Spiritual guru
-
హత్రాస్ బాబాకు క్లీన్ చిట్
హత్రాస్: హత్రాస్లో 121 మంది ప్రాణాలను బలి తీసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆధ్యాత్మిక గురువు నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలె బాబాకు న్యాయ విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. గతేడాది జులై 2వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం రిటైర్డు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. భోలె బాబా అసలు పేరు సూరజ్పాల్. అయితే, పోలీసులు నిందితుడి జాబితాలో సూరజ్పాల్ పేరును చేర్చలేదు. దర్యాప్తు సమయంలో గతేడాది అక్టోబర్లో కమిషన్ ఎదుట భోలె బాబా హాజరయ్యారు. ఈ కమిటీ భోలెబాబాకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక అందజేసిందని ఆయన లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. కొందరు కుట్రదారులు భోలె బాబాను, యూపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా వారి ఎత్తుగడలను కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇది సత్యానికి, విశ్వాసానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. తొక్కిసలాట చోటుచేసుకున్న తర్వాత కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు ప్రకాశ్ మధుకర్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే అనుమతివ్వగా 2.50 లక్షల మందికి పైగా భక్తులు రావడంతోనే ఘోరం జరిగిందని యంత్రాంగం వాదించింది. కాగా, ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. -
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి..
దేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’ అని చెబుతుంటారు. ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. పరమహంస యోగానంద తన జీవిత అనుభవాలను ‘ఒక యోగి ఆత్మకథ’ రూపంలో వెలువరించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ పరమహంస యోగానంద మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు(జనవరి 5) ఆ మహనీయుని జన్మదినం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలను ఒకసారి స్మరించుకుందాం.యోగాకున్న ప్రాముఖ్యతను ప్రపంచమంతటికీ తెలియజేయడంలో పరమహంస యోగానంద(Paramahansa Yogananda) కీలక పాత్ర పోషించారు. పాశ్చాత్య దేశాల్లో ఆయనను ‘ఫాదర్ ఆఫ్ యోగా’ అని పిలుస్తారు. పరమహంస యోగానంద అందించిన ‘క్రియాయోగం’ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక బోధనలకు ఏకరూపత కల్పించడం, శాస్త్రీయ ధ్యాన పద్ధతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం పరమహంస యోగానంద ఎనలేని కృషి చేశారు.పరమహంస యోగానంద ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 1893, జనవరి 5న జన్మించారు. అతని తండ్రి భగవతి చరణ్ ఘోష్ గోరఖ్పూర్ రైల్వేలో అధికారి. పరమహంస యోగానంద అసలు పేరు ముకుంద లాల్ ఘోష్. అనంతర కాలంలో పరమహంస యోగానంద అనే పేరుతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1920లో తొలిసారిగా పరమహంస యోగానంద భారత ప్రతినిధిగా బోస్టన్లో జరిగిన మతపరమైన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అదే ఏడాది యోగానంద భారత్లో తత్వశాస్త్రం, ధ్యాన శాస్త్రంపై బోధనలను వ్యాప్తి చేయడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్(Self-Realization Fellowship)ను స్థాపించారు. 1925లో లాస్ ఏంజిల్స్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరమహంస యోగానంద శిష్యులుగా మారారు.1917లో ఆయన ఆదర్శ జీవన్ విద్యాలయ(Adarsh Jeevan Vidyalaya)ను స్థాపించారు. ఈ పాఠశాలలో ఆధునిక విద్యా పద్ధతుల ద్వారా యోగా శిక్షణ, ఆధ్యాత్మిక ఆదర్శాలను అందించారు. పరమహంస యోగానంద ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం 1977, 2017లలో రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసింది. పరమహంస యోగానంద 1952 మార్చి 7న లాస్ ఏంజెల్స్లో మహాసమాధిలో ప్రవేశించారు. ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్గా ఉంటూ.. -
