Samarlakota
-
సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర
-
మా జగనన్నకు అడ్డుకట్ట వేయలేరు
-
సామర్లకోట లో లాడ్జ్ బాయ్ను చితక్కొట్టిన యువకులు
-
నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆపన్న హస్తం
-
జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం
-
పేదల సొంతింటి కలను మనం సాకారం చేశామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అక్కచెల్లెమ్మల కళ్లల్లో సంతోషాన్ని చూస్తున్నా..
రాష్ట్రంతో బాబు బంధం ఇదీ.. ‘‘ఆ పెద్దమనిషి చంద్రబాబుకు రూ.వేల కోట్ల సంపద ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో సైతం పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా ఇవ్వలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు సీఎంగా చేశాడు. ఆయనకు ప్రజల మీద, రాష్ట్రం మీద, చివరికి కుప్పం మీద గానీ అభిమానం, అనురాగం, బాధ్యత లేదు. రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు ఇల్లు పక్క రాష్ట్రం హైదరాబాద్లో కనిపిస్తుంది. అదీ ఈ రాష్ట్రంతో ఆ పెద్దమనిషికి ఉన్న అనుబంధం. కుప్పంలో దాదాపు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు, 8 వేల గృహ నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పేదవాడి గడపకు మంచి జరిగిందంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే’’ – సామర్లకోట సభలో సీఎం జగన్ సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘నిరుపేద అక్కచెల్లెమ్మల కళ్లల్లో ఎనలేని సంతోషాన్ని చూశా. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగని మహాయజ్ఞం పేదల సొంతింటి కలను మనం సాకారం చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 31 లక్షల కుటుంబాల్లో అంటే రాష్ట్ర జనాభాలో 20 శాతం పైచిలుకు ఉన్న ఇళ్లు లేని నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయపడ్డా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి మంచి చేశాం. దేవుడి దయతో నా పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. కాసేపటి క్రితం ఇక్కడ కాలనీలలో ఇళ్లను చూశా. అవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెబుతున్నా. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మీ బిడ్డగా మీతో ఆనందాన్ని పంచుకుంటున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలి విడతగా 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ లేఅవుట్లో జరిగిన పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సభలో లబ్ధిదారులైన మహిళలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడిని ఇంతకన్నా ఏం అడగగలను? మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 5.85 లక్షల సాధారణ ఇళ్లు, టిడ్కో కింద మరో 1,57,566 లక్షలు కలిపి మొత్తం సుమారు 7.43 లక్షల గృహాల నిర్మాణాన్ని ఇప్పటివరకు పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 14,33,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రతి పేదవాడి ముఖంలోనూ, అక్కచెల్లెమ్మల ముఖంలోనూ చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని నేను ఇంతకన్నా ఏం అడగగలను? దేవుడు నాచేత పేదింటి అక్కచెల్లెమ్మలకు ఇంత మంచి చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. సామర్లకోటలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను చూశా. ఆ ఇళ్లను చూసి లే అవుట్లో నాన్న గారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి స్థలం ధర ఎంత ఉందని దొరబాబును (హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) అడిగా. కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ.12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు. అక్కడ 54 ఎకరాల లేఅవుట్లో పేదలకు 2,412 ఇళ్ల స్థలాలిచ్చాం. ఇప్పటికే వెయ్యికిపైగా ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు చేశారు. రూ.32 వేల కోట్లతో కనీస వసతులు.. రాష్ట్రంలో 21.76 లక్షల గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు రూ.2.70 లక్షలు. ఇందులో రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు వచ్చేటట్టు చేశాం. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. దాని విలువ మరో రూ.15 వేలు ఉంటుంది. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి అంతా కూడా ధర తగ్గించి ఇవ్వడం వల్ల ప్రతి అక్కచెల్లెమ్మకు మరో రూ.40 వేల దాకా మేలు జరుగుతోంది. మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలవుతుంది. ఇంటి స్థలం, ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు డ్రెయినేజీ, రోడ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కోసం మరో రూ.32 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం. మనసున్న ప్రభుత్వం... ఇంతకు ముందెప్పుడూ జరగనిది ఈరోజు జరుగుతోందంటే అందుకు కారణం.. కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి మధ్య తేడా చూడండి. నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది. మీపట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరిది కాబట్టే ప్రతి అక్కచెల్లెమ్మకూ ఒక శాశ్వత చిరునామా ఉండాలని అనుకున్నా. ఆ శాశ్వత చిరునామా విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికీ పరిష్కారాన్ని చూపుతూ ఈ 52 నెలలుగా పరిపాలన సాగింది. పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపనపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇలాంటి మనసు గత పాలకులకు లేదు. 2014–19 మధ్య చంద్రబాబు పాలన చూస్తే పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. తేడాను మీరే ఒకసారి గమనించండి. రాక్షసులు యాగాలను భగ్నం చేసినట్లుగా.. బుుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారని విన్నాం. అలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నప్పుడు, అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తపనతో అడుగులు వేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు వాటిని అడ్డుకుంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని అవరోధాలు తలెత్తాయో మీకు తెలుసు. ఒకవైపు చంద్రబాబు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయగా మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ కారణంగా రాష్ట్రానికి రెండేళ్ల పాటు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్ను ఎదుర్కొనేందుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. అయినా కూడా మీ బిడ్డ ఎక్కడా సాకులు చెప్పలేదు. కారణాలు వెతకలేదు. మీ బిడ్డ కింద మీదా పడి ఏదో ఒకటి చేశాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో అడుగులు వేశాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలలో దాదాపు 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 7.43 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల కోసం ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 72 వేల ఎకరాలను సేకరించి 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటి మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం కనీసం రూ. 2.5 లక్షలతో మొదలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా కనిపిస్తోంది. కనీసం రూ.2.50 లక్షలే అనుకున్నా దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాల రూపంలో సుమారు రూ.75 వేల కోట్లు విలువైన స్థిరాస్తిని నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాల రూపంలో ఇవ్వగలిగాం. ఇళ్ల పట్టాలివ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటా. పేదలపై ప్రేమ, బాధ్యతతో 35 కార్యక్రమాలు ఒక్క ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణమే కాదు.. నవరత్నాల్లోని ఏ పథకాన్ని చూసినా, డీబీటీని తీసుకున్నా అంతే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు భరోసా.. ఇలా రాష్ట్రంలో 35 పైచిలుకు కార్యక్రమాలు మన ప్రభుత్వంలో అమలవుతున్నాయి. పేదవాడి మీద ప్రేమతో, వారి జీవితాలు మారాలి, మార్చాలనే తపన, తాపత్రయంతో 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడూ ఇలా పేదల మీద ప్రేమ, బాధ్యత చూపలేదు. కాబట్టే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా సొంత ఇళ్లు లేని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. నాడు కూడా ఇదే రాష్ట్రం, కేవలం సీఎం మాత్రమే మారాడు. ఇవాళ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. -
సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
దొరబాబు గురించి సీఎం జగన్ మాటల్లో
-
కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లు
-
పేదల పాలిట దేవుడు మా జగనన్న
-
సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలపై, పేదలమీద బాబుకు ఏమాత్రం ప్రేమ లేదని దుయ్యబట్టారు. నెలరోజులు వరుసగా రాష్ట్రంలో ఉన్నారా? జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించాడా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వాళ్లెవవరికి ఇక్కడ సొంతిల్లు లేదు చంద్రబాబు, లోకేష్, ఆయన బావమరది బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంతిల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఆయన దత్తపుత్రిడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్లోనే ఉందని తెలిపారు. ప్యాకేజీ స్టార్కు ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని అన్నారు. ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై ఉన్న గౌరవమంటూ చురుకలంటించారు. చదవండి: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్ ఓట్లను హోల్సేల్గా అమ్ముకునేందుకే ‘వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. ఎల్లో బ్యాచ్కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది హైదరాబాద్లో పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్సేల్గా అమ్ముకునేందుకే అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్. షూటింగ్ గ్యాప్లలో రాష్ట్రానికి వస్తుంటాడు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి రాజకీయాలు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడెందుకు చేయలేకపోయారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు. ప్రతి నెల 1వ తారీకే ఇంటింటికి పెన్షన్లు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం దిశ యాప్తో మహిళలకు అండగా నిలిచాం. ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 రోగాలకుపైగా విస్తరించాం. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. 2.07 లక్షల ఉద్యోగాల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. చంద్రబాబు పేరు చెబితే గుర్చొచ్చేది స్కాంలే. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తొస్తుంది.’ అంటూ చంద్రబాబు, పవన్లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. -
రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్ -
సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లు ప్రారంభం (ఫొటోలు)
-
సామర్లకోట చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
Live: సామర్లకోట జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాలు
-
చంద్రబాబు, పవన్, బాలకృష్ణకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Updates.. ఎల్లో బ్యాచ్కు స్ట్రాంగ్ కౌంటర్.. సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది. ప్యాకేజీ స్టార్కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్లో దోచుకున్నది పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్సేల్గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్. సినిమా షూటింగ్స్ లేని టైమ్లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. సీఎం జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. సీఎం జగన్ మాట్లాడుతూ.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. ►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం. ►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. ►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. ►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ►రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నాం. ►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం. ►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ►పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ►తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. ►మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. ►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. ►మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయి. ►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. ►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ►సామర్లకోటలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. ►జోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ► జగనన్న కాలనీలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్. ► పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను అందించిన సీఎం జగన్. ► జగనన్న కాలనీని పరిశీలించిన సీఎం జగన్ ► కాసేపట్లో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సీఎం జగన్ బహిరంగ సభ. ► సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న సీఎం జగన్ ►సీఎం జగన్ సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. Stunning Visuals of #YSRJaganannaColonies to be launched by CM @ysjagan today at Samarlakota in Kakinada. 🏠 ✨💫 Samarlakota YSR Jagananna Colony is one of the largest housing colonies undertaken by the government, with the completion of approximately 2,000 housing units.… pic.twitter.com/DJ1alSIPuN — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 ►సామర్లకోటకు బయలుదేరిన సీఎం జగన్ ►రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. ►కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. ►మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా సామర్లకోటలో లబ్ధిదారులకు అందించనున్న ఇళ్ళ విజువల్స్. #YSRJaganannaColonies pic.twitter.com/1hb1PEI53I — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 అడ్డంకులను అధిగమిస్తూ.. ►రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ►ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి ►పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది -
సీఎం జగన్ కు లబ్దిదారుల కృతజ్ఞతలు
-
అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం సీఎం వైఎస్ జగన్ సాకారం
-
పేదింటి పండుగ.. నేడు సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనేది ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం. వారి తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీన్ని సాకారం చేస్తూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో గురువారం పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో సరిపుచ్చకుండా మరో అడుగు ముందుకు వేసింది. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం చేస్తున్నారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధి చేకూరుస్తున్నారు. వసతుల రూపంలో మరో రూ.1.5 లక్షలు ఉచితంగా స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరుస్తూనే ప్రతి ఇంటికి ఉచితంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మరో రూ.1.70 లక్షల మేరకు అదనపు లబ్ధిని ప్రభుత్వం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రైన్లు, రోడ్లు లాంటి సకల వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. పార్కులు.. జిమ్.. కళ్లు చెదిరే కాలనీ! పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కులు.. వ్యాయామం కోసం జిమ్ సదుపాయాలతో కాకినాడ జిల్లా సామర్లకోట–ప్రత్తిపాడు రోడ్డులో అందంగా రూపుదిద్దుకున్న జగనన్న కాలనీని చూస్తే కళ్లు తిప్పుకోలేరు! లే అవుట్ అభివృద్ధికి ఏకంగా రూ.15 కోట్లు కేటాయించారు. రూ.4 కోట్లతో విద్యుత్తు సబ్ స్టేషన్, మూడు అంగన్వాడీ కేంద్రాల భవనాలను నిర్మించారు. పిల్లలకు ఆహ్లాదం కోసం ఏకంగా ఏడు పార్కులను నిర్మించడం విశేషం. ఇందులో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కులు కూడా ఉన్నాయి. సామర్లకోట ఈటీసీ లేఆవుట్లో సుమారు 52 ఎకరాల్లో 2,412 మందికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశారు. 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. షేర్వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మాణాలను పూర్తి చేశారు. కాలనీలో ఇళ్లను సీఎం జగన్ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్ను కూడా తిలకిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నవరత్నాలు–పేదలకు ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన జగనన్న ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. – సామర్లకోట -
12న సామర్లకోటకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సామర్లకోట 54 ఎకరాల్లో జగనన్న కాలనీల నిర్మాణం
-
కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. (వడ్డే బాలశేఖర్ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది. 17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్ సమకూర్చారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో.. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్రూమ్, వరండా, స్టేర్ కేస్ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ నిర్మిస్తోంది. ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు అందచేస్తోంది. 5న సామర్లకోట లే అవుట్లో ఇళ్లకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్ జైన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. తిరగకుండానే మంజూరైంది.. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. – సూర్య భాస్కర్ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా దశాబ్దాల కల నెరవేరింది.. మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. – లంక లక్ష్మి, వైఎస్సార్–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు.. నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. – వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. – దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ప్రొఫెసర్ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం -
ఒక నిమిషం ఆగనున్న రైలు
సాక్షిప్రతినిధి,కాకినాడ: రైళ్లలో తాజాగా వందే భారత్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ఖరీదెక్కువైనా సమయం కలిసి వస్తుండటంతో ఎగువ మధ్య తరగతి వర్గాలు తగ్గేదే లేదంటూ జై వందే భారత్ అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో మాత్రమే ఇప్పటివరకూ ఈ ట్రైన్ ఆగుతుంది. కాకినాడ జిల్లాలో రైల్వేపరంగా కీలకమైన సామర్లకోట జంక్షన్లో దాదాపు చాలా సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతున్నా వందేభారత్ మాత్రం ఆగదు. ఇక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన చెందేవారు. గురువారం నుంచి వీరి వేదన తొలగిపోనుంది. సామర్లకోట రైల్వే జంక్షన్లో హాల్టుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన వారిలో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది. గురువారం తొలిసారి ఆగనున్న సందర్భంగా వందేభారత్కు ఘనంగా స్వాగతించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్–విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు స్టేషన్లో ఒక నిమిషం ఆగుతుంది. ఇక్కడి హాల్టుతో రాజమహేంద్రవరానికి రెండు గంటలు వ్యయ ప్రయాసలు పడి అటు కోనసీమ, ఇటు కాకినాడ జిల్లాల ప్రయాణీకులు రైలు ఎక్కుతున్నారు. ఆరంభం నుంచి డిమాండ్ ప్రారంభం నుంచి వందే భారత్కు సామర్లకోట జంక్షన్లో హాల్ట్ కావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విశాఖపట్నం–విజయవాడ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణీకులు కాకినాడకు వెళ్లాలంటే సామర్లకోట జంక్షన్లో రైలు దిగాలి. మెట్ట ప్రాంత మండలాల నుంచి సామర్లకోట వచ్చి విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు ప్రయాణిస్తుంటారు. ఈ ప్రాంత ప్రయాణీకులతో పాటు మైదాన ప్రాంతంలోని కాకినాడ, తుని, పిఠాపురం పట్టణ ప్రయాణికులు కూడా సామర్లకోటలో హాల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత మనోభావాలను ఎంపీ వంగా గీత కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విన్వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లారు. మంత్రి సానుకూల స్పందన ఫలితంగా రైల్వేబోర్డు హాల్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 48 గంటల వ్యవధిలోనే ఆమోదం లభించడంతో ప్రయాణీకుల సంతోషపడుతున్నారు. ఆ లోటు భర్తీ అయ్యేనా సామర్లకోట రైల్వే జంక్షన్ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా రోజుకు 80 (ఆప్ అండ్ డౌన్) ఎక్స్ప్రెస్రైళ్ళు రాక పోకలు సాగిస్తున్నాయి. వీటిలో 50 సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్లే కావడం విశేషం. మిగిలినవి ఎక్స్ప్రెస్ రైళ్లు. రోజూ ఈ జంక్షన్ నుంచి ఏడెనిమిది వేల మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అంచనా. ప్రస్తుతం వందేభారత్ రైలులో ఉమ్మడి జిల్లా నుంచి రోజూ 350 మంది ప్రయాణిస్తున్నారు. అయినా రైలులో సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. సామర్లకోట జంక్షన్లో హాల్డ్కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆ లోటు భర్తీ అవుతుందని రైల్వే అధికారులు విశ్వసిస్తున్నారు. ఇకపై రాజమహేంద్రవరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే సామర్లకోట హాల్ట్తో తమకు వందేభారత్ అందుబాటులోకి వస్తోందని కాకినాడ జిల్లా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటలు తగ్గుతుందని ఆసక్తి చూపుతున్నారు. హాల్ట్కు సర్వం సిద్ధం వందేభారత్ హాల్ట్ సామర్లకోట జంక్షన్కు ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇక్కడ ఆగేది ఒక్క నిమిషమే. ఈ సమయాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలి. సామర్లకోటలో హాల్ట్కు ఆమోదం లభించడంతో ఇప్పటికే హాల్ట్ ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణ సమయాల మార్పును ప్రయాణీకులు గమనించాలి.– ఎమ్ రమేష్, స్టేషన్ మేనేజర్.సామర్లకోట. వందేభారత్ (20833) వేళలు ఇలా ఈ రైలు విశాఖ నుంచి సామర్లకోటకు ఉద యం 7–14గంటలకు చేరుకుంటుంది. 7–15 గంటలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2–15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి 20834నంబర్తో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9–34 గంటలకు సామర్లకోట చేరుకుంటుంది. నిమిషం తర్వాత తిరిగి బయలుదేరి విశాఖ వెళుతుంది. -
పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర పట్ణణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘అర్బన్ హౌసింగ్ కాన్క్లేవ్’లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ మునిసిపల్ కౌన్సిల్గా సామర్లకోటకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి హరదీప్సింగ్ పురీ చేతుల మీదుగా ఏపీ టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ గురువారం అందుకున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాన్క్లేవ్లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్లు, వైఎస్సార్, జగనన్న కాలనీల స్టాల్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
ఊళ్లల్లో కనుమరుగవుతున్న మెకానిక్ దుకాణాలు.. అదే కారణమా!
సామర్లకోట(కాకినాడ జిల్లా): భార్యా పిల్లలతో ఏ శుభ కార్యానికో, వ్యాహ్యాళికో వెళ్తున్న వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం ఏదో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కనుచూపు మేరలో మెకానిక్ షాపులు లేవు. భార్య బిడ్డలను ఆటోలో చేరాల్సిన చోటుకు పంపి అతడి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు. రెండు మైళ్లు చెమటోడ్చి వెళ్లాక.. ఏవో చిన్న పరికరాలు పెట్టుకుని ఓ చిన్న బండికి మరమ్మతు చేస్తున్నాడు 60కి దగ్గరలో ఉన్న వ్యక్తి. అసలే గ్రామీణ వాతావరణం. ఆపై మొండిగా తిరిగే బళ్లు. నట్లు, బోల్టులు పట్టేశాయి. వాటిని విప్పడానికి అతని శక్తి చాలడం లేదు. సత్తువ ఉన్న సహాయకుడు ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. అదీ లేదు. బండిని తోసుకు రావడంతో సోష వచ్చి అక్కడే కూలబడ్డాడు వెంకటేశ్వర్లు. ఎప్పటికైతే అప్పుడే అవుతుందని కూర్చున్నాడు. ఇదీ ప్రస్తుతం మెకానిక్ దుకాణాలు, వాహన చోదకుల పరిస్థితి. సామర్లకోట మండల పరిధిలో సుమారు 70 వరకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులు ఉన్నాయి. వీటిలో 20 షాపుల్లో మాత్రమే హెల్పర్లు ఉండగా, మిగిలిన వాటిలో దుకాణ యజమానులే మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఆ 50 మందిలో 30 మంది 50 ఏళ్లు దాటిన వారే. చేసే ఓపిక లేకపోతే ఇంట సేదతీరడం తప్ప మరో పని చేయలేని పరిస్థితి వారిది. గతంలో ఏ మెకానిక్ దుకాణం చూసినా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు సహాయకులుగా ఉండి బళ్ల మరమ్మతులు నేర్చుకునేవారు. చురుకైనవారైతే ఏడాదిలోనే పని నేర్చేసుకుని వేరే దుకాణం పెట్టేసేవాడు. మళ్లీ అతడి దగ్గరకి సహాయకులు చేరిక.. ఇలా సాగేది. నేటి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. బడి ఈడు పిల్లలు బడిలోకే వెళ్లాలి. పనిముట్లు పట్టరాదు అనే నినాదంతో ఏ చిన్నారీ బాల్యాన్ని బాదరబందీ బతుకులకు బలిచేయకూడదని, ఏ ఒక్కరైనా భావి భారత పౌరుడిగా జాతి ఔన్నత్యాన్ని నిలిపేలా తయారు కాకపోతాడా అనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీంతో చిన్నారులు బడిబాట పడుతుంటే, సహాయకులు లేక, పని నేర్చుకునేవారు లేక మెకానిక్ దుకాణాలు కాలక్రమంలో అంతకంతకూ తగ్గిపోతున్నాయి. దీంతో వెంకటేశ్వర్లు లాంటి వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. ఏ చిన్న సమస్యకైనా సర్వీస్ సెంటర్కి వెళ్లాలంటే మరమ్మతు చార్జీతో పాటు అదనపు చార్జీలు వేసి చేటంత బిల్లు ఇస్తారు. గ్రామీణులు భరించలేని పరిస్థితి ఇది. వాహనం కొన్నప్పుడు ఇచ్చే ఫ్రీ సర్వీసులనే ఎవరూ చేయించుకోరు. నమ్మకస్తులైన సొంత మెకానిక్లతో సర్వీస్ చేయించుకుంటారు చాలామంది. పైగా సర్వీస్ సెంటర్లు కూడా దూరాభారం. వాహన చోదకుల సమస్యలకు ఆయా యాజమాన్యాలు సర్వీస్ సెంటర్లను గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. వృత్తి విద్య శిక్షణ ఏర్పాటు చేయాలి.. ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అనేక మందికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు లో మోటారు సైకిలు మెకానిక్పై కూడా కోర్సును ఏర్పాటు చేయాలి. సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మోటారు సైకిల్ సంస్థల్లో చేరే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట హెల్పర్లు లేకపోతే షాపుల నిర్వహణ కష్టం సహాయకులు లేకపోతే మెకానిక్ షాపుల నిర్వహణ కష్టమే. గతంలో పిల్లలు పని నేర్చుకోడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రాథమిక విషయాలు తెలుసుకున్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారికీ, మాకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – ఆండ్ర నూకరాజు, సీనియర్ మెకానిక్, సామర్లకోట -
వివాహేతర సంబంధం.. అత్త అడ్డుగా ఉండటంతో ప్రియుడితో కలిసి..
