Sandhya Theather
-
హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు
-
Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్/ చిక్కడపల్లి: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం అల్లు అర్జున్ను విచారించారు. మూడున్నరగంటలపాటు 20కిపైగా ప్రశ్నలు అడిగారు. ప్రీమియర్షోకు వచ్చేందుకు పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా తెలియదా అనే అంశం నుంచి ర్యాలీగా రావడం, వెళ్లడం దాకా ఎప్పుడేం జరిగిందనేది గుర్తు చేస్తూ విచారించారు. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు రావాలని సూచించారు. ఈ నెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసుల ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్రెడ్డి, సినీ నిర్మాత బన్నీ వాసు, న్యాయవాది అశోక్రెడ్డిలతో కలిసి అల్లు అర్జున్ ఉదయం 11:03 గంటలకు చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. అరవింద్, చంద్రశేఖర్రెడ్డి, బన్నీవాసులను పోలీస్స్టేషన్ కింద రూమ్ వరకే అనుమతించారు. మొదటి అంతస్తులో అడ్వొకేట్ అశోక్రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్కుమార్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ విచారించారు. సంధ్య థియేటర్ ఘటన, తదినంతర పరిణామాలపై మధ్యాహ్నం 2:47 గంటల వరకు ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల విడుదల పోలీసులు చేసిన పది నిమిషాల వీడియోను ఆధారంగా చూపిస్తూ వివరాలను తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ప్రెస్మీట్లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీశారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లిపోయారు. 10 నిమిషాలకోసారి విరామమిస్తూ.. పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ప్రతి పది నిమిషాలకోసారి విరామం తీసుకున్నట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో అల్లు అర్జున్ కేవలం ఒక్కసారి మాత్రమే టీ తీసుకున్నట్టు సమాచారం. చివరిగా అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్కు సూచించినట్టు తెలిసింది. ఏ–18గా మైత్రి మూవీస్.. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటివరకు మైత్రి మూవీస్ సంస్థపై ఎటువంటి కేసులు నమోదు చేయని పోలీసులు.. మంగళవారం అల్లు అర్జున్ విచారణ సమయంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలను ఏ–18 నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో చేర్చారు. బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీ ఆరెస్టు.. సంధ్య థియేటర్లో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలవడానికి కారణం ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు 10వేలకుపైగా వీడియోలను విశ్లేషించారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్న ఆంటోనీ అని గుర్తించారు. పోలీసులను సైతం అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం, గేట్లను మూసివేయడం వంటివాటిని అతడే దగ్గరుండి పర్యవేక్షించినట్టు సీసీ కెమెరా ఫుటేజీలలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తొక్కిసలాట కాదు... ఊపిరాడకనే.. సంధ్య థియేటర్లో తొక్కిసలాటతోనే రేవతి మరణించిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఇప్పటివరకు భావిస్తున్నారు. తొక్కిసలాట అయితే వారి శరీరంలో ఎముకలు విరగడం గానీ, ఇతర అవయవాలు దెబ్బతినడం గానీ జరిగి ఉండేది. అయితే రేవతికి గానీ, శ్రీతేజ్కి గానీ ఎక్కడ కూడా గాయాలైన ఆనవాళ్లు లేవని వైద్యుల నివేదికలో వెల్లడైంది. థియేటర్ లోయర్ బాల్కనీలో పరిమితికి మించి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడం వల్లే వారికి ఊపిరి ఆడలేదని.. ఈ క్రమంలోనే రేవతి కన్నుమూసిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అల్లు అర్జున్ను పోలీసులు అడిగిన పలు ప్రశ్నలివే.. సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు నాటి ఘటనకు సంబంధించి ప్రశ్నల వర్షం గుప్పించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు అడిగిన ప్రశ్నలివే.. ⇒ పుష్ప–2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్టు సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు అంగీకరించారు. ఈ విషయాన్ని నాగరాజు మీకు చెప్పారా? లేదా? ⇒ థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా, లేదా? అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా? ⇒ పోలీసుల అనుమతి లేకున్నా థియేటర్కు ఎందుకు వచ్చారు? ⇒ మీతో పాటు సినిమా చూసేందుకు ఎంత మంది వచ్చారు? ⇒ మీతోపాటు ఎంత మంది బౌన్సర్లు వచ్చారు? ఆ బౌన్సర్ల ఏజెన్సీకి అనుమతులు ఉన్నాయా? ⇒ మీరు థియేటర్కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందనే దానిని అంగీకరిస్తారా? ⇒ చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి వచ్చారు? ⇒ పోలీసుల విధులను మీరు ఎందుకు అడ్డుకున్నారు? ⇒ రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల మేనేజర్ నాగరాజు చెప్పారా? లేదా? ⇒ రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియదని మీడియాతో ఎందుకు చెప్పారు? ⇒ చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? ⇒ తొక్కిసలాట జరిగినా, ఒక వ్యక్తి మరణించినా కూడా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటికి రాలేదు? సంధ్య థియేటర్ కేసులో నిందితుల వివరాలివీ... ఏ–1: ఆగమాటి పెదరామిరెడ్డి, థియేటర్ యజమాని ఏ–2: ఆగమాటి చిన్నరామిరెడ్డి, థియేటర్ యజమాని ఏ–3: ఎం.