shamshabad airport
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ కార్గో విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తతో విమానం సేఫ్గా దిగగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతులు కాసేపు నిలిపివేశారు.చెన్నై నుండి హైదరాబాద్కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్(Landing Gear) సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్కు ఎయిర్పోర్టు అధికారుల అనుమతి కోరాడు. వెంటనే అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్(Landing Take Off)ను నిలిపివేశారు. దీంతో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేయగలిగారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.విదేశీ కరెన్సీ పట్టివేతహైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. నగరం నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ప్రకటించారు. అతనిని అదుపులోకి తీసుని విచారిస్తుట్లు తెలిపారు. -
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్లు,ఐపీఎస్లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్రాజ్కు వెళుతున్నారు. -
HYD: ఎయిర్పోర్టులో పాముల కలకలం
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్ 25) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు -
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు కుప్పకూలారు. గోవా నుంచి వచ్చిన ప్రయాణికుడు నితిషా, జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికురాలు సకీనా అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని ఎయిర్పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
శంషాబాద్లో ప్రైవేట్ జెట్ టెర్మినల్
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేట్ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్ను ప్రారంభించినట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది.ఈ సందర్భంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జెట్ టెర్మినల్ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్ గ్రూప్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధిహైదరాబాద్ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. -
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు అంతర్జాతీయ పురస్కారం
జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘హైదరాబాద్’ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పడ్డాయి. 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతను నిర్ణయించారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఈ పురస్కారం సాధించడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వహణలో భాగం పంచుకుంటున్న అందరికీ దీన్ని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళికలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఎయిర్సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జాతీయ పురస్కారం
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
ఈ రూట్ల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా ఎయిర్పోర్టు వరకు రెండు రూట్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్మెంట్ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. తక్కువ భూసేకరణతో.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పి–7 రోడ్ రూట్లో, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, బార్కాస్, పహాడీషరీఫ్ రూట్లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్టు వరకు 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్ రూట్ 31 కి.మీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్లలో ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్పోర్టు రూట్ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్షిప్ వరకు భవిష్యత్లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. నిర్మాణంపై ముందుకు సాగేదెలా..? రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్ప్రెస్ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ రూట్లను ఎల్అండ్టీ సంస్థ పీపీపీ మోడల్లో నిర్మించగా ఎయిర్పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్మెంట్ను నిలిపివేసి కొత్త అలైన్మెంట్లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్ రూట్ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్బీనగర్– ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్అండ్టీపై ఉంది. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లలోనే ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్లు పూర్తయితే గానీ ఎయిర్పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. రియల్ ఎస్టేట్ డీలా పడే ప్రమాదం.. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రూట్ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్పోర్టు నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎయిర్పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్రింగ్రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్ భూమ్ కనిపించింది. తాజాగా ఈ రూట్ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
-
Shamshabad Airport: సారీ.. ఎయిర్పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్పోర్టు నుంచి నడిపే క్యాబ్డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్లు ఇటీవల వరకు ఎయిర్పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్పోర్టుకు క్యాబ్లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్పోర్టుకు నడిచే క్యాబ్లకు ప్రతి కిలోమీటర్కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97 — CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్బెర్గ్కు పయనమైన ప్రధాని మోదీ -
శంషాబాద్: అండర్వేర్లో బంగారం పట్టివేత
సాక్షి, క్రైమ్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అండర్వేర్లో బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు. దాదాపు రూ. కోటి 37లక్షలు విలువ చేసే.. 2.279 కిలోలు బంగారం సీజ్ చేశారు అధికారులు. అలాగే.. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మొదటి బంగారం కేసు.. 1196 గ్రాముల బంగారం 72 లక్షల బంగారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ సీట్ వద్ద పేస్టు రూపంలో అమర్చి తీసుకొని హైదరాబాద్ వచ్చిన రసల్ కైమా ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండో కేసులో 752 గ్రాముల బంగారాన్ని కట్ పీస్ గోల్డ్ బార్ గా పెట్టుకొని కువైట్ వయా దుబాయ్ మీదిగా హైదరాబాద్ వస్తూ పట్టుపడ్డాడు విలువ 45 లక్షలు. మూడో కేసులో 331 గ్రాముల స్మగ్ల్డ్ గోల్డ్ విలువ 20 లక్షలు ప్రయాణికుడు షార్జా వయా దుబాయ్ నుండి వస్తూ పట్టుబడ్డాడు మరో కేసులో 1,10,000 సిగరెట్ ప్యాక్స్ ని ముగ్గురు ప్రయాణికులు కంబోడియా బ్యాంకాక్ నుండి వస్తు పట్టుబడిన ముగ్గురు వద్ద విదేశీ సిగరెట్లు. ఇదీ చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. పోలీసులే షాకయ్యారు -
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తెలుగు విద్యార్థులు
-
మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్కు తెలుగు విద్యార్థులు
మణిపూర్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది. చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం సీఎంకు ధన్యవాదాలు మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది: అమిత్ షా