సామర్లకోట (కాకినాడ): వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందనే ఆగ్రహంతో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు హత మార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగళవారం ఈ విషయం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మండలంలోని జి.మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం మార్చి 19 నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆమె భర్త బత్తిన కృష్ణ మార్చి 26న పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు ఎస్సై టి.సునీత అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణ, మాణిక్యం దంపతుల కుమారుడు గతంలో మరణించాడు. అతడి భార్య.. అత్తవారింట్లోనే ఉంటోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన వందే వెంకన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉంటోందన్న అక్కసుతో మాణిక్యాన్ని ఆమె కోడలు, వెంకన్నలు హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి గోదావరి కాలువలో పడేశారు. ఇందుకు బంది పోలయ్య అనే వ్యక్తి సహాయం తీసుకున్నారని గుర్తించారు. వీఆర్ఓ యేడిద భరత్ సమక్షంలో నిందితులు ఈ విషయాన్ని అంగీకరించారని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో మాణిక్యం అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. నిందితులు ముగ్గురినీ మంగళవారం కోర్టులో హాజరుపరచి, 14 రోజుల రిమాండుకు తరలించారు. మాణిక్యం మృతదేహం ఎక్కడుందో గుర్తించి, స్వాధీనం చేసుకుని, డీఎన్ఎ టెస్టుకు పంపాలని ఎస్సై చెప్పారు. చదవండి: ('ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం') -
భీమేశ్వర ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
-
రైలు బోగీలో ప్రసవం
సామర్లకోట: చెన్నై నుంచి జార్ఖండ్ వెళుతున్న ఓ గర్భిణి ఆదివారం రైలులో ప్రసవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శంకర్ క్రికిత్త ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. అతడి భార్య వాసకుమారి(21) ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. దీంతో శంకర్ ఆమెను పుట్టిల్లయిన జార్ఖండ్ తీసుకువెళుతున్నాడు. భార్యాభర్తలిద్దరూ బొకారో ఎక్స్ప్రెస్లో శనివారం రాత్రి జార్ఖండ్ బయలుదేరారు. రైలు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వచ్చాక ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను భర్త బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. రైలును కొద్దిసేపు సామర్లకోటలో నిలిపివేశారు. స్టేషన్కు చేరుకున్న 108 సిబ్బంది తల్లీబిడ్డలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు. -
విషాదం: స్టౌని అలాగే ఉంచి అగ్గిపుల్లతో వెలిగించడంతో..
సామర్లకోట: వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ మంటలకు ఆహుతైన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బ్రౌన్ పేట కుమ్మర వీధికి చెందిన గుబ్బల భవాని (35) శనివారం వంట చేయడానికి గ్యాస్ స్టౌను అగ్గిపుల్లతో వెలిగిస్తోంది. స్టౌ వెలగకపోవడంతో అలాగే ఉంచి పలుమార్లు అగ్గిపుల్లలు వెలిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, భవాని సజీవ దహనమైంది. లారీ డ్రైవర్గా పని చేస్తున్న భర్త చిన్న కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో భవాని ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. షాపు వద్ద పెద్ద కుమారుడు, అత్తను ఉంచి, మధ్యా హ్నం వంట చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి మంటలు రావడం, భవాని కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఆమె బావ కుమారుడు గమనించి, భవాని పెద్ద కుమారుడిని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. అప్పటికీ గ్యాస్ లీకవడం గమనించి వారు అదుపు చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం సీఐ వి.జయకుమార్, ఎస్సై వీఎల్వీకే సుమంత్, వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్టౌ వద్ద ఐదు అగ్గిపుల్లలు ఉండటం గమనించారు. వెంటనే స్టౌ వెలగకపోవడం, గ్యాస్ వ్యాపించి ఉన్న సమయంలో మరో అగ్గిపుల్ల వెలగడంతో మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన భవానీకి 16 ఏళ్ల క్రితం సామర్లకోట బ్రౌన్పేటకు చెందిన గుబ్బల రామకృష్ణతో వివాహమైంది. అత్త లక్ష్మి, పెద్ద కుమారుడు అర్జున్ గణేష్, చిన్న కుమారుడు వేణుతేజ ఉన్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు దెయ్యాల మహలక్ష్మి, కామరాజులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం తరలించి, ఎస్సై సుమంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు -
పోలీసులపై దూసుకెళ్లిన లారీ
-
ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ
సాక్షి, తూర్పుగోదావరి: సామర్లకోట ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ వెహికల్తో ఉన్న ఇద్దరు పోలీసులపై లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను తిమ్మాపురం పోలీసు స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోం గార్డు ఎన్ఎస్రెడ్డిగా గుర్తించారు. విజయవాడ నుంచి వచ్చే కోవిడ్ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్ విధుల కోసం ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’ దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి -
పరుగులో పోటీ పడలేక.. విషమిచ్చారా!
సామర్లకోట: రైతుకు ఆ ఎడ్లు అంటే ప్రాణం.. అవి రాష్ట్ర, జిల్లా స్థాయి పందేల్లో అనేక బహుమతులు సాధించాయి.. అలాంటి మూగ జీవాలపై ఎవరి కన్నో పడింది.. ఎందుకో.. ఏమో వాటికి విషమిచ్చి చంపేశారు.. ఈ సంఘటన సామర్లకోటలో కలకలం రేపింది.. దీనిపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమంత్ తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. సామర్లకోట మాండవ్య నారాయణస్వామి ఆలయం సమీపంలోని ఓ షెడ్డులో పందేల్లో పాల్గొనేందుకు ఎడ్లను రైతు వల్లూరి సత్యేంద్రకుమార్ పెంచుతున్నారు. 20 ఏళ్లుగా పలు పరుగు పందేల్లో ఆయన పెంచిన ఎడ్లు పాల్గొని పతకాలు సాధించాయి. ఈ నెల 11న మాచవరం, 19న రాజానగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇందులో భాగంగానే శుక్రవారం కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన పరుగు పందెంలో ఎడ్లు పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకున్నాయి. (చదవండి: ప్రతీకారం: ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో వల వేసి) ఆ ఆనందంతో కృష్ణా జిల్లా నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు సామర్లకోటకు ఆ రైతు సత్యేంద్రకుమార్ వచ్చారు. ఆ జీవాలను మకాంలో ఉంచి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి నాలుగు ఎడ్ల నోటి నుంచి నురగ వచ్చి మృతి చెంది పడి ఉన్నాయి. ఆ పాకలోని దూడకు ఏమీ కాలేదు. ఇందులో పరుగు పందెం కోసం ఇటీవల ఓ ఎద్దును రూ. ఐదు లక్షలకు కొనుగోలు చేశానని సత్యేంద్రకుమార్ తెలిపారు. (చదవండి: ప్రేయసికి వివాహం.. ప్రియుడి ఆత్మహత్య) వరుసగా మూడు బహుమతులు సాధించడంతో ఎడ్లకు మంచి గిరాకీ వచ్చిందన్నారు. నాలుగు ఎడ్లకు సుమారు రూ.35 లక్షలు పలుకుతుందన్నారు. బహుమతి సాధించి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇలా ఎవరు చేశారో అర్థం కావడం లేదని రైతు బోరున విలపించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పట్టణ పరిధిలోని రైతులంతా అక్కడకు చేరుకున్నారు. ఆ ఎడ్లకు అరటి పండులో విషం పెట్టి తినిపించి ఉండొచ్చని పశు సంవర్ధక శాఖ ఏడీ వై.శ్రీనివాసరావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సామర్లకోట ఎస్సై సుమంత్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రైతు సంఘం అ«ధ్యక్షుడు కంటే బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి పరిశీలించారు. -
కన్న ప్రేమంటే ఇంత చీదరింపా?