కోరికలను తీర్చేది... ఆత్మదర్శనం
జీవితంలో ఎంత పొందినా, ఎంత కీర్తి గడించినా, ఇంకా ఏదో కావాలి అన్న కోరిక మానవుడిని అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ఫలితంగా ఇంకా ఏదో కావాలని నిరంతరాయంగా అన్వేషణ సాగుతుంటుంది. ఏది గమ్యం, ఎటు వైపు పయనం అన్న అవగాహన లేకుండా మనిషి ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. కోరికల వలయంలో కూరుకుపోతూ కొట్టుమిట్టాడతాడు మనిషి. చాలామందికి కోరికల నిజతత్వంపై అవగాహన ఉండదు. అందుకే ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కల్పనలు చేసుకుంటూ, కలలు కంటూ, అనేకమైన కోరికలతో జీవితాలను వెళ్లదీస్తారు. ప్రాపంచికమైన కోరికలను మాత్రమే తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని భావించేవారు సత్యానికి చాలా దూరంగా ఉన్నట్లు లెక్క. ఇటువంటి మనఃస్థితి ఉన్నవారు కోరికలు తీరని పక్షంలో మానసిక సమతుల్యతని కోల్పోతారు. కోరికలు తీరకపోవడం కారణంగా ఏర్పడే లోటు వల్ల వారు తమ పరిస్థితిని మరింత దుర్భరం చేసుకుంటారు. బాహ్యమైన విషయాలు సంతోషాన్ని తప్పక అందిస్తాయి. కానీ ఆత్మతృప్తిని, ఆనందాన్ని అందించలేవు. బాహ్యమైన విషయాల ద్వారా కానీ, వస్తు సంపదల ద్వారా కానీ ఏర్పడే సంతోషం కొద్దిసమయం పాటే నిలబడుతుంది. ఈ కారణంగానే ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇంకా ఇంకా ఏదో కావాలని మనిషి నిరంతరం తపన పడుతూ, అన్వేషిస్తూనే ఉంటాడు. ఆత్మజ్ఞానమే ఆ అన్వేషణకు సమాధానం. ఎన్నడూ మార్పు చెందనిది, శాశ్వతమైనది మాత్రమే యధార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు. ఆత్మతత్వం ఏమిటో అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఆత్మతృప్తి అనంతమైన కోరికలన్నిటిని తీరుస్తుంది. నిజమైన ఆనందం మీలోనే ఉంది. ఆ ఆనందమే మీ నిజ తత్వమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారంలోనే నిజమైన ధన్యత ఉంది. చాలామంది ఆత్మవిద్య కోసం ఎందుకు అన్వేషణ చేయరంటే, ఆత్మజ్ఞానం కోసం వాళ్లు దేన్నో వదిలి వేయాలని భ్రమ పడతారు. ధ్యానసాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన ఎందరో మహనీయులు, మహితాత్ములు ఆత్మదర్శనంతోనే తమకు మిగిలినవన్నీ సమకూరాయని తెలిపారు, నిరూపించారు కూడా. మీరు ఆశించే ప్రతిదీ పరమాత్మ సృష్టిలోనే ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ విషయాన్ని ప్రగాఢంగా నమ్మండి. దేన్ని కోరుకుంటే కోరికలన్నీ తీరి మనసు శాంతిస్తుందో అదే ఆత్మ. ఆ ఆత్మదర్శనం దిశగా అడుగులు వేయండి. ఈ రోజే సాధన మొదలు పెట్టండి. ఆత్మజ్ఞానం కోసం మీరు దేన్ని వదిలి పెట్టవలసిన అవసరం లేదు. నిజానికి ఆత్మజ్ఞానంలోనే మీకు కావాల్సిన సాఫల్యమంతటినీ కనుగొంటారు. మీ హృదయం లోనే దివ్యమైన ఆనందాన్ని, ఆత్మతృప్తిని అనుభూతి చెందుతారు. ఆత్మతో అనుసంధానం కలిగినప్పుడు బాహ్యంగా మీరు దేన్నీ అన్వేషించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా సాధన చేసే యోగికి తీరని కోరికలు ఏవి ఉండవు. – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
డియోర్ బ్యాగ్పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్తో ఇటీవల ఎయిర్పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్తో కనిపించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్కతాలో జన్మించారు. కోల్కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించారు. ఆమె ఛానెల్కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
బిగ్బాస్కు వెళ్లినందుకు ట్రోలింగ్.. ఆచార్యులు ఏమన్నారంటే?
