Sarath Babu
-
మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!
మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే.. చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు. ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్లో ఉద్యోగం చేస్తూనే క్యాట్కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! (చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!) -
శరత్బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్గానే ఉండిపోయింది. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్కుమార్ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను. బిడ్డను కనాలనుకున్నాం నేను శరత్బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు. అభ్యంతరం లేకపోతే.. మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత. తప్పించుకోలేకపోయా.. ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత. చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనట! -
సెప్టిక్ షాక్: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
నా గ్లామర్ సీక్రెట్ అదే: శరత్ బాబు
-
ఆ సినిమా తర్వాత ఫ్రెండ్ అంటే నీ లాగే ఉండాలి అనేవారు
-
నా పేరు ముందు ఎటువంటి తోకలు వద్దు అనుకున్న
-
నా ఫస్ట్ సినిమానే ఆయనతో చేయడం అదృష్టం
-
నేను శరత్ బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. ఆ ఫోటోలపై స్పందించిన నటి!
స్నేహ నంబియార్ మలయాళీ అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులోనే. స్నేహా ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్స్లో కూడా నటించారు. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ బెంగళూరులో పుట్టి పెరిగడంతో కన్నడ భాష సులభంగానే నేర్చుకుంది. అంతే కాకుండా ఆమెకు తమిళ భాషపై కూడా పట్టుంది. దక్షిణాది భాషలపై ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఆమెపై అప్పట్లో కొన్ని వార్తలు వ్యాపించాయి. ప్రముఖ నటుడు శరత్బాబును స్నేహ రెండో పెళ్లి చేసుకుందన్న వార్త అప్పట్లో వైరల్గా మారింది. అంతేకాదు కొంతకాలానికి వీరు విడాకులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్కు తెరలేపేవారు) నా ఫోటోలు ప్రచారం చేశారు అయితే శరత్ బాబు రెండో భార్యగా స్నేహ నంబియార్ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది. 'నా పేరుతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. శరత్ బాబు రెండో భార్యగా నా ఫొటో పెట్టారు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు కూడా వదల్లేదు ఆ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా శరత్ బాబు రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు. కానీ నేను ఆయన భార్యను కాదు. అసలైన స్నేహ నంబియార్ నాకంటే పెద్దది. తను ప్రముఖ నటుడు నంబియార్ కూతురు. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి నా ఫోటోలు పెట్టేవారు. నిజానికి నా పేరు కేవలం స్నేహ మాత్రమే! అయితే స్నేహ అనే పేరుతో చాలామంది నటీమణులు ఉన్నందున నా పేరు పక్కన మా నాన్న పేరును చేర్చారు. స్నేహ పేరు పక్కన నంబియార్ చేర్చడానికి కారణం.. పైగా నంబియార్ అనేది కేరళలోని కన్నూరులో ఓ చిన్న వర్గం. అందుకే తన పేరు తర్వాత మా వర్గమైన నంబియార్ను జత చేశారు. అలా నన్ను స్నేహ నంబియార్ అని పిలిచారు. అప్పట్లో అది కూడా పెద్ద వార్తే. ఎందుకంటే నేను ప్రముఖ తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె అని చెప్పుకుంటున్నాననీ విమర్శించారు. నేను శరత్బాబును రెండో పెళ్లి చేసుకోలేదు. నంబియార్ కుమార్తెను కూడా కాదు' అని ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది నటి. (ఇది చదవండి: పెళ్లిలో ఆలియా భట్ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్) రమాప్రభతో పెళ్లి-విడాకులు సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. 14 ఏళ్ల తర్వాత విడాకులు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్ను రెండో పెళ్లి చేసుకోగా వీరి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. -
మెగాహీరోకి పోటీగా శరత్ బాబు వారసుడు
కొన్నాళ్ల క్రితం (మే 22) కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్బాబు ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు. శరత్బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. కాగా గతంలో ఆయుష్ని తన నటవారసుడిగా శరత్బాబు పేర్కొన్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ‘దక్ష’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' థియేటర్లలోకి రానుంది. ‘‘మా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మా ప్రోడ్యూసర్, డైరెక్టర్ రాజీ పడకుండా పూర్తి చేశారు. మా నాన్న (శరత్బాబు)గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం’’ అన్నారు ఆయుష్. అఖిల్, రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రానికి సంగీతం: లలిత్. -
నాకు ఆ స్టార్ బిరుదులు వద్దమ్మా.. !
-
నా లైఫ్ లో ఇద్దరే ఇద్దరు.. వాళ్ళ వల్లే నా జీవితం మారిపోయింది
-
శరత్ బాబు చివరి ఇంటర్వ్యూ
-
జాలేస్తోంది, నవ్వు వస్తోంది, ఒక్కోసారి బాధగానూ..: రమా ప్రభ
దివంగత నటుడు శరత్ బాబు మాజీ భార్య రమాప్రభ తనపై వస్తున్న కొన్ని వార్తలపై మండిపడింది. అదే సమయంలో శరత్ బాబు మరణ వార్తపై పరోక్షంగా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రమాప్రభ ప్రయాణం అనే సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను వదిలింది. 'ఈ మూడు నెలల్లో చిన్న టూర్లు వేశాను. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లొచ్చాను. ఈ మూడు నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా ఉంటుంది.. ఈ మధ్య ఏదో ఒకరకంగా పాపులర్ అవుతున్నా. ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి. కాబట్టి మాట్లాడాలి. చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలామంది ఉన్నారు. అక్కడుంది రమాప్రభ హీరో అని ఎవరూ చెప్పడం లేదు. అందరూ అక్కడే ఉన్నారు కానీ అది నా ఇల్లు అని కాకుండా వేరేవాళ్ల ఇల్లు అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది. నాకు రజనీకాంత్ డబ్బులిచ్చారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ మిగతావారు సంపాదిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది రమాప్రభ. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. 'శరత్బాబు గురించి ఫీల్ అవుతున్నారా అమ్మ? 13 ఏళ్లు కలిసున్నారు కాబట్టి ఆ బాధ తప్పకుండా ఉంటుంది', 'శరత్బాబును హీరోగా నిలబెట్టడం కోసం వింత ఇల్లు సంతగోల అనే సినిమా తీసి మీరు ఎంత నష్టపోయారో నాకు తెలుసు. ఈ రోజు ఆయన కీర్తి మీ చెమట, మీ రక్తం.. వాటి పునాది మీదే ఆయన ఆనాడు నిలబడ్డారు' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోయిన్తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన అజిత్ బావమరిది -
శరత్ బాబు ఆస్తులు.. అంతా వారికే రాసిచ్చాడా?