Updates.. - శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమిత్ షా. అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఇది ట్రైలర్ మాత్రమే.. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తోంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు ప్రధాని కుర్చీ ఖాళీ లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అవినీతి పరులను బీజేపీ జైళ్లకు పంపించడం ఖాయం కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు ఎంఐఎంకు భయపడేది లేదు తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు 9 ఏళ్లుగా టీచర్ల నియామకాలు చేపట్టలేదు తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు కేసీఆర్ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది బండి సంజయ్ ఏం తప్పు చేశారు పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అందుకే సంజయ్ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది బండి సంజయ్ అరెస్ట్ను మీరు సమర్థిస్తారా? పేపర్ లీకేజ్తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. - బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నన్ను ఎనిమిది గంటల పాటు రోడ్లపై తిప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ ధృడ సంకల్పం. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తాం. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా చేవెళ్ల వచ్చారు. - చేవెళ్ల చేరుకున్న అమిత్ షా - చివరి నిమిషంలో అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా నోవాటెల్కు అమిత్ షా వెళ్లారు. - ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితలపై చర్చించారు. - అమిత్ షా.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై మరింత దూకుడు పెంచాలి. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అధికారమే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలి. బీఆర్ఎస్ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. - శంషాబాద్ నుంచి చేవెళ్ల సభకు బయలుదేరిన అమిత్ షా. - అమిత్ షాకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు. - కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. - వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు.. వాహనాలను లోపలికి అనుమతిస్తున్నారు. లిస్టులో పేరు ఉన్న వాళ్లని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. - ఏటీసీ సెంటర్ నుంచి అమిత్ షా నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నారు. - అమిత్ షా సుమారు రెండు గంటల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. - సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. - రాత్రి 7 గంటలకు అమిత్ షా తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. - రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరుతారు. -
శంషాబాద్లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన టెరి్మనల్కు అనుసంధానంగా నిర్మించిన ఈ డిపార్చర్ కేంద్ర భవనంలో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్లోని డిపార్చర్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్పోర్టు వర్గాలు సూచించాయి. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్లైన్స్ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపాయి. చదవండి: Group 4 Notification: ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్కు తరలించిన ఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్నగర్ అపార్టుమెంట్లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వక్రమార్గంలో బంగారం బిస్కెట్లు, 9 ఐఫోన్లు, ధిరామ్లు.. డాలర్లు.
సాక్షి, శంషాబాద్: ఒకే రోజు మూడు వేర్వేరు కేసులో అక్రమంగా రవాణా జరుగుతున్న బంగారం, విదేశీకరెన్సీ, ఐఫోన్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తీసుకొచ్చిన 9 ఐఫోన్లు బయటపడ్డాయి. వీటి విలువ 8.37 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం ఇలా.. ఓ మహిళా ప్రయాణికురాలు దుబాయ్ నుంచి సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె వద్ద ఉన్న చేతి సంచిలో మూడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 350 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 17.69 లక్షలు ఉంటుందని అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధిరామ్లు..డాలర్లు.. ఇద్దరు మహిళా ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఐఎస్ఎఫ్ చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద 55000 యుఏఈ ధిరామ్లు, 970 యూఎస్ డాలర్లు బయటపడ్డాయి. సీఐఎస్ఎస్ అధికారులకు నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ విలువ భారత కరెన్సీలో 11.49 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు.. పక్కా సమాచారం ప్రకారం అధికారులు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, అధికారులు రూ. 34 లక్షల విలువైన బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రియాద్ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే.. -
‘శంషాబాద్’ విస్తరణకు సహకరిస్తా
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా గౌరవార్థం సీఎం కేసీఆర్ ఆయన్ను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందన్నారు. వైద్య, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల హబ్గా హైదరాబాద్ మారిందని, దీంతో నగరానికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్పోర్టుల అభివృద్ధికి పౌర విమానయాన శాఖ నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మామునూరు ఎయిర్పోర్టులో త్వరలో ఏటీఆర్ కార్యకలాపాలు.. రాష్ట్రం ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్టులో ఏటీఆర్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్పల్లి)లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాంకేతిక అనుమతి ఇస్తామమన్నారు. అలాగే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టును వైమానిక దళం ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలను పున:పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్కు సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. చదవండి: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం -
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్తో పట్టుబడ్డ సిద్ధార్థ్ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్కు బ్యాగులో దొరికిన బులెట్కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల సునీత కుమారుడి బ్యాగ్లో బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్పై శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్లో బుల్లెట్తో విమానం ఎక్కడానికి ప్రయతి్నంచిన నేపథ్యంలో ఆయనపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పారీ్టలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచి్చన ఆయన తన బ్యాగేజ్ను కౌంటర్లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదుచేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్చార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్తో పాటు సిద్ధార్థ్ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. బ్యాగ్లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ -
ఎయిర్పోర్టులో రూ. కోటి విలువైన ఐఫోన్లు పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. -
ఎయిర్పోర్ట్లో క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ ప్రదేశాల్లో రద్దీ నివారణ కోసం ఆల్గో విజన్ టెక్నాలజీ సంస్థ గెయిల్ సహకా రంతో క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా కృత్రిమ మేధ, వీడియో అనలిటిక్స్ కలిపి క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. ఈ విధానంతో ప్రయాణికులు నిరీక్షించే సమయాన్ని నిర్ధారించి ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ ఉంది? ఎంత సమయం వేచి ఉండాలనే సమాచారాన్ని డిస్ప్లే ద్వారా తెలుపుతుంది. దీంతో ప్రయాణికులు రద్దీలేని మార్గాలు ఎంచు కుని ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లొచ్చు. కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన తదితర వాటిని కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్లో బంగారం
శంషాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి అక్రమార్కులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఓ వైపు కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్ –8779 విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఐదుగురు ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లగేజీలో ఉన్న కటింగ్ ప్లేర్లు, మిక్సీగ్రైండర్లను పరిశీలించగా.. బంగారంతో తయారు చేసిన కటింగ్ ప్లేర్లకు ఇనుప పూత వేశారు. అలాగే మిక్సీ గ్రైండర్ లోపల ఉండే మోటార్ యంత్రాల్లో కూడా బంగారు ప్లేట్లను అమర్చారు. అనుమానం రాకుండా సిల్వర్ కోటింగ్ వేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ. 1.15 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారంతో పట్టుబడిన ప్రయాణికులు క్యారియర్లుగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ కరెన్సీ పట్టివేత దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రయాణికుడు మంగళవారం అర్ధరాత్రి ఎఫ్జెడ్–8776 విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 30,000 అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. వీటి విలువ భారత కరెన్సీలో రూ.21,48,000 ఉంటుం దని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్పోర్టులో పాతబస్తీ అబూఫైజల్ అరెస్ట్
శంషాబాద్: యూట్యూబ్ ద్వారా విద్వేష పూరిత వీడియోలు చేసి విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న పాతబస్తీవాసి అబూఫైజల్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ బార్కాస్కు చెందిన అబుఫైసల్పై 2020లో సైబర్క్రైమ్ పోలీసులు సమోటోగా కేసు నమోదు చేశారు. కొంతకాలంగా దుబాయిలో ఉంటున్న అతడిపై సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన అబూఫైజల్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అతడిని అక్కడి నుంచి నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
30 కోట్ల విలువైన వజ్రాభరణాల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబైకి తరలించేందుకు పంపిన కొరియర్లో భారీగా వజ్రాభరణాలు, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గోలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. గడిచిన నాలుగైదు గంటలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం అధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ముంబయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీ ఎత్తున బంగారం, డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని ఎయిర్ పోర్ట్లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందానికి సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న కొరియర్ని ఓపెన్ చేసిన అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. (దూసుకెళ్లిన కారు; తప్పిన పెనుప్రమాదం) వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబై వెళుతున్న పార్సెల్లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు. కాగా.. వీటి విలువ 30 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా. ఈ పార్సిల్ని శ్రీపాల్ జైన్ అనే వ్యక్తి ముంబయి అడ్రస్కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉండటం విశేషం. -
హైదరాబాద్-యూఏఈకి మరిన్ని విమాన సర్వీసులు
సాక్షి, శంషాబాద్: భారత్–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్పోర్టబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సర్వీసులు ప్రారంభించింది. వారంలో మూడు రోజులు కొనసాగుతున్న ఈ సర్వీసులకు తోడుగా తాజాగా ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్ కూడా దుబాయ్కు సర్వీసులు ప్రారంభించింది. సోమ, బుధ, శనివారాల్లో ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక హైదరాబాద్–షార్జాకు మధ్య ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ వారంలో మూడు సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. కరోనా నిబంధనల మేరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపాయి. -
ఎయిర్పోర్ట్ మెట్రో.. మరింత ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) రూట్లో మెట్రో ఏర్పాటుకు నిధుల లేమి శాపంగా పరిణమించనుంది. నిధుల సమీకరణ, ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) యంత్రాంగాన్ని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం శూన్యంగా మారనుంది.. ఈ రూట్లో మెట్రో ఏర్పాటుకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించి ఏడాది ముగిసినా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టి సుమారు రూ.4 వేల కోట్లు వ్యయం చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంలేదని సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్పీవీ సైతం నిధుల సమీకరణలో చేతులెత్తేయడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి తొలిదశ మెట్రో రైళ్లు కూడా డిపోలకే పరిమితమైన విషయం విదితమే. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ రైళ్లను నడుపుతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా.. అనుమతులు లభించకపోవడం గమనార్హం. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎప్పుడో? రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంంలో ఎక్స్ప్రెస్ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ కారిడార్ ప్రాంతాలకు విచ్చేసే దేశ, విదేశీ ప్రయాణికులు అరగంట వ్యవధిలోగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఈ మార్గాన్ని డిజైన్ చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు ఏడాది క్రితమే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ నిధుల సమీకరణ విషయంలో స్పెషల్ పర్పస్ వెహికిల్ యంత్రాంగం చేతులెత్తేయడం, పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో పనులు ఎప్పుడు మొదలయ్యే విషయం సస్పెన్స్గా మారింది. రెండో దశపై నీలినీడలు.. బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ (26 కి.మీ), నాగోల్– ఎల్బీనగర్ (5 కి.మీ) మార్గంలో రెండు మెట్రో కారిడార్లను అనుసంధానించేందుకు రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత తరుణంలో రెండో దశ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సొంతంగా నిధులు వ్యయం చేసే పరిస్థితిలో లేకపోవడం, పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండోదశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వ్యయం ఘనం.. ఫలితం అంతంతే.. నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టును నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్– మియాపూర్ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికి 2010–14లో రూ.8683 కోట్లు, 2015–20లో రూ.13,236.. మొత్తంగా రూ.21,919 కోట్లు ఖర్చు చేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ఇటీవల వెల్లడించింది. ఇందులో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సింహభాగం నిధులను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించి ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసింది. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఈ ప్రాజెక్టు నగర రూపురేఖలను మార్చినప్పటికీ.. మెట్రో రైళ్లలో లాక్డౌన్కు ముందు కేవలం 4 నుంచి 4.5 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారని.. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆశించినంతంగా సత్ఫలితాన్నివ్వలేదని స్పష్టమవుతోందని పట్టణ ప్రణాళిక రంగ నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ పంజాతో ప్రజా రవాణాపై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు. ఈ ఛాయలు భవిష్యత్లోనూ కొనసాగనున్నాయని అంచనా వేస్తున్నారు. -
ఆకాశ వీధిలో..
