savings account
-
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు» ఏటీఎం కార్డ్ సౌకర్యం» చెక్బుక్ సేవలు» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువపోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా.. » మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.» పూర్తి చేసిన ఫారమ్కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు. -
పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్బుక్ లేదా పాస్బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్
ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా మహిళలకు సమగ్రమైన ఆర్థిక సేవలు అందించే దిశగా ‘ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంటు’ను ఆవిష్కరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడేలా ఫ్యామిలీ బ్యాంకింగ్ ప్రోగ్రాం, చిన్న–మధ్య స్థాయి లాకర్లపై తొలి ఏడాది జీరో రెంటల్ ఫీజు, పీవోఎస్లలో రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితితో ఏరైజ్ డెబిట్ కార్డు, కాంప్లిమెంటరీగా నియో క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను దీనితో పొందవచ్చు.అలాగే, మహిళా నిపుణులతో ఆర్థిక సలహాలు, తొలి ఏడాది డీమ్యాట్ అకౌంటుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీల నుంచి మినహాయింపు, ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్ చేసిన స్టాక్స్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మొదలైన సర్వీసులను అందుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలకు సంబంధించిన ప్యాప్స్మియర్ తదితర నిర్దిష్ట వైద్యపరీక్షలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు, ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులతో అపరిమిత కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది.దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఇటీవలే ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. గత అక్టోబర్ 21 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వారం రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందుతోంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. కనీసం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తోంది. -
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయని వ్యక్తులకు విత్డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్తో గేమ్స్ వద్దుసేల్ డీడ్లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయని వ్యక్తులకు విత్డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
ఐవోబీ అకౌంట్ పోర్టబిలిటీ
చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీని ఆన్లైన్లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్లో లాగిన్ అయి, ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ సెక్షన్కు వెళ్లాలి. అకౌంట్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి. -
లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ను ప్రకటించింది. ఈ అకౌంట్తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్లో రూ.3000, సెమీ అర్బన్లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్: యోనో యాప్తో ఈజీగా
NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్ఆర్ఐ క్లయింట్ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) తాజా అప్డేట్ ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) ముచ్చటగా మూడు స్టెప్స్ ►యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ►హోమ్పేజీలో ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి ► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి. ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్బీఐ బ్రాంచ్కు కేవైసీ డాక్యుమెంట్స్ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్ను నోటరీ, హై కమీషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్లు తమ అప్లికేషన్ స్టేటస్ను కూడా ట్రాక్ చేయవచ్చు. -
ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు. పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..? అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు కొరియర్ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం. ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. ♦ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. ♦ ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్మాన్ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్మాన్ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. –పీవీఎస్ రెడ్డి, పోస్ట్మాస్టర్ జనరల్ -
కస్టమర్లకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్బుక్ జారీ, IMPS అవుట్వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.35 శాతానికి చేరింది. ఏడాది, మూడు, ఆరు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావుశాతం పెంపుతో 8.15 శాతం–8.30 శాతం శ్రేణికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని బ్యాంక్ ప్రకటన వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇందులో ఎక్కవ శాతం సేవింగ్స్ ఖాతాదారులే ఉన్నారన విషయం విదితమే. కొందరు అవసరమై, లేదా ఏదైనా ప్రయోజనం కోసం సేవింగ్స్ ఖాతాను ఒకే బ్యాంక్లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో తెరుస్తుంటారు. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచలేక, లేదా బ్యాంక్ చార్జీలు భరించలేక ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలని అనుకుంటుంటారు. అయితే మీ సేవింగ్స్ ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 1. అకౌంట్ క్లోజ్ చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి సేవింగ్స్ అకౌంట్ను మూసివేసే ముందు, కస్టమర్లు వారి ఖాతా బ్యాలెన్స్ని చెక్ చేయడం ఉత్తమం. దీంతో పాటు స్టేట్మెంట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది మీకు భవిష్యత్తులో ఉపయోపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేసేటప్పుడు మీ స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. 2. ఆటోమేటెడ్ పేమెంట్లను రద్దు చేయండి కస్టమర్లు వారి ఖాతా ద్వారా లోన్ ఈఎంఐ (EMI)లు, బిల్లు చెల్లింపులు, నెలవారీ సబ్స్క్రిప్షన్ మొదలైన వాటికి ఆటోమెటిక్ విధానంలో ప్రతి నెల చెల్లిస్తుంటారు. మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారంటే ముందు ఈ తరహా చెల్లింపులను రద్దు చేయడంతో పాటు మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్ ముద్రపడే ప్రమాదముంది. 3. బకాయిలు-చార్జీలు ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు అంగీకరించవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. 4. వివిధ పోర్టల్స్ నుండి మీ సేవింగ్స్ ఖాతాను డీ-లింక్ చేయండి సంస్థల నుంచి సేవలను పొందేందుకు కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్ఓ (EPFO), ఐటీ శాఖ మొదలైన వాటితో లింక్ చేస్తారు. ఒక వేళ మీ సేవింగ్స్ ఖాతాని క్లోజ్ చేస్తున్నట్లయితే మరొక ఖాతా నంబర్తో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక పెట్టుబడులు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి. అలా చేయకపోతే సదరు సంస్థల సేవలను వినియోగించుకోలేరు. దీంతో పాటు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చదవండి: బాబోయ్.. ఆ రంగంలో ఉద్యోగాలు, మాకొద్దంటున్న గ్రాడ్యుయేట్లు! -
ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్డ్ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. సిబిల్(CIBIL) రేటింగ్కు ప్రమాదం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్( CIBIL ) రేటింగ్పై చూపుతుంది. సర్వీస్ ఛార్జీలు అధికం బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ! -
బ్యాంకుకు బొమ్మ తుపాకీతో వెళ్లి.. 10 లక్షలు తీసుకెళ్లిన మహిళ
ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ చేసింది. మేనేజర్కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఆంక్షలు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కారణం.. అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్డ్రా చేసుకుంది. ఇంటర్వ్యూలో వివరణ తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది. ప్రత్యక్ష సాక్షి భయం.. అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది. మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది. అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్కు లెబనాన్ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు. మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది. చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీని కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంది. గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతుల మాత్రమే ఇందులో చేరారు.(చదవండి: రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్ను కుటుంబ పెన్షన్గా పొందటానికి అర్హత ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/PM-కిసాన్ ఖాతా, పొలం పాస్బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్లో ఉన్నా వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరవచ్చు. -
పెట్రోల్ పంపుల్లో ఫాస్ట్యాగ్లు
న్యూఢిల్లీ: టోల్ప్లాజాల వద్ద వాహన క్యూలను తగ్గించే ఫాస్ట్యాగ్లు ఇకపై పెట్రోల్ పంపుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాహనం విండ్ స్క్రీన్పై అతికించే ఈ ఫాస్ట్యాగ్స్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రుసుము ఆటోమేటిక్గా జమ అవుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) విధానం ద్వారా లింక్ అయి ఉన్న ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీ జరిగిపోతుంది. దీనివల్ల ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం ఉండదు. ఈ ఫాస్ ట్యాగ్లను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. వీటితో పార్కింగ్ ఫీజు చెల్లింపులు, పెట్రోల్ కొనుగోలు కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్యాగ్ల విక్రయం, పంపిణీకి సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చున్న అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం తెలిపారు. -
పన్నుభారం... తగ్గించుకుందాం!
ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరే!! కాకపోతే కొందరు పన్ను తగ్గించుకోవటానికి తాము గరిçష్టంగా ఎంత పొదుపు చేయగలమో అంతా చేస్తారు. ఆ రకంగా పొదుపును కూడా పెంచుకుంటారు. ఇవన్నీ ప్రతిబింబించేలా పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. మరికొందరు మాత్రం నామమాత్రపు కార్యక్రమంగా కానిచ్చేస్తుంటారు. తమకున్న అన్ని రకాల ఆదాయం, ఖర్చులు, వాటికి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉన్న మినహాయింపుల గురించి అవగాహన కలిగిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. దీంతో ఆ మినహాయింపులను ఉపయోగించుకోరు. ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద ఉన్న పన్ను మినహాయింపుల గురించే సాధారణ అవగాహన ఉంటుంది తప్ప, ఇతర సెక్షన్ల గురించి తెలిసిన వారు కూడా తక్కువ మందే!! కొంత సమయం వెచ్చించి అవేంటన్నది తెలుసుకుంటే మినహాయింపుల ద్వారా పన్ను భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్పై వడ్డీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్పై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమవుతుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఏటా ఈ వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్పై వడ్డీకి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంతకు మించితే మాత్రం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు మినహాయింపు అంటే... మొత్తం ఆదాయంలో రూ.10,000 తగ్గించి చూపించుకోవడం అని పొరపడొద్దు. ఇతర ఆదాయం కాలమ్లో వడ్డీ ఆదాయాన్ని చూపించి అది రూ.10 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అది ఈ సెక్షన్ కిందికి రాదు. ఇంటి అద్దె చెల్లింపులు... చట్టంలోని సెక్షన్ 80జీజీ ప్రకారం, వేతన ప్యాకేజీలో భాగంగా హెచ్ఆర్ఏ లేకపోతే... వేతన ఉద్యోగి కాని వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. తన పేరు, తన జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట ఇల్లు ఉండి, ఆ ఆంట్లో నివసిస్తుంటే మాత్రం ఈ ప్రయోజనానికి అనర్హులు. మొత్తం ఆదాయంలో 10 శాతాన్ని అద్దెగా చెల్లిస్తుంటే లేదా, మొత్తం ఆదాయంలో 25% లేదా ప్రతీ నెలా రూ.5,000 మొత్తం వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఆదాయం అంటే సెక్షన్ 80సీ, 80యూ, 80జీజీ కింద మినహాయింపులు పోనూ మిగిలింది. తీవ్ర అనారోగ్యాలు, వ్యాధులు ఈ వ్యయాలను 80డీడీబీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా రూ.40,000 వరకు చేసే ఖర్చుకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయితే ఈ పరిమితి రూ.60,000. సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్లకుపైన) అయితే... పరిమితి రూ.80,000. అయితే, ఈ వ్యాధులకయ్యే ఖర్చును బీమా పాలసీ ద్వారా పొందితే పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండదు. పాక్షికంగా రీయింబర్స్మెంట్ వస్తే, మిగిలిన మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు లేదా అతని జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణులకు సంబంధించి ఖర్చు చేసినా ఈ చట్టం కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు... నివసిస్తున్న భవనం కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. 