'బిగ్బాస్ షోకి రమ్మని పిలిచారు.. కోట్లు ఇస్తామన్నారు, అక్కర్లేదని తిరస్కరించాను. నేను పాటించే సాంప్రదాయాలకు, విలువలకు అది అనువైన ప్రదేశం కానే కాదు.. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అక్కడికి వెళ్లను. నాకు డబ్బు కన్నా విలువలే ముఖ్యం..' ఆధ్యాత్మికవేత్త, బాబా అనిరుద్ధాచార్య గతంలో అన్న మాటలివి.బాబాపై ట్రోలింగ్బిగ్బాస్ షో అంటేనే గిట్టని ఆయన ఇటీవల హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గ్రాండ్ లాంచ్లో మెరిశారు. అయితే కంటెస్టెంట్గా కాదు, కేవలం అతిథిగానే! అయినా సరే ఆ రియాలిటీ షోకి ఎందుకు వెళ్లావంటూ జనాలు విమర్శించారు. దీంతో బాబా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. ఊపిరి ఉన్నంతవరకు అదే చేస్తా..నేను బిగ్బాస్కు వెళ్లడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసేందుకు, దాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతోనే వెళ్లానే తప్ప ఆ షోలో పాల్గొనాలని కాదు. దయచేసి నన్ను మన్నించండి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. నేను బతికున్నంతవరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్వయం ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్కు పదేళ్ల జైలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్ను అరెస్టు చేసింది.2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. నేపాల్ ‘బుద్ధ బాయ్’ అరెస్ట్
కఠ్మాండు: నేపాల్కు చెందిన ఆధ్యాతి్మక నేత, బుద్ధుడి అవతారంగా భావించే రామ్ బహదూర్ భోంజన్(33)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలోని పలువురు యువతుల అదృశ్యం, అత్యాచారం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నీళ్లు, ఆహారం, నిద్ర లేకుండా ధ్యానంలో అతడు నిశ్చలంగా నెలలపాటు ఉంటాడని ఆయన అనుచరులు నమ్ముతారు. అతడిని బుద్ధ్ధ బాయ్గా పిలుచుకుంటారు. తన ధ్యానానికి ఆటంకం కలిగించినందుకు గాను పలువురిపై అతడు దాడి చేసినట్లు, అనుయాయులపై భౌతిక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్న రామ్ బహదూర్ దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సలార్హి ఆశ్రమంలో ఓ బాలికపై 2018లో అత్యాచారానికి పాల్పడినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. బుధవారం పట్టుబడిన సమయంలో అతడి వద్ద 3 కోట్ల నేపాలీ కరెన్సీతోపాటు 22,500 డాలర్లు లభించినట్లు సమాచారం. -
కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..
ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు. ‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే! అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు. మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే... ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు. ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు) -
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రం: స్వామి చిదానందగిరి
హైదరాబాద్: భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని, ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారమని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి చెప్పారు. హైదరాబాద్ కన్హ ఆశ్రమంలో జరిగిన వైఎస్ఎస్ సంగం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మానవ జాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమయమైన భవిష్యత్తు కావాలంటే ఈ చైతన్యాన్ని ప్రపంచ మానవులందరిలో నెలకొల్పా లని అయన సూచించారు. స్వర్ణమయమైన సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, భవిష్యత్తులో రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య, వారధులుగా తయారవ్వాలని అయన భక్తులకు పిలుపునిచ్చారు . యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద ధ్యానం, సంఘం, గురుకృపతో కూడిన మూడు అంశాల సాధనా మార్గాన్ని ప్రసాదించారని స్వామి చిదానందగిరి చెప్పారు. ఈ మూడింటి సమ్మేళనమే ఈనాటి కార్యక్రమ ప్రధాన సూత్రమని తెలిపారు. దీన్ని "క్రియాయోగ శరణం"గా అయన అభివర్ణించారు. తద్వారా దివ్యానందం, దివ్యకాంతి అనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన చెప్పారు. నిత్యం క్రమం తప్పకుండా చేసే శాస్త్రీయ క్రియాయోగ సాధన ద్వారా శాశ్వత పరమాత్మ తత్వంలో శరణు పొందాలన్నారు. పరమహంస యోగానంద చెప్పినట్లుగా ప్రపంచం ముక్కలవుతున్నా చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా విజేతగా ఉండడానికి దృఢసంకల్పం చేసుకోవాలని స్వామి చిదానందగిరి సూచించారు. అయితే ముందుగా జ్ఞాన ఖడ్గంతో అవిద్యాజనిత సందేహాలన్నిటినీ ఖండించి పారవేయాలన్నారు కనుబొమ్మల మధ్య బిందువు మీద దృష్టిని ఏకాగ్రం చేస్తే, ఆంతరంగంలో నుంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుందని స్వామి చిదానంద గిరి చెప్పారు. ఈ అలౌకిక చైతన్యమే జీవితానికి గొప్ప రక్షణ అని ఆయన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు స్వామి విశ్వానందగిరి, యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానందగిరి, ప్రధాన కార్యదర్శి స్వామి ఈశ్వరానందగిరి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 3200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. ఈ నెల 16 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. చదవండి: యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’ -
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్లో శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. -
నాసిక్లో ముస్లిం మత గురువు దారుణ హత్య
