smart tvs
-
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్లోని మోడరన్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.దుబాయ్లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్లో కూడా విస్తరించింది.కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్మార్క్ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
5వ తరగతి వరకు స్మార్ట్టీవీలతో పాఠాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం వారికి డిజిటల్ బోధనను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)లను అమర్చింది. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా.. ఇక ఇప్పుడు నాడు–నేడు కింద రెండో దశ స్కూళ్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ఏర్పాటు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు డిజిటలైజేషన్లో భాగంగా తరగతి గదుల్లో 28,014 స్మార్ట్ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 65 ఇంచులు గల స్మార్ట్ టీవీల కొనుగోలుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్స్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించాలని విద్యా శాఖ నిర్ణయించింది. వీటి కొనుగోలుకు రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అవుతుండటంతో నిబంధనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ టెండర్ డాక్యుమెంట్ను జ్యుడిíÙయల్ ప్రివ్యూకు పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు సమర్పించడానికి గడువు విధించింది. అనంతరం జ్యుడిషియల్ ప్రివ్యూ సూచనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ల కోసం టెండర్లను ఆహ్వానించనుంది. లోపాలుంటే 24 గంటల్లోపే పరిష్కారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి వాటి ద్వారా బోధించనున్నారు. డిసెంబర్ నాటికల్లా వీటి ఏర్పాటు పూర్తి చేయనున్నారు. స్కూళ్లకు స్మార్ట్ టీవీలను తీసుకువచ్చి అమర్చిన నాటి నుంచి ఐదేళ్ల వారంటీ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన తరువాత నెల రోజుల్లోనే వాటి పనితీరులో లోపాలున్నా, సంతృప్తికరంగా పనిచేయకపోయినా వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. అలాగే వాటిలో ఏమైనా లోపాలుంటే.. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ కొత్తది అమర్చాలంటే మూడు రోజుల్లోపే అమర్చాలనే నిబంధన విధించింది. అదేవిధంగా సేవల కోసం కాల్ సెంటర్ నంబర్ను ఏర్పాటు చేయనున్నారు. -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్టాప్ డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్ రూ.32,999కు ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్టాప్లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
స్మార్ట్గా మారిపోతున్నారు.. పాత వాటి స్థానంలో కొత్త ఉపకరణాలు
సాక్షి, అమరావతి: రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీతో స్మార్ట్ వస్తువుల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, వాచీలే కాదు గృహోపకరణాలు కూడా స్మార్ట్గా మారిపోతున్నాయి. ఈ డివైస్లు ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి. మార్కెట్లో స్మార్ట్ పరికరాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాన్ని అందించే ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పాత టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు స్థానంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక దాని ఆధారిత స్మార్ట్ పరికరాలకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. సౌకర్యంతో పాటు సులభంగా, తక్కువ సమయంలో పనులను ముగించడం, మరింత ఆనందంగా జీవించడానికి వీలుగా స్మార్ట్ పరికరాలు తోడ్పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్ పరికరాల వినియోగంపై టెచార్క్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా కనెక్టెడ్ కన్సూ్యమర్ రిపోర్ట్’ పలు అంశాలను వెల్లడించింది. 2023లో స్మార్ట్ పరికరాల కొనుగోలు మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే 5జీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ పరికరాల్లో వినియోగదారులు ఆశిస్తున్న సామర్థ్యం ఉండటం లేదని, ఈ పరికరాల్లో సామర్థ్యం మరింత ఉండాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని టెచార్క్ వివరించింది. దాంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాల వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. సామాన్యుల్లో కూడా ఈ స్మార్ట్ పరికరాల కోసం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. కొనుగోలుదారుల్లో 32 శాతానికి పైగా స్మార్ట్ పరికరాలవైపు వెళ్తున్నారు. అయితే ఈ స్మార్ట్ పరికరాల వినియోగంపై, బ్రాండ్లపై నమ్మకం వంటి అంశాల్లో ఇంకా చాలా మందిలో అవగాహన ఉండటం లేదని సర్వే పేర్కొంది. జీవన ప్రమాణాలను మారుస్తున్న వాటిలో స్మార్ట్ పరికరాల పాత్ర ఇలా... కంఫర్ట్ కన్వీనియన్స్ పరికరాలు: 69% సోషల్ రికగ్నిషన్– ప్రెస్టీజ్, స్టయిల్: 53% కనెక్టివిటీ ఆటోమేషన్: 53% టైమ్ సేవింగ్ ప్రొడక్ట్స్: 46% ఎనర్జీ మేనేజ్మెంటు: 19% సేఫ్టీ, సెక్యూరిటీ: 17% ఏ స్మార్ట్ వస్తువు ఎంత శాతం మంది వాడుతున్నారంటే.. వాచ్, ఫిట్నెస్ బ్యాండ్ 72 టీవీ 28 లైట్లు 82 ఏసీలు14 కెమెరాలు 48 వాషింగ్ మెషీన్ 12 -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్తో వచ్చేవి. భారత్లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్ల సపోర్ట్తో పాటు నెట్ఫ్లిక్స్, డిస్నీ+ హాట్స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్లు, రెండు యూఎస్బీ పోర్ట్లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్ఫ్లిక్స్ కోసం హాట్కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
10వేలకే స్మార్ట్టీవీ, రెడ్మీ స్మార్ట్టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్, డోంట్ మిస్!
హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు. -
స్మార్ట్ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్మార్ట్ టీవీల షిప్మెంట్లు (విక్రయాలు/రవాణా) 38 శాతం పెరిగాయి. పండుగల సీజన్ కావడం, కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్కౌంట్ ఆఫర్లు ఈ వృద్ధికి కలిసొచ్చినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా 40 శాతంగా ఉంటే, చైనా బ్రాండ్ల వాటా 38 శాతంగా ఉంది. ఇక స్థానిక బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా రెట్టింపై 22 శాతానికి చేరుకుంది. మొత్తం షిప్మెంట్లలో 32 నుంచి 42 అంగుళాల స్క్రీన్ టీవీల వాటా సగం మేర ఉంది. ఎల్ఈడీ డిస్ప్లేలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్లు సైతం క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు క్యూఎల్ఈడీ స్క్రీన్లతో విడుదలకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్క్రీన్ తర్వాత కస్టమర్లు ఆడియోకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డాల్బీ ఆడియో ఫీచర్తో విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ టీవీల విక్రయాలు మొత్తం టీవీల్లో 93 శాతానికి చేరాయి. రూ.20వేల లోపు బడ్జెట్లో టీవీల విడుదలతో ఈ వాటా మరింత పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్ల ద్వారా విక్రయాలు 35 శాతం పెరిగాయి. అన్ని ఈ కామర్స్ సంస్థలు పండుగల సీజన్లో ఆఫర్లను ఇవ్వడం ఇందుకు దోహదం చేసినట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. మొదటి స్థానంలో షావోమీ షావోమీ స్మార్ట్ టీవీ మార్కెట్లో 11 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్ సంగ్ 10 శాతం, ఎల్జీ 9 శాతం వాటాతో ఉన్నాయి. వన్ ప్లస్ వార్షికంగా చూస్తే 89 శాతం వృద్ధితో తన మార్కెట్ వాటాను 8.5 శాతానికి పెంచుకుంది. దేశీ బ్రాండ్ వూ వాటా సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. ఎంతో పోటీ ఉన్న స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరిన్ని భారత బ్రాండ్లు ప్రవేశిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. సెప్టెంబర్ క్వార్టర్లో వన్ ప్లస్, వూ, టీసీఎల్ బ్రాండ్లు స్మార్ట్ టీవీ మార్కె ట్లో వేగవంతమైన వృద్ధిని చూపించాయి. -
ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్కు సంబంధించి కొత్త డేట్స్ను ప్రకటించింది. తొలి దశ ఆఫర్లు అక్టోబర్ 16తో ముగియడంతో వినియోగ దారుల కోసం తాజా తేదీలను వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లలో దివాలీ జోష్ నింపింది. ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 19న తిరిగి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. తాజా సెకండ్ సేల్లో కూడా వివిధ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తదితరాలపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ అక్టోబర్ 18 అర్ధరాత్రి సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతోపాటు, ఫ్లిప్కార్ట్ 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇంకా పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై ఫ్లిప్కార్ట్ 10 శాతం తక్షణ క్యాష్బ్యాక్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్, రియల్మీ, పోకో, ఒప్పో, వివో, షావోమీ, మోటరోలా, గూగుల్, ఇన్ఫినిక్స్, మైక్రోమ్యాక్స్, లావా వంటిపై తగ్గింపు లభ్యం. ఇంకా గేమింగ్ ల్యాప్టాప్లు , పెన్ డ్రైవ్లు మరియు హార్డ్ డ్రైవ్లు వంటి డేటా స్టోరేజ్ పరికరాలపై కూడా తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్ బ్యాక్ కవర్లు, కేసులు, స్క్రీన్ గార్డ్లు వంటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 4K అల్ట్రా HD స్మార్ట్టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు సహా,టీవీలు, ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. -
ఏంటీ! రూ.75వేల టీవీని రూ.25వేలకే సొంతం చేసుకోవచ్చా!!
Flipkart Big Bachat Dhamaal Sale: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.75వేల విలువైన టీవీని రూ.25లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రిబ్రవరి 3నుంచి ఫిబ్రవరి 5వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో పలు టీవీలపై అదిరిపోయే ఆఫర్లకే టీవీలను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ సేల్ లో 'వీయూ' కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే అందుబాటులోకి తెచ్చింది. 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.75 వేలు ఉండగా.. ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్లో 49శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ టీవీ ధర రూ.37,999 ఉండగా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్తో మరో రూ.1,900 తగ్గుతుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099గా ఉంటుంది. అంతేకాదు ఈ హెచ్డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా కొనుగోలు దారులు ఈ స్మార్ట్ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చు. వీయూ స్మార్ట్ టీవీ ఫీచర్లు డిస్ ప్లే - ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రిజల్యూషన్ - 3,840 x 2,160 పిక్సెల్స్ అప్ గ్రేడ్ రేట్ - 60 హెచ్జెడ్ సౌండ్ స్పీకర్స్ - 30 డబ్ల్యూ సౌండ్ అవుట్పుట్తో రెండు స్పీకర్లు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. -
ఫ్లిప్కార్ట్లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!
ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితమే 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సేల్తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ "బిగ్ బచత్ ధమాల్" సేల్ను ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిరహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్లో భాగంగా ఫ్యాషన్ దుస్తులు, టీవీలు, సౌందర్య ఉత్పత్తులు, హోమ్, కిచెన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్లో ప్రత్యేకంగా టీవీల మీద అందిస్తున్న ఆఫర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► ఎంఐ 4ఏ ప్రో: ఎంఐ 4ఏ ప్రో 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవి రూ.16,999 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టివి అసలు ధర రూ.19,999, అంటే మీరు ఈ స్మార్ట్ టివి మీద 15 శాతం తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ► సోనీ బ్రావియా: సోనీ బ్రావియా డబ్ల్యూ820 108 సెం.మీ(43 అంగుళాలు) టీవి అసలు ధర కంటే రూ.6 వేలు తక్కువ(రూ.28,999) ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.34,900గా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు. ► వన్ ప్లస్ వై సిరీస్: వన్ ప్లస్ వై సిరీస్ 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.27,999 నుంచి రూ.22,499కు తగ్గింది. ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలపై మీరు అదనంగా రూ.2000 తగ్గింపు పొందవచ్చు. ► వు ప్రీమియం: వు ప్రీమియం 139 సెం.మీ(55 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.75,000 నుంచి రూ.42,990కు తగ్గింది. ఈ స్మార్ట్ టివి మీద మీకు సుమారు 42 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎల్ జీ 108 సెం.మీ స్మార్ట్ టీవి, రియల్ మీ 108 సెం.మీ స్మార్ట్ టీవి మీద మంచి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్ పొజిషన్లోకి దూసుకొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్ చార్జీల భారం, కాంపోనేట్స్ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లలో (చిప్సెట్లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. కాగా గ్లోబల్ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా. చదవండి: Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్! -
త్వరపడండి: శాంసంగ్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో తన వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తులపై కొత్త శ్రేణి ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 20శాతం మేర క్యాష్బ్యాక్ను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ టీవీలు: ఎంపిక చేసిన శాంసంగ్ చేసిన టీవీలకు కంపెనీ నుంచి ప్రీమియం సౌండ్బార్లను ఉచితంగా అందిస్తోంది. ఆఫర్ వ్యవధిలో 75-అంగుళాల అంతకంటే ఎక్కువ QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు 99,990 రూపాయల విలువైన సౌండ్బార్ Q900T లేదా QLED TV మోడల్ను బట్టి 48,990 రూపాయల విలువైన Q800T సౌండ్బార్ లభిస్తుంది. వినియోగదారులు ఈ టీవీలను 36 నెలల ఈఎంఐ లభిస్తోంది.అంతేకాకుండా కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్బ్యాక్ లభించనుంది. శాంసంగ్ సౌండ్ డివైజ్స్: ఎంపిక చేయబడిన శాంసంగ్ సౌండ్ బార్స్పై 10శాతం వరుకు అదనపు క్యాష్బ్యాక్ను ఇవ్వనుంది. శాంసంగ్ ఫ్రిజ్లు: సైడ్ బై సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రోస్ట్ ఫ్రీ, డైరక్ట్ కూల్ లాంటి శాంసంగ్ ఫ్రీజ్ల మోడళ్లను ఈఎంఐతో కొనుగోలు చేస్తే సుమారు 15శాతం వరకు క్యాష్బ్యాక్ కాకుండా డిజిటల్ కంప్రెసర్పై పది సంవత్సరాల వరకు వారంటీని ఇవ్వనుంది. మైక్రోవేవ్ ఓవెన్స్: శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్స్ మ్యాగ్నెట్రాన్ పై 5 సంవత్సరాల వారంటీతో పాటు పది శాతం వరకు క్యాష్బ్యాక్, సెరమిక్ ఎనామిల్ కావిటీ మెడల్పై పది సంవత్సరాల వారంటీనీ ఇవ్వనుంది. చదవండి: మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్! -
స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!
దేశంలో మరోసారి టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4 శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
ఆండ్రాయిడ్ టీవీలో ఆపిల్ సినిమాలు
వెబ్డెస్క్ : ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వినియోగదారులకు శుభవార్త ! ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీదే ఇకపై ఆపిల్ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై నడిచే టీవీల్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందించేందుకు ఆపిల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 8 ఆపై వెర్షన్లతో నడుస్తున్న స్మార్ట్ టీవీలో ఆపిల్ టీవీ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్లే స్టోర్లో ఆపిల్ టీవీ యాప్ డౌన్లోడ్ ట్రెండ్ మొదలైంది. పరిధి పెంచుతోంది టెక్నాలజీలో దిగ్గజ సంస్థల్లో ఒకటి యాపిల్. కొత్తదనం, నాణ్యత, బ్రాండ్ వాల్యూ అనే పదాలకు పర్యాయ పదంగా ఆపిల్ నిలిచిపోయింది. అయితే ఆపిల్ సంస్థ అందించే అన్ని సేవలు, అప్లికేషన్లు కేవలం ఐఓఎస్ ప్లాట్ఫారమ్పై పని చేసే మాక్పాడ్, ఐపాడ్, ఐఫోన్ తదితర ఆపిల్ డివైజ్లలోనే లభించేవి. దశబ్ధకాలం పాటు తన అప్లికేషన్లను ఇతర టెక్ ప్లాట్ఫారమ్లకు అందివ్వలేదు యాపిల్. అయితే గత కొంతకాలంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఆపిల్. అందులో భాగంగానే ఐఓఎస్కి సంబంధించిన ఆప్స్టోర్కి ఆవల అమెజాన్ ఫైర్ స్టిక్, ఎల్జీ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్లోనూ స్మార్ట్ఫోన్ మార్కెట్ విభాగంలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ల మధ్యే ప్రధాన పోటీ. అయితే ఆ పోటీని పక్కన పెట్టి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్ను అందించేందుకు ఆపిల్ అంగీకరించింది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్టీవీలకే పరిమితం చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఆపిల్ టీవీని అందివ్వడం లేదు. విస్తరించేందుకే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే టీవీలనే ఎక్కువ సంస్థలు తయారు చేస్తున్నాయి. స్మార్ట్టీవీ మార్కెట్లో వీటిదే సింహభాగం. ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆపిల్ టీవీకి విస్త్రృతమైన మార్కెట్ కల్పించేందుకు ఆండ్రాయిడ్ ఓఎస్ బెటర్ ఛాయిస్గా ఆపిల్ భావించింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆపిల్ టీవీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపిల్ టీవీలో ఉన్న కంటెంట్కి చందాదారులుగా మారుతున్నారు. -
ఇక టెలివిజనూ.. వైర్లెస్
ఇప్పటికే స్మార్ట్ఫోన్ల చార్జింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్లెస్ టెక్నాలజీ... ఇప్పుడు టెలివిజన్లకు విస్తరించనుంది. రష్యాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేబుల్కు బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఇది పనిచేయనుంది. రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీని సీఈఎస్ 2021లో ప్రదర్శించారు. కేబుల్స్కు బదులు వైఫై పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని అందుకునే రిసెప్షన్ సిస్టమ్ను ఇందులో ఏర్పాటు చేశారు. (చదవండి: 5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!) విద్యుత్తు సాకెట్కు దూరంగా టీవీని ఏర్పాటు చేసుకోవడం అసాధ్యమైన ఈ నేపథ్యంలో రెజొనెన్స్ ఈ వైర్లెస్ టీవీని తీసుకొచ్చింది. వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును అందుకునే రిసీవర్. కాయిల్ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్మీటర్ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని కంపెనీ వివరించింది. కనీసం మీటర్ దూరం వరకూ విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. రిసీవర్ కాయిల్ను టెలివిజన్ఫ్రేమ్లోకే చేరవచ్చని, ట్రాన్స్మీటర్ను అవసరాన్ని బట్టి టెలివిజన్ అడుగు భాగంలో కానీ.. గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఏడాది క్రితం సామ్సంగ్ కూడా ఇలాంటి వైర్లెస్ టీవీని తెచ్చే ప్రయత్నం చేసినా... తగిన టెక్నాలజీ లేదని తన ప్రయత్నాలను విరమించుకుంది. రెజొనెన్స్ తన టెక్నాలజీపై అమెరికాతో పాటు ఇండియా, యూరోపియన్ యూనియన్, కెనడా, దక్షిణ కొరియాల్లోనూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ టెక్నాలజీని టెలివిజన్లకు మాత్రమే కాకుండా... ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ ఉపకరణాలతోపాటు విద్యుత్తు వాహనాలకూ వాడొచ్చని కంపెనీ చెబుతోంది. -
అమెజాన్బేసిక్స్ నుంచి తొలిసారి స్మార్ట్ టీవీలు
ముంబై, సాక్షి: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్బేసిక్స్ తొలిసారి దేశీయంగా స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 50-55 అంగుళాల పరిమాణంలో వీటిని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. రూ. 29,999 నుంచి ధరలు ప్రారంభంకానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇవి ఫైర్టీవీ ఎడిషన్ టీవీలుకాగా.. 4కే హెచ్డీఆర్ లెడ్ డిస్ప్లేతో విడుదల చేసినట్లు తెలియజేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫార్మాట్లలో హెచ్డీఆర్, ఆడియో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఇవి అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 4కే స్మార్ట్ టీవీ విభాగంలో ప్రాథమిక(ఎంట్రీ లెవెల్) విభాగంలోని షియోమీ, టీసీఎల్, వీయూ తదితర కంపెనీలతో ఇవి పోటీ పడనున్నట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల) ఇతర ఫీచర్స్ అమెజాన్బేసిక్స్ 50- 55 అంగుళాల పరిమాణంలో రెండు మోడళ్లను విడుదల చేసింది. ఇవి అల్ట్రాహెచ్డీ(3840+2160 పిక్సెల్) లెడ్ తెరలను కలిగి ఉంటాయి. డాల్బీ విజన్ ఫార్మాట్ వరకూ హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుంది. 20 డబ్ల్యూ రేటెడ్ స్పీకర్స్ ద్వారా డాల్బీ ఆట్మోస్ను కల్పించింది. క్వాడ్కోర్ ఆమ్లాజిక్ ప్రాసెసర్ కలిగిన వీటికి రెండు యూఎస్బీ, మూడు హెచ్డీఎంఐ పోర్టులను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. అమెజాన్ ఎకోసిస్టమ్కు సంబంధం లేకుండా సొంత సెట్టాప్ బాక్సును సైతం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఫైర్ టీవీ స్టిక్ తరహాలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, యూట్యూబ్ తదితర సర్వీసులను యాప్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా మూవీస్, మ్యూజిక్ తదితరాలను సెట్ చేసుకోవచ్చు. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్) -
ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో టెక్లైఫ్- 5జీ లీడర్ విజన్తో దేశీయంగా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు రియల్మీ తాజాగా పేర్కొంది. ఇటీవల కాలంలో కంపెనీ స్మార్ట్ఫోన్లతోపాటు.. పూర్తిస్థాయి టెక్నాలజీ బ్రాండుగా ఆవిర్భవిస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలియజేశారు. విభిన్న స్మార్ట్ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలు, ఆడియో, వేరబుల్ ప్రొడక్టులను మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పారు. తద్వారా రియల్మీ టెక్లైఫ్ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా 2021లో కంపెనీ నుంచి మరిన్ని కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. చదవండి: (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) X7 సిరీస్ ఫోన్లు రియల్మీ X7 బ్రాండుతో 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మాధవ్ వెల్లడించారు. వివిధ ధరలలో వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2021లో టెక్ లైఫ్స్టైల్ బ్రాండుగా వృద్ధి చేందే ప్రణాళకలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలువురికి దేశీయంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేశారు. రియల్మీ మాతృ సంస్థ చైనాకు చెందిన బీబీకే గ్రూప్కాగా.. 2020లో దేశీయంగా 5జీ స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించిన విషయం విదితమే. గతేడాది 5 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలను అందుకోగా.. మే నెలలో స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెట్టినట్లు మాధవ్ వెల్లడించారు. ఈ బాటలో స్మార్ట్వాచీల విక్రయాలకూ తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) -
బిగ్ బిలియన్ డేస్ : రూ. 6 వేలకే టీవీ
సాక్షి, ముంబై : యూరప్కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తక్కువ ధరలకే స్మార్టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అక్టోబర్ 16 - 21 వరకు ఫ్లిప్కార్ట్లో జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం హర్ బాత్ బాధి పేరిట మార్కెటింగ్ నిర్వహిస్తోంది. ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభం. (విద్యార్థులకు ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్) ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో టీవీ ఆఫర్లు ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు 32 పాథ్ 0011 ధర - 10,999 రూపాయలు 32 పాథ్ 0011బీఎల్ ధర -11,499 రూపాయలు 40 పాథ్ 7777 ధర - 15,999 రూపాయలు 43 పాథ్ 0009ధర - 18,999 రూపాయలు 43 పాథ్ 4545 ధర -22,499 రూపాయలు 50 పాథ్1010 ధర -24,499 రూపాయలు 55 పాథ్ 5050 ధర - 28,999 రూపాయలు ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్ 43 ఆథ్రో 2000 - 22,499 రూపాయలు 50 ఆథ్రో 1212 - 27,499 రూపాయలు 55 ఆథ్రో 0101 - 30,999 రూపాయలు 65 ఆథ్రో 2020 - 45,999 రూపాయలు 75ఆథ్రో 2121 - 94,499 రూపాయలు సాధ్యమైనంతవరకు తమ వినియోగదారుడిని ఆనందపరిచేందుకే చూస్తున్నామనీ, ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు) -
నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు
సాక్షి, ముంబై: బిగ్ బిలియన్ షాపింగ్ డేస్ సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నోకియా స్మార్ట్ టీవీలపై ఆఫర్లు అందిస్తోంది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో నోకియాకొత్తగా ఆరు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తోంది. 32, 43, 50, 55 65 అంగుళాల స్మార్ట్ టీవీలను సరసమైన ధరలలో విక్రయిస్తుంది. అక్టోబర్ 16నుండి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు నోకియా స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేసినట్టు నోకియా ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీల ధరలు 32 అంగుళాల టీవీ రూ .12,999 హెచ్డీ రెడీ 43 అంగుళాల టీవీ ధర రూ .22,999 ఫుల్ హెచ్డీ వేరియంట్ ధర రూ. 28,999 50 అంగుళాల టీవీ ధర రూ. 33,999 55 అంగుళాల ధర 39,999 రూపాయలు 65 అంగుళాల టీవీ ధర 59,999 రూపాయలు నోకియా బ్రాండ్ ఫ్లిప్కార్ట్ ద్వారా పూర్తిగా కొత్త స్మార్ట్ టీవీ శ్రేణికి విస్తరించడం తమ విజయానికి నిదర్శమని నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా తెలిపారు. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసినప్పటినుంచి తమ టీవీలకు స్పందన బావుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. పండుగ సీజన్ షాపింగ్ను ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు అందుబాటులో ధరల్లో నోకియా సహకారంతో వైవిధ్యమైన స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ అయ్యర్ అన్నారు. నోకియా స్మార్ట్ టీవీలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా స్పాటిఫై ఆఫర్లతో కలిసి లభిస్తాయి. ఈ నోకియా టీవీలు ఒన్కియో సౌండ్ ద్వారా ట్యూన్, సౌండ్బార్తో అమర్చబడి 6డీ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. ఆరు కొత్త నోకియా టీవీలు ఆండ్రాయిడ్ 9.0, క్వాడ్-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 2020 క్రిస్టల్ 4కె యూహెచ్డీ టీవీ, అన్బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీ లను విడుదల చేసింది. క్రిస్టల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్ప్లే సైజుల్లో అందుబాటులో ఉండగా. అన్బాక్స్ మ్యాజిక్ 3.0టీవీలు 32, 43 ఇంచ్ డిస్ప్లే సైజుల్లో లభిస్తున్నాయి. క్రిస్టల్ 4కె యూహెచ్డీ టీవీల్లో 4కె రిజల్యూషన్ను అందిస్తున్నారు. క్రిస్టల్ 4కె ప్రాసెసర్ అమర్చింది. దీంతో క్రిస్టల్ క్లియర్గా దృశ్యాలు కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. శాంసంగ్కు చెందిన బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్తోపాటు అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ను జోడించింది. అలాగే ఈ టీవీలను పర్సనల్ కంప్యూటర్గా కూడా వాడువకోచ్చు. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, ఈరోస్ నౌ, సోనీ లివ్, వూట్ తదితర యాప్స్ను ఈ టీవీలలో ఇన్బిల్ట్గా అందిస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేసేవారికి శాంసంగ్ ఉచితంగా ఆఫీస్ 365 సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. అలాగే 5జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ను కూడా అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో టీవీలను కొంటే 10 శాతం క్యాష్బ్యాక్ కూడా లభ్యం. ధరలు అన్బాక్స్ మ్యాజిక్ 3.0 32 ఇంచుల టీవీ ధర రూ.20,900గా ఉంది. 43 ఇంచుల టీవీ ధర రూ.41,900గా ఉంది. క్రిస్టల్ 4కె యూహెచ్డీ సిరీస్ 43 ఇంచుల టీవీ ధర 44,400 రూపాయలు 50 ఇంచుల టీవీ ధర 60,900 రూపాయలు 55 ఇంచుల టీవీ ధర 67,900 రూపాయలు 65 ఇంచుల టీవీ ధర 1,32,900 రూపాయలు 75 ఇంచుల టీవీ ధర 2,37,900 రూపాయలు -
వన్ప్లస్ కొత్త టీవీలు ఎంత సన్నగా ఉంటాయంటే..
సాక్షి, న్యూఢిల్లీ: వన్ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా వన్ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కి పెట్టింది పేరు. మరి ఇక వన్ప్లస్ టీవీలు ఇంకెంత సన్నగా ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు సీఈఓ వెల్లడించారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రాబోతున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఫ్లాగ్షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లు జూలై 2 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్ ఫీచర్, కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని తెలిపారు. సినిమాటిక్ డిస్ప్లే, డాల్బీ విజన్, నెట్ఫ్లిక్స్ యాప్ లాంటి ఫీచర్లను హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్ చేశారు. వన్ప్లస్ స్మార్ట్ టీవీ ధర, లభ్యత వన్ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర 20 వేల రూపాయలు. ప్రస్తుతం, కొత్త వన్ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర 69,900 రూపాయలు. With a 95% screen-to-body ratio, we're pushing the boundaries of your TV experience. Literally. #SmarterTV pic.twitter.com/gulLxbVvHE — Pete Lau (@PeteLau) June 24, 2020 -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్
సాక్షి, ముంబై : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్పెషల్ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్టాప్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్, బ్లూటూత్ ఇయర్ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్వాచ్లు తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్పి 2,64,900 రూపాయలు). హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర 62,999 రూపాయలు. పాత స్మార్ట్ఫోన్ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. వివో జెడ్ 1 ఎక్స్ వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) 16,990 రూపాయలు (ఎంఆర్పి 24,990 రూపాయలు) పాత స్మార్ట్ఫోన్ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్గా 13,950 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 3 ఏ ధర : 29,999 రూపాయలు. (ఎంఆర్పి రూ .39,999) శాంసంగ్ గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్) రూ.30వేల తగ్గింపు ధరతో 21,999 రూపాయలకు లభ్యం సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్ఇడి స్మార్ట్ టీవీ ధర 42,999 రూపాయలు. (ఎంఆర్పి 72,590 రూపాయలు). పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు డిస్కౌంట్ కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్ఎల్ఆర్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999 రూపాయలు. (ఎంఆర్పి 29,495 రూపాయలు) -
శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్