2016 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణం తీసుకుని ఉండాలి. ఇంటివిలువ రూ.50 లక్షల్లోపు, రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. అలాగయితే సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పైన ఉంటే, అప్పుడు సెక్షన్ 80ఈఈ కింద మరో రూ.50వేలకు పన్ను మినహాయింపు పొందే అవకాశముంది. హోమ్ లోన్ అనుబంధ చార్జీలకూ... ఇంటి రుణం తీసుకునే సమయంలో చేసే ఇతర చెల్లింపులక్కూడా పన్ను మినçహాయింపు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజుపైనా సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చెల్లింపులను సైతం వడ్డీగానే చట్టం పరిగణిస్తోంది. డౌన్ పేమెంట్... రుణాల కోసం కొందరు స్నేహితులు లేదా తెలిసిన వారి నుంచి చేబదులు తీసుకుని డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటారు. ఈ మొత్తంపై వడ్డీ చెల్లించినా సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, ఆధునికీకరణ, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులు సైతం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వైకల్యం కలిగిన వారికి... 40 శాతం వైకల్యం కలిగిన వారు వార్షికంగా రూ.75,000 వరకు సెక్షన్ 80యూ కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. తమపై వైకల్యం కలిగిన వారు ఆధారపడి ఉన్నా గానీ, వారిపై చేసే ఖర్చులకు సెక్షన్ 80డీడీ కింద 75,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ వైకల్యం తీవ్రత 80 శాతంపైన ఉంటే అప్పుడు వార్షికంగా రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే పెట్టుబడులపై వచ్చే ఆదాయం తమ ఆదాయం కిందే చూపించి పన్ను చెల్లించాలి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా వైకల్యంతో ఉంటే, వారి పేరిట చేసే పెట్టుబడులకు ఇది వర్తించదు. వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట పెట్టుబడులపై ఆదాయం తండ్రి ఆదాయంగా చట్టం చూడదు. కనుక పన్ను వర్తించే పెట్టుబడులను వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట చేసుకుంటే పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. నష్టాలు చూపించుకోవచ్చు... గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై నష్టపోయిన వారు, అదే సంవత్సరంలో షేర్లు, ప్రాపర్టీ, బంగారం, డెట్ ఫండ్స్ విక్రయంపై వచ్చిన మూలధన లాభాల పన్ను నుంచి నష్టాలను మినహాయించుకోవచ్చు. స్వల్ప కాలిక మూలధన నష్టాలను, స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది. వివిధ సంస్థలకు విరాళాలిస్తే... విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయంలో ఇది 10 శాతాన్ని మించకూడదు. ముఖ్యంగా ఈ సెక్షన్ కింద ప్రభుత్వం నోటిఫై చేసిన ఫండ్స్కు ఇచ్చే విరాళాలకే ఈ పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే, నగదు రూపంలో విరాళం రూ.2,000 మించి ఇస్తే మినహాయింపునకు అవకాశం లేదు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు ఉపశమన నిధి, జాతీయ చిన్నారుల నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, క్లీన్ గంగా ఫండ్ తదితరమైనవి ప్రభుత్వం నోటిఫై చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే, ఆలయాలు, చర్చిలు, మసీదుల నవీకరణకు ఇచ్చే విరాళాలకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రత్యేకమైన పరిశోధనలు లేదా యూనివర్సిటీ లేదా కాలేజీలను ప్రభుత్వం సెక్షన్ 35(1)(2), సెక్షన్(1)(3), 35సీసీఏ, 35సీసీబీ కింద ఆమోదించి ఉంటే, వీటికి చేసే విరాళాలకు సెక్షన్ 80జీజీఏ రూ.10,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందుకు నగదు రహితంగానే విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం రూపంలో లేదా వృత్తి రూపంలో ఆదాయం కలిగిన వారికి ఈ ప్రయోజనం లేదు. వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలపైనా సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు పరిమితి లేదు. ఎంత మొత్తాన్నయినా విరాళంగా అందించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే నగదు రహితంగానే విరాళాలు అందించి ఉండాలి. వైద్య బీమా ప్రీమియం చెల్లిస్తే.. వైద్య బీమా పాలసీకి ఏటా చెల్లించే ప్రీమియం మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, వారి జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు వీరిలో ఎవరి పేరిట తీసుకున్నా గానీ, చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా తన పేరిట, జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే వైద్య బీమా ప్రీమియం రూ.25,000పై ఈ పరిమితి పొందొచ్చు. దీనికి అదనంగా తల్లిదండ్రుల వైద్య బీమా పాలసీకి చేసే చెల్లింపులు మరో రూ.25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీరు 60 ఏళ్లు దాటిన వారు అయితే రూ.30,000 వరకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) అయితే, ఏ సభ్యులు ప్రీమియం చెల్లించినా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం చేసే చెల్లింపులు రూ.5,000 వరకు కూడా మినహాయింపు అమల్లో ఉంది. విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు ఉన్నత విద్య కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులకు సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా చట్టబద్ధంగా వేరెవరైనా విద్యార్థి తన సంరక్షణలో ఉంటే, వారి పేరిట తీసుకునే విద్యా రుణాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కేవలం వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు, అది కూడా రుణం తీసుకున్న తర్వాత ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్ తర్వాత చేసే ఉన్నత విద్యా కోర్సుల కోసం తీసుకునే రుణాలకే ఈ ప్రయోజనం. వడ్డీ రూపంలో చెల్లింపుల పరిమితి లేదు. ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాయల్టీ ఆదాయానికీ మినహాయింపు... రచయితలకు వారి రచనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, వార్షికంగా రూ.3 లక్షలకు సెక్షన్ 80క్యుక్యుబి ప్రకారం పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రాయల్టీ ఆదాయం ఏక మొత్తంలో వచ్చి ఉండాలి. ఏక మొత్తంలో కాకుండా వాయిదాలుగా అందుకుంటే మాత్రం రాయల్టీ ఆదాయంలో 15 శాతానికే పన్ను మినహాయింపు పరిమితం అవుతుంది. మేథో సంపత్తి హక్కులు 2003 ఏప్రిల్ 1 తర్వాత నమోదయిన ఏ పేటెంట్ ద్వారానైనా రాయల్టీ ఆదాయం అందుకుంటుంటే సెక్షన్ 80ఆర్ఆర్బి కింద ఒక ఏడాదిలో రూ.3లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. పన్ను వర్తించని ఆదాయాన్ని చూపించాలి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం కచ్చితంగా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ, 80 శాతం పన్ను చెల్లింపుదారులు వడ్డీ ఆదాయాన్ని చూపించడంలేదని ట్యాక్స్ స్పానర్ అనే పోర్టల్ పరిశీలనతో తేలింది. పన్ను చెల్లించకూడదన్న ఉద్దేశంతో, పన్ను నోటీసు అందుకోకూడదన్న అభిప్రాయంతో ఈ ఆదాయాన్ని చూపించడం లేదని ట్యాక్స్ స్పానర్ డాట్ కామ్ సీఎఫ్వో కౌశిక్ చెప్పారు. ♦ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పన్ను లేదని పైన చెప్పుకున్నాం. నిజానికి రూ.2.5 లక్షలను ఏడాది పాటు బ్యాంకులో ఉంచితే ఈ మేరకు వడ్డీ ఆదాయం వస్తుంది. రూ.10,000కు పైన వడ్డీ ఆదాయం అందుకునే వారు తక్కువ మందే ఉంటారు. కానీ, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం రూ.10,000లోపు ఉన్నా పన్ను రిటర్నుల్లో తప్పకుండా ఆ ఆదాయాన్ని చూపించాలి. ♦ ఐటీఆర్–1లో ఎగ్జెంప్ట్ ఇన్కమ్ అనే కాలమ్లో ఇలా పన్ను రహిత ఆదాయాన్ని పేర్కొనాలి. ♦ డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఉంటే సెక్షన్ 10 (34) కింద పన్ను ఉండదు. అలాగే, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ రూపంలో వచ్చే ఆదాయం లేదా పరిహారానికి సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ఉంది. వీటిని సైతం రిటర్నుల్లో పేర్కొనడం ద్వారా పన్ను అధికారులకు సందేహాలు తలెత్తితే సమాధానం చెప్పడం సులభం అవుతుందని నిపుణుల సూచన. ♦ ఇక అధిక విలువతో కూడిన పెట్టుబడుల వివరాలను కూడా పన్ను రిటర్నుల్లో పేర్కొనాలని సూచిస్తున్నారు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించాలా? ♦ ఇక్కడ నివసించేవారు, ఎన్ఆర్ఐలకు వేర్వేరుగా నిబంధనలు ♦ ఎన్ని రోజులున్నారన్న అంశం ఆధారంగా వర్గీకరణ ♦ స్వదేశంలో ఉండే వారు విదేశీ ఆదాయం చూపించాల్సిందే ♦ ఎన్ఆర్ఐలు భారత్లో ఆదాయాన్ని రిటర్నుల్లో పేర్కొనాలి ♦ రిటర్నుల దాఖలు పత్రాలు కూడా వేరే పనిచేస్తున్న కంపెనీ తరఫున కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి విదేశీ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వీరు ఆర్జించే విదేశీ మారకాన్ని తమ పన్ను రిటర్నుల్లో చూపించాలా? స్వదేశానికి వెలుపల ఆర్జించిన మొత్తంపై పన్నుకు సంబంధించి నిబంధనలేంటి? విదేశీ ఆర్జనను పన్ను రిటర్నుల్లో ఎలా చూపించాలి? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానమే ఈ కథనం... విదేశీ ఆదాయం భారతీయ పన్ను చట్టాలు పన్ను చెల్లింపుదారులను ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు స్వదేశంలో ఉన్నారనే వివరాల ఆధారంగా వారిని నివాసితులు (రెసిడెంట్), నివాసేతరులు (నాన్ రెసిడెంట్)గా వర్గీకరించింది. వారి నివాస హోదాకు అనుగుణంగా భారతీయ పన్ను చట్టాల పట్ల వారికున్న బాధ్యతను విస్తృతంగా నిర్వచించాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ తమ హోదాను బట్టి వారు తమ ఆదాయాన్ని చూపించాలి. పన్ను చట్టాల ప్రకారం... దేశంలో నివసించే ప్రతి పౌరుడూ, దేశం వెలుపల తాను ఆర్జించిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ అయితే కేవలం భారత్లో ఆర్జించిన దాన్నే స్వదేశంలో దాఖలు చేసే రిటర్నుల్లో చూపిస్తే సరిపోతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో స్వదేశంలోను, విదేశంలోనూ ఒక కంపెనీ తరఫున పనిచేయడం ఇటీవల సాధారణంగా కనిపిస్తోంది. కంపెనీలు కొందరు ఉద్యోగులను విదేశాల్లోని కార్యాలయాల్లో విధుల కోసం కొంత కాలం పాటు పంపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను తరచుగా ఇలా పంపిస్తున్నాయి. ఆ పనికి చెల్లింపులను విదేశీ కార్యాలయం చేస్తుంటుంది. అప్పుడది విదేశీ ఆర్జన అవుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఇంటి నుంచి అద్దె రూపంలో కొందరికి ఆదాయం ఉండొచ్చు. ఇటువంటి ఆదాయాన్ని భారత్లో నివసించే వారు తప్పకుండా తమ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలు ఈ తరహా వ్యక్తులు అంటే విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించదలిస్తే వారికి ఐటీఆర్–1 వర్తించదు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించే వారు ఐటీఆర్–2ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్–2 లేదా ఐటీఆర్–3 ఈ రెండింటిలో ఒక దానిని వారి ఆదాయ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎఫ్ఎస్ఐ షెడ్యూల్లో చూపించాలి. రెండు పన్నులు భారత్లో నివసించే వారు తమ విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించి ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి అని చెప్పుకున్నాం. అయితే, ఒకవేళ పన్నులను విదేశాల్లోనే మినహాయిస్తే ఆ ఆదాయాన్ని ఇక్కడ చూపించి పన్ను చెల్లిస్తే అప్పుడు రెండు సార్లు పన్నులు చెల్లించినట్టు అవుతుంది. అందుకే ఒకసారి పన్ను మినహాయిస్తే దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. పలు దేశాలతో మనకు ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం ఉంది. విదేశీ ఆదాయంపై పన్నును అక్కడే మినహాయించేస్తే ఇక్కడ మరోసారి పన్ను చెల్లించే పని లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్నే విదేశీ పన్ను జమగా (ఎఫ్టీసీ) పేర్కొంటారు. -
కొత్త ఏడాదైనా కాస్త మారదాం..!