ముంబై: ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. అఫ్గనిస్తాన్కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాశిక్లో నివసిస్తున్నారు. స్థానికంగా సూఫీ బాబాగా పేరొందారు. యోలా పట్టణంలోని ఎమ్ఐడీసీ ఓపెన్ ప్లాట్లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిందితులు మత గురువు నుదుటిపై పిస్టోల్తో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబాను హత్య చేసిన అనంతరం నిందితులు అతనికి చెందిన ఎస్యూవీ కార్లోనే పరారయ్యారు. విషయం తెలుసుకున్న యోలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆధ్యాత్మిక గురువు కారు డ్రైవర్నే ప్రధాని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాబా డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ వ్యాఖ్యల ప్రకంపనలు.. ఆమె తల తెస్తే ఇల్లు రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్ -
రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు. అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు. -
నిత్యానందపై ఇంటర్పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్పోల్కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
రూ.40 కోట్లు కుచ్చు టోపీ, బురిడీ బాబా అరెస్ట్
-
పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికవేత్తగా ప్రజలను మోసం చేస్తున్న కుమార్ గిరిష్ సింగ్ అనే బురిడి బాబాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గిరీష్ సింగ్తోపాటు అతని సోదరుడు దిలిప్ సింగ్ను ఎస్ఆర్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన గిరీష్ సింగ్ ఆధ్యాత్మిక వేత్తగా ప్రజలను మోసం చేస్తూ దాదాపు రూ.40 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన గిరీష్ సింగ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించాడు. అనంతరం సోదరుడు దిలీప్ సింగ్తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. ఇంటర్ ఫెయిల్ అయిన గిరీష్ కుమార్ హిమాలయాన్ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు. గత ఏడాది గిరీష్ సింగ్ తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బుపై ఆశ పెంచుకున్న గిరీష్...యువతులను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. పలు టీవీ ఛానల్లో సైతం ఆధ్యాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో గిరీష్ సింగ్ అనేక మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, చివరికి వారికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గిరీష్ సింగ్, అతని సోదరుడు దిలీప్ను పలు కేసుల కింద అరెస్టు చేశారు. జనాల నుంచి వసూలు చేసిన డబ్బుతో అతగాడు దాదాపు ఇరవై దేశాలు చుట్టేసి... అక్కడ జల్సాలు చేశావాడు. అతగాడు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. గత ఏడాదే గిరీష్ కుమార్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అతగాడిలో ఏ మార్పు రాలేదు. ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు. రాచకొండ ఉమ్మడి కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే అతని తరగతులకు హాజరయ్యే వారి నుంచి రూ.10,000 నుంచి రూ .2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇతనిపై 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని, గిరీష్, అతని సోదరుడి పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి డిబెంచర్లు, డ్రీం బ్రిడ్జ్ల రూపంలో రూ.40 కోట్లు కాజేశారని తెలిపారు. -
ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద
న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్కుమార్ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్పూర్లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
లైంగిక వేధింపుల కేసు : స్వామి ఆనంద్ గిరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : యోగా, ఆథ్యాత్మిక గురువుగా చెప్పుకునే స్వామి ఆనంద్ గిరిని ఇద్దరు మహిళా శిష్యులను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు సిడ్నీలో అరెస్ట్ చేశారు. రూటీ హిల్లో 2016లో ఓ ప్రార్ధనా సమావేశానికి హాజరైన ఆనంద్ గిరి ఓ మహిళను వేధించారని, 2018 నవంబర్లో మరో ఘటనలో 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆస్ర్టేలియాలో ఆరు వారాల పర్యటనలో ఉన్న స్వామి ఆనంద్ గిరిని మే 5న సిడ్నీలో అరెస్ట్ చేశారు. ఆనంద్ బెయిల్ అప్పీల్ను తిరస్కరించిన కోర్టు కస్టడీకి తరలించింది. జూన్లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యూపీలోని ప్రయాగ్రాజ్లోని బడే హనుమాన్ ఆలయంలో నిందితుడు మహంత్గా వ్యవహరిస్తున్నాడు. ఆనంద్ ఫేస్బుక్ పేజ్లో ఆయన పలువురు ప్రముఖ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో కలిసి ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్లతో కలిసి ఉన్న ఫోటోలున్నాయి. -
రేప్ బెదిరింపులతోనే భయ్యూ ఆత్మహత్య
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్(50) ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానని సేవకురాలు పలక్ పురాణిక్(25) బెదిరించడంతోనే 2018, జూన్ 12న భయ్యూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్ డీఐజీ మిశ్రా తెలిపారు. తగు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆశ్రమానికి చెందిన వినాయక్(42), శరద్(34)లు పలక్తో చేతులు కలిపి భయ్యూ మహారాజ్కు హైడోస్ మందులు ఇచ్చారని వెల్లడించారు. వీరంతా కలిసి ఆయన్ను ఆత్మహత్యకు పురిగొల్పా రని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిందన్నారు. -
పాఠాలు చెప్పమని వస్తే...