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మొదట్లో విమాన యానంపై ప్రయాణికులు వెనకంజ వేశారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఎయిర్పోర్టులో అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులు అంతంత మాత్రంగానే నడిచాయి. రెండు నెలల లాక్డౌన్అనంతరం మే 25న ప్రారంభమైన విమాన సర్వీసులు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ప్రతి రోజు 126విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రద్దీతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య తక్కువే. అత్యవసరమైతేనే రాకపోకలు సాగిస్తున్నట్లు ఎయిర్పోర్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదట్లో కొన్ని నగరాలకు సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం ముంబై, చెన్నైలతో పాటు సుమారు 40కిపైగా నగరాలకు దేశీయ విమానాలు క్రమం తప్పకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ, కోల్కతా, విజయవాడ, వైజాగ్, కడప, «త్రివేండ్రం, కొచ్చి, బెంగళూరు, భోపాల్, లక్నో తదితర నగరాలకు ప్రయాణికులు వెళ్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు 63 విమానాలు నగరానికి చేరుకుంటుండగా మరో 63 హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు బయలుదేరి వెళ్తున్నాయి. ప్రతి రోజు 6,300 మంది హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మరో 6,200 మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. రాకపోకలు ఇలా.. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత మే 25న దేశీయ విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, మరో 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3వేల మంది ప్రయాణం చేశారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని విద్యానగర్కు బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో కేవలం 12 మంది బయలుదేరడం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన ఎయిర్ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. రెండోరోజు 2500 మంది రాకపోకలు సాగించారు. ఆపరేషన్లు ప్రారంభమైన 3వ రోజు 3,500 మంది ప్రయాణం చేశారు. మూడో రోజు 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్ తదితర ఎయిర్లైన్స్ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ ఆదేశాలకనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. ప్రస్తుతం 126 సర్వీసులు రాకపోకలు సాగించడం గమనార్హం. సాధారణ రోజుల్లో 460 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతాయి. రోజుకు 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. కోవిడ్ దృష్ట్యా రాకపోకలు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నెల ముగిసిన పిదపే.. మరోవైపు అంతర్జాతీయ విమానాలకు ఇప్పట్లో అనుమతి లభించకపోవచ్చని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. అంతా అనుకూలంగా ఉంటే ఆగస్ట్లోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావచ్చని జీఎమ్మార్ ఎయిర్పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు వందేభారత్ మిషన్లో భాగంగా ప్రత్యేక విమానాలను నడిపారు. త్వరలో మరిన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికులే స్వయంగా ఏర్పాటు చేసుకొనే చార్టెడ్ విమానాలు కూడా పలు దేశాల నుంచి రాకపోకలు సాగించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వైరస్ వ్యాపించకుండా ఎయిర్పోర్టులో పటిష్టమైన రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. బ్యాగేజ్ కోసం శానిటైజ్ టన్నెల్స్ పని చేస్తున్నాయి. సెల్ఫ్ చెక్ ఇన్, భౌతికంగా తాకేందుకు అవసరం లేని పద్ధతిలో తనిఖీలను కొనసాగిస్తున్నారు. -
థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేశాం: సోమేశ్కుమార్
-
విమానాలకు టేకాఫ్ సమస్యలు
-
ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే అనుమతిస్తున్నాం
-
కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సైబర్బాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ కొంత తగ్గిందని పేర్కొన్నారు. రవాణా,వైద్య శాఖ, కలెక్టర్ల సహకారంతో జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని రిసీవ్ చేసుకోవడానికి బంధుమిత్రులెవరూ రావద్దని ఆయన సూచించారు. గచ్చిబౌలి,ఎన్ఆర్డీ, వికారాబాద్, రాజేంద్రనగర్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!) ఐసోలేషన్ వార్డుల దగ్గరికి ఎవరూ రావద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. 1300 మందిని ఐసోలేషన్ చేశామని పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డుల్లో కూడా కట్టు దిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. (కరోనా సోకిందన్న అనుమానంతో.. ) -
శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత!
