Special focus
-
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
-
కదిరిలో కదం తొక్కిన ప్రభంజనం.. సీఎం జగన్ కు అఖండ ఘన స్వాగతాలు
-
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్ను దూరం పెట్టింది. 2004 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్కాంత్కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
బాల్య వివాహాలకు ముగింపు
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్లైన్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్బాబు బషీర్బాగ్లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్రెడ్డి బీజేపీ బీ–ఫామ్పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబు, ఐజీలు రమేశ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
దక్షిణాదిలో ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్గఢ్లను బీజేపీ కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్లో ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రాగలిగింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడంతో అధికారంలోకి వస్తామని లేదా అధిక సంఖ్యలో సీట్లు సాధించి కింగ్మేకర్ లేదా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్రాల్లోనూ నిలిచి ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో మరింత బలోపేతమవుతున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఎందుకు విస్తరించలేకపోతు న్నది? అందుకు దారితీస్తున్న, ప్రభావం చూపు తున్న అంశాలేమిటి అన్న దానిపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. వరుస ఓటములతో.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, తెలంగాణలో ఓటమితో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. డీలా పడిన పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ రెండింటితో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే భవిష్యత్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రా యం పార్టీలో వ్యక్తమవుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవ గా, వచ్చే ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టమిని అధిగమించినట్టు అవుతుందనే చర్చ అంతర్గతంగా ముఖ్యనేతల్లో సాగుతున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల కల్లా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాదిలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టు దొరక్కపోవడానికి కారణాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణాదికి సంబంధించి ప్రత్యేక ఎ జెండాకు తుది రూపం ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిని ఆనుకొని పొరుగున రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాల్లో 181 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 53 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను దాటి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే దిశగా కచ్చితమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్లనుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రపార్టీలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
‘ప్రొఫెషనల్’గా బోధన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాల్లేని ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తిస్తే.. సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి, సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్ కోర్సులను బోధిస్తున్న వారి అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసీటీఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించినా.. కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. కీలక కోర్సుల బోధనలో.. దేశవ్యాప్తంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తెలంగాణలో 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే.. ఇందులో 58శాతం కంప్యూటర్ కోర్సులవే. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 50 శాతం దాటడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సరికొత్త కోర్సులకు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కొత్త కోర్సులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా చాలా కాలేజీల్లో బోధన సాధారణ కంప్యూటర్ సైన్స్ కోర్సుల మాదిరిగానే ఉంటోందని ఏఐసీటీఈ గుర్తించింది. ఇప్పటికే కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందిలో మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అర్హత గల నైపుణ్యం ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో బోధన విధానంలో గణనీయమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రొఫెషనల్స్తోనే పాఠాలు ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రత్యేక నైపుణ్యంతో బోధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ స్పష్టం చేస్తోంది. చాలా కాలేజీల్లో గత రెండేళ్లు జరిపిన అధ్యయనంలో ఆ తరహా బోధన కనిపించలేదని పేర్కొంటోంది. కాలేజీలు ఎంటెక్ పూర్తి చేసిన సాధారణ ఫ్యాకల్టీతో కోర్సుల బోధన కొనసాగిస్తున్నాయి. వారు కృత్రిమ మేధ (ఏఐ), ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆన్లైన్లో సెర్చ్చేసో, అప్పటికప్పుడు నేర్చుకునో బోధిస్తున్నారు. వారికి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. అలాంటి వారు సమర్థవంతంగా బోధించలేరని ఏఐసీటీఈ అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులంతా వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా నైపుణ్యం సంపాదించిన వాళ్లే. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులను బోధనకు అనుమతిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రతీ కాలేజీలోనూ అలాంటి వారు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన తెచ్చే ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల చేత పాఠాలు చెప్పించాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందే కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు బోధించే అధ్యాపకుల వివరాలు తెప్పించుకుని.. వారికి అర్హత ఉంటేనే గుర్తింపు ఇవ్వాలనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రొఫెషనల్స్ సేవలు ఎంతో అవసరం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సంబంధిత కోర్సు చేయకున్నా.. కావాల్సిన అనుభవం ఉంది. కాలేజీల్లో పనిచేసే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఎంటెక్ సర్టిఫికెట్లు ఉన్నా ఈ కోర్సులను బోధించే అనుభవం తక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్త కంప్యూటర్ కోర్సులను బోధించేందుకు పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నాం. అమెరికాలో ఓ ఏఐ ప్రొఫెషనల్ వారానికి కొన్ని గంటలు ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు నేరుగా క్లాసులు చెబుతారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీకి కూడా ప్రొఫెషనల్స్ ద్వారా క్లాసులు చెప్పించాలి. అప్పుడే భవిష్యత్లో కొత్త కోర్సులకు అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.– ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ సరైన ఫ్యాకల్టీ లేకుండా అనుమతులు వద్దు కొన్నేళ్లుగా ఇష్టానుసారం కంప్యూటర్ కోర్సులకు అనుమతి ఇస్తు న్నారు. మరి ఆ కోర్సులను బోధించే వా రు ఉన్నారా? లేదా? అనేది యూనివర్సి టీలు పరిశీలించాలి. లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. నైపుణ్యం లేకుండా విద్యార్థులకు డిగ్రీలిస్తే, మార్కెట్లో వారు నిలబడటం కష్టం. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి.– అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రాజస్థాన్ పై బీజేపీ ఫోకస్..
-
మీ గుండె పదిలంగా.. హార్ట్ సర్జరీలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవన ప్రమాణాలు చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు సంభవించిన తొలి గంటలోపే (దీన్నే గోల్డెన్ అవర్ అంటారు) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యధిక అవకాశాలున్నాయి. అనారోగ్యానికి గురైన వెంటనే గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తించడం, సమీపంలో ఉన్న ఆసుపత్రికి సకాలంలో చేర్చడం, ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రోగిని తరలించి, ECG వంటి పరీక్షల ద్వారా రోగి పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన శస్త్ర చికిత్సను చేయడం అనేవి చాలా ముఖ్యం. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే గుండెపోటు కారణంగా జరిగే మరణాలను కట్టడి చేయగలం. ఇందుకోసమే ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది గుండె వ్యాధులకు చెక్ పెడుతూ.. అసంక్రమిక వ్యాధుల్లో NCD (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) గుండె సంబంధిత సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్.సీ.డీల్లో గుండెపోటు వల్ల జరుగుతున్న మరణాలు 32 శాతం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, పీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. STEMI ద్వారా గుండె పదిలం: గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయం ఎంతో కీలకమైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యం. ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న PHCలలో ఇనీషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ను ఉచితంగా రోగికి అందించడం, తదనంతరం 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్స నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగం. ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేసింది. SVRR GGH గుంటూరు, GGH కర్నూలు, KGH విశాఖపట్నం నాలుగు హబ్స్ గా ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ ను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏం చేస్తారంటే..: గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు. మెడికల్ కాలేజ్ హాస్పటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పటల్స్ లో సిబ్బంది నియామకం: గుండె వ్యాధులను తగ్గించేందుకు అత్యుత్తమమైన, నాణ్యమైన హార్ట్ కేర్ సర్వీసులను రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం వేగంగా అవసరమైన పోస్టులను మంజూరు చేసారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటీ విభాగాల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులను సాంక్షన్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. చదవండి: CM Jagan: గౌరవం చేతల్లోనూ.. STEMI పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29, 2023న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని టీచింగ్ హాస్పటల్స్లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ విభాగాలను బలోపేతం చేసి, కార్డియాక్ సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. -
తగ్గిన శిశు మరణాలు..ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు
-
స్పెషల్ ఫోకస్
బాలీవుడ్పై జ్యోతిక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్గా రూపొందిన ఈ సినిమాలో రాజ్కుమార్ రావు టైటిల్ రోల్ చేశారు. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్కు జ్యోతిక సైన్ చేశారనే టాక్ కొన్ని నెలల క్రితం బీటౌన్లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్కు జ్యోతిక సై అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్ ‘వష్’కు ఈ చిత్రం రీమేక్ అని భోగట్టా. -
Karnataka assembly elections 2023: కర్ణాటక ‘సెంట్రల్’ ఎవరివైపు..!
సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. లింగాయత్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది. సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి. స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రసవం సమయంలో మాతా, శిశు మరణాలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీయే ప్రధాన కారణమవుతోంది. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల కట్టడికి ఇప్పటికే వివిధ చర్యలు చేపడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి మూడు, నాలుగు రోజుల ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించడం ద్వారా వారికి మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించాలని నిర్ణయించింది. హైరిస్క్ గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలింపునకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రభుత్వం 108 అంబులెన్స్ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తూ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. 2020 నుంచి ఇప్పటివరకూ 108 అంబులెన్స్లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు హాజరవగా.. ఇందులో అత్యధికంగా 19 శాతం మంది గర్భిణులు ఉండటం గమనార్హం. ఏటా రూ.12 కోట్ల వరకు.. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి ముందే పెద్దాస్పత్రులకు తరలించడం కోసం నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంటారు. కాగా, వీరిలో 10 శాతం మంది హైరిస్క్లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకూ హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పీహెచ్సీలకు రాబోయే వారం రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల సమాచారం రాష్ట్రస్థాయి నుంచి అందజేస్తారు. సమాచారం ఆధారంగా పీహెచ్సీ సిబ్బంది హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి మూడు నుంచి నాలుగు రోజుల ముందే దగ్గరలోని ఏరియా, జిల్లా, అవసరాన్ని బట్టి బోధనాస్పత్రులకు తరలిస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేశారు. హైరిస్క్ గర్భిణి వాహనంలో పెద్దాస్పత్రికి తరలింపు, పెద్దాస్పత్రిలో అడ్మిట్ చేయడం, ప్రసవానంతరం ఫొటోలను యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్ ట్రయల్ రన్ సైతం పూర్తయింది. చిన్నచిన్న మార్పు చేర్పులను చేస్తున్నారు. అందుబాటులోకి కాల్ సెంటర్ మరోవైపు గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై వాకబు చేయడం కోసం వైద్య శాఖ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సేవలు ప్రారంభమయ్యాయి. రెండు షిఫ్టుల్లో 80 మంది సిబ్బంది కాల్సెంటర్లో పనిచేస్తున్నారు. రాత్రివేళల్లో అత్యవసర సేవల కోసం కొందరు సిబ్బంది కాల్సెంటర్లో ఉంటున్నారు. గర్భిణులు, బాలింతలకు ఏఎన్సీ, పీఎన్సీ, ఇతర వైద్యసేవల కల్పన, చిన్నారులకు ఇమ్యునైజేషన్ వంటి ఇతర అంశాలను కాల్సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైరిస్క్ గర్భిణులపై కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మాత, శిశు మరణాల కట్టడి కోసమే మాతా, శిశు మరణాల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హైరిస్క్ గర్భిణులపై ఫోకస్ పెంచుతున్నాం. వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రసవానికి ముందే వారిని పెద్దాస్పత్రులకు తరలించడం కోసం పీహెచ్సీలకు నిధులు మంజూరు చేయనున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
28న కలెక్టర్ల సదస్సు..! పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై కేసీఆర్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రమంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సోమవారం సమావేశానికి సంబంధించి శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్లకు మౌఖికంగా సమాచారమిచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ సీఎంగా రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 13తో నాలుగేళ్లు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది గరిష్టంగా నవంబర్ లేదా అంతకుముందే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి కొద్ది సమయమే మిగిలింది. మిగిలిన ఈ కాలంలో దృష్టి సారించాల్సిన ప్రాధాన్యత అంశాలు, పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై సదస్సులో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. పలు కీలక నిర్ణయాలతో పాటు ఆదేశాలు సైతం జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. తక్కువ సమయమే.. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేసీఆర్ రోజువారీ సమీక్షలు, సమావేశాలతో పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ప్రారంభమైన తరువాత పాలనావ్యవహారాలు కాస్త మందగించాయి. కోవిడ్–19 పూర్తిగా తగ్గుముఖం పట్టినా పాలన యంత్రాంగం మళ్లీ పూర్వపు క్రియాశీలస్థితికి రాకపోవడానికి వరుసగా రాష్ట్రంలో హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్, మునుగోడు స్థానాలకు ఉపఎన్నికలు రావడమూ ఓ కారణంగా చెబుతున్నారు. ఎన్నికలకు దీంతో తక్కువ సమయమే ఉండటం ప్రభుత్వానికి కీలకంగా మారింది. రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడంతోపాటు ఇంకా మిగిలిన హామీలను నెరవేర్చి లబ్ధిదారులకు చేరువ కావడానికి కలెక్టర్ల సదస్సును ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందే డబుల్బెడ్ రూం ఇళ్లు పంపిణీ రాష్ట్రంలో చేపట్టిన 2.91 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైన 62 వేల ఇళ్లను వచ్చే జనవరి 15లోగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆలోగా లబి్ధదారులను ఎంపిక చేయడంతోపాటు మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తికి ముఖ్యమంత్రి గడువు నిర్దేశించే అవకాశం ఉంది. ధరణి పోర్టల్పై వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైతం ధరణి సమస్యలపై విస్తృతంగా చర్చించి నిర్దేశిత గడువులతో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా అకాల వర్షాల కారణంగా అది వాయిదా పడింది. పోడు భూముల సమస్య, గొత్తికోయల దాడిలో ఎఫ్ఆర్వో మరణించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ధరణి సమస్యలు, పోడు వ్యవహారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, మరో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు వంటి అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించే అవకాశం ఉంది. కొత్త పథకాలపై ఆదేశాలు ? గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంకా నెరవేర్చని వాటిపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సొంత జాగాలో ఇళ్లను కట్టుకునేవారికి రూ.3 లక్షలను ప్రోత్సాహకంగా అందించడం, ఉద్యోగాల భర్తీ మరింత వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ -
ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడోసారీ గెలిచి అధికారం చేపట్టేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే టీఆర్ఎస్ను సన్న ద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో సంస్థాగత లోపాలను చక్కదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకసారి మాత్రమే గెలిచిన, ఒక్కసారి కూడా గెలవని నియో జకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, బీజేపీ లోక్సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిని మదింపు చేస్తున్నారు. గెలవని 17 చోట్ల..: రాష్ట్ర అవతరణ తర్వాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గాలకు గాను ఇప్పటివరకు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలేదు. ఇందులో హైదరాబాద్ నగరంలో ఎంఐఎంకు పట్టున్న ఏడు నియోజకవర్గాలతోపాటు ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ ఉంది. వీటితోపాటు హైదరాబాద్లోని ఎల్బీ నగర్, మహేశ్వరం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి, భద్రాచలం, మధిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల్లో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మినహా మిగతా అందరూ టీఆర్ఎస్లో చేరారు. 36 నియోజకవర్గాల్లో చేరికలతో.. టీఆర్ఎస్ 2014లో 63 చోట్ల, 2018లో 88 చోట్ల గెలిచింది. ఈ రెండుసార్లు కూడా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో పాక్షిక ఫలితాలనే రాబట్టగలిగింది. ఈ క్రమంలోనే రాజకీయ పునరేకీరణ పేరిట 2014 నుంచి ఇప్పటివరకు 36 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. మరోవైపు ఈ రెండు ఎన్నికల్లో కలుపుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 52 నియోజకవర్గాల్లో ఒక పర్యాయం, 51 సెగ్మెంట్లలో వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. ప్రస్తుతం మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను టీఆర్ఎస్కు 104 మంది సభ్యుల బలముంది. 65 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇలా శాసనసభలో, బయటా టీఆర్ఎస్ అత్యంత బలంగా ఉన్నా.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సంస్థాగత లోపాలు తలెత్తినట్టు పార్టీ పెద్దలు గుర్తించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల నేతల చేరికతో పలుచోట్ల తాజా, మాజీ ఎమ్మెల్యేలు, నేతల నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లపై.. రాష్ట్రంలో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 19 స్థానాలు ఎస్సీ, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క (ఎస్సీ –మధిర), ఎస్టీ ఎమ్మెల్యేలు సీతక్క (ములుగు), పోదెం వీరయ్య (భద్రాచలం) మినహా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే ఈ రిజర్వుడ్ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందనే అంచనాల నేపథ్యంలో.. ఆయా సెగ్మెంట్లపై పట్టుజారకుండా ప్రత్యేక వ్యూహం అమలుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. దళితబంధు, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి అంశాలపై సంబంధిత వర్గాల్లో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఆ ఎంపీ సీట్ల పరిధిలోనూ నజర్.. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సంస్థాగత బలం తదితరాలపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తోంది. ఈ నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్, ఇతర పారీ్టల బలాబలాలపై ఐప్యాక్ సంస్థ పూర్తిస్థాయి నివేదిక అందజేసింది. ఈ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వే, నిఘా సంస్థల ద్వారా అందుతున్న వివరాల అధారంగా.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి వ్యూహాలను టీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటోంది. ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి (పీసీసీ చీఫ్) రాయని డైరీ -