మరో సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మరి ఆర్థికాంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏవేవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న వారు ఇప్పటికైనా సరైన ప్రణాళిక వేసుకున్నారా? లేదనుకోండి... ఇకనైనా ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే గమ్యంపై స్పష్టత ఉంటేనే ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనుసరించదగ్గ ఆర్థిక తీర్మానాల గురించి నిపుణులు, ఆర్థిక సలహాదారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం... ఆలస్యం విషమే! కొత్తవారైతే ముందు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80సీ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులకింకా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. మార్చిలోపు పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. చివరి నిమిషం వరకు వాయిదా వేస్తే ఆఖర్లో ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ముందుగా ఆరంభిస్తే వయసు, అవసరాలు, రిస్క్ తీసుకోగల స్థాయి, రాబడులు, అవసరంలో నగదు చేసుకోగల వెసులుబాటు వంటివన్నీ పరిశీలించి తగిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అవుతుంది కనక కనీసం జూన్ నుంచయినా పన్ను ఆదా పెట్టుబడులను ఆరంభించి ఏడాది పాటు కొనసాగించాలి. ముందుగా ఆరంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. సకాలంలో రిటర్నులు వేయండి... మనలో కొందరు పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయరు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆలస్యమైతే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భరించాలి. గడువులోపు రిటర్నులు వేయకపోతే ఆలస్య రుసుం గతంలో రూ.1,000గా ఉండగా అదిప్పుడు రూ.10,000గా మారింది. అందుకే గడువులోపు రిటర్నులు ఫైల్ చేయాలి. గడువులోపు బీమా పాలసీల ప్రీమియం చెల్లించడం కూడా అవసరమే. లేదంటే బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆలస్యమైతే అనవసర వడ్డీ భారంతో పాటు క్రెడిట్స్కోరు కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టేస్తే బెటర్! చాలా మందికి క్రెడిట్ కార్డుపై భారీ మొత్తం వాడటం, నెలయ్యేసరికి ఎంతో కొంత కనీస బిల్లు చెల్లించటం అలవాటు. కానీ అలా చేయటం వల్ల వారి మొత్తం రుణం ఎప్పటికీ తీరదనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ మొత్తంపై దాదాపు నెలకు 2.5 నుంచి 3 శాతం వడ్డీ అంటే ఏడాదికి 30–36 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆలస్యపు చెల్లింపుల ఫీజు కూడా తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కార్డుపై వీలైనంత తక్కువ వాడటం... ఏ నెలకు ఆ నెల మొత్తం బిల్లు చెల్లించేయటం చేస్తుండాలి. రుణ సమస్యల్లో ఉన్న వారు ముందుగా తీర్చేయాల్సింది క్రెడిట్ కార్డు బకాయిలే. రివాల్వింగ్ క్రెడిట్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. జీవితానికీ కవరేజీ తప్పనిసరి.. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే జీవితం, ఆరోగ్యం అన్నవి ఇలానే ఉంటాయని ఊహించలేం. అనారోగ్యం పాలైతే అయ్యే వ్యయాలు బడ్జెట్ను గుల్ల చేసేస్తాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. అందుకే తమ వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా పాలసీ తీసుకోవడం మరవద్దు. ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటికి సరిపడా బీమా కవరేజీ పెంచుకోవాలి. జీవిత బీమాకు టర్మ్ పాలసీలు ఉత్తమం. తక్కువ ప్రీమియానికే గణనీయమైన కవరేజీనిస్తాయి. అలాగే రూ.4–5 లక్షల కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్పాలసీ కూడా తీసుకోవాలి. ఖర్చుల్లో స్మార్ట్గా... ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. అనుకోని, అనూహ్య, అత్యవసరాలు ఏర్పడితే ఆదుకుం టుంది. ఈ నిధుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా తక్కువ రిస్క్ ఉండే లిక్విడ్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరంలో వేగంగా వీటిని వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే, సంక్షోభం ఏర్పడితే తప్ప ఈ నిధుల్ని కదలించకూడదు. మీ బడ్జెట్ పరిమితుల్లో స్మార్ట్గా ఖర్చు చేయడాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ ఖర్చులు చేయి దాటిపోకుండా వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ విషయంలో సా యం చేయడానికి ఆన్లైన్ మనీ మేనేజ్మెంట్ టూల్స్ చాలానే ఉన్నాయి. అవసరం లేని వాటిని రుణం తీసుకుని కొనే చర్యలకు దూరంగా ఉండాలి. ఈక్విటీల్లో సిప్ చేయండి.. ఏడాదికి 4– 6 శాతం వడ్డీనిచ్చే సేవింగ్స్ ఖాతాలో నిధులను నిల్వ చేసుకోవడం సరికాదు. పైగా సేవింగ్స్ రాబడులు ఏడాదిలో రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అధిక రాబడులను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలపై దృష్టి సారించడం మంచిది. స్థిరమైన ఆదాయం కోసం డెట్ సాధనాలు అవసరమే కానీ, వీటిలో చాలా వరకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇవ్వలేవు. ఈక్విటీలకు మాత్రం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులనిచ్చే సత్తా ఉంది. అందుకే, ఏ సాధనానికి ఎంత కేటాయించాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ వయసు, అవసరాలు, రిస్క్కు అనుగుణంగా ఈక్విటీ, డెట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి అందరికీ నప్పే ఓ ఆచరణీయ సూత్రం ఉంది. 100 నుంచి మీ ప్రస్తుత వయసు తీసివేయగా, ఎంత వస్తే అంత మేర ఈక్విటీలకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 అనుకోండి. అప్పుడు 65 వస్తుంది. అంటే ఈక్విటీలకు మీ పెట్టుబడుల్లో 65 శాతం కేటాయించుకోవచ్చని అర్థం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవడం కొంత వరకు రక్షణాత్మకం. స్వల్పకాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫండ్స్ రెండంకెల స్థాయిలో లాభాలను ఇస్తున్నాయి. పైపెచ్చు ఈక్విటీ ఫండ్స్లో ఏకమొత్తంలో కంటే నెలవారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయటమే మంచిది. ముఖ్యంగా మార్కెట్లు బాగా పెరిగి ఉన్న ప్రస్తుత స్థితిలో స్టాక్స్ విలువలు చాలా గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్కు లోనవుతున్నా గానీ సిప్ రూపంలో పెట్టుబడులు ఆపకూడదు. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఫండ్స్ యూనిట్ల విలువ కూడా తగ్గుతుంది. కనుక సిప్ రూపంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. స్వల్పకాలంలో ఆటుపోట్లు కనిపించినా దీర్ఘకాలంలో సిప్ చాలా చక్కని రాబడులకు బాట వేస్తుంది. -
పొదుపు డబ్బులపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ‘మిత్ర’ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. వీరంతా ప్రతి నెలా వంద రూపాయల చొప్పున బ్యాంకు పొదుపు ఖాతాకు జమ చేస్తున్నారు. పిల్లలు చదువులు, చిరు వ్యాపారం, కుటుంబ అవసరాలకు ఇది అక్కరకు వస్తుందని ముందుచూపుతో పొదుపు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా వారి ఆశలు నెరవేరటం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు ఖాతాలో దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు సంఘాలను బ్యాంకులు అనుమతించటం లేదు. రాష్ట్రంలోని మెజారిటీ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావటం గమనార్హం. దాచుకున్న డబ్బులున్నా ప్రైవేట్ అప్పులే దిక్కు ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ కుదరదని తేల్చి ప్రతి మహిళకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా ఇస్తానంటూ మాట మార్చటం తెలిసిందే. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు కింద బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం మహిళా సంఘాలు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోవటమే కారణం ఒకపక్క బ్యాంకులో వారి డబ్బులుండి కూడా డ్వాక్రా మహిళలకు అప్పు చేయాల్సిన దుస్థితి రావడం శోచనీయమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని భేటీలో అధికారులు స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడమే దీనికంతటికీ ప్రధాన కారణమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. మహిళా సంఘాల పేరుతో ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవటంతో అవి అలాగే ఉన్నాయని, పొదుపు ఖాతాల నుంచి సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే రుణాలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలపై చార్జీల మోత మరోపక్క మెజార్టీ బ్యాంకులు నిర్ధారించిన వడ్డీ కన్నా ఎక్కువకు రుణాలు ఇస్తున్నాయని, వివిధ రకాల చార్జీల పేరుతో సంఘాల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలిందని సమావేశంలో అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు మహిళా సంఘాలకు 12.5 శాతం వడ్డీకి, మరి కొన్ని బ్యాంకులు 14.5 శాతం వడ్డీకి రుణాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రకాల చార్జీల రూపంలో బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంఘాల నుంచి వసూలు చేస్తున్నాయని వెల్లడైంది. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో జీవిత బీమా, వైద్య బీమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో చెల్లించినా ప్రయోజనం ‘సున్నా’ సకాలంలో అప్పు చెల్లించిన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను వర్తింప చేయాలి. అయితే 2015 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సున్నా వడ్డీకి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సకాలంలో రుణాలను చెల్లించిన మహిళా సంఘాలకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కటం లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలగిన రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. -
సేవింగ్స్పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథాప్రకారం 4 శాతంగానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రూ. 1 కోటి కన్నా తక్కువగా డిపాజిట్లున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్లపై రేటును తగ్గించాయి. -
యాక్సిస్ బ్యాంకు కూడా తగ్గించేసింది
ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు కూడా వడ్డీరేటులో కోత పెట్టింది. అంచనాలకనుగుణంగానే యాక్సిస్ కూడా వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సేవింగ్ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది. పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ అర శాతం తగ్గించింది. 3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల వరకు వరకు నిల్వ (బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది. రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కూడా సేవింగ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
పేటీఎం పేమెంట్ బ్యాంకు వడ్డీరేటు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పే మెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనున్న ఇ-వాలెట్ అగ్రగామి పేటీఎం తన పేమెంట్ బ్యాంక్ మొట్టమొదటి శాఖను నేడు( మే 23, మంగళవారం) ఢిల్లీలో ప్రారంభించనుంది. ఈ సందర్బంగా వినియోగదారులకు చెల్లించనున్న వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం తరువా , కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును లాంచ్ చేస్తోంది. ఢిల్లీలో మొదట శాఖను ప్రారంభించనున్నామని, ఇతర మెట్రో నగరాల్లో రెండో విడత ప్రారంభిస్తామని 'పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మూడు నెలలు తర్వాత రెండో విడతను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్, ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్ 5.5 శాతం వడ్డీని అందిస్తోంటే పేటీఎం మాత్రం వినియోగదారులకు 4శాతం వార్షిక వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది. అలాగే డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ను వెల్లడించింది. 2020 నాటికి కంపెనీ 500 మిలియన్ల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రణూ సత్తీ చెప్పారు. ఈ నేపథ్యంలో మొదటి శాఖను నోయిడాలో మంగళవారం ప్రారంభించనుంది. ఈ సంవత్సరంలో 31 శాఖలు, 3,000 కస్టమర్ సర్వీస్ పాయింట్లు తెరవాలని యోచిస్తోంది. చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచిన మొట్టమొదటి మిలియన్ కస్టమర్లకు రు .25,000 డిపాజిట్లపై రూ.250ల స్పాట్ క్యాష్ బ్యాక్ అందిస్తామని, అన్ని ఆన్లైన్ లావాదేవీలు ఉచితమని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వినియోగదారులకు రుపే కార్డులు అందిస్తుంది. అలాగే నెలకు ఐదు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితం (నాన్ మెట్రో నగరాల్లో) . ఆ తరువాత, వినియోగదారులు ప్రతి ఉపసంహరణకు రూ. 20 రూపాయలు చెల్లించాలి. తమ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసెకోవాల్సిందిగా ఇప్పటికే గత 48 గంటల్లో 2.20 కోట్ల మెసేజ్లను పంపించింది. మరోవైపు ఎయిర్టెల్ పేమెంట్బ్యాంకు ప్రతి నగదు ఉపసంహరణపై 0.65 శాతం వసూలు చేస్తుండగా, ప్రస్తుతం ఉన్న చెల్లింపుల బ్యాంకుల్లో ఇండియా పోస్ట్ మాత్రం ఇది తన ఖాతాదారులకు భారతదేశం పోస్ట్ ఎటిఎం నుంచి నగదును తీసుకోవడానికి కార్డును అందిస్తోంది. కాగా దేశంలో మొట్టమొదటి చెల్లింపులన బ్యాంకును ఎయిర్ టెల్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండియాపోస్ట్ ఎయిర్టెల్ను అనుసరించింది. -
అకటా...! మళ్లీ కటకట
⇒ బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలు ⇒ ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు ⇒ నగదురహితం పేరిట ప్రభుత్వం గొప్పలు ⇒ పల్లెలు, పట్టణాల్లో సామాన్యుల ఇక్కట్లు ‘నో క్యాష్’ బోర్డులు...పొడవైన క్యూలు... బ్యాంకుల్లో పడిగాపులు... అయినా అందుబాటులోకి రాని నగదు...వెరసి అమరావతిలో మరో సారి నగదు కష్టాలు ముప్పిరిగొన్నాయి. మూడు నెలల పాటు నగదు కష్టాలతో అల్లాడిన సామాన్యులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని భావిస్తుండగా... అంతలోనే మరోసారి నగదు కొరత వచ్చిపడింది. సాక్షి, అమరావతి బ్యూరో : బ్యాంకుల వద్ద నగదు నిల్వలు దాదాపు నిండుకోవడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాన్ని నగదు రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. నగదు కష్టాలు రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని బ్యాంకులకు నగదు సరఫరాను గణనీయంగా తగ్గించివేసింది. నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను మళ్లించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులకు చెందిన 789 శాఖలు ఉండగా, గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. దాదాపు అన్ని శాఖల్లోనూ కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేకుండా పోయాయి. కొత్తగా ప్రారంభించిన శాఖకు రోజువారీ లావాదేవీలకు కనీసం రూ.50లక్షలు అవసరం కాగా, 10 ఏళ్లకు పైబడిన శాఖలలో రోజుకు దాదాపు రూ.2కోట్ల వరకు లావాదేవీలు సాగుతాయి. ఇక గ్రామీణ బ్యాంకులకు రోజుకు కనీసం రూ.10లక్షల వరకు అవసరం. కానీ అందులో 25 శాతం నగదు నిల్వలు కూడా లేకుండాపోయాయి. దాంతో బ్యాంకుల్లో దాదాపు 75 శాతం లావాదేవీలు తగ్గిపోయాయి. డ్వాక్రా సంఘాలు, రైతులకు చెల్లింపులు నిలిపి వేశారు. ఖాతాదారులకు నగదు చెల్లింపులపై అనధికారికంగా పరిమితులు విధిస్తున్నారు. నో క్యాష్ బోర్డులే ... నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు, గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 80శాతం ఏటీఎంలలో నగదు నిల్వలు లేనేలేవు. విత్డ్రా కోసం ఖాతాదారులు పలు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ఏటీఎంలో రోజుకు సగటున రూ.30లక్షలు ఉంచాలి. కానీ ప్రస్తుతం రూ.10లక్షలు కూడా అందుబాటులో ఉంచలేకపోతున్నారు. 13 నుంచి పరిస్థితి ఏమిటో...!? ఈ నెల 13 నుంచి బ్యాంకుల్లో విత్డ్రాల మీద పరిమితి ఎత్తివేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా నుంచి రోజుకు రూ.50వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఆ పరిమితి తొలగిస్తామని చెప్పారు. అదే విధంగా ఏటీఎం నుంచి రోజుకు రూ.40వేలు విత్డ్రా చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నగదు నిల్వలు నిండుకోవడంతో ఆర్బీఐ ప్రకటించిన విధానం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. -
వారానికి రూ. 50,000 తీసుకోవొచ్చు
సేవింగ్స్ ఖాతాల విత్ డ్రాయల్ పరిమితి పెంపు ముంబై: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వీక్లీ క్యాష్ విత్డ్రాయల్ పరిమితి సోమవారం నుంచి రూ.50,000కు పెరిగింది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000 విత్డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఈ పరి మితి కూడా ఉండదు. కాగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి క్యాష్ విత్డ్రాయల్ పరిమితి ఇప్పటివరకూ రూ.24,000గా ఉంది. క్యాష్ విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితులను రెండంచెల్లో ఎత్తివేస్తామని ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది. ఇందులో మొదటిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 నుంచి క్యాష్ విత్డ్రాయెల్స్పై పరిమితులు ఆర్బీఐ విధించింది. -
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
-
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు నేటి నుంచి ఓ శుభవార్త. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నేటి నుంచి వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీచేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన ఆర్బీఐ, ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి రూ.24వేలుగా ఉండేది. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతమైతే, కరెంట్ అకౌంట్ హోల్డర్స్కు నగదు విత్ డ్రాలపై ఎలాంటి పరిమితులు లేవు. వ్యవసాయదారులైతే వారానికి రూ.50 వేలు, వివాహానికి రూ.2.5 లక్షల విత్ డ్రాయల్స్ను అనుమతిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేసిన అనంతరం రిజర్వు బ్యాంకు ఏటీఎంలలలో, బ్యాంకు బ్రాంచులలో నగదు విత్ డ్రాయల్స్పై ఆంక్షలు విధించింది. కొద్దికొద్దిగా కరెన్సీ కష్టాలు తొలగిస్తూ వస్తున్న ఆర్బీఐ, వారానికి విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచిన సంగతి తెలిసిందే. (చదవండి: నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!) -
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్..వడ్డీ ఎంత?