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 4 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 800 గ్రాములు, మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 700 గ్రాములు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కేజిన్నర బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారి వద్ద ఉన్న బంగారానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైఫిల్ షూటర్ విజేతలకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
సాక్షి, శంషాబాద్: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఖతార్లో జరిగిన 14వ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రైఫిల్ షూటింగ్లో బంగారు పతకం సాధించిన అబిద్ అలీఖాన్కు, ఇషాసింగ్కు ఎయిర్పోర్టులో మంత్రి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొన్న ఐదుగురు క్రీడాకారులు కూడా వివిధ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. రైఫిల్ షూటింగ్ క్రీడాకారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఇషాసింగ్ను సన్మానిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ -
అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.... అర్థరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర క్యాబ్లో ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా పోలీసులు రావడంతో డ్రైవర్ హడావిడిగా అక్కడి నుంచి కారును పోనిచ్చాడు. అయితే క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించిన యాదయ్య అనే ప్రయాణికుడి షర్టు కారులోపల ఇరుక్కోంది. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ ఎనిమిది కిలోమీటర్లపాటు కారు పోనిచ్చాడు. యాదయ్యను కారు లాక్కెడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కారు బయట మృతదేహం వేలాడుతుండటంతో... శంషాబాద్ టోల్గేట్ వద్ద వాహనదారులు గమనించి..కేకేలు వేయడంతో క్యాబ్ వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. -
మెగాస్టారైనా.. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజియాత్రలో భాగంగా విమానాశ్రయంలో డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ట్రయల్స్ 31 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా రాకపోకలు సాగించే రాజకీయ నేతలు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్లు ముఖ కవళికల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, చిరంజీవి, రాంచరణ్, అఖిల్ తదితరులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే ఈ జాబితాలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ ఇలా.. ప్రయాణికులు ప్రభుత్వం ధ్రువీకరించిన డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ వంటి గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీతోపాటు పూర్తి వివరాలను ఫేస్ రికగ్నిషన్ కౌంటర్ల వద్ద సమర్పించాలి. వివరాలను పరిశీలించిన అనంతరం వారి ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రభుత్వ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు. అనంతరం ఫేస్ రికగ్నిషన్ కోసం నమోదు చేసుకున్న ప్రయాణికుల పేరిట ఒక యూనిక్ డిజియాత్ర ఐడీ జనరేట్ అవుతుంది. ఫేస్ రికగ్నిషన్ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ. ఒకసారి ఈ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యాక ట్రయల్ పీరియడ్లో ప్రయాణికులు తమ డిజియాత్ర ఐడీని వినియోగించుకొని నేరుగా రాకపోకలు సాగించవచ్చు. ఫేస్ రికగ్నిషన్కు చెందిన గేట్ వద్దకు వెళ్లడానికి ముందు ప్రయాణికులు మొదట ఎయిర్ పోర్టులోని చెకిన్ కియోస్క్ల ద్వారా సెల్ఫ్ సర్వీస్ చెకిన్ లేదా వెబ్ చెకిన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సాఫీ ప్రయాణం.. ఫేస్ రికగ్నిషన్ వివరాలు నమోదు చేయించుకున్న ప్రయాణికుల కోసం డిపార్చర్ గేట్ నం.3 వద్ద ప్రత్యేకమైన ఈ–గేట్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికుల బోర్డింగ్ కార్డును స్కాన్ చేసిన అనంతరం వారు కెమెరాకు ఎదురుగా నిలబడతారు. గతంలో రిజిస్టర్ చేసుకున్న దానితో సరిపోల్చుకున్న అనంతరం ఈ–గేట్ తెరుచుకుంటుంది. దీంతో ప్రయాణికులు నేరుగా టెర్మినల్లోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నందున సీఐఎస్ఎఫ్ సిబ్బంది డిపార్చర్ గేటు వద్ద ప్రయాణ పత్రాలను, ఐడీని పరిశీలిస్తారు. అనంతరం సెక్యూరిటీ చెక్ నిమిత్తం ఒక డెడికేటెడ్ ఫేస్ రికగ్నిషన్ చానల్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనిని గేట్ నం.3 వద్ద ఉన్న ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి కెమెరా ప్రయాణికుల వివరాలను పరిశీలించిన అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది మరోసారి తనిఖీలు నిర్వహిస్తారు. వారి అనుమతి అనంతరం ప్రయాణికులు బోర్డింగ్కు వెళ్లవచ్చు. ప్రత్యేక కౌంటర్లు.. ఫేస్ రికగ్నిషన్ వివరాలు నమోదు చేసుకునేందుకు 1, 3 డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పద్ధతిలో ఒక్కసారి నమోదు చేసుకున్న ప్రయాణికులు ఆ తర్వాత పెద్దగా తనిఖీలు లేకుండానే తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. దీంతో ఈ ప్రక్రియకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఎంతోమంది తమంతట తాముగా వచ్చి వివరాలు, ముఖకవళికలను నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెప్పారు. దశల వారీగా విస్తరణ.. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలకే పరిమితం చేశారు. దశలవారీగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం హ్యాండ్ బ్యాగుతో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
బాంబు బెదిరింపులకు పాల్పడిన యువకుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ ఆకతాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవి నకిలీ బెదిరింపులని గుర్తించిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేవీ విశ్వరత్నం అనే వ్యక్తి ప్రేమలో విఫలమై.. మద్యం మత్తులో ఈ బెదిరింపులకు తెగబడినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన విశ్వరత్నం సికింద్రాబాద్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
11కిలోల బంగారం పట్టివేత
-
నటుడికి ఎయిర్పోర్టులో చేదు అనుభవం