రాష్ట్రా ప్రయోజనాలే అజెండా
-
సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ వేసే ప్రతీ అడుగు, నిర్వహించే కార్యక్రమాలన్నీ బీజేపీ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధినాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పకడ్బందీ ప్రణాళికను అమలుచేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యక్ష పర్యవేక్షణల్లోనే కార్యాచరణ రూపొందుతోంది. తెలంగాణలో ఏడాదిగా విభిన్న అంశాలపై నేరుగా అమిత్ షా, నడ్డాలకు రిపోర్ట్ చేసేలా వివిధ సంస్థలు, బృందాలు పనిచేస్తున్నాయి. గతేడాది ఆగస్టులో బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు నుంచే కొన్ని బృందాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై పరిశీలనను మొదలుపెట్టాయి. బూత్ కమిటీలపై అమిత్షా సమీక్ష రాష్ట్రంలో మూడు, నాలుగు నెలలుగా క్షేత్రస్థాయి నుంచి సమాచార సేకరణ ఫుల్ స్పీడ్లో సాగుతోంది. దీనికోసం పదుల సంఖ్యలో అధ్యయన, సమాచార సేకరణ బృందాలు నిమగ్నమయ్యాయి. సర్వేలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, పార్టీల బలాబలాలు తదితరాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడంతోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 25లోగా పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, ఆ కమిటీ కన్వీనర్లు, సభ్యుల నియామకం పూర్తిచేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. 17న జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కిందిస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, బూత్ కమిటీల నియామకం, టీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకత వంటి విషయాలపై ఆరా తీయనున్నట్టు సమాచారం. కేసీఆర్ పాలన తీరు, టీఆర్ఎస్ ముఖ్యనేతలపై అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలపై కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల నుంచి సమాచార సేకరణకు అమిత్ షా ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలు, వాటి బలాబలాలు తదితర అంశాలపై ఇప్పటికే నాయకత్వానికి అధ్యయన బృందాలు నివేదికలు అందజేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పది ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో బలమైన అభ్యర్థులు లేని అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
మునుగోడుపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి
-
సమగ్ర భూ సర్వే
-
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం
-
మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-
జగనన్న కాలనీల నిర్మాణాల పై గృహనిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి
-
స్పందనతో భరోసా
-
ఆసరా ఆర్థిక భరోసా
-
మద్యం విక్రయాన్ని పెంచటానికేనని అడ్డగోలు కథనాలు
-
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు
-
అమెరికా సైనికులను వెనక్కి పిలిపిస్తానన్న ట్రంప్
-
క్రీడాభిమానులను షాక్కు గురి చేసిన సుశీల్కుమార్ ఎపిసోడ్
-
గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చాం: బొత్స
సాక్షి, తాడేపల్లి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, కోటి మందికిపైగా కరోనా పరీక్షలు చేసి భయాందోళనలు తొలగించామని పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుని కరోనా కట్టడి చేశామన్నారు.(చదవండి: ‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’) ‘‘సీఎం జగన్ పేదల సొంతింటి కలను నెరవేర్చారు. 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. విద్య, వైద్యరంగాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నాడు-నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాం. అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని) -
విశాఖ కేంద్రంగా డిజిటల్ విప్లవం
విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని ప్రకటన తరువాత ప్రముఖ ఐటీ కంపెనీల చూపు గ్రేటర్ విశాఖపై పడింది. ఐటీతో పాటు ఐటీయేతర రంగానికి వేదికయ్యేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ వడివడిగా అడుగులేస్తోంది. మెట్రో నగరాలకు దీటుగా డిజిటల్ మార్కెటింగ్ విప్లవానికి కేంద్రంగా నిలవనుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రంలోనే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలకు విశాఖ వేదిక కానుంది. ఇప్పటి వరకు ఐటీ, ఐటీయేతర రంగాలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లు కేంద్రంగా ఏర్పాటవుతున్నాయి. ఆర్థిక రంగ అభివృద్ధికి ఈ సంస్థలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మానవ వనరులను తీర్చిదిద్దే పనిలో.. వాస్తవానికి విశాఖలో ఐటీ రంగ పురోభివృద్ధికి అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం జిల్లాకు శాపంగా పరిణమించింది. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశ్రామిక నగరంగా పేరుపొందిన విశాఖను ఐటీ హబ్గా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖ వేదికగా పెట్టుబడులు పెట్టాలని అనేక బహుళ జాతి ఐటీ, ఐటీయేతర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఉత్పాదక పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో పాటు దేశానికే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఐటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తోంది. అయితే స్థానికంగా ఐటీ నిపుణుల కొరత ఉండే అవకాశం ఉండడంతో ముందుగా అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు, మరోవైపు ప్రభుత్వానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ చుక్కానిలా కనిపిస్తోంది. మానవ వనరులు లేని కారణంగా విశాఖ నుంచి విప్రో వంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా అనేక ఐటీ సంస్థలకు అవసరమైన మానవ వనరులను విశాఖ ద్వారా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్లైన్ ద్వారానే వ్యాపారాలు.. ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు పర్సన్ టు పర్సన్ మార్కెటింగ్ జరిగేది. వినియోగదారులే మార్కెట్కి వెళ్లి తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇపుడు అంతా డిజిటల్ మార్కెటింగ్ విప్లవం పుంజుకుంది. అంతా ఆన్లైన్ ద్వారానే వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫారంలో ఉంటున్న వినియోగదారుల వద్దకే వస్తువులు, ఉత్పత్తులను తీసుకువెళ్లే సౌకర్యం ఏర్పడింది. ఈ మార్కెటింగ్ నైపుణ్యం ఉన్న వారు ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారని సంస్థలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి.. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రతి ఏటా బయటకు వస్తున్నారు. వీరు ఉపాధి, విద్యావకాశాల కోసం మెట్రో నగరాలకు వలస Ðవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అందుకు అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో విద్యార్థులను నిపుణులుగా తయారు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ విద్యార్థులను మార్కెటింగ్ నిపుణులుగా తీర్చిదిద్దవచ్చని భావిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ.. డిజిటల్ మార్కెటింగ్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 550 డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఆన్లై¯న్లోనే కాకుండా ఆఫ్లైన్ ద్వారా కూడా నేరుగా ప్రత్యేక ట్రైనర్ ద్వారా విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ అందిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇన్ఫోసిస్, విప్రో, టెక్మహీంద్ర, ఇతర ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్లు సైతం లభించాయి. భవిష్యత్తు ‘డిజిటల్’పైనే ఆధారం.. ఈ రంగంలో వాస్తవానికి కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఒకరికొకరికి సంబంధం ఉండదు. తెలియాల్సిన, నేరుగా కలవాల్సిన అవసరం లేదు. అయితే వారి మధ్య అనుసంధానకర్తగా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్లదే కీలక పాత్ర. భవిష్యత్తు వ్యాపారం మొత్తం డిజిటల్ ప్లాట్ఫారంపైనే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డిజిటల్ రంగంలో విద్యార్థులకు శిక్షణ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న సుమారు 550 డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఆన్లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ తరగతులు నిర్వహించాం. రిమోట్ ప్రాంతాల్లో సుమారు 220 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆన్లైన్లో శిక్షణ తరగతులను సది్వనియోగం చేసుకోలేకపోవడంతో మూడు నెలల కిందట ఆఫ్లైన్ తరగతులను సైతం ప్రారంభించాం. ప్రత్యేక ట్రైనర్ నేరుగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో అనేక మందికి బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. – చల్లా మధుసూదనరెడ్డి, చైర్మన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 25 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇప్పటికే పల్సస్ ఆధ్వర్యంలో నగరంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది. దీని ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు కలి్పంచే అవకాశం ఉంది. ఈ ప్రొగ్రాంకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం కూడా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా 25 వేల మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయి బయటకు వస్తున్నారు. వీరిలో ఎంసీఏ, ఎంబీఏ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చేసిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి డిజిటల్ మార్కెటింగ్ రంగంలో నైపుణాభివృద్ధి íశిక్షణ అందించగలిగితే స్థానికంగా ఉద్యోగాలు కలి్పంచవచ్చు. అందుకే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ను ఏర్పాటు చేశాం. ఇక్కడే చదవి, ఇక్కడే ఉంటూ నైపుణ్య శిక్షణ తీసుకొని, ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలకు ఇక్కడి నుంచే ఉద్యోగ సేవలు అందించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. – డాక్టర్ గేదెల శ్రీనుబాబు, పల్సస్ ఐటీ కంపెనీ అధినేత -
కృష్ణాలో కొత్త ఉషస్సు!
సాక్షి, మచిలీపట్నం: జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పం మేరకు 2009లో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటైంది. వైఎస్సార్ మరణానంతర పరిణామాలతో దాదాపు పదేళ్ల పాటు ఈ వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన కొత్త క్యాంపస్లోకి వర్సిటీని తరలించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేని దుస్థితి కొనసాగింది. వర్సిటీలో అంతర్గత కుమ్ములాటలతో విద్యాప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.కృష్ణారెడ్డి వర్సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇన్చార్జి వైస్చాన్సలర్ ప్రొ.సుందర కృష్ణతో కలిసి రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి వర్సిటీలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2020 జనవరిలో కొత్త క్యాంపస్లో అడుగుపెట్టడంతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆయా వర్సిటీలతో అవగాహన ఒప్పందాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకోవడం ద్వారా అంతర్గత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు బాటలు వేస్తున్నారు. తైవాన్ వర్సిటీతో ఎంఓయూ తైవాన్ నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీతో ఇటీవలే కృష్ణా వర్సిటీకి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల కృష్ణా వర్సిటీకి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇక్కడ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పీహెచ్డీ చేయడానికి, పీహెచ్డీ పూర్తి చేసిన వారు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేయడానికి తైవాన్ యూనివర్సిటీకి వెళ్లే అవకాశం అందిపుచ్చుకోనున్నారు. కృష్ణా వర్సిటీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. మరో వైపు తైవాన్ దేశానికి చెందిన చంగ్జున్ క్రిస్టియన్ యూనివర్సిటీతో కూడా ఎంఓయూ చేసుకోనుంది. కల్చరల్ ఎక్సే్ఛంజ్ తో పాటు సైంటిఫిక్ అండ్ అకడమిక్ ఎబిలిటిస్ను పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎఐటీ)తో అవగాహన ఒప్పందం చేసుకుంటోంది. దీని ద్వారా ఆక్వా జియో సైన్సెస్ కోర్సులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇరు వర్సిటీలను బలోపేతం చేసుకునేందుకు ఉపకరిస్తుంది. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్తో.. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్తో కూడా అవగాహన ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా ఎట్మాస్పియర్ నేచురల్–వెదర్ డైనమిక్స్ అండ్ ఎడ్వాన్స్డ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్గా వర్సిటీని అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్పేస్ సెంటర్ సమకూర్చనుంది. మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)తో జియో స్పేర్, బయోస్పేర్, అటా్మస్పియర్ యాక్టివిటీస్ అభివృద్ధిపై అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్టుమెంట్ (ఐఎండీ)తో కూడా ఎంఓయూ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందంతో కోస్తా తీరంలో డాప్లర్ వెదర్ రాడార్స్ నుంచి డేటా తీసుకుని ఫోర్కాస్టింగ్ ఆఫ్ ది టెంపరేచర్ వెదర్ పేరా మీటర్స్పై వర్సిటీ రీసెర్చ్ చేయనుంది. వచ్చే ఆర్నెల్లలో వరుసగా మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కృష్ణా వర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నట్టు రిజి్రస్టార్ ప్రొ. కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆశల పల్లకి
విజయనగరం... మొదటినుంచీ వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన జిల్లా. గత ప్రభుత్వ హయాంలో ఆ ముద్ర కాస్తా మరింత ఎక్కువైంది. ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా పడకేయించారు. విభజన హామీలతో జిల్లాకు రావాల్సిన అవకాశాలను వదిలేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం విడుదలైన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అసలు అభివృద్ధి అంటే ఏమిటో జిల్లావాసులు తెలుసుకుంటున్నారు. ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన మంత్రులతోపాటు... ఇన్చార్జి మంత్రి శుక్రవారం రానున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తిగా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథాన పయనింపజేయడానికి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సింది గా అధికారులను ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాను ప్రత్యేకంగా చూస్తున్నారు. జిల్లాలోని సమస్యల్ని పరి ష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాల్సి ఉం ది. ఈ క్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించనున్న సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలపై జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయనగరం రోడ్ల విస్తరణ అస్తవ్యస్తం.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరిట టీడీపీ పాలకవర్గం హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లతో 15 రోడ్లు విస్తరించేందుకు ప్రతిపాదించింది. అందులో నాలుగు మార్గాల్లో మాత్రమే శతశాతం పనులు పూర్తికాగా మరో నాలుగు రోడ్లలో పనులు చివ రి దశలో ఉన్నాయి. మిగిలిన మార్గాల్లో విస్తరణకోసం భవనాలు తొలగించి వదిలివేయటం తో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దీనివల్ల నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు రహదారుల్లో నష్టపోయిన బాధితులకు ఇచ్చిన పరిహారంలో టీడీపీ పాలకవర్గం వివక్ష చూపించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్మిల్లులు మూతపడి నాలు గేళ్లవుతున్నా నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. నీటి పథకాలున్నా... ఆయకట్టుకు అవస్థలే... బొబ్బిలి నియోజకవర్గంలో వీఆర్ఎస్ అదనపు ఆయకట్టు ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరందించాలని తలపెట్టిన పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే విడిచిపెట్టేశారు. పాత ఆయకట్టులోని కాలువలను మరమ్మతు చేయకపోవడం, పూడికలు తీయకపోవడం వల్ల రైతులు శ్రమదానం చేసుకోవాల్సి వస్తోంది. గ్రోత్సెంటర్లో 1240 ఎకరాల ఏపీఐఐసీ భూములను కంపెనీలు ఏర్పాటు చేస్తామని రైతుల వద్ద అతి చౌకగా కొనుగోలు చేసినవారు ఇప్పుడు వాటి చుట్టూ ప్రహారీ నిర్మించి స్థలాలను సొంతం చేసుకున్నారు తప్ప పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయలేదు. రోగాల జోన్గా సాలూరు.. సాలూరు ప్రాంతంలో ఆరోగ్యపరంగా రెడ్జోన్గా అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోనే అధికంగా 28 డెంగీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అనధికారికంగా వందకు పైగా డెంగీ కేసులుండవచ్చు. గురుకులాల్లో నేటికీ విద్యార్థులకు నోట్పుస్తకాలు, యూనిఫాం రాలేదు. గురుకులాలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. వెంగళరాయ సాగర్ అక్విడెక్టు, ఆండ్ర, వెంగళరాయిసాగర్, పెద్దగెడ్డ ఆధునికీకరణ, పెద్దగెడ్డ ఎడమకాలువ పనులు చేయాల్సి ఉంది. గిరిశిఖర గ్రామాల్లో చెక్డ్యాంలు నిర్మించాలి. చీపురుపల్లిలో ఇందిరమ్మ సుజలధార పథకం పైప్లైన్లు శిథిలమయ్యాయి. దీనివల్ల నిత్యం లీకులతో పట్టణానికి సక్రమంగా సాగునీరు అందడం లేదు. రహదారుల్లేని గిరిజన ప్రాంతాలు.. కురుపాం నియోజకవర్గంలో ప్రధానంగా రహదారి సౌకర్యాలు వేధిస్తున్నాయి. కొన్ని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు ఫార్మేషన్ పనులు చేపట్టినప్పటికీ, మెటల్, తారు రోడ్డు వంటి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు. పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నిర్మించిన జంఝావతి ప్రాజెక్టు లక్ష్యం నేటికీ పూర్తికాలేదు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత మహానేత 2006లో రూ.5కోట్లతో రబ్బర్ డ్యాం ద్వారా తాత్కాలికంగా నీటిపారుదల సౌకర్యం కల్పించారు. కానీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా పూర్ణపాడు–లాబేస్ వంతెన నిర్మాణం జరిగితే కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమలక్ష్మిపురం మండలాల ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. కష్టాల్లో భీమసింగి.. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం కష్టాల్లో ఉంది. దీనిని ఆధునికీకరణ చేసి, రైతులకు భరోసా కల్పించాల్సి ఉంది. శాసనాపల్లి–పెదవేమలి, అలమండ–జె.డి.వలస మధ్య వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఎస్.కోట, వేపాడ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాల్లో చేర్చాలన్న డిమాండ్ ఉంది. చిలకలగెడ్డ ఆనకట్ట నిర్మించడం ద్వారా 2000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. రైవాడ జలాశయం నుంచి అదనపు ఆయకట్టు 2000 ఎకరాలకు నీరందించే ప్రతిపాదన అమలుకోసం ఎదురు చూస్తోంది. చుట్టూ ప్రాజెక్టులున్నా... సాగు సున్నా... పార్వతీపురానికి సమీపంలోనే జంఝావతి, వరహాల గెడ్డ ఉన్నప్పటికీ సాగునీరు అందక నిత్యం అక్కడ కరువు తాండవిస్తోంది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో నిత్యం ఎప్పుడు బురదనీరే సరఫరా అవుతోంది. గజపతినగరం నియోజకవర్గానికి సాగునీటి కొరత వేధిస్తోంది. తాగు నీటికి సైతం మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నెల్లిమర్ల పట్టణాన్ని తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. పట్టణ జనాభాకు సరిపడినన్ని పథకాలు లేకపోవడం స్టోరేజీ ట్యాంకులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బంది కలుగుతోంది. రామతీర్థం, సారిపల్లి గ్రామాలకు సంబంధించిన తాగునీటి పథకాలు చంపావతి నదిలో ఉన్నాయి. నదిలో భూగర్బ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పంచాయితీలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. -