సీనియర్ శరత్ బాబు ఇటీవలే అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూసిన ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం చెన్నైలో అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రనయనాల అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. టాలీవుడ్, కోలీవుడ్లోని స్టార్ హీరోలందరితో నటించారు. (ఇది చదవండి: ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు) నటి రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం లేదు. దీంతో శరత్ బాబు ఆనారోగ్యానికి గురి కావడంతో ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తుల గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ శరత్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి? వాటిని ఎవరి పేరు మీదనైనా రాశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వారి పేరు మీదే వీలునామా! అయితే దీనికి ఆస్తులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఆయన బతికుండగానే ఓ వీలునామా రాశారని తెలిసింది. హైదరాబాద్, చెన్నై , బెంగళూరులో ఆయనకు ఇళ్లు, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తిని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల పిల్లల పేర్ల మీద వీలునామా రాశారట శరత్ బాబు. ఆయన మరణం తర్వాత ఈ విషయం బయటపడింది. సోదరి కన్నీటి పర్యంతం శరత్ బాబు మరణం తర్వాత ఆయన సోదరి సరిత స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న మరణాన్ని తలచుకుని ఎంతో బాధపడిన ఆమె.. తనకు తల్లి, తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అంటూ బోరున విలపించారు. తన కొడుకును చదివించి.. తన కుమార్తె పెళ్లి కూడా చేశారని చెప్పారు. చివరగా తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారని.. సోనియాని దత్తత తీసుకుంటానని అన్నయ్య చాలా సార్లు అన్నారని శరత్ బాబు సోదరి తెలిపారు. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) శరత్ బాబు ప్రస్థానం 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. కాగా.. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిసారిగా నరేశ్-పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. -
ఆరోజు చెప్పిన వినలేదు..
-
శరత్బాబుకు తమిళ సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
Sarath Babu Funerals: సీనియర్ నటుడు శరత్బాబు అంత్యక్రియలు (ఫొటోలు)
-
శరత్ బాబుకు తుది వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
సీనియర్ నటుడు శరత్బాబు అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, సన్నిహితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాగా.. శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు కోలుకోలేక మృతి చెందారు. (ఇది చదవండి: చెన్నైలో శరత్బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. -
నా పెళ్లి దగ్గరుండి చేసాడు
-
చెన్నైలో శరత్బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..
సీనియర్ నటుడు శరత్బాబు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు.చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్బాబు నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన చివరగా నరేష్-పవిత్రా లోకేష్ల మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనరోగ్యంతో ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజీలో చేరిన శరత్బాబు మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. నేడు అంత్యక్రియలు శరత్బాబు తోడబుట్టినవాళ్లల్లో అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. శరత్బాబు రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడేళ్ల కిందట మృతి చెందారు. అక్కచెల్లెళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజా ఉన్నారు. శరత్బాబు మృతికి రజనీకాంత్, కమల్హాసన్, చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సోమవారం సాయంత్రం 2 గంటల పాటు హైదరాబాద్లోని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం శరత్బాబు భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత చెన్నై తరలించారు. చెన్నైలో నేడు శరత్బాబు అంత్యక్రియలు జరుగుతాయి.అయితే ఆయనకు పిల్లలు లేకపోవడంతో తలకొరివి ఎవరు పెడతారన్నది సందేహంగా మారింది.చదవండి: 'ఆర్ఆర్ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే! -
చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్బాబు
కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయ నటుడు... ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయిన అందాల నటుడు శరత్బాబు (71) ఇక లేరు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కిత్స తీసుకుని, బెంగళరు వెళ్లారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావటంతో బెంగళరులోని ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గత నెల 20న ఆయన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. శరత్బాబు శరీరంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతినగా, వెంటిలేటర్పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. చివరికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్! అదే చివరి కోరిక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో శరత్బాబు చేసిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’ (2023). ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన ‘మళ్ళీ పెళ్లి’లో శరత్బాబు కీలక పాత్ర చేశారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి సినిమా. వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్లో స్థిరపడాలనేది శరత్బాబు కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాలేదు. చివరికి శరత్ కోరిక నెరవేరలేదు. అదే చివరిరోజైంది... నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే శరత్బాబుకు హార్సిలీహిల్స్తో దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లోనే హార్సిలీహిల్స్ కో–ఆపరేటివ్ బిల్డింగ్ సోసైటీలో సభ్యత్వం పొందారు. ఈ సభ్యత్వంతో 16–4–1985లో ఆయనకు కొండపై మానస సరోవరం పక్కన ఇంటి నివేశనస్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో అప్పట్లోనే ఇంటి నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో గోడల వరకే నిర్మాణం ఆపేశారు. ఈ ఇంటిని కొనుగోలు చేస్తామని, విక్రయించాలని పలువురు కలిసినా విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేసేవారు కాదు. ఇంటి నిర్మాణం పూర్తి చేయించకపోవడం, అలాగే వదిలేయడంతో దాన్ని సంరక్షించే బాధ్యతను స్థానిక వ్యక్తికి అప్పగించారు. అతను తరచూ ఫోన్లో శరత్బాబుతో మాట్లాడేవారు. శరత్బాబు ఏటా హార్సిలీహిల్స్ వచ్చి అసంపూర్తిగా ఉన్న ఇంటిని చూసుకుని, స్థానికులతో ముచ్చటించేవారు. ఆయన చివరగా 2021 మార్చి, 24న హర్సిలీహిల్స్ వచ్చారు. ఆరోజు తనకు పరిచయం ఉన్న స్థానికులతో మాట్లాడారు. పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ఆ చిత్ర నిర్మాణాలు పూర్తయ్యాక హార్సిలీహిల్స్కు వచ్చేసి కుటుంబంతో ఇక్కడే ఉండిపోతానని అప్పుడు చెప్పారు. ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లాక శరత్బాబు హార్సిలీహిల్స్ రాలేదు. ఆదే చివరిరోజైంది. -
ముగిసిన శరత్ కాలం..