సాక్షి, ముంబై : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ల ద్వారా తమ సరికొత్త టీవీలు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వీటిల్లో ఫ్రేమ్ 2020 ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్ స్మార్ట్ టీవీ శ్రేణి 4 కే యూహెచ్డి, ఎఫ్హెచ్డి , హెచ్డి రెడీ పేరుతో ఆవిష్కరించింది. ఫ్లిప్కార్ట్లో 'గెట్ మోర్ ఫ్రమ్ టీవీ' అంటూ, అమెజాన్లో 'వండర్టైన్ మెంట్' అంటూ ప్రచారం చేస్తోంది. ఆఫర్లు: ఫ్లిప్కార్ట్లో మొదటి 48 గంటల్లో ప్రీ-పెయిడ్ (క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి) వినియోగదారులకు రూ.1500ల అదనపు తక్షణ క్యాష్బ్యాక్ లభిస్తుందని శాంసంగ్ ప్రకటించింది. అలాగే అమెజాన్ వినియోగదారులకు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ప్రీ-పెయిడ్ లావాదేవీలపై రూ .1000 వరకు తక్షణ క్యాష్బ్యాక్ అందిస్తోంది. దీంతోపాటు సులభ ఈఎంఐ ఆప్షన్స్ కూడా లభ్యం. కొత్త ఎడిషన్ స్మార్ట్ టీవీలు యువ మిలీనియల్స్, ఆన్లైన్ కంటెంట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుచ్చామని సంస్థ పేర్కొంది. ఆటో హాట్స్పాట్ టెక్నాలజీ, యుఎస్బి 3.0, శాంసంగ్ బిక్స్బైతో పాటు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను వీటిల్లో జోడించింది. ఆకర్షణీయమైన కంటెంట్, క్యాష్బ్యాక్ తమ వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో భాగస్వామ్యం కుదర్చుకున్నామని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆన్లైన్ బిజినెస్ డైరెక్టర్ పియూష్ కున్నపల్లిల్ చెప్పారు. స్పెషాలిటీ ఏంటంటే.. ఈ టీవీలు పర్సనల్ కంప్యూటర్ మోడ్తో కూడా వస్తాయి, వినియోగదారులు తమ టీవీని పూర్తి స్థాయి పీసీగా వాడుకోవచ్చు. దీనితో వర్క్ ఫ్రం హోం వినియోగదారులకు సౌలభ్యం, పెద్ద స్క్రీన్ సౌలభ్యం కోసం ఇంటర్నెట్ లేకుండా వైర్లెస్గా ల్యాప్టాప్ను మిర్రర్ చేసుకోవచ్చు. లేదా రిమోట్గా వారి కార్యాలయ కంప్యూటర్ను యాక్సెస్ చేయవచ్చు. బహుళ లేయర్ల నాక్స్ ద్వారా భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కంపెనీ చెబుతోంది. ధరలు ఫ్రేమ్ 2020 టీవీ వరుసగా 50, 55, 65 అంగుళాల మూడు పరిమాణాల్లో ఫ్లిప్కార్ట్ లో లభ్యం. వీటి ధరలు రూ. 74,990, రూ. 84,990, రూ.139,990. 10 సంవత్సరాల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ. ప్యానెల్ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ. ఆన్లైన్ స్మార్ట్ టీవీ మోడళ్లు 32 అంగుళాల నుండి ప్రారంభమై 65-అంగుళాల వరకు ఉంటాయి. 4 కె యుహెచ్డి టివిలు 43, 50, 55, 65 అంగుళాల నాలుగు పరిమాణాలలో లభ్యం. కొత్త ఎఫ్హెచ్డి, హెచ్డి రెడీ స్మార్ట్ టీవీలు 43, 32-అంగుళాలలో లభిస్తాయి. శాంసంగ్ 4 కె యుహెచ్డి స్మార్ట్ టీవీ (44) ధర రూ. 36,990 65 అంగుళాల వెర్షన్ టీవీ రూ .89,990 ఎఫ్హెచ్డి, హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ మోడళ్లు రూ.14,490 నుంచి ప్రారంభమవుతాయి. -
బడ్జెట్ ధరల్లో వన్ప్లస్ స్మార్ట్ టీవీలు!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో తన స్మార్ట్ టీవీ లైనప్ను విస్తరించడానికి సిద్దమవుతున్న వన్ప్లస్ కంపెనీ రెండు కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనుంది. జూలై 2న కొత్త టీవీలను తీసుకొస్తున్నామని వన్ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా సోమవారం ట్వీట్ చేశారు. భారతీయ కస్టమర్లకోసం ప్రీమియం స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ. 69.900 ప్రారంభ ధరల్లో గత ఏడాది దేశంలో వన్ప్లస్ రెండు వేరియంట్లలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో భారతీయ వినియోగదారులను ఆకర్షించాలనే యోచనలో ఉంది. వన్ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర అనే హింట్ మాత్రం ఇచ్చారు సంస్థ సీఈవో. "బెస్ట్-ఇన్-క్లాస్ డిస్ప్లే" ప్యానెల్స్తో, వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియం అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ టీవీలు ఉండనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు కొత్త స్మార్ట్ టీవీలు సుమారు రూ. 15 వేల వద్ద ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. తద్వారా బడ్జెట్ ధరల్లో టీవీలను తీసుకొస్తున్న వు, షావోమి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. (వన్ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు) It's official. We're making our premium smart TV experience more accessible to our Indian community. #SmarterTV pic.twitter.com/gc7WUcVIxJ — Pete Lau (@PeteLau) June 8, 2020 -
ఆకర్షణీయ ధరల్లో రియల్మీ స్మార్ట్ టీవీలు
సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ స్మార్ట్ టీవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక అంచనాలు, ఊహాగానాలు, టీజర్ల మధ్య ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మీ స్మార్ట్ టీవీలను భారతదేశంలో లాంచ్ చేసింది. తద్వారా రియల్మీ భారతదేశంలో తన మొదటి స్మార్ట్ టెలివిజన్ను ప్రారంభించింది. అలాగే బడ్జెట్ధరల స్మార్ట్ టెలివిజన్ విభాగంలోకి దూసుకొచ్చింది. పాపులర్ సైజుల్లో, బడ్జెట్ ధరల్లో ఈ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన రియల్మి తన ప్రత్యర్థులు, షావోమి, వూక్ తదితరులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ టీవీలు 32, 43అంగుళాల రెండు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తాయి. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్) రియల్మీ స్మార్ట్ టీవీ ధరలు రియల్మి స్మార్ట్ టీవీ 32 అంగుళాల వేరియంట్ ధర రూ. 12,999 43 అంగుళాల వేరియంట్ ధర రూ. 21, 999 లభ్యత: జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, రియల్మే.కామ్లో లభ్యం. త్వరలో ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా కూడా లభిస్తుందని రియల్మి ప్రకటించింది. రియల్మి స్మార్ట్ టీవీ ఫీచర్లు సైజు వేరియంట్ను బట్టి రిజల్యూషన్ ఉంటుంది. 32 అంగుళాల రియల్మే స్మార్ట్ టీవీ 1366x768 పిక్సెల్స్ (హెచ్డి-రెడీ) రిజల్యూషన్, 43 అంగుళాల వేరియంట్ 1920x1080 పిక్సెల్స్ (ఫుల్-హెచ్డి) రిజల్యూషన్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 9 పై, 1 జీబీర్యామ్, 8 జీబీ స్టోరేజ్, మీడియాటెక్ ఎంఎస్ డీ6683 ప్రాసెసర్ తో సహా మిగిలిన అన్ని ఫీచర్లు రెండింటిలో దాదాపు ఒకేలా వున్నాయి. 24 వాట్స్ సౌండ్ అవుట్పుట్తో 4- స్పీకర్ సిస్టమ్, డాల్బీఆడియో , బ్లూటూత్ 5.0 ఫీచర్లను కూడా జోడించింది. అంతేకాదు ఈ లాంచ్ ఈవెంట్లో రియల్మీ వాచ్, రియల్మీ బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. వాచ్ ధరను రూ. 3,999, ఇయర్ ఫోన్స్ ధరను రూ. 2,999 గా ఉంచింది. -
రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్టీవీలు త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి రెడ్మి బ్రాండ్ కింద కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్టీవీలను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం సంకక్షోభ సమయంలో మూడు స్మార్ట్ టీవీలను చై నాలో జరగబోయే లాంచ్ ఈవెంట్లో తీసుకురానుంది. రెడ్మి టీవీ ఎక్స్50, రెడ్మి ఎక్స్ 55, రెడ్మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను కంపెనీ మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. దీంతోపాటు రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. విడుదల చేస్తోంది. బెజెల్ లెస్ డిజైన్ తో చిన్ని సైజులో సరసరమైన అందుబాటులో తీసుకురానుందని సమాచారం. ఈ టీవీల సైజ్ గురించి తప్ప వీటికి సంబంధించిన మరే సమాచారం అందుబాటులో లేదు. ఈ టీవీలు డిజైన్, పిక్చర్ క్వాలిటీ , సౌండ్ క్వాలిటీలో మెరుగ్గా వుంటాయనిమాత్రమే రెడ్మి చెప్పింది. అలాగే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో వీటిని లాంచ్ చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. (అద్భుతమైన ఫీచర్లతో ఫోకో ఎఫ్ 2 ప్రొ లాంచ్) -
స్మార్ట్టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్మీ
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు రియల్మి ఇక స్మార్ట్టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు రియల్మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్మి స్మార్ట్ టీవీలు క్యూ2 లో (ఏప్రిల్ నెలలో) విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్లో కూడా అవకాశం ఉందన్నారు. రియల్మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : ఎంటర్టైన్మెంట్ కా సూపర్స్టార్, బడ్జెట్ ధరలో) మరోవైపు రియల్మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో స్మార్ట్టీవీలకే సంబంధించినదే అని అందరూ ఖాయంగా భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ కాప్షన్తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. రియల్మీ టీవీల పూర్తి ఫీచర్లును అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ ఈ స్మార్ట్టీవీలలో సౌండ్, పిక్చర్ క్వాలిటీలు అద్భుతంగా ఉండనున్నాయని అంచనా. అయితే రియల్మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రియల్మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ What is this? pic.twitter.com/uFQBWYXBtv — Francis Wang (@FrancisRealme) February 21, 2020 -
దేశీ మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తమ ఫైర్ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్ టీవీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. డిసెంబర్ 20 నుంచి అమెజాన్డాట్ఇన్ పోర్టల్లో వీటి విక్రయం ప్రారంభమవుతుంది. ఈ ఫుల్ హెచ్డీ టీవీల్లో బిల్టిన్ వైఫై, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 1 యూఎస్బీ పోర్టు, 1 ఇయర్ఫోన్ పోర్టు తదితర ఫీచర్స్ ఉంటాయి. ఫైర్ టీవీ స్మార్ట్ టీవీలను 2018లో అమెరికా, కెనడాలో అమెజాన్ పవ్రేశపెట్టింది. ఈ ఏడాది బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల్లోకి విస్తరించింది. ఇందుకోసం డిక్సన్స్ కార్ఫోన్, మీడియామార్కెట్ శాటర్న్, గ్రండిగ్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. భారత్లో ఒనిడాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇతర సంస్థలతో కూడా కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ఫైర్ టీవీ డివైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సందీప్ గుప్తా తెలిపారు. అమ్మకాల లక్ష్యాలను మాత్రం వెల్లడించలేదు. నాణ్యమైన పిక్చర్, సౌండ్ ఫీచర్స్తో అందుబాటు ధరల్లో ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ లభిస్తుందని మిర్క్ ఎలక్ట్రానిక్స్ (ఒనిడా) బిజినెస్ హెడ్ సునీల్ శంకర్ తెలిపారు. అమెజాన్ ప్రస్తుతం భారత్లో ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్లు, ఎకో (స్మార్ట్ స్పీకర్స్), కిండిల్ (ఈ–బుక్ రీడర్) వంటి ఉత్పత్తులు విక్రయిస్తోంది. -
రూ.12,999కే స్మార్ట్ టీవీ..!