తూర్పుగోదావరి,సామర్లకోట: ఆ వృద్ధుడు ఎవరికి భారమయ్యాడో కానీ అనాథగా ఓ చెట్టు కింద ఇలా కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం ఉండూరు రోడ్డులో రైల్వే గేటు సమీపంలోని ఓ చెట్టు కింద సుమారు 70 ఏళ్ల వృద్ధుడు పడి ఉన్నాడు. ఆ రోడ్డులో సాయంత్రం వాకింగ్ చేస్తున్న వారు ఇది గమనించి మద్యం సేవించి పడిపోయి ఉంటాడని భావించారు. సాయంత్రం కూడా అతడు అలాగే చలిగాలికి వణికిపోతూ కనిపించడంతో వాకర్స్ చలించిపోయారు. ఆ వృద్ధుడికి దుప్పటి ఇచ్చి తాగునీరు, ఆహారం అందించారు. ఈ వృద్ధుడిని మూడు రోజుల క్రితం మోటారు సైకిల్పై వచ్చిన వారు వదిలి వెళ్లి పోయారని సమీపంలో ఉన్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం వల్ల విడిచి వెళ్లారని భావించామని తెలిపారు. అయితే వృద్ధుడి నుంచి సమాచారం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట స్పష్టంగా రావడం లేదు. అయితే గ్రామం మాత్రం మాధవపట్నం అని చెప్పగలిగాడు. ఈ పెద్దాయనను ఎవరో కర్కశులు ఈ విధంగా చలిలో వదిలి వెళ్లిపోవడంతో స్థానికుల హృదయాలు చలించిపోయాయి. పోలీసులు ఈ వృద్ధుడిని రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామంలో జరిగిన బండి సత్యవతి హత్యకేసులో ప్రధాన ముద్దాయి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో తప్పించుకున్న రిమాండ్ ఖైదీ బండి సురేష్ ఇదే అదనుగా భావించి పరారయ్యాడు. -
భానుప్రియపై చర్యలు తీసుకోవాలి
పెరంబూరు: నిబంధనలకు విరుద్దంగా మైనర్ బాలికను పనిలో నియమించుకున్న నటి భానుప్రియపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది. నటి భానుప్రియ తన ఇంటిలో నలుగురు మైనర్ బాలల్ని పనికి నియమించుకుందన్న అంశం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఒక మహిళ అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో చెన్నైలో నటి భానుప్రియ ఇంటిలో పని చేస్తున్న తన కూతుర్ని ఆమె వేధిస్తోందని, ఆమె నుంచి తన కూతుర్ని కాపాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేసి విచారణ కోసం చెన్నైకి వచ్చారు కూడా. అయితే భానుప్రియ తన ఇంట్లో పని చేస్తున్న పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదని, అదీ కాకుండా ఆ పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందనీ స్థానిక టీనగర్, పాండిబజార్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది కూడా. ఈ విషయం అలా ఉంచితే బుధవారం బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని పురష్కరించుకుని బాల కార్మికుల పరిరక్షణ సమాఖ్య బాలకార్మికుల గురించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సమాఖ్య నిర్వాహకుడు శేషారత్నం మాట్లాడుతూ మైనర్ బాలలను పనిలో చేర్చుకున్న నటి భానుప్రియపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బాలకార్మికుల చట్టం ప్రకారం పిల్లలను పనికి చేర్చుకుంటే రూ.50వేల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే భానుప్రియ తన ఇంటిలో పని చేసే పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదనీ, ఆ పిల్ల వయసు 17 ఏళ్లు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. అయినా ముగిసి పోయిన అంశాన్ని మళ్లీ శేషారత్నం తెరపైకి తీసుకు రావడంతో ప్రయోజనం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. -
రాజకీయం....ఆధ్యాత్మికం
సాక్షి, సామర్లకోట : మెట్ట ప్రాంతానికి ముఖద్వారమైన పెద్దాపురం నియోజకవర్గంపై ప్రతి ఒక్కరి కన్ను పడుతోంది. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో నడయాడిన నేలగా పెద్దాపురానికి పేరు ఉంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 1955లో మొదటి సారిగా ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. పెద్దాపురం నియోజకవర్గానికి నలువైపులా ఒక వైపు కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి నియోజకవర్గాలు ఉన్నాయి.ప్రస్తుతం 2019లో ఎన్నికలు జరుగుతున్నాయి. భౌగోలిక స్వరూపం 291.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నియోజకవర్గంలో జనాభా:2,61,378 పురుషులు: 1,30,376 మహిళలు : 1,31,002 ఓటర్లు: 1,98,369 పురుషులు : 99,936 మహిళలు : 98,407 ఇతరులు : 17 పరిశ్రమలకు కోట నియోజకవర్గంలోని సామర్లకోటలో రైల్వే స్టేషన్ – ఎదురుగానే బస్సు కాంప్లెక్స్ ఉన్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి సదుపాయం లేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద బస్సు కాంప్లెక్స్ ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిటిష్వారి కాలంలో నిర్మించిన పంచదార పరిశ్రమ నేటికీ ఉంది. నవభారత్ వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ సాగుతోంది. నియోజకవర్గంలోని వాణిజ్య పంటలైన చెరకు నుంచి పంచదార తయారు చేస్తారు. మరో వాణిజ్య పంట దుంప నుంచి సగ్గు బియ్యం తయారు చేసే పరిశ్రమలు నియోజకవర్గంలో పది వరకు ఉన్నాయి. వరి ప్రధాన పంట కావడంతో దానికి తగిన రీతిలో ధాన్యం మిల్లులు కూడా నియోజకవర్గంలో ఎక్కువ. తవుడు నుంచి నూనె తీసే పరిశ్రమలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో పామాలిన్ తోటలపై రైతులు మక్కువ చూపడంతో సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో పామాలిన్ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశారు. ఏడీబీ రోడ్డు ఏర్పాటు తరువాత ఈ రోడ్డు వెంబడి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రాక్ సిరామిక్స్, రిలయన్స్ పవర్ ప్లాంటు, జీవీకే పవర్ ప్లాంటు, అపర్ణ సిరామిక్స్ పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో సామర్లకోట మున్సిపాలిటీలో ప్రముఖ పుణ్యక్షేత్రమే శ్రీకుమారారామభీమేశ్వర ఆలయం ఉంది. మహాశివరాత్రి, కార్తికమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆధ్మాత్మికంగానూ.. పెద్దాపురం మున్సిపాలిటీ ముఖ్య కూడలి ప్రదేశంలో మరిడమ్మ అమ్మవారి ఆలయం ఉంది. సామర్లకోటకు చెందిన చింతపల్లి వారి ఆడపడుచుగా చెబుతారు. ఈ ఆలయంలో ఏటా నెల రోజుల పాటు మరిడమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. పెద్దాపురానికి శివారులో జగ్గంపేట, రాజమహేంద్రవరం వెళ్లే రోడ్ల కూడలి ప్రదేశంలో పాండవుల మెట్ట ఉంది. పాండవులు అజ్ఞాత వాసం సమయంలో ఇక్కడ తల దాచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో పాండవులు రాజమహేంద్రవరం గోదావరి కాలువ వరకు ఏర్పాటు చేసుకున్న గృహ నేటికీ ఉంది. పెద్దాపురం మండల పరిధిలో కాండ్రకోట గ్రామంలొ వేంచేసిన నూకాలమ్మ ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్త అమావాస్య నుంచి నెల రోజుల ఆలయ వద్ద తిరునాళ్లు జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2014లో నియోజకవర్గాలను పునఃవిభజనతో అప్పటి వరకు సంపర నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలు(సామర్లకోట మండలానికి చెందిన ) పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. చంద్రంపాలెం, పవర, పండ్రవాడ, నవర, గొంచాల, అచ్చంపేట, పనసపాడు, పి.వేమవరం గ్రామాలను పెద్దాపురం నియోజకవర్గంలో కలిపారు. నియోజకవర్గం ఏర్పడిన సంవత్సరం : 1952 మొదటిసారిగా జరిగిన ఎన్నికలు : 1955 సామర్లకోట మున్సిపాలిటీ, మండల పరిధిలో గ్రామాలు : 18 పెద్దాపురం మున్సిపాలిటీ, మండల పరి«ధిలో గ్రామాలు : 23 పోలింగ్ కేంద్రాలు : 211 సమస్యాత్మక పోలింగ్ బూత్లు : 95 నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం : 63.92 ప్రభుత్వ పాఠశాలలు : 160 ప్రైవేటు పాఠశాలలు : 89 ప్రభుత్వ జూనియర్ కళాశాల : 1 ప్రైవేటు జూనియర్ కళాశాలలు : 6 డీగ్రీ కళాశాలలు :5 బీఈడీ కళాశాలలు :3 ఇంజినీరింగ్ కళాశాలలు : 2 ఇప్పటి వరకు 13 పర్యాయాలు జరిగిన సాధారణ ఎన్నికలలో ఏడు పర్యాయాలు స్థానికేతరులే విజయం సాధించారు.మిగిలిన ఆరు పర్యాయాలు స్థానికులు కైవసం చేసుకున్నారు. -
నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదు
-