శంషాబాద్ : బాలీవుడు నటుడు రితేష్ దేశ్ముఖ్ ట్విటర్ వేదికగా శంషాబాద్ విమానాశ్రయంలో తాను ఎదుర్కొన్న సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టు లాంజ్లోని లిఫ్ట్లో ప్రయాణిస్తుండగా కరెంటు సరఫరా ఆగిపోయి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఒకే ఒక్కటిగా ఉన్న ఎగ్జిట్( బయటికి) డోర్ కూడా తెరుచుకోలేదు. మరికొద్ది సమయం తర్వాత లిఫ్ట్ యధాతథంగా పనిచేసింది. ఆ సమయంలో ఆ వీడియోను తీసి ట్విట్టర్లో ఈ విషయాన్ని రితేష్ ప్రస్తావించారు. ఒక వేళ ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎగ్జిట్ డోర్ తెరుచుకోకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రితేష్ దేశ్ముఖ్ ట్వీట్లకు ఆర్జీఐఏ అధికారులు స్పందించారు. చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంగా ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్ను బద్దలు కొట్టవచ్చన్నారు. అక్కడే ఓ బాక్స్లో దీనికి సంబంధించిన కీ కూడా ఉంటుందన్నారు. ఎంతో విలువైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు రితేష్ దేశ్ముఖ్కు ధన్యవాదాలు తెలిపారు. So we were at the Hyderabad Airport Lounge - suddenly the power goes off- the way in & out is an elevator that shuts down. The only exit door is locked in a chain (Incase of FIRE🔥 it’s a tragedy waiting to happen)- pic.twitter.com/jO3TQhVlQG — Riteish Deshmukh (@Riteishd) May 27, 2019 -
శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును కుట్టుకొని అందులో బంగారు బిస్కెట్లు తేవడానికి ప్రయత్నించగా, కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. బుధవారం కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్ కన్సీల్మెంట్ రూపంలో, మరొకరు పౌడర్గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు. కాగా, బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్లోని కస్టమ్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్–దుబాయ్ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మరోసారి అరుదైన ఘనత సాధించింది. తాజాగా స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై పురస్కారాలు ప్రకటించింది. అందులో జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్పోర్టుగా పురస్కారం గెలుచుకుంది. మరోవైపు విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను అవార్డు దక్కించుకుంది. ఒకేసారి రెండు విభాగాల్లో గుర్తింపు సాధించి తన ప్రత్యేకత చాటుకుంది. లండన్లో నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్పో కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (జీహెచ్ఐఎల్) ఈ పురస్కారాలను అందుకుంది. -
ఎయిర్పోర్ట్లో ఆర్టీసీ నిర్లక్ష్యం.. మంత్రి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: నగరానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ వెళ్లేందుకు తాను ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. అక్కడ బస్సు అందుబాటులో లేకపోవడం.. వాకబు చేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే ఆయన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎస్సెమ్మెస్స్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే స్పందించి.. సదరు ప్రయాణికుడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా.. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన శంకరయ్య, ఆయన కుమారుడు అరవింద్ ఆదివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో కరీంనగర్ వెళ్లేందుకు ముందుగానే వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా.. ఎంత వేచి చూసినా అది రాలేదు. దీంతో వాకబు చేసేందుకు ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లగా.. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం వారికి విస్మయం కలిగించింది. దీంతో వెంటనే ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆరాతీసి.. బస్సును ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది అలసత్వంపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
పలు విమాన సర్వీసులు రద్దు
సాక్షి, హైదరాబాద్ : భారత్-పాక్ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సందర్భంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్-పాక్ రహదారిని కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోగా పలు విమానాలకు కూడా రద్దు చేసింది. దేశీయంగా.. హైదరాబాద్ నుంచి అమృత్సర్, చండీఘడ్, డెహ్రాడూన్లకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. -
30 మంది తెలుగు విద్యార్థులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగురాష్ట్రాల విద్యార్థులలో 30 మందికి విడుదల లభించింది. ఆదివారం ఆ విద్యార్ధులు అమెరికానుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం మీడియాకు తెలిపారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. నకిలీ వీసాల కేసులో అమాయక విద్యార్ధులు ఇరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు న్యాయ సహాయం చేస్తున్నాయని తెలిపారు. తన ఫేస్ బుక్ ఐడీకి స్టూడెంట్స్ వివరాలు పంపమని సాక్షితో ఆయన కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్ధులు ఇండియాకు చేరకుంటారని చెప్పారు. ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో మొత్తం 130మంది విద్యార్ధులు అరెస్టవ్వగా వారిలో అధికులు భారతీయులు కావటం గమనార్హం. -
ఎయిర్పోర్టులో కార్డన్ సెర్చ్
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి డీసీపీ ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బుకింగ్ లేకుండా ప్రయాణికులను కార్లలో ఎక్కించుకోవడం ఎయిర్పోర్టులో నిషేధం ఉంది. అయితే, కొంత కాలంగా విమానాశ్రయంలో కొందరు డ్రైవర్లు ఈవిధంగా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. గతంలో కార్డన్సెర్చ్ నిర్వహించగా కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో కూడా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు కూడా ముందస్తు బుకింగ్ ఉన్న కార్లలోనే ప్రయాణించడం క్షేమమని డీసీపీ ప్రకాశ్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ అశోక్కుమార్, ఆర్జీఐఏ సీఐ గంగాధర్, సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. -
విమానం టాయిలెట్లో బంగారం పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలకు భయపడిన ఓ ప్రయాణికుడు తాను పట్టుబడుతానేమోననే ఆందోళనతో విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో వదిలివెళ్లాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1,866 గ్రాముల బరువు కలిగిన పదహారు బంగారు బిస్కెట్లు ఇందులో బయటపడ్డాయి. వీటి విలువ రూ.60,94,122 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో బులెట్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారుల సోదాల్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో విమానంలో (6ఈ 7201) విజయవాడ వెలుతున్న సత్యదుర్గ అనే వ్యక్తి వద్ద 9ఎమ్ఎమ్ బులెట్లను సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. -
