tds
-
అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం
వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ తెలిపారు. కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు అర్ధమయ్యే విధంగా ఉంటుందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం జూలై 2024లో ఆదాయపు పన్ను చట్టానికి సంబందించిన సమగ్ర సమీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడమే దీని లక్ష్యం అని అప్పుడే వెల్లడించింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడే.. చెల్లింపుదారులకు పన్ను ఖచ్చితత్వం లభిస్తుంది. కాబట్టి దీనిని త్వరగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాల సరళీకృతం జరుగుతున్నప్పుడు.. కేపీఎంజీ జనవరి 2025లో పరిశ్రమ అభిప్రాయాలను మరియు అంచనాలను సంగ్రహించడానికి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 200 కంటే ఎక్కువ మంది అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారిశ్రామిక తయారీ, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అండ్ నేచురల్ రీసోర్సెస్, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా మొదలైన ఇతర రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు.సర్వేలో తేల్చిన విషయాలు➤సుమారు 84 శాతం మంది సరళీకరణ చాలా అవసరమని చెప్పారు. ఇందులో 30 శాతం కంటే ఎక్కువమంది లావాదేవీ వర్గాలను కవర్ చేసే టీడీఎస్ నిబంధనలను సరళీకృతం చేయాలని అన్నారు. మూలధన లాభాల పన్ను, వ్యాపార ఆదాయ గణన వంటి ఇతర అంశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.➤96 శాతం మంది ప్రభుత్వం ప్రచురించిన ఆదాయపు పన్ను వ్యాఖ్యానాన్ని రూపొందించడానికి మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. పన్ను సర్క్యులర్లు లేదా నోటిఫికేషన్ల నుంచి ఇప్పటికే తీసుకున్న ప్రయోజనకరమైన స్పష్టీకరణలను ఆదాయపు పన్ను చట్టంలో నేరుగా చేర్చాలని కోరుకుంటున్నారు.➤87 శాతం మంది తప్పనిసరి TDS సర్టిఫికేట్ జారీని తొలగించాలని అంటున్నారు. 61 శాతం మంది ఫేస్లెస్ ఇంటరాక్షన్లకు మద్దతు ఇస్తున్నారు. డివిడెండ్ పన్నులతో సహా అధిక ప్రభావవంతమైన పన్ను రేట్లను పేర్కొంటూ 58% మంది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని చెబుతున్నారు. 34 శాతం మంది ప్రస్తుత రేట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. 7 శాతం మంది నాన్ రెసిడెంట్ కంపెనీలకు మాత్రమే తగ్గింపులను కోరుకుంటున్నారని తెలుస్తోంది. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్యూఎఫ్ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్లపై టీసీఎస్ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్లైన్ ప్రాజెక్ట్లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
టీడీఎస్లో మార్పులు.. అద్దె ఆదాయంపై భారీ ఊరట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో టీడీఎస్కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు."ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్వర్క్ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.టీడీఎస్లో ప్రధాన మార్పులు ఇవే..సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపుఅద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుపాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్గా పరిగణించాలని సూచించింది. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్లు ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్లో తెలియజేసింది. -
కొత్తకు జైజై.. పాతకు బైబై..
సాక్షి, అమరావతి : ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్..ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194ఐఏ సెక్షన్ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను రూ.75వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్దారుల స్టాండర్డ్ డిడక్షన్ను రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది. కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది. -
టీడీఎస్ విధించకూడదంటే ఏం చేయాలో తెలుసా..
పన్నుదారులకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించకుండా పాన్ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.6 డివిడెండ్ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్-పాన్ అనుసంధానం అవ్వకపోతే పాన్ చెల్లదు) డివిడెండ్పై 20 శాతం టీడీఎస్ కట్ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.డివిడెండ్ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్లో ఎల్ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్డేట్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి.. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్ఆపరేటివ్లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా?అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
గతవారం స్థిరాస్తి అద్దెకిచ్చినప్పుడు ఓనర్గారికి ఆ ఆదాయం ఎలా లెక్కించాలి .. మినహాయింపులేమిటి? మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఈసారి మీరు అద్దె చెల్లించే వారయితే .. అంటే మీరు కిరాయిదారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన విషయాలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ♦మీరు ఇచ్చే రెంటుకి అగ్రిమెంటు రాసుకోండి. దయచేసి రెంటును నగదు రూపంలో ఇవ్వకండి. చెక్కు ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, బదిలీ ద్వారా రెంటు ఇవ్వండి. ♦కొంత నగదు, కొంత బ్యాంకు అని ఒప్పుకోకండి. రెంటు ఇవ్వగానే రసీదు పుచ్చుకోండి. కనీసం ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారానైనా తీసుకోండి. సత్సంబంధాలు కొనసాగినన్నాళ్లూ రసీదు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ జాతివైరం సహజం. ముందుగా ఆలోచించి ఒక అలవాటుగా అనుసరించండి. ♦ప్రత్యేకించి నగదు పుస్తకం, లెడ్జర్లో పద్దులు రాయకపోయినా, ఈ వ్యవహారాలను అన్ని వివరాలతో సహా ఒక పుస్తకంలో రాయండి. ♦మీరు ఉద్యోగైనా, వ్యాపారస్తులైనా, వృత్తి నిపుణులైనా ఇలా చెల్లించే అద్దెను ఖర్చుగా భావించి, మినహాయింపు పొందాలంటే కాగితాలు కావాలి. ♦మీ ఓనర్ పాన్ నంబరు, బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని భద్రపర్చుకోండి. ♦ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీద అద్దె వసూలయ్యే సందర్భాలూ ఉంటాయి. భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, అన్నదమ్ములు, ఇలాంటి అతి తెలివి వారుంటారు. మీకు సంబంధం లేకపోయినా, మీరు గట్టిగా అడగలేకపోయినా.. కాగితాలు, రసీదు లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ♦194– ఐ సెక్షన్ కొన్ని బాధ్యతలను అంటకట్టింది. అదే టీడీఎస్. ♦చెల్లించే వార్షిక అద్దె రూ. 2,40,000 దాటితే ప్రతి చెల్లింపునకు టీడీఎస్ కట్ చేసి, ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో చెల్లించి ఆ మేరకు ఫారం 16 అని మీ యజమానికి ఇవ్వాలి. ♦194– ఐ వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ♦మరో సెక్షన్ 194 ఐఆ ఉందండోయ్. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. ♦వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, ‘ట్యాక్స్ ఆడిట్’ అవసరం లేని వారు, వర్తించనివారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. ♦అద్దె నెలకి రూ. 50,000 దాటిన వారికే వర్తిస్తుంది. నెలలో కొంత వ్యవధికి అయినా వర్తిస్తుంది. ♦నెలకి రూ. 50,000 అంటున్నారు, సంవత్సరానికి అని అనడం లేదు.. మీరు వారం రోజులకు అద్దె ఇచ్చి రూ. 50,000 దాటి పుచ్చుకుంటే చాలు. ♦ఇలా అద్దె ఇచ్చేటప్పుడు పన్ను రికవరీ చేసి మిగతా మొత్తమే ఇవ్వాలి. ట్యాక్సును సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, ఆ మేరకు టీడీఎస్ సర్టిఫికెట్ 16 ఇ ద్వారా ఇవ్వాలి. ♦పన్ను వసూలు చేయకపోయినా, వసూలు చేసిన మొత్తం సకాలంలో చెల్లించకపోయినా, సకాలంలో టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా .. వడ్డీ, పెనాల్టీలు భరించాలి. ♦ఏతావతా.. రెంటు చెల్లించిన వారికి మాత్రమే టీడీఎస్ బరువు, బాధ్యతలు ఉన్నాయి. -
ట్యాక్స్ పేయర్స్కు ఊరట! టీసీఎస్, టీడీఎస్ అనుసంధానం..