జైపూర్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోకీలక ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి పే మెంట్ బ్యాంకును రాజస్థాన్లో లాంచ్ చేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పేరుతో ప్రయోగాత్మకంగా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్టెల్ రీటైల్ అవుట్ లెట్స్ లో ఈ బ్యాంక్ ఖాతాలు తెరవచ్చని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి సదుపాయాలను అందించనున్నట్టు తెలిపింది. డీమానిటైజేషన్ తో ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు క్యాష్ లెస్ (డిజిటల్) పేమెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ పైలట్ తో,తాము బ్యాంకింగ్ సేవల ప్రారంభంలో ముందడుగు వేసామని ,అనంతరం భారతదేశం అంతటా పూర్తి స్థాయి సేవలను ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేశామని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు, చెల్లింపులకు సేవలు, తక్కువ ఆదాయ గృహాలు, చిన్న వ్యాపారాలు,ఇతర అసంఘటిత రంగ సంస్థల అవసరాలను తీర్చటానికిఈ బ్యాంకునుప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా విజన్ కు ఈ బ్యాంకు సరిగ్గా సరిపోతుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుధరా రాజే కూడాదీనిపై సంతోషం వ్యక్తం చేశారు.. దేశంలోని నలుమూలలకు ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు విస్తరించాలని ఆమె కోరుకున్నారు. రాజస్థాన్లోని పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలకు ప్రాథమిక, సౌకర్యమైన బ్యాంకింగ్ సేవలను అందించనున్నామని కంపెనీ పేర్కొంది. 10,000 ఎయిర్టెల్ రిటైల్ షాపుల్లో బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎయిర్టెల్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా చెల్లింపు బ్యాంక్ను విస్తరించేందుకు, వ్యవస్థలను పరీక్షించే లక్ష్యంగానే దీన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2016 డిసెంబరుకు రాజస్థాన్లో బిజినెస్ నెట్వర్క్ను 1,00,000కు విస్తరించేందుకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సన్నద్ధమవుతోంది. వార్షిక పొదుపు ఖాతాల డిపాజిట్లపై 7.25శాతం వడ్డీరేటును అందించనున్నట్టు తెలిపింది.దీంతోపాటుగా ప్రతి సేవింగ్స్ ఖాతాపై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమాను అందించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. పూర్తి డిజిటల్గా పనిచేసే ఈ చెల్లింపు బ్యాంక్లో ఖాతాను అధార్ ఆధారిత ఇ-కేవైసీతో తెరవొచ్చని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. దేశంలో ఏ బ్యాంక్ ఖాతాకైనా నగదు బదిలీ చేసుకునే సౌలభ్యం ఉందని, ఎయిర్టెల్ బ్యాంక్ ద్వారా ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ నంబర్లకు ఉచితంగా నగదు పంపించవచ్చని పేర్కొంది. కాగా గతేడాది ఏప్రిల్లో చెల్లింపు బ్యాంక్ల ఏర్పాటుకోసం ఎయిర్ టెల్ కు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. 2016 ఫిబ్రవరిలో రూ.98. 8 కోట్లతో కోటక్ మహీంద్ర బ్యాంకు 19.90 శాతం వాటాను కొనుగోలుచేసింది. -
ప్రైవేట్ బీమా సంస్థలు క్లెయిమ్లు సెటిల్ చేయవా?
ప్రస్తుతం నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ డెరైక్ట్ ప్లాన్లు. అన్నీ ఆన్లైన్ మోడ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడు మ్యూచువల్ ఫండ్స్కు రిజిస్ట్రార్గా క్యామ్స్, మిగిలిన రెండు మ్యూచువల్ ఫండ్స్కు కార్వీ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి. అన్ని ఫండ్స్లో ఒకే సేవింగ్స్ ఖాతా ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతాను మారుద్దామనుకుంటున్నాను. ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకు ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతా మార్పు గురించి వెల్లడించాలా?లేక మరే విధమైన ఇతర పద్ధతి ఉందా? - సాగరిక, హైదరాబాద్ మీరు ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతాను మార్చినట్లయితే సదరు మార్పు, చేర్పుల వివరాలను ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెల్లడించాల్సి ఉంటుంది. మరొక రకమైన పద్ధతి ఏమిటంటే, ఎంఎఫ్ యుటిలిటిస్ ఇండియా ద్వారా మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిని ఒకే గొడుగు కిందకు తేవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(యాంఫి) ప్రారంభించిన కామన్ ప్లాట్ఫామ్ ఇది. ప్రస్తుతమున్న 25 మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్, లావాదేవీల కోసం యాంఫి ఈ కామన్ ప్లాట్ఫామ్ను(ఎంఎఫ్ యుటిలిటిస్ ఇండియా) అందుబాటులోకి తెచ్చింది. కామన్ అకౌంట్ నంబర్(క్యాన్) ద్వారా ఎంఎఫ్ యుటిలిటీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిని యాక్టివేట్ చేయాలంటే క్యాన్ దరఖాస్తును పూర్తి చేసి, మీకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్(క్యామ్స్, కార్వీ వంటి సంస్థలు) లేదా ఫండ్ హౌస్కు సమర్పించాలి. క్యాన్ దరఖాస్తుతో పాటు క్యాన్సిల్ చేసిన చెక్కును, సంతకం చేసిన పాన్/ఆధార్ కార్డ్ జిరాక్స్ను కూడా అందజేయాలి. ఇది పూర్తయిన తర్వాత మీ ఖాతా వివరాలను/కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్, జీవన్ సరళ్ పాలసీలు తీసుకున్నాను. ఈ రెండు పాలసీల్లో 2012 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. మొదటి దాని కాలపరిమితి 35 ఏళ్లు. కాగా రెండో దాని కాలపరిమితి 15 ఏళ్లు. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్కు ప్రీమియమ్ రూ.30,360 కాగా, రెండో దానికి ప్రీమియమ్ రూ.16,376గా చెల్లిస్తున్నాను. ఈ పాలసీల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా లేక ఈ పాలసీల నుంచి వైదొలగమంటారా? - రఘు, విశాఖపట్టణం ఈ పాలసీలను సరెండర్ చేయడమే సరైన నిర్ణయమని మేము సూచిస్తాము. ఎల్ఐసీ జీవన్ సరళ్, న్యూ ఎండోమెంట్.. ఈ రెండు పాలసీలు ఎండోమెంట్, హోల్లైఫ్ ప్లాన్లు కలగలసిన ప్లాన్లు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే బీమా కవర్ చేస్తాయి. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నట్లయితే పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత ఏక మొత్తం పాలసీ తీసుకున్న వ్యక్తికి లభిస్తుంది. అయితే ఈ పాలసీలు ఖరీదైనవి. పాలసీలకు సంబంధించి వ్యయాలు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి పారదర్శకత ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ పాలసీలతో పోల్చితే బ్యాంక్ డిపాజిట్లే ఒకింత మెరుగైన రాబడులనిస్తాయని చెప్పవచ్చు. మీకు నష్టాలు వచ్చినా సరే ఈ పాలసీలను సరెండర్ చేయండి. మొదటి పాలసీలో మీరు ఏడాదికి చెల్లించే ప్రీమియమ్ రూ.30,360ను ప్రతి ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ పోతే 8 శాతం రాబడులను పరిగణనలోకి తీసుకుంటే మీకు రూ.59.78 లక్షలు వస్తాయి. ఇలాగే రెండో పాలసీకి చెల్లించే ప్రీమియమ్ను రూ.16,376ను ప్రతి ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ పోతే, 8 శాతం వార్షిక రాబడులను పరిగణనలోకి తీసుకుంటే, మీకు రూ.4.9 లక్షలు వస్తాయి. ఈ రాబడులు ఈ పాలసీల సమ్ అష్యూర్డ్ కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో ఈ రెండు పాలసీలు 5-6 శాతానికి మించి రాబడులు ఇచ్చిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా ఇంతకు మించి రాబడులు వచ్చే అవకాశాలూ లేవు. అందుకని బీమా అవసరాలకు టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)లో రూ. లక్షన్నర, ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చా? - సృజన్ సేన్, ఏలూరు ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో, పీపీఎఫ్లో చెరో లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం, మీకు రూ. లక్షన్నర వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్లతో పాటు జీవిత బీమా ప్రీమియమ్లు, ఈఎల్ఎస్ఎస్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఎన్ఎస్సీ, గృహరుణంపై అసలు చెల్లింపు, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు.. వీటిల్లో ఏమేరకు ఇన్వెస్ట్ చేసినా, మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ.లక్షన్నర వరకే పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇంతకు మించి ఇన్వెస్ట్ చేస్తే మీకు మినహాయింపులు రావు. ఇక ఈపీఎఫ్ విషయంలో మీ కోసం మీ కంపెనీ చెల్లించే మొత్తం పన్ను నుంచి మినహాయిస్తారు. మీ జీతం నుంచి చెల్లించే మొత్తానికి సెక్షన్ 80 సీ కింద మినహాయింపు లభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లో మ్యాక్స్ లైఫ్ నుంచి రూ.50 లక్షలకు టర్మ్ బీమా పాలసీ తీసుకున్నాను. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే ప్రైవేట్ బీమా కంపెనీలు నామినీలకు డబ్బులు చెల్లించవని, డబ్బు సంపాదన కోసమే పాలసీలు విక్రయిస్తాయని కొందరు మిత్రులు భయపెడుతున్నారు. ఇది నిజమేనా? తగిన సలహా ఇవ్వండి. - శేఖర్రావు, కరీంనగర్ మీ మిత్రులు కొందరు చెప్పింది సరైనది కాదు. ప్రైవేట్ బీమా కంపెనీలు క్లయిమ్లు చెల్లించవనడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే పలు ప్రైవేట్ కంపెనీలకు మంచి క్లయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉంది. ప్రైవేట్, ప్రభుత్వ బీమా సంస్థలను నియంత్రించేందుకు ఐఆర్డీఏ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ)ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీమా కంపెనీల ఏర్పాటు చేయటానికి పలు కఠినమైన నిబంధనలను ఐఆర్డీఏ రూపొందించింది. భారత్లో బీమా కంపెనీలు 150 శాతం సాల్వెన్సీ మార్జిన్ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మీరు తీసుకున్న మ్యాక్స్ లైఫ్ విషయానికొస్తే, మీరు మంచి టర్మ్ ప్లాన్ను తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రైవేట్ కంపెనీల టర్మ్ పాలసీలతో పోల్చితే ఎల్ఐసీ టర్మ్ పాలసీలు కొంచెం ఖరీదైనవి. మ్యాక్స్ లైఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63 శాతంగా, గ్రీవెన్స్ రిజల్యూషన్ రేషియో 99.98 శాతంగా ఉన్నాయి. ఈ టర్మ్ ప్లాన్ విషయమై మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
డీమ్యాట్ ఖాతా కావాలా?
