రెవెన్యూ చట్టంలో ఈ క్రింది అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 1. ‘ధరణి’ పోర్టల్ ద్వారా భూమి యజమా నుల హక్కులను గుర్తించి పాస్బుక్–టైటిల్ డీడ్ జారీ చేయటం. 2. తహసీల్దార్కే రిజిస్ట్రార్ అధికా రాలను కల్పించి రిజిస్టర్ ఒప్పందం పూర్తయిన వెంటనే పట్టాదారు పాస్ జారీ చేయడం. 3. రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలు పూర్తిగా తొలగించారు. 4. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం, అట్టి తీర్పు అంతిమం. నూతన రెవెన్యూ చట్టంలో అతి ప్రాధాన్యత కలిగిన న్యాయపరమైన అంశం ‘ధరణి’ పోర్టల్. నూతన చట్టంలో సెక్షన్ 3 ద్వారా, సెక్షన్ 2(3) ద్వారా ప్రభుత్వం ‘ధరణి’ డిజిటల్ ప్లాట్ఫామ్గా గుర్తించి ప్రభుత్వం దాన్ని నిర్వ హిస్తుంది. కానీ హడావుడిగా తెచ్చిన నూతన చట్టంలో చాలా సమస్యలకు పరిష్కారం లభిం చదు. ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ విజయదశమి నాడు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. లోపాలు లేకుండా అన్ని సమస్యలకు సమాధానం చెబుతూ ముఖ్యంగా భూమి సంబంధించిన చట్టాల్ని తయా రుచేయడం అంత సులభం కాదు. ఈ చట్టంలో సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం సదు ద్దేశం అయినా నైపుణ్యం లేని శక్తుల ద్వారా సేకరిం చిన పలు అంశాలు క్రోడీకరించడంవల్ల జరిగే తప్పిదాలకు, లోపాలకు సామాన్య భూ యజమా నులు ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులు అవస్థలు అనుభవిస్తారు. ప్రతి చిన్న పొరపాటుకు సవరణకు సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్, 1905లో సెక్షన్ 9 ప్రకారం ఎలాంటి సివిల్ తగాదాను పరిష్కరించే అవకాశం సివిల్ కోర్టుకు ఉంటుంది. కానీ, కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్లోని సెక్షన్ 152 నుండి అధికారాన్ని తహసీల్దార్ ఇవ్వకపోవడంవలన ప్రతి చిన్న పొరపాటుకు, తప్పుకు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అది పేదలైన రైతులపై ఆర్థిక భారం, సమయ భారం పడుతుంది. ఒక రైతుకు గ్రామంలో 16వ సర్వే నెంబర్లో ఎ2.30 గుంటల భూమి ఉంది. పొరపాటున అట్టి విస్తీర్ణాన్ని ఎ2.03 గుంటలు అని ధరణి పోర్టల్లో నమోదు చేస్తే, ఆ రైతు రికార్డులో తక్కువగా నమోదు చేయబడిన 27 గుంటల భూమి కోసం సివిల్ దావా వేయాలి. అట్టి పొరపాటు సాంకేతిక లోపంవల్ల జరిగిందని వివరిస్తూ రైతు తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందుంచినప్పుడే కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల వరకు తుది తీర్పు రావడం కష్టం. అట్టి పరిస్థితులలో పేద రైతులకు ప్రభుత్వం అందించే సహాయం కోల్పోవలసి వస్తుంది. ఒక చిన్న సమస్య అతి చిక్కుముడి సమస్యగా మారుతుంది. నూతన చట్టంలోని సెక్షన్ 5ను ఒక సారి పరిశీలిస్తే ఈ సెక్షన్ కౌలు ఒప్పందాల్ని గుర్తిం చడం లేదు. కౌలు ఒప్పందాన్ని రిజిస్టర్ చేసే అవకాశం ఉందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. నూతన చట్టం వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గానీ కౌలుపత్రం ద్వారా సాగు చేస్తున్న వారిని గుర్తించడం లేదు. 1.4.1999 నుండి వీలునామా ద్వారా అనుభవిస్తే అట్టి పత్రాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. నూతన చట్టంలోని సెక్షన్ 6 ద్వారా తహ సీల్దారుకు కుటుంబసభ్యుల మధ్య భాగ పంపిణీకి వెసులుబాటు ఉంది. ఎప్పుడైతే కుటుంబ పెద్ద చనిపోతాడో అతని వారసులు భాగ పరిష్కారానికి తహసీల్దార్ ముందు నమోదు చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చు. ఒక కుటుంబ యజ మానికి వేర్వేరు మండలాల లోని భూములు ఉండే ప్రతి మండలం ఆ భూముల భాగ పరిష్కారం ప్రతి మండలంలో చేసుకోవాలి అన్నది ప్రశ్న. మరొక విషయం ఏమిటంటే ఆ యజమానికున్న ఇతర స్థిర ఆస్తులు ఉదాహరణకు ఇల్లు, చర ఆస్తుల భాగ పరిష్కారం ఎక్కడ నమోదు చేయించుకోవాలి అనేది ప్రధాన సమస్య. సమయాభావంవల్ల ఏ ఒక్క భాగస్వామి సహకరించకపోతే భాగ పరిష్కా రమయ్యే అవకాశం ఉండదు. అన్ని ఆస్తుల భాగ పంపిణీకి ఏదైనా ఒక రిజిస్ట్రార్ దగ్గరే నమోదు చేసే అధికారం కల్పించి పని భారం తగ్గించడం సమంజసం. ఈ చట్టం కేవలం వ్యవసాయ భూమికి సంబంధించే కాబట్టి మిగతా ఆస్తుల విషయంలో భాగ పంపిణీకి అవకాశం లేదు. ఒకే కుటుంబ సభ్యులను నాలుగు కార్యాలయాల చుట్టూ తిరగమనడం సమంజసమేనా? మరో ప్రముఖ సమస్య ఏమంటే ఇదివరకే భాగ పంపిణీ అయిన భూములను సర్దుబాటు చేసుకొనే అవకాశం లేకపోవడం. భూయజమాని చనిపోయిన తర్వాత ఇదివరలో ప్రతి సర్వే నెంబర్లో వారసులకు హక్కు కల్పింంచి పాస్బుక్ ఇచ్చారు. కానీ వాస్తవ సాగు విషయంలోకి వస్తే నమోదైన రికార్డుకు భిన్నంగా ఉంది. ఉదాహరణకు ఒక యజమానికి రెండు వేర్వేరు సర్వే నెంబర్లలో భూమి ఉంటే అతని వారసులు ఇద్దరు అనుకొంటే వారి పేర్లను రెండు సర్వే నెంబర్లలో సరిసమానంగా వాటా చూపించారు. వాస్తవానికి ఇద్దరు వారసులు చెరి ఒక సర్వే నంబర్లో సాగు చేసుకున్నారు. ఇట్టి సర్వే నెంబర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదు. పైగా చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక వారసుడు తన స్వాధీనంలో ఉన్న భూమి అమ్మాలంటే ఇతర వారసుడు తప్పక సహకరిం చాలి. సహకరించకపోతే అమ్మకం పూర్తి కాదు. అందుకని వారసులలో ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వారికే ఆ సర్వే నంబర్ మీద హక్కు కల్పించి పాస్ బుక్ ఇవ్వాలి లేదా ఇద్దరి దగ్గరనుంచి అఫిడవిట్ తీసుకుని ఆ తహసిల్దారు ముందు హాజరై పాస్బుక్ తీసుకునే ఏర్పాటు చేయాలి. లేకుంటే ఇద్దరు వారసుల మధ్య తగాదా మొదలై సివిల్ తగాదాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిక్కు ముడికి జవాబు ఇవ్వకపోవడం ప్రధాన లోపం. నూతన రెవెన్యూ చట్టంలోని 16వ అధికరణం ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దాదాపు 16 వేల కేసులను బద లాయిస్తారు. ప్రభుత్వం 16 ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక సంవత్సరంలో తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో 16మంది విశ్రాంత న్యాయ మూర్తులు దొరికే అవకాశం లేదు. ఒక ట్రిబ్యునల్ ఒక సంవత్సరంలో వేయికేసులు పరిష్కరించడం దాదాపు అసాధ్యం. పైన ఉదహరించిన సమస్యల పరిష్కారానికి చిన్నరైతులు మధ్యదళారులను ఆశ్రయిస్తారు. అప్పుడు మధ్య దళారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించే యంత్రాంగం కొరవడటంతో ఈ చట్టం కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రైతు బంధు వంటి ప్రభుత్వ పథ కాలను సకాలంలో అందుకోకపోవడం వలన రైతులు కష్టాలపాలు కావచ్చు. నూతన రెవెన్యూ చట్టంలో తహసిల్దారుకు కానీ, కలెక్టర్కు కానీ పొరపాటును సవరించడానికి అధికారం లేకపోయినప్పటికీ, పైగా చాలా సమ స్యలలకు తక్షణ పరిష్కారాలు లేనప్పటికీ, కావా లని తప్పు చేసిన తహసిల్దారును తొలగించే అధి కారం కలెక్టరుకు ఉండటం, క్రిమినల్ చర్యలు తీసు కునే అవకాశం ఉండటం వల్ల తహసిల్దారు జాగ్ర త్తగా పనిచేసి రైతులకు, భూ యజమానులకు మేలు జరుగుతుందనేది నిర్వివాదాంశం. కూతురు రవీందర్ రెడ్డి వ్యాసకర్త విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది మొబైల్ : 94406 80789 -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే మరో నెల రోజులపాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మీ–సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బుధవారం రాత్రి నాటికి మొత్తం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల్లో 6,67,693, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్లలో 2,91,066 దరఖాస్తులొచ్చాయి. -
12లోగా ఆస్తుల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 12లోగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఏ ఒక్క ఆస్తిని వదిలిపెట్టవద్దని, ఆస్తుల నమోదు 100 శాతం పూర్తి అయినట్లు సంబంధిత వార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవీకరించిన వ్యవసాయేతర ఆస్తుల ముసాయిదా జాబితాను వార్డు కమిటీ ముందు వుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు/ సలహాలు స్వీకరించా లని ప్రభుత్వం నిర్దేశించింది. అభ్యంతరాల ను పరిష్కరించిన అనంతరం తుది జాబితా ను ప్రకటించాలని ఆదేశించింది. ఆస్తుల న మోదుకు సంబంధించిన వివరాలను వార్డు అధికారుల నుంచి పురపాలికలు సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఇంకా పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డులకు ఎక్కని ఆస్తుల నమోదును గడువులోగా పూర్తి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న మ్యుటేషన్, వారసత్వ బదిలీ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. అక్రమాలకు పాల్పడితే వేటే... ఆస్తుల నమోదు ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 95 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్లను పురపాలక డైరెక్టర్ హెచ్చరించారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే మున్సిపల్ ఉద్యోగు లు, అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ కల్పిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల కు మెరూన్రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ అత్యం త కీలకంగా మారింది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ను దసరా రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణిలో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా పురపాలికలు/ గ్రామ పంచాయతీల్లోని ఆస్తి పన్నుల రికార్డుల్లో సైతం కొత్త యజమాని పేరును నమోదు చేసి తక్షణ మ్యుటేషన్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఇందుకోసం ప్రతి ఆస్తికి సంబంధించిన యజమానికి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా యజమాని పేరు, కులం, వయసు, లింగం, ఫోన్ నంబర్, గుర్తింపు రుజువు, ఫొటో, ఆస్తి వివరాలు, వినియోగం, విస్తీర్ణం, సర్వే నంబర్, ఆస్తి సంక్రమణ విధానం, విద్యుత్, కులాయి కనెక్షన్ నంబర్లు, కుటుంబీకుల వివరాలు, చిరునామా తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి యజమానులందరూ ఇకపై పన్ను చెల్లింపు పరిధిలోకి రానున్నారు. -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు!
శంషాబాద్కు చెందిన దయానంద్రెడ్డికి మండల పరిధిలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వాటికి ఎల్ఆర్ఎస్ చేయించేందుకు సమీపంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో సంప్రదించగా ఒక్కో దరఖాస్తుకు రూ. 2 వేలు అవుతుందని చెప్పడంతో ఆ మేరకు రూ. 8 వేలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గంట తర్వాత నాలుగు రిసిప్ట్లను దయానంద్రెడ్డి చేతిలో పెట్టాడు. తీరా రిసిప్ట్లను పరిశీలిస్తే నాలుగింటికి కలిపి రూ. 4,180 మాత్రమే దరఖాస్తు ఫీజు అయినట్లుంది. మిగతా మొత్తంపై ఆరా తీయగా దరఖాస్తు చేసినందుకు సర్వీసు చార్జీ తీసుకున్నట్లు కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో నోట మాటరాలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే రూ. వెయ్యి వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడాన్ని కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ దరఖాస్తుదారుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల ప్రకారం ఒక ప్లాట్ కోసం చేసుకొనే దరఖాస్తుపై రూ.వెయ్యితోపాటు అదనంగా రూ. 45 జీఎస్టీ రూపంలో చెల్లించాలి. అదేవిధంగా లేఅవుట్ దరఖాస్తుకు రూ. 10 వేలతోపాటు జీఎస్టీ చెల్లించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్లో లేఅవుట్ దరఖాస్తుల కంటే వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. సర్కారు ఆదాయాన్ని తలదన్నేలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ విధానం, దరఖాస్తు తీరుపై సరైన ఆవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనే ప్రొత్సహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియకు తెరలేచింది. ఎక్కడికక్కడ దరఖాస్తు కేంద్రాలు తెరవడంతో అర్జీలు పెట్టుకొనే వారంతా ఇలాంటి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ కేంద్రాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు మాత్రం చేతిచమురు వదిలిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై డబుల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ. 1,545 నుంచి రూ. 2,045 వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కింద వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయ్యే ఫీజుల కంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసే మధ్యవర్తులే అధికంగా సంపాదిస్తుండడం గమనార్హం. అందరికీ అందుబాటులో... ఎల్ఆర్ఎస్ పథకం దరఖాస్తు విధానం అత్యంత సులభంగా ఉంది. కానీ ఈ దరఖాస్తు చేసుకొనే తీరుపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్ టాప్, ట్యాబ్లలో దేని ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారం నింపాక దరఖాస్తుదారు తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదటి పేజీని, లేఅవుట్ నమూనాను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లను ఎంట్రీ చేసి నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ఖాతా లేదా ఏటీఎం కార్డు, టీవ్యాలెట్ యాప్ల ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రసీదు వస్తుంది. -
‘పరిష్కారాల’ తర్వాతే ధరణి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలకు సంబంధించిన భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, విధానపరమైన పరిష్కా రాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యల్లేకుండా చేయాలని, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ‘గుణాత్మక మార్పు, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినప్పుడు గరీబులకే అత్యధిక ప్రాధా న్యతనివ్వాలి. ధరణి వెబ్ పోర్టల్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవ సాయ భూములకు ఆకుపచ్చ, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్పుస్తకాలను అందజేయాలి. ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేయాలి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడి ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఒక్క నిరుపేదకూ బాధ కలగవద్దు.. దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలుపరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని అన్నారు. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం స్పష్టం చేశారు. గూండాగిరి తగ్గింది... ‘తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూతగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గూండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగాజమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసెలు నేడు పక్కా ఇళ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మనచేతుల్లో పెట్టారు. చారిత్రక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించవలసిన బాధ్యత మనపై ఉన్నది. నోటరీ, జీవో 58, 59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వనిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులవారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి·తఆన్లైన్లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్డేట్ చేయాలి’అని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. సీఎంపై ప్రజాప్రతినిధుల ప్రశంసలు సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారివారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాసస్థలాలు, ఇళ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతిసమస్యనూ అధికారులతో నోట్ చేయించారు. ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, తమ రాజకీయజీవితంలో హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాసస్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇంతవరకూ చూడలేదని సీనియర్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, నరగ, పట్టణ ప్రాంతాల ఎమ్మెల్యేలు, మేయర్లు పాల్గొన్నారు. -
వ్యవసాయేతర ఆస్తులకు..మెరూన్ పాస్బుక్
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్బుక్స్ జారీచేయను న్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు íసీఎం చెప్పారు. కొత్తగా అమల్లోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ న్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ... పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాదాబైనామాలకు చివరి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని , భవిష్యత్తులో ఇక సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు. పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ.. నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా, ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంíపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని సూచించారు. మ్యుటేషన్ తప్పనిసరి.. ఉచితం ఆస్తుల మ్యుటేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న, బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్లైన్లో ఎన్రోల్ (మ్యుటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఇంటి వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, పన్నులు వసూలు చేయాలి అని సీఎం ఆదేశించారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్టీఎల్, నాలా, యూఎల్సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి బదిలీ కావాలంటే కూడా... ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఆస్తుల మ్యుటేషన్కు, ఎల్ఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. భవిష్యత్లో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటరీ, జీ.వో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. -
స్లమ్స్లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆస్తులన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఆస్తి వివరాలు ఇక పక్కాగా ఆన్లైన్లో నమోదు కానున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయి ల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100% ఆన్లైన్ చేయాలని సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ హించారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిం చారు. ఇందు కోసం డీపీఓలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్కు శ్రీకారం చుడుతున్నా మని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్తో తనిఖీలు ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు సమీక్షలో సీఎం తెలిపారు. ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా హరితహారం అమలు, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
పల్లె స్పందించలే!
సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్ఆర్ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు! స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్ఆర్ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్ రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి. -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసిన తర్వాతే పటిష్ట పద్ధ తిలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలో చనతో ఉందని, వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూరికార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరా లను సమన్వయ పరుచుకోవడం, ధరణి వెబ్ సైట్ను అప్డేట్ చేయడం జరగాలి. రెవెన్యూ చట్టం అమలుపై నూతన మార్గదర్శకాలు వెలు వడాలి. దీంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని, భూముల మార్కెట్ విలువల సవరణ కసరత్తు పూర్తి చేయాలని, అదే విధంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిస్థాయిలో అందు బాటులోకి రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుందని సచి వాలయ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి పది రోజులు దాటుతున్నందున... మరో పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, అక్టోబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నాయి. సవరణ... ఆధునీకరణ ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూముల మార్కెట్ విలువలను సవరించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విలువల సవరణ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ వర్గాల నుంచి భూముల మార్కెట్విలువలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ప్రస్తుత విలువలు, సవరించాల్సిన విలువల విషయంలో పారదర్శకత లోపించిందనే కారణంతోనే మార్కెట్ విలువల సవరణ కసరత్తును ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్ వర్గాలు చెపుతున్నాయి. సరళీకరణ, హేతుబద్ధీకరణ కోణంలో మార్కెట్ విలువలను సవరించాలని, అవసరమైన చోట్ల తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలను సవరించి ఆరేళ్లు దాటుతున్నందున కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, హైవేల చుట్టుపక్కల ప్రాంతాలు, ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్సులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచే దిశలో కసరత్తు జరుగుతోంది. అల్పాదాయ ఆఫీసుల ఎత్తివేత దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ లావాదేవీలు జరిగి, స్వల్ప ఆదాయం వచ్చే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేయాలని, అదే విధంగా అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను రెండు లేదా మూడుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని 25వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేసి అర్బన్ ప్రాంతాల్లో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పనిలోపనిగా సబ్రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలోని ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనుండగా, ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను కూడా ఆధునీకరించాలని, వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో జరిగే డాక్యుమెంట్ల రూపకల్పనలో తప్పులు జరిగితే వారినే బాధ్యులను చేయాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వారి విద్యార్హత, అనుభవానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పని విభజన కోసం.. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు, ఇతర భవనాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న ఇతర కార్యకలాపాలను సబ్రిజిస్ట్రార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల సమన్వయం, వాటిని ధరణి వెబ్సైట్తో పాటు కొత్త సాఫ్ట్వేర్లో ఇమిడ్చే పనిలో ప్రభుత్వ వర్గాలున్నాయి. దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఇది ముగిసేలోపు ధరణి వెబ్సైట్ను కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంది. -
‘ఎల్ఆర్ఎస్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్ఆర్ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది. తగ్గనున్న భారం.. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం. శ్లాబులు 4 నుంచి 7కి పెంపు.. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
క్రమబద్ధీకరణలో ఊరట
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయానికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. తాజా మార్కెట్ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్ఆర్ఎస్ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఆరేళ్లుగా అదే మార్కెట్ విలువ.. మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్ చేస్తున్నారు. మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి... భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్ అనుమతులు లేకపోయినా /ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
‘ఇంటి’కి గ్రీన్సిగ్నల్
-
21 రోజుల్లోనే.. ‘ఇంటి’కి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ కొత్తగా తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ–పాస్)తో దళారుల పాత్ర లేని పూర్తి పారదర్శక పద్ధతి అందుబాటులోకి రానుందని పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని, ఏదైనా కారణంతో సకాలంలో అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో 22వ రోజున అనుమతి వచ్చినట్టుగానే అప్రూవల్ పత్రం వస్తుందని పేర్కొన్నారు. 75 గజాలలోపు స్థలం అయితే అసలు అనుమతులతో ప్రమేయమే లేదని, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం అందుబాటులో లేదని, కొన్ని విదేశీ నగరాల్లోనే ఇది అమలులో ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేలా ప్రభుత్వం పేర్కొంటున్న టీఎస్ బీ–పాస్ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ప్రత్యేకతలను వివరించారు. 21 రోజుల్లోనే అనుమతులు.. కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టం 95 శాతం మందికి ఉపయుక్తంగా ఉండనుందని మంత్రి చెప్పారు. నిర్మాణ వైశాల్యం 75 గజాల లోపు ఉంటే నిర్మాణ అనుమతులే అవసరం లేదని, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని చెప్పారు. 75 గజాల నుంచి 600 గజాలలోపు (500 చదరపు మీటర్ల లోపు) ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే (ఇన్ స్టాంట్) అనుమతులు జారీ చేస్తారని చెప్పారు. 600 గజాలకు పైన ఉన్న స్థలానికి సంబంధించి నిర్మాణ అనుమతులుగాని, లే–అవుట్ అనుమతులుగాని 21 రోజుల్లో జారీ అవుతాయన్నారు. సరైన దరఖాస్తులకు సంబంధించి 21 రోజుల్లో అనుమతి రాని పక్షంలో 22వ రోజు అనుమతి వచ్చినట్టుగానే భావించవచ్చని(డీమ్డ్ టూ అప్రూవల్), ఇందుకు సంబంధించి రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. 15 రోజుల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారులే స్వీయ ధ్రువీకరణ దాఖలు చేసే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ, ఇతరుల భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని పక్షంలో పది రోజుల్లోపే అధికారులు తిరస్కరిస్తారని, ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే సిబ్బంది వచ్చి నిర్మాణాలను కూల్చేస్తారని హెచ్చరించారు. ఇన్ స్టాంట్గా వచ్చే అనుమతులు పూర్తి షరతులకు లోబడే ఉంటాయని గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్.. ఈ చట్టం సరైన విధంగా అమలు జరిగేలా, లోటుపాట్లను గుర్తించేలా జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్లు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో అయితే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఆ పాత్ర పోషిస్తారన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ సంచాలకులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సెల్ ఉంటుందన్నారు. చట్టం అంటే భయం ఉండాలి.. అక్రమ నిర్మాణం అంటూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదని, ఒకవేళ అది అధికారుల తప్పువల్ల జరిగిందని తెలిస్తే తర్వాత చేసేదేమీ ఉండదని భట్టి పేర్కొన్నారు. అయితే దీన్ని కేటీఆర్ ఖండించారు. చట్టంపై భయం, గౌరవం లేకపోవటంతోనే ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని, ఇది ఆగిపోవాలంటే కూల్చడమే సరైందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక నోటరీలకు సంబంధించిన స్థలాలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలన్న సూచనపై సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వన్టైమ్ రిలీఫ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ పత్రం చెల్లుబాటు.. గతంలో కొన్ని చట్టాల్లో ఈ తరహాలో, నిర్ధారిత సమయంలోగా అనుమతులు రాని పక్షంలో ఆటోమేటిక్గా అనుమతులు వచ్చినట్టు భావించే విధానం అమలు చేశారని, అయితే అలాంటి పత్రాలపై సంబంధిత స్టాంప్స్ లేనందున చెల్లుబాటు కాలేదని, వాటికి విలువే లేకుండాపోయిందని కాంగ్రెస్ సభా పక్ష నేత భట్టి విక్రమార్క సందేహాన్ని వెలిబుచ్చారు. కొత్త చట్టం ప్రకారం.. ఇన్స్టాంట్ అనుమతి పత్రాలపై సంబంధిత అధికారుల సంతకం, రాజముద్ర ఉంటుందని, అది అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టతనిచ్చారు. అలాగే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు కూడా అవసరముంటే సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడతానని కేటీఆర్ అన్నారు. -
భూ నిర్ణయాలు వద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూ వివాదాలపై నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కొత్తగా భూమి హక్కులు, పట్టదారు పాసుపుస్తకాలు చట్టం–2020 మనుగడలోకి వస్తున్న తరుణంలో భూ వివాదాలు, ఇతరత్రా వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రాజధాని శివారు జిల్లాలోని ఓ అధికారి పాత తేదీతో ఉత్తర్వులు ఇవ్వడం..దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త చట్టంలో రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల పాత్రను పరిమితం చేయడంతో పాటు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో ఇప్పటివరకు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల విచారణ బాధ్యతలను త్వరలో ఏర్పాటు చేయబోయే ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునళ్లకు బదలాయించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులు, ఇతర భూ వివాదాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీసీఎల్ఏ స్పష్టం చేశారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. నాయబ్ తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధులు తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రముఖుల పర్యటనలను దగ్గరుండి చూసుకునే తహసీల్దార్లు ఇకపై కేవ లం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు, ప్రభుత్వ భూ ముల పరిరక్షణకే పరిమితం కానున్నారు. ఇక పై ప్రోటోకాల్ బాధ్యతలను నయాబ్ తహసీల్దార్లు(డిప్యూటీ తహసీల్దార్లు) చూసుకోనున్నారు. ఇదిలావుండగా, వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడే విధులను వీఆర్ఏలకు కట్టబెడతారు. అయితే ప్రస్తుతం ఉన్నట్లుగాకుండా ఒకరినే ఈ సేవలకు వాడుకొని మిగతావారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్లపై వారం రోజుల్లో స్పష్టత రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టిన సర్కారు కేవలం సాగు భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లే చేస్తారు. అయితే, ఎప్పటి నుంచి ఈ విధానం అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
భూస్వాములే లేరు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసలు ఇప్పుడు భూస్వాములే లేరని, మొత్తంగా పది ఎకరాల్లోపు ఉన్న రైతులే 98.38%గా ఉన్నారని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇరవై ఐదు ఎకరాలు పైబడిన రైతులు 6,679 మంది మాత్రమే ఉన్నారని, వీరి చేతుల్లో 2,24,733 ఎకరాల విస్తీర్ణమున్న భూములే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఎవరూ లేరన్నారు. రెండు, మూడు ఎకరాలున్న వారు భూస్వాములా అని ప్రశ్నిస్తూ... మూడెకరాల్లోపు భూములున్న వారిలో 98.7% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారన్నారు. గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీల్లోని గిరిజనుల భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ భూములు కేంద్రం పరిధిలో, 1/70 చట్టానికి అనుగుణంగా యథాతథంగా కొనసాగుతాయని, నమోదైన రైతులకు రైతుబంధు, బీమా, ఇతర సౌకర్యాలు ప్రభుత్వపరంగా యథావిధిగా కొనసాగిస్తా మన్నారు. ఇవి తప్ప మిగతా భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయన్నారు. సోమవారం శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, ఆర్డినెన్స్ జారీచేసి అరాచకంగా దెబ్బకొట్టిందన్నారు. ఏడాదిలో 10 నెలలు విద్యుత్ ఉత్పత్తి చేసే 440 మెగావాట్ల సీలేరు ప్రాజెక్ట్ను కూడా తరలించి కేంద్రం శాశ్వతనష్టం కలగజేయ డంపై తాము బంద్ను కూడా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆన్రికార్డ్గా తాను ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. వక్ఫ్, ఎండోమెంట్ భూముల పరిరక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టిన విధంగా క్రైస్తవ సంస్థల భూముల విషయంలో స్పందించడం సాధ్యం కాదన్నారు. క్రైస్తవ సంస్థల భూముల లెక్కలు లేవన్నారు. భూముల వివరాలు సమర్పించి, తమకు కూడా బోర్డు ఉండాలని క్రైస్తవ సంస్థల పెద్దలు నిర్ణయిస్తే ఆలోచిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో భూసర్వేను ఏడాది, ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని, ఇందుకోసం జిల్లాల వారీగా ఎక్కడిక్కడ ఏజెన్సీల సహాయం తీసుకుంటామన్నారు. అన్ని అత్యాధునిక హంగులు, సాంకేతికతతో ధరణి పోర్టల్ను త్వరలోనే రూపొందించేందుకు సీఎస్ సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు. పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్ను రూపొందించి పబ్లిక్ డొమెయిన్లో పెడతామని, ప్రపంచంలోని ఏమూల నుంచైనా వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చునని, అయితే దీనిలో మార్పలు చేయడం మాత్రం సాధ్యం కాదని చెప్పారు. వెబ్సైట్ అందుబాటులో వచ్చాక పాస్పుస్తకాలు కూడా అప్రస్తుతమైపోతాయని, వీటి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే అవకాశముందన్నారు. కౌలుదారులను పట్టించుకోమని, అది తమ పార్టీ పాలసీ అని చెప్పారు. రక్షిత కౌలుదారుల చట్టం తీసుకురావడం ఆనాడు సరైందే కాని ఇప్పుడు కాదన్నారు. బంజారాహిల్స్లో ఎవరైనా తమ ఇళ్లు అద్దెకు ఇచ్చాక, కిరాయిదారుల పేర్లను సొంతదారుల్లో ఎలా చేర్చలేమో ఇది కూడా అంతేనన్నారు. భూమి అనుభవదారుల కాలమ్ ఉండదని స్పష్టం చేశారు. రైతుల భూముల రక్షణ, వారి క్షేమం కోరి కొత్త చట్టం తెచ్చామని, వీఆర్ఓ వ్యవస్థ రద్దు నిర్ణయం కూడా వారి ప్రయోజనాల కోసమే తీసుకున్నామన్నారు. వ్యవసాయేతర భూములకు ‘మెరూన్’ కలర్లో పాసుపుస్తకాలు కొత్త రెవెన్యూచట్టంలో భాగంగా వ్యవసాయేతర భూములకు ‘మెరూన్’ కలర్ పాస్బుక్లు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూములను తేలిగ్గా గుర్తించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. భూమి శిస్తు వసూలు వంటివి లేకపోవడంతో, వీఆర్ఓల పాత్ర అప్రస్తుతంగా మారిందని, అయితే వీరిలో కొందరిని ఊరికి ఒకరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నామని, ఆ మేరకు అవసరం కూడా ఉందన్నారు. నీరడి, ఇతర పనుల కోసం నీటిపారుదల శాఖలో వీరి సేవలు ఉపయోగించుకునే వీలుందన్నారు. రిజిస్ట్రేషన్లో భాగంగా కౌలు, అనుభవదారుల కాలమ్ ఉండదని, దానిని అందులో పెట్టబోమని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నామన్నారు. ఈ చట్టంలో సబ్రిజిష్ట్రార్లకు కూడా తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఎక్కడికక్కడ భూముల ధరలు నిర్ణయించే అధికారం ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా రెవెన్యూశాఖ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి చెప్పారు. అవినీతిని కేవలం వీఆర్ఓలకు పరిమితం చేయడం సరికాదని, ఇటీవల అడిషనల్ కలెక్టర్, ఎమ్మార్వో, ఇతర అధికారుల అవినీతి ఉదంతాలు కూడా బయటపడ్డాయన్నారు. లాండ్ రికార్డ్స్ అప్డేషన్పై దృష్టిపెట్టాలని, నేటికి 10 నుంచి 12 లక్షల మంది రైతుల పాస్పుస్తకాలు రాలేదన్నారు. రెవెన్యూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని జీవన్రెడ్డి కోరగా... సీఎం కేసీఆర్ స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ లాగే ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. చర్చ అనంతరం చివరకు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు గతంలో కేటాయించిన భూములకు రక్షణ ఎలా అని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించారు. వీఆర్ఓల వంటి క్షేత్రస్థాయి మెకానిజంను మళ్లీ ఏర్పాటు చేస్తారా అన్న దానిపై స్పష్టతనివ్వాలన్నారు. ఎంఐఎం సభ్యులు అమీనుల్ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, డి.