సినీ నటి భానుప్రియపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమార్తె సంధ్యను చెన్నైలోని భానుప్రియ నివాసంలో పనికి పెటినట్టు ప్రభావతి తెలిపారు. అయితే అక్కడ భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తొలుత తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడించేవారిని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు. తన కుమార్తెతో మాట్లాడించాలని కోరిన పట్టించుకోవడం లేదని.. పైగా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు. పది లక్షల రూపాయలు చెల్లించి తన కుమార్తెను తీసుకెళ్లాలని భానుప్రియ చెబుతున్నట్టు తెలిపారు.దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
ప్రజలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు
-
వైఎస్ జగన్ను కలిసిన APUWJ సంఘం నేతలు
-
219వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 219వ రోజు సోమవారం ఉదయం ప్రారంభమైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో సందడి మొదలైంది. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దారి పొడవునా స్థానిక ప్రజలు వైఎస్ జగన్కు సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉండూరు నుంచి సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. సామర్లకోట మాతం సెంటర్, అయోధ్యా రామాపురం, చలపతి నగర్ మీదుగా గణపతి నగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,574.9 కిలోమీటర్లు నడిచారు. -
వైఎస్ జగన్ను కలిసిన పంచాయతీ కార్మికులు
-
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ; ఆరు మంది మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి, పెద్దాపురం(తూర్పు గోదావరి జిల్లా) : సామర్లకోట కాకినాడ ఏడీబీ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, టిప్పర్ ఢీ కొన్న దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారితో పాటూ నలుగురు మహిళలున్నారు. ఓ శుభకార్యం నిమిత్తం వడ్లమూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం టిప్పర్తో సహా లారీ డైవర్ పరారయ్యాడు. -
కారు–నాన్స్టాప్ బస్సు ఢీ
సామర్లకోట : సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డ్రైవరు వాహనంలోనే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న ఎం.రాజబాబు వద్ద వడ్డి అనిల్దాసు(35) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. రాజబాబును శనివారం కాకినాడలో దింపిన అనిల్దాసు రాజమహేంద్రవరం వెళ్తూ ఉండగా జ్యోతుల గొడౌన్ సమీపంలో ఎదురుగా వస్తున్న నాన్స్టాప్ బస్సును ఢీ కొనడంతో కారు ముందుభాగం నుజ్జయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న అనిల్దాసు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం చినుకుల పడడంతో కారు అదుపు తప్పి బస్సును ఢీకొంది. దాంతో నాన్స్టాప్ బస్సు కుడివైపు ఉన్న తుప్పల్లోకి పొయింది. వెంటనే డ్రైవరు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో బస్సులో కాకినాడకు తరలించారు. నాన్స్టాప్ వెనుక పెద్దాపురం మండలం తూర్పు పాకల నుంచి వస్తున్న చెరకు ట్రాక్టరు డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గమనించి బ్రేక్ వేయడంతో ఎడమ వైపు నుంచి వస్తున్న ట్రాక్టరు కుడివైపు రోడ్డు మార్జిన్లో తుప్పలో బోల్తా పడింది. ట్రాక్టరు డ్రైవరును స్థానికులు వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మార్జిన్లో కారు, రోడ్డుకు అడ్డుగా బస్సు నిలిచి పోవడంతో సామర్లకోట–పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ రామారావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, కాకినాడ జాయింట్ 1 రిజిస్ట్రార్ రాజబాబు, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కె.సుందరరావులు సంఘటన ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ ఎస్సై సతీష్ తన సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న డ్రైవరు సీటు బెల్టు పెట్టుకుని ఉంటే కొంత వరకు ప్రమాదం తప్పేదని స్థానికులు అంటున్నారు. -
విశాఖ బాలుడు కోట రైల్వే స్టేషన్లో గుర్తింపు
సామర్లకోట : అదృశ్యమైన విశాఖపట్నం గోపాలపట్నానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సామర్లకోట ఆర్పీఎఫ్ పోలీసులు సామర్లకోట రైల్వే స్టేషన్లో గుర్తించా రు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ కథనం ప్రకారం ఒక బాలుడు విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో మహిళల బోగీలో ప్రయాణిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లంకలపల్లి భువన సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంట్లో చెప్పకుండా తిరుపతి వెళ్లాలని బయలు దేరినట్టు విద్యార్థి చెప్పాడని ఎస్సై తెలిపారు. కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు, ఆర్పీఎఫ్ పోలీసులకు, హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వడంతో ఆ విషయం టీవీలలో ప్రచారమైంది. దాంతో విశాఖపట్నం ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై విద్యార్థిని సామర్లకోటలో రైలు నుంచి దింపి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విద్యార్థి చినాన్న సందీప్కుమార్ సామర్లకోట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. సందీప్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ డిల్లీ వెళుతున్నానని నా కోసం వెతక వద్దని లేఖ రాసి పెట్టాడని దాంతో పోలీసులకు, హెల్ప్లైనుకు, ఆర్ఫీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై యు.దుర్గాప్రసాద్ హెల్్పలైన్ సిబ్బంది సమక్షంలో విద్యార్థిని అతడి చిన్నాన్నకు అప్పగించారు. -
కురుక్షేత్ర యుద్ధంతో వర్గీకరణ సాధిస్తాం
సామర్లకోట : మాదిగల హక్కుల సాధన కోసం 70 రోజుల పాటు 160 సభలను ఏర్పాటు చేసి మాదిగలను చైతన్యం చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పిఠాపురం రోడ్డులో ముత్యం రాజబాబు గ్రౌండ్లో జిల్లా నాయకుడు వల్లూరి నాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 35 రోజులు ముగిసిందని, మిగిలిన 35 రోజులల్లో 10 సభలు నిర్వహించాల్సి ఉందన్నారు. మాదిగల హక్కులను సాధించడం కోసం అమరావతిలో జూలై 7వ తేదీన కురుక్షేత్ర సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐక్యతను చాటడానికి ప్రతి మాదిగ కురుక్షేత్ర సభకు హాజరు కావాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. చంద్రబాబు 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్కసారి కూడా వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాలేదన్నారు. మాదిగ, మాలల మధ్య చంద్రబాబు అసమానతలను పెంచుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మందా వెంకటేశ్వర్లు, వల్లూరి నాని, వల్లూరి సత్యవతి, కాళ్ల లక్ష్మీ నారాయణ, బాలభద్రం, దివాకర్ తాతపూడి కృష్ణబాబు, సత్యనారాయణ, ఎ.పార్వతి, వల్లూరి సత్తి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్ష సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ముస్లిం సంఘ నాయకులు, స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు మంద కృష ్ణమాదిగను ఘనంగా సత్కరించారు. -
భక్తిశ్రద్ధలతో భీమేశ్వరుని తెప్పోత్సవం
సామర్లకోట : కుమారరామ భీమేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి ఆలయ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో స్వామికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రాత్రి ఆలయ కోనేరు వద్ద స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి ఉత్సవ విగ్రహాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, తెప్పోత్సవ నిర్వాహక కుటుంబ సభ్యులు పూజలు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఉంచి కోనేరు చుట్టూ తెప్పోత్సవం నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు కటకం సతీష్, సరేష్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కంటే బాబు, కార్య నిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల పుత్రయ్య, బి. త్రిమూర్తులు, అన్నదాన ట్రస్తు నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు, భక్త సంఘం నాయకులు బూరయ్య, తూతిక కామేశ్వర రావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సామర్లకోటలో అబ్కారీ అకాడమీ