సాలార్జంగ్ మ్యూజియం వద్ద ప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీలోని సాలార్జంగ్ మ్యూజియం వద్ద బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫార్చూనర్ కారు అతివేగంగా వస్తూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ హైదరాబాద్లోని పాతబస్తీకి చెందినవారే. ఇమ్రాన్ అనే వ్యక్తి విదేశాల నుంచి హైదరాబాద్కు బుధవారం వేకువజామున వచ్చాడు. ఇమ్రాన్ను స్నేహితులు పికప్ చేసుకుని శంషాబాద్ నుంచి పాతబస్తీకి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్(రాజేంద్రనగర్) : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్లైన్స్కి చెందిన ఎఫ్జడ్436 విమానంలో దుబాయ్ బయలుదేరడానికి వచ్చిన వ్యక్తిని ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేయగా.. హ్యాండ్ బ్యాగ్లో విదేశీ కరెన్సీ దొరికింది. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఒమన్, సౌదీ దేశాల కరెన్సీ ఉంది. భారత కరెన్సీలో వాటి విలువ రూ.39,86,195 ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడు ఇదే తరహాలో రెండోసారి పట్టుబడడం గమనార్హం. ఈ నోట్లను అనధికార డీలర్ నుంచి తీసుకుని విదేశాలకు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. -
శంషాబాద్ ఎయిర్పోర్టు@బంగారం స్మగ్లింగ్
శంషాబాద్: దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠా డొంక కదిలింది. ఈ నెల 4న ఈకే 528 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి సమాచారంతో ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. అదే విమానంలో వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానంతో అధికారులు ఆమె లగేజీ తనిఖీ చేశారు. లగేజీలో బొమ్మలు, వ్యక్తిగత వస్తువులు మాత్రమే ఉండటంతో మరింత లోతుగా తనిఖీలు చేపట్టారు. బొమ్మలు ఉన్న బాక్స్ను స్కానింగ్ చేయగా కార్బన్ కాగితాల వెనక కార్డ్బోర్డుకు మధ్య బంగారాన్ని రేకులుగా మార్చి అమర్చిన విషయాన్ని గుర్తించారు. సుమారు 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు ప్రయాణ చార్జీలతో పాటు ఉపాధి కల్పిస్తామని చెప్పడంతోనే బంగారాన్ని తీసుకువచ్చానని తెలిపింది. దుబాయ్లో బంగారం అప్పగించిన వ్యక్తి తన ఫొటో తీసుకుని హైదరాబాద్కు సమాచారం అందించినట్లు మహిళ వివరించింది. దీంతో కస్టమ్స్ అధికారులు శంషాబాద్ జోన్ పోలీసులతో కలసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్లను ఎయిర్పోర్టులో 2 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఏడుగురు.. తొలిసారి ప్రయాణించే మహిళలతో పాటు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా ఈ ముఠా వలలో వేసుకుని వారి ద్వారా బంగారాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులు శంషాబాద్ ఎయి ర్పోర్టులోనే ఉంటున్నారు. ప్రయాణికుల ద్వారా వచ్చిన పార్సిళ్లను సమీపంలోని హోటళ్లకు తీసుకెళ్లి అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు కేరళ తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు.. మరో ఇద్దరు వ్యక్తులు నేరుగా హైదరాబాద్ నుంచే ముంబైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురితో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. వారం రోజుల్లో 5 పార్సిళ్లను ముంబైకి తరలించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. సిబ్బంది పాత్ర సైతం.. ఈ నెల మొదటి వారంలో మరో 2 బంగారం అక్రమ రవాణా ఘటనలు జరిగినట్లు కస్టమ్స్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈకే 528 విమానంలోని చెత్తను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వాటిని స్కానింగ్ చేశారు. అందులో టేప్లతో చుట్టి ఉన్న ఓ ప్యాక్లో 615 గ్రాముల బరువున్న 5 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది ఒకరు పార్సిళ్లను ఏరో బ్రిడ్జి సమీపంలో పడేసి అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎయిర్ ఇండియా అధికారి అతడిని ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్కాన్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున ఇండిగో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. అతడు పడేసిన పార్సిళ్లను చూడగా 1,632 గ్రాముల బంగారం బయటపడింది. -
మరోసారి ఇండిగోకు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఇండిగో విమానానికి మరోసారి ప్రమాదం పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 15 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండిగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు సైతం పేలిపోయాయి. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణానికి భరోసా లేదంటూ వాపోతున్నారు. -
విమానం సీటు కింద బంగారం
శంషాబాద్: గల్ఫ్ దేశాల నుంచి స్మగ్లర్ల ద్వారా అక్రమంగా బంగారాన్ని దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని సీటు కింద అతడు దాచిన 1.22 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎయిర్ ఇండియా 952 విమా నంలో దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడిని అంతర్జాతీయ అరైవల్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద అక్రమ రవాణా వస్తువులు ఏమీ లభించలేదు. కానీ, అతడి కదలికలపై సందేహంతో పాస్పోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సదరు ప్రయాణికుడు గత కొద్ది రోజుల్లోనే గల్ఫ్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. తాను ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ ప్యాకెట్లో 1.22 కేజీల బంగారాన్ని దాచినట్లు తెలిపాడు. అప్రమత్తమైన అధికారులు విమానంలోకి వెళ్లి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈ విమానం శంషాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు దేశీయ సర్వీస్గా మారి వైజాగ్కు బయలుదేరుతుంది. దీంతో సీటు కింద దాచిన బంగారాన్ని హైదరాబాద్కు చెందిన మరో ప్రయాణికుడు వైజాగ్కు తీసుకువెళ్లి అక్కడ నుంచి దానిని ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్లు నిందితుడు అధికారులకు వివరించాడు. దుబాయ్లోని ఓ స్మగ్లర్ నుంచి రూ.50 వేలకు బంగారం అక్రమ రవాణా చేసేందుకు ఒప్పుకున్నట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. -