డీ మ్యాట్ అంటే... కొనుక్కున్న షేర్లను దాచుకునే ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. అయితే దీన్లో షేర్లను కొని దాచిపెట్టుకోవాలన్నా... ఇందులో ఉన్న షేర్లను విక్రయించాలన్నా... అందుకు ట్రేడింగ్ ఖాతా కావాలి. క్రయవిక్రయాలకు డబ్బులుండాలి కనక ఈ ట్రేడింగ్ ఖాతాలోకి డబ్బులు వెయ్యాలన్నా, తియ్యాలన్నా ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ సేవలు మూడు విధాలుగా పొందవచ్చు. 1. కొన్ని బ్యాంకులు సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలన్నిటినీ కలిపి ఇచ్చే 3 ఇన్ 1 స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి రీసెర్చ్ రిపోర్టులివ్వటంతో పాటు ఏ షేర్లను కొనాలి? వేటిని విక్రయించాలి? వంటి సూచనలు కూడా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ వంటి బ్యాంకులతో పాటు కోటక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలూ ఈ 3 ఇన్ 1 సేవలందిస్తున్నాయి. 2. ఇక రెండో తరహా స్టాక్ బ్రోకర్ల విషయానికొస్తే... ఇవి కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్ను మాత్రమే అందిస్తాయి. వీటికి మనకు ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు సేవింగ్స్ అకౌంట్ను జత చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలోకి నగదు వేయటం, అందులోంచి నగదు తీసుకోవటం వంటివి కాస్తంత ఆలస్యమవుతాయి. ఇండియా ఇన్ఫోలైన్, ఏంజెల్, షేర్ఖాన్, వెంచురా వంటి పలు సంస్థల్ని ఈ తరహావిగా చెప్పొచ్చు. 3. ఈ మధ్యకాలంలోనే మూడో రకం బ్రోకరేజ్ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి చిన్న ఇన్వెస్టర్లను, చిన్న ట్రేడర్లను దృష్టిలో పెట్టుకుని... లావాదేవీలతో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు లేదా చాలా తక్కువ చార్జీలతో సేవలందిస్తున్నాయి. అందుకే వీటిని డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలుగా పేర్కొంటున్నారు. మూడింట్లో ఏది ఉత్తమం? ఈ మూడింట్లో ఏది ఉత్తమమనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కానీ అదంతా మీరు నిర్వహించే లావాదేవీలు, ఇన్వెస్ట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారైతే ఏ బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవాలన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్లు ఎదురు చూస్తారు. ఏడాదిలో 30 నుంచి 40 లావాదేవీలకు మించవు. ఇలాంటి వారు ఫీజులు, చార్జీల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వీరు చక్కని సర్వీసులు అందించే 3 ఇన్ 1 బ్రోకర్ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొనాలనుకున్న వెంటనే కొనుగోలు చేయొచ్చు. పెపైచ్చు విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి. బ్యాంకుల్లోనే కనక డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. అటు ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ట్రేడింగ్ కూడా చేసేవారైతే... రెండు బ్రోకింగ్ అకౌంట్స్ను తీసుకోవటం మంచిదన్నది నిపుణుల సలహా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసమైతే మరొకటి ట్రేడింగ్ కోసం. అలా కాకుండా కేవలం ఇంట్రాడే ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ మాత్రమే చేసేవారైతే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలకేసి చూడొచ్చు. ఇవన్నీ కాకపోతే చెల్లించే వార్షిక ఫీజులు ఆధారంగా కూడా బ్రోకింగ్ సంస్థలకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం చాలామంది ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. ఏడాదిలో చెల్లించే చార్జీలు రూ. 3,000 మించకపోతే మరో ఆలోచనేదీ లేకుండా ఆ బ్రోకింగ్ సంస్థలో కొనసాగవచ్చు. అదే చెల్లించే ఫీజులు రూ. 3,000 నుంచి రూ. 6,000 మధ్యలో ఉంటే అందులో ఎఫ్ అండ్ వో లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో బ్రోకింగ్ సంస్థ కేసి చూడండి. ఇక రూ.6,000 పైన చెల్లిస్తుంటే తప్పకుండా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ తలుపు తట్టండి. ట్రేడింగ్, డీమ్యాట్ మాత్రమే అయితే..! త్రీ ఇన్ ఒన్ సేవలందించే బ్యాంకులతో పోలిస్తే కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలందించే బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు చాలా తక్కువే. ఎందుకంటే వీటిలో సేవింగ్స్ ఖాతాలోంచి అప్పటికప్పుడు డబ్బులు వేయటం, ఆ ఖాతాలోకి విత్డ్రా చేసుకోవటం ఉండదు. అయితే ఒకేసారి ఏక మొత్తంలో నగదు కేటాయించి, భారీగా ట్రేడింగ్ చేసేవారికి ఛార్జీల భారం తగ్గుతుంది కనక ఇవి మంచివనే చెప్పొచ్చు. దాదాపు ప్రతి బ్రోకింగ్ సంస్థా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను (సాఫ్ట్వేర్) అందిస్తుంది కనక లావాదేవీలు నెమ్మదిగా జరగటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. కొన్ని ప్రధాన సంస్థల బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు.. డిస్కౌంట్ బ్రోకింగ్... పూర్తి స్థాయి సేవలందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకుంటే ట్రేడింగ్లో వచ్చే లాభాల్లో అత్యధికం వాటి జేబుల్లోకే పోతాయి. ఒకపక్క ట్రేడింగ్ లాట్ సైజులు పెరిగి ప్రీమియంలు పెరిగిపోతే... మరో పక్క వచ్చిన స్వల్ప లాభాలు బ్రోకింగ్ సంస్థలకు కట్టడానికే సరిపోవడం లేదన్నది ట్రేడర్ల మాట. అందుకే వీరు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలవైపు చూస్తున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ లేదా స్థిరమైన రేట్లకే ఎన్ని లావాదేవీలైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తాయి. జీరోదా, ఆర్కేఎస్వీ, ఇండియన్ ట్రేడింగ్ లీగ్, ట్రేడ్జిని వంటివి ఈ రంగంలోని ప్రధాన సంస్థలు. వీటిలో చాలా సంస్థలు అకౌంట్ ఓపెనింగ్కి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఉండే ప్రధానమైన లోపం... లో బ్యాండ్విడ్త్. దీనివల్ల మార్కెట్లు బాగా పెరిగిన, లేదా పడిన సమయాల్లో పొజిషన్లను వదిలించుకోవడం కష్టమవుతుంది. మిగిలిన పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలతో పోలిస్తే కస్టమర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వివిధ సంస్థల ఛార్జీలివీ... తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న సంస్థలు డిస్కౌంట్ బ్రోకరేజీలుగా రంగంలోకి త్రీ ఇన్ వన్ సేవలకు చార్జీలూ ఎక్కువే ట్రేడింగ్ చేసేవారికి కొన్ని బెటర్; ఇన్వెస్టర్లకైతే ఇంకొన్ని మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర్నుంచి ముగిసే వరకు ఏదో ఒక షేరు కొనటమో... అమ్మటమో చేస్తూనే ఉంటాడు సుబ్బు. రూపాయి, బంగారం, ఇతర కమోడిటీలు... ఇలా దేన్నీ వదలడు. అన్నిట్లోనూ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్న పరిమిత శ్రేణిని కూడా ట్రేడింగ్కు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ భారీ ఒడిదుడుకులను క్యాష్ చేసుకుంటూ లాభం జేబులో వేసుకుంటున్నాడు. కానీ తీరా బ్యాంక్ బ్యాలెన్స్లో చూస్తే... ఆ స్థాయి లాభాలు కనిపించడం లేదు. దీనికి కారణమేంటో తెలుసా..? వస్తున్న లాభాలన్నీ బ్రోకరేజ్ చార్జీలు చెల్లించడానికే సరిపోతున్నాయి. ఒక్క సుబ్బు మాత్రమే కాదు. రోజూ భారీగా ట్రేడింగ్ చేసే వారిలో చాలా మంది పరిస్థితి ఇదే. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించడానికిపుడు అనేక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అసలీ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలంటే ఏంటి? వీటిలో ఉండే లాభనష్టాలేంటి? ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఎవరికి ఎలాంటి బ్రోకింగ్ సంస్థలు బాగుంటాయి? ఎవరి దగ్గర డీమ్యాట్ ఖాతా తెరిస్తే బెటర్? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... ఫీజులు పరిశీలించుకోండి... కొన్ని ప్రధాన బ్రోకింగ్ సంస్థల ఫీజులు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఆయా బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే సగటు చార్జీలు. ఖాతాదారులు నిర్వహించే లావాదేవీల స్థాయిని బట్టి ఇవి మారిపోతుంటాయి కూడా. వీటిల్లో లాభనష్టాలివీ... పై బ్యాంకులకు సంబంధించిన ఖాతాల్లో ట్రేడింగ్ చేసేవారిని సంప్రదించినపుడు వివిధ రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఐసీఐసీఐ వరకూ చూస్తే సాఫీగా ట్రేడింగ్ చేసుకునే ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కూడా ఇది సరైన ప్లాట్ఫామ్గానే చెప్పాలి. ఎందుకంటే సైట్నే విగేషన్, నగదు లావాదేవీల వేగం వంటివన్నీ దీన్లో బాగుంటాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్త ఎక్కువ. పెపైచ్చు ట్రేడింగ్ చేసేవారు మొత్తం సొమ్మును ట్రేడింగ్కు కేటాయించి, సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వలుంచని పక్షంలో వారికి ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు. ట్రేడింగ్లో సంపాదించేదంతా ఈ ఖర్చులకే పోతుందని వాపోయిన వారూ ఉన్నారు. హెచ్డీఎఫ్సీది కూడా ఇదే గొడవ. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు ఉంచాల్సిన అవసరం దీన్లోనూ ఉంది. కోటక్ సెక్యూరిటీస్ది మామూలుగానే మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువ ఛార్జీల వ్యవహారం. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఛార్జీలు కాస్త తక్కువే అయినా... ఇది ట్రేడింగ్ చేసేవారికి ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే దీన్ని యాక్సిస్ చేసుకోవటమే చాలా స్లో కనక... ఒకసారి షేర్లు కొన్ని కొన్నాళ్ల పాటు వదిలేసేవారికైతే మంచిదనే చెప్పొచ్చు. ఎస్బీఐ కూడా ఇలాంటి సేవలందిస్తున్నా... యాక్సిస్ మాదిరే ట్రేడింగ్ చేసేవారికి చాలా ఇబ్బందని చెప్పొచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఆనంద్! ఇక ‘సిప్’ చేయండి!
ఆనంద్ రాజుకు 27 ఏళ్లు. వివాహమయింది. నెలకు కోతలన్నీ పోను చేతికి రూ. 28 వేల వరకూ వస్తుంది. దాన్లో 18 వేలు ఖర్చయిపోతాయి. మిగిలిన 10 వేలూ పొదుపు చేస్తుంటాడు. కాకపోతే ఆనంద్కు పొదుపు పథకాలపై, పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా లేదు. దీంతో మిగిలే సొమ్మంతా తన సేవింగ్స్ ఖాతాలోనే జమ చేస్తున్నాడు. ఇలా జమ చేసిన మొత్తం ఇప్పటికి రూ. 3 లక్షలపైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పథకాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎందుకంటే తనకు ఇప్పటిదాకా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లూ లేవు. కానీ ఆర్థికంగా ఆయనకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవేంటంటే... 35 ఏళ్లు నిండేసరికల్లా కనీసం రూ. 50 లక్షలు పెట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి. 60 ఏళ్లకు రిటైరయి... హాయిగా బతకాలి. ఈ ప్రశ్నను ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగోకు పంపించాం. మరి ఆయన ఏమన్నారు? ఏం సూచించారు. ఇదే ఈ వారం ‘ప్లానింగ్’... లక్ష్యాలు బాగున్నాయి.. ఆనంద్! నేను గమనించిందేమంటే మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యాలు చాలా బాగున్నాయి. కాకపోతే వీటిని సాధించడానికి మీరు సరిపోయే నిధిని సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రస్తుతం మీ దగ్గరున్న మిగులు మొత్తాన్ని సరైన రీతిలో పెట్టుబడులకు మళ్లించాలి. మీ వయసు చిన్నదే కాబట్టి... ఇపుడు మీరు కాస్త రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ లక్ష్యాలకోసం మీరు సమకూర్చుకోవాల్సిందేంటంటే... - ఇల్లు కొనుగోలు చేయటం. దానికి 2023 నాటికి రూ.50 లక్షలు కావాలి. - రిటైరయ్యే నాటికి... అంటే 2048 నాటికి నెలకు రూ.18,000 రావాలి. కాకపోతే ఇంటికి కావాల్సిన సొమ్మును గానీ, రిటైర్మెంట్ అనంతరం అవసరమయ్యే మొత్తాన్ని గానీ ఇప్పటి రేట్ల ప్రకారం లెక్కించాం. కానీ ధరలు ఇప్పట్లా ఉండవు కదా? అందుకని ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటే మీ రిటైర్మెంట్ నిధి ఈ కింది విధంగా ఉండాలి. ఇక ఇంటి విషయానికొస్తే డౌన్ పేమెంట్గా కనీసం 20 శాతం మొత్తం ఉండాలి. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇలా విశ్లేషించొచ్చు... దాచుకున్న మొత్తాన్ని డెట్లో పెట్టుబడి పెట్టొచ్చు అక్కడి నుంచి క్రమంగా ఈక్విటీలోకి మళ్లించండి అప్పుడే సొంతింటిసహా హ్యాపీ రిటైర్మెంట్ కాల వ్యవధిని బట్టి మీ అవసరాలను మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించవచ్చు. మధ్య కాలిక అవసరాలు తీర్చుకోవటానికి ఈక్విటీ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్ వంటి విభిన్న సాధనాలను ఎంచుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలకోసమైతే ఎక్కువగా ఈక్విటీపైనే ఆధార పడాలి. సొంతిల్లు విషయానికొస్తే మీరు గృహ రుణం తీసుకోవచ్చు. కావాల్సిన మొత్తం రుణం 40 లక్షలు. ఇది మీరు కొనాలనుకుంటున్న మొత్తంలో 80 శాతం. దీనికి నెలవారీ ఈఎంఐల రూపంలో రూ. 41వేలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ వ్యవధి 20 ఏళ్లు. ఇలాగైతే మీరు సంపాదిస్తున్న మొత్తంపై ఈఎంఐ ప్రభావం చాలానే ఉంటుంది. అది మీ ఇతర అవసరాలపై కూడా పడుతుంది. ఇక డౌన్పేమెంట్గా మీరు చెల్లించాల్సిన మొత్తం కోసం... మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. నా సూచనలు ఇవీ.. మీ అవసరాలు కావచ్చు... లక్ష్యాలు కావచ్చు. వాటిని సాధించాలంటే ఇప్పటి నుంచే మీరు మీ నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడులలోకి మళ్లించండి. ఎవరైనా నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడుల్లోకి మళ్లించాలంటే దానికో చక్కని మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్). దీన్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. దీర్ఘకాలంలో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలుంటాయి కనక సగటు కొనుగోలు మొత్తం తగ్గుతుంది. దీనివల్ల భారీ నిధిని సమకూర్చుకోవటం వీలవుతుంది. ఇక మీ సేవింగ్స్ ఖాతాలో ఇప్పటిదాకా దాచుకున్న మొత్తం విషయానికొస్తే దాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి... సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా కొన్నాళ్ల వ్యవధిలో ఈక్విటీలోకి మళ్లించండి. వీటితో పాటు మీరు ఆరోగ్య బీమాను తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే ఆ ఖర్చులు తట్టుకోవటం చాలా కష్టం. మీ వయసు, రిస్క్ సామర్థ్యం, మీకు వస్తున్న ఆదాయాన్ని బట్టి మీరు ఈ కింది పోర్ట్ఫోలియోను పరిశీలించవచ్చు. అప్పటికి ఖర్చులు ఇలా ఉండవచ్చు..! ప్రస్తుతం నెలకు మీకు అవుతున్న ఖర్చు రూ.18 వేలు. కాకపోతే ద్రవ్యోల్బణాన్ని, ఇతరత్రా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే మరో 33 ఏళ్ల తరవాత మీకు నెలకు అవసరమయ్యే మొత్తం రూ.1.23 లక్షలు. దాన్ని చూస్తే.. ప్రస్తుతం నెలకు ఖర్చు రూ.18 వేలు ద్రవ్యోల్బణం అంచనా 6 శాతం రిటైర్మెంట్ సంవత్సరం 2048 అప్పటి నెలవారీ ఖర్చు రూ.1,23,131 అనిల్ రెగో సీఈవో, రైట్స్హొరైజన్స్ -
ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్
కాగితంతో పని లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని ప్రైవేటు రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఈ విధానాన్ని అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని దానికి ఫొటోగ్రాఫ్, అడ్రస్, పాస్పోర్ట్ జిరాక్స్ కాపీలను జత చేసి అప్లోడ్ చేస్తే చాలు పేపర్లెస్ బ్యాంకింగ్ సేవలు మీ ముందుంటాయని బ్యాంక్ పేర్కొంది. -
ఉపాధిలో పొదుపు
ఉపాధి కూలీలను చెడువ్యవసనాలకు దూరంగా ఉంచేందుకు వారిలో పొదుపును అలవాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యసనాలకు ఖర్చు చేసే సొమ్మును మదుపు చేయించడం ద్వారా వారి భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇటీవల జరిగిన డ్వామా పీడీల జాతీయస్థాయి సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగింది. కూలీల నుంచి అభిప్రాయ సేకరణ అనంతరం ఈ పొదుపు పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. - కూలీమొత్తం పొదుపు ఖాతాకు మళ్లింపు - ఆర్డీలపై ఇచ్చే 8.5 శాతం వడ్డీ చెల్లింపు - చెడు వ్యసనాల నుంచి దారి మళ్లించేందుకే సాక్షి, విశాఖపట్నం : ఉపాధి హామీ పథకంలో సంపాదించే మొత్తంలో ముప్పై నుంచి 40 శాతం మద్యం, ఇతర వ్యసనాల కోసం కూలీలు ఖర్చు చేస్తున్నట్టుగా ఇటీవల ఒక సర్వేలో కేంద్రం గుర్తించింది. 80 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు ఇలా వ్యసనాలకు ఖర్చు చేస్తున్నట్టు నిర్ధారణైంది. వీరిలో పొదుపు అలవాటును పెంపొందించగలిగితే వ్యసనాలకు చేసే ఖర్చు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. తొలుత వీరు సంపాదించే మొత్తంలో కనీసం 10 శాతం మొత్తాన్ని పొదుపు చేయించాలని నిర్ణయించారు. సాధారణంగా ఉపాధి పథకంలో ఆర్నెల్లు మాత్రమే పనులుంటాయి. మిగిలిన ఆర్నెల్లు కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. ఉపాధి పనులు చేసినంత కాలం ప్రతీ నెలా వారు సంపాదించిన మొత్తంలో 10 శాతం మొత్తాన్ని సేవింగ్ అకౌంట్లో జమచేస్తారు. సాధారణంగా సేవింగ్ అకౌంట్లో జమ చేసే మొత్తంపై కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ ఇస్తారు.ప్రతీనెలా కొంత మొత్తం చొప్పున ఏడాదిపొడవునా పొదుపు చేస్తేనే రికవరింగ్ డిపాజిట్ అకౌంట్గా పరిగణిస్తారు. ఈ అకౌంట్లో పొదుపుచేసే మొత్తానికి మాత్రమే బ్యాంకులు 8.5 శాతం వడ్డీ చెల్లిస్తాయి. కానీ ఉపాధి కూలీల కోసం కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది. సేవింగ్ ఖాతాలో పొదుపు చేసే కూలీల మొత్తానికి కూడా ఆర్డీలపై చెల్లించే 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఏదైనా కూలీ రోజుకు గరిష్టంగా రూ.169ల చొప్పున ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి పొందితే అతను సంపాదించే రూ.16,900లలో 10శాతం చొప్పున రూ.1690ల మొత్తం సేవింగ్ ఖాతాలో అటోమేటిక్గా జమవుతుంది. మన రాష్ర్టంలో ఉపాధి హామీ పథకంలో 80,68,349 జాబ్ కార్డుల పరిధిలో కోటి 72లక్షల83వేల 712 మంది కూలీలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31లక్షల35వేల92 కుటుంబాల పరిధిలో 52 లక్షల 11వేల586 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రూ.252కోట్ల 41 లక్షల 84వేల విలువైన 26లక్షల 76వేల 41పనులు గుర్తించగా, ఇప్పటివరకు రూ.107 కోట్ల విలువైన 14లక్షల 70వేల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.25 కోట్ల మేర కూలీలు పొదుపుచేసే అవకాశం ఉంటుంది. ఈ పొదుపు పథకానికి సంబంధించిఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల పీడీల కాన్ఫరెన్స్లో ఈపథకంపై పీడీల అభిప్రాయాలు కేంద్రం సేకరించింది. డిసెంబర్ నెలాఖరులోగా కూలీలనుంచి అభిప్రాయాలు సేకరించిన వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉన్నట్టుగా ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఉపాధి కూలీల్లో పొదుపు అలవాటు పెరగడంతో పాటు వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
మైనర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం పదేళ్లు పైబడిన మైనారిటీల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించింది. వ్యక్తిగత చెక్బుక్, డెబిట్ కార్డ్ను కూడా ఈ అకౌంట్తో బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. పిల్లల్లో పొదుపు, ఆర్థిక పరంగా జవాబుదారీ తనాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ‘స్మార్ట్ స్టార్’ అకౌంట్ను ప్రారంభించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాత్ తెలిపారు. చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపు, మొబైల్ ఫోన్ల రిచార్జ్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ల ప్రారంభం, ఏటీఎం, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆర్థిక అంశాలపై మైనర్లకు అవగాహన పెరుగుతుందనీ అన్నారు. -
బుడి బుడి పొదుపు...