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో అబ్కారీ అకాడమీ ఏర్పాటు కానుంది. అకాడమీ ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద అబ్కారీ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించారు. ఇక్కడ ఉన్న అటవీ భూముల్లో అకాడమీ ఏర్పాటు చేస్తే ఎక్సైజ్ సిబ్బంది శిక్షణకు అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ క్రైం రేటు అధికంగా ఉందనే కారణంతో ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు అబ్కారీ అకాడమీ హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉమ్మడి రాష్ట్రాలకు శిక్షణ కేంద్రంగా ఉంది. అకాడమీలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో అబ్కారీ ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. బండ్లగూడ నుంచి అకాడమీని తరలించి సామర్లకోటలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. -
మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నివాసాల మధ్య, మార్కెట్ సమీపంలో షాపు ఏర్పాటు చేయవద్దని టెంట్ వేసుకుని మహిళలు అక్కడే కూర్చోని నినాదాలు చేస్తున్నారు. కాగా, మద్యం షాపు ఏర్పాటుకు తమకు లైసైన్స్ ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మద్యం షాపుపై మహిళల దాడి
-
మద్యం షాపుపై మహిళల దాడి
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనావాసాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై మహిళలు దాడులు చేశారు. సోమవారం ఉదయం దాడికి దిగిన మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. డిగ్రీ కళాశాల ఇతర విద్యాసంస్థలు, జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా మహిళలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దుకాణం దారులు మూసేందుకు ప్రయత్నించినా మహిళలు జొరబడి మద్యం బాటిళ్లను పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
అగ్నిప్రమాదంలో రూ.3 లక్షలు బుగ్గి
సామర్లకోట (తూర్పు గోదావరి) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో పూరిపాకతోపాటు.. రూ. 3 లక్షల నగదు కాలి బూడిదైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ జానీ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇనుము లోడును అమ్మి రూ. 3 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచి వ్యాపారానికి వెళ్లాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వృద్ధురాలు టీ కాచుకొని స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో అగ్నిప్రమాదం జరిగి జానీ ఇంటకి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను ఆర్పేలోపే ఇంట్లో ఉన్న డబ్బు కాలి బూడిదైంది. -
మరోసారి సూదిపోటు కలకలం
సామర్లకోట(తూర్పుగోదావరి): సైకో సూదిపోటు మరోసారి కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గండం శ్రీనివాస్ అనే తాపీ మేస్త్రీ శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ మహిళ, ఓ వ్యక్తి అకస్మాత్తుగా శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. బాధితుడు స్థానిక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పాతనేరస్తుడు అరెస్ట్
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలకేంద్రంలో ఓ పాతనేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సామర్లకోటలోని కొత్తపేటకాలనీకి చెందిన జావర దుర్గ(22) సామర్లకోటతో పాటు పెద్దాపురం, గండేపల్లి పోలీస్స్టేషన్లలో పలు చోరీ కేసుల్లో నిందితుడు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ.3 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఈసారి మహిళ చేతికి సిరంజీ..!
సామర్లకోట(తూర్పుగోదావరి): పది రోజులుగా గోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతున్న ఇంజక్షన్ ఇప్పుడు సామర్లకోటకు చేరుకుంది. బుధవారం రాత్రి సామర్లకోట పట్టణంలోని ఇద్దరికి సూది గుచ్చుకుంది. వివరాలు.. పట్టణంలోని సంగీతరావుపేటలో అడపా దుర్గాప్రసాద్ అనే యువకుడు తన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా.. మోటారుసైకిల్పై ఓ పురుషుడు, మహిళ అక్కడికి వచ్చి ఆగారు. పిఠాపురం ఎలా వెళ్లాలంటూ దుర్గాప్రసాద్ను ఆరా తీశారు. ఇంతలోనే బైక్పై కూర్చున్న మహిళ దుర్గాప్రసాద్ నడుముకు ఇంజక్షన్ చేసింది. అతడు తేరుకునేలోగానే వారు అక్కడి నుంచి మాయమయ్యారు. ఇంజక్షన్ ప్రభావంతో దుర్గాప్రసాద్ అస్వస్థతకు గురయ్యాడు. చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వరకట్న వేధింపులకు గర్భవతి బలి
సామర్లకోట (తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని గొల్లగూడెం వీధికి చెందిన రాజు, సుగుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హారతి(25) వివాహం విజయవాడకు చెందిన కల్యాణ్కుమార్తో ఏడాదిన్నర క్రితం అయింది. పెళ్లయిన నాటి నుంచి భర్తతోపాటు అత్తమామలు మరింత కట్నం తేవాలని వేధిస్తున్నారు. కాగా గర్భవతి అయిన హారతి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుంది. శనివారం ఉదయం చూసేసరికి ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
సామర్లకోట: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సామర్లకోటలోని రజకపేటకు చెందిన ఎమ్.కావమ్మ(23) జయ డార్మటరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూలీ పని చేసి జీవనం సాగించే ఆమె డార్మటరీలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన భయం
కదులుతున్న రైలు నుంచి దిగుతూ కింద పడి యువకుడి మృతి సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా ) : రైల్వే అధికారులు కేసు రాస్తారనే భయం ఓ యువకుడి ప్రాణం తీసింది. కదులుతున్న రైలు నుంచి దిగుతూ దాని కిందపడి తునికి చెందిన కొత్తల సురేష్ గురువారం మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం తునికి చెందిన కొత్తల సురేష్ (33) ఒక ప్రెవేటు వైద్యశాలలో వార్డు బాయ్గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 8.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి సామర్లకోటకు ప్యాసింజరు రైలు టిక్కెట్టు తీసుకున్నాడు. అయితే వెంటనే వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేశాడు. ఆ రైలు నుంచి సామర్లకోట స్టేషన్లో దిగితే అధికారులు కేసు రాస్తారనే భయంతో సురేష్ రైలు స్టేషన్కు సమీపంలో ఉండగానే కెనాల్ రోడ్డు వైపు కంగారుగా దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో జారిపోయి అదే రైలు కింద పడ్డాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి హెచ్సీ పవన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాంగ్మన్ ఆత్మహత్య
సామర్లకోట :ఆర్థిక ఇబ్బందులు తాళలేక గ్యాంగ్మన్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. స్థానిక చంద్రంపాలెం లో రైల్వే గ్యాంగ్మన్ ఆదివారం రైలు కిందపడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. స్థానిక బలుసులపేటకు చెందిన పొన్నమల్ల కిష్టమ్మ (59) రైల్వేలో గ్యాంగ్మన్గా పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి వివాహాల కోసం అతడు అప్పులు చే శాడు. మొత్తం రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నా యి. వాటిని తీర్చాలని అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారు. ఇలాఉండగా కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురికావడంతో విధులకు సెలవు పెట్టాడు. ఈ క్రమంలో తునికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి న్యాయవాది ద్వారా నోటీసు ఇచ్చాడు. బకాయి చెల్లించకపోతే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించాడు. పదేళ్ల క్రితం సత్యనారాయణ వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నామని కిష్టమ్మ భార్య లక్ష్మీకాంతం పేర్కొంది. సుమారు రూ.50 వేలు చెల్లించినా ఇంకా బాకీ ఉన్నట్టు నోటీసులో పేర్కొన్నారని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన కిష్టమ్మ స్థానిక ఐదు తూములు దాటిన తర్వాత సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే నెలలో తన భర్త పదవీ విరమణ చేయనుండగా, అప్పుల వారి వేధింపుల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని లక్ష్మీకాంతం రోదించింది. జామీదారుగా ఉండడం వల్ల కూడా అతడిపై అప్పులు పేరుకుపోయాయని విలపించింది. ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో జయేంద్ర సరస్వతి