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ 20 శాతం ఓట్లు సాధించి నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్రంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువా రం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడంపై అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన పదాధి కారుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై అమిత్షా దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవడంతో వాటి పరిధుల్లోని 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో పుంజుకున్న పార్టీని దక్షిణ తెలంగాణకు విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని, దానికి ముందుగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి నేతల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అన్నారు. దేశవ్యాప్తంగా గల్లంతైన కాంగ్రెస్.. రాష్ట్రంలో కూడా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగే స్థితి లేకుండా స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ జెండా మోస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా భావించి లోక్సభ ఎన్నికల్లో పట్టంకట్టారన్నారు. -
తమ్ముళ్లూ.. ప్చ్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’లో ఎదురుగాలి వీస్తోందని చంద్రబాబు గ్రహించారు. ‘అనంత’ టీడీపీకి కంచుకోట అనుకున్నామని, కానీ కూలిపోయే పరిస్థితి కనిపిస్తోందనే నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, మంత్రులపై కూడా తీవ్రంగా స్పందించారు. వ్యక్తులు ముఖ్యం కాదని.. పార్టీయే ముఖ్యమని, పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సూటిగా చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు మాట్లాడం, నేతలపై అసహనం వ్యక్తం చేయడం చేస్తే జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినిందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని, బాబులోని అసహనం, మాటలు చూస్తే అధికారంలోకి రాదనే విషయం కూడా స్పష్టమవుతోందనే చర్చ నేతలు, కార్యకర్తల్లో వినిపించింది. రెండురోజుల ‘అనంత’ పర్యటనకు వచ్చిన ఆయన పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించాలనేందు కోసమే ఈ దఫా జిల్లా పర్యటనకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికారిక కార్యక్రమాల కంటే పార్టీ కార్యక్రమాలపైనే చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ‘అనంత’ పర్యటనకు 23వ సారి వచ్చిన చంద్రబాబు 21సార్లు జిల్లాకు రావడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోయారు. 2016లో రెయిన్గన్లను ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే జిల్లాలో నాలుగురోజులు గడిపారు. అప్పుడు కూడా ‘అనంత’లో బస చేసి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు హెలికాప్టర్లో వెళ్లి వచ్చారు. కానీ ఈ దఫా మాత్రం రెండురోజులు ‘అనంత’లో బస చేసి పార్టీపై దృష్టి సారించారు. తొలిరోజు పుట్టపర్తి పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బళ్లారిరోడ్డులోని ఎంవైఆర్ కళ్యాణమండపంలో శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకూ సమీక్ష కొనసాగింది. రెండోరోజు శనివారం ఉదయం 7కన్వెన్షన్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించి, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి పుట్టపర్తి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. అర్ధరాత్రి దాకా మేల్కొని సమీక్షలు నిర్వహించడం, అధికారులతో మాట్లాడిన తీరు.. పార్టీ నేతలు, కార్యకర్తల సమీక్షలో మాట్లాడిన వైనాన్ని నిశితంగా పరిశీలిస్తే ‘అనంత’లో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పకనే చంద్రబాబు చెప్పారు. రెండురోజుల సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు ఆయా నియోజకవర్గాల నుంచి కీలక వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు వివరాలివీ.. శింగనమల: శింగనమల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. విప్ యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా పంచుకుని నాశనం చేశారని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో గ్రూపులు ఉండటంతో పాటు నియోజకవర్గంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేకు తెలీకుండా అమలు కాకూడదని అధికారులకు నిర్దేశించడంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పనితీరు చూస్తే ‘అట్టర్ఫ్లాప్’ అనే నిర్ధారణకు వచ్చారు. నార్పలలో ఆలం నర్సానాయుడు పార్టీని భ్రష్టుపట్టించారని ఎంపీపీ ఆకుల అరుణ సీఎం దృష్టికి తీసుకొచ్చి నట్లు తెలిసింది. దీంతో నర్సానాయుడిపై సీఎం సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘ఒక మండలంలోని సమస్యలు కూడా నా దృష్టికి వస్తున్నాయంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అన్ని రకాల ఫెయిల్ అయ్యారని’ సీఎం విప్, ఎమ్మెల్సీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం: ‘కళ్యాణదుర్గం జిల్లాలోనే అత్యంత బలంగా ఉందని అనుకునేవాళ్లం. సర్వే రిపోర్టులు చూస్తే అత్యంత దారుణపరిస్థితి అక్కడే ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ‘సన్స్ట్రోక్’ తగిలింది. మారుతి వ్యవహారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. మారుతి నువ్వు మారాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే రామ్మోహన్చౌదరిపై కూడా తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. ‘మంత్రి అండ ఉందని ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు. గ్రూపులు కట్టుకుని పార్టీకి నష్టం చేస్తున్నారు. ఇకపై ఫిర్యాదు వస్తే సీరియస్గా ఉంటుంది.’ అని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తంగా కళ్యాణదుర్గంలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తే రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చిందని, మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.గుంతకల్లు: గుంతకల్లు నియోజకవర్గం సర్వే రిపోర్టులు దారుణంగా ఉన్నాయి. ఎమ్మెల్యే కుటుంబపాలనతో పార్టీకి నష్టం వాటిల్లింది. పార్టీలోకి వచ్చే వారిని కలుపుకుని వెళ్లాలి. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకూడదని పరోక్షంగా జితేంద్రగౌడ్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే మునిసిపల్ చైర్పర్సన్ భర్త చంద్రశేఖర్ పనితీరు పార్టీకి నష్టం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల స్థితిగతులపై తరచూ సర్వేలు చేయిస్తున్నాం. ఏమాత్రం తేడాలు వచ్చినా సహించేది లేదని మాట్లాడారు. కదిరి: కదిరి సమీక్షలో చంద్రబాబు తీవ్రస్థాయిలోనే స్పందించారు. కదిరిలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు ప్రత్యర్థులు బలపడుతుంటే, గ్రూపు తగాదాలతో రోజురోజుకు మరింత బలహీనపడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరూ బలప్రదర్శన చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అత్తార్తో పాటు మాజీ ఎమ్మెల్యే కందికుంటను హెచ్చరించారు. ఇద్దరి తీరుతో పార్టీ నాశనమైందని చెప్పుకొచ్చారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త జోక్యం చేసుకుని అత్తార్పై ఫిర్యాదు చేయబోయారు. ‘అవునయ్యా! ఇప్పుడు తీవ్రంగా మాట్లాడుతున్నారు. మొన్న ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు. నా ముందు వేషాలు వేయొద్దు!’ అని వారించారు. టిక్కెట్ ఎవరికి అనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని, ఇద్దరూ పార్టీ కోసం పనిచేయాలని పనితీరు ఆధారంగా చివరల్లో నిర్ధారిస్తానని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెబుతూ కదిరి బాధ్యతను మంత్రి దేవినేనికి ప్రత్యేకంగా అప్పగించారు. పుట్టపర్తి: పుట్టపర్తిపై సర్వేలు చేయిస్తే ఓడిపోతామని రిపోర్టులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. పల్లె ప్రవర్తనే పార్టీకి నష్టం చేకూరుస్తోందని చెప్పుకొచ్చారు. ఆయన భార్య చనిపోయింది.. కాబట్టి మీరే కోఆర్డినేట్ చేసుకుని పార్టీని ముందుకు నడిపించండి. ఎన్నికల ముందు పార్టీ పరిస్థితి బేరీజు వేసి, ఎవరి బలం ఏంటో నిర్ధారించి టిక్కెట్ సంగతి ఆలోచిస్తా! అని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారులకు దిశానిర్దేశం పార్టీ సమీక్షకు ముందు ప్రభుత్వ అధికారులతో 7 కన్వెన్షన్లో నిర్వహించిన సమీక్షలో కూడా చంద్రబాబు అధికారులకు కూడా పరోక్షంగా పార్టీ బలోపేతంపైనే దిశానిర్దేశం చేశారు. ఒక ప్రభుత్వానికి మంచిపేరు రావాలన్నా, చెడ్డపేరు రావాలన్నా అధికారుల పనితీరు కీలకమని ‘అనంత’లో పార్టీ పరిస్థితి బాగోలేదని అధికారులు ప్రభుత్వ పనితీరుపై జనాల్లో విస్తృత ప్రచారం చేయాలని, అది పరోక్షంగా పార్టీకి లాభిస్తుందనే కోణంలో మాట్లాడారు. అధికారుల సమీక్షతో పాటు ఐదు నియోజకవర్గాల సమీక్షలను పరిశీలిస్తే ఐదుచోట్ల టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. సమీక్ష అనంతరం బయటకు వచ్చిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ ఐదు ఓడిపోతామని తెలిసే చంద్రబాబు సమీక్ష పెట్టుకున్నారని, చంద్రబాబు ఇంత బాహాటంగా మాట్లాడటం చూస్తే జిల్లాలో 5 కచ్చితంగా ఓడిపోతామని స్పష్టమవుతోంది. తక్కిన 9 నియోజకవర్గాల్లో కూడా ఎన్ని గెలుస్తామో, ఎన్ని ఓడిపోతామో.. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయినట్లు ఉందని చర్చించుకున్నారు. సమీక్ష అనంతరం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో పుట్టపర్తికి వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్లిపోయారు. -
‘ఆయువుపట్టు’ పట్టేద్దాం!
ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్కు ఆయువుపట్టు గత ఎన్నికల్లో అత్యధిక సీట్లను ఈ ప్రాంతం నుంచే గెలిచింది అందుకే టీఆర్ఎస్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో ఆ ప్రాంతంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మొత్తం 45 స్థానాలున్నాయి. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు టీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణ జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ఈ జిల్లాల్లో 7 సీట్లే గెలిచింది. ఉత్తర తెలంగాణ లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో పూర్వవైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కనీసం సగం సీట్లు గెలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. భారీసభలతో జనాల్లోకి... ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించేందుకు టీపీసీసీ ముఖ్యులంతా అక్కడే భారీస్థాయిలో ప్రచారపర్వం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్లో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సైతం కొన్ని నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి పూర్తి స్థాయిలో నార్త్ తెలంగాణ జిల్లాల్లపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే 30 బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రచార షెడ్యూల్పై కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభల్లో పాల్గొని అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిసింది. దక్షిణ తెలంగాణలోనూ పోటాపోటీయే... ఉత్తర తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణ తెలంగాణ నుంచే అధిక స్థానాలు గెలుపొంది ప్రతిపక్షం హోదాను దక్కించుకోగలిగింది. ముందునుంచి కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి ప్రాంతాలు ఆయువుపట్టుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, ఈసారి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు ఢీ అండే ఢీ అనే స్థాయిలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సగం అభ్యర్థులు మాజీమంత్రులే. నియోజకవర్గాల్లోనే ఉంటున్నందున కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన సీట్ల కంటే రెండింతలు సాధిస్తామని కాంగ్రెస్ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ► కాంగ్రెస్పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఉత్తర తెలంగాణ జిల్లా అయిన ఖమ్మంలోని మధిర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు, మధిర, ఖమ్మం, ఇల్లెందు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపుపొందింది. అయితే, పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి మృతితో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 10 సీట్లలో ఈసారి కాంగ్రెస్ తన సిట్టింగ్ సీట్లతో పాటు కూటమి తరఫున సా«ధ్యమైనన్ని ఎక్కువస్థానాలు గెలిచేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ► ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల తప్పా మరే స్థానాన్నీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. జిల్లాలోని 13 స్థానాల్లో ఈసారి కనీసం సగం స్థానాలనైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ముథోల్ స్థానం మిన హాయించి ఏ స్థానంలోనూ గెలవలేకపోయింది. ముథోల్ నుంచి గెలిచిన విఠల్రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే, ఈ సారి జిల్లాల్లోని 10 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక డోర్నకల్ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నర్సంపేట్ నుంచి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి గెలిచారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ కాంగ్రెస్లో చేరడం మళ్లీ పరకాల నుంచి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ తన స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. –సాక్షి, హైదరాబాద్ -
పల్లె మెరవాలె
సాక్షి, హైదరాబాద్: పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన పల్లెల కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సూచిం చారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలనూ గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు నర్సింగ్రావు, శాంత కుమారి, పీకే ఝా, వికాస్రాజ్, నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, భూపాల్రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నెల రోజులపాటు చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలను, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు సీఎం చేసిన సూచనలివీ.. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుపడిన బావులను పూడ్చేయాలి. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. హా గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. పిచ్చిమొక్కలను, సర్కారు తుమ్మలను, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి. హా గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి. పచ్చదనం పెంచేందుకు చేసిన సూచనలివీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పు న మొత్తం 12,751 నర్సరీలను ఏర్పాటు చేయాలి గ్రామంలోని రైతులతో, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని దానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. రైతులు పొలం గట్ల మీద, బావుల వద్ద మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలోనూ మొక్కలు పెంచాలి. అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులకు లేఖలు రాయాలి. ప్రత్యేకాధికారులు సేకరించాల్సిన వివరాలు గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి? గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? గ్రామంలో శ్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలాన్ని సేకరించాలి గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఏర్పాటు చేయాలి. గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఎలా ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి. పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి? -
అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం
సాక్షి, వికారాబాద్: అక్రమ మైనింగ్కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శనివారం ఆయన జిల్లా అధికారులతో మైనింగ్, మినరల్స్, హరితహారం తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తదితరాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నవాబుపేట, ధారూరు, యాలాల, బషీరాబాద్, పరిగి తదితర మండలాల్లో ఇసుక, ఇతర మైనింగ్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. అక్రమార్కులతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయని మంత్రి చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణా విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించరాదని సూచించారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్తో పర్యావరణ సమత్యులం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిట్ల గడువు పూర్తయినా ఇంకా కొందరు అక్రమంగా గనులను తవ్వడం, ఒకచోట పర్మిట్లు తీసుకొని మరోచోట తవ్వకాలు చేపట్టడం వంటివి చేస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్మిట్ తీసుకున్న విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలను నిర్వస్తున్న వారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో గనుల ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని నాణ్యతా ప్రమాణాలతో బాగు చేయాలంటే రూ.35 కోట్లు అవసరమవుతాయన్నారు. జిల్లాలో మైనింగ్పై ఏటా ప్రభుత్వానికి రూ.47.81 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో మైనింగ్ ప్రభావిత గ్రామాలకు 30 శాతంమేర నిధులను అందించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో చెక్పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో రెండేసి చొప్పున ఆరు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను అందించాలని సూచించారు. జిల్లాలో 125 మైనింగ్ లైసెన్సులు రెన్యూవల్ దశలో ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. మైనింగ్ నిధులతో జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలంలో రూ.2.5 కోట్ల వ్యయంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి మహేందర్రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వానికి వచ్చే మైనింగ్ ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న బయో మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయన్నారు. వీటి స్థానంలో సాధారణ మరుగొదొడ్లను నిర్మించేందుకు అనుమతించాలని సూచించారు. కలెక్టర్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. మైనింగ్కు సంబంధించి ఇప్పటికే 40 ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు జీపీఎస్తో అనుసంధానం చేశామని తెలిపారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు సంజీవరావు, రామ్మోహన్రెడ్డి, కాలె యాదయ్య, జేసీ అరుణకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘సింహం కడుపున సింహమే పుట్టింది’
తండ్రికి తమ్ముడిగా, అన్న హరికృష్ణకు కొడుకుగా నటించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో బాలకృష్ణ నటనను చూసి ‘సింహం కడుపున సింహమే పుట్టింది’ అని ఏఎన్నార్ అన్నారట. అవును నిజమే సింహం పేరు వింటే మనకు గుర్తొచ్చేది నందమూరి నటసింహమే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా ఇలా ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలతో తన నట విశ్వరూపాన్ని చూపారు. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలనటుడిగా తండ్రి ఆధ్వర్యంలోనే నటిస్తూ, నటనలోని మెలుకువలు తెలుసుకున్నారు బాలకృష్ణ. నందమూరి వంశాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ నిలబెడితే, ఇంతవరకు ఆ పేరును కాపాడుకుంటూ వచ్చారు బాలకృష్ణ. 1974లో తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పటి వరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఈ శతాధిక నటుడు తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసి విజయాన్ని అందుకున్నారు. జానపదం, ఫ్యాక్షన్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని జానర్స్లో సినిమాలు తీసి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య. వారసత్వ హీరోగా వచ్చినా.. అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. సగటు ప్రేక్షకుడు కూడా ఇష్టపడేది బాలయ్య డైలాగ్స్. ఇక బాలయ్య డైలాగ్లు చెపుతూ ఉంటే అభిమానులకైతే పూనకాలే. బాలయ్య మార్క్ డైలాగ్లకు బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. నేటి తరంలో పౌరాణిక పాత్రలు వేయాలంటే ఒక్క బాలయ్య బాబు మాత్రమే వేయగలరు, చేయగలరు అనేంతలా అలరించారు. అభిమన్యుడు, పాండురంగడు, నారదుడు, సిద్ద, కృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణ దేవరాయలు, రాముడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు. బాలయ్య హీరోగా తన కెరీర్ను 1984లో ‘సాహసమే జీవితం’ అంటూ మొదలుపెట్టగా, ‘మంగమ్మగారి మనవడు’గా తిరుగులేని హిట్ కొట్టారు. బాలయ్య కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే చిత్రాలు. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహానాయడు’ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులకు దారిని చూపాయి. ‘సింహా’, ‘లెజెండ్’ సినినిమాలతో తన నటవిశ్వరూపాన్ని చూపారు. బాలయ్య కోసమే కొన్ని డైలాగ్లు పుట్టాయా అన్నట్లు ఉంటుంది. వాటిని ఆయన చెబితేనే అందం. వాటి కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు కోకొల్లలు. బాలయ్య సినిమా వస్తోందంటే బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలీవరిలో సంభాషణలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందే. మళ్లీ బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారు. నటసార్వభౌముడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో బాలయ్య దాదాపు అరవై పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, విశ్వామిత్రుడిగా, రావణాసురునిగా ఇలా ఎన్టీఆర్ చేసిన గొప్ప పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. సో.. ఈ పాత్రల్లో బాలయ్య మరోసారి తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకోబోతున్నారు. మరిన్ని విజయాలు రావాలని, ఇంకా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తూ... నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