న్యూఢిల్లీ: మూలం వద్దే పన్ను వసూలు చేయడం (టీసీఎస్), మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్)ను ప్రభుత్వం అనుసంధానించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనివల్ల టీసీఎస్ చెల్లించిన వారిపై టీడీఎస్ భారం తగ్గుతుందని.. తద్వారా పన్ను చెల్లింపుదారు నగదు ప్రవాహాలపై ప్రభావం పడకుండా ఉంటుందన్నారు. జూలై 1 నుంచి కొన్ని రకాల అంతర్జాతీయ క్రెడిట్ కార్డు వ్యయాలపై 20 శాతం టీసీఎస్ను అమలు చేస్తున్న దశలో అనంతనాగేశ్వరన్ ఈ అంశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్తకులు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలపై టీసీఎస్ను వసూలు చేస్తుంటారు. అదే టీడీఎస్ అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రెడిట్కార్డు లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ పట్ల నిరసన వ్యక్తం కావడంతో రూ.7 లక్షల వరకు లవాదేవీలకు మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. దీనివల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించిందని... కనుక ఎక్కువ శాతం లావాదేవీలు 20 శాతం టీసీఎస్ పరిధిలోకి రావంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని అనంత నాగేశ్వరన్ సమర్థించారు. -
Mahila Samman Scheme: గుడ్న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్ఎన్ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల వేతనం నుంచి టీడీఎస్ మినహాయించే ముందు పాత, కొత్త పన్ను విధానాల్లో వారికి ఏది సమ్మతమో సంస్థలు తెలుసుకోవాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న పన్ను విధానం పరిధిలోనే టీడీఎస్ వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఏ ఆప్షన్ చెప్పకపోతే, అప్పుడు నూతన పన్ను విధానం కింద టీడీఎస్ మినహాయించాలని కోరింది. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్! -
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
పెట్టుబడి పెట్టే ముందు రాబడి ఒక్కటే చూస్తే కాదు. వచ్చిన లాభంపై పన్ను బాధ్యత ఎంతన్నది కూడా ముఖ్యమే. అప్పుడే కదా నికర రాబడి గురించి తెలిసేది. మ్యూచువల్ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు తదితర డెట్ సాధనాలు, బంగారం, జీవిత బీమా పథకాలు, యులిప్లు ఇలా ఎన్నో పెట్టుబడి సాధనాలున్నాయి. వీటన్నింటిపైనా ఒకే విధమైన పన్ను లేదు. పైగా కాల వ్యవధి ఆధారంగా పన్ను బాధ్యత కూడా మారిపోతుంది. అందుకే ఇన్వెస్టర్లు ప్రతి పెట్టుబడి సాధనం, అందులో వచ్చే రాబడులపై చెల్లించాల్సిన పన్ను, అమలయ్యే టీడీఎస్ తదితర వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ వివరాలను అందించే కథనమే ఇది. సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ అంటూ కొంత ఉంచుతుంటాం. దీనికితోడు మనకు జమయ్యే వేతనం, ఇతరత్రా అన్నీ కూడా వచ్చి ముందుగా నిల్వ ఉండేది బ్యాంకు ఖాతాలోనే. మరి ఈ మొత్తంపై బ్యాంకులు సుమారు 3 శాతం మేర వడ్డీ చెల్లిస్తాయని తెలిసింది తక్కువ మందికే. ఇలా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను లేదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ పన్ను మినహాయింపు కల్పిస్తోంది. రూ.10వేలలోపు ఉన్నా కానీ ఆదాయపన్ను రిటర్నుల్లో ఈ మొత్తాన్ని చూపించాలి. వడ్డీ ఆదాయం రూ.10,001 అంతకంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాలి. సంబంధిత వ్యక్తి ఆదాయం ఏ శ్లాబ్ పరిధిలో ఉంటే ఆ రేటు ప్రకారం, సేవింగ్స్ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ 60 ఏళ్లు నిండి ఉంటే వారికి రూ.50,000 వరకు సేవింగ్స్ బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. రూ.50,001, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే సీనియర్ సిటిజన్లు (వృద్ధులు) సైతం తమ పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. సావరీన్ గోల్డ్ బాండ్స్ సార్వభౌమ బంగారం బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి హామీతో ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. బంగారంలో పెట్టుబడుల కోసం ఉద్దేశించిన సాధనం ఇది. కాల వ్యవధి ఎనిమిదేళ్లు. కాల వ్యవధి ముగిసేవరకు పెట్టుబడిని కొనసాగించినట్టయితే, రాబడిపై ఎలాంటి పన్ను లేదు. మూడేళ్లు మించి, ఎనిమిదేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంది. మూడేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. రిఫండ్ కోరొచ్చు కొన్ని రకాల పెట్టుబడి సాధనాలపై రాబడి నిర్ణీత పరిమితి దాటితే మూలం వద్ద పన్ను వసూలు చేసే (టీడీఎస్) విధానం అమల్లో ఉంది. 10–20 శాతం మేర టీడీఎస్ అమలవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంక్లు, పోస్టాఫీసులు, కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు సంబంధిత ఇన్వెస్టర్ పాన్ నంబర్ ఆధారంగా ఐటీ శాఖకు జమ చేస్తాయి. ఒకవేళ ఇన్వెస్టర్ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే.. ఈ వడ్డీ ఆదాయంపైనా అంతే మేర పన్ను పడుతుంది. ఒకవేళ వార్షికాదాయం పన్ను వర్తించని పరిధిలో ఉంటే అప్పుడు రిటర్నులను విధిగా నిర్ణీత గడువులోపు దాఖలు చేయాలి. అలా దాఖలు చేసిన తర్వాత టీడీఎస్ రూపంలో మినహాయించిన మొత్తాన్ని తిరిగి తనకు చెల్లించాలంటూ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బంగారం బంగారం ఆభరణాలు, భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేసి, వాటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుంది. మూడేళ్లలోపు విక్రయించనప్పుడు వచ్చే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ మానిటైజేషన్.. ఈ పథకంలో భాగంగా తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని జమ చేయవచ్చు. ఇలా జమ చేసే బంగారం విలువపై ఏటా 2.5% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తంపై పన్ను లేదు. అద్దె ఆదాయం అద్దె ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ అమలవుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయంలో 30 శాతం పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒకవేళ అదే ఇంటికి రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే, ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల కింద రూ.2 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ కోరొచ్చు. ప్రాపర్టీ విక్రయం ప్రాపర్టీని రెండేళ్లకు మించి ఉంచుకుని విక్రయించినప్పుడు వచ్చే లాభంపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని మినహాయించుకోవచ్చు. రెండేళ్లలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కంపెనీ ఎఫ్డీలు/ఆర్డీలు వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి అంతా వ్యక్తి వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్కు చెల్లిస్తారు. పన్నులేని బాండ్లు పేరులో ఉన్నట్టుగా ఈ బాండ్లపై వచ్చే రాబడి కానీ, పెట్టుబడి వృద్ధిపైనా పన్ను ఉండదు. నిర్ణీత కాలానికి ముందుగా విక్రయించినట్టయితే అప్పుడు పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయిస్తే రాబడి అంతా వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. ఏడాది తర్వాత, నిర్ణీత గడువు ముగియకుండా అమ్మేస్తే రాబడిపై 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇక్కడ కూడా ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. ఎన్ఎస్సీ/కేవీపీ ఈ సాధనాల్లో వచ్చే రాబడి సైతం వ్యక్తి ఆదాయానికి కలుస్తుంది. రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలో ఉంటే పన్ను చెల్లించాలి. టీడీఎస్ అమలు చేయరు. మ్యూచువల్ ఫండ్స్ పన్ను విషయానికొస్తే మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్కు వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ పథకం ఏదైనా కానీ తన నిర్వహణ ఆస్తుల్లో 65 శాతం, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. ఇంతకంటే తక్కువ ఈక్విటీ పెట్టుబడులు కలిగి ఉంటే డెట్ ఫండ్స్ కిందకు వస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్, 65 శాతం అంతకంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అన్నింటికీ ఒక పన్ను విధానం అమల్లో ఉంది. వీటిల్లో పెట్టిన పెట్టుబడి ఒక ఏడాది నిండకుండా వెనక్కి తీసుకుంటే, రాబడి స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాలి. వ్యక్తి వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా కానీ, ఈక్విటీ లాభాలపై పన్ను చెల్లించాల్సిందే. ఏడాది, అంతకుమించిన కాలానికి ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. దీనిపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన రాబడి రూ.లక్ష వరకు పన్ను లేదు. లక్షకు మించినప్పుడు, ఆ అదనపు మొత్తంపైనే 10 శాతం పన్ను బాధ్యత అమలవుతుంది. లిక్విడ్ ఫండ్స్, డ్యురేషన్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు తదితర సాధనాలన్నీ డెట్ ఫండ్స్ కిందకు వస్తాయి. వీటిల్లో పెట్టుబడులను మూడేళ్లు నిండకుండా వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చే లాభంపై స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఈ మొత్తం వ్యక్తి ఆదాయానికి కలిపి చూపించాలి. మూడేళ్లు నిండిన డెట్ పెట్టుబడి వెనక్కి తీసుకుంటే వచ్చే రాబడి, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. రాబడి నుంచి సగటు ద్రవ్యోల్బణాన్ని తీసేసి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ పథకం కింద కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉండి, కార్పస్ను వెనక్కి తీసుకుంటే కనుక, ఈ మొత్తం వార్షిక ఆదాయానికి తోడు అవుతుంది. రిటైర్మెంట్ వరకు ఆగకుండా, గడువుకు ముందే ఈపీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, ఈ మొత్తం రూ. 50,000 మించితే దీనిపై 10% టీడీఎస్ అమలవుతుంది. పాన్ లేకపోతే 20% టీడీఎస్ అమలవుతుంది. ఎన్సీడీలు/బాండ్లు వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం సైతం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఒక ఏడాదిలో వీటిపై వడ్డీ ఆదాయం రూ.5,000 మించినప్పుడు ఆ మొత్తంపై 10 శాతం టీడీఎస్ పేరిట తగ్గించి, మిగిలినది ఇన్వెస్టర్కు చెల్లిస్తారు. అయితే, ఈ బాండ్లు లేదా ఎన్సీడీలను డీమ్యాట్ రూపంలో కలిగి ఉంటే టీడీఎస్ అమలు చేయరు. ఎన్సీడీలు/బాండ్లను కొనుగోలు చేసిన వారు నిర్ణీత కాలవ్యవధి వరకు కలిగి ఉండకుండా, ముందుగానే సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో విక్రయించినట్టయితే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా పన్ను రేటు లేదు. వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇన్వెస్టర్ పన్ను బాధ్యత ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత ఈ పెట్టుబడులను విక్రయించినప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు రాబడులు వస్తాయి. అప్పుడు రాబడిపై 10 శాతం పన్ను అమలవుతుంది. దీనికి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం లేదు. పోస్టల్ సేవింగ్స్ అకౌంట్ పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో ఒక్కరి పేరు మీదే ఖాతా ఉంటే, అందులోని బ్యాలెన్స్పై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.3,500 వరకు పన్ను లేదు. జాయింట్ హోల్డర్ అకౌంట్ (ఇద్దరి పేరు మీద) అయితే ఈ ఆదాయం రూ.7,000 మొత్తంపై పన్ను లేదు. ఇంతకుమించి ఆదాయం ఉంటే, మినహాయింపు పోను మిగిలిన మొత్తం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(15)(ఐ) కింద ఈ ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఉండి, అదే వ్యక్తి పోస్టల్ సేవింగ్స్ ఖాతా కూడా కలిగి ఉన్నాడని అనుకుందాం. అప్పుడు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపైనా (సెక్షన్ 80టీటీఏ కింద), పోస్టల్ సేవింగ్స్ ఖాతాలపై రూ.3,500 మొత్తంపైనా (సెక్షన్ 10(15)(ఐ)) పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి అర్హులే. పోస్టల్ సేవింగ్స్ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు నిండి, క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన ఈ పథకంలో పెట్టుబడిపై రాబడి వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఎన్పీఎస్ ఎన్పీఎస్ సభ్యులు 60 ఏళ్లు రాగానే పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి వరకు సమకూరిన కార్పస్లో కేవలం 60 శాతాన్ని వెనక్కి తీసుకోగలరు. ఈ మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. మిగిలిన 40%తో యాన్యుటీ ప్లాన్ (పెన్షన్ చెల్లింపులకు సంబంధించి) తీసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసిన వారు మెచ్యూరిటీలో మూడింట ఒక వంతును వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తంపై పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. ఇలా యాన్యుటీ ప్లాన్లపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తి మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే అప్పుడే పన్ను చెల్లించాలి. ఎండోమెంట్/మనీబ్యాక్ బీమా పథకాలు మనలో చాలా మందికి ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి. జీవిత బీమా రక్షణతోపాటు, గడువు ముగిసేవరకు జీవించి ఉంటే, పాలసీదారులకు నిర్ణీత మొత్తం ఈ ప్లాన్ల కింద వస్తుంది. టర్మ్ ప్లాన్లలో కేవలం మరణించినప్పుడే పరిహారం దక్కుతుంది. చివరి వరకు జీవించి ఉంటే ఏమీ రాదు. అందుకని ఎక్కువ మంది ఎండోమెండ్ ప్లాన్లు తీసుకుంటుంటారు. ఈ పథకాల్లో గడువు ముగిసేవరకు కొనసాగితే వచ్చే మెచ్యూరిటీపై పన్ను ఉండదు. యూనిట్ లింక్డ్ ప్లాన్లు (యులిప్లకు) సైతం ఇదే అమలవుతుంది. వీటిల్లో వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.2.5 లక్షలు మించనప్పుడు ఈ ప్రయోజనానికి అర్హులు. వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు మించినప్పుడు, ఈక్విటీ పథకాల మాదిరే ఉపసంహరణ సమయంలో పన్ను రేట్లు అమలవుతాయి. -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్ఎఫ్టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్టూపీర్ అంటే ఎక్సే్ఛంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్ల్లో అయితే ఆయా ప్లాట్ఫామ్లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. -
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
లావాదేవీలపై టీడీఎస్ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్ఫారమ్లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
స్థిరాస్తుల లావాదేవీలపై కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: స్థిరాస్తి లావాదేవీల విలువ రూ.50 లక్షలు మించితే ఒక శాతం టీడీఎస్ మినహాయింపు నిబంధన శుక్రవారం (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది. స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందం విలువ ఏది ఎక్కువైతే దానిపైనే ఇది అమలవుతుంది. అలాగే, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టోలు, ఎన్ఎఫ్టీలు) బదిలీలు, ట్రేడింగ్ లావాదేవీలపై 30 శాతం మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుంది. ఈ మేరకు బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదనలు చేర్చడం తెలిసిందే. -
అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?