సామర్లకోట, న్యూస్లైన్ : కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామీజీ శుక్రవారం సామర్లకోటలోని ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చారు. ఆలయ చైర్మన్, ప్రసిద్ధ సిద్ధాంతి, కంచికామకోటి పీఠం సభ్యుడు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి నివాసానికి తొలుత చేరుకున్న స్వామీజీకి ఘన స్వాగతం లభించింది. అనేక మంది భక్తులు జయేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న స్వామీజీ ఆలయంలోని గణపతికి, ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన హోమాన్ని ఆయన దర్శించారు. ఆలయం వద్ద ఉన్న 65 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి వారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చింతామణి గణపతిశాస్త్రి స్వామీజీని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. ప్రసన్నాంజనేయ స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేశారు. స్వామీజీ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
165 గంటల పాటు హరినామ సంకీర్తన
భద్రాచలం, న్యూస్లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్త బృందం నిరంతర హరినామ సంకీర్తన చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన భక్త బృందం సప్తాహం పేరిట ఈ భజన కార్యక్రమాన్ని చేపట్టింది. 165 గంటలపాటు నిరంతరాయంగా సాగే ఈ కార్యక్రమంలో 130 మంది భక్తులు బృందాలుగా పాల్గొన్నారు. ఈ సంకీర్తన 26వతేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. -
సాయి సన్నిధిలో వైఎస్ జగన్
-
తొలి అంకానికి తెర
పురపోరులో తొలిఘట్టానికి తెర పడింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఆర్భాటంగా కదిలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. పది చోట్లా మొత్తం 1764 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజునే 933 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 373, టీడీపీ నుంచి 280, కాంగ్రెస్ తరఫున 100 మంది, ఇండిపెండెంట్లుగా 136 మంది నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల విషయానికి వస్తే బీజేపీ 26, సీపీఎం 8, లోక్సత్తా 5, సీపీఐ 2, ఇతరులు 3 నామినేషన్లు వేశాయి. చివరిరోజు అమలాపురంలో 97, మండపేటలో 176, రామచంద్రపురంలో 70, తునిలో 76, సామర్లకోటలో 142, పెద్దాపురంలో 60, పిఠాపురంలో 124 నామినేషన్లు దాఖలు కాగా నగర పచాయతీలకు సంబంధించి ముమ్మిడివరంలో 39, గొల్లప్రోలులో 54, ఏలేశ్వరంలో 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా శుక్రవారం గడువు ముగిసే నాటికి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 264 వార్డులకు 1764 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ 638, టీడీపీ 642, కాంగ్రెస్ 157, ఇండిపెండెంట్లు 253, బీజేపీ 40, సీపీఎం 17, సీపీఐ 4, లోక్సత్తా 8 తోపాటు ఇతరుల నామినేషన్లు 5 ఉన్నాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా సామర్లకోటలో 30 వార్డులకు 253 నామినేషన్లు, అతితక్కువగా రామచంద్రపురంలో 132 దాఖలయ్యాయి. నగర పంచాయతీల్లో అధికంగా ఏలేశ్వరంలో 20 వార్డులకు 180 నామినేషన్లు పడ్డాయి. ‘కోట’లో కనుమరుగైన కాంగ్రెస్ సామర్లకోటలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేక పోయిన కాంగ్రెస్ పెద్దాపురంలో ఆఖరు రోజున అతి కష్టం మీద ఐదింటిని వేయగలిగింది. వార్డు సంఖ్యతో పోలిస్తే కాంగ్రెస్ తరఫున 55 శాతం కూడా నామినేషన్లు పడలేదు. నగర పంచాయతీలైన గొల్లప్రోలు, ముమ్మిడివరంలలో ఆ పార్టీ అభ్యర్థుల సంఖ్య ఒక్క అంకెకే పరిమితమైంది. నేడు పరిశీలన.. నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఈనెల 18 వరకూ ఉపసంహరణకు గడువుంది. అదే రోజున తుది జాబితా ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని మున్సిపల్ ఆర్డీ రమేష్బాబు తెలిపారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులుగా ఉన్న కమిషనర్లు అవసరమైతే న్యాయ సలహాలు కూడా తీసుకుని పరిశీలనను నిక్కచ్చిగా నిర్వహిస్తారన్నార -
రైలు కింద పడి ట్రాక్మన్ ఆత్మహత్య
సామర్లకోట, న్యూస్లైన్ : భార్యాబిడ్డలకు దూరంగా, ఒంటరిగా నివసిస్తున్న ఓ రైల్వే ఉద్యోగి శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, సహ ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సీహెచ్ సత్యనారాయణ(52) గత 15 ఏళ్లుగా సామర్లకోటలో పని చేస్తున్నాడు. గ్యాంగ్మన్గా విధుల్లో చేరిన ఇతడికి స్పెషల్ ట్రాక్మన్గా పదోన్నతి లభించింది. ఇతడికి భార్య రమ, కుమారుడు శ్రావణ్, కుమార్తె శిరీష ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేశాడు. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతుండడంతో భార్య రమ, శ్రావణ్ కాజీపేటలో నివసిస్తున్నారు. దీంతో స్థానిక రైల్వే క్వార్టర్సలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం విధులకు హాజరుకావాల్సిన సత్యనారాయణ.. తెల్లవారుజామున రైల్వే స్టేషన్లోని మూడో నంబరు ప్లాట్ఫాం పట్టాలపై సామర్లకోట నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో అతడి తల, మొండెం, చేతులు వేరయ్యాయి. సత్యనారాయణకు కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ లేవని, అందరితోను కలిసిమెలిసి ఉండే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్ధం కావడం లేదని సహ ఉద్యోగులు తెలిపారు. రైల్వే ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎటు కూడినా 2014!
సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన గణితావధాని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ నూతన సంవత్సరం సందర్భంగా రంగురంగుల 16 గడులతో ఓ చదరం తయారు చేశారు. ఇక్కడిగడుల్లో ఉన్న సంఖ్యలను అడ్డంగా, నిలువుగా, మూలగా ఎటుకూడినా.. 2014 వస్తుంది. ఒకే రంగు కలిగిన గడుల్లోని సంఖ్యలను కూడినా 2014 వస్తుంది. తాను ఇలాంటి మ్యాజిక్ చదరాలను వెయ్యికి పైగా రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు. -
లారీ ఢీకొని బైక్ దగ్ధం
సామర్లకోట, న్యూస్లైన్ : కాకినాడ-సామర్లకోట ఏడీబీ రోడ్డులో అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోటార్ బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం హుస్సేన్పురానికి చెందిన మద్దిల నిరీక్షణకుమార్, ప్రసన్న అన్నాచెల్లెళ్లు. ఆది వారం కావడంతో మోటార్ బైక్పై నిరీక్షణ కుమార్తో కలిసి ప్రసన్న కాకినాడలో చర్చికి బయలుదేరింది. ఏడీబీ రోడ్డు అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఎదురుగా మోటార్ బైక్పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో నిరీక్షణ కుమార్ నడుపుతున్న బైక్ దానిని ఢీకొంది. ఈ ధాటికి వెనుక కూర్చున ప్రసన్న రోడ్డుపై పడిపోయింది. ఆమెను కా పాడే ప్రయత్నంలో ఉండగా, కాకినాడ నుంచి లారీ దూసుకురావడాన్ని గమనించి బైక్పై నుంచి నిరీక్షణకుమార్ దూకేశాడు.దీంతో బైక్ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఆ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమం లో బైక్ నుంచి మంటలు చెలరేగి, కాలి బూడిదైంది. లారీని గుర్తించలేదని నిరీక్షణకుమార్ చెప్పాడు. ప్రసన్న తలకు తీవ్ర గాయమైంది. 108కు ఫోన్ చేయగా సకాలంలో రాలేదు. దీంతో ఆమెను ఆటోలో మా ధవపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సామర్లకోట ఎస్బీఐలో కుంభకోణం
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ కుంభకోణం జరిగింది. పూతబోసిన నకిలీ బంగారు నగలు కుదువ పెట్టి రుణాలు తీసుకున్నట్టు వెలుగు చూసింది. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరెవరు రుణాలు తీసుకున్నారు, బ్యాంక్ సిబ్బంది ప్రమేయముందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.