అయోధ్య : ఆధ్యాత్మిక బోధనలు విందామని వచ్చిన భక్తురాలిపై అయోధ్యలోని ఓ ఆలయ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంచివాడిగా నటిస్తూ దేవుడి సన్నిధిలో కామంధుడి రూపం దాల్చాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కటకటకాల పాలయ్యాడు. వివరాలు.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందామని వారణాసికి చెందిన ఓ మహిళ (30) డిసెంబర్ 24న వచ్చారు. బయటకు వెళ్తే బోధనలకు ఇబ్బంది అవుతుందనీ, ఆలయ పరిసరాల్లోని ఓ గదిలో ఉండాలని పూజారి నమ్మబలికాడు. ఆపై ఆమెను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం గోప్యంగా ఉంచేందుకు ఆమెను బయటకు రాకుండా ప్రతిఘటించాడు. ఎలాగోలా బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమెను రక్షించారు. పూజారి కృష్ణకాంతాచార్యను మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపంచామని సీఐ ఏకే.సావ్ తెలిపారు. -
ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..?
ఇండోర్ : ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం తనను తాను తుపాకితో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ ఆయన గదిలో లభించింది. కానీ తాజాగా ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు ఆయన ఒక రెస్టారెంటుకు వెళ్లినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటపడింది. ఆయన రెస్టారెంటులోకి ప్రవేశిస్తునే ఫోన్లో ఎవరితోనో సంభాషిస్తున్నారు. కొంతసేపటికి ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన రెండో భార్య డాక్టర్ ఆయుష్ శర్మ అక్కడికి వచ్చారు. తర్వాత భయ్యూజీ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన ఒకింత ఆదోళనగా, గాబరాపడుతున్నట్లు కనిపించారు. సూసైడ్ నోట్లో మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నప్పటికి, అసలు కారణం వేరే ఉన్నట్లు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాలు.. భయ్యూజీ ఆస్తి విషయంలో మొదటి భార్య మాధవికి, రెండో భార్య ఆయుషీ శర్మకు విభేదాలు ఉన్నాయి. తన తండ్రి మరణానికి ఆయుషీ శర్మనే కారణమంటూ మొదటి భార్య కూతురు కుహు ఆరోపించారు. ఆస్తి కోసం కుహు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిందని దాని కారణంగానే భయ్యూజీ ఆత్మహత్య చేసుకున్నారని ఆయుషీ ప్రత్యారోపణలు చేశారు. రాజకీయ వత్తిడి.. భయ్యూజీ ఆత్మహత్యకు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భయ్యూజీకి వేల సంఖ్యలో అభిమానులు, భక్తులు ఉన్నారని అందుకోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చి లోబర్చుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని విమర్శలు గుప్పించింది. తమ ప్రభుత్వానికి సహారించనందుకే భయ్యూజీని ఆత్మహత్య చేసుకునేలా బీజేపీ ఆయనను వేధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భయ్యూజీకి తన క్యాబినెట్లో మంత్రి పదవీ ఆఫర్ చేస్తే, భయ్యూజీ దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
‘భయ్యూజీ మరణానికి కారణం అదే...’