గత వారం ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి ట్యాక్స్ ప్లానింగ్ అమలుపర్చే దారిలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ట్యాక్స్ ప్లానింగ్లో ముఖ్యమైన భాగం.. చట్టాన్ని తప్పనిసరిగా సకాలంలో పాటించడమే. నిబంధనలను గౌరవించి అమలుపర్చడమే. పన్ను చెల్లించడం కూడా ప్లానింగ్లో ఒక భాగమే! ప్రతి అస్సెస్సీ తన నికర ఆదాయాన్ని ముందుగానే ఊహించడం చేయాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని కనీసం జూన్ మొదటి వారంలోగా అంచనా వేయాలి. ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు కష్టమే. అందునా ఇప్పుడు మనల్ని పీడిస్తున్న అనిశ్చితిలో ఇది మరింత కష్టమే. అయినప్పటికీ ఇది తప్పదు. ఉద్యోగస్తులకు సంబంధించిన పన్ను భారం టీడీఎస్ రూపంలో యజమాని రికవర్ చేస్తారు. కానీ వీరికి జీతం కాకుండా ఇతర ఆదాయం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్లు, వడ్డీ.. ఇలా ఎన్నో ఉండవచ్చు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది బ్యాంకులో ఉన్న ఎఫ్డీలకు సంబంధించిన వడ్డీ మీద ఏర్పడ్డ పన్ను భారం .. టీడీఎస్తో సరిపోతుందనుకుంటారు. అలా సరిపోదు. ఎందుకంటే బ్యాంకు కేవలం 10 శాతం మాత్రమే రికవర్ చేస్తుంది. మీకు మీ శ్లాబుని బట్టి మరో 10 శాతం లేదా 20 శాతం పడుతుంది. ఈ అదనపు ఆదాయాన్ని మీరు.. అంచనాల్లోకి తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ముందు ముందు వ్యాపారం ఎలా ఉంటుందని ఊహించటం తప్పనిసరి. కనీసం గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయం బేసిస్గా తీసుకోండి. ఇది రెసిడెంట్లకు వర్తిస్తుంది. మొత్తం నికర ఆదాయం లెక్కించి, పన్ను భారాన్ని లెక్కించిన తర్వాత నాలుగు వాయిదాల్లో కింద పేర్కొన్న పట్టిక ప్రకారం చెల్లించాలి. 15 జూన్లోగా 15 శాతం 15 సెప్టెంబర్లోగా 30 శాతం 15 డిసెంబర్లోగా 30 శాతం 15 మార్చిలోగా 25 శాతం మార్చి 15 లోగా మొత్తం పన్ను భారం చెల్లించాలి. మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు టీడీఎస్ తగ్గించాలి. ఏదేని కారణం వల్ల కట్టకపోతే, చెల్లించేందుకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. మార్చి 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే అలా చెల్లించనందుకు గాను నెలకు 1 శాతం లోపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది అనవసరపు ఖర్చు. అంతే కాదు. మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ భారంలో 90 శాతం భాగాన్ని మార్చి 15లోగా చెల్లించకపోతే అదనంగా చెల్లించాల్సిన పన్ను మీద నెలకు 1 శాతం వడ్డీ వడ్డిస్తారు. కాబట్టి వెనువెంటనే 31-3-22కి సంబంధించి నికర ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించండి. అడ్వాన్స్ ట్యాక్స్ భారం రూ.10,000 లోపు ఉన్న వారికి పైన చెప్పిన నిబంధనలు వర్తించవు. (చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) -
స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..
స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్ వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్ చేయాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి; కె.వి.ఎన్లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్) సెపె్టంబర్ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఏప్రిల్–1 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు. ► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రిఫండ్స్ రూ.75,111 కోట్లు. -
పీఎఫ్ విత్ డ్రాపై ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా?
Tax On EPF Withdrawl: కరోనా వైరస్ మహమ్మారి వల్ల సామాన్య ప్రజానీకం సేవింగ్స్ కోసం దాచుకున్న నగదును మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. సాదారణంగా అయితే, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ ఖాతాదారులు చిక్కుల్లో పడుతున్నారు. ఇతర కారణాల చేత ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 నాల్గవ షెడ్యూల్ రూల్ 8 సెక్షన్ 10(12) ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగం మానేసిన తేదీ నాటికి ముందు అతను ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే విత్ డ్రా చేసే నగదుపై పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 ఏళ్లు పైగా పని చేసి ఉండాలి అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి తర్వాత మరో కంపెనీలో 3 ఏళ్లు పైగా పనిచేస్తే ఇటువంటి సందర్భంలో కూడా తను ఉపసంహరించే నగదుపై పన్ను వర్తిస్తుంది. కానీ, అతను మొదటి సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పీఎఫ్ ఖాతాను, మరో సంస్థలో జాయిన్ అయినప్పుడు పూర్వ పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ కొత్త లింకు చేయడం వల్ల అతను 5 ఏళ్లకు పైగా పనిచేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి సర్విస్ పీరియడ్ కనుక 5 ఏళ్లు కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా తను ఉపసంహరించే నగదుపై పన్ను పడుతుంది. కరోనా మహమ్మరి కాలంలో కాకుండా సాధారణంగా నగదు డ్రా చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కచ్చితంగా 5 ఏళ్లు పని చేసి అయిన ఉండాలి లేదా గత కంపెనీలో పనిచేసిన సర్వీస్ పీరియడ్ అయిన 5 ఏళ్లు పైగా అయిన ఉండాలి. -
జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ బీఎస్బీడీ జూలై 1 నుంచి ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు. అంతకంటే ఎక్కువ 10 లీఫ్ల చెక్ బుక్కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్కు చెందిన కొత్త ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. చెక్కు బుక్కులు చెల్లవు మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది. టీడీఎస్ కొత్త రూల్స్ ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి -
రిటర్నుల దాఖలు చేయకపోతే భారీ జరిమానా?
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా మూలం వద్ధపన్ను కోత(టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు(టీసీఎస్) చేసేవారు.. పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించేందుకు తగిన సదుపాయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్రమండలి(సీబీడీటీ) ప్రారంభించింది. సెక్షన్206ఏబీ, సెక్షన్ 206సీసీఏ విషయమై ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలకు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారీ విషయంలో జూలై 1 నుంచి అధిక టీడీఎస్, టీసీఎస్ అమల్లోకి రానుంది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్ పర్సన్స్)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్, టీసీఎస్ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. అంటే 2018-19, 2019-20 అర్థిక సంవత్సరాల రిటర్నులు వేయకుండా.. టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.50,000, అంతకుమించి మినహాయించి ఉంటే, అటువంటి వారికి(నిర్ధేశిత వ్యక్తులు) జూలై 1 నుంచి 5 శాతం అధిక రేటును వసూలు చేయనన్నారు. ఇటువంటి నిర్దేశిత వ్యక్తులను తెలుసుకునే సదుపాయాన్ని https://report.insight.gov.in/ పోర్షల్పై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీబీటీటీ ప్రకటించింది. చదవండి: 21 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర -
Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా?
పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును పొడిగించింది. సర్క్యులర్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం టీడీఎస్ పన్ను దాఖలు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది. అంతకుముందు టీడీఎస్ ను దాఖలు చేయడానికి గడువు మే 31 వరకు ఉండేది. ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఫారం 16 జారీ చేయవలసిన తేదీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు పొడగించారు. తాజా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫారమ్ లలో ఉద్యోగుల కోసం మరో కాలమ్ జోడించబడింది. దీని ప్రకారం, టీడీఎస్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో కొత్తగా పన్ను చెల్లించే వారు ఈ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుందని టాక్స్ 2 విన్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. అలాగే గత రెండేళ్లలో వ్యక్తి టీడీఎస్ దాఖలు చేయకపోతే, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది అని అన్నారు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు నగదు రూపంలో చెల్లించాల్సిన పన్ను మొత్తం లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, సెక్షన్ 234ఎ కింద జరిమానా, వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత తేదీ నుంచి వర్తిస్తుంది. చదవండి: కేవలం వారంలో భారీగా ముకేశ్ అంబానీ సంపద -
అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్లు నింపాల్సిందే
కరోనా మహమ్మరి నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) వ్యక్తిగత ఐటీఆర్ కోసం 2 నెలలు, కంపెనీలు లేదా భాగస్వామ్య సంస్థలకు ఒక నెల గడువును పొడిగించింది. సీబీడీటీ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ఎఫ్డీ గడువు విషయంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎఫ్డీలో పెట్టుబడులు పెట్టిన వారు జూన్ 30 న లేదా అంతకన్నా ముందు 15 జీ, 15 హెచ్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్లను నింపి గడువులోగా బ్యాంకుల్లో సమర్పిస్తే డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే బ్యాంకులు పన్ను మొత్తాన్ని కట్ చేస్తాయి. 15జీ, 15హెచ్ ఫామ్ల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఉన్న వారికి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్) నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు వస్తుండడంతో ఎక్కువ మంది మదుపరులు ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎఫ్డీల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓ పరిధిని నిర్ణయించింది. అది దాటిన వారికి టీడీఎస్ వర్తిస్తోంది. టీడీఎస్పై గరిష్ట పరిమితి ఎంత..? మొదట్లో టీడీఎస్ పరిమితి రూ.10వేలు ఉండగా ప్రస్తుతం అది రూ.40వేలకు పెరిగింది. ఈ పరిమితి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది. ఆపై టీడీఎస్ నుంచి మినహాయింపు పొందాలంటే.. 15G, 15H ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది. 15 జీ ఫామ్ అంటే..? మీరు పెట్టుబడి పెట్టిన నగదు ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15జీని సమర్పించాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. దాని ఆధారంగా ఈ ఫారం నింపబడుతుంది. ఈ ఫారమ్ను ఎవరు పూరించవచ్చో తెలుసుకుందాం. ఒక భారతీయ పౌరుడు లేదా ఉమ్మడి హిందూ కుటుంబం లేదా ట్రస్ట్ ఈ ఫారమ్ నింపవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఫారమ్ను పూరించవచ్చు. ఈ ఫారం కంపెనీకి లేదా సంస్థకు వర్తించదు. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఓ సంవత్సరంలో వడ్డీ రాబడి పన్ను మినహాయింపు పరిధిని దాటి ఉండకూడదు. 15 హెచ్ ఫామ్ అంటే..? 60 ఏళ్లు పైబడిన వారు టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15 హెచ్ ఫామ్ సమర్పించాలి. ఏ భారతీయ పౌరుడైనా ఈ ఫారమ్ నింపవచ్చు. వ్యక్తికి కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఈ రెండు ఫామ్ల్లో మీ ప్రాథమిక సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత వీటికి పాన్ కార్డ్ కాపీని, ట్యాక్స్ డిక్లరేషన్ను జత చేయాలి. ఆ తర్వాత ఫిక్స్ డిపాజిట్ ఉన్న బ్యాంకులో సమర్పించాలి. ఈ రెండు ఫామ్ల కాల పరిమితి ఓ సంవత్సరం ఉంటుంది. చదవండి: కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే -
టీడీఎస్ విషయంలో వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
గత వారం వేతన జీవులకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఈ వారం వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీలు పొడిగించవచ్చు. అయితే, దాన్నలా ఉంచితే.. మీరు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన విషయాలు గురించి తెలుసుకుందాం. మీ ఆదాయానికి సంబంధించి 1-4-2020 నుంచి 31-3-2021 అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను త్వరలోనే 26ఏఎస్ వస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫారంని డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఈ ఫారంలోని అంశాల్లో మీకు వచ్చి న అన్ని ఆదాయాలకు సంబంధించిన టీడీఎస్ వివరాలు ఉంటాయి. వ్యాపారం/వృత్తి రీత్యా వచ్చిన ఆదాయం, దాని మీద టీడీఎస్, ఇంటి అద్దె రూపేణా అందే ఆదాయం మీద టీడీఎస్, వడ్డీ మొదలైన ఇతర ఆదాయాల మీద టీడీఎస్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ మీద టీడీఎస్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. అయితే టీడీఎస్ జమలు రాకపోతే, అందులో పొందుపర్చకపోతే గాభరా పడక్కర్లేదు. మే/జూన్ లోపల అన్నీ ఎంట్రీలు నమోదవుతాయి. అప్పటిదాకా ఆగండి. ఈ టీడీఎస్ వలన మీ మీద పూర్తి ఆదాయపు పన్ను భారం పడకపోవచ్చు. వ్యాపారం విషయంలో నికర లాభం లెక్కించాలి. స్థూల లాభం మీద టీడీఎస్ వర్తింపచేస్తే .. పన్ను భారం మాత్రం నికర లాభం మీద ఉంటుంది. వ్యాపారస్తులు మరో విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎస్ టీ రిటర్నుల్లో.. టర్నోవరు వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటోంది. ఇది ఇన్కం ట్యాక్స్ రిటర్నుల్లో పొందుపర్చిన వివరాలకు సరిపోలి ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటినీ పోల్చి చూస్తారు. తేడా వస్తే ఆరా తీస్తారు. బ్యాంకు ఖాతాల్లో జమకి, టర్నోవరుకి సంబంధ లేకపోయినా ఆ డిపాజిట్లతో కూడా సరిపోల్చి చూసుకోండి. ఇటువంటి విశ్లేషణల కోసం వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. బ్యాంకు జమల్లో వ్యాపారపరమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, అప్పులు కావచ్చు.. ఆదాయాలు కావచ్చు.. ప్రతీ జమని సమర్థించుకోగలిగేలా కాగితాలు ఉండాలి. ఇంచుమించు ఇదే పద్ధతిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రణాళికలు వేసుకోండి. ముందు చూపుతో వ్యవహరించడం, సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం, చట్టరీత్యా బాధ్యతలు నిర్వర్తించడం .. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: వేతన జీవులూ.. జర జాగ్రత్త! -
వేతన జీవులూ.. జర జాగ్రత్త!
► వేతన జీవులకు జీతభత్యాల మీద వారి యజమాని ప్రతి నెలా టీడీఎస్ కొంత చేసి, ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. అలా జమ చేసిన తర్వాత ఆ సమాచారం అంతా ఫారం 26 ఏఎస్లో పొందుపర్చబడుతుంది. ఇందులో ఎప్పటికప్పుడు సమాచారం చేరుస్తుంటారు. ముందుగా ఉద్యోగస్తులు వారి ఆదాయ వివరాలు, సేవింగ్స్ వివరాలు ఇవ్వాలి. యజమాని నికర ఆదాయాన్ని లెక్కించి, పన్ను భారం లెక్కించి పన్నెండు సమాన భాగాలుగా ప్రతి నెలా జమ చేయాలి. కానీ అలా జరగడం లేదు. బదులుగా చివరి 3-4 నెలల్లో చేస్తున్నారు. జీతం, పెన్షన్ మీద టీడీఎస్ వర్తింపచేయడం జరుగుతుంది. జాగ్రత్తగా సమాచారం ఇవ్వండి. ► ఉద్యోగి తనకి వచ్చే ఇతర ఆదాయపు వివరాలు యజమానికి తెలియజేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించి, రికవరీ చేయాలి. ► ఏదైనా కారణం వల్ల వేతన జీవులు ఇతర ఆదాయం గురించి యజమానికి చెప్పలేకపోయిన పక్షంలో వారే స్వయంగా అలాంటి ఆదాయాలన్నింటినీ లెక్కించి, జీతం మీద ఆదాయంతో కలిపి మొత్తం పన్ను భారాన్ని లెక్కించాలి. అందులో నుంచి టీడీఎస్ని తగ్గించి, మిగతా భారాన్ని 2022 మార్చిలోగా చెల్లించాలి. ► జీతం కాకుండా వేతన జీవులకి బ్యాంకు వడ్డీ, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రావచ్చు. ఇలాంటి ఆదాయం మీద కేవలం 10 శాతం టీడీఎస్ వర్తింపచేస్తారు. మీరు శ్లాబును బట్టి అదనంగా 10 శాతం నుంచి 20 శాతం దాకా చెల్లించాల్సి రావచ్చు. ► అలాగే ఇంటి అద్దె. దీని మీద టీడీఎస్ జరగవచ్చు లేదా జరగకపోనూ వచ్చు. ఒకవేళ జరిగినా నిర్దేశిత స్థాయి పన్ను భారానికి సరిపోకపోవచ్చు.. తేడా ఉండొచ్చు. అటువంటి తేడాలేమైనా ఉంటే సకాలంలో చూసుకుని పన్నుని చెల్లించాలి. ► క్యాపిటల్ గెయిన్స్ని ఉదాహరణగా తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లోనే టీడీఎస్ వర్తిస్తుంది. (అమ్మకపు విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ చేయాలి) వేతన జీవులు స్వయంగా వాళ్ల క్యాపిటల్ గెయిన్స్ లెక్కించి పన్ను భారం చెల్లించాలి. లావాదేవీ జరిగిన తేదీ తర్వాత వచ్చే త్రైమాసికంలో పన్ను చెల్లించాలి. అలా చేయకపోతే వడ్డీ చెల్లించాలి. ► ఇంకేదైనా ఇతర ఆదాయం కూడా ఉండి ఉండవచ్చు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ► అడ్వాన్స్ ట్యాక్స్ వర్తించే పరిస్థితి వస్తే.. ప్రతి మూడు నెలలకు అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదాల ప్రకారం చెల్లించేయాలి. గడువు తేదీ దాటితే కొన్ని సందర్భాల్లో వడ్డీ పడుతుంది కాబట్టి మీ సంవత్సర ఆదాయాన్ని సేవింగ్స్ను ముందుగా లెక్కించండి. నికర ఆదాయం మీద పన్ను భారాన్ని టీడీఎస్ ద్వారా, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! -
ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. ఈసారి కార్లు, బైక్లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. అవేంటంటే.. ఈ బ్యాంకుల పాస్బుక్, చెక్బుక్లు చెల్లవు ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా? అయితే ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్బుక్, చెక్బుక్లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఎందుకంటే ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్బుక్, చెక్బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్ ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కార్లు, బైక్లు, ఏసీలు ధరలు పెంపు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కార్ల, బైక్లు, ఏసీలు ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు పెరగనున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు. విమానం చార్జీల మోత ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్) పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్ పాస్పోర్టులున్నవారు తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు నుంచి మినయింపు ఇచ్చారు. కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది. చదవండి: మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు -
ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. 75 అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుండి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టిడిఎస్ ను ప్రతిపాదించారు. ఇక ఈపిఎఫ్ ఖాతాలో ఏటా రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులపై పన్ను విధించాలని ప్రకటించారు. 1) పిఎఫ్ పన్ను నియమాలు: 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 2) టిడిఎస్: ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. 3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు: సీనియర్ సిటిజన్లపై పన్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి లభించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది. 4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంలలో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 5) ఎల్టిసి: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. చదవండి: 2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే -
పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే
ఇవాళ మార్చి 15.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు తేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మీ నికర ఆదాయాన్ని లెక్కించుకుని, వర్తించే పన్ను భారంలో నుంచి టీడీఎస్ తగ్గించి .. మిగతా మొత్తాన్ని జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నిర్దేశించిన వాయిదాల ప్రకారం చెల్లించాలి. ఈ చెల్లింపులకు మార్చి పదిహేనే ఆఖరు తేదీ. వెంటనే చెల్లించేయండి. లేని పక్షంలో వడ్డీ భారం పడుతుంది. ఒకవేళ మార్చి 15న కుదరకపోతే కనీసం నెలాఖరు లోగానైనా చెల్లించేయాలి. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్న్ వేయలేకపోయిన వారు మార్చి నెలాఖరు లోపల వేయవచ్చు. 2019-20కి వేసిన రిటర్నులను సవరించుకోవడానికి కూడా మార్చి 31 ఆఖరు తేదీ. చెల్లించాల్సినవి ఉంటే.. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, మెడిక్లెయిమ్, పీఎఫ్, జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజులు, మున్సిపల్ పన్నులు, విరాళాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపలే చెల్లించాలి. ఏదైనా మర్చిపోతే వెంటనే చెల్లించేయండి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో డిపాజిట్ చేసిన వారికి అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను సంబంధ అంశాలన్నింటికీ మార్చి 31 గడువు తేదీ. ఆదాయ పన్ను ప్లానింగ్ గురించి మీరు ముందుగానే ఆలోచిస్తే.. మీ కుటుంబంతో పాటు మీ ఆర్థిక కార్యకలాపాల గురించి మంచి ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. తద్వారా బండి సాఫీగా ముందుకు సాగిపోతుంది. వివరాలన్నీ పోల్చి చూసుకోవాలి.. కొత్త అపార్ట్మెంట్లు కొనే వాళ్లు వాటి నిర్మాణం చివరి దశలో ఉంటే ఈ సంవత్సరంలోనే తీసుకోవడమో లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవడమో ఆలోచించుకోవచ్చు. అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఏప్రిల్లో చేపట్టవచ్చు. అప్పుడు ప్లానింగ్ చేసుకోవడానికి, పన్నుల భారం చెల్లించడానికి తగినంత సమయం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయంలో వారి వార్షిక టర్నోవరు వివరాలను అసెసీకి సంబంధించిన ఫారం 26ఏఎస్లో పొందుపరుస్తున్నారు. ఇందులోని వివరాలను మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాగా .. మీ ఫైనాన్షియల్ రికార్డు .. మీ జాతకంగా అనుకోవచ్చు. ఎక్కడ తేడా వచ్చిన ఆరా తీస్తారు. సరైన వివరణ ఇవ్వకపోతే ఏ అధికారులూ ఊరుకోరు. కాబట్టి ఏ తప్పులు లేకుండా అన్ని వివరాల రికార్డులు, రిటర్నులు మొదలైన వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూసుకుని, తప్పులు లేకుండా వేసుకోండి. ఇక చివరిగా రెసిడెంట్ల విషయానికొస్తే.. మీ పాన్కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనికి 2021 మార్చి 31 ఆఖరు తేది. కనుక త్వరపడండి. అనుసంధానం చేయకపోతే పెనాల్టీలు వడ్డిస్తారు. అన్నీ సక్రమంగా చేసుకుంటే, చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది. చదవండి: ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా! దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ -
ఈ 27 నుంచి కొత్త సినిమాలు రావా?
మార్చి 27 నుంచి తమిళనాడులో కొత్త సినిమాలను పంపిణీ చేయబోమని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ పేర్కొంది. సినిమా పంపిణీపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 శాతం టీడీయస్ పన్నుని విధించింది. ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆల్రెడీ సినిమా టికెట్ మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది ప్రభుత్వం. దానికి తోడు ఇటీవలే 8 శాతం లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ టాక్స్ కట్టాలని ఆదేశించింది. దీంతో సినిమా చూసేవాళ్ల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది’’ అని పంపిణీదారుల సంఘం పేర్కొంది. 8 శాతం పన్ను విధింపును మరోసారి ఆలోచించి, నిషేధించాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ఈ 10 శాతం పన్ను జోడించడంతో మార్చి 27 నుంచి కొత్త సినిమాలు పంపిణీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. గవర్నమెంట్ ఈ పన్నుని తొలగించే వరకూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. -
రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా? ఎంత ఆలస్యమైనా ఈరోజు ఫైల్ చేసేయండి. ఐటీ రిటర్న్ ఈ రోజులోపు సమర్పించకపోతే 10 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సిరావొచ్చు. ఆదాయ పన్నుపై కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు రేపటి నుంచి (సెప్టెంబర్ 1) అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలు అమల్లో రానున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. కాబట్టి వేతన జీవులు కాస్త కేర్ఫుల్గా ఉండ్సాలిందే. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్నవి ఏంటో చూద్దాం. ఇల్లు కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. రూ. కోటి విత్డ్రా చేస్తే ‘ఫైవ్’ పడుద్ది ఒక సంవత్సరంలో ఒక అకౌంట్ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్డ్రాయెల్స్ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. ఐఆర్సీటీసీ వడ్డన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను పునరుద్ధరించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న నాన్ ఏసీ టికెట్పై రూ. 15, ఏసీ టికెట్పై రూ. 30 సర్వీసు ఛార్జీలను ఐఆర్సీటీసీ వసూలు చేయనుంది. సర్వీస్ ట్యాక్స్ బకాయిలకు చెక్ సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్లో ఉన్న సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు. బీమా డబ్బుకు తప్పదు పన్ను జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. కొత్త పాన్కార్డులు ఆధార్ నంబరుతో పాన్కార్డులు లింక్ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్కార్డులు జారీ చేయనుంది. ఉల్లంఘిస్తే బాదుడే సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించే వారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. (చదవండి: రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్) షాపింగ్.. బ్రీఫింగ్ ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్ రిటర్న్స్లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్క్షన్ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది. (ఇది చదవండి: సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!) -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్ను ఎన్ ఎస్డీఎల్ వెబ్సైట్కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
‘ఐటీఆర్ ఫామ్స్’లో మార్పుల్లేవ్..
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫామ్స్లో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం స్పష్టంచేసింది. ఐటీఆర్ ఫామ్స్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటోన్న కారణంగా రిటర్నులను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు కేవలం అపోహలు మాత్రమే అని కొట్టిపడేసింది. యుటిలిటీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందే తప్పించి మరే ఇతర మార్పులు లేవని వివరించింది. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) సమాచారం ఆధారంగా ప్రీ–ఫైలింగ్ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉన్నట్లు తెలిపింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 ఆఖరి తేదీ. -
వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్ మినహాయింపు
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019–20 మధ్యంతర బడ్జెట్లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్రం ప్రకటించిన విషయం గమనార్హం. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్ 15హెచ్ను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్15 హెచ్ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఇక నుంచి కొత్త ఫామ్–16
న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్ –16 సర్టిఫికెట్ ఫార్మాట్ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్–16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్ను రూపొందించినట్లు ఆ వర్గాలు చెప్పాయి. వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు, పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సులు అలాగే ఇతర వనరుల ద్వారా ఆదాయం, పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు, రిబేట్స్, సర్చార్జీలు.... ఇలా విస్తృత సమాచారం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసిన సవరిత ఫామ్–16 మే 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ తాజా ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. -
జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్ – డిసెంబర్ కాలానికి టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్ ఫైలింగ్కు గడువును కేంద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్టీ కింద టీడీఎస్ ప్రొవిజన్స్ ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) చట్టం ప్రకారం..రూ.2.5 లక్షలు దాటిన వస్తువులు, సేవల సరఫరాదారులకు చేసే చెల్లింపులపై నోటిఫైడ్ సంస్థలు 1% టీడీఎస్ను వసూ లు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర చట్టాల (ఎస్జీఎస్టీ) కింద మరో 1% పన్నునూ విధించాలి. -
ఫారం 26ఏఎస్ తప్పుల తడకైతే..