సందీప్, భాగస్వామి ఏ–4: సుమిత్, భాగస్వామి ఏ–5: ఆగమాటి వినయ్, భాగస్వామి ఏ–6: అశుతోష్రెడ్డి, భాగస్వామి ఏ–7: రేణుకాదేవి, భాగస్వామి ఏ–8: అరుణారెడ్డి, భాగస్వామి ఏ–9: నాగరాజు, థియేటర్ మేనేజర్ ఏ–10: విజయ్ చందర్, లోయర్ బాల్కనీ ఇన్చార్జి ఏ–11: అల్లు అర్జున్, పుష్ప సినిమా హీరో ఏ–12: సంతోష్, అల్లు అర్జున్ పీఏ ఏ–13: శరత్ బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్ ఏ–14: రమేష్, సెక్యూరిటీ ఏ–15: రాజు, సెక్యూరిటీ ఏ–16: వినయ్కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఏ–17: పర్వేజ్, బాడీగార్డ్ ఏ–18: మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు -
గంటకు పైగా అల్లు అర్జున్ను విచారిస్తున్న పోలీసులు
-
ముగిసిన అల్లు అర్జున్ విచారణ
చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. అయితే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బన్నీ తన కారులోనే ఇంటికి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కాగా, సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో ఇదివరకే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన బన్నీ.. మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తన లాయర్లతో భేటీ అయిన అల్లు అర్జున్.. వాళ్లతో కలిసి ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్కు రానున్నాడు.విచారణలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన విషయాల గురించి పోలీసులు మాట్లాడుతారు. అలానే అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. ఇది విచారణ కాబట్టి మధ్యాహ్నానికి తిరిగి బన్నీ ఇంటికి వెళ్లిపోతాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)అసలేం జరిగింది?'పుష్ప 2' (Pushpa 2) మూవీ బెన్ఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కి (Sandhya Theatre) వెళ్లాడు. కానీ అక్కడ అభిమానుల మధ్య తోపులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆస్పత్రిలో చేర్చారు. రేవతి భర్త ఫిర్యాదుతో తొలుత థియేటర్ ఓనర్, మేనేజర్, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆ రాత్రికే బెయిల్ వచ్చింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ బన్నీని జైలు నుంచి ఉదయం రిలీజ్ చేశారు.జైలు నుంచి విడుదలై ఇంటికెళ్లిన తర్వాత సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్ని పరామర్శించారు. తాజాగా ఆ విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని ఒక్కరు కూడా పరామర్శించలేదని, బన్నీని మాత్రం కలిశారని అన్నారు. తప్పంతా బన్నీదే అన్నట్లు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్.. తానేం తప్పు చేయలేదని, ప్రమాదం వల్ల మహిళా చనిపోయిందని అన్నాడు. ఇప్పుడు పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?) -
KA Paul: రేవతి కుటుంబానికి 300 కోట్లు ఇస్తా
-
సంధ్య ధియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం
-
ఇకపై నో బెనిఫిట్ షోస్
రాంగోపాల్పేట్: తెలంగాణలో ఇకపై ఎంత పెద్ద బడ్జెట్తో రూపొందించే సినిమాలకైనా బెనిఫిట్ షోలను అనుమతించబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సందేశాత్మక చిత్రాలతోపాటు తెలంగాణ పోరాటం, ఉద్యమం, చారిత్రక అంశాలపై రూపొందించే సినిమాలకు నామమాత్రంగా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు.సంధ్య థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్కు గొంతులో పైపులు వేసి ఆహారం అందిస్తున్నారని.. ప్రస్తుతం చాలా బలహీనంగా ఉన్నాడన్నారు. అతను కోలుకోవడానికి ఏడాదికిపైగా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారన్నారు.బాలుడు కోలుకొనే వరకు ప్రభుత్వం ఆస్పత్రి ఖర్చులు భరిస్తుందని చెప్పారు. ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా రూ. 25 లక్షల చెక్కును బాలుడి తండ్రి భాస్కర్కు అందించారు. భాస్కర్కు ఆత్మస్థైర్యం అందించడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో తాను వచి్చనట్లు తెలిపారు. సంధ్య థియేటర్కు రావొద్దని పోలీసులు రాతపూర్వకంగా సూచించినప్పటికీ హీరో అల్లు అర్జున్ వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కొద్దిగా మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కిమ్స్ ఆస్పత్రి శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపింది. వెంటిలేటర్ సాయం లేకుండానే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. -