ఏడేళ్ల ఆదిత్య నాన్నతో కలసి ఏటీఎంకి వెడితే .. కార్డు ఇన్సర్ట్ చేయడం నుంచి నగదు, ట్రాన్సాక్షన్ స్లిప్ తీసుకునేదాకా అంతా తానే చేయాలంటాడు. ఆరేళ్ల భార్గవి .. వాళ్లమ్మతో షాపింగ్కి వెడితే డబ్బులు తన చేత్తోనే ఇస్తానని మారాం చేస్తుంది. డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆర్థిక లావాదేవీలపై వారికి క్రమక్రమంగా పెరిగే ఆసక్తే ఇందుకు కారణం. అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అటు బ్యాంకులు మరో అడుగు ముందుకేసి పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. ఉచితంగా పాస్బుక్లు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలతో పలు బ్యాంకులు కిడ్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ తదితర బ్యాంకులు ఈ మధ్యే ప్రత్యేక అకౌంట్స్ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల పొదుపు ఖాతాలపై ఈ కథనం.. ఎస్బీఐ .. పెహ్లా కదమ్.. పెహ్లీ ఉడాన్.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల అకౌంట్లు అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలసి ఏ వయస్సు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీన్ని వారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో రూ. 5,000 దాకా పరిమితి ఉంటుంది. అదే మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనైతే పరిమితి రూ. 2,000గా ఉంటుంది. . యంగ్ చాంప్.. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారి కోసం ఫెడరల్ బ్యాంక్ యంగ్ ఛాంప్ పేరిట పొదుపు ఖాతాలను ప్రవేశపెట్టింది. పదేళ్లు అంతకు పైబడి వయస్సున్న పిల్లల కోసం దీన్ని ఉద్దేశించారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్లో రూ. 2,500 దాకా వ్యయ పరిమితితో ప్రత్యేకంగా డెబిట్ కార్డును అందిస్తుంది. మొబైల్ అలర్ట్లు, పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా నిధుల బదలాయింపు, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్లో కొనుగోళ్లకు రివార్డు పాయింట్లు మొదలైన ఫీచర్లు ఈ అకౌంట్లో ఉన్నాయి. కిడ్స్ అడ్వాంటేజ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7-18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును బ్యాంకు ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ.2,500 విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ పరిమితి రూ. 2,500గా ఉంటుంది. ఈ ఖాతా రూ. 1,00,000 మేర విద్యా బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. అలాగే మూడు నెలలకోసారి స్టేట్మెంట్లు, లావాదేవీలకు సంబంధించిన ఉచిత ఈమెయిల్ అలర్ట్లు కూడా బ్యాంకు పంపిస్తుంది. జంబో కిడ్స్ సేవింగ్స్.. కరూర్ వైశ్యా బ్యాంక్ పన్నెండేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్ను కూడా బ్యాంకు ఇస్తుంది. అటు స్టూడెంట్ సేవింగ్స్ అకౌంటు పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయస్సు గల విద్యార్థుల కోసం మరో పొదుపు ఖాతాను కూడా బ్యాంక్ అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉండాలి. కోటక్ మై జూనియర్ అకౌంటు.. ఈ ఖాతాలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షికంగా దాదాపు ఆరు శాతం దాకా వడ్డీ ఇస్తోంది. దీనికి అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటివి ప్రారంభించి.. క్రమం తప్పకుండా కడుతూ ఉంటే మినిమం బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది. ఖాతాను ప్రారంభించిన తొలి ఏడాది ప్రారంభ ఆఫర్ కింద ఆర్డీ, సిప్ మొత్తాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది దాకా పీవీఆర్ థియేటర్ సినిమా టికెట్లు లేదా ల్యాండ్మార్క్ బుక్ వోచర్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ ఖాతా.. పద్దెనిమిదేళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకటి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్బుక్లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా (ఆర్నెల్ల పాటు), రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. పదేళ్ల పైబడిన పిల్లలకోసం వారు కోరిన చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. ఆర్నెల్లకోసారైనా డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డెబిట్ కార్డు మోసాలు జరిగిన పక్షంలో రూ.50,000 దాకా పర్చేజ్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీ ఉంటుంది. ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ ఒక్క రోజు నుంచి పద్దెనిమిదేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాం క్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. పేరెంట్స్ కోరితే ఏడేళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది బ్యాంకు. రోజువారీ షాపింగ్ లేదా విత్డ్రాయల్ కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 దాకా వీటిపై పరిమితులను ఎంచుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ తరహా అకౌంట్లు పిల్లలకు చిన్నప్పట్నుంచి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చేందుకు ఉపయోగపడతాయి. నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్బుక్కులు, డెబిట్ కార్డులు వాడటం మొదలైన బ్యాంకింగ్ లావాదేవీల గురించి అవగాహన ఏర్పడుతుంది. అయితే, కిడ్స్ అకౌంట్స్ అంటూ బ్యాంకులు ప్రత్యేకత చూపించినా.. బ్యాలెన్సులు, ఫీజులు మొదలైన వాటి విషయంలో మిగతా సాధారణ ఖాతాల తరహాలో వీటి ట్రీట్మెంటు ఉంటుంది. ఇక, పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే.. తల్లిదండ్రులు కూడా వారితో కాస్త సమయం గడపాలి. డిపాజిట్, విత్డ్రాయల్స్ చేయడం, స్లిప్స్ నింపడం మొదలైనవి వారికి నేర్పాలి. అకౌంటు మనదే కదా అని వృథా ఖర్చులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అన్నది పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్లు మూడు నాళ్ల ముచ్చట కాకుండా కొనసాగించగలగాలి. ఇవన్నీ జరగాలంటే పేరెంట్స్కి కూడా క్రమశిక్షణ ఉండాలి. -
బీమా సొమ్ముకు ఎగనామం!
చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ రూ.600 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయం కోటయ్య కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర లక్షన్నర కన్నా ఎక్కువ బీమా వస్తే.. ఆ సొమ్ము మాత్రమే రైతులకు ఒక్కో రైతుకు రూ.50 వేలకు మించి వచ్చే అవకాశం లేదు హైదరాబాద్: రుణాలు చెల్లించలేదన్న కారణం చూపిస్తూ రైతుల సేవింగ్స్ ఖాతాలను స్తంభింపజేయడానికి ఒకవైపు బ్యాంకులు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు రైతులకు రావలసిన పంటల బీమాకు ప్రభుత్వం ఎగనామం పెట్టనుంది. రుణ మాఫీ పేరుతో రైతుల పంటల బీమా సొమ్మును సర్కారు ఖాతాలోకి జమ చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చింది. గత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు దాదాపు రూ.600 కోట్ల బీమా మొత్తం చెల్లించాల్సి ఉందని ప్రాథమికంగా లెక్కతేల్చారు. రుణ మాఫీ చేస్తున్నప్పుడు బీమాచెల్లించడమెందుకని భావిస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మును తన ఖాతాలో వేసుకోనుంది. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర రుణం మాఫీ చేస్తున్నట్టు ప్రకటించినందున ఇక ఆయా కుటుంబాలకు వచ్చే బీమా సొమ్ములను రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కోటయ్య కమిటీ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఒక్కో కుటుంబానికి మాఫీ చేస్తున్న లక్షన్నర రూపాయలకు మించి బీమా సొమ్ము వస్తే ఆ ఎక్కువగా వచ్చే సొమ్మునే రైతులకు ఇవ్వాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసింది. ఎలాగూ పంటల బీమా కింద రైతులకు రూ.లక్షల్లో సొమ్ము రాదు. ఒక్కో రైతుకు అత్యధికంగా వచ్చినా రూ.50 వేలకు మించి రాదు. అరుుతే ఆ రూ.50 వేలను కూడా మాఫీ కింద జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే ఒకో రైతు కుటుంబానికి రూ.లక్షమాత్రమే మాఫీ చేసినట్లవుతుందని, మిగతా రూ.50 వేలు రైతుల పంటల బీమా కింద వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి రైతు వ్యవసాయ రుణం తీసుకునే సమయంలో పంటల ఆధారంగా బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.లక్ష వరకు పంటకు బీమా చేస్తే అందుకుగాను కొన్ని పంటలకు ఐదు శాతం, కొన్ని పంటలకు ఆరు శాతం చొప్పున రుణం మంజూరు సమయంలోనే ప్రీమియంను బ్యాంకులు మినహాయించుకుంటాయి. రాష్ట్రంలో మెజారిటీ రైతులు పంటల బీమా పథకం పరిధిలో ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఖరీఫ్లో వేసిన పంటలు కోతలకు వచ్చిన సమయంలో అంటే గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇన్సూరెన్స్ కంపెనీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కలసి పంటల దిగుబడి ఆధారంగా ఇన్సూరెన్స్ సొమ్మును అంచనా వేస్తారు. ఆ మేరకు గత ఖరీఫ్లో పంటల బీమా కింద రైతులకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.బీమా మొత్తంలో సగం కేంద్రం తన వాటా కింద విడుదల చేస్తే.. మిగతా సగాన్ని రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుందని ఆ అధికారి వివరించారు. లక్షన్నర మాఫీ చేసినట్టు కాదు..! పంటల బీమా కింద ఒక్కో రైతు కుంటుంబానికి రూ.25 వేల నుంచి రూ.50 వేలకు మించి రావని, ఇప్పుడు రుణ మాఫీ పేరుతో ఆ మొత్తాన్ని మినహాయించుకుని, రూ.లక్షన్నరమాఫీ అనడం సమంజసంకాదనిఅధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. రూ.లక్షన్నరకు పైగా బీమా సొమ్ము వస్తే అలా ఎక్కువగా వచ్చిన సొమ్మునే రైతులకు చెల్లించాలని కోటయ్య కమిటీ సిఫారసు చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని, వారికి బీమా సొమ్ము రూ.50 వేలకు మించి రాదని, మిగతా 10 శాతం మంది పెద్ద రైతులకు మాత్రమే లబ్ధిచేకూరుతుందని అంటున్నారు. ఈ ఖరీఫ్కు లేనట్టే! మరోవైపు సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఈ ఖరీఫ్లో వేసే పంటలకు బీమా లేకుండా పోతోంది. జూలై నెలాఖరుతో చెల్లింపు గడువు ముగిసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగింపుపై ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఆగస్టు నెలాఖరు వరకు గడువు పొడిగించాలని ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది. దీంతో రైతుల పంటల బీమా గడువు పొడిగింపును పట్టించుకునే నాధుడే కరువయ్యారు. -
మా దృష్టికి రాలేదు.. వచ్చినప్పుడు చూస్తాం
రైతుల పొదుపు ఖాతాల స్తంభనపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి రుణ మాఫీపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం హైదరాబాద్: రైతుల వ్యక్తిగత పొదుపు ఖాతాలను స్తంభిం పజేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రైతులు తమ వ్యక్తిగత ఖాతాల్లో దాచుకున్న నగదును డ్రా చేసుకోవడానికి వీలులేకుండా బ్యాంకులు ఆంక్షలు విధించడమే కాకుండా తీసుకున్న వ్యవసాయ రుణాల బకాయి కింద లాగేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించింది. బుధవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు విలేకరులు ఈ అంశం ప్రస్తావించగా.. అది తమ దృష్టికి రాలేదని ఆయన బదులిచ్చారు. తమ దృష్టికి వచ్చినప్పుడు అలా చేయొద్దని బ్యాంకులకు ఆదేశాలిస్తామని చెప్పారు. మాఫీపై స్పష్టత ఎప్పుడో చెప్పలేం... రైతుల రుణ మాఫీపై ఆర్బీఐ నుంచి స్పష్టత వచ్చినా రాకున్నా తమ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. నేరుగా నగదు ఇవ్వకపోయినా రుణమాఫీని ఇప్పటికే ప్రకటించామని.. త్వరలో నిర్దిష్ట గడువునూ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఎప్పటిలోగా అనే గడువు చెప్పలేమన్నారు. నేరుగా రుణమాఫీ చేయలేకపోయినా రైతులకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. కొత్త రుణాలు తీసుకోదలచిన వారు పాతవి చెల్లించి తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఆర్బీఐ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదన్నారు. రుణాలు చెల్లించినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు. ఐ-ప్యాడ్లా..? ఉత్తిదే.. దృష్టి మరల్చడానికన్నాం..! రైతులకు ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకు ఐ-ప్యాడ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన ప్రస్తుతానికి సంబంధించినది కాదన్నారు. రైతులు ఎక్కువ మంది వరి పంటపై దృష్టి సారిస్తున్నందున వారి దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి ఈ మాట చెప్పారని పేర్కొన్నారు. లాభసాటిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించేలా చేసేందుకు ఐ ప్యాడ్ల ప్రస్తావన చేసినట్టు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్లో ఇస్తామన్నారు. -
హామీలన్నీ ‘మాఫీ’!