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ టీవీల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీవీ తయారీదారు ఒనిడాతో ఇటీవల జత కట్టిన అమెజాన్ తాజాగా ఒక స్మార్ట్టీవీని విడుదల చేసింది. ‘ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్’పేరుతో పేరిట 1 కొత్త స్మార్ట్టీవీలను బడ్జెట్ ధరలో భారత్లో లాంచ్ చేసింది. ఇండియాలో కొత్త ఒనిడీ టీవీలను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అమెజాన్ డివైసెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా వెల్లడించారు. తమ ఫైర్ టీవీ ఎడిషన్ అద్భుతమైన చిత్ర నాణ్యత, డాల్బీ డిజిటల్ ప్లస్, టీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్తోపాటు వినియోగదారులు తమకు ఇష్టమైన అన్ని కంటెంట్లను ఒకే చోట ఆనందించ వచ్చన్నారు. ఫైర్ టీవీ స్టిక్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ టీవీల్లో ఇన్బిల్ట్గా అమర్చింది. 32, 43 అంగుళాల (ఫుల్ హెచ్డీ ఇంచుల డిస్ప్లే) సైజులలో ఇవి వినియోగదారులకు లభ్యంకానున్నాయి. డిసెంబర్ 20 నుంచి అమెజాన్లో లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్ను ఇన్బిల్ట్గా అందిస్తున్నారు. ఇంకా 3 హెచ్డిఎంఐ పోర్ట్లు, 1 యుఎస్బి పోర్ట్ ఒక ఇయర్ఫోన్ పోర్ట్లను జోడించింది. డీటీహెచ్ లేదా కేబుల్ సెట్-టాప్ బాక్స్లు, గేమింగ్ కన్సోల్లు, సౌండ్బార్లు, హోమ్ థియేటర్ సిస్టమ్లకు అనుసంధానించవచ్చు. దీంతో స్మార్ట్ఫోన్తోపాటు టీవీల రంగంలో కూడా దూసుకు పోతున్న చైనా సంస్థ షావోమితోపాటు, నోకియా, అలాగే బడ్జెట్ధరల్లో స్మార్ట్టీవీలను అందుబాటులో ఉంచిన మోటరోలా, టీసీఎల్ లాంటి కంపెనీలకు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ స్మార్ట్ టీవీ ధరలు 32 అంగుళాల మోడల్ ప్రారంభ ధర రూ .12,999 43 అంగుళాల మోడల్ ప్రారంభ ధర రూ .21,999 -
షావోమీ టీవీలు లాంచ్
బీజింగ్: షావోమి తాజాగా స్మార్ట్టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ సిరీస్లో భాగంగా ఎంఐ టీవీ 5, ఎంఐ టీవీ 5 ప్రో పేరుతో బీజింగ్లో కంపెనీ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్లో భాగంగా మంగళవారం లాంచ్ చేసింది. 55-అంగుళాలు, 65, 75-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో ఈ స్మార్ట్టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ టీవీ 5 ప్రొ ధరలు 55 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో మోడల్ ధర సిఎన్వై 3,699 (సుమారు రూ. 37,200) 65 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో సిఎన్వై 4,999 (సుమారు రూ .50,300) 75 అంగుళాల మోడల్ ధర సిఎన్వై 9,999 (సుమారు రూ .100,500) ఎంఐ టీవీ 5 ధరలు 55 అంగుళాల మోడల్కు సిఎన్వై 2,999 (సుమారు రూ .30,200) 65 అంగుళాల ఎంఐ టీవీ 5 మోడల్ ధర సిఎన్వై 3,999 (సుమారు రూ .40,200) 75 అంగుళాల మోడల్ ధర సిఎన్వై 7,999 (సుమారు రూ. 80,400) అల్యూమినియం ఫ్రేమ్.అమ్లాజిక్ టి 972 సోసి, ప్యాచ్వాల్ యూజర్ ఇంటర్ఫేస్.8 కె వీడియో ప్లేబ్యాక్, వై-ఫై 802.11 ఎసి, మూడు హెచ్డిఎమ్ఐ పోర్ట్లు, రెండు యుఎస్బి పోర్ట్లు, ఎవి ఇన్పుట్లు, బ్లూటూత్ 4.2, 4 మైక్రోఫోన్లు, రెండు 8 డబ్ల్యూ నాలుగు-యూనిట్ స్పీకర్లు, షావోమి వాయిస్ అసిస్టెంట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఈ స్మార్ట్టీవీలలో పొందు పర్చింది. ఎంఐ టీవీ 5లో 3 జీబీ ర్యామ్/32 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉండగా, ఎంఐటీ 5 ప్రో 4జీబీ ర్యామ్/ 64 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ తో వచ్చింది. చైనాలో నవంబర్ 11 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని షావోమి తెలిపింది. అయితే ఇతర మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి తెచ్చేది వెల్లడించలేదు. -
ఎంఐ టీవీ 4ఏ కేవలం రూ .17,999
సాక్షి, బెంగళూరు : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి విస్తృత శ్రేణి స్మార్ట్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. మంగళవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బడ్జెట్ ధరల్లో స్మార్ట్ టీవీలు, కొత్త ఫిట్నెస్ ట్రాకర్, వాటర్ ప్యూరిఫైయర్, మోషన్-యాక్టివేటెడ్ నైట్ లైట్ను లాంచ్ చేసింది. మార్కెట్లో అందుబాటులో వున్న ఉత్పత్తులకు పోటీ ధరల్లో వీటిని తీసుకువచ్చింది. ‘స్మార్ట్ లివింగ్ 2020 థీమ్’ తో నిర్వహించిన ఒక ఈవెంట్లో తాజా ఉత్పత్తులను లాంచ్ చేసింది. ప్రతిఒక్కరికీ 4 కె లేదా ప్రతి ఇంటిలో కనీసం పెద్ద స్మార్ట్టీవీ అనే ఆలోచనతో నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఎంఐ టీవీ 4 ఎక్స్ 65 అంగుళాల, 50 అంగుళాల, 43 అంగుళాల, 40 అంగుళాల పరిమాణాలలో ఇవి లభించనున్నాయి. తొలి మూడుటీవీలు 4 కె హెచ్డిఆర్ ప్యానెల్ కలిగి ఉంటాయి. అతిపెద్ద 65 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 54,999 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 29,999 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్ ధర రూ. 24,999 వీటిల్లో బడ్జెట్ ధరల్లో ఎంఐ టీవీ 4ఏ ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ .17,999. ఈ అన్ని టీవీలు సెప్టెంబర్ 29 నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎంఐ .కామ్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా విక్రయించబడతాయి. అయితే, ఫ్లాగ్షిప్ 65-అంగుళాల మోడల్ సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి ప్రీ-ఆర్డర్కు అందుబాటులో ఉంటుంది. ఎంఐ బ్యాండ్ 4 : ఈ స్మార్ట్టీవీలతో ఎంఐ బ్యాండ్ 4 ను కూడా లాంచ్ చేసింది. ఎంఐ బ్యాండ్ 3 ఫీచర్స్ను అప్గ్రేడ్ చేసింది. ధర రూ.2299 వాటర్ ప్యూరిఫయర్ అయిదు అంచెల ప్యూరిఫికేషన్తో దీన్ని లాంచ్ చేసింది. ఎంఐ వాటర్ ప్యూరిఫైయర్ పీపీసీ, ఆర్ఓ, పీఏసీ పిఎసి ఫిల్టర్ల ద్వారా ఐదు-దశల శుద్దీకరణ ప్రక్రియ జరుగుతుందని షావోమి తెలిపింది. నిల్వ చేసిన నీరు స్వచ్ఛంగా ఉందని నిర్ధారించుకోవడానికి యువి లైట్ అమర్చింది. అంతేకాదు ఇందులో రియల్ టైమ్ టీడీఎస్ పర్యవేక్షణ , ఫిల్టర్ లైఫ్ ట్రాకర్ కూడా ఉన్నాయి. ధర రూ. 11,999. నైట్ లైట్ ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్లైట్ 2ను విడుదల చేసింది. మనుషుల కదలికలను గుర్తించి స్వయంచాలకంగా ఇది వెలుగుతుంది. అలాగే గదిలో 15 సెకన్లపాటు కదలికలు లేకపోతే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. -
షావోమికి షాక్ : మోటరోలా స్మార్ట్టీవీలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు లెనోవా సొంతమైన మోటరోలా భారత మార్కెట్లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలనునేడు (సోమవారం) లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్టీవీలకు పెరుగుతున్నఆదరణ నేపథ్యంలో స్మార్ట్టీవీ మార్కెట్పై దృష్టి పెట్టడానికి వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొత్త వ్యూహంతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. ప్రధానంగా షావోమికి షాకిచ్చేలా ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29 నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. దాదాపు షావోమి ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది. మరోవైపు షావోమి రేపు భారతదేశంలో 65 అంగుళాల టీవీని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్ 9 ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్ సపోర్ట్తో పనిచేస్తాని కంపెనీ తెలిపింది. స్క్రీన్ షిఫ్ట్, ఆటోటూన్ఎక్స్ డిస్ప్లే టెక్నాల. జీ10 బిట్ కలర్ డెప్త్ లాంటి ఫీచర్లు జోడించింది. 49, 55 అంగుళాల టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, మాలి-450 జిపియు, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. 32, 43-అంగుళాల ఫుల్హెచ్డీ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. ఇవి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 డబ్ల్యూ సౌండ్ అవుట్పుట్తో వస్తాయి 32 అంగుళాల హెచ్డీ రెడీ టీవీ ధర రూ.13,999 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ.24,999 43 అంగుళాల 4కె టీవీ ధర రూ.29,999 50 అంగుళాల 4కె టీవీ ధర రూ.33,999 55 అంగుళాల 4కె టీవీ ధర రూ.39,999 65 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ ధరను రూ.64,999 -
రూ.7499కే స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ ఇండియన్ మార్కెట్లో మరో ఆరు కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.7499 నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 39 అంగుళాల మధ్య టీవీల స్క్రీన్ సైజ్ ఉండేలా ఈ స్మార్ట్ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా ఇది అందుబాటులో ఉంటాయి. జేవీసీ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.11,999గా ఉంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. అతితక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన జేవీసీ కొత్త ఎల్ఈడీ స్మార్ట్టీవీలు, షావోమి, థామ్సన్, మార్క్ లాంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్, 20 వాట్ సౌండ్ ఔట్పుట్, 2 యూఎస్బీ పోర్ట్స్, 3 హెచ్డీఎంఐ పోర్ట్స్ , స్మార్ట్ రిమోట్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. -