భోపాల్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నర్మదా నది తీరంలో చేపట్టిన అక్రమ తవ్వకాల గురించి భయ్యూజీ ప్రశ్నించేవారని.. అయితే తమ అవినీతి గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఆయనకు మంత్రి పదవి ఆశ చూపినా లొంగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి భయ్యూజీ తనతో ఫోన్లో మాట్లాడారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించడం వల్లే ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. కాగా భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఇండోర్లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గదిలో ఓ నోట్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని భయ్యూజీ నోట్లో రాశారు. నోట్లోని దస్తూరీ మహారాజ్దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. -
అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు
ఇండోర్ : ఆధ్యాత్మిక భోదనలు చేసే గురు భయ్యూజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లో బాగా పాపులర్ అయినా, ఈయన గురించి ఇతర రాష్ట్రాల వారికి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక, శాంతి బోధనలు చేసే గురువే ఆత్మహత్యకు పాల్పడంతో ఆయన మరణ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గురు భయ్యూజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. భయ్యూజీ అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్ముఖ్. 1968లో మధ్యప్రదేశ్లోని శాజాపూర్ జిల్లా శుజల్పూర్లో జమిందార్ వంశంలో జన్మించారు. మొదట ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసిన భయ్యూజీ, తర్వాత మోడల్గా మారారు. ప్రముఖ వస్త్రాల బ్రాండ్ సియారామ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేశారు. భయ్యూజీకి, మాధవితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. 2015లో భార్య మాధవి చనిపోగా, 2017లో డాక్టర్ ఆయుషి శర్మను రెండో వివాహం చేసుకున్నారు. 1999లో ‘సద్గురు దత్తా ధార్మిక్ పర్మార్థిక్’ అనే ట్రస్ట్ను నెలకొల్పారు. ఇండోర్లోని భయ్యూజీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, రాజ్ థాక్రే, లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు సందర్శించారు. ఈయన జీవన విధానం చాలా విలాసవంతంగా ఉండేది. మెర్సిడిస్ ఎస్యూవీ కార్లు, రోలెక్స్ చేతి గడియారాలు, గుర్రపు స్వారీలు, రిసార్ట్స్లో బసచేయడాలు అన్ని లగ్జరీగానే ఉండేవి. అవ్వడానికి ఆధ్యాత్మిక గురువైనప్పటికి రాజకీయంగా కూడా చాలా ప్రభావశాలిగా ఉండేవారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్కు భయ్యూజీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్థాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రేతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భయ్యూజీ సన్నిహితంగా మెలిగే వారన్న విషయం తెలిసిందే. -
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
-
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
హైదరాబాద్ : ఆధునిక సమాజంలో చాలామంది తమ భావాలను నేరుగా వ్యక్తీకరించడం మరచి... టైప్ చేయడం, బొమ్మలతో వ్యక్తం చేయడం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహాత్రియ రా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్’పేరుతో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్రియా రా మాట్లాడుతూ... భావ వ్యక్తీకరణ నేరుగా హావభావాలతో ఆచరణలో చూపించాలన్నారు. అప్పుడే అనుబంధాలు నాలుగు కాలాల పాటు ఉంటాయని తెలిపారు. కుటుంబం కోసం సమయం వెచ్చించాలని, కుటుంబసభ్యుల మధ్య నిందలు కాకుండా పొగడ్తలు మాత్రమే ఉండాలని చెప్పారు. దైవం మన ఇంట్లోనే ఉన్నారని, ఇంట్లో వారిని సంతోషానికి గురి చేయాలని చెప్పారు. వృత్తిలో కస్టమర్ మెప్పు కోసం ఏమైనా చేస్తామని.. అదే ఇంట్లోవారి కోసం కూడా చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సంబంధ బాంధవ్యాలే పునాది అన్నారు. పిల్లలను స్పర్శ ద్వారా ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకోవాలని తెలిపారు. ఇవి పాటిస్తే రాబోయే రోజుల్లో పుస్తకాలు చదివి సంబంధ బాంధవ్యాలు పెంచుకొనే దౌర్భాగ్య పరిస్థితి పట్టకుండా ఉంటుందన్నారు. ఎంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చేతిరాత మరవొద్దని, అది బ్రెయిన్ రైటింగ్ అని తెలిపారు. రాతను బట్టి అతని మనస్తత్వం చెప్పవచ్చని తెలిపారు. ఎఫ్ఐసీసీఐ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ ప్రియాంక గనెరివాల్ అరోరా మాట్లాడుతూ... ఆరు లక్షల రూపాయలు వెచ్చించి 1,000 మంది విద్యార్థినులకు హ్యాపీ ఉమెన్స్ కిట్స్ను త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ సేవాభావం అలవరుచుకోవాలి