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్
-
అల్లు అర్జున్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:సంధ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో శనివారం(డిసెంబర్ 21) రేవంత్రెడ్డి ఈ విషయమై మాట్లాడారు. హీరో అల్లుఅర్జున్ సంథ్య థియేటర్కు రావడానికి 2వ తేదీన దరఖాస్తు చేసుకుంటే 3వ తేదీ పోలీసులు తిరస్కరించారు. అయినా కూడా అల్లు అర్జున్ థియేటర్కు 4వ తేదీ వచ్చారు. థియేటర్కు ఒకటే మార్గం ఉంది భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి చేయిదాటింది. సినీహీరో కావడంతో ఒక్కసారిగా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారు. వద్దని వారించినా అల్లుఅర్జున్ అక్కడికి వచ్చారు. బౌన్సర్లు, అభిమానులు పరస్పరం తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్కు కాలు పోయిందా.. కన్ను పోయిందా.. ఎందుకు పరామర్శలు.. ‘అల్లు అర్జున్కు కాలు పోయిందా కన్ను పోయిందా, కిడ్నీలు చెడిపోయాయా ఆయనను అందరూ ఎందుకు పరామర్శిస్తున్నారు. పోలీసులు సంధ్య థియేటర్తో పాటు అల్లు అర్జున్పై కేసు పెట్టారు. నెలకు 30 వేలు సంపాదించే ఒక అభిమాని టికెట్ రూ.12 వేలు పెట్టి కొన్నాడు. అలాంటి అభిమాని చనిపోతే హీరో కనీసం పట్టించుకోలేదు. పోలీసులు ప్రథమ చికిత్స చేసినప్పటికీ రేవతి బతకలేదు. శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి చనిపోయి, కొడుకు చావు బతుకుల్లో ఉంటే హీరో అల్లు అర్జున్ పట్టించుకోకుండా సినిమా చూసుకుంటూ అక్కడే ఉన్నాడు. చివరకు డీసీపీ వచ్చి అరెస్టు చేస్తామని చెబితే అప్పుడు అక్కడినుంచి హీరో వెళ్లాడు. థియేటర్ సిబ్బంది హీరో దగ్గరికి పోలీసులను వెళ్లనివ్వలేదు. 11 రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయంలో పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి నాపై అడ్డగోలుగా ట్వీట్ చేశాడు. చనిపోయిన వాళ్లను పట్టించుకోకుండా సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది ప్రభుత్వమే కదా’ అని సీఎం రేవంత్ అన్నారు. నేను సీఎంగా ఉన్నంత వరకు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవుతల్లి చనిపోయి పిల్లాడు బ్రెయిన్ డెడ్ అయితే సినిమా వాళ్లు ఎవరైనా పరామర్శకు వెళ్లారా. సినిమా వాళ్లు ఇన్సెంటివ్స్ కావాలంటే తీసుకోండి.. ప్రివిలేజ్ కావాలంటే కుదరదు. ఇక నుంచి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదు. నేను సీఎంగా ఉన్నంత వరకు అనుమతివ్వను. నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లంటే పోనీ.. రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు నాపై విమర్శలు చేశారు’అని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కోలుకున్న శ్రీతేజ్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
'పుష్ప 2' బెన్ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్.. కోలుకుంటున్నాడు. మొన్నటివరకు సీరియస్ కండీషన్లో ఉన్న ఇతడు.. ప్రస్తుతం కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. ఈ మేరకు వైద్యులు.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో)సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది, ఫీటింగ్ తీసుకోగలుగుతున్నాడని.. కాళ్లు-చేతులు కదిలిస్తున్నాడని హెల్త్ బులిటెన్లో వైద్యులు పేర్కొన్నారు.ఇదే సంఘటనలో శ్రీతేజ్ తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు కేసు పెట్టి.. తొలుత సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్ని అరెస్ట్ చేశారు. తర్వాత హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. వీళ్లకు బెయిల్ వచ్చింది. దీంతో కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్) -
శ్రీతేజ్ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు. ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాటహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
సంధ్య థియేటర్కి పోలీసులు షోకాజ్ నోటీసు
'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)తాజాగా చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు.షోకాజ్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్న కొన్ని అంశాలుసంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలుసంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం.ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారుఅల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు.అల్లు అర్జున్తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.టిక్కెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