సెటిలర్ల నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సెటిలర్లు, అందులోనూ ఏపీకి చెందిన ఓటర్లకు ఎలా దగ్గర కావాలన్న అంశంపై ప్రత్యేక కసరత్తు చేస్తోంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న దాదాపు 30 నియోజకవర్గాలపై టీపీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ఆరేడు సీట్లలో సెటిలర్లనే రంగంలోకి దింపాలని యోచిస్తోంది. మిగతా చోట్ల కూడా సెటిలర్లలో సానుకూలత ఉన్నవారిని, వారి సామాజిక వర్గాలకు చెందినవారిని ఎన్నికల గోదాలోకి దింపి ప్రయోజనం పొందేందుకు వ్యూహం రచిస్తోంది ఇందులో భాగంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి ఆంధ్ర ప్రాంతం వారిని నిలబెట్టాలని యోచిస్తోంది. సెటిలర్ల ఓట్లు ఎక్కువున్న ప్రాంతాల నుంచి మాజీ స్పీకర్ (ఉమ్మడి ఏపీ) నాదెండ్ల మనోహర్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వంటి వారిని రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదిలాబాద్ టు కోదాడ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 స్థానాల్లో సెటిలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న (రంగారెడ్డి, మెదక్లతో కలిపి) 10 నియోజక వర్గాలకుతోడు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్నారని, వారి ఓట్లను కొల్లగొడితేనే అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు దక్కుతాయని భావిస్తోంది. గత ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సరైన ప్రదర్శన కనబర్చకలేకపోయిందన్న నిర్ధారణకు వచ్చిన టీపీసీసీ నాయకత్వం... ఈసారి కనీసం 15 స్థానాలకంటే ఎక్కువగా గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే సిర్పూర్, చెన్నూరు (ఆదిలాబాద్), బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ రూరల్ (నిజామాబాద్), ములుగు (వరంగల్), కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర, పాలేరు, ఖమ్మం (ఖమ్మం), అలంపూర్, గద్వాల, మక్తల్ (మహబూబ్నగర్), పఠాన్చెరు, సంగారెడ్డి (మెదక్), కోదాడ, సూర్యాపేట (నల్లగొండ), కూకట్పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి (హైదరాబాద్, రంగారెడ్డి) స్థానాలను ఎంచుకుని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అస్త్రాలు రెడీనా? సెటిలర్లకు దగ్గరవడంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తోపాటు ఇతర ముఖ్య నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. గత ఎన్నికలలో గెలవని ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకోవాలని, ఇందులో సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలే కీలకమన్న అభిప్రాయానికి వచ్చారు. సెటిలర్లకు, ముఖ్యంగా ఏపీ సెటిలర్లలో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదనే భావన ఆ వర్గాల్లో ఉందన్న అంచనాకు వచ్చారు. ఖమ్మం పట్టణంలో జరిగిన కమ్మ సామాజికవర్గ సమావేశంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగిందని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఓ నేత ప్రస్తావించారు. తుమ్మలతో వెళ్లి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంట నడిచినా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావన ఆ సమావేశంలో వ్యక్తమైనట్లు సదరు నేత చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక సెటిలర్లకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ప్రచారాస్త్రంగా ‘హోదా’ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీఆర్ఎస్ సభ్యులు లోక్సభలో వ్యవహరించిన తీరును కూడా ప్రధానాస్త్రంగా ఎంచుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చి తాము కూడా నోటీసు ఇచ్చామని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగిన పోరాటంలో రాహుల్గాంధీ ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపారన్న అంశాలతోపాటు టీఆర్ఎస్ కావాలనే అవిశ్వాసాన్ని అడ్డుకుందన్న అంశాన్ని సెటిలర్లకు వివరించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెటిలర్లలో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోవాలని, ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై పీసీసీ ముఖ్యుడొకరు మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. ఇతర పార్టీల నుంచి గెలిచిన కొందరు ఆంధ్రా ప్రాంత నేతలను పార్టీలోకి తీసుకున్నారు కానీ వారికి ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తెలంగాణ ఇవ్వాల్సిందే అని నినదించిన సంఘాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట మాట్లాడకుండా కనీసం అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకున్నారు. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. సెటిలర్లకు స్పష్టమైన హామీ ఇచ్చి వారిని ఆకట్టుకునేలా మా మేనిఫెస్టో రూపొందిస్తున్నాం’’అని చెప్పారు. ఎక్కడ్నుంచి ఎవరెవరు..? అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. సెటిలర్ల నియోజకవర్గాల్లో ప్రభావం చూపే సామాజిక వర్గాలకు చెందిన నేతలను అభ్యర్థులుగా బరిలో నిలపాలని నిర్ణయించింది. టీపీసీసీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కూకట్పల్లి అసెంబ్లీ స్థానం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంలో అప్పటి స్పీకర్గా మనోహర్ పోషించిన పాత్రతో పాటు ఆయన కుటుంబం హైదరాబాద్లోనే స్థిరపడిందన్న కోణంలో ఆయనకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో మనోహర్ సామాజికవర్గం ఓట్లు కూడా ఆయన గెలుపునకు సహకరిస్తాయని యోచిస్తోంది. అలాగే మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని, తమ పార్టీలోకి వస్తే ఖమ్మం లోక్సభ స్థానానికి నామా నాగేశ్వరరావును నిలబెట్టాలనే చర్చ జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకువచ్చి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ లేదా నిజామాబాద్ పార్లమెంట్కు పోటీ చేయించాలని యోచిస్తోంది. మొత్తంగా సామాజిక వర్గాల కూర్పు, సెంటిమెంట్లను ఆసరాగా చేసుకుని సెటిలర్లు ఎక్కువున్న నియోజకవర్గాల్లో గెలుపు తీరాన్ని చేరాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. -
రిమ్స్పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్: రిమ్స్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ‘కలెక్టరమ్మ.. రిమ్స్ను చూడమ్మ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. ఆస్పత్రిలో సమస్యలు, కేసుల రెఫర్, వైద్యుల పోస్టుల ఖాళీ, ప్రైవేటు వైద్యంపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దాస్పత్రి రిమ్స్ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మూడు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించి రోగుల బాగోగులు, వైద్య సేవలపై ఆరా తీశారు. పరిశీలన సాగిందిలా.. కలెక్టర్ దివ్యదేవరాజన్ ముందుగా రిమ్స్ వైద్య కళాశాలలో అధికారులతో సమావేశమై గంటపాటు గంటపాటు ఆస్పత్రి పరిస్థితులపై చర్చించారు. పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు, కాంట్రాక్టు టెండర్ల నిర్వహణపై చర్చ సాగింది. అనంతరం రిమ్స్ అత్యవసర విభాగం, రక్త పరీక్షల కేంద్రాలను పరిశీలించారు. రక్త పరీక్షలు యంత్రాల ద్వారా చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్బ్యాంకుకు వెళ్లి బ్లడ్స్టోరేజీని పరిశీలించారు. ఐసీయూలో రోగులతో మాట్లాడారు. సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ట్రామాకేర్ యూనిట్ని సందర్శించి అక్కడ ఏయే రోగులకు చికిత్స అందిస్తున్నారో తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి డాక్టర్ కళ్యాణ్రెడ్డిని స్కానింగ్ పరీక్షల వివరాలు అడిగారు. ఏయే సమయంలో ఎక్స్రే, స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారు. మెటర్నిటీ వార్డులో(ప్రసూతివార్డు) బాలింతలతో మాట్లాడారు. అప్పుడే పుట్టిన పసికందులను చూసి వారి తల్లిబిడ్డ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ వార్డు, మేల్మెడికల్ వార్డు, కంటి విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గిరిజనుల రక్తహీనతపై చలించిన కలెక్టర్.. మహిళల వార్డులో పర్యటించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన మహిళల రక్తహీనతపై చలించిపోయారు. ఓ మహిళకు 2.5 గ్రామాలు రక్తం ఉందని సిబ్బంది చెప్పడంతో కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా 7 గ్రాముల రక్తం ఉంటేనే ఆరోగ్యం దెబ్బతింటుంది.. అలాంటిది ఇంత తక్కువ రక్తం ఉండడమేంటని అడిగారు. ఆమెతోపాటు ఆ వార్డులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థిని సైతం రక్తహీనతతో బాధపడుతుండగా ఆమెను కలెక్టర్ పలుకరించారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రక్తహీనతతో వస్తుంటారని రిమ్స్ వైద్యులు కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు రక్తం అందుబాటులో ఉంచాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రిమ్స్లో తనిఖీలు చేస్తుండగా రాంనగర్కు చెందిన చంద్రారెడ్డి అనే వృద్ధుడు తనకు పింఛన్ కోసం వైద్యుడి సంతకం కోసం నాలుగు రోజులుగా రిమ్స్లో తిరుగుతున్నానంటూ కలెక్టర్కు విన్నవించగా, వెంటనే స్పందించిన కలెక్టర్ పింఛన్ కోసం ఎంపీడీవోను కలువాలని తెలిపి, వృద్ధుడి పూర్తి వివరాలు నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు తెలుపాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. ప్రైవేటు వైద్యంపై విచారణ రిమ్స్ వార్డులో పరిశీలన అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్ మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశ వివరాలు తెలియజేశారు. రిమ్స్లో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందితో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రిమ్స్కు మన జిల్లానే కాకుండా మహారాష్ట్ర నుంచి రోగులు వస్తున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. రిమ్స్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్లు నడుపుతుండడంపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. త్వరలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కాంట్రాక్టు కోసం టెండర్లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో పారిశుధ్యం, వైద్య పరికరాలు, వైద్యుల పోస్టుల భర్తీ, కార్మికుల సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఔట్సోరి్సంగ్ టెండర్ కోసం ఎంపిక కమిటీతో మరోసారి చర్చించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజీవ్రాజ్, రిమ్స్ ఇచార్జి డైరెక్టర్ అశోక్, వైద్యులు ఉన్నారు. -
టెన్త్ విద్యార్థులపై దృష్టి పెట్టండి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇప్పటినుంచే విద్యాబోధనలో మార్పులు రావాలి.. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.. ప్రత్యేక ప్రణాళికలు రచించి వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) విజయలక్ష్మీబాయి ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆర్జేడీ జడ్చర్ల జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, నక్కలబండ ప్రాథమిక, జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట పాఠశాలలను సందర్శించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలోని వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, విద్యాబోధన, ఉపాధ్యాయుల సమయపాలన, ఇబ్బందులు, తదితర అంశాలను డీఈఓ సోమిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డీఈఓగా పనిచేసిన ఆమె ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా జిల్లా పర్యటనకు రావడంతో ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో సెక్షన్ అధికారులు వెంకటేశ్వర్గౌడ్, విజయభాస్కర్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హాజరుశాతంపై ఆరా అనంతరం షాసాబ్గుట్ట పాఠశాలను ఆర్జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల వారీగా సబ్జెక్టుపై బోధిస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసి విద్యార్థుల హాజరుశాతంపై ఆరా తీశారు. ఫలితాలు మెరుగ్గా రావాలి జడ్చర్ల టౌన్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావాలని ఆర్జేడీ విజయలక్ష్మీ ఆదేశించారు. శనివారం జడ్చర్ల జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు వేశారని హెచ్ఎంలు రాజేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి నక్కలబండతండా ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచికరంగా ఉండాలని సూచించారు. అధికారి వెంట ఎంఈఓ మంజులాదేవి ఉన్నారు. -
అదిగో యాదాద్రి..
-
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివి జన్ల వారీగా ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు అనే వివరాలు సేకరించారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు తోడు మరో 13 వాహనాలను సమకూర్చిందని వాటిని ఎవరు మోనిటర్ చేస్తున్నారని, వాహనాలు వచ్చిన తర్వాత ప్రమాదాలను ఎంత మేరకు తగ్గించారని అడిగి తెలుసుకున్నారు. ఆయా వివరాలను డీఐజీ, ఎస్పీ గణాంకాలతో వివరించారు. -
పోలవరం ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేసి సాగు, తాగు జలాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో గురువారం జరిగిన 68వ భారత గణతంత్ర దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రూ.1,400 కోట్లతో పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి.. రూ.660 కోట్ల విలువైన పనులు పూర్తిచేశామని కలెక్టర్ చెప్పారు. యనమదుర్రు, ఎర్రకాలువ ఆధునికీకరణ, పోగొండ రిజర్వాయర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నీరు–చెట్టు పథకం కింద రూ.62 కోట్లతో 480 చిన్నతరహా నీటి వనరుల్లో 171 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు చేశామన్నారు. సాగులో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించి రూ.73 కోట్ల విలువైన యంత్రాలను 31 వేల మంది రైతులకు అందించామని వివరించారు. ఈ ఏడాది 4 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్లను పంట రుణాలుగా అందిస్తున్నామన్నారు. 5 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల రుణమాఫీ చేశామని, 75 వేల మంది కౌలు రైతులకు రూ.22 కోట్లు పంట రుణాలుగా అందించామని తెలిపారు. రైతు కూలీల వలసలు నివారించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం కింద 2.78 లక్షల కుటుంబాలకు చెందిన 4.40 లక్షల మంది కూలీలకు 108 లక్షల పనిదినాలు కల్పించి రూ.152 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జలసిరి పథకం కింద 1,500 వ్యవసాయ బోర్లు తవ్వి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని, వీటిలో 317 బోర్లకు సోలార్ విద్యుత్ పంప్ సెట్లు అమరుస్తున్నామని వివరించారు. జిల్లాలోని 47 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.1,027 కోట్ల రుణాలను అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రూ.149కే టెలిఫోన్, ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు అందించే దిశగా చేపట్టిన ఫైబర్గ్రిడ్ పనులు పూర్తికావచ్చాయని చెప్పారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 1.81 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను, వివిధ జాతీయ పథకాల నిధులు రూ.146 కోట్లతో సురక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నామని వివరించారు. గృహనిర్మాణ పథకం కింద 18,504 గృహాలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస యోజన కింద 5,296 గృహాలు, ప్రధానమంత్రి పట్టణ ఆవాస యోజన కింద ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లుల్లో 1,910 గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పంట భూములను వినియోగించకుండా 16 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేసి, వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వనం–మనం కార్యక్రమం కింద 93 లక్షల మొక్కలు నాటి వాటిని జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఈ ఏడాది మరో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ.344 కోట్లతో 82 పనులు చేపట్టామని, జిల్లాలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా రూ.9.50 కోట్లతో ఇండోర్ స్టేడియంలు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్ల అంచనా వ్యయంతో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. కార్యక్రమంలో డీఐజీ పి.రామకృష్ణ, ఎస్పీ భాస్కర్భూషణ్, జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, ఏఎస్పీ కె.రత్న, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డీఆర్ఓ కే.హైమావతి, ఆర్డీఓ నంబూరి తేజ్భరత్ పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి
నల్లగొండ : నగదు రహిత లావాదేవీలపై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకుపోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. నగదు రహిత కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముందుగా గుర్తించిన 11 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతూనే మిగతా గ్రామాల్లో ఆచరణయోగ్యంగా నగదు రహిత అవగాహన కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఎంపిక చేసిన 11 గ్రామా లు ఏడు మండలాల్లో ఉన్నాయని, మిగతా 24 మండలాలల్లోనూ ఒక్కొక్క గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. శుక్రవారం నుంచి గ్రామ కమిటీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే నివేదిక ప్రకారంగా అకౌంటు లేని వారికి ఓపెన్ చేస్తామన్నారు. పూర్తి నగదు రహితంగా ఎంపి క చేసిన గ్రామాల్లో చౌకధరల దుకాణం, చిన్న చిన్న వ్యాపారులకు పాస్మిషన్లు, పేటీఎంలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ 48 గ్రామాలను ఎంపిక చేశామని, మండల ప్రత్యేకాధికారులు, శాఖ సంయుక్తంగా అవగాహన, సర్వే పనులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒక్కొక్కగ్రామానికి ఎస్ఐ, సీఐను కేటాయించడంతో పాటుగా నగదు రహిత లావాదేవీలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని వారిపై జరిమానా చెల్లింపు కోసం మూడు సబ్ డివిజన్లకు మూడు పాస్ మిషన్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు అధికారి సూర్యం, డీఆర్ఓ కీమ్యానాయక్, డీఆర్డీఓ అంజయ్య, పాల్గొన్నారు. -
యాదాద్రి అభివృద్ధిపై కేసీఆర్ దృష్టి
-
విద్యార్థుల అభ్యసన తీరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
చివ్వెంల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన తీరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దష్టి సారించాలని స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యుడు యానాల వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు కుడకుడ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుట, రాయుట, బొమ్మల గీసే విధంగా ప్రాథమిక స్థాయి నుంచే తీర్చిదిద్దాలని కోరారు. ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్తుల సహకరంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తిగా వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. హరితహరంలో భాగంగా పాఠశాలల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు చింతమళ్ల వెంకటి, బొప్పని శ్రీనివాస్, కటకొండ రామయ్య, చంద్రయ్య, విమల, తదితరుల పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి
బీబీనగర్: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న ప్రజల సంఖ్యను, పలు విభాగాల్లోని వైద్య పరికరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో వాట ర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మాసీ పరీవాహక ప్రాంతం కావడంతో నిమ్స్లో చర్యవాధ్యులకు సంబంధించిన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్కు వచ్చి వెళ్లే వారి కోసం జాతీయ రహదారిపై బస్షెల్టర్ను ఏర్పాటు చేసి ఇక్కడ స్టాప్ ఉండేలా ఆర్టీసీ అధికారులతో చర్చించామని త్వర లో ఆ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఓపీ కార్డు తీసుకుని.. ఇటీవల మిషన్ భగీరథ ప్రారంభ పనుల్లో పాల్గొన్నప్పుడు ఎడమ కాలు బెనకడంతో నొప్పిగా ఉందంటూ మంత్రి నిమ్స్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వైద్యుడితో చికిత్స చేయించుకున్నారు. 50 రూపాయలు చెల్లించి తన పేరుపై ఓపీ కార్డును తీసుకొని డాక్టర్ రాసి ఇచ్చిన మందులను కొనుగోలు చేశారు. పీహెచ్సీ వైద్యులను మందలించిన మంత్రి బీబీనగర్ పీహెచ్సీ వైద్యులు సమయపాలన పాటించడం లేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్ వద్దే ఉన్న పీహెచ్సీ వైద్యాధికారులను పిలిచి మందలించారు. సమయపాలన పాటించకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్గౌడ్, బొక్క జైపాల్రెడ్డి, చెంగళ వెంకటకిషన్, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, జెడ్పీటీసీ బస్వయ్య, ఉప సర్పంచ్ అక్బర్, సింగిల్విండో చైర్మన్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియమైన ముఖ్యమంత్రి గారికి...