రాజేశ్వరరావు, టీచర్ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దనరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలకు వెసులుబాటు.. కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఎన్ఆర్ఐల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఎన్ఆర్ఐలకు ఆధార్కార్డులు లేని కారణంగా పాస్పోర్టో మరే ఇతర ఆధారంతోనో వారి భూము లను కాపాడేందుకు చర్యలు చేపడతామన్నారు. వారి భూములను రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకు అనుగుణంగా ఒక మెకానిజం తీసుకొస్తామన్నారు. కొత్త రెవెన్యూచట్టం చేశాక న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, అడ్డంకులను వందకు వంద శాతం ఎదుర్కొంటామన్నారు. ధరణి పోర్టల్లో మార్పులు చేసే అధికారం తహసీల్దార్లకు సైతం లేదని, బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫొటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే «ఇందులో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ కోర్టుల స్థానంలో ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్లు పని చేస్తాయని సీఎం వెల్లడించారు. శతాబ్దాల భూ వివాదాల పీడ విరగడయ్యేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. -
మనిషి జీవనశైలి దాని చుట్టే తిరిగింది
-
హైదరాబాద్ శివారులో భూముల ధరలు కోట్లకు చేరింది
-
రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి, కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశామని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని పేర్కొన్నారు. దీంతో పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సోమవారం ఆరో రోజు తెలంగాణ వర్షాకాల శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించారు. దీంతో మండలిలో కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి ఒక్కటే కాదు, మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని వెల్లడించారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్ను ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ధరణి ఒక్కటే కాదని.. మిగిలిన చట్టాలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, కార్మికుల ఇన్కమ్ట్యాక్స్ను రద్దు చేయాలని ప్రధానిని కోరామని చెప్పారు. కారుణ్య నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. అర్హులుంటే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)కు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 2 నుంచి ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, శనివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 70,193 దరఖాస్తులు వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంత అనూహ్యమైన స్పందన రావడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో 30,353, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 16,912, గ్రామపంచాయతీల పరిధిలో 22,928 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.7.12 కోట్ల ఆదాయం వచ్చింది. అనధికార, అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయమని, ఇలాంటి లేఅవుట్లలో భవన నిర్మాణాలకు సైతం అనుమ తులు జారీ చేయబోమని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవ డం తప్పనిసరిగా మారింది. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్లు జరపడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్ల యజమానులు, లేఅవుట్ల డెవలపర్లలో గుబులు పట్టుకుంది. దీంతో ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవడానికి సామాన్యులతోపాటు డెవలపర్లు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. -
కొత్త రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అలాగే వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్గా ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త చట్టం ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. శనివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలను కడుపులో పెట్టుకొన్నట్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందని దానికి అనుగుణంగా పోలీసుశాఖలో మార్పు వచ్చిందని, అదే తరహాలో రెవెన్యూశాఖలో కూడా మార్పు రావాలన్నారు. (వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్) కొత్తం చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు.. వివిధ పనులపై రెవెన్యూ కార్యాయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. గతంలో మండలాల్లో, గ్రామాల్లో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించే వారని, మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలని సీఎం సూచించారు. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. రెవెన్యూశాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్ గా ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రొటోకాల్ సహా కార్యాలయాల నిర్వహణ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. (దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్) రూ. 260 కోట్ల అదనపు భారం వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టనికి ట్రెసా సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నాయకులు మన్నె ప్రభాకర్, రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, దేశ్యా నాయక్, నాగమణి, వాణిరెడ్డి, శైలజ, మాధవి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మరింత మేలైన సేవలందుతాయని వారు పేర్కొన్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మేలైన సేవలందించి ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
'మేం గొప్పలు చెప్పం.. చేసి చూపిస్తాం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. నూతన రెవెన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మీడియాతో మాట్లాడారు. '2014 ముందు తెలంగాణ అనేక రకాలుగా ఇబ్బందులు పడింది. బడుగు బలహీన వర్గాలు గోస పడ్డారు. ప్రజల కష్టాలు తీరడానికి ఒక యుగ పురుషుడు వస్తాడు.. చరిత్ర ఒక యుగవురుషుణ్ణి పుట్టిస్తుంది. అలాంటి ఒక యుగ పురుషుడే సీఎం కేసీఆర్. ఏ పార్టీని ఎన్నుకుంటే తమ ఇబ్బందులు పోతాయో ప్రజలకు తెలుసు..కొత్త రెవెన్యూ చట్టం ఒక చర్రిత. ఉద్యమ నాయకుడుగా సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు. రైతుల కష్టాలు ఎన్నో ఉన్నాయి.నీళ్లు లేక కరెంట్ లేక అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. గొప్పలు చెప్పే నాయకులకు ఒక్కటే మాట..మేం వాళ్లలా గొప్పలు చెప్పం ఏదైనా చేసి చూపిస్తాం . ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా చెప్పాలి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో ఎండిపోయిన కంకులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.గత ప్రభుత్వాలు రైతే రాజు అని చెప్పారు.. కానీ ఆచరణ సాధ్యం కాలేదు.. అది సాధ్యం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే.' అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. -
మాన్యువల్ రికార్డులూ నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఆన్లైన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ రికార్డులను మాన్యువల్గా కూడా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఆన్లైన్ ప్రక్రియతో సేవలు సులభతరమైనప్పటికీ... వెబ్సైట్లను హ్యాక్ చేసే అవకాశం ఉందని, దీంతో రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు తారుమారయ్యే ఆస్కారముందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ రికార్డు వ్యవస్థకు సమాంతరంగా మాన్యువల్ రికార్డులను కూడా నిర్వహిస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. మాన్యువల్ రికార్డుల నిర్వహణ మరింత సులభతరంగా అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో భట్టివిక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టాలనుకున్న డిజిటల్ సమగ్ర భూసర్వేకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమగ్ర భూసర్వేను ఎలా చేపడతారనే దానిపై మరింత స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేస్తారా? లేక ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తారనే దాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సూచించారు. ఇదివరకు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రైవేటు ఐటీ కంపెనీతో కలిసి రికార్డుల నిర్వహణ చేసిందని, కానీ మధ్యలో నెలకొన్న అవాంతరాలతో ఆ కంపెనీ నిర్వహణ ప్రక్రియను పూర్తిగా వదిలేసిందని, ఇలా మధ్యలో వదిలేయకుండా పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ధరణితో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ఇదివరకు చెప్పిందని, కానీ మాన్యువల్ రికార్డులన్నీ సాఫీగా ఉన్న వారికే పాసుపుస్తకాలు ఇచ్చారని, ఇతర సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికే ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్స్: సీఎం కేసీఆర్ ప్రస్తుతం రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16 వేల కేసులు పరిష్కరించేందుకే ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఈ కేసులు పరిష్కరించిన తర్వాత అవి కొనసాగవని తెలిపారు. రెవెన్యూ కోర్టుల్లో వచ్చే తీర్పు పట్ల సంతృప్తి లేని వాళ్లు సివిల్ కోర్టులను ఆశ్రయిస్తున్నారని సీఎం వాఖ్యానించారు. సీఎల్పీ నేత భట్టి ప్రస్తావించిన అంశాల్లో కొన్నింటిపై సీఎం పై విధంగా స్పందించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత మార్పులు, చేర్పులు చేస్తామని, సభ్యుల అంగీకారంతోనే బిల్లు పాసవుతుందని పేర్కొన్నారు. ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఈ అంశాన్ని సభ్యులు దృష్టిలో ఉంచుకుని విశాల దృక్పథంతో ఆలోచించాలని కోరారు. -
ఆ తప్పులు తహసీల్దార్లు చేయరా?
సాక్షి, హైదరాబాద్: ‘వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లపై భారం వేయడం ఎంత వరకు సమంజసం. వీఆర్వోలే కాదు తహసీల్దార్లు కూడా అవినీతి దుకాణం తెరిచారు. కొంతమంది వీఆర్వోలు చేసిన తప్పులకు వీఆర్వోలందరిపై అవినీతి ముద్ర వేయడం సరికాదు. వీఆర్వోలు చేసిన తప్పులనే తహసీల్దార్లు చేయరని గ్యారెంటీ ఏంటి? తహసీల్దార్లు, అదనపు కలెక్టర్లు కూడా ఏసీబీకి పట్టుబడుతున్నారు కదా. అధికారులను కాదు, వ్యవస్థను మార్చాలి. రైతుల నుంచి డబ్బులు అడిగే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. వ్యవసాయ భూముల సర్వే చేస్తాం అని సీఎం ప్రకటించారు. దేవాదాయ, ల్యాండ్ సీలింగ్, అసైన్డ్ భూములను కూడా సర్వే చేస్తారా?’అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా బిల్లుకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. న్యాయపర చిక్కులు రాకుండా చూడాలి: శ్రీధర్బాబు కొత్త రెవెన్యూ చట్టం అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు పేర్కొన్నారు. చట్టంలో పలు మార్పులను సూచించారు. 8లక్షల ఎకరాల పట్టా భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిందని, వీటిపై నిర్ణయం తీసుకోవాలని.. సర్వే, సెటిల్మెంట్ తర్వాతే మ్యుటేషన్ చేయాలని స్పష్టంచేశారు. -
‘నోటరీ ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి ’
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్, భవనాల క్రమబద్ధీకరణ పథకాల్లో ప్రభు త్వం మరికొన్ని మార్పులు చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇళ్లు, ప్లాట్లు నోటరీల ద్వా రా క్రయవిక్రయాలు జరిగాయని, ఇది వరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినప్పటికీ చాలామంది దర ఖాస్తు చేసుకోలేకపోయారని అన్నా రు. కొందరికి తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఇదే పద్ధతిలో ఉన్నాయని, ప్రస్తుతం క్రమబద్ధీకరణ విషయంలో నోటరీ ఆస్తులపై విధానపరమైన నిర్ణయం తీసుకొని చివరి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ బిల్లుకు ఎంఐఎం పూర్తి మద్ద తు ఇస్తుందని, కానీ కొన్ని రకాల మా ర్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. వక్ఫ్బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వీటిపై ప్రభు త్వం మరింత పక్కాగా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఇకపై వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులను బా ధ్యులుగా చేయాలన్నారు. హైదరాబా ద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభు త్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని అక్బరుద్దీన్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గచ్చిబౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో కేటీఆర్ కీలక పా త్ర పోషించారన్నారు. ఇటీవల తాను ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అభివృద్ధిని చూసి షాక్ అయ్యానన్నారు. -
భూవివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. సర్వే పూర్తయ్యాక, ధరణి పోర్టల్ వచ్చాక 99.9 శాతం సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసిన అంశాలపై ఆయన శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనన్నారు. ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ముందుకు సాగుతామని తెలిపారు. చట్టంలో అన్నీ తీసేయడం లేదని, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి, అవినీతికి ఆస్కారం ఉన్న వాటి తొలగింపుతోనే సంస్కరణలు ప్రారంభించామని వివరించారు. కంక్లూజివ్ టైటిల్ దిశగా వెళ్లడానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఈ చట్టంతో కొన్నింటికి తక్షణమే సమాధానం దొరుకుతుందని, మరికొన్నింటికి టైం పడుతుందన్నారు. ‘1,45,58,000 ఎకరాలకు సంబం« దించి 57.95 లక్షల రైతులకు 48 గంటల్లోనే రైతుబంధు కింద రూ.7,279 కోట్లు వెళ్లింది. వాటి విషయంలో సమస్య రాలేదు. అంటే వివాదం తక్కువగా ఉన్నట్లే. అయితే కొందరి పేరున భూమి తక్కువ, ఎక్కువ వంటి అంశాలతో సమస్యలు రావచ్చు. సమగ్ర సర్వే, డిజిటలైజ్ చేస్తే గొడవలు ఉండవు’ అని సీఎం పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే.. వీలైనంత త్వరగా సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం స్పష్టం చేశారు. ఆ పనులు చేసేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. నిబంధనల్లో సీలింగ్ క్లాజ్, ట్రబుల్ షూటర్ అనేవి పెడతామన్నారు. డిఫికల్టీ అనేది పెడతామని, తద్వారా సమస్యలు రావన్నారు. సీఎస్ సమీక్ష తర్వాత చట్టాల్లోని మరికొన్నింటిని రాబోయే రోజుల్లో తీసివేస్తామన్నారు. భూములకు సంబంధించి రెండుమూడు అంశాల్లో ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందన్నారు. అసైన్డ్ భూముల పంపిణీ అశాస్త్రీయంగా జరిగిందన్నారు. మెదక్ జిల్లా శివంపేట్లో 200 ఎకరాలుంటే ఆరేడు వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే చేశారని, తాను పుట్టిన ఊళ్లోనే 91 ఎకరాల పోరంబోకు భూమి ఉంటే.. 136 మందికి 120 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. గెట్టు, బాట చూపించలేదన్నారు. ఓట్లు వస్తున్నాయంటే సర్టిఫికెట్లు పంచారన్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో అవే తగాదాలు ఉన్నాయన్నారు. రాజకీయ పరమైన అసైన్ మెంట్లు చాలా జరిగాయన్నారు. ఎరవెల్లి పక్కన 356 ఎకరాలు దళితుల భూమి ఉందని, అందులో ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదయన్నారు. ఇలాంటి వాటి పరిష్కారానికి సర్వేనే సరైన జవాబని స్పష్టం చేశారు. భూపంపిణీ విషయంలో తాము గత పాలకుల్లా చేయబోమన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడానికి భూములే లేవని, దళితులకు 3 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు. కౌలుదారు కాదు.. రైతులే ముఖ్యం.. రాష్ట్రంలో కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని, రైతులకు అండగా ఉండటమే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒకప్పుడు 100 సర్వే నంబర్లుంటే ఇపుడు 1,400 అయ్యాయని.. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. 25 ఎకరాలకు పైన భూమి ఉన్నోళ్లు కేవలం 0.28 శాతం మంది మాత్రమేనని అన్నారు. ఒకనాడు జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు(కౌలుదారు) వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పాస్బుక్లో అనుభవదారు కాలమ్తో అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. తమకు రైతుల ప్రయోజనాలనే ప్రధాన మన్నారు. కౌలు అనేది రైతుకు, కౌలుదారుకు సంబంధించిన అంశమన్నారు. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్.. దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ లను శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. 1962 నుంచి 1973 వరకు 12 ఏళ్లు సర్వే చేసి.. 1982 నుంచి 2003 వరకు 62 గెజిట్లు ఇస్తూనే పోయారన్నారు. అలాంటప్పుడు వక్ప్ భూములు ఉంటాయా?. 77,538.3 ఎకరాల వక్ఫ్ భూముల్లో 57,423.91 ఆక్రమణలో ఉందన్నారు. 6,938 మంది ఆక్రమణదారులు ఉండగా 6,074 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 2,186 మందిపై కేసులు పెట్టారని, 967 మందిపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. ఇక దేవాదాయ శాఖ భూములు 87,235 ఎకరాలు ఉంటే 21 వేల ఎకరాలు లీజ్లో ఉన్నాయన్నారు. అర్చకుల చేతిలో 23 వేలు ఎకరాలు ఉండగా, 22,545 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, అన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ లో 19 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఇకపై గజం కూడా కబ్జా కాకుండా కాపాడేందుకు మున్సిపల్, గ్రామపంచాయతీ పర్మిషన్ అనుమతులు, ఎన్ వోసీ జారీ, రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేస్తామన్నారు. సెక్షన్ 22 ఏ కింద బ్యాన్ చేసే అధికారం ఉందని, శనివారమే ఫైల్ తెప్పించుకొని సంతకం చేస్తానన్నారు. వీటితోపాటు అటవీ భూములను కూడా ఆటోలాక్ చేస్తామన్నారు. ధరణి పోర్టల్లో ఆర్వోఎఫ్ఆర్ నమోదు.. ఆర్వోఎఫ్ఆర్ల్లో కూడా రాజకీయ దందా చేశారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఇచ్చినవి ఆర్వోఎఫ్ఆర్ పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనన్నారు. ఆ భూములు పొందిన వారు ఫలసాయంతో బతకాలే తప్ప ఓనర్లు కాదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. అయితే, ఆర్వోఎఫ్ఆర్ ఉన్న వాటిని కూడా ధరణి వె»Œ సైట్లో ప్రత్యేకంగా పొందుపరుస్తామన్నారు. ఇవి ఉన్న 81 వేల మందికి రైతుబంధు ఇచ్చామన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాలని అడుగుతున్నారని, సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రైతులకు వచ్చినట్లే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ‘పోడు’కు పరిష్కారం.. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం అన్నారు. ఇప్పటికి దున్నుకుంటున్న వారు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. ఒక దర్బార్ పెట్టి ఇప్పుడున్న వరకు పోడు భూమలకు పట్టాలు ఇమ్మని చెప్పి క్లోజ్ చేస్తామన్నారు. భవిష్యత్లో అవకాశం ఇవ్వబోమని, దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతోందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటోందన్నారు. అందుకే అడవుల పునరుజ్జీవాన్ని హరితహారంలో భాగంగా చేస్తామన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. సాదా బైనామాలకు మరో అవకాశం.. సాదాబైనామాల క్రమబద్దీకరణకు 11,19,000 ఎకరాలకు దరఖాస్తులు వస్తే.. 6,18,000 ఎకరాలను ఒక్క రూపాయి లేకుండా క్రమబద్దీకరించామని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే మూడు సార్లు పొడిగించామని, ఇప్పుడు మళ్లీ అడుగుతున్నారన్నారు. దీనిపై ఆలోచిస్తామని, అవసరమైమే 15 రోజుల టైంపెట్టి వన్ టైం చాన్ ్సగా అవకాశం ఇస్తామన్నారు. దీనిపై సీఎస్, ఇతర అధికారులు, కేబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ.. జీవో 58, 59 ప్రకారం.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు మరోసారి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆయా స్థలాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారంతా పేదలే కాబట్టి 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఓనర్లను చేశామన్నారు. మరొక అవకాశం ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటికి ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత ఏదైనా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ తోనే చేస్తామన్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్ రేట్లు ప్రకటన.. ఇకపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు తమకు కేటాయించిన పనులే చేస్తాయన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేసారి ప్రకటిస్తుందన్నారు. వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుతుతాయని, విచక్షణాధికారం అనేది ఉండదన్నారు. సర్కార్ ఆధ్వర్యంలోనే ధరణి.. ధరణి పోర్టల్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఎస్టీఎస్కు ఈ బాధ్యత అప్పగిస్తామన్నారు. ఈ పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. భూ రికార్డులను వెబ్సైట్ (పోర్టల్), డిజిటల్(సీడీల రూపంలో), డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేస్తున్నామన్నారు. ధరణి వెబ్సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్బుక్లను ఇస్తామని, ఇతర భూములన్నింటికి మెరూన్ కలర్ పాస్బుక్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటన్నింటిని ధరణి పోర్టల్లో పెడతామన్నారు. అధికారులు తప్పులు చేస్తే రిమూవల్/డిస్మిషన్ ఫ్రమ్ సర్వీసు అనే నిబంధనను చట్టంలో పెట్టామన్నారు. అంతా తప్పులు చేయరని పేర్కొన్నారు. వీఆర్ఓలు ఎక్కువ బాధలు పెట్టారు కాబట్టి రద్దు చేశామన్నారు. సభ్యుల పేర్లు నమోదుకు 2 నెలల సమయం.. వివాదాల పరిష్కారం సివిల్ కోర్టుల్లో చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కావాలని ఒకరికి అన్యాయం చేసే పరిస్థితి ఉంటే సదరు వ్యక్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేసి పరిష్కరించుకునేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు రైతులందరికి 2 నెలల సమయం ఇచ్చి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అందరి పేర్లతో పట్టాలు ఇచ్చేలా చర్యలు ఉంటాయని, దీంతో వివాదాలు తగ్గిపోతాయన్నారు. కాగా, బండ్లగూడలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఎవరూ మార్చలేరు.. సమగ్ర సర్వేను ప్రభుత్వ, ప్రైవేటు వారిలో ఎవరు చేసినా తేడా రాదని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి కాబట్టి వాటిని ఎవరి మార్పు చేయలేరన్నారు. ఈ పనులను ప్రభుత్వ సారథ్యంలో ప్రైవేటు సంస్థలు చేస్తాయన్నారు. టాంపర్ చేయడానికి అవకాశం లేదని, ప్రతి సర్వే నంబర్కు కోఆర్డినేట్స్ ఇస్తారన్నారు. కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకున్నా ముందుకు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 9 వేల కోట్లే ఇవ్వడం లేదని, ఇక ధరణికి ఏం ఇస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరిపై పోరాటం చేయాలని ఎంపీలకు చెప్పానన్నారు. జీడీపీ క్రాష్ అయిందని, 24 శాతం మైనస్లోకి పోయి 31 శాతం పడిపోయిందన్నారు. అందులోంచి బయట పడితే కదా రాష్ట్రానికి ఇచ్చేదని విమర్శించారు. వారు ఇచ్చినా ఇవ్వకున్నా ముందుకు పోతామన్నారు. టపాసులు కాల్చుకుంటున్నారు... భూమి శిస్తు రద్దయిపోయి ప్రభుత్వమే రైతుబంధు ఇస్తున్నప్పుడు, అది వసూలు చేసే అధికారులు ఎందుకని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి ఆరోపణలు, అనేక లోపాలు ఉన్నందునే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామన్నారు. దీంతో ప్రజలు తమకు పీడ విరగడైంది అని టపాసులు కాల్చుకుంటున్నారన్నారు. ఈ చట్టం అమలు సమయంలో కొంత కఠినంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. బలహీన వర్గాలు కోరుకున్నట్లుగానే.. అసైన్ ్డ భూములను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించినా సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. దీంతో వాటిల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. అందుకే దళిత, గిరిజన సంఘాలతో మాట్లాడి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోమని ఆ ఎమ్మెల్యేకు చెప్పానన్నారు. ఆ బాధ్యతను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. కాగా, ట్రిబ్యునల్లో మెంబర్స్గా రిటైర్డ్, ఉద్యోగంలో ఉన్న ఐఏఎస్ అధికారులను నియమిస్తామన్నారు. వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం.. పే స్కేల్ అమలులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వీఆర్ఏలే ఉద్యోగం తీసుకోవచ్చని, లేదంటే కుటుంబంలోని వారసుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తామన్నారు. వారంతా ఇన్నేళ్ల నుంచి చాలా తక్కువ జీతంతో పనిచేశారన్నారు. రూ. 200 కాలం నుంచి పని చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 వేలు చేస్తే.. తాము రూ.10 వేలు చేశామన్నారు. వారికి వయోపరిమితి లేనందున 70 ఏళ్లు వచ్చినా వీఆర్ఏలుగా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుంటే ఇస్తామన్నారు. గిరిజనేతరులకు రైతుబంధు ఇచ్చేందుకు ఆలోచన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. వారికి ఎలా ఇవ్వాలో ఆలోచించి చర్యలు చేపట్టాలని సీఎస్కు చెబుతానన్నారు. చట్టపరంగా ఇబ్బంది లేకపోతే వారికి ఇస్తామన్నారు. నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు–2020కు, వీఆర్వో రద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్– 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం–2020 సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభవార్త అందించారు. ఉద్యోగులకు పే స్కేల్ అమలుతో పాటు పదవీ విరమణ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్సిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వీఆర్ఏలు ఎంతో సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్ఏ సమస్యలపై ప్రశ్న సందర్భంగా సీఎం ఈ హామీ ఇచ్చారు. కాగా శుక్రవారం నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసందే. (కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం). . వీఆర్ఏలకు పే స్కేల్తో పాటు వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ధన్యవాదాలు : ట్రెసా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ రెవెన్యూ ఉద్యోగుల పని తీరును మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంతోషం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమపై పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏ లకు పూర్తి వేతనంతో పాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్ పోచారం ప్రకటించారు. సభలో మూజువాణి ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ కూడా జరుగనుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్లోనే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగనుంది. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అన్నారు. (దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్) -
ప్రక్షాళన : కేసీఆర్ మరో కీలక నిర్ణయం
-
ప్రక్షాళన : కేసీఆర్ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూశాఖ ప్రక్షళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యులు చేసిన సూచనలకు, ప్రశ్నలకు సీఎం స్వయంగా సమాధానం చెప్పారు. (అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం రెవెన్యూ సంస్కరణలో తొలి అడుగు మాత్రమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. పలు చట్టాల సమూహారంగా కొత్త రెవెన్యూ చట్టం కొనసాగుతుందని పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో 160కి పైగా చట్టాలు ఉండేవని, తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నామని వెల్లడించారు. ధరణి ఒక్కటే కాదనీ, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని సభలో సీఎం వివరించారు. రెవెన్యూ కోర్టుల్లో 16వేల కేసులు, హైకోర్టులో 2వేల కేసులు ఉన్నాయని, సమగ్ర సర్వే చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు సాయం అందించామన్నారు. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదంలో ఉన్న భూములు చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు. -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్మెంట్ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి. అర్హులుగా తేలితేనే రీఅసైన్ అసైన్డ్దారుల నుంచి కొనుగోలు చేసినవారిలో అసైన్మెంట్ చట్ట ప్రకారం అర్హులుగా తేలితే(భూమిలేని పేదలైతే) వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో గాకుండా ఇతరచోట్ల 2017 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, అసైన్డ్దారుల నుంచి కొనుగోలు చేసినవారు దారిద్య్రరేఖకు ఎగువన ఉంటే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఆర్థిక సమస్యలతో భూములను అమ్ముకున్న అసైనీలు భూమిలేని పేదలైతే మాత్రం పీవోటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగివారికే కేటాయిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన వారు ఈ చట్టానికి అర్హులుగా లేకపోతే మాత్రం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సివుంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే. కాలనీలు.. కాసులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పించింది. ఇదే తరహాలోనే మన రాష్ట్రంలోనూ ఇతరుల చెరలో ఉన్న భూముల క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవడమేగాకుండా.. భూమి యజమాన్యహక్కులను కల్పించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జీవోల ద్వారా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్న సర్కారు అసైన్డ్ భూముల్లో వెలిసిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్లు జరిగినా.. కొత్త చట్టం ప్రకారం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో మరింత కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాలనీలుగా వెలిసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరిస్తే ఖజానాకు కాసుల వర్షం, ప్రజలకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు చరిత్రాత్మకమైనది. ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడే రోజు. రైతులకు సరళీకృతమైనటువంటి చట్టం కోసం కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ప్రతీ కుటుంబానికి వర్తించే బిల్లు ఇది’అని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. శాసనసభలో బుధవారం రెవెన్యూ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన బిల్లులోని ముఖ్యాంశాలను వివరించారు. ప్రపంచంలో ఇంతటి అత్యుత్తమైన బిల్లు మరోటి లేదన్నారు. ‘కొత్త చట్టంతో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూతగాదాల పీడ విరగడవుతుంది. అధికారుల దయాదక్షిణ్యాల మీద ప్రజలు ఆధారపడాల్సిన పని ఉండదు. వారసత్వ భూ మార్పిడి సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు తమ సమాచారాన్ని రాసి ఇస్తే ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమవుతాయి. ఇకనైనా అవినీతి అంతం కావాలి’అని అన్నారు. అంతులేని అవినీతికి ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ‘భూములన్నింటినీ డిజిటలైజ్డ్ సర్వే చేస్తాం. డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ తయారవుతుంది. అది కూడా ప్రజలకు ఐటీ నెట్వర్క్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన ఇంకేం అన్నారంటే... వారి ఉద్యోగాలకు ఢోకా లేదు... ‘వీఆర్వో, వీఆర్ఏల ఉద్యోగాల భద్రతకు ఎటువంటి డోకా లేదు. అవసరాల మేరకు వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేస్తాం. భూసంస్కరణలను క్రమబద్ధీకరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా పాలకులు పూర్తిస్థాయిలో మార్పును తీసుకురాలేకపోయారు. అంతులేని అవినీతి కారణంగా ప్రజలకు, రెవెన్యూ శాఖకు మధ్య విద్వేషపూరిత వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లుగా దీన్ని చక్కదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టాం. మధ్యలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగింది. కరోనా మహమ్మారి రాకతో ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. రెవెన్యూ బాధ్యతలను నేనే స్వీకరించా. సెక్రటరీని కూడా నియమించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే దీన్ని చూస్తున్నారు. మూణ్నాలుగు నెలలుగా మళ్లీ భూరికార్డుల ప్రక్షాళనపై దృష్టి పెట్టా. రెవెన్యూ ఉద్యోగులతోనూ నేరుగా మాట్లాడా. తమకు గౌరవం, ఉద్యోగ భద్రత కావాలని అడిగారు. వారి ఉద్యోగ భద్రతకు డోకా ఉండదు. ప్రజలకు దీంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో వీఆర్ఏలు 22,900 మంది ఉన్నారు. వీరిలో దళితులు, బీసీలే ఎక్కువ. ఇప్పుడు వీరికి స్కేల్ ఇచ్చి గుర్తిస్తాం. కొందరిని రెవెన్యూలో, మరికొందరిని ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ మూణ్నాలుగు నెలల్లో పూర్తవుతుంది. వీరికి స్కేల్ పోస్టులు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 260 కోట్ల వరకూ అదనపు భారం పడుతుంది. వారి అధికారాలకు కత్తెర... ‘సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 5,480 మంది వీఆర్వోలను తీసేయం. ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. వీరికి ప్రత్యామ్నాయ సేవలు ఐటీ ద్వారానే జరుగుతాయి. తహసీల్దార్లు, ఆర్టీఓలు ఉంటారు. అయితే వారి అధికారాలు పోతాయి. రాజ్యాంగం ప్రకారం చట్టం నిర్దేశించినట్లుగా పనిచేయాలి. ప్రస్తుతం ఎలా ఉందంటే తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లే ఉత్తర్వులు జారీ చేస్తారు. మళ్లీ వీరే కోర్టులు నిర్వహిస్తారు. ఇది కొంచెం వికారంగా ఉంది. అందుకే కొత్త చట్టం అమల్లోకి వచ్చాక, ఈ మూడు రెవెన్యూ కోర్టులుండవు. సివిల్ కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వంటి న్యాయ వ్యవస్థ ఉండగా మళ్లీ ఈ రెవెన్యూ కోర్టులెందుకు?. ఈ మూడు కోర్టుల్లో కలుపుకొని మొత్తం 16,137 కేసులున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటుచేస్తాం. మూడునాలుగు నెలల్లో కేసులు పరిష్కరించేలా కృషిచేస్తాం. ఆ తర్వాత భూ తగాదా కేసులుండవు. ఒకటో అరో కేసులొచ్చినా వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఎకరా రూ.10 లక్షలకు పైనే ఉంది. ప్రస్తుత భూ వివాదాలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే భూరికార్డుల క్రమబద్ధీకరణ జరగాల్సిందే. రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తారా? అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నూతన విధాన అమలుకు ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని చెప్పా. గతంలో నిజాం హయాంలో తర్వాత ఇప్పటి వరకూ భూరికార్డుల సర్వే చేయలేదు. అక్షాంశాలు, రేఖాంక్షాల ఆధారంగా.. ‘ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి భూమిని సర్వే చేయిస్తాం. ప్రతి ఇంచునూ కొలుస్తాం. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి హద్దుల(కోఆర్డీనేట్)ను నిర్ణయిస్తాం. ఇక బలహీనుల భూమిని బలవంతులు దౌర్జన్యంగా ఆక్రమించుకోలేరు. ఇటువంటి పోర్టల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హరియాణాలో ఉన్నా ఇంత లోతుగా లేదు. ఎలక్ట్రానిక్ ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ భూములు.. రెండోది వ్యవసాయేతర భూములు. రాష్ట్రంలో 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా చూసుకోవచ్చు. డౌన్లోడ్, కాపీ కూడా చేసుకోవచ్చు. మల్టీపుల్ సర్వర్లలో, దేశంలో సురక్షితమైన ప్రాంతాల్లో వీటి రికార్డులు భద్రపరుస్తారు. ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చినా ఇతర ప్రాంతాల్లో వీటి రికార్డులుంటాయి. కొన్ని బ్యాంకులు రుణాలివ్వడానికి రైతులను తిప్పించుకుంటున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం (ఎన్కంబెన్స్) ధరణి పోర్టల్లో లభ్యమవుతుంది. గతంలో కొందరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావుండదు. ప్రసిద్ధ స్థలాల వివరాలను ముందే పొందుపర్చి ఉంచుతాం గనుక సాఫ్ట్వేర్ ఆటోమెటిక్గా తిరస్కరిస్తుంది. అన్ లాక్ చూపిస్తుంది. జాయింట్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లు... తహసీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్లుగా చేస్తాం. వ్యవసాయ భూములను వీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. స్లాట్ను రైతులే బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వచ్చి పోతే సరిపోతుంది. వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు కూడా అందజేస్తారు. వ్యవసాయేతర భూములను ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం రాష్ట్రంలో గ్రామ, పురపాలక, జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుకొని 89.47 లక్షల ఆస్తులు ఆన్ లైన్లో ఉన్నాయి. ధరణి పోర్టల్లోకి ఇవన్నీ వస్తాయి. రిజిస్ట్రేషన్, ఎమ్మార్వో కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఎవరికి వారు సొంతంగా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన నమూనా కాపీని ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వమే అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ రాసుకోవడానికి వీలు పడని వారు నిర్దేశిత ఫీజు చెల్లించి రాయించుకోవచ్చు. అలా రాసే వారికి లైసెన్సు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఇక నుంచి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోనే ఇస్తారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఆస్తుల ప్రాతిపదికన జారీచేస్తారు. ఆ డేటా బేస్ అంతా ప్రభుత్వం వద్ద ఉంటుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘంగా శుక్రవారం చర్చ జరుగుతుందన్నారు. దీనికి ముందు ముఖ్యమంత్రి వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి కేటీఆర్.. మున్సిపల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
ఒకే క్లిక్తో భూమి భద్రం
సాక్షి, హైదరాబాద్: భూమి హక్కుకు ‘కొత్త’కళ వచ్చింది. ‘రెవెన్యూ’పరిధులు, పరిమితులు నూతన బాట పట్టాయి. ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు ఒక చోటుకు, మ్యుటేషన్కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. ధ్రువీకరణలు స్థానిక సంస్థల దారి మళ్లాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దు, వీఆర్ఏలకు పేస్కేల్, ఇతర శాఖల్లో సమానశ్రేణిలో విలీనం. ఇదీ స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. సాధికారతకు సాంకేతికత.... యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్ పడింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్ (భూ బదలాయింపు), పాస్ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్సైట్ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్స్టాప్ పడింది. భూ లావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్సైట్లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు అందనున్నాయి. ‘ధరణి’మంత్రం... రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్న సర్కారు.. ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్ లైన్ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్సైట్ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్–ఏ(వ్యవసాయ), పార్ట్–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్ లాక్ వ్యవస్థను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్సైట్లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు. తహసీల్దార్ కమ్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్... తహసీల్దార్ ఇక కొత్త అవతారమెత్తనున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ అధికారి ఇకపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్.... రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్కు రిటైర్డ్ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులే అంతిమం. వీఆర్ఏలకు పే స్కేల్.... గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు తీపి కబురు అందజేసింది. ఇప్పటివరకు గౌరవ వేతనంపై పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇకపై అర్హతనుబట్టి పే స్కేల్ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,900 మంది పనిచేస్తుండగా.. పదో తరగతిని విద్యార్హతగా ప్రకటిస్తే సుమారు 8 నుంచి 10వేల మందికి పేస్కేల్ రానుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.260 కోట్ల మేర భారం పడనుంది. కాగా, 5,480 మంది వీఆర్వోలతోపాటు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీఆర్ఏలలో కొందరి సేవలను మాత్రం రెవెన్యూశాఖలోనే వినియోగించుకోనుంది. ‘స్థానికం’గానే కుల ధ్రవీకరణ.... ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపడింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. భూమి హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు(భర్తరఫ్, శిక్ష). కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం హక్కు పత్రంగా పరిగణన. కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్లో పెడతారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్ను బర్తరఫ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది. -
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు
-
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణిస్తామన్నారు. ఇకపై సబ్ రిజిస్ట్రార్ అధికారాలను తహశీల్దార్కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులు డిజిటల్ స్టోరేజ్లో ఉంటాయని తెలిపారు. కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా పరిగణిస్తామని వివరించారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం అన్ని ఉంటాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు ఈ చట్టం వర్తించదని తెలిపారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ కోసమైనా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవటం తప్పనిసరి అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తాలు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలని చెప్పారు. మ్యూటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారిని స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. వీఆర్ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయ కూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలిపారు. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ విభాగాలుగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ను ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు వివరించారు. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారానికి 16 ఫాప్ట్ ట్రాక్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తహశీల్దార్లను జాయింట్ సబ్రిజిస్ట్రార్లుగా చేస్తామని తెలిపారు. వ్యవసాయ భూములను జాయింట్ సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక శాసనసభలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
రెవెన్యూ కోర్టులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కోర్టులకు ఇక చెల్లుచీటీ పడనుంది. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఈ రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కుల చట్టం–2020 (ఆర్ఓఆర్) బిల్లులో పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు మండల స్థాయిలో తహసీల్దార్.. ఆపై అప్పిలేట్ అధికారిగా ఆర్డీవో.. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ భూ వివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల పరిష్కారానికి ఎడతెగని జాప్యం జరగడం, మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూశాఖ అధికారుల అధికారాలకు కత్తెరపడనుంది. ఈ క్రమంలోనే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కొత్తగా ట్రిబ్యునల్... రెవెన్యూ కోర్టులకు రాంరాం చెబుతున్న ప్రభుత్వం దాని స్థానే జిల్లాకో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ ట్రిబ్యునల్.. ఇకపై మండలం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని భూ వివాదాలను పరిష్కరించనుంది. దీంతో ఇప్పటివరకు మూడంచల వ్యవస్థకు కాలం చెల్లనుంది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులపై సంతృప్తి చెందని కక్షిదారులు కలెక్టర్కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కొత్త చట్టంలో ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అలాగే, సేవలను సులభతరం చేయడంలో భాగంగా ఇకపై తహసీల్దార్, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల పాత్రను కూడా పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి మరో అధికారి రెవెన్యూశాఖలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి (అర్జీలతో సహా) జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, విరాసత్, కల్యాణలక్ష్మి–షాదీముబారక్, కుల, ఆదాయ, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆస్తుల భాగాల పంపిణీ వ్యవహారాలను కొలిక్కి తెచ్చే బాధ్యతను ఈ అధికారికి అప్పగించనున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి ఈ అర్జీలకు పరిష్కారమార్గం చూపేలా వ్యవహరించనున్నారు. పేర్లలోనూ మార్పులు... వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపైనా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పోస్టులను కూడా పునఃనిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపరిచినట్లు సమాచారం. జిల్లా పాలనాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ అనే పదానికి బదులుగా ఇకపై జిల్లా మేజిస్ట్రేట్గా పిలవనుంది. అదనపు కలెక్టర్ను ఇకపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్గా వ్యవహరించనుంది. తహసీల్దార్ను తహసీల్దార్/ భూ మేనేజర్గా నిర్వచించే అంశాన్ని పరిశీలిస్తోంది. -
ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలి
సాక్షి, మేడ్చల్ : నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. అనంతరం ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. (వీఆర్వో వ్యవస్థ రద్దు) ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని నిరసనలు చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచడం అంటే సామాన్యప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి విఙ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. (రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు ) -
రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, భూరికార్డులు చక్కదిద్దడం అవసరమేనని చెప్పారు. అయితే, నూతనంగా తీసుకొస్తున్న రెవెన్యూ బిల్లును ముందుగా సెలెక్ట్ కమిటీకి అప్పగించి విస్తృత చర్చ జరిగిన అనంతరం తుది రూపు ఇచ్చి చట్టం చేయాలని సూచించారు. ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. రెవెన్యూ శాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి ఒక్క వీఆర్ఓలను బాధ్యులను చేయడం సమంజసం కాదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు దున్నుకుంటున్న రైతులు, పేద, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులకు హక్కులు కల్పించాలన్నారు. కాగా, ఎల్ఆర్ఎస్తో ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్న కోదండరాం.. రెగ్యులరైజేషన్కు రుసుం విధించడం సమంజసం కాదని తెలిపారు. -
కొత్త చట్టానికి ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించిన ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020’ను ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ బిల్ –2020’ పేరుతో రూపకల్పన చేసిన కొత్త రెవెన్యూ చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనలో కీలక సంస్కరణలకు సంబంధించిన బిల్లులు, ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్లను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం.. రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం వీఆర్వో పోస్టుల రద్దుతో పాటు కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల కారణంగానే గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులు భ్రష్టుపట్టాయని, ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని సర్వత్రా ఆరోపణలు ఉండటంతో ఈ పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సాదా బైనామాలు చెల్లవు.. తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు –2019లోని సవరణ బిల్లు, పంచాయతీరాజ్–రూరల్ డెవలప్మెంట్–గ్రామ పంచాయత్స్–ట్రాన్స్ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లులను కేబినెట్ ఆమోదించింది. కొత్త రెవెన్యూ చట్టానికి అనుబంధంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఈ బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. ఖాళీ స్థలాలను సాదా బైనామా ద్వారా క్రయావిక్రయాలు చేస్తే ఇకపై చెల్లదని కొత్త నిబంధనలను ఈ బిల్లుల ద్వారా తీసుకురాబోతోంది. సాదాబైనామాలతో భూకబ్జాలు, అక్రమ లావాదేవీలు చోటు చేసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. లే–అవుట్ అనుమతి/ఎల్ఆర్ఎస్ కలిగి ఉండటం, రిజిస్ట్రేషన్ చేయించడాన్ని తప్పనిసరి చేయనుంది. భవనాలు, లే–అవుట్ల అనుమతులను పారదర్శకంగా జారీ చేసేందుకు రూపొందించిన టీఎస్ బీపాస్ బిల్ను ఆమోదించింది. జీతాల్లో కోత బిల్లుకు ఆమోదం.. ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్–2002ని కేబినెట్ ఆమోదించింది. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో జీతాలు, పెన్షన్లలో కొత విధించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. అలాగే ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ –2020కు కేబినెట్ ఓకే చెప్పింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు్క కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వయోపరిమితి 65 ఏళ్లకు పెరగనుంది. బీసీ జాబితాలో 17 కొత్త కులాలు.. బీసీల జాబితాలో 17 కులాలను చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. అద్దపువారు, బాగోతులు, బైల్ కమ్మర, ఏనూటి, గంజికూటివారు, గౌడజెట్టి, కాకిపడగల, మాసయ్యలు/పటంవారు, ఒడ్, సన్నాయోల్లు, శ్రీక్షత్రియ రామజోగి, తెరచీరలు, తోలుబొమ్మలవారు/బొప్పల కులాలను బీసీ–ఏలో.. అహీర్ యాదవ్, గొవిలి, కుల్లకడగి, సారోళ్లు కులాలను బీసీ–డీలో చేర్చాలని బీసీ కమిషన్ సిఫారసు చేసింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు... తెలంగాణ జీఎస్టీ యాక్టు –2017లో సవరణ బిల్లుకు ఆమోదం తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్–2020కి గ్రీన్సిగ్నల్ తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు –1956 సవరణ బిల్లుకు, ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు –1972 కు సవరణ బిల్లుకు అనుమతి. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఓకే. కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదమిచ్చింది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలతో ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర క్యాబినెట్ రెండు గంటల పాటు కొనసాగింది. కొత్త రెవెన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. బుధవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ -1972కు సంబంధించిన సవరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ కెబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు: -ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్,(వీఆర్ఓ) 2020కు ఆమోదం - ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020కు ఆమోదం - తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ -2019లోని సవరణ బిల్లుకు ఆమోదం - పంచాయితీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్ – 2018 సవరణ బిల్లుకు ఆమోదం - తెలంగాణ జీ.ఎస్.టీ యాక్ట్ -2017 సవరణ బిల్లుకు ఆమోదం - తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020కు ఆమోదం - ది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020కు ఆమోదం - ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002కు ఆమోదం - ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ కు ఆమోదం - టీఎస్ ఐపాస్ బిల్కు ఆమోదం - తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ -1956 సవరణ బిల్లుకు ఆమోదం - ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ -1972 సవరణ బిల్లుకు ఆమోదం - కొత్త సెక్రటేరియట్ నిర్మాణం(సచివాలయం), పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదం - కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదం -
వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్ భావిస్తు న్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసా యిదా చట్టానికి తుదిరూపునిచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసిం ది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టంలో చేయాల్సిన మార్పు చేర్పులపై మరింత కసరత్తు చేయాలని అధికారు లను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టా దారు పాసు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని ఇవ్వాల్సి ఉందనేది ఆరా తీశారు. వ్యవసాయ, వ్యవసాయే తర భూముల విస్తీర్ణం విష యంలో నెల కొన్న గందరగోళంపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దేవాలయ భూముల తో సహా అన్ని కేటగిరీల భూముల వివరాలపై చర్చిస్తూ, గతంతో పోలిస్తే వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగడాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉద్యో గులు, డిప్యూటీ కలెక్టర్ల వివరాలు, పాత చట్టంలో సమూలంగా మార్చాల్సిన నిబంధనలు, కొత్త చట్టంలో చేర్చాల్సిన అంశాలు తదితరాలపై మరింత కసరత్తు జరగాలని సూచించినట్లు సమాచారం. వీఆర్ఓ, వీఆర్ఏలు, డిప్యూటీ కలెక్టర్లను ఏ ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేయాలనే అంశం పైనా చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టానికి సం బంధించిన అంశాలపై సీఎం సోమవారం మరో మారు సమీక్షిస్తారని రెవెన్యూ వర్గాలువెల్లడించాయి. (రేపటి నుంచి సెట్స్ షురూ) -
ఇక రెవె‘న్యూ’ కదలిక!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై చర్యలను సర్కారు వేగవంతం చేసింది. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కాలం చెల్లినవాటికి మంగళం పాడాలని నిర్ణయించింది. నూతన చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, బలంగా ఉన్న చట్టాలు/ రూల్స్నే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. తలనొప్పిని వదిలించుకోవాలని.. అవినీతి, వివాదరహిత పాలన అందించడానికి రెవెన్యూ శాఖ పనితీరు తలనొప్పిగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు అధికారుల అవినీతి, పనితీరు సర్కారుకు చెడ్డపేరు తెస్తోందనే భావనలో ప్రభుత్వం ఉంది. మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల కోసం తహసీళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్ల నగదుతో ఏసీబీ చిక్కడంతో అవాక్కయిన ప్రభుత్వం నయా రెవెన్యూ చట్టానికి వేగంగా పదునుపెడుతోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల ఏకీకృతం.. కొత్త చట్టంలో పొందుపరచాల్సిన సంస్కరణలౖపై కలెక్టర్లు, న్యాయ నిపుణులతో సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది. ఒకే గొడుగు కిందకు.. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్తచట్టానికి తుదిరూపునిస్తోంది. టైటిల్ గ్యారంటీ చట్టం ఆలోచనను దాదాపుగా విరమించుకున్న సర్కారు రెవెన్యూ కోడ్ను అమలు చేసే అంశాన్నిమాత్రం పరిశీలిస్తోంది. గతంలో 1999లోనే ఈ కోడ్కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసినా కేంద్రం ఓకే చెప్పకుండా 44 ప్రశ్నలు సంధిస్తూ తిప్పిపంపింది. దీనికే కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2020ను ప్రవేశపెడితే ఎలా ఉంటుందని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఈ కోడ్తో ఒకే చట్టం మనుగడలోకి రానుంది. అయితే, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరి కావడంతో కాలయాపన జరిగే అవకాశమూ లేకపోలేదని అధికారవర్గాలు అంటున్నాయి. మరోవైపు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ నిర్వహణ చట్టం–2020 ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం కుస్తీ పడుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టంస్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో 124 చట్టాలు/నియమాలకు బదులు రెవెన్యూచట్టం–1907, భూ ఆక్రమణ చట్టం, అసైన్మెంట్, రెవెన్యూ రికవరీ, ల్యాండ్ గ్రాబింగ్, సర్వే, సరిహద్దులు, రక్షిత కౌలుదారు తదితర చట్టాలతో ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని రూపకల్పన చేస్తోంది. అదే రోజు మ్యుటేషన్ కొత్త చట్టంలో తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాల కత్తెర, వీఆర్వోల విలీనం, హోదాల మార్పుపై కసరత్తు చేస్తున్న సర్కారు.. సబ్ రిజిస్ట్రార్లకు కీలక బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, ఇన్స్టంట్ పాస్పుస్తకాన్ని జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భూములపై వివాదాలు, ఇతరత్రా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధీకృత అధికారి/ట్రిబ్యునల్ను నియమించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)కు ప్రత్యామ్నాయంగా ఈయన రెవెన్యూ వివాదాలను పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఏడంచెల అధికార వ్యవస్థను కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్కు రిటైర్డ్ జడ్జీలను నియమించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
తెలంగాణ: తహసీల్దార్ల పవర్ కట్
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో భూ వ్యవహారాలపై సర్వాధికారాలు ఎమ్మార్వోలకే ఉండగా.. ఇప్పుడు వాటిలో సగం అధికారాలకు కత్తెర వేయబోతోంది. రెవెన్యూ అంశాల్లోనే కాకుండా తహసీల్లార్దు ప్రతిష్టాత్మకంగా భావించే రేషన్ వ్యవహారాల్లోనూ కోత విధిస్తోంది. రేషన్కార్డులు జారీచేసే అధికారం, రేషన్షాపుల పర్యవేక్షణ, రైసుమిల్లులపై అజమాయిషీ బాధ్యతల నుంచి వారిని తప్పించబోతోంది. ఇక, రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహసీల్దార్ల పాత్రను పరిమితం చేస్తోంది. జనగణన, పశుగణన వంటి అదనపు భారాల నుంచి కూడా విముక్తి కల్పించ బోతోంది. ఈ మేరకు తహసీల్దార్లకు ఉన్న ప్రధానమైన 44 అధికారాల్లో 20 మాత్రమే వారి పరిధిలో కొనసాగిస్తూ, 17 అధికారాలను వ్యవసాయ, పశుసంవర్థక, పోలీసు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలకు బదలాయించబోతోంది. కాలం చెల్లిన మరో ఏడు అధికారాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో రక్షితదారు చట్టం కూడా ఉంది. ► తహసీల్దార్లకు గల అధికారాల్లో ప్రధానమైనవి-44 ► ఇకపై తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు-20 ► ఇతర శాఖలకు బదలాయించే అధికారాలు-17 ► రద్దు చేయాలని నిర్ణయించినవి-7 అంతర్గత కసరత్తు పూర్తి రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడమేగాకుండా.. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగానే తహసీల్దార్ద విధుల్లో పెనుమార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార పాత్రను స్పష్టంగా ప్రస్తావించనుంది. తహసీల్దార్లతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) విధుల్లో కూడా ఈ చట్టం ద్వారా మార్పులు చేయనున్నారు. వాస్తవానికి మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే రెవెన్యూ ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించినా.. రెవెన్యూ కోడ్ తీసుకురావాలా? సంపూర్ణంగా కొత్త చట్టమే తీసుకురావాలా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ముందడుగు పడలేదు. అయితే, చట్టం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చిన ఉన్నతాధికారులు... వీఆర్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాలు, ఇతర శాఖల్లో బదలాయింపుపై మాత్రం అంతర్గత కసరత్తు పూర్తిచేశారు. ఇక, కీలకమైన మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ అధికారాలను తహసీల్దార్లకే ఉంచాలా లేదా ఆర్డీఓలకు బదలాయించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకే గొడుగు కిందకు.. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులోభాగంగానే గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయట్లేదని తెలుస్తోంది. సీసీఎల్ఏ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా కుదించి.. సచివాలయంలోని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయార్జన శాఖలన్నింటికీ ఒకే ముఖ్య కార్యదర్శి ఉండేలా, ఆ పోస్టులో స్పెషల్ సీఎస్ హోదా అధికారిని నియమించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న శాఖలను భారీగా కుదించాలని, కేవలం 18 శాఖలకే పరిమితం చేస్తే బాగుంటుందని గతంలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు చేసే దిశగా ఆలోచన సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులను ఆ శాఖకు శాశ్వతంగా బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు, బాధ్యతలు ► మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై పర్యవేక్షణ, సమన్వయం ► సాధారణ విచారణలు ► వీఐపీల పర్యటనల ప్రొటోకాల్ విధులు ► కుల, ఆదాయ, వాల్యూయేషన్, స్థానికత, న్యాయబద్ధమైన వారసుల సర్టిఫికెట్ల జారీ ► ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో జ్యూడీషియల్ అధికారాలు, భూసేకరణాధికారి (ఎల్ఏవో) ► రోడ్డు, రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన ప్రొటోకాల్ డ్యూటీ ► వెట్టి కార్మికుల విముక్తి చట్టం అమలు ► రెయిన్గేజ్ మీటర్ల నిర్వహణ ► నీటి వనరులు, నీటి పరివాహక ప్రాంతాల పర్యవేక్షణ ► వ్యవసాయేతర రంగాలకు నీటి వనరుల కేటాయింపులపై అధికారం ► రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం ► గ్రామ పద్దుల పరిశీలన ► ప్రకృతి విపత్తుల నిర్వహణ, పునరావాసం ► సాధారణ భూసేకరణ ► సాధారణ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ► ఓటర్ల జాబితా రూపకల్పన ► ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ బాధ్యతలు ► చెట్లపై హక్కుల జారీ ► రివాల్వర్ లైసెన్సులు, పేలుడు సంబంధిత అనుమతుల లైసెన్సుల తనిఖీ ► భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు రద్దు కానున్న అధికారాలు ► సర్వే సబ్ డివిజన్ నంబర్ల జారీ ► ఉప్పు భూమి లీజులు, అద్దె వసూళ్లు ► సర్వే హద్దురాళ్ల తనిఖీ ► ఆక్రమణదారులకు బీ–మెమోల జారీ ► వ్యవసాయ, ఇళ్ల స్థలాల అసైన్మెంట్ ► హోమ్ స్టెడ్ యాక్ట్ కింద పట్టాల జారీ ► టెనెన్సీ యాక్డు -
రెవె‘న్యూ’ లుక్ వచ్చేనా!