యూనివర్సిటీక్యాంపస్ : అందరూ సేవాభావం అలవరుచుకోవాలని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లా యంత్రాంగం తరఫున ఆయనకు స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం రవిశంకర్ సత్సంగం చేశారు. అందరూ ఆ«ధ్యాత్మికత, సేవాభావం అలవాటు చేసుకోవాలని అప్పుడే సంతోషంగా ఉం టారని చెప్పారు. ప్రతి మనిషిలోపల ఏడు చక్రాలు ఉంటాయన్నారు. ఏడుకొండలపై వెలసిన శ్రీవారు ఎంతో మహిమకలిగిన దేవుడు అన్నారు. అన్నమయ్య రచించిన ‘‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’’ కీర్తనలోని పరామార్థాన్ని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్, తిరుపతి సాంస్కృతిక హబ్గా తయారవుతుందన్నారు. ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతిని తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్న ప్రద్యుమ్న నేతృత్వంలో తిరుపతి ఆధ్యాత్మిక ఆనంద నగరంగా తీర్చిదిద్దబడుతుందనడంలో సందేహం లేదన్నారు. అలరించిన అన్నమాచార్య కీర్తనలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా ఎస్వీ స్టేడియంలో జోతిర్మయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. ప్రేక్షకులు భక్తిసాగరంలో మునిగి తేలారు. అనంతరం హాలీంఖాన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న, ఆర్డీఓ కనకనరసారెడ్డి పర్యవేక్షించారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి ఎస్వీ స్టేడియంలో శ్రీరామనవమి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే సినీనేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవీ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విబ్రీమీడియా పర్యవేక్షిస్తోంది. యోగాతో మానసిక శాంతి తిరుచానూరు: యోగాతోనే మానసిక శాంతి సాధ్యమని యోగా శిక్షకులు తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం శిల్పారామంలో యోగాపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు యోగాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు తరలివచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ ఒకప్పుడు జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానికి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. -
చర్చకు రమ్మంటే.. తల నరికిన ఫొటో పంపారు
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు ఝలక్ ఇచ్చారు. శాంతి చర్చలకు ఆయన ఆహ్వానం పంపిస్తే తల నరికిన ఫొటోను బదులుగా ఉగ్రవాదులు పంపించారు. ఇటీవల ప్రపంచ సాంస్కృతిక పండుగను విజయవంతంగా నిర్వహించిన ఆయన అదే ఆశతో ఉగ్రవాద సంస్థతో చర్చలు జరిపి వారిని మార్చాలనుకున్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. 'నేను ఇస్లామిక్ స్టేట్ సంస్థతో శాంతియుత చర్చలు జరపాలని అనికున్నాను. కానీ వారు మొండెంతో ఉన్న వ్యక్తి ఫొటోను తీసి పంపించారు. ఇక వారితో శాంతి చర్చలు లేనట్లే' అని ఆయన చెప్పారు. -
'ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది'
భోపాల్: చర్చల ద్వారా భద్రతా బలగాల ద్వారా ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఈ చర్యలకు బదులుగా ప్రతి ఒక్కరికి ఈ భూమిపై జీవించే హక్కు ఉందని ఉగ్రవాదులు అర్థం చేసుకునేలా చేయడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. 