ఆదాయ పన్ను శాఖ నిర్వహించే వెబ్సైట్లో మీకు సంబంధించిన ఆదాయ పన్నుల రికార్డును ఫారం 26ఏఎస్ అంటారు. మీరు చెల్లించే టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అస్సెస్మెంట్ ట్యాక్స్ ఈ రికార్డులో నమోదవుతుంది. స్వయంగా చెల్లించే ముందస్తు పన్ను, ఆ తరువాత సెల్ఫ్ అస్సెస్మెంట్ ట్యాక్స్ వివరాలతో పాటు మీ పేరు, చిరునామా, పాన్ కార్డ్ నంబర్ వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకులో జమచేసిన మొత్తం ఆ బ్యాంకు సిబ్బంది సాఫ్ట్వేర్ ద్వారా డిపార్ట్మెంట్కు చేరవేయడం ద్వారా వివరాలు ఈ రికార్డులో వెంటనే నమోదవుతుండగా.. టీడీఎస్, టీసీఎస్ వివరాలు మాత్రం తత్సంబంధిత అధికార కేంద్రాల ద్వారా అప్లోడ్ అవుతాయి. ఈ క్రమంలో ఎన్నో తప్పులు జరగడం పరిపాటిగా మారిపోయింది. నైపుణ్యత లేని సిబ్బంది, పని ఒత్తిడి లాంటి అనేక కారణాల వల్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. తప్పులు ఏవైవుండచ్చు... ►పాన్ నంబర్ తప్పు రాయడం ►టాన్ నంబర్ తప్పు రాయడం ►చలాన్ నంబర్ సరిగ్గా రాయకపోవడం ►డేటా ఎంట్రీలో తప్పులు ►తప్పు చలాన్ కట్టడం ►పూర్తి సమాచారం లేకపోవడం ►తప్పుడు సమాచారం ►జమ చేసిన మొత్తం/చెల్లించిన మొత్తంలో తప్పులు రాయడం. ►చివరి 3 నెలలు పన్ను రికవరీ చేసి ఆ సమాచారంతో పాటు కేవలం 3 నెలల జీతం / పెన్షన్ మాత్రమే అప్లోడ్ చేసి మిగిలిన 9 నెలల ఆదాయం వివరాలు అప్లోడ్ చేయకపోవడం. 194సీ, 194జే వంటి సెక్షన్ వివరాలు తప్పులు రాయడం. ►మినహాయింపులు, తగ్గింపు విషయాలను ప్రస్తావించకుండా పూర్తి ఆదాయాన్ని రాసి.. ఫారం 16లో నికర ఆదాయం రాయడం వల్ల ఈ రెండూ ఒకదానితో ఒకటి కలవకపోవడం.. ఇలాంటివి అనేక తప్పులు రావడం సర్వసాధారణంగా మారిపోయినందున మీరు రిటర్నులు దాఖలుచేసే రోజున ఫారం 26ఏఎస్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి సరిచూసుకోవడం మంచిది. వివరాలు సరిగా లేకపోతే... ►డిడక్టర్, యజమాని, బ్యాంకు, ఇతరుల వద్దకు వెళ్లి తప్పులు సరిదిద్దించండి. ►అసలు ఆ వ్యవహారాలు మీవేనేమో చూడండి. ►రెండు సార్లు పేమెంట్లు ఉన్నాయోమో చూసుకోండి. ►మీరు చెల్లించినవి నమోదైనవో లేదో చూడండి. ►ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి. ►మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అన్నీ సరిగ్గా ఉండి.. ఫారం 26ఏఎస్లో ఆ వివరాలు అప్లోడ్ కాకపోతే గడువుతేదీ వరకు వేచి ఉండకండి. అన్ని కాగితాలు సమకూర్చుకుని, సరిదిద్దుకుని, సరిచేసుకుని రిటర్నులు వేయండి.. తప్పు దిద్దుకోవడానికి మూడు సూత్రాలు.. డిడక్టర్ని సంప్రదించండి. టిన్ కాల్ సెంటర్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, 3 ఫ్లోర్, సఫైర్ చాంబర్స్ బనీర్ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ సమీపం, పుణే – 411045 అడ్రస్ను ఆశ్రయించండి. 020 – 27218080 నంబర్కు కాల్ చేయండి. టిన్ఇన్ఫోఃఎన్ఎస్డీఎల్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ను ద్వారా సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కానీ స్వయంగా అధికారులను కానీ అభ్యర్థించండి. వాళ్లు మీకు కలిగిన ఇబ్బంది గురించి వింటారు. మీకు ఉపశమనం దొరుకుతుంది. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి - కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
నోటీసులొస్తాయ్.. జాగ్రత్త!!
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ చెల్లింపులు, టీడీఎస్ వంటి వాటిని కచ్చితంగా చూసుకోండి. పన్ను రికవరీ చేసే అధికారులు/ సంస్థలు సరిగ్గా పనిచేయకపోవడం, రికవరీని బ్యాంకుల్లో చెల్లించకపోవడం, రిటర్నులను గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడం వలన ఆదాయపు పన్ను శాఖ వారు నిర్వహిస్తున్న మీ ఖాతాలో సమాచారం లేకపోవడం లేదా తప్పుడు సమాచారం ఉండడం కారణంగా నోటీసులు వచ్చే అవకాశముంది. ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయేమో ఒకసారి చూడండి... రిటైర్డ్ హెడ్మాస్టర్ ప్రసాద్కు పెన్షన్ వస్తుంది. చివరి మూడు నెలల్లోనే పన్ను కోత వేశారు. కానీ సమాచారం అప్లోడ్ చేసేటప్పుడు ఫారం 26ఏఎస్లో 3 నెలల పెన్షన్, సంవత్సరపు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారు. మీరు రిటర్ను వేసేటప్పుడు 12 నెలల పెన్షన్ చూపించాలి. మీ రిటర్నుకి 26ఏఎస్కి సమాచారం పరంగా మిస్మాచ్. మీరు రిటర్ను సరిగ్గా వేసినా, పన్ను సరిగ్గా చెల్లించినా ఇలాంటి మిస్మాచ్ వలన సమస్యలు ఉత్పన్నమౌతాయి. నోటీసులు తథ్యం. చాలా మంది బ్యాంకులో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో అనాలోచితంగా ఆలోచిస్తున్నారు. ట్యాక్సబుల్ ఆదాయం ఉన్నప్పటికీ పన్ను రికవరీ చేయవద్దని ఫారాలు సబ్మిట్ చేస్తున్నారు. కొంత మంది ఈ అంశాన్ని కావాలని మరిచిపోతున్నారు. బ్యాంకర్లు పని ఒత్తిడి వలన వీలున్నప్పుడు రికవరీ చేయడం, వీలులేనప్పుడు మానేయడం చేస్తున్నారు. అసెసీలు కూడా ఫారం 26ఏఎస్ని చెక్ చేసుకోవడం లేదు. ఫలితంగా రిటర్నులు వేసేటప్పుడు బ్యాంకుల్లో వడ్డీ విషయం మరచిపోతున్నారు. 26ఏఎస్లో ఉన్న వడ్డీని, టీడీఎస్ని పరిగణనలోకి తీసుకోకుండా రిటర్నులు దాఖలు చేస్తున్నారు. కొంత మంది వడ్డీ మీద టీడీఎస్తో పన్ను భారం తీరిపోయిందని అనుకుంటున్నారు. అది మీరున్న శ్లాబును బట్టి ఉంటుంది. వీటి వలన అదే మిస్మాచ్ సమస్య. మళ్లీ నోటీసులు. కొత్త సంవత్సరంలో ఇటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి. ♦ 1–4–2017 నుంచి 31–3–2018 వరకూ మీకువచ్చే ఆదాయపు జాబితా రూపొందించుకోండి. ఉదాహరణకు.. జీతం/పెన్షన్, ఇంటి అద్దె, బ్యాంకుల వడ్డీ, ఇతరత్రా వడ్డీ, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ వంటివి. ♦ వీటికి సంబంధించిన జమలు, బ్యాంకుల్లో అన్ని అకౌంట్లని పరిశీలించండి. ♦ రావలసిన ఆదాయం కన్నా తక్కువగా అకౌంట్లో జమ అయిందంటే దానికి కారణం టీడీఎస్. చెక్ చేసుకోండి. అది పన్ను అయితే సంబంధిత సంస్థలను సంప్రదించండి. ♦ టీడీఎస్ ప్రక్రియకి మే 2018 దాకా సమయం ఉంది. సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకొని మే నెలాఖరు నుంచి 26 ఏఎస్ కోసం లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ♦ తప్పుడు సమాచారం ఉన్నా.. లోటుపాట్లు ఉన్నా.. వెంటనే వారిని సంప్రదించండి. ♦ రిటర్ను వేయడానికి గడువు తేదీ జూలై 2018. ♦ వీలయితే ఫారం 16, 16ఏలు పొందండి. ♦ 26ఏఎస్ సమాచారమే మీకు మార్గదర్శకం. కానీ 26ఏఎస్లో తప్పులున్నా, మీకు సంబంధించని సమాచారం ఉన్నా మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. -
టీడీఎస్ పేరిట రూ.3,200 కోట్లు స్వాహా!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ 12,700 కోట్ల స్కామ్ దేశ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తే... మరోవంక టీడీఎస్ రూపంలో కంపెనీలు రూ.3,200 కోట్ల మేర భారీ అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీఎస్ అంటే... ఉద్యోగుల జీతం నుంచి ఆదాయపు పన్ను నిమిత్తం నెల నెలా కోత వేసే మొత్తం. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు తమ ఉద్యోగుల వార్షికాదాయం గనక పన్ను చెల్లించేటంత ఉంటే ఆ మేరకు టీడీఎస్ను మినహాయించి వారి పేరిట ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 447 కంపెనీలు టీడీఎస్ సొమ్మును జమ చేయకుండా పక్కదారి పట్టించినట్టు ఆ శాఖ గుర్తించింది. ఈ నిధుల్ని కంపెనీలు మూలధన అవసరాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వాడేసుకున్నాయి. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ వర్గాలను ఉటంకిస్తూ... ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇలా టీడీఎస్ ఎగవేతలకు పాల్పడిన వాటిలో ఇన్ఫ్రా కంపెనీలు, చిత్ర నిర్మాణ సంస్థలు, ఇతర కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు టీడీఎస్ సొమ్ములో సగం మేర జమ చేసి, మిగిలిన సగాన్ని తమ అవసరాలకు వాడుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థలపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 276బి కింద విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఐటీ శాఖలో ఈ–కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులతో ప్రత్యక్ష సంబం ధాల కోసం కాగిత రహిత ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ–కమ్యూనికేషన్ వ్యవస్థను ఆదాయపన్ను శాఖలో ఏర్పాటు చేస్తారు. ఆ విభాగం ఏ పన్ను చెల్లింపుదారుడికైనా సమాచారం, ఇతర ధ్రువీకరణలకు ఆన్లైన్లోనే ఈమెయిల్కు నోటీసు లు పంపుతుంది. ఈ విషయాన్ని మొబైల్కు సందేశం పంపడం ద్వారా తెలియజేస్తారు. ఈ కమ్యూనికేషన్ సెంటర్లో ఏర్పాటు చేసే మెషీన్ పన్ను చెల్లింపుదారుల స్పందనను నమోదు చేయనుంది. -
టీడీఎస్పై అవగాహన సదస్సు
నెల్లూరు(వేదాయపాళెం) : నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో తిరుపతి ఆదాయపన్ను శాఖ అధికారులు టీడీఎస్పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆదాయ పన్నుశాఖ టీడీఎస్ అధికారి సత్యానంద మాట్లాడారు. జీతాలు, కాంట్రాక్ట్లు, ఇన్సూ్యరెన్స్లు, లాటరీలపై టీడీఎస్ పన్ను మినహాయింపు శాతాన్ని వివరించారు. టీడీఎస్ పన్నుల చెల్లింపు విషయంలో విజయవాడ ఆదాయ పన్నులశాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల వారు సకాలంలో పన్నులు చెల్లించి టీడీఎస్ మినహాయింపు పొందాలన్నారు. టీడీఎస్కు పాన్, ట్యాన్, ఆధార్కార్డులతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఆదాయపన్నుల శాఖలోని వివిధ రాయితీలను వివరించారు. తిరుపతి ఆదాయ పన్నులశాఖ టీడీఎస్ విభాగం అధికారి ఎంవీ వేణుగోపాల్, నెల్లూరు ఆదాయ పన్నులశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆడిటర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు, వివిధ శాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు. -
రెండేళ్లలో మెచ్యూరిటీ, సరెండర్ చేయాలా?