అల్లు అర్జున్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్టు జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్టు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచీ తగిన ఏర్పాట్లు చేసుకున్న టాస్్కఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహరెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరూ బయటికి వెళ్లేవరకు సమీపంలోనే వేచి ఉన్న పోలీసులు.. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు.ఆ సమయంలో అల్లు అర్జున్ షార్ట్స్, టీ–షర్ట్ ధరించి.. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నారు. ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. సంధ్య థియేటర్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సరే మీ పని మీరు చేసుకోండి’ అంటూ పోలీసులకు సహకరించిన అల్లు అర్జున్.. బట్టలు మార్చుకోవడం కోసం రెండు నిమిషాలు సమయం కోరారు. దీనికి అనుమతించిన పోలీసులు.. ఆయన వెంటే బెడ్రూమ్ వరకు వెళ్లారు. ఈలోపు విషయం తెలుసుకున్న అరవింద్, స్నేహరెడ్డి, అర్జున్ సోదరుడు శిరీష్ ఇంటికి చేరుకున్నారు. అరెస్టు చేసినా ఫర్వాలేదు.. కాఫీ తాగండి! పోలీసులు అల్లు అర్జున్ను ఆయన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్ నుంచి కింద ఉన్న హాల్లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడున్న తండ్రి అల్లు అరవింద్ కాసింత ఆందోళన చెందారు. అర్జున్ను హత్తుకుని ‘అరెస్టు చేస్తున్నారు.. చెయ్యనీ.. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ ధైర్యం చెప్పారు. తర్వాత అల్లు అర్జున్, పోలీసులు ఇంటి బయట పోరి్టకో వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసు వాహనాలను సిద్ధం చేశారు. అల్లు అర్జున్ కాఫీ తాగడానికి ఆగారు. ఇంట్లో నుంచి తెచ్చిన కాఫీని తన సమీపంలో ఉన్న ఓ పోలీసు అధికారికి ఇవ్వబోయారు. అధికారి కాఫీ వద్దని చెప్పడంతో ‘అది అదే (అరెస్టు చేసుకోండి).. ఇది ఇదే (కాఫీ తాగండి)’ అని నవ్వుతూ పేర్కొన్నారు. కాఫీ తాగడం పూర్తయ్యాక పోలీసులను ఉద్దేశించి ‘రెడీ సార్.. కాఫీ అయిపోయింది’ అంటూ ముందుకు నడిచారు. బెడ్రూం వరకు రావడం సరికాదు.. ఇంటి ముందు పోలీసు వాహనం ఎక్కే సమయంలో అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వస్తానని, ఒకరిని పంపాలని కోరితే ఇంత మంది పోలీసుల బెడ్రూమ్ వరకు వచ్చారు. నన్ను అరెస్టు చేయడంలో తప్పులేదు, తీసుకువెళ్లడం తప్పులేదు. కానీ రెండు నిమిషాలు టైమ్ ఇవ్వాలని కోరితే బెడ్రూమ్ వరకు వచ్చి ఇలా చేశారు. ఇది సరికాదు..’’ అని పేర్కొన్నారు. తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ పోలీసు వాహనం ఎక్కుతుండగా.. తానూ అదే వాహనంలో వస్తానంటూ అల్లు అరవింద్ బయలుదేరారు.అయితే తన తండ్రి పోలీసు వాహనంలో రాకూడదని భావించిన అర్జున్.. ‘మీరు పోలీసు వాహనంలో ఉంటే మీడియాలో అలానే వస్తుంది. ఏ క్రెడిట్ వచ్చినా నా మీదనే ఉండాలి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా..’’ అని ఆపేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ను తీసుకుని చిక్కడపల్లి ఠాణాకు బయలుదేరారు. అప్పటికే ఆ ప్రాంతమంతా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయింది. ఠాణాలో గంటన్నర పాటు విచారణ.. పోలీసులు అల్లు అర్జున్ను చిక్కడపల్లి ఠాణాలో దాదాపు గంటన్నర పాటు విచారించారు. ఠాణా వద్దకు అల్లు శిరీష్, అల్లు అరవింద్, అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్తోపాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంధ్య థియేటర్ పర్సనల్ మేనేజర్ జేబీ సంతోష్కుమార్ల అరెస్టు ప్రక్రియను పూర్తి చేసి, రిమాండ్ రిపోర్టులు తయారు చేశారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్ రాజకుమారి చాంబర్కు తీసుకెళ్లి.. అప్పటికే సిద్ధంగా ఉంచి పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆస్పత్రికి వచ్చిన అల్లు అరవింద్ వైద్య పరీక్షల సమయంలో కుమారుడి వెంటే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆస్పత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్ ఫొటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు అల్లు అర్జున్, సంతోష్లను చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకుపైగా ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతో‹Ùలకు 14 రోజుల జ్యుడిíÙయల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురినీ చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ నాలుగు గంటలకుపైగా జైలు రిసెప్షన్లోనే వేచిచూశారు. చివరికి హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్గూడ జైలు నుంచి విడుదల అవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్లోని క్లాస్–1 రూమ్కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు. క్షణక్షణం హైడ్రామా.. ఉత్కంఠ మధ్య.. ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్కు అల్లు అర్జున్ -
అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు
-
Revathi Husband: నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు.
-
అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
-
Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా?
ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ను.. చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తొలుత పుష్ప హీరోను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డుచేసి.. అటుపై వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి.. అటు నుంచి అటు రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. అయితే..ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో ఉంది. ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసు అంత తీవ్రమైందా?.. ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షల గురించి ఓసారి పరిశీలిద్దాం..👉105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఉద్దేశపూర్వకంగా చంపేందుకు.. ఉద్దేశం లేకపోయినా అది మరణానికి దారి తీస్తుందని తెలిసిగానీ చేసే నేరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇది హత్యానేరం(Murder) కిందకు రాకపోయినప్పటికీ.. శిక్షించదగిన హత్యానేరమే అవుతుంది.👉105 సెక్షన్ కింద.. ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే మినిమమ్ ఐదేళ్లు.. గరిష్టంగా పదేళ్ల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు.👉105 సెక్షన్ ప్రకారం.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ తెలిసికూడా మరణానికి గనుక కారణమైతే.. ఆ శిక్షకుగానూ గరిష్టంగా పదేళ్ల శిక్ష, జరిమానా విధిస్తారు.👉సెక్షన్ 118(1).. ప్రమాదకరమైన ఆయుధాలు లేదంటే ఇతరత్రా మార్గల ద్వారా గాయపర్చడం. ఈ నేరం తీవ్ర దృష్ట్యా మూడేళ్ల వరకు జైలు శిక్ష.. రూ.20వేల జరిమానా విధిస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిదిల్సుఖ్ నగర్కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి(మృతురాలు రేవతి భర్త) ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సంధ్యా 70 ఎంఎం థియేటర్ మేనేజ్మెంట్, స్టాఫ్తో పాటు అల్లు అర్జున్, ఆయన పర్సనల్ భద్రతా సిబ్బందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించగా.. అల్లు అర్జున్ పేరు 11వ నిందితుడిగా చేర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్గూడ జైలుకు తరలించనున్నారు.కాగ్నిజబుల్ నేరం . అంటే ఒక పోలీసు అధికారికి వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, కోర్టు అనుమతితో లేకుండా విచారణ జరిపే అధికారం ఉన్న నేరమన్నమాట. నేరం తీవ్రత దృష్ట్యా ఇది అన్వయింపజేస్తారు. తాజాగా.. కాగ్నిజబుల్ నేరం కిందనే వారెంట్ లేకుండానే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సెక్షన్ 118(1) విత్ సెక్షన్ 3(5).. సెక్షన్ 118(1)కు సెక్షన్ 3(సబ్ సెక్షన్-5)నుకూడా పోలీసులు జత చేశారు. ఈ సెక్షన్ కింద.. ఒక నేరంలో ఎక్కువ మందికి గనుక భాగం ఉంటే.. వాళ్లందరికీ సమానంగా బాధ్యత ఉంటుందని అర్థం.ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 304, సెక్షన్ 324, సెక్షన్ 34ను.. బీఎన్ఎస్లో 105, 118(1), 3(5) సెక్షన్లతో భర్తీ చేశారు. -
హీరో అల్లు అర్జున్ అరెస్ట్
-
అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్
అల్లు అర్జున్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై నమోదైన కేసులో ఇవాళ అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.ఈనెల 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ మూవీని వీక్షించారు. అదే సమయంలో తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి గాయాలు కావడంతో నిమ్స్కు తరలించి చికిత్స అందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కూడా కేసు నమోదైంది. -
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. రెండు రోజుల ముందే లేఖ రాసిన యాజమాన్యం!
అల్లు అర్జున్ సినిమాకు పుష్ప-2 మూవీకి భద్రతా కల్పించాలని తాము కోరినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. తమకు 4, 5 తేదీల్లో సెక్యూరిటీ ఇవ్వాలని రెండో తేదీనే లేఖ రాసినట్లు వెల్లడించింది. పుష్ప-2 ప్రత్యేక షోల దృష్ట్యా థియేటర్ వద్ద భద్రత కల్పించాలని చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లేఖలో కోరినట్లు యాజమాన్యం పేర్కొంది.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఅయితే డిసెంబర్ 4న వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. అయితే బన్నీని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాతపడగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. -
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
-
ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు: సీఎం రేవంత్
-
అల్లు అర్జున్ అరెస్ట్ లో కీలక మలుపు
-
క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
-
#AA కేసు అప్డేట్స్.. జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ క్రమంలో హైడ్రామా నడిచింది. కింది కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తే.. ఉన్నత న్యాయస్థానం మాత్రం ఆయనకు ఆ సెక్షన్లు వర్తించవని చెబుతూ మధ్యంతర బెయిల్ నడిచింది. -
అల్లు అర్జున్ అరెస్ట్.. టూమచ్!