‘‘మేము, అనగా నల్లగొండ జిల్లా వాసులం.. మీకు ప్రేమతో రాస్తున్న కష్టాల లేఖ ఇది. జిల్లాలో ఉన్న 35లక్షల మంది ప్రజల పక్షాన మీకు మా సమస్యలను తెలియజేసుకుంటున్నాం. పోరాడి సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాము. మీతో పాటు మా జిల్లా మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మా జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. మానవాభివృద్ధి సూచిలో మా జిల్లా తెలంగాణలోని 10 జిల్లాల్లో 8వస్థానంలో ఉందంటే మా అభివృద్ధి ఏపాటిదో మీకు అర్థమవుతుంది. అయ్యా.. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మా సమస్యలను తెలియజేయాలని భావించి ఈ లేఖ రాస్తున్నాం.’’ సాగునీరు అందించాలి ఇక సాగునీటి విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్లో మా జిల్లా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు మీకు కృతజ్ఞులం. అయితే డిండి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇంతవరకు ఖరారు కాలేదు. ఈ బడ్జెట్లో రూ.650 కోట్ల మేర నిధులు పెట్టినా పాలమూరు నేతల పంచాయతీతో అది పెండిం గ్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు వరప్రదాయినిగా మీరు ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీలున్నంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. ప్రాణహిత-చేవెళ్ల, చొక్కారావు దేవాదులు, శ్రీరాంసాగర్ రెండో దశ లాంటి పథకాలను కూడా త్వరగా పూర్తి చేసేలా నిధులిప్పించాలని కోరుతున్నాం. మా సమస్యలివే సార్... తాగునీటి సమస్య తీవ్రతరం జిల్లాలో ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 1,176 గ్రామపంచాయతీల పరిధిలో 3,300 ఆవాసాలుండగా, అందులో 300 ఆవాసాలకు ఇంతవరకు మంచినీరు లేదు. వీటికి తోడు కరువుతో జిల్లా ప్రజానీకం అల్లాడుతోంది. పెద్ద ఎత్తున నిధులు సమకూరిస్తే కానీ రానున్న వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి లేదు. నాన్కంటింజెన్సీ రిలీఫ్ ఫండ్ కింద రావాల్సిన రూ.60 కోట్లను ఇప్పించాలని కోరుతున్నాం. నీటి సమస్య తీరాలంటే సాగర్ ఎడమ కాల్వకు తాగునీటి కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం. చేనేతకు చేయూతనివ్వాలి జిల్లాలో మొత్తం 70 చేనేత, జౌళి సంఘాల్లో 22వేల మంది కార్మికులున్నారు. ఇందులో ఏడాది కాలంలో 26 సంఘాలు మూతపడ్డాయి. దాదాపు 10 వేల మంది ఇతర రంగాలకు వలస వెళుతున్నారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలకు మూడు నెలలుగా బిల్లుల్లేవు. చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాలో 3లక్షల ఎకరాల్లో బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. బత్తాయి తోటలు సాగు చేసే రైతాంగానికి సరైన మార్కెటింగ్ కోసం మార్కెట్యార్డు ఏర్పాటు చేయాలి. 9గంటల కరెంట్ హామీ నెరవేర్చాలి జిల్లాలో 3.44లక్షల వ్యవసాయ బావులున్నాయి. వీటికి 9 గంటల పగటి విద్యుత్ను సరఫరా చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఏప్రిల్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీ నెరవేర్చుకుంటామని మా జిల్లా మంత్రి, రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలి. అదే విధంగా జిల్లాలో దాదాపు 5లక్షల మంది రైతులు పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణలో మా జిల్లాకు అత్యధికంగా 1100 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ కింద ఇప్పటికే రెండు దఫాల్లో ఇచ్చారు. అది 50 శాతం మొత్తానికే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేసి వచ్చే ఖరీఫ్ నాటికయినా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. సరిపడా లేని అగ్నిమాపక కేంద్రాలు జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నల్లగొండ రామన్నపేటల్లో 11 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటిలో నకిరేకల్కు సొంత భవనం లేదు. వీటితోపాటు చండూరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, రాజుపేటల్లో నూతన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. వీటిని కూడా త్వరగా నిర్మించాలని మనివి. హైవే ఆస్పత్రి ఏర్పాటు చేయూలి జిల్లా ప్రజలకు ఆధునిక వైద్యసేవలతోపాటు, హైవే భాదితులకు తక్షణ వైద్య సేవల కోసం నార్కట్పల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్టు మీరు 2014లో ప్రకటించారు. జిల్లాలో 65వ నంబరు జాతీయ రహదారి చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 160కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. హైవేపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారిపై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయించాలి. ఎంజీయూలో సమస్యల లొల్లి మా జిల్లా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. పలు అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. యూనివర్శిటీకి రూ.100 కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ఈ మొత్తాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నాం. పాలేరు జలాల హామీ నెరవేర్చాలి ఎన్నికల ముందు సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాలేరు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని సూర్యాపేట పట్టణానికి పాలేరు జలాలు అందిస్తానని మీరు హామీ ఇచ్చారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో నేరాలు పెరిగిపోతున్నాయి. టూ టౌన్ పోలీస్స్టేషన్ ఏర్పాటుచేస్తే నేరాలు అదుపులోకి తేవచ్చు.పట్టణంలో నాలా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. అలాగే అండర్గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మాణం కూడా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరి డివిజన్లో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికులు సుమారు 1000 మంది అన్ని అర్హతలు ఉండి కూడా జీవన భృతి పొందడం లేదు. వారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కడం లేదు. ఆసరా పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూపులు.. జిల్లాలో ప్రస్తుతం 4లక్షల మంది ఆసరా పథకం కింద పింఛన్లు పొందుతున్నారు.మొదటి వారంలో అందే పింఛన్ ఇప్పుడు మూడో వారానికి వెళ్లింది. బయోమెట్రిక్ వ్యవస్థతో వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి కూడా జరుగుతోంది. ప్రతినెలా మొదటి వారంలో పింఛన్లు వచ్చేలా చూడాలని మనవి. వలసలు, శిశు విక్రయూలను నివారించాలి దేవరకొండ నియోజకవర్గంలో వలసల కారణంగా పేదరికం పెరిగిపోతోంది. పనులు లేక పొట్టచేతబట్టుకుని చందంపేట మండలంలోని 60 శాతం గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇక్కడ పనులు కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ శిశు విక్రయాల దురాచారానికి అడ్డుకట్ట వేసేచర్యలు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలి. -
శంకుస్ధాపన ఖర్చు రూ 200 కోట్లు కాదు..
-
అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసుల ఫోకస్
విదేశాల నుంచి వచ్చే బంగారం, మత్తు పదార్థాలపై దృష్టి ప్రత్యేక బృందం ఏర్పాటు విమానాశ్రయంలో పట్టుబడుతున్న వారిపై లోతుగా ఆరా సూత్రధారులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నం సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా బంగారం, మత్తు పదార్థాలు తరలిస్తూ పట్టుబడుతుండటంతో ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోట్ల రూపాయల విలువ చేసే కేజీల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. అయితే వీటికి చాలా వరకు జరిమానా వేసి కస్టమ్స్ అధికారులు వదిలేస్తున్నారు. వీటిలో చాలా వరకు పాత్రధారులు మాత్రమే పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని వెనకున్న అసలు సూత్ర ధారులెవరనే విషయాన్ని కస్టమ్స్ అధికారులు తమ పరిధిలోకి రాదని పట్టించుకోవడం లేదు. ఇన్నాళ్లు వీటిపై పోలీసులు కూడా దృష్టి కేంద్రీకరించలేదు. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మూసియా మూసా (32) రూ.50 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకొస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులను నిగ్గుతేల్చితే బంగారం, డ్రగ్స్ సరఫరాను అరికట్టవచ్చని పోలీసులు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టీమ్ను కూడా ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి బంగారం, ఇతర మత్తు పదార్థాలు తీసుకొచ్చిన వెంటనే ఆ కేసు పూర్వాపరాలన్నీ కూడా కస్టమ్స్ అధికారుల నుంచి తీసుకొని పట్టుబడిన వ్యక్తులను కూడా తమ అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. వారి ద్వారా సూత్రధారులను పట్టుకోవాలని నిర్ణయించారు. కిలోల కొద్దీ బంగారం పట్టివేత.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజూ 20కి పైగా విదేశాల నుంచి విమాన సర్వీసులు నడస్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, సింగపూర్ల నుంచి వచ్చే వారు అత్యధికంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు సంబంధించి 125 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 127.67 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.31 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో చాలా వరకు జరిమానాలు విధించి వదిలేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 30 కేసులకు పైగా నమోదయ్యాయి. నిబంధనలతో కొంత తీసుకురావొచ్చు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం తీసుకరావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. భారతీయులు ఏడాదిపాటు విదేశాల్లో ఉండి వచ్చేటప్పుడు పురుషులు అయితే రూ.50 వేలు, మహిళలు రూ.లక్ష వరకు విలువ చేసే బంగారు ఆభరణాలు మాత్రమే ఎలాంటి సుంకం లేకుండా తెచ్చుకునే వీలుంది. ఒక కేజీ బంగారం తీసుకొస్తే అందులో 10.3 శాతం విలువ గల డబ్బును కస్టమ్స్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. అంతకుమించి ఎక్కువ తీసుకొస్తే 36 శాతం చెల్లించాలి. -
ఉద్యోగులపై ‘మూడో’ కన్ను
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నిఘా పెట్టింది. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ పరి పాలనలో ఒడిదుడుకులు ఇంకా అధిగమించలేదనే అభిప్రాయానికి వచ్చింది. ప్రధానంగా పాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఇటీవలే అన్ని విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం అంతర్గతంగా సర్వే చేయించింది. పలు కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అర్జీదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అక్కడి ఉద్యోగులు స్పంది స్తున్న తీరును రహస్యంగా తెలుసుకుంది. తమది ‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సందర్భం వచ్చినప్పుడల్లా పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే. కానీ.. ఈ సర్వేలో పలు ఆందోళనకర అంశాలు దృష్టికి రావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా విధి నిర్వహణలో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ విభాగాలతో పాటు సచివాలయం కేంద్రంగా అవినీతి వ్యవస్థీకృతమైందని సర్వేలో తేలింది. ఇరిగేషన్ విభాగంతో పాటు పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను బేరం పెట్టి దళారులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ దందాల్లో తెర వెనుక ఇక్కడి ఉద్యోగుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్లో ఏదీ నాటి స్ఫూర్తి ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఎక్కువ గంటలు పని చేస్తామని, ఎక్కువ శ్రమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వివిధ సంఘాలుగా ఏర్పడి ఒక్కతాటిపై నిలబడ్డారు. అదే స్ఫూర్తిని రగిలించేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడింది. అడిగిందల్లా కాదనకుండా.. తెలంగాణ ఇంక్రిమెంట్తోపాటు 43 శాతం ఫిట్మెంట్తో పదో పీఆర్సీ సిఫారసులను అమలు చేసింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించిన తరహాలోనే అదే ఆనవాయితీని ఉద్యోగులు కొనసాగిస్తున్నారని.. అర్జీలను పట్టించుకోవటం లేదని, మంత్రులు, ప్రముఖుల సిఫారసుల ఫైళ్లను మాత్రమే చకచకా కదిలిస్తూ మిగతా వాటిని పక్కన పడేస్తున్నారని గుర్తించింది. దీంతో కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు స్థానచలనం కల్పించటం ద్వారా ఈ రుగ్మతలను పారదోలవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన సిబ్బంది కొన్ని విభాగాల్లో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయారు. వీరిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాలని, సెక్రెటేరియట్లో పని చేస్తున్న ఉద్యోగులను అవసరమైతే జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ం ఉన్న సెక్రెటేరియట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడి ఉద్యోగులను జిల్లాలకు పంపించటం కుదరదు. అయితే వారిని జిల్లాలకు పంపేందుకు అవసరమైతే సర్వీస్ రూల్స్ను సరళీకృతం చేయాలని సీఎం ఉన్నతాధికారులను సూచించినట్లు తెలిసింది. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు.. అవినీతి రహిత పాలనతో పాటు పారదర్శకంగా వీలైనంత వేగంగా ప్రజలకు సేవలందించాలనేది బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. పది నెలల కిందటే అవినీతిని సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్ని విభాగాలకు సీఎం హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మొదటి వారంలోనే వేలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తటంతో వాటిని ఆయా విభాగాలకు పంపించటం తప్ప.. సీఎంవో కార్యాలయం వీటిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో అక్కడ ఫిర్యాదు చేసినా.. అంతే సంగతులనే ప్రచారం జరిగింది. ఫలితంగా కాల్సెంటర్కు వచ్చే రోజువారీ ఫిర్యాదుల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయికి పడిపోయింది. తాజా సర్వేతో అందిన సమాచారంతో ఇకపై అవినీతి ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, అధికారుల వేళలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరంభంలో స్వయంగా మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉద్యోగులు సమయపాలన పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. అదే తరహాలో ఉన్నతాధికారులు, మంత్రుల సారథ్యంలో అడపాదడపా తనిఖీలు కొనసాగించే ఆలోచనలు చేస్తోంది. -
తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ..