సాగర సంగమం సంపూర్ణమవ్వాలంటే బాలుకు ఓ రఘుపతి కావాలి. సీతాకోక చిలుక అందంగా ఎగరాలంటే ఆ కథకు డేవిడ్ ఉండి తీరాలి. అన్వేషణ అంతం కావాలంటే అడుగడుగునా జేమ్స్ కనిపించాలి. ఆపద్బాంధవుడిలా చిరంజీవి మారాలంటే శ్రీపతి లాంటి ఉత్తముడు రావాలి. అప్పలనరసయ్య సంసారాన్ని చదరంగంలా ఆడాలంటే ప్రకాష్ అనే పొగరుబోతు కొడుకు ఇంటిలో తిరగాలి. పనివాడు ముత్తు గొప్పవాడిగా మారాలంటే నిజం తెలుసుకునే జమీందార్ అతని కళ్ల ముందుండాలి. ఇన్ని గొప్ప కథలకు, ఇలాంటి కథకులకు వరంలా దొరికిన నటుడు శరత్బాబు. ఆమదాలవలసలో పుట్టి పెరిగిన ఈ అందగాడు తెలుగు, తమిళ సినిమాల్లో మర్చిపోలేని పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వెండితెరపై అందంగా వికసించిన ఆయన నవ్వు ఇప్పుడు మాయమైపోయింది. అర్ధ శతాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన నట ప్రస్థానం నేటికి కళామతల్లి పాదాల చెంతకు చేరుకుంది. వంశధార నుంచి మెరీనా తీరం వరకు ఆయన సాగించిన ప్రయాణం సిక్కోలు స్మరించుకుంటోంది. ఆమదాలవలస: వంశధార నదీ తీరాన సత్యనారాయణ దీక్షితులుగా ఆడిపాడిన శరత్బాబు వేలాది మంది సినిమా అభిమానులను శోకంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆమదాలవలసకు చెందిన ఆయన రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముందు చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు, మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆమదాలవలసలోనే.. ► శరత్బాబు బాల్యం, యవ్వనం ఆమదాలవలసలో నే గడిచింది. ఆయన తండ్రి విజయ్శంకర్ దీక్షితులు ఉత్తరప్రదేశ్లో పెళ్లి చేసుకుని ఆమదాలవలస వచ్చి స్థిరపడ్డారు. ► శరత్బాబు ఇక్కడే పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 13 మంది సంతానంలో శరత్బాబు ఒకరు. వీరికి ఆమదాలవలసలో రైల్వేస్టేషన్ ఎదురుగా గౌరీ శంకర్ విలాస్ అనే బ్రాహ్మణ భోజన హొటల్ ఉండేది. ► శరత్బాబు ఆమదాలవలసలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► తిత్లీ తుఫాన్ సమయంలో రెండు లక్షల రూపాయలు జిల్లాకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆమదాలవలసలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంగమేశ్వర దేవాలయాలకు ఒక్కో లక్ష చొప్పున విరాళాలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యా: స్పీకర్ ఆమదాలవలసకు మంచి పేరు తెచ్చిన నటుడు శరత్బాబు మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో, ఆమదాలవలస పట్టణానికి చెందిన సత్యనారాయణ దీక్షితులు అలియాస్ శరత్ బాబు మృతి చెందిన సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదువుకున్న రోజుల్లోనే నటనపై శరత్ బాబుకు మక్కువ ఉండేదన్నారు. అప్పట్లో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ‘వాపస్’ నాటకంలో నిరుద్యోగ యువకుడిగా శరత్ బాబు వేసిన పాత్ర రక్తి కట్టించిందన్నారు. 44 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆమదాలవలస పేరు ప్రఖ్యాతలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో శరత్ బాబు ఒకరిని కొనియాడారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని లోటు శరత్బాబు మృతి అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆమదాలవలసకు తీరని లోటని ఆమదాలవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ జేజే మోహన్రావు అన్నారు. శరత్బాబుతో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవని జ్ఞాపకం చేసుకున్నారు. చివరిసారిగా ఆమదాలవలసలో అయ్యçప్పస్వామి ఆలయ ప్రతిష్ట సమయంలో ఆయన వచ్చారని చెప్పారు. ఆమదాలవలస పట్టణంలోని గల ప్రధాన రహదారి సింగపూర్ రహదారిలా తీర్చిదిద్దుదామని శరత్బాబు అన్నారని తెలిపారు. శరత్బాబుకు ఆమదాలవలస లో ఎర్నాగుల ప్రభాకరరావు, పీరు యర్రయ్య, రవిబ్రహ్మం అనే స్నేహితులు ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఉద్యోగరీత్యా వేరే చోట్ల నివసిస్తున్నారని తెలిపారు. సంగమయ్య ఆలయానికి విరాళం ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండకు శరత్బాబు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల కిందట టైల్స్ వేయించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించే జాతర సంగమేశ్వర జాతర. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు జనం వచ్చి సంగమయ్య కొండను, గుహలో ఉన్న సంగమయ్యను దర్శించుకుంటారు. అలాంటి సమయాల్లో గుహ లోపలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు శరత్బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే గుహ లోపల టైల్స్ వేయించాలని తన సోదరులకు తెలపడంతో వాటిని అమర్చారు. కలిసి చదువుకున్నాం శరత్ బాబు మృతి చెందారని తెలియగానే సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయాననే బాధ కలిగింది. నేను, శరత్ బాబు ఏడో తరగతి నుంచి కలిసి చ దువుకున్నాం. శ్రీకాకుళం డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఎంపీసీ, నేను సీబీజెడ్లో చేరాం. మంచి తెలివైన విద్యారి్థ. క్రమశిక్షణకు మారుపేరు. శరత్ బాబు ఒరిజనల్ పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన ముప్పైఏళ్లు వరుసగా అయ్యప్ప మా ల వేశారు. 2019 వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తర్వాత తగ్గింది. 1980 లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో టంకాల బాబ్జీ తదితరులు శరత్బాబును సత్కరించారు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. – పీరు ఎర్రయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ -
'శరత్ బాబు వెండితెర 'జమిందార్'': మెగాస్టార్ చిరంజీవి
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అనేక చిత్రాలలో నా సహనటుడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) కాగా.. అనారోగ్య కారణాలత హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తరలించిన కుటుంబసభ్యులు.. మంగళవారం చెన్నై ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV — Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023 -
Sarath Babu: శరత్బాబు పార్థీవ దేహానికి సినీ ప్రముఖుల నివాళులు
-
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!
తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో శరత్ బాబు తనదైన నటనతో అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. శ్రీకాకులం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. కానీ అనుకోకుండానే నటనలో ప్రవేశించారు. 1973లో రామరాజ్యం సినిమాతో మొదలైన శరత్ బాబు ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం చెన్నైకి వెళ్లారు. గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన శరత్ తొలి సినిమా ఛాన్స్ గురించి ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) ఇంటర్వ్యూలో శరత్ బాబు మాట్లాడుతూ.. 'మాకు ఊర్లో ‘గౌరీశంకర్’ అనే హోటల్ ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా హోటల్కు మంచి పేరు కూడా ఉండేది. అన్నయ్యతో పాటు నేను కూడా హోటల్ను చూసుకునేవాళ్లం. కాలేజీ అయిపోగానే అన్నయ్యకు హోటల్ పనుల్లో సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో మద్రాసు వెళ్లమంటూ నా స్నేహితులు బలవంతం చేశారు. అప్పట్లో నా అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారికి ఫొటోలు పంపాను. ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం పంపారు. మద్రాసుకు వెళ్లాక నన్ను చూసిన సుబ్బారావు.. మళ్లీ కబురు పంపిస్తా.' అని అన్నారు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయా! సినిమా ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ.. 'అయితే సుబ్బారావు ఎప్పుడు పిలుస్తారా అని మద్రాస్లోనే ఉన్నా. అప్పుడే రామా విజేత ప్రొడెక్షన్స్ వారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇచ్చారు. ఆడిషన్కు 3000 మంది రాగా.. చివరకు నేనే సెలెక్ట్ అయ్యా. యూ ఆర్ ద హీరో ఆఫ్ మై పిక్చర్ అని దర్శకుడు బాబూరావు చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇదంతా నిజమేనా అనిపించింది. జగ్గయ్య, ఎస్వీ రంగారావు, చంద్రకళ, సావిత్రి.. ఇలా అగ్రహీరోలతో కలిసి నా మొదటి సినిమా ‘రామరాజ్యం కోసం పనిచేశా. 1973లో అది విడుదలైంది. హీరోగా తొలి ప్రయత్నంలోనే నాకు గుర్తింపు లభించింది.' అని అన్నారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) -
ఆయన ఎంతో గొప్ప నటుడు: శరత్బాబు స్నేహితులు
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన మరణంపై శరత్బాబు చిన్ననాటి మిత్రులు స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'పూర్వం శరత్బాబుతో కలిసి నాటకాలు, నాటికలు వేసేవాళ్లం. ఆయన నాకు మంచి మిత్రుడు. ఈ రోజు నా స్నేహితుడిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన మంచి నటుడని మేమే కాదు ప్రజలంతా చెప్తారు. అంతటి పేరు సంపాదించుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు. మరో స్నేహితుడు మాట్లాడుతూ.. 'నేను ఉపాధి కోసం తిరుగుతున్న సమయంలో శరత్బాబు ఫ్యామిలీ నాకు సాయం చేసింది. వారి వల్లే నేను సినీరంగంలో ప్రవేశించాను. 35 ఏళ్లు అదే రంగంలో ఉన్నాను. ఆయన తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువగా పేరుప్రతిష్టలు సంపాదించారు' అంటూ శరత్ బాబును గుర్తు చేసుకున్నాడు. చదవండి: రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్బాబు.. ఆస్తులు రాసిచ్చినా కూడా -
ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం: సీఎం జగన్
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. (ఇది చదవండి: శరత్బాబు-రమాప్రభ లవ్స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?) దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు.. చివరిసారిగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. శరత్ బాబు మృతి పట్ల ఏపీ ఫిల్మ్ డెవలప్మెంచ్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: పోసాని కృష్ణమురళి) తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/NaTgovOKOW — YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023 -
ప్రముఖ నటుడు శరత్ బాబు అరుదైన ఫోటోలు
-
శరత్బాబు-రమాప్రభ లవ్స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?
విలక్షణ నటుడు శరత్బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అప్పటికే నటిగా, స్టార్ కమెడియన్గా రమాప్రభకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో శరత్బాబును సినిమాల్లో రికమండ్ చేసి వేషాలు ఇప్పించారని వార్తలు వచ్చేవి. ఆ సమయంలో వీరి సాన్నిహిత్యంపై కథలు కథలుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరికి వాటినే నిజం చేస్తూ వయసులో తనకంటే నాలుగేళ్ల పెద్దదైన రమప్రభను శరత్బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అప్పట్లో శరత్ బాబు తాను మరచిపోలేని రోజులు మూడే అని అందులో ఒకటి తన పుట్టినరోజు కాగా, రెండు రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజూ అంటూ ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు. -
రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్బాబు!
పోలీస్ అవ్వాలనుకుని సినీ యాక్టర్ అయ్యారు శరత్ బాబు. మనము ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలుస్తారు. శరత్ బాబుకు యాక్టర్ కావాలి అని రాసి పెట్టి ఉంది. అందుకే.. ముఖానికి రంగేసుకొని వెండితెర మీద మెరిసిపోయారు. బిగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్ని కలుపుకుని దాదాపు 220కి పైగా చిత్రాలు చేశారు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు శరత్ బాబు. అండగా ఉన్న రమాప్రభ కానీ ఆయన వైవాహిక జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. తను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేనాటికే స్టార్ కమెడియన్గా రాణిస్తోంది రమాప్రభ. అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చేవారికి అండగా ఉండేది రమా ప్రభ. ఈ క్రమంలో శరత్ బాబు తను నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న సమయంలో ఆయనకు సపోర్ట్గా నిలబడింది. తనకంటే వయసులో నాలుగైదేళ్లు పెద్దదైన రమప్రభతో ప్రేమలో పడ్డారు శరత్ బాబు. ఈ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకుని చెరో దారి చూసుకున్నారు. దాని విలువ రూ.60 కోట్లు అయితే విడాకుల తర్వాత రమాప్రభ శరత్బాబుపై అనేక ఆరోపణలు చేశారు. తన ఆస్తి మొత్తం లాక్కున్నారని, తనను మోసం చేసి నడిరోడ్డుపై వదిలేశారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై చాలావరకు సహనంగా ఉన్న శరత్బాబు ఓ ఇంటర్వ్యూలో మాత్రం నోరు విప్పారు. ఆమె పేరు వాడకుండానే తన ఆరోపణలను తిప్పికొట్టారు. 'రమాప్రభకు ఆస్తులు లేవు. తన పేరిట ఉన్న ఒకే ఒక ఆస్తిని అమ్మి ఆ డబ్బుతో రమా ప్రభ పేరు మీద, ఆమె తమ్ముడి పేరు మీద ఫ్లాట్లు కొనిచ్చాను. పొలం అమ్మి ఆ డబ్బుతో ఉమాపతి స్ట్రీట్లో ఒక ఇల్లు కొనిచ్చాను. అమ్మిన భూమి విలువ ఇప్పుడు రూ.60 కోట్లు. ఇక ఆ ఇల్లు విలువ ఇంకెన్ని కోట్లు ఉంటుందో! మాదసలు పెళ్లే కాదు.. రమా ప్రభతో నేను క్లోజ్ అయ్యే సమయానికి నా వయసు 22 ఏళ్లు. రమాప్రభ నాకంటే ఐదేళ్లు పెద్ద. ఫ్రెష్గా కాలేజీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. తెలియని వయసులో పొరపాటు చేశా. అది నా దృష్టిలో పెళ్లి కూడా కాదు. ఒక కలయిక అంతే!' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శరత్ బాబు. చదవండి: శరత్ బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు -
శరత్ బాబు నటించిన చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన హైదరాబాద్లో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) రామరాజ్యం సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. సాగర సంగమం, సితార, సీతాకోక చిలక చిత్రాలతో గుర్తింపు సాధించారు. సాగర సంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్గా కనిపించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇలాంటి మిత్రుడు ప్రతీ ఒక్కరికి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర వేసి మెప్పించాడు. ఆస్తులు అన్ని పోయినా పరువు కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు. లోపల ఎంతో బాధ ఉన్న కూడా బయటకు మాత్రం గంభీరంగా కనిపించే క్యారెక్టర్లో అలరించాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో బంగారు మనిషి, లాయర్ విశ్వనాథం, శృంగార రాముడు, రామకృష్టుడు లాంటి సినిమాలలో నటించాడు. (ఇది చదవండి: Sarath Babu: శరత్బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..) కాగా.. ఆయన కెరీర్లో నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన ఇక లేడన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
Sarath Babu: శరత్బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..