వరల్డ్ కప్ మేనియా : టీవీలపై 60 శాతం తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐసీసీ వరల్డ్ కప్ 2019 హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఈ ఫీవర్ను క్యాష్ చేసుకునేందుకు ఆయా కంపెనీలు తమదైన రీతిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్ సేల్స్ ఆఫర్ చేస్తోంది. ‘వరల్డ్ కప్ మానియా’ పేరుతో జూన్ 13వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆఫర్ ఇస్తోంది. నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్స్లో షావోమీ, థామ్సన్, వూ, ఐఫాల్కన్ తదితర కంపెనీల టీవీలు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఎల్జీ, కొడాక్ తదితర కంపెనీల టీవీలు కూడా డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. అదనంగా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుతో పది శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ కనీసం రూ.7,999 విలువ కలిగిన ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంది. కొనుగోలుదారులు గరిష్టంగా రూ. 2వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. షావోమీ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల డిస్ప్లే కలిగిన ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ ప్రొ టీవీ ఫ్లిప్కార్ట్లో రూ.12,999 గా ఉంది. 43 అంగుళాల మోడల్ రూ.22,999కే అందుబాటులో ఉంది. 55 అంగుళాల మోడల్ టీవీ రూ.39,999గా ఉంది. వీటితో ఎంఐ టీవీ ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 వరకు ఉన్నాయి. వూ అల్ట్రా స్మార్ట్ టీవీ వూ స్మార్ట్టీవీ 33 శాతం డిస్కౌంట్తో రూ.17,999కి వస్తుంది. దీని అసలు ధర రూ.27,000. 32 అంగుళాల టీవీ రూ.11,999 55 అంగుళాల హెచ్డీ టీవీ రూ.36,999 65 అంగుళాల మోడల్ టీవీ రూ.1,29,999. ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు లభిస్తాయి. 32 అంగుళాల మోడల్ రూ.11,999 75 అంగుళాల 4కేయూహెచ్డీ ప్రీమియం మోడల్ టీవీ రూ.1,49,999కు అందుబాటులో ఉంది. దీంతోఆపటు ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా లభ్యం. థామ్సన్ స్మార్ట్ టీవీ థామ్సన్ యూడీ 9 40అంగుళాల టీవీ19,999 లకే లభిస్తోంది. అసలు ధర మీద 28శాతం డిస్కౌంట్. 55 అంగుళాల ప్రీమియం మోడల్ రూ.33,999గా ఉంది. ఫ్లిప్కార్ట్ వీటికి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. -
రూ.1 కే స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ రేపటి (ఏప్రిల్4 )నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్లో ఎంఐ ఫ్యాన్స్కు పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగాఈ సేల్లో భాగంగా రూ.1 ఫ్లాష్ సేల్ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఎంఐ ట్విటర్ ద్వారా వీడియోలను కూడా పోస్ట్ చేస్తోంది. ఒక రూపాయికే తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్తోపాటు, ఎంఐటీవీని సొంతం చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. ముఖ్యంగా రెడ్మి నోట్ 7 ప్రొ, పోకో ఎఫ్ 1, ఎంఐ సౌండ్బార్, ఎంఐ ఎల్ఈడీ4 ప్రొ(32) టీవీ ని ఒక రూపాయి ఫ్లాష్ సేల్లో విక్రయిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతుంది. అంతేకాదు రూ. 2400 విలువైన ప్రొడక్ట్లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్) రూ.1 సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది షావోమి. దీని ధర రూ.22,999. ఫ్లాష్ సేల్ అనంతరం ఈ స్మార్ట్ఫోన్పై 2వేల డిస్కౌంట్ లభ్యం. అలాగే ఎంఐ ఎల్ఈడీ4 ప్రొ(55) అంగుళాల టీవీని డిస్కౌంట్ అనంతరం రూ.45,999 కు అందిస్తోంది. మరిన్ని వివరాలు ఎంఐ వెబ్సైట్లో . Can you guess this right? Share the screenshot of your guess in comments to win a prize. Hints here --> https://t.co/Jl3A9uBmQY #MakeTheMostOfMi #MiFanFestival pic.twitter.com/vtOOiTLLlX — Redmi India (@RedmiIndia) April 2, 2019 #MakeTheMostOfMi by grabbing your favourite #Xiaomi products at unbelievable prices. Here's what the #MiFanFestival has to offer. What's more? Get a chance to win #RedmiNote7 and other prizes. Visit - https://t.co/5tWlIXPzyk RT if you're excited! pic.twitter.com/vmU0LwQWar — Mi India (@XiaomiIndia) April 3, 2019 -
షావోమి ఫెస్టివ్ సేల్: రూ.9వేల దాకా డిస్కౌంట్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి మరోసారి ఎంఐ ఫాన్స్ ఫెస్టివల్ సేల్ను మళ్లీ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు తాజా సేల్ద్వారా భారీ ఆఫర్లను అందిస్తోంది ఏప్రిల్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఫెస్టివ్ సేల్ కొనసాగుతుంది. ఆన్లైన్లో ఎంఐ.కాం, ఆఫ్లైన్ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర్లలో ఈ సేల్ ఉంటుంది. షావోమి లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు స్మార్ట్ టీవీలను కూడా తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోళ్లపై 5శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. షావోమి రెడ్మి 6, రెడ్మి వై2, రెడ్మి నోట్ 5ప్రొ, పోకో ఎఫ్1 ఎంఐ ఎల్ఈడీ టీవీ4 ప్రొలపై భారీ డిస్కౌంట్ను అందివ్వనుంది. Mi fans! The biggest offers, amazing deals, games and a lot more are here for you. #MakeTheMostOfMi in this #MiFanFestival. Check out now: https://t.co/5tWlIXPzyk 1500 RTs and we'll giveaway exciting prizes! pic.twitter.com/CgpgkmDvpQ — Mi India (@XiaomiIndia) April 1, 2019 -
తక్కువ ధరకే షింకో ఎల్ఈడీ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్టివీ సెగ్మెంట్లో దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా షావోమి, శాంసంగ్, ఎల్జీ సంస్థలు స్మార్ట్టీవలను వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజా ఈ కోవలోకి మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు షింకో చేరింది. ఎల్ఈడీ టీవీ ఎస్వో4ఏ పేరుతో కొత్త టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 39 ఇంచెస్ స్క్రీన్, 1366x768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ను, రెండు హెచ్డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యూఎస్బీ పోర్టులను ఈ టీవీలో పొందుపర్చింది. 4కె వీడియో ప్లేబ్యాక్కు ఇందులో సపోర్ట్ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను జోడించింది. దీని ధరను రూ.13,990 ధరగా కంపెనీ నిర్ణయించింది. షింకో ఎల్ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్) మధ్య వినియోగ దారులకు లభ్యమవుతున్నాయి. -
షావోమీ దూకుడు: బిగ్ టీవీ, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్, స్మార్ట్టీవీ సెగ్మెంట్లో రారాజులో ఏలుతున్న చైనా స్మార్ట్ఫోన దిగ్గజం షావోమి ఎంఐ తాజాగా కొత్త ఎల్ఈడీ టీవీలను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె పేరుతో వీటిని విడుదల చేసింది. వీటితోపాటు ఎంఐ సౌండ్ బార్నుకూడా ఆవిష్కరించింది. 20 వాట్ల స్టీరియో స్పీకర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్, షావోమి సొంతమైన ప్యాచ్ వాల్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ను ఈ టీవీలలో అందిస్తున్నారు. ప్లే స్టోర్, క్రోమ్ క్యాస్ట్కు సపోర్ట్, హాట్ స్టార్, హంగామా, సోనీ లివ్, వూట్, ఈరోస్ నౌ, జీ5, హూక్, ఎపిక్ ఆన్ వంటి యాప్లు ఇన్బిల్ట్గా ఈ స్మార్ట్ టీవీల్లో పొందుపర్చింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 అంగుళాల టీవీలో 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులు తదితర ఫీచర్లను అందిస్తోంది. ధరలు: 43 ఇంచుల టీవీ ధర రూ.22,999 55 ఇంచుల టీవీ ధర రూ.39,999 సౌండ్బార్ ధర : రూ. 4999 ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్లో ఈ టీవీలు విక్రయానికి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. -
మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన షావోమి
స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్ను, ఫిట్నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్.... గురువారం షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్లో ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్తో ప్యాచ్వాల్ యూఐ రిఫ్రెస్తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్లోనే వాయిస్ సపోర్ట్ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్డీఆర్ సపోర్ట్తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్డీఎంఐ పోర్ట్లు, 2 యూఎస్బీ 3.0 పోర్ట్లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 3... షావోమి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎస్ఎంఎస్లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్ను కూడా దీని స్క్రీన్పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్..... షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్అందుబాటులోకి రానుంది. ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360.... టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. -
బుల్లితెరపై ధరల పోటీ!!