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): 2008లో ముంబైలో జరిగిన ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శిక్షణ పూర్తి చేసుకున్న 22వ బ్యాచ్ సెక్యూరిటీ గార్డుల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐజీ సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రసంగించారు. ముంబైపై దాడి అనంతరం ఓడరేవుల భద్రతపై శ్రద్ధ పెరిగిందన్నారు. చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచామన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలో కృష్ణపట్నం పోర్టు ప్రథమస్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. పోర్టు విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నం పోలీసుస్టేషన్కు ఆయుధాలు సమకూరుస్తామని ఐజీ సంజయ్ చెప్పారు. ఈ అంశంపై సీఎంతో చర్చిస్తున్నామన్నారు. దీని వల్ల పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చే నౌకలకు సాయుధ బలగాల భద్రత ఉంటుందన్నారు. సెక్యూరిటీ కేంద్రం ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేఎస్ఎస్పీఎల్లో యువత ఉపాధి కోసం కొత్త కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనబరచిన గార్డులకు జ్ఞాపికలు అందజేశారు. ఆల్రౌండర్గా నిలిచిన కే.రమేష్కు ఐజీ చేతుల మీదుగా షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
* ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రుల హాజరు * మీడియాకు అనుమతి నిరాకరణ * బెయిల్ గడువు ముగిసిన అనంతరం జైలుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు కానీయలేదు. కేవలం కెమెరాలను మాత్రమే కాసేపు అనుమతించి బయటకు పంపారు. ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్... పోలీస్ ఎస్కార్ట్ అనుసరించగా పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు భార్య గీత, కుమార్తెతో కలసి నిశ్చితార్థ వేదికకు చేరుకొని 10 గంటల వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిశ్చితార్థానికి హాజరైన అతిథులను పలకరిస్తూ గడిపారు. నిశ్చితార్థానికి హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ.. రేవంత్రెడ్డి దంపతులు, నిశ్చితార్థం జరుగుతున్న నైమిష, సత్యనారాయణరెడ్డిలతో ఆత్మీయంగా గడిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, బి.కె. పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, దానం నాగేందర్, విష్ణువర్ధన్రెడ్డి, బీజేపీ నేతలు కిషన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సినీనటి కవిత తదితరులు హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసిన రేవంత్... 3 గంటలకు తిరిగి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపిన రేవంత్రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బెయిల్ గడువు ఉండటంతో ఆలోపే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు. -
రేవంత్రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
'బాస్' పక్కన రేవంత్
హైదరాబాద్ : ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'బాస్' పక్కన కూర్చున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి తాత్కాలిక బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే వాళ్లిద్దరూ చిరునవ్వు నవ్వడమే తప్ప...పలకరించుకోలేదు. కాగా రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా ఆయనకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని సూచించింది. విచారణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయరాదని స్పష్టం చేసింది. దాంతో కోర్టు నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన అతిథులను పలకరించలేకపోయారు. మరోవైపు సివిల్ డ్రెస్లో ఏసీబీ అధికారులు నిఘా కొనసాగింది. రేవంత్ కదలికలపై వారు దృష్టి పెట్టారు. బెయిల్ మంజూరు చేస్తాం, కానీ రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన విషయం తెలిసందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థం గురువారం నిఘా నీడలో జరిగింది. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేవంత్ ఏకైక కూతురు నైమిశరెడ్డి నిశ్చితార్థం సత్యనారాయణరెడ్డితో జరిగింది. భీమవరానికి చెందిన వెంకట్రెడ్డి, లక్ష్మీపార్వతి కుమారుడు సత్యనారాయణ ఫారెన్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. రేవంత్ కూతురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. మరోవైపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కుమార్తెతో కలిసి... నేరుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నిఘా నీడలోకి వెళ్లింది. సివిల్ డ్రెస్లో ఏసీబీ అధికారులు రేవంత్ను పరిశీలించారు. బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నిశ్చితార్థం వేడుకలో నేతలెవరితోనూ మాట్లాడవద్దని రేవంత్ ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
-
‘తోటపల్లి’పై ప్రత్యేక దృష్టి
గరుగుబిల్లి :తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది ఖరీఫ్కు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపా రు. గురువారం ఆమె తోటపల్లి ప్రాజెక్టు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని చె ప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్ర భుత్వం పని చేస్తుందన్నారు. మరో వా రం రోజుల్లో నిర్వాసితులు, రైతులతో సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కాగా తోటపల్లి పాత రెగ్యులేటర్ను తొల గించకపోతే వరదలు వచ్చినప్పుడు ప్రా జెక్టుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ హెచ్. హనుమంతురావు మంత్రికి వివరించారు. దీనిపై స్పందిం చిన మంత్రి తక్షణమే ఆర్అండ్బీ అధికారులతో చర్చించి రెగ్యులేటర్ను తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పరిధిలోని పనులను పూర్తి చేయాలని చెప్పా రు. సకాలంలో పనులు పూర్తి చేయకపో తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మా జీ ఎమ్మెల్యే వీటీ జనార్ధన్ థాట్రాజ్, టీడీపీ నాయకులు డి. ధనుంజయరావు, మాజీ ఎంపీపీ ఎం. పురుషోత్తంనాయుడు, డి. లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మంత్రికి వినతుల వెల్లువ తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి సబ్ డివిజన్ కార్యాలయాన్ని తోటపల్లిలో ఏ ర్పాటు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ధనుంజయరావు మంత్రిని కోరా రు. పాలకొండ, రాజాంలో డివిజన్ కా ర్యాలయం ఉండడంతో నిత్యం ఇబ్బం దులు పడుతున్నారని వివరించారు. అలాగే హుద్హుద్ తుపానుకు సంబంధింంచిన నష్టపరిహరం ఇంతవరకు రాలేదని సంతోషపురం మాజీ సర్పంచ్ ఎ. గౌ రునాయుడు వినతిపత్రం అందజేశారు. నూతన తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సమీపంలోని ఏడు గ్రామాలకు కాలువలు ఏ ర్పాటు చేసి సాగునీరందించాలని నాగూ రు సర్పంచ్ మధుసూధనారావు కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. పేదల బాగుకోసమే చంద్రబాబు తపన...! పార్వతీపురం : పేదల బాగుకోసం ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపిస్తున్నారని మంత్రి మృణాళిని అన్నారు. గురువారం ఆమె పార్వతీపురం లోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో భూసేకరణ అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్ర బాగు కోసం జరుగుతుందన్నారు. ఇంకా రాష్ట్ర రాజధాని ని ర్మాణానికి పునాది రాయ వేయకుండానే అభివృద్ధిగిట్టనివాళ్లు చంద్రబాబు పని తీ రును తప్పుపడుతున్నారని ఆరోపించా రు. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ముఖ్యమంత్రి తోటపల్లి ప్రాజెక్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. -
అందరి దృష్టి ఆలేరు వైపు..
జానకీపురం నుంచి కందిగడ్డ తండాకు మారిన సీన్ పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఆలేరు ఘటన ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆలేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఐఎస్ఐ ఏజెంట్లు చనిపోయారన్న వార్త మంగళవారం జిల్లాలో హల్చల్ చేసింది. కొన్ని రోజులుగా వరుసగా జిల్లాలో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగిందని తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు మోత్కూరు మండలం జానకీపురం ఎన్కౌంటర్ గురించి ప్రజల్లో జరుగుతున్న చర్చ ఒక్కసారిగా ఆలేరువైపునకు మళ్లింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వికారుద్దీన్గ్యాంగ్ను హైదరాబాద్కు తీసుకువెళుతున్న పోలీసులు జిల్లాలోని ఆలేరు మండలం కందిగడ్డతండా వద్ద ఎన్కౌంటర్లో హతమార్చడం సంచలనాన్ని సృష్టించింది. ఎన్కౌంటర్ వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లాలో ఏ నోటా విన్నా ఈ మాటే వినిపించింది. గత ఆరురోజులుగా జిల్లా కాల్పుల చప్పుళ్లతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. పోలీసులది పైచేయి అయ్యిందా? ఆలేరు వద్ద కరుడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్తో పాటు మరో నలుగురిని కాల్చిచంపడంతో జిల్లాలో పోలీసులు పైచేయి సాధించారని, ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే చర్చ జరుగుతోంది. సూర్యాపేట హైటెక్బస్టాండ్లో సీఐ మొగిలయ్య బృందంపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపి దుండగులు దొరక్కుండా వెళ్లిపోవడం, ఆ తర్వాత తాపీగా రెండు రోజుల తర్వాత రోడ్డుమీద కు వచ్చి హల్చల్ చేస్తున్న దుండగులను మట్టుబెట్టడంలో పోలీసుల వ్యవహరించిన తీరు విమర్శల పాలు కావడం అందరికీ తెలిసిందే. జానకీపురం ఎన్కౌంటర్ జరిగిన రోజు మరో కానిస్టేబుల్, ఎస్ఐలు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం కూడా పోలీసులు చేజేతులా చేసుకుందేననే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో ఇంటా బయటా విమర్శల పాలవుతున్న పోలీసు యంత్రాంగం మంగళవారం జరిగిన ఘటనతో ఊపిరి పీల్చుకుంది. తీవ్రవాదులపై పోలీసులకు పైచేయి సాధించి పెట్టిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా మొత్తంమీద తీవ్రవాదులను హతమార్చడం పోలీసు వర్గాలకు ఊపిరినిచ్చిందనే చెప్పాలి. -
ఎమ్మెల్సీని గెలిపిస్తే వరంగల్పై కేంద్రం దృష్టి
హన్మకొండ : నల్లగొండ, వరంగల్,ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపేస్తే కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశముందని ఆ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్రావు అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాల యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమురళీధర్రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం ద్వారా ఈ పార్టీ నాయకులు కేంద్ర సా యాన్ని అడుగగలుగుతారన్నారు. రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో నిధులు విడుదల కావడం లేదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ద్వారా ఇలాంటి అవకాశాలు కోల్పోనున్నామన్నా రు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావు జాతీయ భావాలకు అంకితమై పని చేస్తారని, సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అన్నా రు. తెలంగాణను ఒక కుటుంబం హైజాక్ చేసిందన్నారు. ఇలాంటి వాటికి బీజేపీ దూరంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బీజేపీ సహించదన్నారు. ధన, భుజ బలంతో ప్రదర్శించాలని టీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. పట్ట భద్రులు దీన్ని ఎదుర్కోవాలని, బీజేపీ దీని కి నాయకత్వం వహిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నా ల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, ఒంటేరు జయపాల్, డాక్టర్ పి.విజ యచందర్రెడ్డి, నరహరి వేణుగోపాల్రెడ్డి, చింతాకుల సునీల్, రాంరెడ్డి, గాదె రాంబా బు, దశరథం, దుప్పటి భద్ర య్య, దిలీప్, కుమార్, లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు. -
పుష్కరాలు.. ఎమ్మెల్సీ ఎన్నికలు
నిడదవోలు/ఏలూరు/ : కొవ్వూరు/చాగల్లు :పుష్కరాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ లు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశిం చారు. నిడదవోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం వారితో భేటీ అయ్యారు. అధికారులను, విలేకరులను లోనికి అనుమతించలేదు. అందిన సమాచారం ప్రకా రం.. గతంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై తొలుత ముఖ్యమంత్రి ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను నియమిం చినట్టు తెలిసింది. నిడదవోలులో పాదయాత్ర, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆది వారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంత రం ముఖ్యమంత్రి ఇక్కడే బస చేశారు. సోమవారం ఉదయం 10.35 గంటలకు ప్రజాప్రతినిధులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. పుష్కరాలపై గంటకు పైగా సమీక్షించినట్టు భోగట్టా. ఉద యం 11.45 గంగలకు చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం వెళ్లారు. సమీక్ష సమావేశంలో ఎంపీ మాగం టి మురళీమోహన్, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, గన్ని వీరాం జనేయులు, జి.బుచ్చియ్యచౌదరి, ఎమ్మెల్సీలు కలి దిండి రవివర్మ, చైతన్యరాజు, అంగర రామ్మెహన్, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి పాల్గొన్నారు. చప్పగా సాగిన రెండో రోజు పర్యటన ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన పర్యటన చప్పగా సాగింది. తొలిరోజు పర్యటనలో నిడదవోలు నియోజకవర్గంలో హామీలు గుప్పించిన సీఎం రెండో రోజు ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి తమ గ్రామాల అభివృద్ధికి నిధులిస్తారని, వరాలు కురిపిస్తారని ఆశపడిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు నిరాశే మిగిలింది. రెండోరోజు పర్యటన కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమైంది. మురుగుదొడ్లు లేనోళ్లు మనుషులే కాదు మరుగుదొడ్లు లేనివాళ్లు మనుషులే కాదని.. వాటిని కట్టుకోకపోతే మనుషులకు, జంతువులకు తేడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యా ఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి కారులో బ్రాహ్మణగూడెం చేరుకున్న ఆయన పంచాయతీ కార్యాలయం సమీపంలో గారపాటి రామారావు అందించిన రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మొయిన్ రోడ్డులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో ఇంకా 30 మందికి మరుగుదొడ్లు లేవని, నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సీఎం సూచించారు. పల్లెల్ని స్మార్ట్ విలేజ్గా మార్చడానికి ఎన్ఆర్ఐలు, ధనవంతులు కొంతమేర నిధులు వెచ్చించాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగులో ఆధునిక పద్ధతులు తీసుకొస్తామన్నారు. గ్రామానికి చెందిన దాపర్తి సత్యనారాయణ మనుమడు విహాన్బాలు రూ.25 వేలను రాజధాని నిర్మాణం కోసం అందజేశారు. ఎస్.ముప్పవరంలో స్ధానికులు కొందరు ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డువెళ్లి ఊర చెరువు కొందరు వ్యక్తుల చేతుల్లో ఉందని, దాన్ని పంచాయతీకి అప్పగించి ఆదాయ వనరుగా మార్చాలని కోరారు. గ్రామానికి చెందిన సత్యసాయి సమితి ప్రతినిధి గారపాటి కృష్ణమూర్తి చెరువు అభివృద్ధికి రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. అనంతరం చాగల్లు చేరుకున్న చంద్రబాబు ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో నాలుగు వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించిన నాదెండ్ల శ్రీరామ్చౌదరిని అభినందించారు. రాజధాని నిర్మాణానికి వేములపల్లి హ ర్షిణి తాను సొమ్ము దాచుకున్న డిబ్బీని చంద్రబాబుకి అందజేసింది. అనంతరం ఊనగట్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విజయవాడ వెళ్లారు. ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవ నాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మొడియం శ్రీనివాస్, వేటుకూరి శివ, కలెక్టర్ కె.భాస్కర్, పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, చాగల్లు జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, ఆళ్ల హరిబాబు, గారపాటి కాశీవిశ్వనాథం, సూరపనేని చిన్ని, ఎంపీపీ కోడూరి రమామణి, గారపాటి శ్రీదేవి, దుద్దుపూడి రాజారమేష్, నందిగం శ్రీను పాల్గొన్నారు. -
పాలన గాడిలో పడేనా..?
భద్రాచలం టౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పాలనా విభాగాలపై నూతన ఈఓ కూరాకుల జ్యోతి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా అన్ని విభాగాల్లో నెలకొన్న వివాదాలు, ఆలయ అధికారుల నిర్లక్ష్యం తదితర సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ మూడు రోజులుగా ఆయా విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బకాయిదారులపై కఠిన వైఖరి.... ఆలయ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా రాముడి ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు దేవస్థానానికి బకాయిలు ఉన్న వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. విస్తా కాంప్లెక్స్, కొబ్చరి కాయలు దుకాణాలు, కొబ్బరి చిప్పలు, కళ్యాణకట్ట, ఫొటోగ్రాఫర్స్ వద్ద నుంచి మూడు సంవత్సరాలుగా సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఈ మేరకు ఆమె సోమవారం వారందరిని పిలిచి తక్షణమే ఆ బకాయిలను చెల్లించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు వారిపై కఠిన వైఖరి అనుసరిస్తూనే బకాయిల వసూలు ద్వారా ఆలయ అభివృద్ధి సాధ్యం అవుతుందని వారికి వివరిస్తున్నారు. అలాగే దేవస్థాన ఉపాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్భంలో అక్కడ విధుల్లో ఉండాల్సిన అర్చకులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు అర్చకులు, ఉద్యోగులు సకాలంలో హాజరై తమ విధులను నిర్వర్తించాల్సిందేనని, విధుల్లో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా, అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిబ్బంది విధులకు తప్పకుండా తెల్లని వస్త్రాలతో రావాల్సిందేనని, డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. కమిషనర్ ఆర్డర్లు లేకుండా పనులా...? దేవస్థానం పరిధిలో నిర్వహించే పలు పనులకు కమిషనర్ ఆర్డర్లు కూడా లేవని ఆమె పరిశీలనలో తేలింది. దీంతో ఆమె సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం టెండర్లు జరిగి కమిషనర్ నుంచి ఆర్డర్లు అందిన తర్వాతే చేపట్టాల్సిన పనులు ఇమేమీ లేకుండానే చేయడం పట్ల ఈఓ జ్యోతి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. అదేవిధంగా సీఆర్వో కార్యాలయంలో భక్తుల కోసం వసతి గృహాల ఖాళీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని, ఆ మేరకు బోర్డును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇలా ఆలయంలోని పలు విభాగాలపై విడివిడిగా చర్చిస్తునే ఆలయ అభివృద్ధికు తీసుకోవల్సిన సూచనలను అందచేస్తూ ఈఓ జ్యోతి తనదైన మార్కును చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. -
రాత్రి గస్తీ.. రాబడి జాస్తి
దృష్టి సారిస్తాం నైట్ బీట్ కానిస్టేబుళ్లు సొమ్ములు వసూలు చేస్తుండడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిఘా పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బంది వల్ల ఇబ్బందులు ఎదురైతే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. - ఎం. రవిప్రకాష్, జిల్లా ఎస్పీ కాకినాడ క్రైం :‘ఏ పుట్టలో ఏ పాముందో’ అన్నది పాత నానుడే కాగా.. ‘ఏ దారిలో ఏ పోలీసు మాటేశాడో’నన్నది వాహనదారుల నానుడిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు రోడ్లపై రక్షకభటుల జాడ కనిపిస్తేనే.. ’అయ్యబాబోయ్.. పోలీసులు’ అనుకుని గడగడలాడిపోతున్నారు. రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట, తిమ్మాపురం, అచ్చంపేట జంక్షన్, పిఠాపురం, కత్తిపూడి, తుని, యానాం-ఎదుర్లంక వంతెన, మురమళ్ల, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు ప్రతి రాత్రి గస్తీ కాస్తుంటారు. నేరాలు, ప్రమాదాల నిరోధానికి కృషి చేయడం, జరిగితే తక్షణ చర్యలకు ఉపక్రమించడం వారి విధి. కాగా.. ఆ డ్యూటీ మాటున వారు వాహనదారుల జేబులకు చిల్లి పెడుతున్నారు. గస్తీ అంటేనే రాబడి జాస్తి’ అన్నట్టు.. తమ బారి నుంచి తప్పించుకోజూసే వాహన చోదకులను వెంటాడి మరీ భారీగా మామూళ్లు దండుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలూ ఉన్నాయి. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్లో, సామర్లకోట నుంచి కాకినాడ బీచ్ రోడ్డు వరకూ ఉన్న ఏడీబీ రోడ్లో ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కానిస్టేబుళ్లు రాత్రి పహారా కాస్తూ వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణం ఓ గండంగా మారిందని, గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారులు మద్యం తాగి ఉన్నా, వ్యభిచారం వంటి కార్యకలాపాలపై వెళుతున్నారనుకున్నా బెదిరించి సొమ్ములు గుంజుతున్నారు. ఇక లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు వంటి వాహనాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ‘పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ’ అనుకుంటూ భారీ వాహనాల డ్రైవర్లు వారు ఆపిక ప్రతి చోటా రూ.50 చొప్పున సమర్పించుకుంటున్నారు. సరుకులనూ దండుకుంటారు.. ప్రయాణం సాఫీగా సాగుతుందని చాలా మంది వ్యాపారులు, వాహనదారులు సరుకుల రవాణాను రాత్రి పూట చేస్తుంటారు. దానిని కూడా గస్తీ కానిస్టేబుళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చేతికి వచ్చిన సరుకులను తీసుకుంటున్నారని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి సరుకులు తగ్గడంతో వ్యాపారులు కిరాయి తగ్గించి ఇస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. కానిస్టేబుళ్లకు ఎదురు చెపితే ఏదో ఒకసాకుతో వాహనాలు నిలిపివేసి సమయం వృథా చేస్తారని భావించి చాలా మంది సొమ్ములు ఇచ్చి బెడద తప్పించుకుంటున్నారు. సాధారణంగా వాహనాలు తనిఖీ చేసే అధికారం కానిస్టేబుళ్లకు లేకపోయినా.. దండుకోవడానికే హద్దు మీరుతున్నారని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అయినా ఆగని అక్రమార్జన గతంలో పెద్దాపురం ఏడీబీ రోడ్లో చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో సొమ్ములు గుంజుతున్నారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో రెక్కీ నిర్వహించారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోం గార్డు (జీపు డ్రైవర్)ను సస్పెండ్ చేశారు. అనంతరం కానిస్టేబుళ్ల హవాపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారులు రాత్రి పూట పోలీసు దందాపై దృష్టి సారించడం మానివేశారు. దీంతో గస్తీ కానిస్టేబుళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. గస్తీ లక్ష్యాన్ని విస్మరించిన కానిస్టేబుళ్లు కాసుల వేటలో నిమగ్నమవుతున్నారు. అసాంఘిక శక్తులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానిస్టేబుళ్లను ప్రధాన సెంటర్లు, రహదారుల్లో కాక జనావాస ప్రాంతాల్లో గస్తీకి నియమిస్తే చోరీలు, హత్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి గస్తీ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే 90 శాతం అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు, హత్యలు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గస్తీ కానిస్టేబుళ్ల దందాను అరికట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. -
విదేశీ ‘కొలువు’దీరేందుకు మార్గాలు...