హీరో నుంచి విలన్ దాకా ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఉద్ధండుడు శరత్ బాబు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక చిత్రాలు చేశారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పవచ్చు. వందలాది సినిమాలు చేసిన ఆయన తన దగ్గరకు వచ్చే ఏ పాత్రనైనా ప్రాణం పెట్టి చేస్తారు. శరత్బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్బాబు తండ్రి సత్యనారాయణ దీక్షిత్కు మొత్తం పదమూడుమంది సంతానం. అందులో నాలుగోవాడే శరత్బాబు. ఆ సలహాతో రూటు మారింది.. సత్యనారాయణకు అప్పట్లో పెద్ద హోటల్ ఉంది. తన తదనంతరం కొడుకే హోటల్ చూసుకుంటాడని ఆయన భావించారు. కానీ శరత్బాబుకు మాత్రం పోలీస్ కావాలని ఉండేది. ఫ్రెండ్స్, టీచర్లు అంతా నువ్వు హీరోలా ఉంటావు, సినిమాల్లో ట్రై చేయకపోయావా? అని సలహా ఇచ్చారు. ఈ మాటలు శరత్బాబు తల్లిని ఆలోచింపజేశాయి. తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి అవకాశాల కోసం ప్రయత్నించారు శరత్ బాబు. వెయ్యి మందిలో ట్రై చేస్తే శరత్కు దక్కిన ఛాన్స్ ఆ సమయంలో రామవిజేత సంస్థ నూతన నటీనటుల కోసం పేపర్లో ప్రకటన ఇచ్చింది. దాదాపు వెయ్యి అప్లికేషన్లు వస్తే ముగ్గుర్ని సెలక్ట్ చేశారు. ఆ ముగ్గురికీ స్క్రీన్ టెస్ట్ చేసి అందులో శరత్బాబును హీరోగా సెలక్ట్ చేశారు. అలా 1973లో రామరాజ్యం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శరత్. అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, పంతులమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతాకోక చిలుక ఇలా వరుస సినిమాలు చేస్తూ నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి.. వయసులో తనకంటే పెద్దదైన రమాప్రభతో ప్రేమ.. పెళ్లి అప్పటికే కమెడియన్గా స్టార్ హోదాలో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడటం, అది ప్రేమకు దారి తీయడంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. రమాప్రభ.. శరత్బాబు కంటే నాలుగేళ్లు పెద్దది. 14 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు. ఆ 25 మంది తన పిల్లలే.. ఆ తర్వాత నమితను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ అదంతా వుట్టి పుకారు అని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆయన సీక్రెట్గా ఎవరినో మూడో పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక తన పిల్లల గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు 25 మంది తన తన పిల్లలే అని సరదాగా చెబుతుండేవారు. శరత్బాబుకు ఎటువంటి దురలవాట్లు లేవు. తను పూర్తి శాకాహారి. చదవండి: శరత్బాబు ఇక లేరు -
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఏప్రిల్ 20న అనారోగ్యానికి గురైన శరత్ బాబును ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు సినీ ప్రస్థానం శరత్ బాబు మాతృభాష తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబు ఆదరణ పొందారు. గతేడాది రిలీజైన పవన్ కల్యాణ్ మూవీ నటించిన వకీల్ సాబ్లో ఓ అతిథి పాత్రలో కనిపించిన ఆయన.. వందలాది చిత్రాల్లో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన జన్మించారు. శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది.. అతనిలాగే కుమారుడు బిజినెస్ చూసుకుంటాడని తండ్రి భావించారు. కానీ శరత్ బాబుకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక ఉండేది. కానీ మిత్రులు, లెక్చరర్స్ ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నించారు. పేపర్లో రామవిజేత అనే సంస్థ కొత్త నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ద్వారానే శరత్ బాబుకు హీరోగా అవకాశం లభించింది. అలా శరత్ తొలిసారి నటించిన చిత్రం రామరాజ్యం. ఆ తర్వాత బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు వంటి చిత్రాల్లో నటించారు. రమాప్రభతో పరిచయం.. పెళ్లి అప్పటికే కమెడియన్గా ఉన్న రమాప్రభతో శరత్ బాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి..పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పద్నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను శరత్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు. -
శరత్బాబు ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తే కేసు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు శరత్బాబు ఆరోగ్యంపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్న వారిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలిసీ తెలియకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆ వార్తల్ని వెంటనే సదరు యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో తొలగించని పక్షంలో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారని వివరించారు. శరత్బాబు కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: చివరిసారి నంది అవార్డు అందుకున్న హీరో ఎవరో తెలుసా? -
'వదంతులు నమ్మొద్దు, శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది'
సీనియర్ నటుడు శరత్బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. ఇదే నిజమని నమ్మిన కొందరు సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు. అంతలోనే అదంతా ఫేక్ అని తెలియడంతో నాలుక్కరుచుకుని ట్వీట్లు డిలీట్ చేశారు. ఈ సోషల్ మీడియా వల్ల ఆయన్ను బతికుండగానే చంపేస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శరత్బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించాడు. శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని తెలిపాడు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. దయచేసి ఆయన ఆరోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరాడు. శరత్బాబు సోదరి సైతం త్వరలోనే ఆయన కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 1973లో విడుదలైన రామరాజ్యం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రల్లో మెప్పించారు. చదవండి: టార్చర్.. రోజూ కొట్టేవాడు.. విడాకుల ఫోటోషూట్ వెనక నటి దీనగాధ శరత్బాబుకు సంతాపం తెలిసిన కమల్ హాసన్, ట్వీట్ డిలీట్ -
శరత్బాబుకు సంతాపం తెలిపిన కమల్హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ
శరత్ బాబు చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంపై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది. శరత్ బాబు చనిపోలేదని.. ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం.' అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో పలువురు శరత్ బాబు చనిపోయినట్లు వైరల్ చేయడంతో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు!) శరత్ బాబు సోదరి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం రికవరీ అయి.. వేరే రూముకు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీ అందరితో మాట్లాడుతారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) మూడు సార్లు నంది అవార్డులు శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. -
శరత్ బాబుకు వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స
-
అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం!