నేను ప్రవాస భారతీయుడ్ని. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్పై రూ. లక్షన్నర వరకూ మూలధన లాభాలు ఆర్జించాను. భారత్లో మరే ఇతర ఆదాయాలేవీ లేవు. నేను ఐటీఆర్ను దాఖలు చేయాలా? మూలధన లాభాల పన్ను చెల్లించాలా ? - నవనీత్, విశాఖపట్టణం ప్రవాస భారతీయుల విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకున్నప్పుడు, మూలం వద్దే పన్ను (టీడీఎస్-ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)విధిస్తారు. మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ను మీరు ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, డెట్ లేదా గోల్డ్ ఫండ్స్కు అయితే 30 శాతం టీడీఎస్ ఉంటుంది. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్కు అయితే 15 శాతం టీడీఎస్ ఉంటుంది. అయితే మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించిన పక్షంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే.. మూడేళ్లలోపు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్పై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి ఆదాయపు పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులపై పన్ను 10 శాతం(ఇండేక్సేషన్తో కాకుండా), లేదా 20 శాతం(ఇండేక్సేషన్ను కలుపుకొని)గా పన్ను విధిస్తారు. దీనికి సెస్ అదనం. మీరు ప్రవాస భారతీయులు కాబట్టి, మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకున్నప్పుడే మూలధన లాభాల పన్ను విధిస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్స్పై మీరు చెల్లించాల్సిన పన్ను, కోత విధించిన పన్ను కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను రిఫండ్ కోసం దరఖాస్తు చేయాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కు సంబంధించి.. రిటైర్మెంట్ తర్వాత మొత్తం కార్పస్లో 60 శాతాన్ని యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది కదా ! ఒకవేళ ఆ సబ్స్క్రైబర్ మరణిస్తే ఆ యాన్యుటీని ఆ వ్యక్తి వారసులకు చెల్లిస్తారా? - రమేశ్, హైదరాబాద్ యాన్యుటీ అంటే దానిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం అందించేది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో సబ్స్క్రైబర్ ఎంచుకోవడానికి విభిన్నరకాలైన యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో లైఫ్టైమ్ యాన్యుటీ, లైఫ్టైమ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, యాన్యుటీ విత్ జాయింట్ లైఫ్, లాస్ట్ సర్వైవర్ బెనిఫిట్స్.. ఇలా రకరకాలైన ఆప్షన్లు ఎంచుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అందుకని యాన్యుటీని ఎంచుకునేటప్పుడే డెత్ బెనిఫిట్స్, వారసులకు యాన్యుటీ బెనిఫిట్స్ లభిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. సబ్స్క్రైబర్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ఆప్షన్ను ఎంచుకుంటే, అసలైన కార్పస్ వారసులకు అందజేస్తారు. యాన్యుటీని మాత్రం ఆపేస్తారు. ఒకవేళ జాయింట్ యాన్యుటీని ఎంచుకుంటే, యాన్యుటీని ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను. 2010 తర్వాత దీనిని భారత్కు బదిలీ చేసుకున్నాను. 20 ఏళ్ల ఈ ప్లాన్ 2018లో మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పాలసీ నుంచి వైదొలిగితే, నాకు నష్టమా, లాభమా? నన్ను ఏం చేయమంటారు ? - యాదగిరి, కరీంనగర్ ఎండోమెంట్ ప్లాన్లు... బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన హైబ్రిడ్ ప్లాన్లు. ఇవి తగిన బీమా కవర్ను ఇవ్వలేవు. మంచి రాబడినీ అందించలేవు. ఈ పాలసీలను సరెండర్ చేయమనే ఎప్పుడూ సలహాఇస్తాం. కానీ మీ విషయానికొస్తే, మరో రెండేళ్లలో ఈ ప్లాన్ మెచ్యూర్ అవుతోంది. 18 ఏళ్లపాటు ప్రీమియమ్లు చెల్లించారు. కాబట్టి ఈ ప్లాన్ను ఇప్పుడు సరెండర్ చేయడం సరికాదు. మరో రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేస్తే మీకు భారీ నష్టాలు వస్తాయి. కొన్ని పాలసీల్లో సరెండర్ విలువగా మీరు చెల్లించిన ప్రీమియమ్ల్లో 30 శాతమే చెల్లిస్తారు. తొలి ఏడాది ప్రీమియమ్ను మినహాయించుకుంటారు. దీనిని సరెండర్ చేయకుండా మరో మార్గం కూడా ఉంది. ఈ పాలసీని పెయిడప్ పాలసీగా మార్చుకోవచ్చు. మీ బీమా కంపెనీని సంపదించి ఈ పెయిడప్ పాలసీని ఎంచుకుంటే ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోండి. సరెండర్ విలువతో ఈ పెయిడప్ పాలసీ విలువను పోల్చి ఈ పాలసీ నుంచి వైదొలగడం లాభమో, కాదో తేల్చుకోండి. మొత్తం మీద మీ ఎండోమెంట్ పాలసీ మెచ్యూరిటీకి రెండేళ్ల గడువు మాత్రమే ఉంది. కనుక ఈ పాలసీ నుంచి వైదొలగడం కంటే కొనసాగించడమే సబబు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్స్కు ఇలాంటి హైబ్రిడ్ ప్లాన్ల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఎంచుకోండి. ఇల్లు, కారు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నతాభ్యాసం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రిటర్నులు ఎందుకు వేయాలి?
చాలా మంది రిటర్నులు ఎందుకు వేయాలని అడుగుతారు. పాన్ ఉంటే వేయాలా.. ఆదాయం లేకపోయినా వేయాలా.. బంగారం కొనుగోలు చేస్తే వేయాలా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక సమాధానం. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.... మీ వయసును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్కు మించి మీ నికర ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకోండి. రిటర్నులు దాఖలుతో ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాన్ని గౌరవించండి! చట్టాన్ని అనుసరించడం మన బాధ్యత. కంపెనీలలో డెరైక్టర్లు రిటర్నులు దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలలో భాగస్వాములు కూడా రిటర్నులు వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంట్ ఉన్నా రిటర్నులు దాఖలు తప్పనిసరి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా రిటర్నులు వేయండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోయినా విదేశాలలో ఉన్న అంశాలను రిటర్నులలో పొందుపరచాలి. రిఫండ్ పొందాలంటే.. ప్రతిచెల్లింపులు చేసేవారు టీడీఎస్ చేస్తున్నారు. అంటే మూలంలోనే కోత. కొంత మందికి ట్యాక్సబుల్ ఇన్కమ్ దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువగా ఉండటం వలన కోతలను అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాలో జమయ్యినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కాని రిఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు రిఫండ్ ఉంది అంటే ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్ల క్లెయిమ్ ఎలా? అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80 సీ, 80 డీ, 80 డీడీ, 80 ఈ.. ఇలా ఎన్నో. వీటి అన్నింటికీ కాగితాలు ఉండాలి. రిటర్నులతోపాటు జతపరచకపోయినప్పటికీ భద్రపరచుకోవాలి. స్థూల ఆదాయం లో నుంచి వీటిని మినహాయిస్తారు. క్లెయిమ్ మార దు. కానీ స్థూల ఆదాయం మారొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే.. మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 3 లక్షలు. 80 సీ కింద రూ. 1,50,000 చెల్లించారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.1,50,000. పన్ను భారం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం రూ.1,00,000 పెరిగిందనుకోండి. అప్పుడు గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో నష్టం రావచ్చు. లాభాలు పొందొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్కమ్ సరే.. లావాదేవీల్లో నష్టం రావొచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద ఆదాయం పడిపోవచ్చు. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో సర్దుబాటు చేయవచ్చు. అందుకే కచ్చితంగా ఈ లావాదేవీలను చూపిస్తూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి డబ్బు పంపిస్తే! విదేశాల నుంచి అబ్బాయి/అమ్మాయి/ఇతరులు మీకు డబ్బు పంపుతున్నారా? భయపడనక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం మీ అకౌంట్లో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే గ్రాట్యుటీ, జీవిత బీమా వంటి పన్నుకు గురికాని ఆదాయాలనూ డిక్లేర్ చేస్తూ రిటర్నులు దాఖలు చేయాలి. మరిన్ని ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, మీకు రుణమిచ్చే వారు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, సంస్థలు... ఇలా ఎందరో ఆదిలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు అడుగుతున్నారు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా.. వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
పీఎఫ్ డ్రా చేసినా టీడీఎస్ ఉండదు!