‘స్టడీ అబ్రాడ్’ అంటే.. సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి గుర్తొచ్చే పదం. ఇందుకోసం గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే కసరత్తు మొదలుపెడతారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో కాలు మోపేందుకు సన్నద్ధమవుతారు. ఇటీవలకాలంలో స్టడీ అబ్రాడ్తోపాటు బాగా ప్రాచుర్యం పొందుతున్న మాట.. ‘జాబ్స్ అబ్రాడ్’! అంటే.. విదేశీ ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాయి. అవసరమైన మానవ వనరుల కోసం విదేశీ అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ కొలువులపై స్పెషల్ ఫోకస్.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మంచి ఆదరణ లభిస్తోంది. కష్టపడి పనిచేసే తత్వం.. త్వరగా స్థానిక పరిస్థితులతో ఇమడగలిగే నేర్పు.. ఇంగ్లిష్పై పట్టు.. విదేశాల్లో భారతీయులకు అవకాశాలు పెరగడానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం. అనేక దేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.. లో-స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ప్రొఫెషనల్ స్కిల్స్ పేరుతో దిగువ స్థాయి మొదలు.. ఆయా రంగాల్లో అనుభవం గడించిన మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ వరకూ.. ఎన్నో విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ డెస్టినేషన్స్ సాధారణంగా ‘విదేశీ’ లక్ష్యం ఎంచుకున్న వారికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు తొలి ప్రాధాన్యంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల అక్కడి సంస్థల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఆశించడం కొంత కష్టంతో కూడుకున్న విషయం. ఇదే సమయంలో అంతే స్థాయిలో ఆదాయార్జనకు మార్గం వేసే క్రమంలో మరెన్నో దేశాలు ఉద్యోగాల పరంగా బెస్ట్ డెస్టినేషన్స్గా నిలుస్తున్నాయి. పొరుగు దేశం చైనా మొదలు ఆఫ్రికా వరకు భారతీయులకు అవకాశాలు కల్పించడంలో ముందుంటున్నాయి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న చైనా.. విదేశీ ఉద్యోగులను ఆకర్షించడంలో ముందుంటోంది. అదేవిధంగా ఆసియా ఖండంలోనే విదేశీ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్న మరో దేశం.. సింగపూర్. ఇక్కడ టూరిజం, హాస్పిటాలిటీ, టెలికాం రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో క్లర్క్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు.. హెల్త్కేర్ నుంచి హాస్పిటాలిటీ దాకా.. అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. ఆఫ్రికా దేశాల్లోనైతే భారత అభ్యర్థులకు అవకాశాలు కోకొల్లలు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, టెలికం రంగాల్లో అవకాశాలు విస్తృతం. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్కు మరింత ప్రయోజనం విదేశీ ఉద్యోగాల విషయంలో ఎంట్రీ లెవల్ అభ్యర్థులతో పోల్చితే.. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్కు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జీతభత్యాలే. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సంబంధించి మన దేశంలో చక్కటి వేతనాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా దేశాల్లోని జీతాలతో పోల్చితే సమానంగా ఉంటున్నాయి. కానీ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ విషయంలో మాత్రం ఇక్కడ కంటే విదేశాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వచ్చే జీతభత్యాలకు కనీసం రెండింతలకుపైగా అందుకోవచ్చు. విదేశీ ఉద్యోగాన్వేషణకు మార్గాలు విదేశాల్లో ఉద్యోగం కోరుకునే ఔత్సాహికులకు ఉద్యోగాన్వేషణ క్రమంలో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రముఖంగా నిలుస్తోంది కన్సల్టెన్సీల ద్వారా అన్వేషణ. ప్రస్తుతం ఎన్నో ‘అబ్రాడ్ జాబ్ కన్సల్టెన్సీలు’ అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహికులు ముందుగా వీటిని సంప్రదిస్తే సరైన గమ్యాలు తెలుస్తాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్: జాబ్స్ అబ్రాడ్ దిశగా మరో ముఖ్య సాధనం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్స్. ఔత్సాహికులు ఆయా సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ ద్వారా తాము అడుగుపెట్టాలనుకుంటున్న దేశం, అక్కడి అవకాశాలపై.. అప్పటికే ఆయా దేశాల్లో స్థిరపడిన స్నేహితులు, ఇతర అనుభవజ్ఞుల ద్వారా సమాచారం పొందొచ్చు. జాబ్ సెర్చ్ ఇంజిన్స్: ఇంటర్నెట్ సాధనంగా జాబ్ సెర్చ్ ఇంజిన్స్ (నౌకరీ డాట్ కామ్, మాన్స్టర్ డాట్ కామ్ తదితర) ద్వారా కూడా విదేశీ ఉద్యోగావకాశాలపై సమాచారం పొందొచ్చు. ఈ మార్గాల ద్వారా అన్వేషణ సాగించి అసలైన గమ్యాన్ని తెలుసుకోవడం ఎంతో తేలిక. స్పష్టతతో అన్వేషణ సాగిస్తేనే విదేశీ ఉద్యోగార్థులు ఎంతో స్పష్టంగా వ్యవహరించాలి. తమ విద్య, ఉద్యోగ నేపథ్యం- అనుభవం ఆధారంగా ముందుగా తాము కోరుకుంటున్న ఉద్యోగాన్ని, అందుకు తగిన గమ్యాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సదరు దేశంలో తమకు సరిపోయే సంస్థలు, వాటిలో అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత.. ఆయా సంస్థల పనితీరును పరిశీలించాలి. ఇందుకు ఏకైక సాధనం ఇంటర్నెట్. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షించి సదరు సమాచారం పొందొచ్చు. అంతేకాకుండా ఆయా కంపెనీలకు ఆ దేశంలోని నియంత్రణ సంస్థల అనుమతుల విషయంలోనూ పరిశోధన సాగించాలి. అనుమతులున్న కంపెనీల్లోనే దరఖాస్తుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలకు సన్నద్ధత జాబ్ అబ్రాడ్కు సంబంధించి దరఖాస్తుల విషయంలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు సాధారణంగా టెలిఫోన్ లేదా ఈ-మెయిల్ లేదా స్కైప్ మాధ్యమాల్లో జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. టెలిఫోనిక్, స్కైప్ ఇంటర్వ్యూల సమయంలో.. ప్రశ్నలకు సమాధానమిచ్చేట ప్పుడు ఎలాంటి తడబాటుకు లోనవకూడదు. ఇక ఈ-మెయిల్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూల సమయంలో సమయపాలన, భాషపై పట్టు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఆన్లైన్ చాటింగ్ ద్వారా జరిగే ఇంటర్వ్యూలలో సంబంధిత సంస్థ అధికారులు తాము అడిగిన ప్రశ్నకు అభ్యర్థి సమాధానం ఇవ్వడానికి తీసుకుంటున్న వ్యవధిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని.. దరఖాస్తు సమయం నుంచే ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. అప్రమత్తతో కన్సల్టెన్సీలు, ఏజెంట్స్ ఎంపిక విదేశీ ఉద్యోగార్థులకు మార్గంగా నిలుస్తున్న జాబ్ కన్సల్టెన్సీలు, రిక్రూటింగ్ ఏజెంట్స్ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ అన్ని దేశాలకు సంబంధించి గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలు, ఏజెంట్ల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. ముందుగా దాన్ని పరిశీలించి ఆ జాబితాలో ఉన్న కన్సల్టెన్సీలను సంప్రదించడం మేలు. అదేవిధంగా ఇతర దేశాలు కూడా విదేశాల్లోని తమ అధీకృత రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలను తమ ఎంబసీ వెబ్సైట్లు, ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లలో పొందుపర్చాయి. ఔత్సాహికులు తాము ఎంపిక చేసుకున్న దేశం.. అక్కడి ప్రభుత్వ గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాలు అందుకు సంబంధించి ఏజెంట్లు జారీ చేసే ప్రకటనల ఆధారంగా వెళ్లే అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. నైపుణ్యాలను నిరూపించుకుంటే.. సులువుగా వీసా వీసా.. విదేశాల్లో అడుగుపెట్టేందుకు కచ్చితంగా అవసరమైంది. ఈ విషయంలో అన్ని దేశాలు ఎంతో నిర్దిష్టంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. స్టడీ, టూరిస్ట్, బిజినెస్ వీసాలతో పోల్చితే వర్క్ వీసాల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్కడి వారికంటే తామెంత మెరుగైన నైపుణ్యాలు కలిగున్నామో తెలియజేయాలి. తద్వారా వీసా అధికారులను మెప్పించాల్సిన బాధ్యత అభ్యర్థులదే. అదనపు ‘భాష’ ప్రయోజనం విదేశీ ఉద్యోగార్థుల కోణంలో మరో అదనపు ప్రయోజనం సంబంధిత దేశ భాషలో నైపుణ్యం సాధించడం. ఇది భవిష్యత్తులో రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీస్గా ఉన్న చైనా, స్కాండినేవియన్ దేశాలలో ఉద్యోగాలు కోరుకునేవారు తప్పనిసరిగా ఆయా దేశాల భాషలను నేర్చుకోవడం లాభిస్తుంది. పని చేసే ప్రాంతంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యంతో రాణించగలిగినా.. సామాజిక పరిస్థితుల కోణంలో స్థానిక భాషను నేర్చుకోవడం అవసరం. అంతేకాకుండా విధుల్లో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు అవసరమైన మార్కెటింగ్ విభాగాలు, ఎన్జీఓ రంగాల్లో ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టుండాల్సిందే. అప్పుడే.. ఉద్యోగ వాతావరణంలో, అక్కడి సామాజిక పరిస్థితుల్లో రాణించగలిగి భవిష్యత్తులో సుస్థిర స్థానాలు సొంతం చేసుకోగలుగుతారు. జాబ్ అబ్రాడ్.. అనుసరించాల్సిన విధానాలు ముందుగా గమ్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఏ దేశంలో అడుగుపెట్టాలనుకుంటున్నారో.. ఆ దేశంలో తమకు సరితూగే అవకాశాలు, కంపెనీల గురించి తెలుసుకోవాలి. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వాటి గత చరిత్రను, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించాలి. ఫలితంగా తమ వ్యక్తిగత ప్రగతిపైనా అవగాహన ఏర్పడుతుంది. ఆయా కంపెనీల వెబ్సైట్లలో పొందుపర్చిన వివరాల ఆధారంగా.. అకడెమిక్, ఎక్స్పీరియన్స్ నిబంధనలతోపాటు ఇతర అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఐదేళ్లు పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. అవసరమైన డాక్యుమెంట్లు అబ్రాడ్ జాబ్ దిశగా కదిలే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి.. పాస్పోర్ట్ వీసా, వర్క్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పత్రాలు, లేదా రిక్రూట్మెంట్ లెటర్ యాక్స్ప్టెన్స్ లెటర్ (సదరు నియామక ప్రతిపాదనను అంగీకరిస్తూ సంస్థలో చేరేందుకు సంసిద్ధత తెలియజేసే లెటర్) హెల్త్ సర్టిఫికెట్ (దాదాపు అన్ని దేశాలు అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హెల్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశాయి.) ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అకడెమిక్ సర్టిఫికెట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎంట్రీ మాత్రమే కాదు.. ఎగ్జిస్టెన్స్ కూడా ముఖ్యమే ఇప్పుడు ఎన్నో దేశాలు భారత అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుబాటులోని మార్గాల ద్వారా వీటిని అందిపుచ్చుకోవడం సులభంగా మారింది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీలు, సోషల్ నెట్వర్కింగ్ సోర్సెస్ ద్వారా వివిధ దేశాల్లోని అవకాశాలు తెలుసుకోవడం, వాటిని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఎంతో తేలిక. ఔత్సాహికులు సంబంధిత దేశంలో అడుగుపెట్టడంపై దృష్టి సారించాలి. దాంతోపాటు దీర్ఘకాలం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ క్రమంలో ఆయా సంస్థల క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లో రాణించాలి. అక్కడి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో పనిచేయగల నేర్పు ఉండాలి. - సుబ్రహ్మణ్యం, విసు గ్లోబల్ కన్సల్టెంట్స్ వీసా విషయంలో జాగ్రత్తగా విదేశీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వీసా పొందే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థ అందించిన ఆఫర్ లెటర్ ఆధారంగా వీసా కాలపరిమితి ఉంటుంది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. యూకేలో ఉద్యోగం పొందితే.. ఆయా అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా టైయర్-2, టైయర్-3 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వ్యవహారశైలిపై అనుమానం కలిగితే సందేహ నివృత్తి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించకూడదు. - సుచిత గోకర్ణ్, హెడ్, బ్రిటిష్ కౌన్సిల్ డివిజన్,బిటిష్ హైకమిషన్, న్యూఢిల్లీ -
సామాజిక వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా
కొత్త కొత్త వ్యక్తులతో పరిచయంతోపాటు కొత్త కొత్త అంశాలను తెలుసుకునే వీలుకల్పించేవే సామాజిక మీడియా వెబ్సైట్లు. అయితే రానురాను ఈ వెబ్సైట్లు సమాజానికి పెనుసవాలుగా మారుతున్నాయి. రెచ్చగొట్టే రాతలను పోస్టు చేయడంతోపాటు ఫొటోలను ఉంచుతుండడంతో ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఈ వెబ్సైట్ల వల్ల తలెత్తకుండా చేసేందుకు నగరపోలీసులు నడుం బిగించారు. న్యూఢిల్లీ: సామాజిక వెబ్సైట్లలోని అంశాలపై ఢి ల్లీ పోలీసుశాఖ నిరంతర నిఘా ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇటీవలి కాలంలో పలు వెబ్సైట్లలో రెచ్చగొట్టే రాతలు కనిపిస్తుండడంతో ఇటువంటి వాటిని నిరోధించాలని కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారి ఒకరు వె ల్లడించారు. ‘సోషల్ మీడియా ప్రభావం ఇటీవల బాగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాం. సంఘ వ్యతిరేకశక్తులు ఈ మీడియాను దుర్వినియోగం చేసే ప్రమాదం పొంచిఉంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించింది’ అని అన్నారు. అయితే ఈ నిఘా అనేది చొరబాటుతత్వాన్ని కలిగిఉండబోదన్నారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న అంశాలనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. అదికూడా రాజధాని నగరానికి సంబంధించి పోస్టుచేసిన అంశాలపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. పోలీసులు చేపట్టిన ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన సామాజిక మీడియా వెబ్సైట్లనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. కొత్తగా తాము ఏర్పాటు చేయబోయే కేంద్రంద్వారా వివిధ అంశాలపై ప్రజాభిప్రాయంతోపాటు వారి మనోభావాలను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. దినపత్రికల్లో కొన్ని వార్తల కటింగ్లను ప్రతినిత్యం సేకరిస్తున్న మాదిరిగానే సామాజిక మీడియా వెబ్సైట్లలోని అంశాలను కూడా తెలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత తరుణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామే తప్ప గూఢచార విభాగంపై ఆధారపడడం వంటి పురాతన పద్ధతులను ఆశ్రయించలేమన్నారు. నేటి యువత వీలైనంతమేర అధునాతన జీవితాన్ని గడిపేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. మరో నాలుగు లేదా ఐదు నెలల కాలంలో తాము ప్రతిపాదించిన కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఓ సర్వర్తోపాటు, ప్రభుత్వం ఆమోదించిన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. తమ సిబ్బందికి వీటి వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. కాగా నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు. -
జర ‘పది’లం సారూ!
నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్ : పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారు ఈ మేరకు రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలలో ప్రతి సబ్జెక్టు నుంచి పది పేపర్ల చొప్పున ఎంపిక చేసుకున్నారు. వాటిని ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నారు. ఇందుకు ఆయా సబ్జెక్టులలో నిపుణులైన 50 మంది టీచర్లను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్లో గల ఎంఎస్ఆర్ పాఠశాలలో వారం రోజుల నుంచి ఈ వాల్యుయేషన్ ప్ర క్రియ కొనసాగుతోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల మెరిట్ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాలలలో సంబంధిత టీచర్లే జవాబు పత్రాలను దిద్ది అనుకూలంగా మార్కులు వేయడంలాంటి చర్యలను గుర్తిస్తున్నారు. ఇటువంటి వాటికి చెక్పెట్టి విద్యార్థుల ప్రతిభను స్వయంగా గుర్తించాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. ఇతర టీచర్లచే వాల్యుయేషన్ చేయిస్తే సరైన ఫలి తా లు రాబట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వాల్యుయేషన్ పూర్తి చేసి మిగిలిన 55 రోజులలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిం చేందుకు వారిని ఎలా సన్నద్ధం చేయాలో ప్రణాళిక రూపొందించనున్నారు. దీం తో మెరుగైన ఫలితాలు రాబట్టే ఆవకాశం ఉంది. వీటి ఆధారంగా వెనకబడిన పా ఠశాల లోపాలు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత వైభవం కోసం గతంలో పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జిల్లా 18, 21 స్థానాలకు పడిపోయింది. గతంలో వరుసగా జిల్లా నంబర్ వన్ రావడంతో పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా మంత్రి కూడా స్పందించారు.ప్రతిభతో కూడి న మెరుగైన ఫలితాలు మాత్రమే రావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చా రు. జిల్లా కలెక్టర్ సైతం ఫలితాలపై దృష్టి పెట్టడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు నిత్యం సూచనలు జారీ చేస్తున్నారు. వాల్యుయేషన్ జరుగుతోంది. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలను ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నాం. జిల్లాలో 40 పాఠశాలల నుంచి జవాబు పత్రాలు తెప్పించాం. జిల్లా కలెక్టర్ ఆదేశాను సారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫలితాల ఆధారంగా మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాం. -
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి, ఉగాది పండుగల నేపథ్యంలో ప్రధానంగా శ్రీశైలం, ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. దెబ్బతిన్న రహదారుల్లో ఇబ్బందులు పడకుండా తగిన మరమ్మతులు చేయాలని వివరించారు. కర్నూలు నుంచి కోడుమూరు, కోడుమూరు నుంచి దేవనకొండ రోడ్లు గుంతలుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు రోడ్ల మరమ్మతు పనులపై దృష్టి సారించాలని వివరించారు. కర్నూలు-శ్రీశైలం, నంద్యాల, శ్రీశైలం రోడ్ల మరమ్మతులు సత్వరం చేపట్టాలని పేర్కొన్నారు. బొమ్మలసత్రం దగ్గర రోడ్డు అధ్వానంగా ఉందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాల రోడ్ల అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.46 కోట్లు మంజూరు అయ్యాయని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. బేతంచెర్ల-డోన్, రామళ్లకోట-బేతంచెర్ల, ఆళ్లగడ్డ-అహోబి లం రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనా పనులు జరగకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ఆదోని డివిజన్లో పంచాయతీరాజ్కు రోడ్ల అభివృద్ధి పనులు ఆర్అండ్బీ అధికారులు తీసుకుని చేపట్టాలని సూచించారు. అన్ని పనులను వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
పారదర్శకంగా ‘ఉపాధి’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల్లో ఎలాంటి అవకతవకలకు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ హరినాథరెడ్డి అన్నారు. అడిగిన వారందరికీ సమాజానికి ఉపయోగపడే పనులు కల్పిస్తూ వలసలను నివారించడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. ఉపాధి పనుల సీజన్ మొదలైన నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘న్యూస్లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యూస్లైన్: ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సారి ఎలాంటి పనులు చేపట్టనున్నారు? పీడీ: ఈ సారి అన్నీ ఉపయోగపడే పనులు కల్పించనున్నాం. పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు భారీగా నిర్మించబోతున్నాం. డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నాం. రైతులకు సేంద్రీయ ఎరువుల తయారీకి నాడెప్ కంపోస్టు పిట్లు నెలకొల్పనున్నాం. కరెంటు ఉన్నప్పుడు నీటిని నిల్వ చేసుకుని కరెంటు లేనప్పుడు పంటలకు పారించుకోవడానికి వీలుగా భూ ఉపరితల ట్యాంకులు నిర్మించనున్నాం. పండ్ల తోటలు, బండ్ ప్లాంటేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. న్యూస్లైన్: రైతుల కోసం ఎలాంటి పనులు చేపడుతున్నారు? పీడీ: రైతులకు శాశ్వత ప్రయోజనాలు ఉండే పనులు కల్పిస్తున్నాం. నంద్యాల డివిజన్లో చేలగట్ల వెంట పెద్ద ఎత్తున కొబ్బరి మొక్కలు నాటి కోనసీమ తరహాలో అభివృద్ధి చేయనున్నాం. కర్నూలు, ఆదోని డివిజన్లలో కొబ్బరితో పాటు టేకు మొక్కలు నాటనున్నాం. మొత్తం మీద 20 లక్షల మొక్కలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఆరువేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయనున్నాం. న్యూస్లైన్: అక్రమాలను ఎలా అధిగమిస్తారు? పీడీ: రోజువారిగా మస్టర్, మెజర్మెంట్లపై ఎస్ఆర్డీ నుంచే క్రాస్ చెకింగ్ ఉంటుంది. దీనికి తోడు సామాజిక తనిఖీలు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఉంటాయి. ప్రస్తుతం జాబ్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేస్తున్నాము. అయినా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులను ఇంటికి పంపడమే కాక క్రిమినల్ కేసులు, రికవరీ అన్నీ ఉంటాయి. న్యూస్లైన్: జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులు కల్పించడం నామమాత్రంగానే ఉంది కదా? పీడీ: గత డిసెంబర్ రెండోవారం నుంచే పనులు ప్రారంభించాం. ప్రస్తుతం లేబర్ రిపోర్టింగ్ రోజూ 16 వేల వరకు ఉంది. దీనిని 50 వేలకు పెంచనున్నాం. వలసలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పనులు కల్పిస్తున్నాం. న్యూస్లైన్: పనులు కావాలంటే కూలీలు ఏమి చేయాలి.. ఎవరిని కలవాలి? పీడీ: రెండు రకాలుగా మస్టర్లు వేస్తారు. గ్రామాల్లోని శ్రమశక్తి సంఘాలను రెండు బ్యాచ్లుగా చేస్తారు. మొదటి బ్యాచ్ మస్టర్ సోమవారం మొదలవుతుంది. ఈ బ్యాచ్ వారి పని కోసం గురు, శుక్రవారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు డిమాండ్ ఇవ్వాలి. ప్రాథమిక పనులన్నీ పూర్తి చేసి 4 రోజుల నుంచి 14 రోజుల్లో పని కల్పిస్తారు. రెండో బ్యాచ్ మస్టర్ గురువారం మొదలవుతుంది. వీరు శని, సోమవారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు డిమాండ్ ఇస్తే 4 నుంచి 14 రోజుల్లో పని కల్పిస్తారు. అలా పనులు కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. న్యూస్లైన్: 2013-14 ఆర్థిక సంవత్సర లక్ష్యాలను ఎంతవరకు సాధించారు? పీడీ: ఈ ఆర్థిక సంవత్సరంలో 1.80 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 1.15 కోట్ల పనిదినాలను కల్పించాం. ఇంక 70 లక్షల పనిదినాలను మార్చిలోగా కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాం. జనవరిలో 15 లక్షలు, ఫిబ్రవరిలో 20 లక్షలు, మార్చిలో 35 లక్షల పనిదినాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటివరకు 15,500 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. -
చైన్ స్నాచింగ్లపై ప్రత్యేక నిఘా
రామచంద్రాపురం, న్యూస్లైన్ : ఆర్సీ పురం పోలీస్స్టేషన్ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పాత కేసు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, కేసులు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్ల విషయం తన దృష్టి లో ఉందని, అందుకు సంబంధించిన విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో నిఘాను పటిష్టం చేస్తున్నామన్నారు. రామచంద్రాపురం పటాన్చెరు పరిధిలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని తెలిపారు. మహబూబ్నగ ర్, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అ డవిలో ఓ దళం సంచరిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, శంకర్రెడ్డి, భీంరెడ్డి,గంగాధర్, ఎస్ఐలు రవీందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, వెంకట్, లోకేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పటాన్చెరు పీఎస్ తనిఖీ చేసిన ఐజీ పటాన్చెరు టౌన్ : శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపా రు. పోలీస్ స్టేషన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన పటాన్చెరు పోలీస్స్టేషన్ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీస్స్టేషన్ పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. క్రైం రేటు అదుపులో ఉందన్నారు. దోపిడీ దొంగతనాలు, చైన్స్నాచింగ్, మర్డర్ కేసులు ఛేదించడంలో పోలీసు లు మంచి పనితీరును చూపుతున్నారని కొనియాడారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామానికి ఓ పోలీస్ నేతృత్వంలో రక్షణ కల్పిస్తామన్నారు. అతని ద్వారా ఎప్పటికప్పుడు పోలీస్స్టేషన్ అధికారికి సమాచారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ విజయ్కుమార్, డీఎస్పీ కవిత, సీఐలు శంకర్రెడ్డి, మహబూబ్ఖాన్లు ఉన్నారు. -
సరుకుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణ , ఇసుక రీచ్ల అవకతవకలకు బాధ్యులైన కొంతమంది అధికారులపై నివేదికలు తయారుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 విజిలెన్స్ యూనిట్లలో గుంటూరు అధికారులు అధిక స్థాయిలో కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేశారు.సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఖజానాకు చేరకుండా పన్ను ఎగవేత జరుగుతున్న చోట విజిలెన్స్ అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి రూ.150 కోట్లు లక్ష్యం కాగా, రూ.250 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూర్చి లక్ష్యాన్ని అధిగమించారు. ఆర్థిక సంవత్సరం పూర్తవడానికి ఉన్న మూడు నెలల కాలంలో మరో రూ.40 నుంచి రూ.50 కోట్లు ఆదాయం రావచ్చని విజిలెన్స్ ఎస్పీ ఎంఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, వ్యవసాయం, వాణిజ్య తదితర శాఖలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే 300కు పైగా కేసులు నమోదు చేశారు. దాడులు చేసి వాణిజ్యశాఖ పన్ను ఎగవేతకు సంబంధించి రూ.121 కోట్లు, మైనింగ్ శాఖలో రాయ ల్టీ, సీనరే జీలకు సంబంధించి రూ.9 కోట్లు, వ్యవసాయశాఖకు సంబంధించి రూ.50 కోట్లు ఆదాయాన్ని రాబట్టగలిగారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జిల్లాలో పౌరసరఫరాల శాఖ లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా జాయిం ట్ కలెక్టర్ వివేక్యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ, పీడీఎస్ బియ్యం, నీలి కిరోసిన్ అక్రమ తరలింపు మాత్రం ఆగడం లేదు. విజిలెన్స్ అధికారుల దాడులే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు వీరి దాడుల్లో రూ.1.45 కోట్ల విలువైన 8826 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకులు తరలిస్తున్న 100 వాహనాలను సీజ్చే శారు. వీటికి సంబంధించి 244 (6ఏ) కేసులు, 86 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 200 మందికి పైగా అరెస్టుచేశారు. బియ్యం అక్రమ తరలింపులో పల్నాడు, నీలి కిరోసిన్ అక్రమాలు రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో చోటుచేసుకోవడం గమనార్హం. వీటిపై ప్రభుత్వానికి 500 నివేదికలు పంపగా, అందుకు బాధ్యులైన కొందరు అధికారులపై చర్యలకు కూడా సిఫార్సు చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరం ప్రభుత్వ ఖజానాకు పన్ను ఎగవేస్తూ అక్రమ మార్గంలో నడిచే సరుకుల రవాణాపై విజిలెన్స్ దృష్టిసారించి, వాహనాల తనిఖీని ముమ్మరం చేసింది. దీని ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యం రూ.2.59 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.2.83 కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయశాఖకు సంబంధించి 59 క్వింటాళ్ల ఎరువులు, పురుగుమందులు, నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ల దందాపై నివేదికలు.. బినామీ సొసైటీల పేరుతో నడుస్తున్న ఇసుక రీచ్ల వ్యవహారాలపై కూడా విజిలెన్స్ అధికారులు నివేదికలు తయారుచేశారు. అమరావతి, అచ్చం పేట, మల్లాది, జువ్వలపాలెం, తుళ్లూరు, గొడవర్రు రీచ్లకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అదేవిధంగా మందుల కొనుగోలులో అక్రమాలపై నిజాలు నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. -
తప్పుల తడకగా తెలంగాణా ముసాయిదా బిల్లు
-
సంక్రాంతి కోడిపందాలపై ప్రత్యేక దృష్టి
నరసాపురం రూరల్ , న్యూస్లైన్ : రానున్న సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్సింగ్ మాన్ తెలిపారు. ఇందుకోసం గ్రామాల వారీ బీట్ కు కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఆదివారం నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడిపందాలను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, రాత్రివేళల్లో కానిస్టేబుళ్ల బీట్లు ముమ్మరం చేశామన్నారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ విజిటింగ్పై దృష్టి సారించి రానున్న రోజుల్లో నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందిని కూడా పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందుతున్న 150 మంది ఎస్సైలు జనవరిలో విధుల్లో చేరతారన్నారు. దొంగనోట్ల చలామణిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఐజీ సమాధానమిస్తూ ఈ వ్యవహారం ఏలూరు రేంజ్ పరిధికి మాత్రమే సంబంధించింది కాదని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే కొంత వరకు సమాచారం లభించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి నకిలీ కరెన్సీ వస్తోందన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఇక్కడకు వచ్చానని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను పరీశీలించేందుకు సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. మెరైన్ పోలీస్ స్టేషన్ విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని, కృష్ణాజిల్లా పాలకాయతిప్ప గ్రామంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మాణంలో ఉందన్నారు. ఆయన వెంట డీఎస్పీ రఘువీర్రెడ్డి, సీఐ నాగమురళి, రూరల్ ఎస్సై గుజ్జర్లపూ డి దాసు, మొగల్తూరు ఎస్సై ఆకుల రఘు ఉన్నారు. -
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు, న్యూస్లైన్: రాబోవు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అర్ధవార్షిక నేర సమీక్షలో భాగంగా బుధవారం సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ రవిశంకర్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్ఐలు రంగముని, రెడ్డప్పరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ విభాగం సీఐలు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, తేజేశ్వర్, కమ్యూనికేషన్ సీఐ రామాంజనేయులుతో పాటు పీపీలు, ఏపీపీలు పాల్గొన్నారు. సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలు వారి వారి ప్రాంతాల్లోని తహశీల్దార్ల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కర్నూలు సబ్ డివిజన్కు సంబంధించి డీఎస్పీ వైవీ రమణకుమార్తో పాటు పట్టణంలోని సీఐలు, కర్నూలు తహశీల్దార్ కార్యాలయం, మరికొంత మంది కల్లూరు, కోడుమూరు తహశీల్దార్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా హింసాత్మక సంఘటనలకు అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని సబ్ డివిజన్ అధికారులను ఆదేశించారు. ఎవరి పరిధిలో వారు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వైరి వర్గాలకు సంబంధించిన కదలికలపై సమాచారం రాబట్టాలని సూచించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లు జోరందుకున్నాయని, నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కూడా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వస్తే వారి పట్ల గౌరవంగా మసులుకొని కచ్చితంంగా ఫిర్యాదును రిజిష్టర్ చేయాలని ఆదేశించారు.