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శరత్బాబుకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోసారి శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితుల చెబుతున్నారు. (చదవండి: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!) కాగా, 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలతో అలరించారు. -
శరత్బాబుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్కు తరలింపు
ప్రముఖ నటుడు శరత్బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశామని వైద్యులు తెలిపారు. కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలతో అలరించారు. -
ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు!
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. -
శరత్బాబుతో హీరోయిన్ నమిత పెళ్లి పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన భర్త
Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్గా పాపులర్ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే నమితపై గతంలో అనేక రూమార్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్లోనే నేను విన్న వరస్ట్ కామెంట్స్ ఇవి. అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్ పెట్టారు. -
Sarath Babu: శరత్బాబు నట వారసుడు హీరోగా ఎంట్రీ
Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ. చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ. -
శరత్బాబు సాయం రూ.2 లక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం సినీనటుడు శరత్బాబు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు. సంబంధిత చెక్ను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని ఆయన బంగ్లాలో గురువారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శరత్బాబు మాట్లాడుతూ తన సొంత జిల్లా శ్రీకాకుళంలో తుపాను బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని చూసి చాలా బాధపడ్డానన్నారు. కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ తుపానుతో ఉద్దానం ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయావన్నారు. జిల్లా వాసిగా శరత్బాబు స్పందించడం సంతోషకరమంటూ ఆయన్ని అభినందించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా వ్యవసాయరంగంలో మరింత అభివృద్ధి చెందాలని, అందుకు అధికారులు, మీడియా సహకారం అందించాలని కోరారు. -
అందమైన ప్రేమకు స్టార్ట్ కెమెరా
ఆ కళ్లు విశ్వమంత విశాలంగా ఉంటాయి. కాని నాలుగు గోడలను దాటి ఏమీ చూడలేవు. ఆ పాదాలు అలల వేగంతో కదలుతుంటాయి. కాని గడప దాటి ఎరగవు. ఆ చీర చెంగు నీలి మబ్బు. కాని ఎండ పొడ కూడా తగలదు. ఆ గుండెల్లో పట్టలేనన్ని ఆశలు. కాని ఉచ్చ్వాస నిశ్వాసలకు కూడా రేషన్. మరి– ఆ అమ్మాయి రాజావారి కూతురు. మహల్లో కోకిల. కాదు కాదు పంజరంలో పక్షి. అప్పటికే ఆ జమిందారీ పరగణ దివాలా తీసింది. పెద్దలు చేసిన పాపాలకు తెంపరితనాలకు ఆస్తులు హరించుకుపోయాయి. అప్పులు... కోర్టు కేసులు. మిగిలింది ఆ పాతకాలపు బంగళా. తల మీద తాతల నాటి పరువు బరువు. అలాంటి మహల్లో ఆ అమ్మాయి ఒక్కత్తి. ఆమెకు తోడుగా అన్న. అమ్మాయి భానుప్రియ. అన్న శరత్బాబు. ఊరి పెద్దల్లో మాత్రం ఇంకా ఆ కుటుంబం అంటే గౌరవం. మన్నన. గుట్టు బయట పడనందున ఇంకా మహల్లో దర్జాలూ వైభోగాలు ఉండే ఉంటాయని నమ్మకం. ఇలాంటి టైముకు ఊరికి ఉత్సవాలు వచ్చాయి. వాటి వెనుకనే ఒక పగటి వేషగాళ్ల బృందం వచ్చింది. సాక్షి రంగారావు, సుమన్, రాళ్లపల్లి, ధమ్.... వేడుకల్లో నాలుగు వేషాలు కట్టి నాలుగు డబ్బులు రెండు పాత బట్టలకు ఆశపడి వచ్చిన బక్క జీవులు. కాని వారిలో కూడా ఆత్మాభిమానం ఉన్న సుమన్ ఉన్నాడు. అందంతో కట్టి పడేసే అతడి రూపం వుంది. వేషం కడితే అందరూ నిలువు కాళ్లతో కాలాన్ని మరిచి చూసే ప్రతిభ ఉంది. ప్రతి రోజూ ఎవరు చూసినా చూడకపోయినా తొలి ప్రదర్శన మహలు ముందు ఆడాలని నియమం. అందరూ రోజూ మహల్ ప్రాంగణంలో ఆడుతుంటారు. కాని ఆ మహలు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. ఎవరూ వాటిని చూడరు. లోపలి నుంచి ఏ ఉలుకూ విందామన్నా ఎటువంటి పలుకూ ఉండవు. ఇలాంటి మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడం కన్నా వల్లకాటి ముందు భిక్షాటన చేయడం నయం అనుకుంటాడు సుమన్. కాని ఆ సమయంలోనే అతడి కంటికి ఒక కన్ను కనిపిస్తుంది. మహల్ పైన పగిలిన కిటికీ అద్దం నుంచి తననే చూస్తున్న కన్ను. అందమైన కన్ను. ఆడపిల్ల కన్ను. అరె... ఎవరో చూస్తున్నారే. అమ్మాయి గారేమో. అమ్మాయి గారే. సుమన్ను ఊపిరి వస్తుంది. ఉత్సాహం వస్తుంది. వెంటనే వెన్ను విల్లులా వంగి గొంతు నుంచి రాగం ఉబికి వస్తుంది. పరవశంగా ఆడతాడు. పరవశించి