న్యూఢిల్లీ: దేశ టీవీల మార్కెట్లో లీడర్గా ఉన్న శామ్సంగ్... చైనా కంపెనీలిస్తున్న పోటీకి తల వంచింది. తన ప్రారంభ సైజు టీవీల ధరలను ఏకంగా 20 శాతం వరకూ తగ్గించింది. శామ్సంగ్ ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి. నిజానికి షావోమీ, టీసీఎల్ కంపెనీలు 55 అంగుళాల టీవీలను రూ.45,000 స్థాయిలోనే అందిస్తుండగా, శామ్సంగ్ మాత్రం ఇదే సైజు టీవీలను రెట్టింపునకు పైగా ధరలకు మార్కెట్ చేసుకుంటోంది. తాజాగా ధరల్ని తగ్గించిన తర్వాత వీటి మధ్య వ్యత్యాసం 60 శాతానికి తగ్గింది. మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చన్నది కంపెనీ వ్యూహమని శామ్సంగ్ డీలర్లు చెబుతున్నారు. భారీ టెలివిజన్ మార్కెట్... దేశీయ టెలివిజన్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ.22,000 కోట్లు. అందుకే దేశ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సగానికి పైగా వాటాతో ఆధిపత్యాన్ని సాధించిన చైనా కంపెనీల కన్ను ఇప్పుడు టెలివిజన్ల మార్కెట్పై పడింది. ఇందులో భాగమే షావోమీ కంపెనీ అత్యాధునిక ఫీచర్లున్న స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకు లాంచ్ చేయడం. 43 అంగుళాల స్మార్ట్ టీవీని షావోమీ ఎంఐ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో రూ.22,999కే విడుదల చేసింది. ఇక 55 అంగుళాల 4కే టీవీ ధరను రూ.39,999కే తీసుకొచ్చింది. అయితే, తర్వాత కొన్ని రోజులకు 55 అంగుళాల టీవీ ధర రూ.5వేలు పెంచి రూ.44,999 చేసింది. వీటికి కస్టమర్ల నుంచి స్పందనే లభించింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ ధరల పరంగా దిగిరాక తప్పలేదు. 55 అంగుళాల టీవీని ఇంతకాలం రూ.లక్షకు విక్రయించిన ఈ కంపెనీ ఇపుడు రూ.70,000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక 43 అంగుళాల టీవీని రూ.39,900 నుంచి రూ.33,500కు తగ్గించింది. విధానంలో మార్పు... ‘‘సాధారణంగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినప్పుడు కంపెనీలు అప్పటికే మార్కెట్లో ఉన్న పాత మోడళ్ల ధరల్ని 5 శాతం వరకు తగ్గించడం జరుగుతుంది. కానీ, ఈ విడత శామ్సంగ్ ఏకంగా 10– 20 శాతం వరకు ధరల్ని తగ్గించింది. ధరల విధానం పూర్తిగా మారిందని ఇది తెలియజేస్తోంది’’ అని ప్రముఖ రిటైల్ కంపెనీ డైరెక్టర్ ఒకరు చెప్పారు. అందుబాటు ధరల టీవీలకు మళ్లుతున్న కస్టమర్లను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా పెంచుకునేందుకు శామ్సంగ్ చాలా పోటీతో కూడిన ధరల విధానాన్ని ఆచరణలో పెట్టిందని ముంబైకి చెందిన రిటైల్ చెయిన్ కోహినూర్ డైరెక్టర్ విశాల్మేవాని చెప్పారు. దేశ టీవీ మార్కెట్ను శామ్సంగ్, సోనీ, ఎల్జీలే ఇంతకాలం ఏలాయి. అయితే, షావోమీ, టీసీఎల్, థామ్సన్, షార్ప్, బీపీఎల్, స్కైవర్త్ బ్రాండ్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రముఖ బ్రాండ్లు తమ ధరలపై పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. స్మార్ట్ఫోన్ల మాదిరే... భారత టెలివిజన్ల మార్కెట్లోకి షావోమీ ప్రవేశం గత నాలుగేళ్ల కాలంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో చోటుచేసుకున్న విధ్వంసకర పోటీ పరిస్థితులకే దారితీస్తుందని ఫారెస్టర్ అధ్యయనం తెలిపింది. టెలికం రంగంలో జియో ఎలాగైతే విప్లవం సృష్టించిందో, అదే మాదిరిగా భారత టెలివిజన్ మార్కెట్ను తాము మార్చేయాలనుకుంటున్నట్టు షావోమీ సహ వ్యవస్థాపకుడు లీజున్ చెప్పారు. ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయాలు ఆరంభించడానికి ముందే ఈ ఏడాది చివరికి అతిపెద్ద ఆన్లైన్ బ్రాండ్గా అవతరించాలన్నది కంపెనీ లక్ష్యంగా చెప్పారు. అంత సులభం కాదు...! ‘‘వినియోగదారులు కేవలం ధరలను మాత్రమే చూసి టీవీలు కొనకపోవచ్చు. టీవీకి రిపేర్ వస్తే అది వెంటనే సరిచేయాలని కోరుకుంటారు. రిపేర్ సదుపాయాలను సమకూర్చడం అంత తేలికకాదు. స్మార్ట్ఫోన్లకు సమస్య వస్తే వారు వెంటనే హ్యాండ్సెట్ మార్చేయగలరు. అందుకే స్మార్ట్ఫోన్లతో పోలిస్తే టీవీ మార్కెట్ కొత్త బ్రాండ్లకు సవాలే’’ అని కొరియాకు చెందిన ఓ ప్రముఖ టెలివిజన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసిక గణాంకాలు చూస్తే... దేశీ టీవీ మార్కెట్లో శామ్సంగ్కు 30 శాతం వాటా ఉంది. తర్వాత ఎల్జీ, సోనీ ఉన్నాయి. అదే 55 అంగుళాలు ఆ పైన సైజున్న టీవీల్లో శామ్సంగ్ వాటా 37 శాతం. సోనీది 29 శాతం వాటా. ధరల పెంపు చిత్రంగా ప్రారంభసైజు టీవీల ధరల్ని తగ్గంచిన శామ్సంగ్ పెద్ద సైజు తెరల క్యూఎల్ఈడీ టీవీల రేట్లను పెంచేసింది. 65 అంగుళాల ఫ్లాట్ క్యూఎల్ఈడీ టీవీ ధరను రూ.30,000 వరకు పెంచగా, కర్వ్డ్ క్యూఎల్ఈడీ టీవీ ధరను ఏకంగా రూ.55,000 మేర పెంచేసింది. కాకపోతే బంపర్ ఆఫర్ కింద ఈ టీవీలను కొన్న వారికి శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 స్మార్ట్ఫోన్ను ఉచితంగా ఇస్తోంది. శామ్సంగ్ తాజా ధరలు సైజు గత ధర ప్రస్తుత ధర (అంగుళాల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో) 32 22,900 19,400 43 39,900 33,500 55 1,00,000 70–75,000 65 2,05,000 1,95,000 కొత్త ఫీచర్లతో శామ్సంగ్ టీవీలు చెన్నై: శామ్సంగ్ కంపెనీ యాంబియెంట్ మోడ్, మరింత శబ్ధ నాణ్యత తదితర ఫీచర్లతో కూడిన నూతన శ్రేణి టెలివిజన్లను గురువారం విడుదల చేసింది. క్యూఎల్ఈడీ, యూహెచ్డీ, కాన్సర్ట్ సిరీస్లో నూతన శ్రేణి టెలివిజన్లను తీసుకొచ్చింది. క్యూఎల్ఈడీ సిరీస్ టీవీల్లో యాంబియెంట్ మోడ్తో కస్టమర్లు తమ స్వభావాలకు అనుగుణమైన ఫీచర్లు, వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. క్యూఎల్ఈడీ మోడళ్ల ధర రూ.2.45 లక్షలు, యూహెచ్డీ టీవీల ధర రూ.64,900, కాన్సర్ట్ సిరీస్ టీవీల ధరలు రూ.27,500 నుంచి ప్రారంభం అవుతాయి. -
ప్రియమైనా.. ప్రీమియమే నయం!
సురేష్ కొత్త టీవీ కొందామనుకున్నాడు. దగ్గర్లోని షాపులతో పాటు... ఆన్లైన్లోనూ వెదికాడు. ముందైతే ఓ 35వేల బడ్జెట్తో 42 అంగుళాల టీవీ కొందామనుకున్నాడు. కానీ సెర్చ్ చేస్తున్న క్రమంలో తాజాగా ఎంటీ ఇచ్చిన ఓ చైనా కంపెనీ రూ.40వేలకే 55 అంగుళాల టీవీ విక్రయిస్తున్నట్లు తెలిసింది. వాకబు చేసిన మీదట... నాణ్యత కూడా బాగానే ఉందని తెలియటంతో దానికే ఓటేశాడు. కొనుక్కున్నాడు. సాక్షి, బిజినెస్ విభాగం: ఆర్జన శక్తి పెరుగుతుండటంతో జనం కాస్తంత ఎక్కువ ఖర్చు పెట్టినా ప్రీమియం ఉత్పత్తులనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీనికితోడు మార్కెట్లో పోటీ కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు రకరకాల ఫీచర్లతో కాస్తంత తక్కువ ధరలకే దొరుకుతున్నాయి కూడా. ఓ సాధారణ ఫ్రిజ్కు బదులు రెండు మూడు కంపార్టుమెంట్లు ఉండే అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్లు, ఓ సాధారణ టీవీకి బదులు 4కే అల్ట్రా టెక్నాలజీతో కూడిన ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ, దుస్తుల్ని ఉతకడంతోపాటు వాటిని నిమిషాల్లో ఆరబెట్టే ఫీచర్లతో కూడిన ఫ్రంట్లోడ్ వాషింగ్ మెషీన్లు, సాధారణ ఏసీలకు బదులు ఖరీదైనా గానీ విద్యుత్ ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీలు... ఇవీ కస్టమర్ల ఎంపికలుగా మారుతున్నాయి. పరిశ్రమ మొత్తం వృద్ధితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా ఉండటం మారుతున్న ధోరణికి అద్దం పడుతోందని చెప్పొచ్చు. సాంకేతికత, డిజైన్కు మొగ్గు ప్రపంచ స్థాయి టెక్నాలజీలు అందివస్తుండడం, జీవన విధానంలో మార్పులతో వినియోగదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ను కేవలం వినియోగ ఉత్పత్తులుగానే చూడడం లేదని శాంసంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటానీ చెప్పారు. మెరుగైన వినియోగం కోసం మంచి సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను ఎంచుకోవడంపై అవగాహన కలిగి ఉంటున్నారని ఆయన తెలియజేశారు. ప్రీమియం ఉత్పత్తులు చూడ్డానికి అందంగా కనిపించడంతోపాటు దుమ్ము పట్టని ఫ్యాన్లు, విద్యుత్ ఆదా చేసే ఏసీలు తరహా ఉన్నత శ్రేణి ఫీచర్లను కలిగి ఉండడం వాటి అమ్మకాలను పెంచుతోంది. ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తుల్లోనూ ప్రీమియం (ఖరీదైన/ఉన్నతశ్రేణి) ట్రెండ్ కనిపిస్తోంది. ‘‘బాష్ ప్రీమియం వాషింగ్ మెషీన్ల విక్రయాల్లో వృద్ధి ఇతర ఉత్పత్తులతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉంది. డిమాండ్ పెరుగుతుండడంతో ఉత్పత్తులను ప్రమోషన్లు, సులభ రుణ వాయిదాల్లో అందించే దిశగా మాకు ప్రోత్సాహాన్నిస్తోంది’’ అని బీఎస్హెచ్ హౌస్హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ, సీఈవో గుంజన్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో కన్జ్యూమర్ డ్యురబుల్స్ పరిశ్రమలో సగటు వృద్ధి ఏడు శాతంగా ఉంది. అదే ప్రీమియం ఉత్పత్తుల విభాగంలో మాత్రం 20 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఏసీల్లో 15 శాతం వృద్ధి ఉంటే, ఇన్వర్టర్ ఏసీల విక్రయాల్లో 25 శాతం పెరుగుదల ఉంది. వినియోగదారులు తమ సౌకర్యం కోసం మంచి డిజైన్, మెరుగైన టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఇందుకోసం అధికంగా చెల్లించేందుకూ వారు వెనుకాడడం లేదు’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ ఈవీపీ కమల్ నంది తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ ఇదే ధోరణి ఈ విధమైన ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఖరీదైన ఉత్పత్తులకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాము క్యుఎల్ఈడీ సిరీస్ను ఆవిష్కరించినప్పుడు 40 శాతం బుకింగ్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరిగినట్టు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూటీని పేర్కొన్నారు. ఇంటర్నెట్ అందుబాటు పెరగడంతో చిన్న పట్టణాల్లోని కస్టమర్లు సైతం ఉత్పత్తులకు సంబంధించి సమాచారం తెలుసుకుంటున్నారని కమల్ నంది తెలిపారు. ప్రీమియం ఉత్పత్తుల మార్కెట్లో తాము మెరుగైన స్థితిలో ఉన్నామని భూటాని చెప్పారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్ విభాగాల్లో తామే లీడర్గా ఉన్నట్టు చెప్పారు. దిగుమతులే అధికం... ప్రీమియం ఉత్పత్తుల్లో చాలా వరకు దిగుమతి అవుతున్నవే. కంపెనీలు వాటిపై భారీగా దిగుమతి సుంకాలు చెల్లించి దిగుమతి చేసుకుంటున్నాయి. రిఫ్రిజిరేటర్లపై 28 శాతం జీఎస్టీతోపాటు 10 శాతం దిగుమతి సుంకం కూడా అమల్లో ఉంది. హై ఎండ్ ప్రీమియం రిఫ్రిజిరేటర్ల దిగుమతులను ఇక ముందూ కొనసాగిస్తామని, తమ విక్రయాలు ఇక్కడ భారీగా లేకపోయినప్పటికీ అవి పెరుగుతున్నట్టు జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండీషనింగ్ చైర్మన్, ఎండీ గుర్మీత్సింగ్ తెలిపారు. -