హైదరాబాద్, సాక్షి: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ను నగర పోలీసులు దాదాపు ధృవీకరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకుగానూ శుక్రవారం(నవంబర్ 13) మధ్యాహ్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే..అరెస్ట్ టైంలో పోలీసులు అతి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన టైంలో.. అల్లు అర్జున్ నైట్ దుస్తులతో ఉన్నారు. తమతో రావాలని కోరగానే.. డ్రస్ మార్చుకుంటానని అన్నారాయన. దీంతో బెడ్ రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి మరీ తీసుకెళ్లారు. ఆ టైంలో అరెస్ట్ సమయంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘బెడ్ రూంలోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా?. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా?’’ అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవ్వగా.. ఆమెను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇక.. తనయుడి వెంట అల్లు అరవింద్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని వాహనం నుంచి దించేశారు. ‘మంచైనా చెడైనా నాదేనంటూ..’ ఆ టైంలో అల్లు అర్జున్ , అరవింద్తో అన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండినాలుగు సెక్షన్ల కింద కేసుభారత న్యాయ సంహిత సెక్షన్లు 105, 118(1) రెడ్విత్ 3/5 కింద కేసు పెట్టారు. ఇందులో 105 నాన్బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. ఈ కేసులో గనుక నేరం రుజువైతే కనీసం ఐదేళ్లు.. గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అలాగే.. బీఎన్ఎస్ 118(1) సెక్షన్ చూసుకుంటే ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడుతుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య ధియేటర్కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సంధ్య థియేటర్ యజమానులలో ఒకరైన ఎం సందీప్ను, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ విజయ్ చందర్ ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి.. తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, అలాంటి నోటీసులేం జారీ చేయకుండానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.హైకోర్టులో పిటిషన్ ఉండగానే..ఈకేసుకు సంబంధించిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ కావడం గమనార్హం.మాకేం సంబంధం లేదు!తమకు సంబంధం లేకుండా, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ‘ప్రీమియర్ షో నిర్వహణ థియేటర్ యాజమాన్యం నిర్ణయం కాదు. చట్టప్రకారం గత నెల 29న ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రదర్శనపై మైత్రి డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నెల 4, 5 తేదీల్లో బెనిఫిట్ షో కోసం గత నెల 30 నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున చిక్కడపల్లి పోలీసులకు, ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. .. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా భారీగా వచ్చిన అభిమానులతో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు మహిళ మృతి ఘటన చోటుచేసుకుందే తప్ప ఇది హత్య కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదు. ఈ ఘటనలో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా మేం దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పైనా కేసు నమోదు చేశారు.నిర్లక్ష్యం!అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్న విషయాన్ని పోలీసులకు ముందుగా తెలియజేయడంలో అలసత్వం వహించడంతోపాటు భద్రత విషయంలోనూ నిర్లక్ష్యం వహించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బన్నీ.. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.చదవండి: బాక్సాఫీస్ బాద్షాగా పుష్పరాజ్.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు -
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్వర్మ తన అభిప్రాయాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
పుష్ప 2: సంధ్య థియేటర్లో తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్లో భాగంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే రేవతి మృతిచెందినట్లు తేల్చిన పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యజమాని, సెక్యూరిటీ మేనేజర్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.అసలేం జరిగిందంటే?హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్ సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు జనం భారీ ఎత్తున వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ కూడా థియేటర్కు రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగ్గా దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అటు సంధ్య థియేటర్ యాజమన్యంతో పాటు అల్లు అర్జున్ టీమ్పైనా కేసు నమోదు చేశారు. ఈ విషాదంపై అల్లు అర్జున్ స్పందిస్తూ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు రూ.294 కోట్లు రాబట్టి అందరితో ఔరా అనిపించింది. ఓవరాల్గా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూలు చేసింది. పుష్ప దూకుడు చూస్తుంటే వెయ్యి కోట్లు అవలీలగా వచ్చేట్లు కనిపిస్తోంది. చదవండి: పుష్ప రాజ్ హవా.. మూడు రోజుల్లోనే హిందీలో మరో రికార్డ్! -
రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్
-
Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల సాయం
పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించాడు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియో షేర్ చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 'మొన్న నేను పుష్ప ప్రీమియర్స్ చూసేందుకు ఆర్టీసీ క్రాస్రోడ్కు వెళ్లాను. అక్కడ జనం రద్దీ ఎక్కువ కావడంతో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదురేవతి అనే మహిళకు దురదృష్టవశాత్తూ దెబ్బలు తగిలి మరణించింది. ఈ విషయం నాకు సినిమా చూసొచ్చిన తర్వాతి రోజు ఉదయం తెలిసింది. నేను, సుకుమార్, పుష్ప టీమ్ మొత్తం ఈ వార్త చదివి ఎంతగానో బాధపడ్డాం. 20 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక ప్రధాన థియేటర్కు వెళ్లి సినిమా చూడటమనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సడన్గా ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయాం.తట్టుకోలేకపోయాం..అందుకే పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయడానికి.. అలాంటిది థియేటర్లోనే ఇలాంటి విషాదం జరిగేసరికి తట్టుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము ఏం చేసినా మీరు లేని లోటును పూడ్చలేం.మీ కోసం నేనున్నా: అల్లు అర్జున్ కానీ మీ కుటుంబం కోసం మేమున్నామ. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తాం. నా తరపున రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నాను. మీకోసం నేనున్నాను అని చెప్పడానికే ఈ డబ్బు ఇస్తున్నాను. ఇప్పటివరకు అయిన హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని అల్లు అర్జున్ మాట్లాడాడు.Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz— Allu Arjun (@alluarjun) December 6, 2024చదవండి: సమంత మా ఇంటిమనిషి, రూ. 25 లక్షలిచ్చా: బెల్లంకొండ సురేశ్ -
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్పై కేసు నమోదు
హీరో అల్లు అర్జున్ టీమ్పై కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్న సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే బన్నీ వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా భాద్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ అల్లు అర్జున్ టీమ్పైనా కేసు ఫైల్ చేశారు.అసలేం జరిగిందంటే?సెంట్రల్ జోన్ డీసీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో బుధవారం రాత్రి 9.40 గంటలకు ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్కు వెళ్లాడు. సినిమా టీమ్ థియేటర్కు వస్తుందని పోలీసులకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో వారిని నెట్టేయడం ప్రారభించారు. అప్పటికే థియేటర్ లోపల, వెలుపల జనం కిక్కిరిసిపోయి ఉండటంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి కుటుంబం చెల్లాచెదురయ్యారు. పెద్ద ఎత్తున జనాలు ఉండటంతో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్కు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ -
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
సంథ్య థియేటర్ వద్ద ఉద్రికత్త.. న్యాయం చేయాలంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుష్స-2 సినిమా విడుదల సందర్బంగా చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ థియేటర్ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని థియేటర్ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. దీంతో, వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.ఇదిలా ఉండగా.. రేవతి మృతిపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని చెప్పుకొచ్చింది. మరోవైపు.. మహిళ మృతి విషయం పట్ల పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. -
సంధ్య థియేటర్ వద్ద ఘటన.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్!
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం పట్ల దురదృష్టకరమని తెలిపింది. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ నిమ్స్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించారు. అయితే ఆ థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్నారని పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. -
వీడియో.. థియేటర్లో టపాసులు పేల్చి రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్!
సినిమా రీరిలీజ్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. హీరోల కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మొన్నామధ్య పవన్ కల్యాణ్ ఖుషి, మహేశ్బాబు ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేయగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఈమధ్యే ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేయగా దానికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈసారి మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. తాజాగా అల్లు అర్జున్ బర్త్డే(ఏప్రిల్ 8) సందర్భంగా దేశముదురును రీరిలీజ్ చేశారు. బర్త్డేకు రెండు రోజుల ముందే ఏప్రిల్ 6న గ్రాండ్గా రీరిలీజ్ చేశారు. సిక్స్ప్యాక్ ట్రెండ్ను టాలీవుడ్కు పరిచయం చేసిన అభిమాన హీరో మాస్ సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ ఊరుకుంటారా? థియేటర్లకు వరుసకట్టారు. ఈ క్రమంలో సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్కు అభిమానులు భారీగా తరలివచ్చారు. డైలాగులు, పాటలు వచ్చిన ప్రతిసారి ఈలలు, కేకలు, అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు. అక్కడివరకు బానే ఉంది అంతటితో ఆగకుండా పేపర్లు చింపుతూ థియేటర్ లోపలే టపాసులు పేల్చారు. ఈ విషయం తెలిసిన పోలీసులు షో ఆపేసి లోనికి వెళ్లి అభిమానులను హెచ్చరించారు. ఈ విషయం గురించి నిర్మాత శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. 'సంధ్య థియేటర్ లోపల టపాసులు పేల్చడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దయచేసి అభిమానులు సీట్లకు, థియేటర్కు డ్యామేజీ చేయవద్దని కోరుతుతున్నాను. సినిమాను ఎంజాయ్ చేయండి. అలాగే దేవాలయాలుగా భావించే థియేటర్లను రక్షించండి' అని ట్వీట్ చేశాడు. కాగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన దేశముదురు 2007 జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రంలో హన్సికా మొత్వానీ కథానాయికగా నటించింది. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించారు. Police interpreted the show due to the hugeee crowds and bursting crackers inside Sandhya 70 mm Request fans don't damage seats and burst crackers inside theaters Enjoy the single screen Euphoria Respect and protect theaters which r our temples 🤗❤️#Desamuduru4KSpecialShows pic.twitter.com/YtgCKRFABz — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 6, 2023 RTC X Road Sandhya 70MM #Desamuduru4K Celebrations!! 💥💥 Maku support chesina parthi team member ki thank you ♥️🔥 Next #Aarya2 ki ready ayipoindi .#Desamuduru4kSpecialShows#DesamuduruCelebrations pic.twitter.com/Oc5CuJYJQi — Allu Arjun Fan™ (@UrsAlluSai) April 7, 2023 BLOCK BUSTER #Desamuduru 💥 Telugu states witnessed never before MASS JATHARA on Working Day!!!! Just @alluarjun cults things🛐 🙏#DesamuduruCelebrations#Desamuduru4KSpecialShows pic.twitter.com/wEMky9z6jL — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) April 7, 2023 -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