పాడతాడు. రోజూ వచ్చి ఆ మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడమే అతడి పని. అతడికి తెలుసు. రోజూ అమ్మాయి తననే చూస్తుంది. పగిలిన అద్దం నుంచి. చేపట్టు పగుళ్ల నుంచి. రహస్య కంతల నుంచి. తుదకు దేవి కరుణిస్తుంది. మహల్ తలుపు తెరుచుకుంటుంది. సుమన్కు మహల్లో ప్రవేశం లభిస్తుంది. కాని అది మహల్ కాదని గత వైభవం తాలుకు ఒక అవశేషమని లోపలికి వెళ్లాక సుమన్కు అర్థమవుతుంది. అతడు ఆమెనూ ఆమెకు తన పట్ల ఉన్న ఆరాధననూ అర్థం చేసుకుంటాడు. ఆ రాజకుమారి తన హృదయానికి బానిస. తాను ఆమె మనసుకు బంటు. ఇంత కాలం ఒక మనిషి తోడు ఒక మగవాడి స్పర్శ ఎరగని భానుప్రియ సంపూర్ణంగా ఆ తొలిప్రేమలో ములిగిపోతుంది. కాని రాజరికం ఊరుకుంటుందా? ఒక పగటి వేషగాడికి తన ఇంటి ఆడపడుచును కట్టపెడుతుందా? సుమన్ను చంపమని శరత్బాబు మనుషుల్ని పురమాయిస్తాడు. మనుషులు అతణ్ణి చంపి గోదాట్లో శవాన్ని అదిమి పెడతారు. భానుప్రియ నెత్తి మీద పిడుగు పడినట్టవుతుంది. మనసు ఛిద్రం అయిపోతుంది. తన ప్రేమ ఇంతటి క్రూరమైన మలుపు తిరగడం తట్టుకోలేకపోతుంది. మరోవైపు కోర్టు కేసు ఓడిపోయిన శరత్బాబు శేష జీవితం బికారిగా గడపడం అవమానంగా భావించి చెల్లెలిని నిర్దాక్షిణ్యంగా వదిలి ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రేమించినవాడు చనిపోయి, సోదరుడు దూరమయ్యి భానుప్రియ పూర్తిగా ఒంటరిదవుతుంది. దిక్కుతోచనిదానిలా మద్రాసు చేరుకుంటుంది. అక్కడ శుభలేఖ సుధాకర్ వంటి ఒక మిత్రుడి పరిచయంతో పెద్ద హీరోయిన్ అవుతుంది. కాని ఆమె గతం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. అది ఒక్కసారిగా బయటపడి ప్రపంచానికి తెలిసి జనం ఆమె వెంట పడటం ప్రారంభిస్తారు. ఒక జమీందారు అమ్మాయి హీరోయిన్గా మారడం వింత. ఆమెకో ప్రేమ కథ ఉండటం ఇంకా ఆసక్తి. దీనంతటి నుంచి విసిగిపోయి భానుప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కాని సుమన్ చనిపోలేదని బతికే ఉన్నాడని తెలిసి అతడి రాకతో ఆమె మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. ప్రేమను నిలబెట్టుకుంటుంది. 1984లో విడుదలైన సినిమా ‘సితార’. పూర్ణోదయ బేనర్లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. దర్శకుడు వంశీకి, నటి భానుప్రియకు ఇది చాలా పేరు తెచ్చింది. తెలుగులో భానుప్రియకు ఇది తొలి చిత్రం. మనకు పరిచయం ఉన్న జమిందారు కథలు, గోదావరి వెంట ఉండే సంస్కృతి, భాష, మంచి పలుకుబడి, సంగీతం ఇవన్నీ సినిమాకు హానెస్టీని ఒరిజినాలిటీని తీసుకు వచ్చాయి. ముఖ్యంగా అసూరంపశ్య వంటి ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ప్రేమలో పడినప్పుడు కలిగే అలజడి, అస్థిమితత్వం, మైమరపు, ముగ్ధత్వం... ఇవన్నీ భానుప్రియ కళ్లలోని భావాలతో దర్శకుడు కృతకత్వపు ఫిల్టర్స్ లేకుండా చూపించడం మరీ ముఖ్యంగా ఆమె జీవితంలోని తొలి కౌగిలింత తాలుకు గాఢతను చూపడం ఇవన్నీ చాలా బాగుంటాయి. అయితే వీటికి తోడు రాళ్లపల్లి, ధమ్, మల్లికార్జునరావు వంటి వారి హాస్యాన్ని జత చేయడం కూడా దర్శకుడి ప్రావీణ్యమే. లాంచీ మీద ప్యాసింజర్ని అర్ధరాత్రి నుంచి పీక్కు తింటున్న ధమ్ను ఉద్దేశించి ఆ ప్యాసింజరు ‘రేవెప్పుడొస్తుంది బాబూ’ అని అడగడం దానికి మనకు నవ్వు రావడం మర్చిపోలేము. పగటి వేషాలలో భాగంగా రాళ్లపల్లి ‘భేతాళుడు’ వేషం వేసి డప్పులతో దరువులతో ఊరిని హడలు గొడితే చంటి పిల్లలు జ్వరాన పడటం కూడా మంచి హాస్యమే. అసలు ఈ సినిమా మూగగా విడుదలయ్యి మూగగా రాలిపోవాల్సింది. ఇళయరాజా తన ఆర్.ఆర్తో దానికి ప్రాణం పోశాడు. ఆ ఆర్.ఆరే సన్నివేశాలను లేపి జీవంతో నిలబెట్టాయి. ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’, ‘కుకుకూ కోకిల రావే’, ‘కిన్నెర సాని వచ్చిందమ్మా’... ఈ పాటలన్నీ హిట్. కథను, కథా సంవిధానాన్ని, చెప్పే పద్ధతిని అర్థం చేసుకోవాలనుకోనేవారికి ఈ సినిమా మంచి సిలబస్ అని చెప్పవచ్చు. కొన్ని పాతబడవు. సితార కూడా. తెలుగు సినిమాల్లో నిలిచి మిణుకు మిణుకుమనే తార సితార. వెన్నెల్లో గోదారి అందం ‘వెన్నెల్లో గోదారి అందం’ జానకి పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఎడిటింగ్లోనూ ఈ సినిమా జాతీయ అవార్డులు గెలుచుకుంది. అయితే రాష్ట్ర పురస్కారాలకు మాత్రం మరో మంచి సినిమా ‘ఆనందభైరవి’ అడ్డు నిలిచింది. ఈ సినిమాలో వంశీ చాలా కొత్త తరహా చిత్రీకరణలు చేశారు. ఉదాహరణకు ‘కుకుకూ.. కుకుకూ.. కోకిల రావే’ అనే పాటలో గ్రూప్ డాన్సర్స్ చేతులు మనోహరంగా కనిపిస్తుంటాయి. వాళ్ల ముఖాలు కనిపించవు. దాని కారణం షూటింగ్ రోజున కొంచెం వయసు మళ్లిన డాన్సర్స్ రావడమే. వాళ్లను స్క్రీన్ మీద చూపించడానికి ఇష్టపడక అప్పటికప్పుడు ఆలోచన చేసి చేతుల మీదగా వంశీ పాటను తీసి అద్భుతం అనిపించారు. -
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో!