మార్కెట్లోకి థామ్సన్ స్మార్ట్ టీవీలు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కన్సూమర్ బ్రాండ్ ‘థామ్సన్’ తాజాగా మూడు స్మార్ట్టీవీలను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. 43 అంగుళాల అల్ట్రాహెచ్డీ 4కే, 40 అంగుళాల హెచ్డీ, 32 అంగుళాల హెచ్డీ రెడీ టీవీలు ఇందులో ఉన్నాయి. ఇవి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి. ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 18 అర్ధరాత్రి ప్రారంభమౌతుందని పేర్కొంది. 43 అంగుళాల అల్ట్రాహెచ్డీ 4కే స్మార్ట్టీవీలో జీమెయిల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ వంటి యాప్స్ను డిపాల్ట్గా ఉంటాయని, ఈ టీవీ ఆండ్రాయిడ్ 4.4.4.0 ఓఎస్పై పనిచేస్తుందని వివరించింది. కాగా థామ్సన్ బ్రాండ్ టెక్నికలర్ కంపెనీది. ఇది భారత్లో ఎస్పీపీఎల్తో లైసెన్స్ అగ్రిమెంట్ను కుదుర్చుకుంది. 43 అల్ట్రాహెచ్డీ 4కే– ధర రూ.27,999 కాగా... 40 ఫుల్హెచ్డీ ధర రూ.19,999. ఇక 32 హెచ్డీ రెడీ ధర రూ.13,499. -
ఆ కంపెనీలకు షాక్: కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి థామ్సన్ టీవీలు వచ్చేశాయ్.. ముఖ్యంగా స్మార్ట్టీవీ సెగ్మెంట్లోకి చైనా కంపెనీ షావోమి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో థామ్సన్ సరికొత్త రీఎంట్రీ ప్రాధాన్యతను సంతరించుకుంది. స్మార్ట్ ఎఫ్హెచ్డీ టీవీలను భారత టీవీ మార్కెట్లో లాంచ్ చేసింది. గురువారం 40, 43, 32 అంగుళాల మూడు స్మార్ట్ టీవీలను ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్లో శుక్రవారం విక్రయాలు మొదలు కానున్నాయని కంపెనీ వెల్లడించింది. 43 అంగుళాల 4కే యూహెచ్డీ థామ్సన్ టీవీ ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది. 43 అంగుళాల 4కే యేహెచ్డీ టీవీ మోడల్ పేరు 43టీఎం4377 : 3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్డీఆర్, విత్ ఎల్ జీఐపీఎస్ ప్యానెల్ , ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ కాట్, 1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్, అలాగే మాలి-టీ720 జీపియూ, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 10వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 40టీఎం4099 మోడల్ , 1920x1080 పిక్సల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ , 10 వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 32ఎం3277 మోడల్: 1366x768 పిక్సల్స్ రిజల్యూషన్, 450 నిట్స్ , ఆండ్రాయిడ్ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 20వాట్స్ టోటల్ ఆడియో అవుట్పుట్, వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. కాగా ఫ్రాన్స్కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్, టెక్నికలర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మడి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండే థామ్సన్. యురోపియన్ మార్కెట్లో థామ్సన్ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. తాజా వ్యూహంతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీలతో భారత మార్కెట్లో పాగా వేయనుంది. తద్వారా దేశంలో మైక్రోమ్యాక్స్, వూ, షావోమి లాంటి బడ్జెట్ ధరల్లో టీవీలను అందిస్తున్న కంపెనీలకు భారీ షాకే ఇవ్వనుంది. -
అంగన్వాడీకేంద్రాలకు ఇంటర్నెట్, స్మార్ట్ టీవీలు
ఐరాల : జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు, ఇంటర్ నెట్, స్మార్ట్ టీవీలు అందజేయనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చుక్కావారిపల్లెలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,750 కేంద్రాలకు స్మార్ట్ టీవీలు అందజేయనున్నట్లు తెలిపారు. రూ 5 లక్షల ఎంపీ నిధులతో అరుంధతీయవాడల్లో ఉన్న 600 అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మిగిలిన వాటికి టెండర్ల ద్వారా అందజేస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యమన్నారు. వేదగిరివారిపల్లె పంచాయతీని ఉపాధి హమీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సింగం శెట్టి సుబ్బరామయ్య దత్తత తీసుకోవడం హర్షించదగిన విషయమన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఆయనకు ప్రజలు సహకరించాలన్నారు. హరిజనవాడకు సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, పశువైద్య కేంద్రం మంజూరు చేయాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా, పంచాయతీలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకుంటే వాటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సింగంశెట్టి సుబ్బరామయ్యను కలెక్టర్ సన్మానించారు. అనంతరం సుబ్బరామయ్య ఆ పంచాయతీలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన టీవీలను అందజేశారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మురళీధర్ మూర్తి , సర్పంచ్ వసంతమ్మ, మండల ఉపాధ్యక్షుడు ధనుంజయనాయుడు, తహసీల్దార్ ప్రసాద్ బాబు, ఇన్చార్జి ఎంపీడీఓ సతీష్ పాల్గొన్నారు. -
వ్యూ టెక్నాలజీస్ నుంచి 15 కొత్త స్మార్ట్ టీవీలు
న్యూఢిల్లీ: టీవీలు తయారు చేసే వ్యూ టెక్నాలజీస్ సంస్థ గురువారం 15 కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించింది. 19 నుంచి 85 అంగుళాల సైజుల్లో ఉండే ఈ టీవీల ధరలు రూ.9,000 నుంచి రూ.9,00,000 లక్షల రేంజ్లో ఉన్నాయని సంస్థ డిజైన్ హెడ్, సీఈఓ దేవిత సరాఫ్ వెల్లడించారు. టీవీలను ఆల్ట్రా హెచ్డీ లేదా 4కే టెక్నాలజీతో రూపొందించామని, ఇతర టీవీలతో పోల్చితే తమ టీవీల ధరలు 40% తక్కువని వివరించారు. వీటిని పూర్తిగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారానే విక్రయిస్తామని తెలిపారు.తమ ఆదాయంలో 55% ఆన్లైన్ అమ్మకాల ద్వారానే వస్తున్నాయరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లుగా ఉన్న తమ టర్నోవర్ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లకు (రూ.300 కోట్లకు) పెంచుకోవడం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే 35 వేలుగా ఉన్న టీవీల విక్రయాన్ని లక్షకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. -
మీ టీవీలే మీపై నిఘానేత్రాలు!
గోడకు చెవులుంటాయో, లేదోగానీ మన ఇళ్లలో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు చెవులూ కళ్లు రెండూ ఉంటాయి. ఎవరూ లేరనుకుని ప్రేయసితోనో, ప్రియుడితోనో మాట్లాడే మాటలు మనకు తెలియకుండానే క్షణాల్లో ఇంటర్నెట్లోకి వెళ్తాయి. అక్కడి నుంచి మనపై నిఘా వేయాలనుకునే వ్యక్తికో లేదా కంపెనీకో నేరుగా చేరుతాయి. ఇదంతా కేవలం ఒక్క టీవీతోనే సాధ్యం అయిపోతోంది!! మన కదలికలపై ఎవరైనా నిఘా పెట్టాలంటే రహస్య కెమెరాలు అమర్చాల్సిన అవసరం లేదు. స్మార్ట్ టీవీలు మనింట్లో ఉంటే చాలు. మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి కదలికను ఆ స్మార్ట్ టీవి రికార్డు చేసి ఇంటర్నెట్కు పంపించే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీలు సాధారణంగా ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయి. నెట్ఫిక్స్ లాంటి సర్వీసులు లేదా బీబీసీ ఐ ప్లేయర్ల నుంచి మనకు కావాల్సిన సినిమాలు, కార్యక్రమాలను డౌన్లోడ్ చేసుకొని మన స్మార్ట్ టీవీల ద్వారా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. అచ్చం అలాగే మన ఇంట్లో విషయాలను అది అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘వాయిస్ రికగ్నైజ్డ్ సిస్టమ్’ ఉన్న టీవీలతో మన ప్రైవసీకి మరింత ప్రమాదం. మన మాటరె బట్టి ఛానళ్లు మారే సౌకర్యం కలిగిన టీవీల ముందు మనం కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మన కబుర్లను ఆ టీవీలు రికార్డు చేస్తాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ జర్నలిస్టు ఇటీవలే ప్రత్యక్షంగా రుజువు చేశారు. ఒక్క స్మార్ట్ టీవీలే కాదు.. ‘వాయిస్ యాక్టివేటెడ్ ఎక్స్ బాక్స్ గేమ్స్’ లాంటి గాడ్జెట్ వల్ల కూడా ఇలాంటి ముప్పు ఉంది. వాయిస్ కమాండ్ ఇస్తున్నప్పుడు ఆ కమాండ్తో పాటు బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ప్రతి శబ్దం రికార్డు అవుతుందని కంపెనీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. తమ స్మార్ట్ టీవీలను చూస్తున్న ప్రేక్షకుల మనోభావాలను తెసుకోవడానికి దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ టీవీ ఉత్పత్తుల కంపెనీ ఇటీవలనే ప్రేక్షకుల డేటాను సమీకరించింది. ఆ డేటాను ఆ కంపెనీ భద్రంగా ఉంచుతుందనే గ్యారెంటీ ఏమిటీ?...ఏ యాడ్స్ కంపెనీకో అమ్మేసే అవకాశం లేదా? మనుషులపైనా, వ్యవస్థలపైనా నిఘా పెంచేందుకు టెలీస్క్రీన్లు ఎలా దోహదపడతాయో ప్రముఖ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్ 1949లోనే ఊహించి రాశారు. ఆప్పట్లోనే ఆయన‘1984’ పేరుతో విడుదల చేసిన ఈ నవలలో ఓసియానియా దేశంలో పాలకపక్షం టెలీస్క్రీన్ల ద్వారా ప్రతిపక్ష పార్టీపై నిఘా పెట్టి ఆ పార్టీ నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఆ నవలలో జార్జి ఆర్వెల్ ఊహించిన దానికన్నా ఇప్పటి టీవీల్లో నిఘా పరికరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్ టీవీల్లో ఎదురుగా ఉండే మనుషులను గుర్తుపట్టే ఫీచర్ కోసం శక్తివంతమైన కెమేరాలు వాడుతున్నారు. అవే అవసరమైతే మనపై నిఘా నేత్రాలుగా పనిచేస్తాయి. ప్రైవసి కోసం ఎలక్ట్రానిక్ నిఘా నేత్రాలు లేని ఏ పచ్చిక బయళ్లకో, లోయల్లోకో, ఎడారులకో పోదామా?... అలాంటి ప్రదేశాల్లో కూడా గూగుల్ ఎర్త్ ద్వారా మనపై నిఘా వేయవచ్చేమో!