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. జూన్ ఒకటో తేదీ నుంచి మీ పీఎఫ్లోంచి రూ. 50 వేల వరకు డ్రా చేసుకున్నా, దానిమీద ఎలాంటి పన్ను కోత వేయరు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 30వేల వరకు మాత్రమే ఉండగా దాన్ని రూ. 50 వేలకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఉద్యోగులు ముందుగానే పీఎఫ్లో సొమ్ము విత్డ్రా చేయకుండా ఉండేందుకు, రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం చేతికి వచ్చేలా ఉండేందుకు పీఎఫ్ విత్డ్రాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, సభ్యులు 15జి లేదా 15హెచ్ ఫారం సమర్పిస్తే ఈ పన్ను ఉండదు. ఈ మొత్తం అందుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయపన్ను పరిమితి లోపలే ఉంటుందని ఈ ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో 15జి 60 ఏళ్ల లోపువారికి, 15హెచ్ 60 ఏళ్లు దాటినవారికి వర్తిస్తాయి. పీఎఫ్లో ఉన్న మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేస్తే పన్ను విధించరు. అలాగే, ఉద్యోగులు ఐదేళ్ల తర్వాత పీఎఫ్ విత్డ్రా చేసినా పన్ను విధించకూడదని చట్టం చెబుతోంది. -
పీఎఫ్ చందాదారులకు టీడీఎస్ఊరట
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్డ్రాయెల్స్కు సంబంధించి చందాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఇకపై రూ. 50 వేల వరకూ పీఎఫ్ విత్డ్రాయెల్స్ విషయంలో సోర్స్ వద్ద పన్ను (టీడీఎస్) ఉండదు. జూన్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ. 30,000 వరకూ విత్డ్రాయెల్స్ వరకూ మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండేది. పరిమితిని పెంచడానికి 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 192ఏను 2016 ఫైనాన్షియల్ యాక్ట్ సవరించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముందస్తు విత్డ్రాయెల్స్ నివారణ, పొదుపులు దీర్ఘకాలం కొనసాగేలా చూడ్డం వంటి లక్ష్యాలను నిర్దేశించి పీఎఫ్ విత్డ్రాయెల్స్పై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పాన్ను సమర్పిస్తే... 10% మాత్రమే టీడీఎస్ అమలవుతోంది. వచ్చిన డబ్బే తమ ఆదాయం, ఆధారం అని ధ్రువీకరించే ఫామ్ 15జీ (60 సంవత్సరాల లోపు) ఫామ్15 హెచ్ (60 ఏళ్లు పైబడినవారు) సమర్పిస్తే... అసలు టీడీఎస్ కోత ఉండదు. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు పీఎఫ్ మొత్తం మారినా... లేక ఐదేళ్ల కాలం తర్వాత పీఎఫ్ విత్డ్రాయెల్స్ జరిగినా పన్ను భారం ఉండదు. -
వసూలైన టీడీఎస్ చెల్లించకపోతే ఏడేళ్ల జైలు!
న్యూఢిల్లీ: తమ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తగ్గించిన మూలం వద్ద పన్ను (టీడీఎస్)ను ప్రభుత్వానికి చెల్లించడంలో విఫలమైన యజమాన్యం విషయంలో మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఆయా అంశాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక వార్షిక సర్క్యులర్ను విడుదల చేసింది. -
నల్లధనం గుట్టుచెప్పు.. రూ.15 లక్షలు పట్టుకెళ్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్ను ఎగవేసి భారీగా నల్లధనాన్ని కూడబెట్టినవారికి సంబంధించి రహస్య సమాచారాన్ని అందించే వ్యక్తులకు ఇచ్చే పారితోషికం విషయంలో ఆదాయపు పన్నుశాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. టీడీఎస్, స్వంతంగా పన్ను మదింపు వివరాలు అందించే కేటగిరీలు సహా ఎవరైనా పన్ను ఎగ్గొట్టినవారికి సంబంధించి చర్యలకు వీలుకల్పించే సమాచారం ఇచ్చినవారికి ఇకపై పన్ను ఎగవేసిన మొత్తంలో పదిశాతం పారితోషికం ఇవ్వాలని ఐటీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పారితోషికంగా ఇచ్చే సొమ్ము రూ.15 లక్షలకు మించకూడదని ఆ మార్గదర్శకాల్లో అధికారులకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలను గత ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింప జేస్తారు. న్యాయపరమైన అంశాలు వచ్చిన సందర్భం మినహా, నల్లధనం గురించి సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. వీరితో సంప్రదింపులకోసం ప్రత్యేకంగా ఓ కోడ్నంబర్ను కూడా ఇస్తారు. అయితే సమాచారం ఇచ్చేవారు పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టినవారి వివరాలను పత్రికల్లో ప్రచురించాలని ఐటీశాఖ నిర్ణయించింది. -
నేటి నుంచి ఆర్డీలపైనా టీడీఎస్
సేవా పన్ను పెరుగుతోంది పలు కొత్త సేవలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావటంతో పాటు సోమవారం నుంచి సేవా పన్ను 14 శాతానికి చేరుతోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ పన్నును సోమవాంర నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లోనే ప్రకటించారు. జూన్ 1 నుంచి రికరింగ్ డిపాజిట్ల(ఆర్డీ)పైనా ‘మూలం వద్ద పన్ను’ (టీడీఎస్) భారం పడనుంది. ఇప్పటి వరకూ ‘టైమ్ డిపాజిట్’లు మినహా ‘రికరింగ్ డిపాజిట్ల’పై టీడీఎస్ లేదు. అయితే ఇకపై రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై సైతం టీడీఎస్ పడనుంది. వడ్డీ రూ.10,000 దాటి తే టీడీఎస్ అమలవుతుంది. ఇంతేకాదు ఇప్పటివరకూ నిర్దిష్ట బ్యాంక్ బ్రాంచీలో డిపాజిట్పై వడ్డీ రూ.10,000 దాటితేనే టీడీఎస్ భారం పడేది. జూన్ 1 నుంచి బ్రాంచ్తో సంబంధం లేకుండా ఒక బ్యాంక్లో (బ్రాంచీలనూ గమనంలోకి తీసుకుని) డిపాజిట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వాటిపై వచ్చే వడ్డీ వార్షికంగా రూ.10,000 దాటితే టీడీఎస్ పడుతుంది. మీరేం చేయాలి? ఆదాయపు పన్ను పడకుండా కొన్ని పరిమితులు ఉన్నాయి. 60 సంవత్సరాల లోపు కనీస ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలు. 80 సంవత్సరాల వయస్సులోపు ఈ పరిమితి రూ.3 లక్షలు. రూ.80 సంవత్సరాల పైబడిన వారి విషయంలో ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఈ మొత్తంకన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు బ్యాంకుల్లో 15జీ/15హెచ్ ఫారమ్లను దాఖలు చేసి తమ ఎఫ్డీ, ఆర్డీలపై టీడీఎస్ భారం నుంచి బైటపడవచ్చు. ఆదాయపు పన్ను పరిమితికన్నా తమ ఆదాయం తక్కువ ఉందని ధ్రువీకరిస్తూ... వ్యక్తులు దాఖలు చేయాల్సిన ఫామ్స్ ఇవి. 60 సంవత్సరాల లోపు వయస్సు వారికి ఫామ్ 15జీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 15హెచ్ వర్తిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇతర ఎటువంటి ఆదాయం లేకుండా... డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే బతికే వారికి ఈ ఫామ్ల దాఖలు మంచి ఫలితాలను అందిస్తాయి. పీఎఫ్ విత్డ్రాయల్స్పై కూడా.. కొన్ని పరిమితులకు లోబడి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్డ్రాయల్స్ విషయంలో కూడా జూన్ 1 నుంచీ టీడీఎస్ భారం పడనుంది. ఐదు సంవత్సరాల లోపు (ఉద్యోగికి) సర్వీస్ ఉన్న ఉద్యోగి విత్డ్రాయల్స్పై టీడీఎస్ పడుతుంది. ఈ సందర్భంలో రూ.30,000 పైబడిన విత్డ్రాయల్స్పై టీడీఎస్ అమలవుతుంది. పాన్ నంబర్ సమర్పిస్తే టీడీఎస్ 10 శాతంగా ఉంటుంది. 15జీ, 15 హెచ్ ఫారమ్లు సమర్పిస్తే- టీడీఎస్ సమస్య ఉండదు. ఈ మూడూ సమర్పించకపోతే... టీడీఎస్ 33 శాతం వరకూ ఉంటుంది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు బదలాయింపులపై మాత్రం టీడీఎస్ పడదు. అనారోగ్యం కారణాల వల్ల ఉద్యోగిని తొలగించినా టీడీఎస్ కట్కాదు. ఉద్యో గి సర్వీస్ ఐదేళ్లకు పైగా కొనసాగుతూ చేసే పీఎఫ్ విత్డ్రాయల్స్పై సైతం టీడీఎస్ ఉండదు. -
సీఏలు ‘ట్రూ అండ్ ఫెయిర్’గా ఉండాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనదని, సామాన్యుని దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ వరకు అందరూ ఆ సంతకం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ కె.వి.చౌదరి పేర్కొన్నారు. ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ను నిర్ధారిస్తూ ఆడిటర్లు ‘ట్రూ అండ్ ఫెయిర్’ అని సంతకం చేస్తారని, జీవితంలో కూడా సీఏలు అదే విధంగా వ్యవహరించినప్పుడే వృత్తి గౌరవం కాపాడినవారవుతారన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వస్తోందని, ఈ మధ్యకాలంలో బ్యాంకుల నుంచి నిధుల మళ్లింపుల కేసుల్లో పరోక్షంగా సీఏల పాత్ర కూడా ఉందంటూ చురకలు వేశారు. ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ ఎస్ఐఆర్సీ ప్రత్యక్ష పన్నులపై నిర్వహించిన ఒక రోజు సమావేశానికి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణల పేరుతో సామాన్యులను భయపెట్టాలన్నది ఆదాయ పన్ను శాఖ లక్ష్యం కాదని, పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న వారే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక సంస్థ టీడీఎస్ వసూలు చేసి చెల్లించకపోతే దానివల్ల మొత్తంగా రిఫండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో చాలా కఠినంగా వ్యవ హరిస్తున్నామన్నారు. గతేడాది సంయుక్త ఆంధ్రప్రదేశ్లో టీడీఎస్ వసూలు చేసి చెల్లించని 1,000 కేసులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఒప్పందాల్లో పన్ను ఎగవేత ఎక్కువగా ఉంటోందన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అరికట్టడానికి బెంగళూరు కేంద్రంగా ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లతో పాటు, ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దేవరాజ రెడ్డి, ప్రాక్టీసింగ్ సీఏలు పాల్గొన్నారు.