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని సీఎం చేసిన ప్రకటనతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. గతేడాది లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతుతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తరచూ ప్రస్తావిస్తున్నా.. ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే, చట్ట రూపకల్పన కోసం రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం త్వరలోనే భేటీ అవుతారని, ఆ తర్వాత స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవినీతి శాఖగా అపఖ్యాతిని మూటగట్టుకున్న రెవెన్యూను సంపూర్ణంగా సంస్కరించాల్సిన అవసరముందని గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా.. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి ఆమోదముద్ర వేస్తామని తేల్చి చెప్పారు. చట్టాలపై సమాచారం: రెవెన్యూ వ్యవస్థకు సత్వర చికిత్స, కొత్త చట్టానికి రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలతో పాటు, కొత్త చట్టంలో ఎలాంటి సంస్కరణలు తేవాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారం సేకరించింది. ఇనామ్, అసైన్డ్, రక్షిత కౌలుదారు, ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కేటగిరీల భూములకు సంబంధించి చట్టాల అవశ్యకతపై ఇప్పటికే నివేదికలు కూడా తెప్పించుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయసేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ విశ్వవిద్యాలయం న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపింది. ఒకే గొడుగు కిందకు.. ఇప్పటివరకు మనుగడలో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీ ఒకడుగు ముందుకేసి ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడంతో ఇదే తరహా చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోంది. అయితే, ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తెలంగాణ ల్యాండ్రెవెన్యూ కోడ్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కోడ్తో ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఒకే చట్టం మనుగడలోకి రానుంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్దగా చట్ట స్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలనే కోణంలోనూ ఆలోచన చేస్తోంది. ఉద్యోగుల్లో గడబిడ! రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్లైన్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలను మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రద మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుదనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది. శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. ఉద్యోగుల్లో గడబిడ! రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్లైన్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలకు మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రథ మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుందనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది. శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. -
తెలంగాణ భూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమలుతోపాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం అమ ల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి ‘తెలంగాణ భూ చట్టం’గా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టం తీరుతెన్నులు ఎలా ఉండాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారాన్ని కోరింది. అసైన్డ్, ఇనాం, రక్షిత, కౌలుదారు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి కలె క్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంది. కొత్త చట్టం రూపకల్పనపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశం పైనా సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ముందు మూడు మార్గాలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తేవడంతోపాటు కాలం చెల్లిన వాటిని తొలగించడం, గజిబిజిగా ఉన్న చట్టాలను సరళతరం చేస్తూ ఒకే చట్టం తీసుకువస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్గౌడ్ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టడమేగాకుండా రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఫైలును ఢిల్లీకి పంపారు. తరువాత ఆ ఫైలు అటకెక్క గా రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ కోడ్ను రూపొందించాలనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ కోడ్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. ఈ రెండింటితోపాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్ధగా కొత్త చట్టం రూపొందించడం ఉత్తమమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు... కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల రెవెన్యూ సేవలకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే అంశంపై శాసనసభ సాక్షిగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలలో విలీనం చేయలా లేదా పనితీరు, మెరిట్ ఆధారంగా రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలా? అనే దానిపై కొత్త చట్టంలో స్పష్టత రానుంది. అలాగే బ్రిటిష్ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండటాన్ని తప్పుబడుతున్న సీఎం.. కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోదాల మార్పు కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. -
చర్చల తర్వాతే కొత్త రెవెన్యూ చట్టం అమలు
పంజగుట్ట: సమగ్ర చర్చల అనంతరమే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని పలు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘ప్రభుత్వం చేపట్టిన భూముల రికార్డుల సవరణ దాని పరిణామాలు’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కోదండరెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో వాస్తవ సాగుదారుల నుంచి భూమిని లాక్కుని భూస్వాములకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే కాలమ్ నంబర్ 16 తొలగించారన్నారు. భూప్రక్షాళన భవిష్యత్తులో రక్తపాతాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా భూరికార్డులను పరిశీలించే సీసీఎల్ఎను నియమించలేదన్నారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రెవెన్యూ భూవివాదాలను ఓ కమిటీ పరిష్కరించేదని, సదరు కమిటీ ఎన్నో కీలక అంశాలను బయటకు తీసుకొచి్చందని వాటిని అమలు చేసే లోపే తెలంగాణ ఉద్యమం వచి్చందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థనే తొలగిస్తానని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు.రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం తీసుకురావడం అవసరమే అయితే దీనికోసం విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్కుమార్లు మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఇప్పటికీ 8లక్షల 90వేల మందికి పాసు పుస్తకాలు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, రైతు సంఘం నాయకుడు నర్సింహ్మ రెడ్డి, నల్సార్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు సునీల్, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా, వివిధ సంఘాల, పారీ్టల నాయకులు చైతన్య పాల్గొన్నారు. -
తెరపైకి రెవెన్యూ కోడ్!
సాక్షి, హైదరాబాద్ : పాత రెవెన్యూ చట్టాలకు చెల్లు చీటి పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత చట్టాల స్థానే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 145 చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తోంది. ఇందుకనుగుణంగా ‘తెలంగాణ ల్యాండ్ రె వెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి చట్టం లేనట్లే? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించిన సీఎం..శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. అయితే రెవెన్యూ చట్టం ముసాయిదా తుది రూపునకు రాకపోవడంతో ప్రస్తుత సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టకపోవచ్చని తెలుస్తోంది. సీఎం.. సలహాలు, సూచనలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కలెక్టర్ల నుంచి ఎలాంటి నివేదికలు ప్రభుత్వానికి అందలేదు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం... బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు వసూలు చేసేందుకు నియమించిన కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్ల విధుల నిర్వహణలో పెద్ద తేడా లేకున్నా హోదా, పేరును పునర్నిర్వచించాలని యోచిస్తోంది. ఇది కేవలం కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీవో, తహసీల్దార్లకు కూడా వర్తింపజేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే కిందిస్థాయిలోని వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇదివరకే సీఎం సంకేతాలిచ్చారు. ఈ వ్యవస్థను రద్దు చేయడమో లేదా ఇతర శాఖల్లో విలీనం చేయడం ద్వారానో క్షేత్రస్థాయిలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి తీరుపై వీఆర్వోలు ఇప్పటికే ఉద్యమబాట పట్టారు. మరోవైపు భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా శాశ్వత పరిష్కారం కలగజేస్తూ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని భావిస్తున్న సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేíషిస్తోంది. భూ సమగ్ర సర్వే, టైటిల్ గ్యారంటీని అమలు చేయడమా లేక తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టడమా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. -
గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్ చట్టాల మార్పుపై ఈ సమావేశంలోచర్చించినట్లు తెలుస్తోంది. కాగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు రూపొందించాలంటూ ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో అవినీతి, లంచాల ఆరోపణలతో, ఈ శాఖలను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా శాఖల చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం గవర్నర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రాచపుండులా లంచం
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు లంచాలు ఎందుకివ్వాలి? లంచాలు లేని వ్యవస్థ కోసం పటిష్టమైన రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు రూపొందించాలి’అని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వాస్తవానికి అవినీతి మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయింది. చేయి తడపనిదే ప్రభుత్వ శాఖల్లో పనులు జరగడం లేదు. ప్రజల నిరంతర అవసరాలు ముడిపడి ఉన్న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా భూముల వ్యవహారాలు, పట్టణాల్లో ఉండే ప్రజల అవసరాలు చాలా కీలకమైనవి. ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు ధ్రువీకరించడం, సొంతింటి కలసాకారం చేసుకోవడం దగ్గర్నుంచి.. వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్లు ఇవ్వడం వరకు మున్సిపల్ వర్గాల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు కీలకం. చట్టాల ప్రకారం అయితే సామాన్యుడికి అవసరమైన ఏ పనైనా.. ఉచితంగా నిర్దిష్ట కాలపరిమితిలోపు చేసి పెట్టాల్సిన బాధ్యత అధికార వర్గాలది. కానీ, ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, పైస్థాయి అధికారుల ధన దాహం.. పేదోడి జేబు చమురు వదిలిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆవేదన, అభిప్రాయంతో ఈ అవినీతి, లంచాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో వృద్ధ దంపతుల భిక్షాటన, మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పెట్టిన ఫేస్బుక్ పోస్టు.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష జరగడంతో.. రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు వస్తాయోననే ఆసక్తి అందరిలో నెలకొంది. రెవెన్యూ, మున్సిపల్ వర్గాలపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, అపవాదు, వారు విమర్శలకు గురవుతున్న తీరుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. పైసలిస్తేనే పనయ్యేది! రెవెన్యూ శాఖలో అవినీతి తీవ్రంగా ఉంది. ఇందుకు వ్యవస్థీకృతమైన లోపాలతో పాటు అడ్డగోలు సంపాదనపై అధికారుల అత్యాశే కారణాలుగా కనిపిస్తున్నాయి. పనిని బట్టి, మనిషిని బట్టి, అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి రెవెన్యూ శాఖలో వసూళ్లు జరుగుతుంటాయనేది బహిరంగ సత్యమే. అందిన కాడికి గుంజుతారంటూ అధికారులపై చాలాసార్లు ఫిర్యాదులొచ్చాయి. అడిగినంత ఇవ్వకపోతే తిప్పించుకోవడం, సమయానికి ఇవ్వకపోవడం, ఉన్నతాధికారులను అడగాలని, కంప్యూటర్లు పనిచేయడం లేదని, పైనే అలా ఉంటే కింద మేమేం చేస్తామని, సర్వర్ డౌన్ ఉందని, పాసుపుస్తకాలు ప్రింటింగ్కు వెళ్లాయని, ఎమ్మార్వో లేడని, ఆర్డీవో పంపలేదని, జేసీ డిజిటల్ సంతకం కాలేదని రకరకాల సాకులు చెప్పటం పరిపాటిగా మారింది. అనుకున్నంత వసూలు చేసిన తర్వాతే.. పనిచేసి పెడతారనే విమర్శలున్నాయి. 50 పైసల ఫామ్కు 10రూపాయలు తీసుకోవడం, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము ఎక్కువ వసూలు చేస్తారనే అభియోగమూ రెవెన్యూ శాఖపై ఉంది. భూరికార్డుల ప్రక్షాళనతో.. రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. 2017 సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఇది తారస్థాయికి చేరింది. భూ–రికార్డులను పరిశీలించి రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా సంపాదించారనే ఆరోపణలు, విమర్శలున్నాయి. రైతుకు ఇవ్వాల్సిన యాజమాన్య హక్కుల కోసం ఎకరానికి 5 నుంచి 10వేల వరకు వసూలు చేశారని ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై.. రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా నిరసనలు, సిబ్బందిపై దాడులు చేసేంతవరకు కూడా వెళ్లింది. రైతుకు భూమే జీవనాధారం. ఆ భూమిపై తనకు హక్కు ఉంటేనే రైతుకు మనుగడ ఉంటుంది. తరాలుగా భూమితో రైతు పెంచుకుంటున్న మమకారాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది.. ఉన్నతాధికారుల పేరు చెప్పి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడడం గమనార్హం. ఎలుకలు పడ్డాయని..: రెవెన్యూ సంఘాలు ఇటీవల మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ యువకుడు భూమి పట్టాకోసం లంచం అడుగుతున్నారంటూ పెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయి.. సీఎం దృష్టికెళ్లింది. ఈ పోస్టింగ్కు స్పందించిన సీఎం నేరుగా ఆ యువకునితో మాట్లాడి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని, అప్పుడు ప్రజలంతా తనకు అండగా నిలబడాలని కోరారు. దీంతో రెవెన్యూశాఖను రద్దు చేస్తారనే ప్రచారం మొదలయింది. భూముల వ్యవహారాలన్నింటినీ రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారనే చర్చ మొదలయింది. ఇందులో నిజానిజాలను పక్కనపెడితే.. ఈ చర్చపై రెవెన్యూ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కొందరు చేసిన పనిని అందరికీ ఆపాదించడం.. ఏకంగా శాఖనే రద్దు చేయాలనే ఆలోచనపై మండిపడుతున్నాయి. ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? అని ప్రశ్నిస్తున్నాయి. రెవెన్యూ సేవలతో పాటు ఇతర శాఖలకు పనిభారాన్నీ తామే మోస్తున్నామని.. సమగ్ర కుటుంబ సర్వే, భూ–రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన తమపై అపవాదు వేయడం సరికాదంటున్నాయి. రెవెన్యూ వ్యవస్థ జవాబుదారీతనం కోసం రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపట్టాలని, ధరణి ప్రాజెక్టును తహశీల్దార్లకు అనుకూలంగా ఉండేలా మార్చాలని, అర్థరహితమైన ఆదాయ, కుల, తదితర ధ్రువపత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పురపాలికల్లో అవినీతి జాఢ్యం పురపాలికలు ‘అవినీతి’కి అడ్డాగా మారిపోయాయి. దశాబ్దాలుగా పట్టిన అవినీతి కంపు మున్సిపాలిటీలను వదలడం లేదు. అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం నూతన సంస్కరణలు, విధానాలను ప్రవేశపెట్టినా పరిస్థితిలో మార్పురావడం లేదు. నగర, పుర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, ఇతర సేవలందించాల్సిన పురపాలికలు.. కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతిధులు, అధికారుల అక్రమార్జనకు కేరాఫ్ అడ్రస్లుగా మారాయి. చేతులు తడపందే.. సామాన్యులకు కనీస అనుమతులు కూడా లభించడం లేదు. ఏ ధ్రువీకరణ పత్రం జారీ కాదు. ఏటా నగరపాలికలు, మునిసిపాలిటీల్లో జరిగే.. వందల కోట్ల విలువైన అభివద్ధి పనుల్లో ఏ మాత్రం నాణ్యత ఉండదు. ఎందుకంటే.. అక్కడ బినామీల ముసుగులో కీలకమైన పనులు, కాంట్రాక్టులు దక్కించుకునేది స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులే. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మునిసిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఆస్తి పన్నులు, ఇతరాత్ర పన్నులు, చార్జీలతో ఏటా పురపాలికలకు కోట్లలో ఆదాయం వస్తోంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందల కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి. వీటితో చేపట్టే ప్రతి అభివద్ధి పనిలో 25–30% కమీషన్లు వాటాల రూపంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలైతే.. తమ పరిధిలోని మునిసిపాలిటీల్లో జరిగే ప్రతిపనిలో 5% కమీషన్ను దర్జాగా దండుకున్నారు. పురపాలికల్లో కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు కావాలంటే మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కమిషనర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లకు కలిపి మొత్తం 25% కమీషన్లు ఇవ్వాల్సిందే. కాదు,కుదరదంటే.. ఏళ్లు గడిచినా ఆ కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కావు. పుట్టినా.. చచ్చినా! జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి గృహ నిర్మాణ అనుమతుల జారీ వరకు ప్రతి పనికీ యథేచ్చగా లంచాలు వసూలు చేస్తున్నారు. భవనాలు, లేఔట్ల నిర్మాణ అనుమతుల్లో అవినీతి నిర్మూలనకు మూడేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం’(డీపీఎమ్మెస్) కొద్దిరోజులకే నీరుగారిపోయింది. డీపీఎంఎస్ కింద ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే, 14 రకాల చార్జీలను విధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి స్థాయిని బట్టి 10వేల నుంచి 25 వేల రూపాయల వరకు మామూళ్లు తప్పవు. డీపీఎంఎస్ వచ్చిన తర్వాత కూడా ఇళ్ల అనుమతుల జారీకి లంచాలు స్వీకరిస్తూ కొందరు మునిసిపల్ అధికారులు ఏసీబీకి పట్టుబడడం ఇందుకు నిదర్శనం. ఇక ఆస్తుల మ్యుటేషన్లు, వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు, నల్లా కనెక్షన్, అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్నులపై పునఃసమీక్ష వంటి సేవలకు సైతం వందలు, వేలల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారు. టెండర్ వేయాలంటే భయం! జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వింత పరిస్థితి నెలకొని ఉంది. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కమీషన్ల వాటా ముట్టజెప్పనిదే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి వీల్లేదు. కాంట్రాక్టర్ అయితే వారి బినామీ ఉండాలి.. లేదా వారికి కోరినంత పర్సెంటేజీని ముట్టజెప్పాలి. కొన్ని పురపాలికల్లో బినామీలు తప్ప ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు టెండరు వేయడానికి వస్తే బెదిరింపులు, దాడులకు దిగుతారు. ఎవరైనా కొత్త కాంట్రాక్టర్లు వచ్చి పనులు ప్రారంభించినా, క్షణాల్లో స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రంగంలో దిగి.. మాకేంటి? అని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ కమీషన్ వాటా లభించకపోతే పనిని సజావుగా జరిగే ప్రసక్తే ఉండదు. ఇక పురపాలికల్లో చేపట్టే పనుల్లో నాణ్యత డొల్లగా మారింది. కోట్ల ఖర్చుతో వేసిన సీసీ రోడ్లు, మురికి కాల్వలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వేసిన చోటే పదేపదే రోడ్లు వేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లయితే వాటాల కోసం ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, భవన నిర్మాణాలను సైతం అడ్డుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వకుంటే అనుమతి లేకుండా భవన నిర్మాణం జరుపుతున్నారని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలుపుదల చేయిస్తారు. దీంతో బాధితులు ఎంతోకొంత సెటిల్మెంట్ చేసుకుని పనిచేసుకుంటున్నారు. కాగ్ నివేదికలు బుట్టదాఖలు! మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల అవినీతిపై కాగ్ సమర్పించిన నివేదికలు బుట్టదాఖలయ్యాయి. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కాగ్ నిర్థారించినా బాధ్యులపై చర్యలు చేపట్టలేదు. అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్న అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ చేసి శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో వందల మందిపై విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం. విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్నా ఇటీవల కాలంలో కొందరికి పదోన్నతులు రావడం విమర్శలకు దారితీసింది. తీవ్ర ఆరోపణలున్న ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని కేసులనుంచి తప్పిస్తున్నారని పురపాలక శాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తే కొంత వరకు పరిస్థితిలో మార్పు రావచ్చు. రెండేళ్లుగా పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా ‘జాల గ్రామంలోని 330 సర్వే నెంబర్లో 20 గుంటల భూమి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది. కొంతకాలం సేద్యం చేసిన. కానీ వర్షాలు రాకపోవడంతో ఉపాధి కోసం పదేళ్లు హైదరాబాద్లో ఉండి వచ్చిన. 2017 నవంబర్లో రెవెన్యూ అధికారులు నాకు 1–బీ ఫారం ఇచ్చిండ్రు. కానీ, ఇప్పటిదాకా పాసుపుస్తకం ఇయ్యలేదు. వీఆర్వోను అడిగితే.. నాకు భూమి లేదని.. వేరేవాళ్లకు అమ్ముకున్నానని అంటున్నడు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రేపు, ఎల్లుండి అనుకుంట చెబుతున్నరు’– కోటగిరి మాలమణి, జాల గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా భూమి ఒకరిది.. పరిహారం మరొకరికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో భూసేకరణలో భాగంగా విద్యుత్ సబ్స్టేషన్ కోసం అవారి లచ్చవ్వ అనే మహిళ భూమిని సేకరించారు. ఆమెకు సర్వే నంబరు 227లో 20 గుంటల భూమి ఉంది. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనుల్లో ఈ మొత్తం భూమి పోయింది. లచ్చవ్వకు పరిహారంగా రూ.3.25 లక్షలు రావాల్సి ఉంది. కానీ.. ఆ డబ్బులను ఈ భూమితో ఏమాత్రం సంబంధం లేని మేచినేని మనోహర్రావు పేరుతో రెవెన్యూ అధికారులు చెక్కు జారీ చేశారు. లచ్చవ్వ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే పొరపాటు జరిగిందని చెప్పారు. కానీ.. ఇంతవరకు పరిహారం రాలేదు. డబ్బులు అడిగితే ప్రామిసరీ నోటు చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు రొడ్డరాజం. ఈయనది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, వేంపల్లి. తన భూమిని పట్టాచేయాలని రెండేళ్ల కిందట వీఆర్వో ఆంజనేయులును కలిశాడు. పట్టాచేయాలంటే రూ.32,000 ఇవ్వాలని వీఆర్వో డిమాండ్చేశాడు. భూమి పట్టా చేతికొస్తుందని ఆశతో రొడ్డరాజం అడిగినంతా ముట్టజెప్పాడు. నెలలు గడుస్తున్నా పట్టా కాకపోవడంతో వీఆర్వోను నిలదీశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. దీంతో వీఆర్వో 32 వేలకు ప్రామీసరి నోటు రాసిచ్చి చేతులు దులుపుకోవడంతో రైతు లబోదిబోమన్నాడు. ఇలాగా ఆ గ్రామంలోని దాదాపు వందమంది రైతుల నుంచి సదరు వీఆర్వో లక్షలు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టర్ ఇతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పైసలు ముడ్తెనే పాస్పుస్తకం! ‘వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామం మాది. మా మామయ్య మేక నారాయణ రెడ్డి పేరుతో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మామయ్య కొద్దిరోజుల క్రితం మరణించడంతో అత్తమ్మ మేక రాజమ్మ పేరుమీదకి మార్చి పాసుపుస్తకం ఇవ్వాలి. కానీ, వీఆర్వో ఆర్నెల్లు తప్పించుకున్నడు. కలెక్టరేట్ గ్రీవెన్స్లో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు డబ్బులు ఇస్తెనే.. పాసుపుస్తకం, రైతు బంధు చెక్ ఇచ్చారు’– రవీందర్రెడ్డి, రైతు, వరంగల్ అర్బన్ జిల్లా అనుమతుల కోసం వసూలు ‘నాకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డులో 126గజాల స్థలముంది. అక్కడ ఇల్లు కట్టేందుకు అన్ని అనుమతులు తీసుక్నున్నాను. అయితే ఇల్లు కడుతుండంగనే.. ఆ స్థలానికి 3–5–55, 3–5–56 ఇంటి æనెంబర్లతో పన్నులు చెల్లించాలని నోటీసులు పంపారు. నిర్మాణ దశలో ఉండగా ఇంటిపన్ను ఎలా ఇస్తారని అడిగితే గతంలో ఇక్కడ ఇల్లు ఉందని, 3–5–55 ఇంటి నెంబర్ మీద రూ.6,244 పన్ను వసూలు చేశారు. అది చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టుకునేందుకు అనుమతించారు’– మందుల వెంకట్రాంనర్సయ్య, మహబూబాబాద్. సైనికుడినీ వదల్లేదు ఈ ఫోటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామానికి చెందిన బాలగాని ప్రవీణ్కుమార్. 63 రాష్ట్ర రైఫిల్స్, కాలకూట్, జమ్మూలో జవాన్గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి పేరు మీద విస్నూరు గ్రామంలోని 4 సర్వేనంబర్లలో 12.17 ఎకరాల భూమి ఉంది. భూమి విస్తీర్ణం తక్కువగా ఉందని కొలత కోసం మండల సర్వేయర్కు దరఖాస్తు చేస్తే డబ్బులు ఇస్తేనే చేస్తానని డిప్యూటీ సర్వేయర్ నాంపల్లి శ్రీనివాస్ తెగేసి చెప్పాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్వేయర్కు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్న ఆ జవాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ అడిగిన రూ.10 వేలు తీసుకుని జనగామ జిల్లా కేంద్రంలో ఇస్తుండగా ఏసీబీకి అప్పగించాడు. శ్రీనివాస్ మీద కేసు నమోదైంది. ఫొటోలో కన్పిస్తున్న ఈ దంపతుల పేరు దేవేంద్రప్ప, శకుంతల. వీరిది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం. మాచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 246లో దేవేంద్రప్ప పేరున 2.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఇప్పటికీ వీళ్లే సాగు చేస్తున్నారు. అయితే 2013లో ఈ భూమిని పట్టాదారులతో సంబంధం లేకుండా.. అప్పటి తహసీల్దార్ అదే గ్రామానికి చెందిన జానకమ్మ పేరున మార్పు చేస్తూ, ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న దేవేంద్రప్ప తన భూమిని తనకు తెలియకుండా జానకమ్మ పేరున ఎలా మార్చుతారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యతో కలిసి గట్టు తహసీల్దార్ కార్యాలయం ఎదుట న్యాయపోరాటానికి దిగినా ఫలితం లేకుండాపోయింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకునే జానకమ్మ పేరిట ప్రొసీడింగ్ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
లంచాలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు మరింత బాగా సేవలందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలన్నారు. కలెక్టర్/జిల్లా పరిపాలనాధికారి(ఐఏఎస్) నాయకత్వంలో అడిషనల్ కలెక్టర్/అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వంటి అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు (అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ బృందం ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చట్టం కఠినంగా ఉండాల్సిందే.. ‘ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు గొప్ప బాధ్యతలేవీ లేవు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలకు పనులు జరగాలి. రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలను తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకపోతేనే.. ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది. నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అని పిలవాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లేఔట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది’అని కేసీఆర్ సూచించారు. మౌలిక వసతులపై ఎక్కువ దృష్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దష్టి పెట్టాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం (శ్మశానం) నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి. తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతోంది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, వి.శ్రీనివాస్గౌడ్, లోక్సభ సభ్యులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, టి.భానుప్రసాద్రావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్రావు, సునీల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావు పాల్గొన్నారు. అడిషనల్ సీఎస్లను నియమించాలి : కేసీఆర్ జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఎస్లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఈ బృందం ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలి. -
అవినీతి పెరిగిపోయిందంటూ కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని సూచించారు. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలవబడే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని పిలవబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు(అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. ప్రజలకు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావల్సిన పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉంది’ అని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ‘జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సిఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సిఎస్ లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సిఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, సునిల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూ ప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.350 కోట్ల భూమి.. అక్రమార్కుల పరం!
ఓటేరు చెరువు భూ కుంభకోణంలో అక్రమార్కులకు క్లీన్చిట్ 17.18 ఎకరాలు ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చిన విచారణాధికారి రెవెన్యూ రికార్డులు తప్పులతడకేనని చెప్పకనే చెప్పిన వైనం కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక సమర్పించిన డీఆర్వో శేషయ్య నేడోరేపో తుది నిర్ణయం జారీ ఓటేరు చెరువు భూకుంభకోణం మరో మలుపు తిరిగింది. ఆ కుంభకోణంపై విచారణ చేస్తున్న డీఆర్వో శేషయ్య అక్రమార్కులకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలోని సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల భూమి ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చారు. ఈ మేరకు అక్రమాలకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ సర్వే నెంబరు పరిధిలోని భూమి చెరువు శిఖం అని పేర్కొన్న రెవెన్యూ రికార్డులన్నీ తప్పుడువని చెప్పకనే చెప్పారు. ఈ నివేదికపై నేడో రేపో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. తిరుపతి : రెవెన్యూ చట్టంలో లొసుగులను అస్త్రంగా చేసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలో సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల ఓటేరు చెరువు శిఖం భూమిని కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఎప్పటికప్పుడు పార్టీలు మార్చే ఆ మాజీ ఎమ్మెల్యే కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన పంచన చేరి ఆ భూమికి పట్టాదారు పాసుస్తకాలు ఇచ్చేలా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనాతో ఉత్తర్వులు జారీచేయించుకున్నారు. ఎన్నికలకు ముందు సైకిలెక్కి చంద్రబాబుతో జతకట్టి కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లి.. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి రూ.350 కోట్ల విలువైన 17.18 ఎకరాల చెరువు శిఖం భూమిని బినామీల ద్వారా ఆ మాజీ ఎమ్మెల్యే సొంతం చేసుకోవడంపై జూలై 16న ఁభూదోపిడీ*.. జూలై 17న ఁఆంతర్యమేమిటి రామచంద్రా..?* అంటూ వరుస కథనాల ద్వారా ఁసాక్షి* వెలికితీసింది. ఈ కుంభకోణంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్రెడ్డి కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కలెక్టర్.. ఓటేరు చెరువు భూకుంభకోణంపై డీఆర్వో శేషయ్యను విచారణకు ఆదేశించారు. తిమ్మిని బమ్మిని చేసి.. రెవెన్యూశాఖకు ఏ-రిజిష్టరే ప్రామాణికం. బ్రిటీషు ప్రభుత్వం హయాంలో 1886లో తొలిసారి భూములను సర్వే చేసి ఏ-రిజిష్టర్ రూపొందించారు. 1886 ఏ-రిజిష్టర్ ప్రకారం తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలోని 377 సర్వే నెంబరులో 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం. బ్రిటీషు ప్రభుత్వం 1916లో మరోసారి భూములను సర్వే చేసింది. ఆ సర్వే చేసినప్పుడు ఆ భూమిని ప్రభుత్వ బంజరుగా తప్పుగా పేర్కొనడాన్ని పసిగట్టిన అప్పటి చంద్రగిరి సబ్ కలెక్టర్ రీ-సర్వే చేసి 1925లో చెరువు శిఖంగానే తేల్చి ఏ-రిజిష్టర్లో పొందుపరిచారు. ఇందుకు సంబధించిన రికార్డులు ఇప్పటికీ తిరుపతి రూరల్ తహశీల్దార్, తిరుపతి ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో పదిలంగా ఉన్నాయి. ఈ చెరువు భూ వివాదంపై పలు కోర్టుల్లో రెవెన్యూ అధికారులు అఫిడవిట్లు దాఖలు చేసేటప్పుడు ఆ భూమిని చెరువు శిఖంగానే పేర్కొన్నారు. ఇదే భూవివాదంపై ఫిబ్రవరి 12న అప్పటి కలెక్టర్ రాంగోపాల్ పంపిన నివేదికపై రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పందిస్తూ.. ఁభూమి రికార్డులకు తక్కిన రికార్డులకన్నా ఏ-రిజిష్టరే ప్రామాణికం. ఏ-రిజిష్టర్లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయండి* అని ఆదేశిస్తూ మే 22న ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. మే 22 బీఆర్.మీనా జారీచేసిన ఉత్తర్వులను రెవెన్యూ అధికారులు వక్రీకరించారు. 1886, 1925 ఏ-రికార్డులను ప్రామాణికంగా తీసుకోని రెవెన్యూ అధికారులు.. 1916 రికార్డులనే ప్రామాణికంగా తీసుకుని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని తేల్చారు. ఆ భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకు కట్టబెట్టారు. ఇదేంటి శేషయ్యా..? ఓటేరు భూకుంభకోణంపై కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు డీఆర్వో శేషయ్య విచారణ చేశారు. విచారణలో 1886, 1925 ఏ-రికార్డులను శేషయ్య ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించలేదు. కేవలం 1916 రికార్డులనే పరిగణనలోకి తీసుకున్న శేషయ్య.. సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకే చెందుతుందని తేల్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేయడంలో కూడా తప్పులేదని తేల్చారు. ఆ మేరకు కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక కూడా ఇచ్చేశారు. శేషయ్య ఆ మేరకు నివేదిక ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. సీఎంవో కార్యాలయం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెప్పించి.. శేషయ్యతో తప్పుడు నివేదికను కలెక్టర్కు ఇప్పించారనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. శేషయ్య నివేదికపై కలెక్టర్ ఆమోదముద్ర వేయడమే తరవాయి.. రూ.350 కోట్ల విలువైన భూమి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సొంతమవుతుందన్న మాట. కలెక్టర్కు నివేదిక ఇచ్చా : డీఆర్వో శేషయ్య తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలోని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదు. ఆ భూమి డి.వెంకట్రామనాయుడు తదితరులకు చెందినదే. ఆ మేరకు వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు* అని డీఆర్వో శేషయ్య ఁసాక్షి*కి చెప్పారు. 1886, 1925 సర్వేల మేరకు ఏ-రికార్డుల్లో అది చెరువు శిఖం భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు కదా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. నివేదికను కలెక్టర్కు ఇచ్చానని.. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేని సెలవిచ్చారు.