సంధ్య థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్
మెగా మేనల్లుడు, ‘సుప్రీమ్’ హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ రోజు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను పలు థియేటర్లో రీరిలీజ్ చేస్తూ స్పెషల్ షోలను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లోకి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో జల్సా స్పెషల్ షోను ప్రదర్శించారు. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్ ఈ సందర్భంగా మేనమామ చిత్రాన్ని చూసేందుకు థియేటర్కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్తో కలిసి థియేటర్లో రచ్చ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ ఎన్నో సందర్భాల్లో తాను పవన్ కల్యాణ్కి వీరాభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ట్రెడిషనల్ లుక్లో తారక్ భార్య, కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రణతి Fan Boy @IamSaiDharamTej Anna❤️❤️❤️❤️#HBDJanasenani #HBDJanasenaniPawanKalyan#PSPK #Jalsa4KCelebrations #SaiDharamTej pic.twitter.com/be6WsgGm6c — Bhavani (@Bhavani00285593) September 2, 2022 -
భార్యతో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చూసిన నితిన్
హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు(ఆగస్టు12)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ భార్య షాలినితో కలిసి హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను వీక్షించారు. వీరితో పాటు నిర్మాత శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఆచార్య: థియేటర్ వద్ద సోనూ సూద్ భారీ కటౌట్కి పాలభిషేకం
Fans Pouring Milk On Sonu Sood Cutout At Acharya Theatres: సోనూ సూద్.. పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో విలన్గా కంటే నిజ జీవితంలో రియల్ హీరోగానే అందరికి తెలుసు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అప్పటి నుంచి ఎవరూ ఏ సాయం అడిగినా కాదనకుండ తనవంతుగా చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫౌండేషన్ పెట్టి అనారోగ్యులకు వైద్య ఖర్చులు, పెద పిల్లలకు చదువు.. ఇలా రకరకాల సామాజిక సేవలు అందిస్తున్నారు. దీంతో సోనూ సూద్ అందరికి రియల్ హీరో అయ్యారు. చదవండి: బాలీవుడ్ నటి జావ్వెలిన్ ఫెర్నాండేజ్కు ఈడీ షాక్ ఈ నేపథ్యంలో సోనూ సూద్ మీద అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన చిరంజీవి, రామ్ చరణ్ల మల్టిస్టారర్ ‘ఆచార్య’ మూవీలో ప్రతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న(ఏప్రిల్ 29)న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో సోనూసూద్ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అంతేకాదు ఆయన కటౌట్కి పాలభిషేకం చేసి.. పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అంతేకాదు కటౌట్ ముందు టపాసులు పేలుస్తూ సందడి చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై సోనూసూద్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSood pic.twitter.com/1hNurkpZR7 — Harish Kumar (@apparalaharishk) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి
Allu Arjun And Family Visits RTC X Road Sandhya Theater: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మూవీ నేడు(డిసెంబర్ 17) విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రిలీజ్ అయిన థియేటర్లో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదే లే అన్నట్టుగా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ థియేటర్లో బన్నీ ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు. పుష్ప మూవీ చూసేందుకు భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు వచ్చారు అల్లు అర్జున్. అక్కడ బన్నీని చూడగానే ఫ్యాన్స్ అంతా మరింత రచ్చ చేశారు. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. బన్నీతో సెల్ఫీ దిగేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అల్లు అర్జున్పై పూలు చల్లుతూ ‘తగ్గేదే లే’ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో థియేటర్లోకి వెళ్లేందుకు బన్నీ ఫ్యామిలీ కాస్తా ఇబ్బంది పడింది. ఇక వారి రాకతో అక్కడ మరింత సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే థియేటర్లకు అడ్డా.. ఏ సినిమాను చూడాలన్నా… గొంతుచించుకుని అరవాలన్నా… హంగామా చేయాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్డుయే. అందుకే అక్కడి థియేటర్లలో ఏ సినిమా రిలీజైనా… ఆ సినిమా హీరో వచ్చి ఫ్యాన్స్ రెస్పాన్స్ను చూస్తుంటారు. సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
‘సంధ్య’లో సూర్య
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సంధ్య థియేటర్లో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాను భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్తో కలిసిప్రేక్షకుల మధ్య వీక్షించారు. అర్జున్తో కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ముషీరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో హీరోఅల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీని భార్య స్నేహారెడ్డి, చిత్రయూనిట్సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీక్షించారు.స్టైలిష్ స్టార్ను చూసేందుకు అభిమానులు తరలొచ్చారు. -
‘ఎవడు’ థియేటరికల్ ట్రైలర్ లాంచ్