ప్రభుత్వ తీరుపై డ్వాక్రా మహిళల ఆగ్రహం రుణ చెల్లింపులకు పెరుగుతున్న ఒత్తిళ్లు బ్యాంకర్ల ఒత్తిడికి సాయంగా ఐకేపీ సిబ్బంది వాయిదా మొత్తాన్ని పొదుపు ఖాతాలో వేయాలని మెలిక చోడవరం: ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది డ్వాక్రా మహిళల పరిస్థితి. రుణాలు మాఫీ చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తుంటే... తీసుకున్న రుణ వాయిదాలు వెంటనే చెల్లించాలంటూ ఐకేపీ అధికారులు మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు హామీల సంగతేంటని మహిళలు నేతలను నిలదీస్తున్నారు... డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది. దీంతో ఐదు నెలలుగా డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలను చెల్లించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ రుణ మాఫీపై ఇప్పుడు మీనమీషాలు లెక్కిస్తోంది. ఇదిగో చేస్తాం... అదిగో ఇస్తామంటూ అధికారం చేపట్టి పదిరోజులైనా నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనివల్ల బ్యాంకర్ల నుంచి ఐకెపి అధికారులకు కొంత ఒత్తిడి వస్తుండడంతో వారు మహిళా సంఘాలను రుణాలు చెల్లించాలంటూ సతాయిస్తున్నారు. జిల్లాలో సుమారు 42 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుమారు రూ.1200 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్నాయి. వీటిలో కొంత మేర చెల్లించినప్పటికీ మిగతా రుణమంతా మాఫీకి వర్తిస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే వాయిదాలు మీరుతున్నా మాఫీపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా మహిళలపై ఒత్తిడి ప్రారంభమైంది. రుణ వసూలుకు కొత్త మెలిక : నేరుగా అప్పు చెల్లించమనకుండా ఆ వాయిదా మొత్తాన్ని డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో వేయాలని ఐకేపీ సిబ్బంది సంఘ సభ్యులకు చెబుతున్నారు. మాఫీ అయ్యే అవకాశం ఉన్నందున రుణాలు చెల్లించకూడదని ఇప్పటికే జిల్లాలో ఉన్న 43 మండల సమైక్యసంఘాలు, 1150 గ్రామైఖ్య సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయినా ఐకేపీ సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో సంఘ సభ్యత్వం రద్దు కాకుండా తమ పొదుపు ఖాతాలో నెలవారీ ఒక్కొక్క సభ్యురాలు రూ.50 నుంచి రూ.100 వరకు వేసుకుంటున్నారు. అలాంటిది ఒకేసారి రుణం తాలూకా వాయిదా సొమ్మును ఆ ఖాతాల్లో వేయమని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మాఫీ చేయకపోతే సంఘాల పొదుపుఖాతాల్లో వేసిన రుణ వాయిదాల మొత్తాన్ని ఆన్లైన్లో బ్యాంక్ జమ చేసుకునే అవకాశం లేకపోలేదని కొందరు మహిళలు అంటున్నారు. ఇదిలావుంటే రుణమాఫీ జరిగితే పొదుపు ఖాతాలో వేసిన వాయిదాల సొమ్ము సంఘానికే ఉండి పోతుందని ఏదో విధంగా మహిళలను ఒప్పించే పనిలో ఐకేపీ సిబ్బంది పడ్డారు. ఇప్పటికే చోడవరం, మాడుగుల, ల క్ష్మీపురం, రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో ఇందిరా క్రాంతి పథకం సిబ్బంది డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనిని డ్వాక్రా మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. -
ఏబీసీ ఫార్ములా..
స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. కాస్త ఒడిదుడుకులు వచ్చినా.. అప్పుడే నిశ్చింతగా ఉండొచ్చు. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్కి అనేక సాధనాలు ఉన్నాయి. లక్ష్యాలు, రాబడులు, రిస్కులు తదితర అంశాలు బట్టి వాటిని వర్గీకరించుకుని, మనకు అనువైనవి ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలవుతుంది. A-వడ్డీనిచ్చే సాధనాలు సేవింగ్స్ అకౌంట్ లాంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. ఇలాంటి వాటిలో గొప్పతనమేమిటంటే.. అసలుకు ఢోకా ఉండదు. పైగా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఠక్కున తీసుకోగలిగే వెసులుబాటు ఉంటుంది. అయితే, మిగతా అన్ని సాధనాలతో పోలిస్తే .. వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా నెమ్మదిగా పెరుగుతుంది. స్వల్పకాలికమైన లక్ష్యాల కోసం లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏం చేయాలో ఆలోచించుకునేందుకు సమయం కావాల్సినప్పుడో ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఎక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో చూసుకుని ఎంచుకోవడం మంచిది. B-డివిడెండ్లు ఇచ్చే సాధనాలు.. షేర్లు వంటివి ఈ కోవలోకి వస్తాయి. పెట్టుబడులపై స్థిరంగా ఆదాయం రావాలనుకుంటే ఇది కూడా మంచి సాధనమే. అయితే, ఆయా కంపెనీల పనితీరుపై డివిడెండ్లు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా తరచూ డివిడెండ్లు ఇచ్చే కంపెనీల నిర్వహణ మెరుగ్గానే ఉంటుంది. కానీ, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఆయా కంపెనీలు ఏటా ఇచ్చే నివేదికలపై ఒక కన్నేసి ఉంచడం మంచిది. తద్వారా ఊహించని పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు సాధ్యపడుతుంది. C- బంగారం, రియల్టీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే సాధనాల్లో బంగారం, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిని కూడా చేర్చుకోవచ్చు. బంగారాన్ని ఆభరణాల కోణంలోనే కాకుండా ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా పరిగణించే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే ఫ్లాట్లు, ప్లాట్లు వంటి రియల్టీ సాధనాల్లో కూడా ఇటీవల పెట్టుబడి ఆసక్తి పెరుగుతోంది. పరిస్థితులను బట్టి ధరలు హెచ్చుతగ్గులకు లోనైనా దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఆ వెబ్సైట్ నకిలీది: ఆర్బీఐ
ముంబై: గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆర్బీఐ పేరుతో నకిలీ వెబ్సైట్ను ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని రిజర్వు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. http://www.rbiinonline.org/ savings.htm పేరుతో ఉన్న ఆ వెబ్సైట్ ఆఫరు చేస్తున్న సేవింగ్స్ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించింది. ఈ వెబ్సైట్ ఆఫర్లకు ఆకర్షితులై మోసపోవద్దని కోరింది. సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంటు, క్రెడిట్ కార్డుల వంటి వాణిజ్య బ్యాంకింగ్ సేవలను తాము అందించడం లేదని తెలిపింది. నకిలీ వెబ్సైట్కు సంబంధించి తాము గతంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలను తమ అధికారిక వెబ్సైట్ rbi.org.inలో చూడవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. -
బీమా పాలసీలు ప్రత్యేకం..
కోటికి వైద్య బీమా సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ప్రో హెల్త్’ పేరుతో కొత్త వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీలోని ప్రత్యేకత. ప్రొటెక్ట్, ప్లస్, ప్రిఫర్డ్, ప్రీమియర్ పేరుతో ఈ పాలసీ నాలుగు రకాల ఆప్షన్లు అందిస్తోంది. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అవకాశాన్ని కల్పిస్తోంది. అదే 65 ఏళ్లు దాటిన వారికి కో-పేమెంట్ తప్పనిసరి. మ్యాక్స్ లైఫ్ శిక్షా సూపర్ ప్లస్ ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ పిల్లల ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ‘శిక్షా ప్లస్ సూపర్’ పేరుతో యులిప్ పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల ఉన్నత చదువులకు అక్కరకు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఈ పథకం గ్యారంటీ లాయల్టీ అడిషన్తో పాటు అవసరమైతే 5 ఏళ్ల తర్వాత నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. తల్లిదండ్రులకు ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ మొత్తం చెల్లించడంతోపాటు, పిల్లల భవిష్యత్తు ఫీజులను కూడా బీమా కంపెనీయే భరిస్తుంది. కొటక్ ‘జిఫి’ అకౌంట్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి’ పేరుతో సోషల్ నెట్వర్క్ బ్యాంక్ అకౌంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్క్లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ అకౌంట్ను రూ.5,000తో ప్రారంభించొచ్చు. కనీస నిల్వ అవసరం లేదు. సేవింగ్స్ ఖాతాపై ఎటువంటి వడ్డీ ఉండదు. అకౌంట్లో ఉన్న నగదు రూ.25,000 దాటితే అది ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్గా మారిపోతుంది. -
అవసరం ఎలాంటిదైనా..నెలకో కొంత
‘‘ఏమండీ డిసెంబర్ వస్తోంది! పిల్లలిద్దరి సెకండ్ టెర్మ్ ఫీజు కట్టేశారా?’’ అజయ్ని అడిగింది ఆయన భార్య సుహాసిని. ’అరె! మరచిపోయానే!! ఇప్పటికిప్పుడు 60 వేలు ఎలా?’ ఆలోచనలో పడ్డాడు అజయ్. ఈ సమస్య అజయ్ ఒక్కడిదే కాదు. స్వల్పకాలంలో డబ్బు అవసరమయ్యే స్కూలు ఫీజులు, ఇంట్లో శుభకార్యాలు, ఇంటి రిపేర్లు, విహారయాత్రలు... వీటికీ ప్లానింగ్ తప్పనిసరి. మరి ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం దేన్లో పొదుపు చేయాలి? ఏవి మంచివి? చాలామంది నెలనెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడుతుంటారు. కొందరు దాన్ని ఇంట్లోనే దాచుకుంటారు. మరికొందరు సేవింగ్స్ ఖాతాలోనే వదిలేస్తారు. కొందరైతే సిప్ వంటి సాధనాల ద్వారా షేర్ మార్కెట్లో పెడతారు. వీటిని చూసినట్లయితే... ఇంట్లో దాస్తే ఏ రాబడీ రాదు. సేవింగ్స్ ఖాతాలో వదిలేస్తే వడ్డీ అతితక్కువ వస్తుంది. షేర్లలో పెడితే రిస్కుంటుంది. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచించేవారికి అక్కరకొచ్చేదే ఆర్డీ. అంటే రికరింగ్ డిపాజిట్. చిన్న లక్ష్యాల కోసం... మీరు రూ.20 వేల స్మార్ట్ఫోనుకు, రూ.25 వేలు విహారయాత్రకు, రూ.50 వేలు పిల్లల స్కూలు ఫీజుకు పెట్టాల్సి ఉంది. సాధారణంగా... స్కూలు ఫీజు తప్ప.. మిగతా రెండింటికీ డబ్బులుంటే చూద్దాంలే అనుకుంటాం. చాలా సందర్భాల్లో అంత మొత్తం ఒకేసారి సమకూరదు. ఆ సరదా తీరకపోనూ వచ్చు. ఆర్డీ ఉంటే ఇవి తీరనివేమీ కావు. ఎలాగంటే... ఫోన్ కోసం ప్రతి నెలా రూ. 2,000 చొప్పున పది నెలలు, వెకేషన్ కోసం ఏడాది పాటు రూ. 2,000, స్కూల్ ఫీజుల కోసం ఏడాది పాటు రూ.4,000 ఆర్డీ చేయడం మొదలు పెట్టి చూడండి. నెలకు రూ.8,000 వీటికోసం కేటాయించాల్సి వస్తుంది. అది కష్టమేమీ కాదు. కానీ ఏడాది తిరిగేసరికి మీ కోరికలన్నీ తీరుతాయి. పెపైచ్చు దీనిపై వడ్డీ కూడా వస్తుంది. ఆర్డీ ఎందుకంటే... దీని కనీస వ్యవధి 6 నెలలు. గరిష్ట వ్యవధి పదేళ్లు. కనీసం రూ.100 (ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ లాంటివి) నుంచి ఆర్డీ చేయొచ్చు. ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ.500. పోస్టాఫీసులోనైతే నెలకు రూ.10 వేయొచ్చు. వడ్డీ రేట్లు 7-10% దాకా ఉన్నాయి. మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి అసలుకు జమచేస్తారు. గడువుకన్నా ముందే ఆర్డీని వెనక్కి తీసుకోవచ్చు. కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెనక్కి తీసుకోవటం ఇష్టం లేకుంటే... ఆర్డీలో జమ అయిన మొత్తంలో 90 శాతం దాకా లోన్ తీసుకోవచ్చు. ఆర్డీపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలానికి సింపుల్ సాధనం.. కొత్తగా పొదుపు ఆరంభించిన వారు... హడావుడిగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆర్డీతో మొదలుపెట్టడం బెటర్. నెలనెలా కొంతమొత్తాన్ని నిర్దిష్ట కాలానికి డిపాజిట్ చేయటమే ఆర్డీ. దీనివల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటవుతుంది. ఒకటి రెండేళ్లు గడిచాక మెల్లగా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఇతర సాధనాలపై అవగాహన పెంచుకుని ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టొచ్చు.