'ఉగ్రవాదులను తప్పకుండా చర్చలకు ఆహ్వానించాలి. అయితే, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని వారు అర్థం చేసుకోనంతవరకు ఇలాంటి పని వ్యర్థమవుతుంది. అందుకే వారిని నియంత్రించేందుకు భద్రతా బలగాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది మాత్రం శాశ్వత పరిష్కారం కాదు' అని రవిశంకర్ అన్నారు. కుంచిత మనస్తత్వం వల్లే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలమీద చిన్నతనం నుంచే అవగాహన కల్పించినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదని చెప్పారు. చాలా కాలం నుంచి భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని తొలుత చెప్పినప్పుడు ఏ ఒక్క పాశ్చాత్య దేశం ఆమోదించలేదని, పైగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయే తప్ప ఎవరూ కావాలని దాడులు చేయరని వ్యాఖ్యానించాయని, ఇప్పుడు తాజాగా పారిస్ దాడులతో ఆ దేశాలకు అసలు విషయం బోధపడిందని అన్నారు. భారత్ సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసివచ్చిందని, పారిస్ ఘటనతో యూరప్ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి భారత్ ముందు నుంచి చేస్తున్న హెచ్చరికలను నేటికి అర్థం చేసుకున్నాయని అన్నారు. ఇక, దేశంలో అసహన పరిస్థితులు ఉన్నట్లు తనకు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఇలాంటి పుకార్లన్నీ ఎన్నికల సమయంలోనే షికార్లు చేస్తాయని చెప్పారు. -
నరేంద్ర మోదీ గురువు స్వామి దయానంద గిరి శివైక్యం
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్లోని దయానంద ఆశ్రమంలో బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి దయానంద శివైక్యం చెందారు. ఈ నెల11న చివరి సారిగా మోదీ, స్వామి దయానంద గిరిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆడిగి తెలుసుకున్నారు. -
'ఇంటర్నెట్ ఆధారిత జీవనం ప్రమాదకరం'
హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక విలువలు పడిపోతున్నాయని, ధనార్జనే ధ్యేయంగా ఎంత క్రూరత్వానికైనా సిద్దపడుతున్నారని ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి అన్నారు. భారతదేశ యాత్రలో భాగంగా అమ్మ ఆదివారం నగరంలోని మహేంద్రహిల్స్లోని ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నేటి తరం వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారని అన్నారు. ప్రస్తుతం అంతా ఇంటర్నెట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, ప్రజల్లో ధ్యానం, భక్తి, యోగాసానాలు వేయడం, ప్రవచనాలు వినడం, భజనలు చేయడం చాలా తగ్గిపోయాయని, సేవా గుణాన్ని మరిచిపోతున్నారని మాతా అమృతానందమయి ఆవేదన వ్యక్తం చేశారు. తోటివారిని ప్రేమతో దగ్గరకు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమ్మ విద్యామృతం పథకం కిదం దాదాపు వెయ్యిమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, 500 ల మంది వితంతువులకు పింఛన్లు అందజేశారు. -
ఆశారాం కుమారుడు అరెస్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు, అత్యాచారం కేసులో నిందితుడు నారాయణ సాయిని ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. 58 రోజులుగా పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్న సాయితో పాటు అతడి సహాయకుడు కౌశల్ ఠాకూర్ అలియాస్ హనుమాన్ (29), డ్రైవర్ రమేశ్ మల్హోత్రా (27) కూడా పట్టుబడ్డారు. వారిని రోహిణి మేజిస్ట్రేట్ ఎదుటహాజరుపరచగా, గుజరాత్ పోలీసులకు 24 గంటల ట్రాన్సిట్ రిమాండ్కు అప్పగించారు. సిక్కుల మాదిరిగా తలపాగా ధరించి మారువేషంలో ఉన్న నారాయణ సాయిని, అతడి అనుచరులను కురుక్షేత్ర సమీపంలోని పిప్లి వద్ద అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నారాయణ సాయిపై రూ.5 లక్షలు, హనుమాన్పై రూ.లక్ష మొత్తాలను పోలీసులు ఇదివరకే రివార్డుగా ప్రకటించారు. సాయిని, అతడి అనుచరులను రోహిణి జిల్లా కోర్టుల కాంప్లెక్స్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు పోలీసులు తీసుకు వచ్చిన సమయంలో సాయికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై అతడి మద్దతుదారులు దాడి చేశారు. ఇద్దరు అక్కచెల్లెళ్ల ఫిర్యాదు ఆధారంగా ఆశారాం, ఆయన కుమారుడిపై సూరత్ పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపులు అభియోగాలపై కేసు లు నమోదు చేశారు. ఆశారాం ప్రస్తుతం జోధ్పూర్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
ఆశారామ్ బాపూపై లైంగిక దాడి కేసు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ (74)పై మంగళవారం ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసుస్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆశారామ్ ఇటీవల తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురా లు పేర్కొంది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. బాధి తురాలు మధ్యప్రదేశ్ చింద్వారాలో ఆశారామ్కు చెందిన గురుకులంలో 12వ తరగతి చదువుతోంది. ఈ ఆరోపణలను ఆశారామ్ బాపూ ఆశ్రమ ప్రతినిధి తోసిపుచ్చారు.