శరత్బాబు, సుజాత, సరిత ముఖ్య తారలుగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘గుప్పెడు మనసు’. మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసిన అద్భుతమైన పాటల్లో ఒకటైన ‘మౌనమే నీ భాష...’ ఈ చిత్రం లోనిదే. ఈ పాటతత్వం గురించి యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాటల్లో..... ఈ పాటలో మనిషి మనసు గురించి, మనస్తత్వం గురించి, జీవిత తత్వం గురించి చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితానికీ, వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలకూ ఈ పాటలోని తత్వం దగ్గరగా ఉంటుంది. హ్యూమన్ థింకింగ్, ఫిలాసఫీకి ఓ పాఠ్య పుస్తకం లాంటిదీ పాట. కర్మ–యోగి తత్వం తరహాలో ఉంటుంది. పల్లవి: మౌనమే నీ భాష.. ఓ మూగ మనసా (2) తలపులు యెన్నేన్నో కలలుగా కంటావు (2) కల్లలు కాగానే కన్నీరవుతావు ‘‘మౌనమే నీ భాష..‘‘ నిజమే... మనతో, ప్రతి మనిషితో తన మనసు మౌనంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే... మనసుకి భాష లేదు గనుక. కానీ, భావోద్వేగాలు మాత్రం బోలెడు. సంతోషం, దుఃఖం, నిరాశ, కోపం... మన మనసులో ఎన్నెన్నో భావోద్వేగాలు. మనసు మనిషితో మాట్లాడినప్పుడు ముఖంలో భావోద్వేగాలన్నీ బయటకొస్తాయి. ఈ తత్వాన్ని పల్లవిలో ఎంతో అందంగా చెప్పారు. ముఖ్యంగా పల్లవిలో చివరి రెండు లైన్లు నాకు బాగా ఇష్టం. ఉదాహరణకు... ప్రతిరోజూ ఎన్నో అంచనాలతో ఏదో జరుగుతుందనే ఆశతో మనమంతా పనులు ప్రారంభిస్తాం. ఆశించినది జరగని పక్షంలో నిరాశకు లోనవుతాం. కలలు కల్లలు కాగానే కన్నీరవుతావని ఆత్రేయగారు ఎంతో అద్భుతంగా చెప్పారు. చరణం 1: చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు (2) నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో (2) ‘‘మౌనమే నీ భాష..‘‘ ఈ చరణంలో మనసును నాటక రంగంతో పోల్చడం టిపికల్ కాయినింగ్. మది (మైండ్), మనసు (హార్ట్).. రెండిటి గురించీ చెప్పారు. నాటకాన్ని ఎప్పుడైనా చూశామనుకోండి... రకరకాల పాత్రలు వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ, రంగస్థలం మారదు. మన మనసులోనూ అంతే. ఎన్నెన్నో కోరికలు.. ఒక్కోసారి ఒక్కో కోరిక వచ్చి వెళ్తుంది. ఒకదానితో పొంతన లేని మరో కోరిక తర్వాత వస్తుంటుంది. ఓ డైరెక్షన్ అంటూ ఏమీ ఉండదు. తెగిన గాలిపటంలా ఏటో పయనిస్తుంది. సాధారణంగా మన మనసే హృదయ స్పందనలను నిర్ణయిస్తుందనీ, తద్వారా మది నడుచుకుంటుందనీ చెబుతారు. కానీ, మైండ్కి లాజిక్ కావాలి. మనసుకు ప్రేమ, ఫీలింగ్స్ సరిపోతాయి. బహుశా... ఆత్రేయగారు అది ఆలోచించే మనసు ఎందుకు వలచేవో, వగచేవో, రగిలేవో అన్నట్టున్నారు. చరణం 2: కోర్కెల సెల నీవు.. కూరిమి వల నీవు (2) ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ‘‘మౌనమే నీ భాష..‘‘ మన మనసు నిజంగా మాయల మహమ్మారి. ఊహాలోకంలో విహరించే వయ్యారి. ఎప్పుడూ ఉన్నదానితో సంతృప్తి చెందదు. దాన్ని వదిలేసి, లేనిదాన్నేదో కోరుతుంది. ఆ కోరికలు ఒక్కోసారి మనల్ని కూరిమిలోకి నెట్టేస్తాయి. ఒక్క తప్పు చేస్తే.. సరిదిద్దుకోడానికి కొన్నేళ్లు పడుతుందనే భావాన్ని ఈ చరణంలో చెప్పారు. మన గురించి, మన మనసు గురించి తెలుసుకోవడమే ఈ పాట అర్థమని నాకు అనిపిస్తుంటుంది. ఈ పాటలోని సాహిత్యం వినడానికి కవితాత్మకంగా అనిపించినా... మన మనసు కనులు తెరచి చూస్తే అంతులేని అర్థం ధ్వనిస్తుంది, కనిపిస్తుంది. భగవధ్గీత, బైబిల్, ఖురాన్... అన్నిటిలోనూ మనం ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అనే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. మనిషి జీవిత గమనానికి మార్గదర్శిగా నిలిచాయి. కానీ, ఈ పాటలో భావం, తత్వం అందరికీ అర్థమయ్యేలా గొప్పగా ఉంటుంది. నేను సంగీత దర్శకుణ్ణి కాబట్టి ప్రతి పాటలోనూ ఎక్కువగా సంగీతం, స్వరం గురించి ఆలోచించేవాణ్ణి. కానీ, ఈ పాట విన్న తర్వాత ఎవరు రాశారో తెలుసుకోవాలనుకున్నా. అప్పట్నుంచీ ఆత్రేయగారికి పెద్ద అభిమానినయ్యా. బాలమురళీగారు పాడిన విధానం గానీ, ఆత్రేయగారు రాసిన విధానం గానీ, ఎమ్మెస్ విశ్వనాథన్గారి బాణీ గానీ మహాద్భుతం అనే చెప్పాలి. ముగ్గురు లెజెండ్స్ కలసి చేసిన ఈ పాటను కొన్నివేల సార్లు విన్నాను. నాకు ఆత్రేయగారన్నా, ఈ పాటన్నా నాకు ఎంత అభిమానమంటే... నేను సంగీతమందించిన ‘వెళ్లిపోమాకే’ సినిమాలోని ఓ పాటలో ‘ఓ మూగ మనసా..’ అనే పదాన్ని హుక్లైన్గా తీసుకున్నా. ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు ‘ఓ మూగ మనసా’ని నేనే కాయినింగ్ చేశా. ఈ పాటలోని లిరిక్స్ సారాంశం తీసుకుని ఆ పాట చేశా. నాలో ఈ పాట అంత స్ఫూర్తి నింపింది. ఇటీవల విడుదలైన ‘వెళ్లిపోమాకే’ పాటలకు, ముఖ్యంగా ‘ఓ మూగ మనసా’ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు పందిపిల్లతో దర్శకుడు రవిబాబు తీస్తున్న ‘అదిగో’, శ్రీవిష్ణు హీరోగా రాజ్కందుకూరి నిర్మిస్తున్న ‘మెంటల్ మదిలో’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. సంభాషణ: సత్య పులగం -
రాజకీయాల్లోకి రావాలని ఉంది
పూసపాటిరేగ : రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉందని సినీనటుడు శరత్ బాబు అన్నారు. నిన్న ఆయన శ్రీకాకుళం వెళ్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి రాబోయే ఎన్నికల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి బయటి వ్యక్తులు పోటీచేస్తే ఓడించాలని శరత్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా తాను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు సహకారంతో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆయనతో పాటు డైరెక్టర్ తిలక్, పర్యావరణ శాస్త్రవేత్త కమల్ కోయలాడా తదితరులు ఉన్నారు.