మన ఎయిర్పోర్ట్.. మరింత భారీగా!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో భాగ్యనగరానికి కీర్తి కిరీటంగా భాసిల్లుతున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత సమున్నతంగా మారబోతోంది. విమానాశ్రయం ప్రారంభమై పదేళ్లయిన సందర్భంగా.. ప్రయాణికుల సామర్థ్యాన్ని భారీగా పెంచి, మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం కోసం యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టింది. ఏకంగా సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణించగలిగేలా సామర్థ్యాన్ని సమకూర్చనుంది. ఈ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. విస్తరణ పనులతో పాటు ఎయిర్పోర్టు సిటీ, 12 వేల మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగలిగే కన్వెన్షన్, ఎగ్జిబిషన్ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. అయితే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేసీఆర్ ఏమీ ప్రసంగించకుండా వెంటనే వెళ్లిపోయారు. దీంతో పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కీలకోపన్యాసం చేశారు. విశ్వనగర స్థాయికి తగినట్టుగా.. విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్లో విమానాల ట్రాఫిక్ బాగా పెరుగుతోందని.. దానికి తగినట్టుగా శంషాబాద్ విమానాశ్రయ విస్తరణను చేపట్టారని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. విశ్వనగర స్థాయిలో విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జీఎంఆర్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రస్తుతం ఏటా కోటిన్నర మంది వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉండగా.. దానిని నాలుగు కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరిస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఫార్మాసిటీ, ఏరోస్పేస్ పార్కులతో పాటు ఐటీ పరిశ్రమల విస్తరణ వేగంగా జరుగుతోందని... దీంతో ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరగనుందని చెప్పారు. భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం పది కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విమానయాన ఇంధనంపై రాష్ట్రంలో ఉన్న 16 శాతం వ్యాట్ను ఒక శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. రూ.4,650 కోట్లతో రెండేళ్లలో మెట్రో రైలును విమానాశ్రయానికి అనుసంధానిస్తా మన్నారు. వైమానిక నగరంగా శంషాబాద్ విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ను నిర్మిస్తామని చెప్పారు. తెలుగువాడైన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆమోఘమని ప్రశంసించారు. సామాజిక బాధ్యతలో భాగంగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ చేపడుతున్న పనులను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు.. బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్పోర్టు సిటీ, కన్వెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత నాలుగేళ్లలో శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధి రేటు 21% పెరిగింద న్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశం సించారు. ఇక కార్యక్రమంలో తొలుత జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా అందించే పలు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎయిర్పోర్టుకు సంబంధించిన ‘డికేడ్ ఆఫ్ ఎక్స్లెన్స్’సార్మక స్టాంపు కవర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్నయన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. విమానాశ్రయ పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుడి వివరాలు తెలియరాలేదు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్
సాక్షి, శంషాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), నిఘావర్గాల ఆదేశాల మేరకు సందర్శకుల ప్రవేశ పాసులపై ఆంక్షలు విధించారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశీయ ప్రయాణికులు 2 గంటలు, అంతర్జాతీయ ప్రయాణికులు 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకొని తనిఖీలు, ఇతర భద్రతాపరమైన అంశాల్లో సహకరించాలని భద్రతావర్గాలు సూచించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంతోపాటు పరిసరాల్లో నిఘా, భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్, హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు విమానాశ్రయ ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణికులు, వాహనాల తనిఖీలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. -
హైదరాబాద్ లో అతిపెద్ద కార్గో విమానం
-
రాజ్యసభలో గందరగోళం!
న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు వి.హనుమంతరావు, జేడీ శీలం, పాల్వాయి గోవర్ధన రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సభను మొదట అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది. ఈ నిరసనల మధ్యే బీమా బిల్లు సభలో చర్చకు వచ్చింది. బీమా బిల్లుపై నివేదిక సమర్పించడానికి సెలెక్ట్ కమిటీకి వచ్చే నెల 12వరకు గడువు పొడిగించారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మళ్లీ వాయిదావేశారు. ** -
విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: కోల్కత-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అశోక్ చటర్జీ అనే ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని కిందకు దించారు. కోల్కత నుంచి బెంగళూరు వెళుతున్న ఈ విమానం కిందకు దిగిన వెంటనే అశోక్ చటర్జీని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించారు. * -
బంగారం బాత్రూంలో పడేశాడు
హైదరాబాద్ : అధికారుల నిఘాను పసిగట్టిన ఓ అక్రమార్కుడు మూడు కిలోల బంగారాన్ని బాత్రూంలో (టాయిలెట్) పడేశాడు. అతడి నుంచి అధికారులు మరో రెండు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనంప ప్రకారం... హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35) ఒమన్ ఎయిర్లైన్స్ విమానంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు బంగారం అక్రమంగా తీసుకొస్తున్నాడని డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు ముందస్తు సమాచారంతో అప్రమత్తం అయ్యారు. అధికారుల నిఘా పసిగట్టిన సదరు వ్యక్తి తన లగేజీలో ఉన్న మూడు కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టులోని బాత్రూంలోకి చొరబడి కుండీలో పడేశాడు. అధికారులు వెంటన అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు.