tears
-
మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం
వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్ టాపిక్గా నిలిచాయి.సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ, నాగచైతన్య మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో శోభిత ఎమోషనల్ అయింది. మంగళసూత్రాలను తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు. ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి. అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున. ట్విటర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు, డియర్ శోభిత- మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. -
టాటాకు పెంపుడు శునకం కన్నీటి బై బై
ముంబయి: వ్యాపార దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్10) సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం టాటాకు చివరిసారి వీడ్కోలు పలికారు. టాటాకు కడసారి బై బై చెప్పేందుకు వచ్చిన ఓ పెంపుడు శునకం ఈ అంత్యక్రియల్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ శునకం ఎవరిదో కాదు..రతన్ టాటా దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నదే. దీని పేరు గోవా. టాటా గోవా వెళ్లినపుడు ఓ వీధి శునకం ఆయన వెనకాల నడుస్తూ వచ్చింది. అంతే దాన్ని ముంబై తీసుకువచ్చి పెంచుకున్నారు. 11 ఏళ్లుగా గోవా టాటా వద్దే ఉంది. అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు టాటా పార్థివ దేహం పక్కనే కూర్చున్న గోవా తన మాస్టర్కు అశ్రనయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది -
హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు మాజీ ఎమ్మెల్యే కంటతడి
మరో నెల రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈలిస్ట్లో విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించింది.దీంతో పార్టీ నుంచి ఆశించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడం రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తనకు టికెట్ నిరాకరించడంతో మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్ కంటతడి పెట్టుకున్నారు. అయితే బివానీ జిల్లలోని తోషమ్ నియోజకవర్గం నుంచి శశి రంజన్ పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కలత చెంది శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను. పార్టీ నా విలువను చూస్తుందని, నా నియోజకవర్గాన్ని చూస్తుందని అనుకున్నాను. నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నిస్సహా స్థితిలో ఉన్నాను.’ అంటూ కంటతపడి పెట్టుకున్నాడు. అయితే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of— Sushil Manav (@sushilmanav) September 5, 2024అయితే పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉండాలని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పగా..‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. నన్ను ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు.కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13న జరనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్లోని ఈ ల్యాబ్లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్లాండ్లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు. ‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది. 2020, అక్టోబర్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు. కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు. భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు. ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం -
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్ను వీపింగ్ బాయిస్గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్, ట్రోల్స్.. మీరూ ఓ లుక్కేయండి
టమాటా ధరలు ఆకాశంలో ఉండి ఆందోళన కలిగిస్తున్న మాట ఎలా ఉన్నా, చేతికి చిక్కని, అందనంత ఎత్తులో ఉన్న టమాటపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తూ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేయండి.. ‘మా ప్రేమని టమాటాలతో కొనలేరు’ అంటాడు ఒక ప్రేమికుడు. పోజ్ కొడుతున్న టమాటాను ఉద్దేశించి సాటి కూరగాయలు ఇలా అంటాయి... ‘నడమంత్రపు సిరి అంటే ఇదే’ మరో మీమ్లో... పరుగు పందెంలో డీజిల్, పెట్రోల్లతోపాటు టమాట కూడా పాల్గొని నెంబర్వన్ స్థానంలో నిలిచి కాలరెగరేస్తోంది. ఉల్లిగడ్డ... కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. అదేమిటో... టమాట పేరు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి. Ek tamatar ki keemat tum kya jano, Ramesh Babu!!#TomatoPrice pic.twitter.com/ViZMVtaF7W — Sandhya Bhadauria (@Okk_Sandhya) June 27, 2023 Returning home with 2kg tomato#TomatoPrice pic.twitter.com/TH1oSEaELl — Thanos Pandit™ (@Thanos_pandith) June 27, 2023 #TomatoPrice keep running pic.twitter.com/Q2WmxttRkZ — varsha roshan (@RoshanVars79963) June 27, 2023 #TomatoPrice hike, Say it like Nimmo Tai 😎 pic.twitter.com/GmKJKR74vs — United India 🇮🇳 (@Unitedd_India) June 27, 2023 Tomato prices are skyrocketing across the country. Even a simple dish like rasam has become costly. But what is causing this price hike?#tomato #tomatopricehike #climatechange #delayedrainfall #heavyrainfall #heatwave #newswithnavya pic.twitter.com/RjgsJEHMxB — Navya Singh (@newswithnavya) July 2, 2023 #TomatoPrice pic.twitter.com/3YA3eYeg1I — Sri Rama Chandra Murthy YV (@yvsrc_murthy) July 4, 2023 #TomatoPrice pic.twitter.com/ITKLb1ONiN — Nala Ponnappa (@PonnappaCartoon) July 3, 2023 -
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్!
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఒకటే ఏడుపు... పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. View this post on Instagram A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20) -
గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయిన సామ్ కంటతడి పెట్టింది. కాగా తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి ఇలా మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సినిమాపై ఉన్న ప్రేమ, సినిమాకు నామీదున్న ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ''గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారు. ఈ కథ విన్నప్పుడు మేం ఊహించుకున్నట్లు రావాలి అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఉంది అనేలా ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. ఇండియన్ హిస్టరీ లో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లైఫ్లో ఎన్ని ఫేస్ చేసినా సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ సమంత మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) We're with you sam 🤍🥺 be strong@Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/sDjC9r9dBR — Jegan (@JeganSammu) January 9, 2023 -
మయోసైటిస్తో ఆ స్టేజ్లో ఉన్నాను.. భావోద్వేగానికి లోనైన సమంత
సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది. -
మయోసైటిస్ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సెనెటర్ ఆజం ఖాన్ స్వాతి ఒక అభ్యంతరకర వీడియో గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజం ఖాన్ గతనెలలో ట్విట్టర్లో జనరల్ కమర్ జావేద్ బజ్వాను విమర్శించడంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్పై విడుదల అయ్యారు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో ప్రసంగిస్తూ...తన భార్యకు గత రాత్రి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని చెప్పారు. ఐతే నా దేశంలో కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు కాబట్టి ఆ వీడియో గురించి ఏమి ప్రస్తావించలేను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను తన భార్య క్వెట్టాను సందర్శించినప్పుడూ ఈ వీడియోని తీశారని, దీంతో తనను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు. అంతేగాదు తనను కస్టడీలో ఉంచి బట్టలు విప్పి ఎగతాళి చేస్తూ.. టార్చర్ చేసినట్లు తెలిపారు. ఐతే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఫేక్ వీడియో అని, ఫోటోషాప్తో సృష్టించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఐతే సెనెటర్ ఈ విషయమై ఒత్తిడి చేస్తున్నారు కాటట్టి అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తే విచారణ చేస్తామని ఫెడరల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ...ఆజం ఖాన్ స్వాతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. అలాగే ఆయన భార్య అనుభవిస్తున్న అవమానకరమైన బాధ, ఆవేదనకు పాకిస్తాన్ తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. Shocking details of what happened last night to Azam Swati and his family being stated by @AzamKhanSwatiPk himself 1/2 pic.twitter.com/gdLpAW30qe — PTI (@PTIofficial) November 5, 2022 (చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!) -
Sakshi Cartoon: సారు.. ఇలా లైవ్లో స్పందించరు!
సారు.. ఇలా లైవ్లో స్పందించరు! -
కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ
కాశీబుగ్గ: మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్ఫిల్మ్ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
పునీత్ రాజ్కుమార్ సినిమా చూస్తూ అభిమానుల కంటతడి
Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్ యాక్షన్స్ సీన్స్ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 -
ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత
Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie: గుండ్రని కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచిన చిన్నది ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బాపుబొమ్మ సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా 'బావ' మూవీలో నటించి మెప్పించింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్బస్టర్ హిట్ 'అత్తారింటింకి దారేది' సినిమాతో సెకండ్ హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం తెలుగులో అవకాశాలు లేక కనుమరుగైంది. సినిమాల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ప్రణీత. ఈ సోషల్ మీడియా వేదికగా తను, ఆమె భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశాం అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ప్రణీత తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్లో ''మేము 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు.'' అని పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. ఈ చిత్రాన్ని వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్సైట్తో తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ కళ్ల నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని 'ఝూలా కిన్నే దాలా రే, హమ్రియా, లతా మంగేష్కర్ ఆలపించిన పాపులర్ సాంగ్ ‘లగ్ జా గలే’, ఆజ్ జానే కీ జిద్ న కర్ అనే గజల్ను ఇర్ఫాన్ కోసం పాడి వినిపించానంటూ సుతాప ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ లేకుండా, సింగిల్ మదర్గా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది ఇర్ఫాన్ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్కెంతో ఇష్టమైన నైట్ క్వీన్ మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు
పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్థింగ్ స్పెషల్గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. చదవండి: అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు! ‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్ View this post on Instagram A post shared by WeddingWire India (@weddingwireindia) -
ఆ నిర్ణయం దురదృష్టకరం: మేరీ కోమ్ భావోద్వేగం
టోక్యో ఒలింపిక్స్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇంగ్రిట్ వాలెన్సియాపై ఓడిన తరువాత మీడియాతో మాట్లాడిన మేరీ కోమ్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జెస్ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదనీ, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే 40 ఏళ్ల వయస్సు వరకు తన బాక్సింగ్ వృత్తిని కొనసాగిస్తానని మేరీ కోమ్ ప్రకటించారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల విభజన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ పరిస్థితిని మేరీ కోమ్ కూడా ఊహించలేదు. ఒక దశలో ఇంగ్రిట్ విజేతగాప్రకటించడానికి ముందే విజేతగా మేరీ తన చేయిని పైకి లేపారు. ముగ్గురు జడ్జిలు ఇంగ్రిట్కు అనుకూలంగా బౌట్ తీర్పు ఇవ్వగా ఇద్దరు మేరీ కోమ్కు మద్దతిచ్చారు. కానీ పాయింట్ల కేటాయింపులో తేడా మేరీని విజయానికి దూరం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ట్వీట్ చేశారు. అందరి దృష్టిలో మీరే విజేత. కానీ న్యాయమూర్తులకు వారి వారి లెక్కలు ఉంటాయంటూ ట్విటర్లో వ్యాఖ్యానించారు. ప్రియమైన మేరీ కోమ్, టోక్యో ఒలింపిక్స్లో కేవలం ఒక పాయింట్తో ఓడిపోయారు. కానీ ఎప్పటికీ మీరే ఛాంపియన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మహిళా బాక్సర్ సాధించనిది మీరు సాధించారన్నారు. మీరొక చరిత్ర. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని కేంద్ర మాజీ క్రీడామంత్రి ప్రశంసించారు. అలాగే ఇతర క్రీడాభిమానులు కూడా మేరీ కోమ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓడిపోయినా ‘యూ ఆర్ ది లెజండ్.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అన్న సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. For all of us @MangteC was the clear winner but Judges have their own calculations😥 https://t.co/bDxjHFK9MZ pic.twitter.com/gVgSEugq4Q — Kiren Rijiju (@KirenRijiju) July 29, 2021 -
ప్రధాని మోదీ కంటతడి
వారణాసి/లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టుకున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య యోధులతో సమావేశం సందర్భంగా.. వైరస్తో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తన లోక్సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు, వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్ సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 పేషెంట్ల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆయన సూచించారు. ‘జహాః బీమార్.. వహీః ఉపచార్’అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించారు. దానివల్ల ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు. ‘అందరి ఉమ్మడి కృషితో ఈ మహమ్మారిని కొంతవరకు నియంత్రించగలిగాం. కానీ అప్పుడే సంతృప్తి చెందలేం. యుద్ధాన్ని ఇంకా చాలారోజులు కొనసాగించాల్సి ఉంది’అన్నారు. వారణాసి, పూర్వాంచల్లోని గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు దృష్టి పెట్టాలన్నారు. టెలీ మెడిసిన్ సేవలను విస్తృతం చేయాలని, యువ వైద్యులు, రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, వార్డ్బాయ్స్, అంబులెన్స్ డ్రైవర్లు.. తదితరుల సేవలను ప్రధాని కొనియాడారు. ‘కానీ ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇంతగా కష్టపడుతున్నా.. చాలా మంది ప్రాణాలను ఇంకా కాపాడలేకపోతున్నాం. మనకు దగ్గరైన వారెందరినో ఈ వైరస్ తీసుకెళ్లిపోయింది’అంటూ కంటనీరు పెట్టుకుని, గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఆ తరువాత కాసేపటివరకు ఆవేదనతో ఆయన మాట్లాడలేకపోయారు. కాసేపటికి తేరుకుని.. కరోనాతో చనిపోయినవారందరికీ నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానన్నారు. కరోనా నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. తాజాగా బ్లాక్ ఫంగస్ మరో సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండో వేవ్లో కరోనాతో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ‘ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరమున్న రోగుల సంఖ్య పెరిగింది. దాంతో వైద్య వ్యవస్థపై భారీగా భారం పడింది’అని వివరించారు. కనిపించని, క్షణక్షణం రూపుమార్చే శత్రువుతో పోరాడుతున్నామన్నారు. టీకాలే ఈ వైరస్ నుంచి కాపాడే సురక్షా కవచాలని, టీకా వేసుకున్న కారణంగానే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్లైన్ యోధులు ధైర్యంగా పోరాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సురక్షా కవచం అందరికీ చేరాల్సి ఉందన్నారు. ఏడేళ్లుగా వైద్య రంగంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. అయితే, ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు సేవలందించిన వైద్య సిబ్బంది కృషి విస్మరించలేనిదని కొనియాడారు. మొదట్లో తాము యోగాకు ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి కొందరు మతం రంగు పులిమారని, కానీ ఇప్పుడు ఆ యోగానే కరోనాపై పోరులో మనకు సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల వల్ల వారణాసి లబ్ధి పొందిందన్నారు. -
అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల దృష్ట్యా వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు నటులు, ప్రొఫెషనల్ క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకుంటూ మండిపడ్డారు. అసలు 'ఎసెన్షియల్’ అర్థం ఏమిటి? అంటూ మహారాష్ట్ర అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రొఫెషనల్ 'నటులు' వారి వారి సినిమాల షూటింగ్ కొనసాగించుకోవచ్చు. ప్రొఫెషనల్ 'క్రికెటర్లు' అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ 'రాజకీయ నాయకులు' భారీగా గుమిగూడిన జనాలతో ర్యాలీలను కొనసాగించవచ్చు. కానీ వ్యాపారం లేదా పని ఎసెన్షియల్ కాదా అని అన్మోల్ అంబానీ ప్రశ్నించారు. ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరోవైపు కరోనా కేసుల పెరుగుదల మధ్య మహారాష్ట్రలో వ్యాక్సిన్లు అయి పోతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇక మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, రాబోయే మూడు రోజులకు ఇవి సరిపోతాయని అన్నారు. కాగా దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత తీవ్రంగా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. సినిమా హాళ్ళు, పార్కులు, మ్యూజియంలు , రెస్టారెంట్లు అన్ని మత ప్రదేశాలను మూసి ఉంచాలని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, రాత్రిపూట సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని మంత్రివర్గం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతంలో (శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు) పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. What does essential even mean? EACH INDIVIDUALS WORK IS ESSENTIAL TO THEM. #scamdemic — Anmol A Ambani (@anmol_ambani) April 5, 2021 -
గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ భావోద్వేగం
సాక్షి న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పదవీ విమరణ చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యసభలో పదవీకాలం ముగుస్తున్న నేతలనుద్దేశించి ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ నేత ఆజాద్పై అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు. గులాం నబీ తనకు నిజమైన స్నేహితుడని అభివర్ణించిన ప్రధాని, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆజాద్ సేవలను కొనియాడుతూ కన్నీరు పెట్టారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్కు సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో సభ చప్పట్లో మారుమోగింది. ఆజాద్ తన సొంత పార్టీ గురించి మాత్రమే కాకుండా దేశం, సభ గురించి కూడా ఆజాద్ ఆందోళన చెందే వారన్నారు. 2007లో కశ్మీర్ ఉగ్రదాడి సమయంలో గుజరాతీ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయన చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్షణం గుజరాతీ పర్యాటకులను యోగ క్షేమాలపై తనకు అప్డేట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకన్నా మిన్నగా స్పందించారంటూ ఆయన సహాయానికి సెల్యూట్ చేశారు. గులాం నబీ తనకు చాన్నాళ్ల నుంచి తెలుసు అని, ఒకే సారి సీఎంలుగా పనిచేశామని, గార్డెనింగ్లో ఆయనకు మంచి పట్టుందన్నారు. అలాగే ఆ సమయంలో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయత్నాలను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ‘మీ పదవీ విరమణను అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి’ అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ అన్నారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలన్నారు. అలాగే కశ్మీర్ ఎన్నికలను ఆజాద్ స్వాగతించారంటూనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై ఆజాద్ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 -
సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి
న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్లో నేషనల్ గార్డ్ సెంటర్లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్టన్ స్టేషన్లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు. -
ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు
సిడ్నీ : ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్ కంటతడి వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. కాగా సిరాజ్ కంటతడి పెట్టడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచుకున్నాడు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') 'జాతీయగీతం ఆలపించే సమయంలో మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన నన్ను ఒక క్రికెటర్గా చూడాలని ఎప్పుడూ అంటుంటేవాడు.. స్వతహగా మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో దేశం తరపున ఒక్క టెస్టు మ్యాచ్లో నేను ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉండేదని నాతో చాలాసార్లు అనేవాడు. ఆరోజు రానే వచ్చింది.. ఆసీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కానీ నా ఆటను చూడడానికి మా నాన్న ఈరోజు బతికిలేడు. అందుకే అదంతా గుర్తుకువచ్చి కాస్త ఎమోషనల్ అవడంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయంటూ' బాధగా చెప్పుకొచ్చాడు. (చదవండి : మహ్మద్ సిరాజ్ కంటతడి) కాగా మెల్బోర్న్ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ తొలి మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్లు కలిపి 5 వికెట్లు తీయడం ద్వారా ఆకట్టుకున్నాడు. అంతేగాక మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సిరాజ్ తన తొలి టెస్టునే మధురానుభూతిగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. Mohammed Siraj provided a glimpse of what it means to represent your country in international cricket ✨#AUSvINDpic.twitter.com/HpL94QH5pr — ICC (@ICC) January 7, 2021 -
బ్రిటీష్ వాళ్ల కంటే అధ్వాన్నంగా మారకండి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గురువారం అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. కరోనా కాలంలో అంత అత్రుతగా చట్టాలను ఆమోదించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులపై కేంద్రం మరోమారు పునరాలోంచుకోవాలని, బ్రిటీషర్స్ కంటే అధ్వానంగా తయారుకావొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 'వ్యవసాయ బిల్లుల ప్రయోజనాలను రైతులకు వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. రైతుల భూములు తీసుకోనందున అది వారికి లాభం చేకూరుతుందని యూపీ సీఎం యోగి అంటున్నారు. అసలు ఇవి రైతులకు ప్రయోజనకరమా?ఢిల్లీ సరిహద్దుల్లో గత మూడు వారాలుగా రైతులు తమ నిరసన తెలియజేస్తున్నారు. లాఠీ చార్జీలు చేసినా , టియర్ గ్యాస్ ప్రయోగించినా లెక్కచేయకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీ రైతు ఓ భగత్సింగ్లా మారారు. ఈ క్రమంలో రైతు నిరసనలకు మద్దతుగా ఆప్ వారికి బాసటగా నిలుస్తోంది. వారికి తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, వంటి మౌలిక సదుపాయాలను అందిస్తోందని, రైతుల డిమాండ్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం' అని కేజ్రివాల్ పేర్కొన్నారు. (కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ ) 20 से ज्यादा किसान इस आंदोलन में शहीद हो चुके हैं। रोज एक किसान शहीद हो रहा हैं। मैं केंद्र सरकार से पूछना चाहता और कितनी शहादत और कितनी जान आप लोगे? : मुख्यमंत्री @ArvindKejriwal #KejriwalAgainstFarmBills pic.twitter.com/UDnlcvchnb — AAP (@AamAadmiParty) December 17, 2020 రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 65ఏళ్ల పూజారి సహా 20మంది మరణించినట్లు కేంద్రానికి నివేందించారు. రైతులు తమ గొంతులను వినిపించడానికి ఎంకెంత మంది ప్రాణత్యాగం చేయాలని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా ఆప్ ఎమ్మెల్యేలు మహేంద్ర గోయల్, సోమనాథ్ భారతి సైతం వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. ఈ నల్లచట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని వారు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో బలగాలను మోహరించారు. (రైతులకు మద్దతుగా ఆత్మహత్య ) AAP MLAs @attorneybharti and @MohinderAAP tears copy of 3 Farm Bills. "We refuse to accept these black laws which are against farmers." pic.twitter.com/7s4puJNZPA — AAP (@AamAadmiParty) December 17, 2020 -
ఈ అమ్మాయి ఏడ్వకుండానే
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని ఆప్తమాలజిస్ట్లకు తాజాగా ఈ 11 ఏళ్ల బాలిక కేసు సవాలుగా మారింది. ఈ అమ్మాయి ఏడ్వకుండానే కన్నీరు ఎర్రగా వస్తున్నాయి. సాధారణంగా పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే కన్నీరు వస్తాయి. కాని ఇక్కడ ఈ అమ్మాయి ఏడవకుండానే రోజులో మూడు నాలుగుసార్లు కళ్ల నుంచి ఎర్రనీళ్లు కారుతున్నాయి. తల్లి భయపడి స్థానిక ఐ క్లినిక్లో చూపించింది. వారికి ఏమీ తెలియలేదు. ఏ.ఐ.ఎం.ఎస్లోని కంటి నిపుణులకు కూడా ఏమీ తెలియడం లేదు. పిల్లల్లో కనిపించే ఈ అరుదైన స్థితిని ‘హిమోలాక్రియా’ అంటారు. గతంలో మనదేశంలో ఒక కేసు, బంగ్లాదేశ్లో ఒక కేసు కనిపించింది. మన దేశంలోని మరో కేసులో తల్లి కావాలని లేపిన పుకారని బయటపడింది. కాని ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో నిజంగా ఎర్రకన్నీరు వస్తున్నాయి. ‘ఇలా రావడానికి కచ్చితమైన కారణం అంటూ ఏదీ ఉండదు’ అని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. తల్లికి ఓదార్పు ఏమిటంటే ‘ఇవి ఎలా మొదలయ్యాయో అలాగే పోతాయి’ అని వైద్యులు చెప్పడం. అంటే ఈ బాధ ఎల్లకాలం ఉండదు అని అర్థం. -
కన్నీళ్లపై పేటెంట్ మాదే!
బెంగళూరు: ‘మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్గా మారాయి’ అని మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది. మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పోలీసులు తీవ్రంగా హింసించారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న, మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మానస్ భవన్లో ఆమె మాట్లాడుతూ విచారణ సమయంలో పోలీసులు తనను ఏవిధంగా హింసించిందీ రోదిస్తూ వివరించారు. ‘పోలీసులు నన్ను అక్రమంగా 13 రోజులు బంధించారు. ఆ సమయంలో వెడల్పైన బెల్టుతో నన్ను కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు. తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగ్విజయసింగ్పై ప్రస్తుతం ప్రజ్ఞ పోటీ చేస్తున్నారు. దిగ్విజయ హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు. -
ఒక్కసారి వచ్చి ఏడ్చిపోరా..?
ఎవరైనా చనిపోతే.. శత్రువుకైనా కన్నీళ్లు వస్తాయి అంటారు.. ఎక్కడైనా ఇది కామన్. అయితే ఆఫ్రికాలోని ఘనాలో ఏడవడం తప్పనిసరి సంప్రదాయం అట. ఎందరు ఏడుస్తున్నారన్న దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని ఎందరు ప్రేమిస్తున్నారనేది అంచనా వేస్తారట. పైగా ఎంతమంది ఏడిస్తే అంత ప్రెస్టేజీగా భావిస్తారు అక్కడి వారు. కొందరు తమ బంధువులు చనిపోతే ఏడుపు రావట్లేదట. అందుకే డబ్బులు ఇచ్చి మరీ ఏడ్పించుకుంటున్నారట. అందుకు కొందరు మహిళలను నియమించుకుంటున్నారట. ఇప్పుడు అక్కడ అదో బిజినెస్గా మారిపోయింది. అలా ఏడ్చేందుకు మహిళలు కావాలంటే అమీ డోక్లీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆమె వారందరికీ బాస్ అన్న మాట. తెలియని వారి దగ్గరికి వెళ్లి ఏడవడం అంటే అంత సులువేం కాదని, అందుకే డబ్బులు తీసుకుని మరీ ఏడుస్తున్నామని అమీ చెబుతోంది. కాస్త పెద్ద కార్యక్రమంగా చేయాలనుకుని ఎక్కువ డబ్బులు ఇస్తే గట్టిగా ఏడుస్తామని, తక్కువ డబ్బులు ఇస్తే చిన్నగా ఏడుస్తామని వివరించింది. ఎంత పిండికి అంత రొట్టె అన్న మాట! -
రెండేళ్లు...కన్నీళ్లు
‘అనంత’ కరువుకు చిరునామా.. ప్రకృతికి ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేస్తారు.. అరకొరగా పండినా ఆనందిస్తారు.. పంటమొత్తానికే పోతే..పాలకుల వైపు ఆశగా చూస్తారు..కానీ ప్రచార యావే తప్ప...రైతులను ఆదుకోవాలన్న ధ్యాసలేని సర్కార్...అమాయకులైన రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు గొప్పలు చెప్పిన పాలకులు... అర్హులైన వారికి మాత్రం అందివ్వకుండా వేధిస్తున్నారు. అందువల్లే 2016లోనే అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకూ చాలా మంది రైతుల ఖాతాల్లో పడలేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా...రైతు గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. అనంతపురం అగ్రికల్చర్: 2016 ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఒక్కో రైతుకు ఒక్కో రకంగా అన్యాయం జరిగింది. పంట వేసినా పరిహారం రానివారు కొందరు... పదెకరాల్లో పంట వేసి నష్టపోయినా కేవలం రూ.2 వేలు, రూ.3 వేలు వచ్చిన వారు మరికొందరు, వేరుశనగ పంట స్థానంలో ఇతర పంటల నమోదు చేసి అరకొర పరిహారం దక్కించుకున్న వారు ఇంకొందరు రైతులు ఉన్నారు. అంతా ఆన్లైన్, పారదర్శకతకు పెద్దపీట అంటూ గొప్పగా చెబుతున్నా ఇన్పుట్ సబ్సిడీ జాబితాలు తయారు, పరిహారం వర్తింపు, పంపిణీ మాత్రం ఇష్టారాజ్యంగా తయారైంది. అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు తారుమారు చేయడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరగ్గా అనర్హులకు పరిహారం ఎక్కువగా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాలు, పరిహారాన్ని చూసి లక్షలాది మంది రైతులు కంగుతిన్నారు. అర్జీల పోటు ఇన్పుట్ జాబితాలు ప్రకటించగానే రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రైతుల కోపాన్ని తగ్గించడానికి రంగంలోకి దిగిన సర్కారు పెద్దలు, అధికార యంత్రాంగం అర్జీలు ఇస్తే జాబితాలు సరిచేసి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని గొప్పలు చెప్పారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీలు వెల్లువలా వచ్చాయి. అసలే రాని వారు, అరకొరగా పరిహారం వచ్చిన రైతులు లక్షలాది మంది మండల, డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో పట్టాదారు, ఆధార్, బ్యాంకు పుస్తకం అందించి అర్జీలు సమర్పించుకున్నారు. అందులో అసలే పరిహారం రాని వారు 59 వేల మంది రైతులు అర్జీలు ఇచ్చుకోగా తక్కువగా పరిహారం వచ్చిన వారు 42 వేల మంది అర్జీలు ఇచ్చారు. ఇలా లక్ష మందికి పైగా రైతుల నుంచి రూ.143 కోట్లకు అర్జీలు వచ్చిపడ్డాయి. వాటిని మరోసారి క్రోడీకరించిన అధికారులు రూ.126 కోట్లు పరిహారం అదనంగా అవసరమని నివేదిక తయారు చేశారు. అందులో 52 వేల మంది అసలే పరిహారం రాని రైతులకు రూ.84 కోట్లు, తక్కువగా వచ్చిన 35 వేల మంది రైతులకు రూ.42 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మేరకు రూ.126 కోట్లు మంజూరు చేయాలని ఆరు నెలల కిందట ప్రభుత్వానికి, కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపారు. పంపిణీ అస్తవ్యస్తం మరోపక్క మంజూరు చేసిన 2016 ఇన్పుట్ పరిహారం పంపిణీ అస్తవ్యస్తంగా తయారు కావడంతో వేలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికీ జమ కావడం లేదు. ఏడాదికో పద్ధతిలో పంపిణీ చేస్తుండటంతో గందరగోళంగా మారింది. జేడీఏ కార్యాలయాన్ని పక్కనపెట్టి 2016 సమస్యలు ఇపుడు మండలాలు, డివిజన్ స్థాయిలోనే జాబితాలు తయారీ, మిస్మ్యాచింగ్ సర్దుబాట్లు, ఆ తర్వాత పరిహారం జమ చేసే బాధ్యత ట్రెజరీకి అప్పజెప్పడంతో రైతులకు అర్థం కాకుండా పోయింది. పరిహారం రాని రైతులు ఎక్కడ సంప్రదించినా సరైన జవాబు లభించకపోవడంతో దారుణంగా తయారైంది. జాబితాల ఆధారంగా పరిహారం జమ చేసినట్లు ట్రెజరీ అధికారులు చూపిస్తున్నా రైతు ఖాతాల్లోకి జమ కానివి చాలానే ఉండటం విశేషం. డివిజన్ వ్యవసాయశాఖ కార్యాలయాల నుంచి వందలాది మంది జాబితాలు అప్లోడ్ చేసి ట్రెజరీకి పంపిస్తే అందులో 10 శాతం మందికి కూడా పరిహారం జమ కావడం లేదంటున్నారు. అలా పదే పదే జాబితాలు పంపాల్సివస్తోందని వాపోతున్నారు. జిల్లాకు విడుదలైన రూ.1,032 కోట్ల పరిహారంలో ఇంకా రూ.180 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి చేరలేదంటున్నారు. మొత్తమ్మీద 2016 ఇన్పుట్ జాబితాల తయారీ, పరిహారం వర్తింపు, పంపిణీ వ్యవహారం ఘోరంగా తయారైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి ఓ రైతు పేరు ఎం. నాగరాజు.. 2016 ఖరీఫ్లో 5.25 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. వర్షం లేక పంట ఎండిపోయి రూ.80 వేలు నష్టం వాటిల్లింది. ఇన్పుట్సబ్సిడీ కింద గరిష్టంగా రూ.30 వేలు వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. కానీ... జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. బెళుగుప్ప, కళ్యాణదుర్గం, అనంతపురం వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, జేడీఏ కార్యాలయాల్లో అర్జీలు ఇచ్చుకున్నా ఇప్పటికీ నాగరాజు పేరు జాబితాలో చేర్చలేదు. -
గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు విలవిల
-
ఉల్లికి కన్నీరు!
ఉల్లి.. దాన్ని కోసేవారికి కన్నీరు రాక తప్పదు. ఎప్పుడూ కంటనీరు పెట్టని కఠిన హృదయులైనా ‘ఉల్లి’ ధాటికి కన్నీరు ఉబికి రావాల్సిందే. అయితే కంట నీరు రాకుండా ఉండే ఉల్లిని తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలే చేశారు. కొందరు సఫలమయ్యారు కూడా. 1980 నుంచి అమెరికాలోని వాషింగ్టన్, నెవడాలోని పంటపొలాల్లో పలు రకాల ఉల్లి జాతుల మధ్య సహజంగా సంకరం జరపడం వల్ల తాజాగా కొత్త రకం ఉల్లి ఆవిర్భవించింది. దీని పేరే ‘సునియాన్’. జన్యుమార్పుల వల్లే ఇది రూపొందిందని చెబుతున్నారు. ఈ ఉల్లి తియ్యటి రుచి కలిగి ఉంటుందని, కోసినప్పుడు కన్నీరు రాదని పేర్కొంటున్నారు. సునియాన్ భారత్కు ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అనుకుంటున్నారా.. దానికి ఇంకాస్త టైం ఉంది లెండి! -
ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం పెద్ద కుమార్తె మాలియా(19)ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చినప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మాలియాను వర్సిటీలో వదిలి వస్తుంటే తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నంత బాధ కలిగిందన్నారు. డెలావర్లోని బ్యూ బిడెన్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ విందు కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. మాలియాను హార్వర్డ్లో వదిలి వస్తున్న సమయంలో తనకు విపరీతంగా ఏడుపు వచ్చినప్పటికీ ఆమె ముందు ఏడ్వలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్(మాజీ ఉపాధ్యక్షుడు) దంపతుల్ని ఉద్దేశించి ఒబామా అన్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. తిరుగుప్రయాణంలో ముక్కు తుడుచుకుంటూ తాను చేసిన శబ్దాలు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి వినిపించినప్పటికీ వారు విననట్లే నటించారని చమత్కరించారు. జీవితంలో మనం ఎంత సాధించినా, చివరికి మనకు సంతోషాన్నిచ్చేది మాత్రం పిల్లలేనన్నారు. మళ్లీ అదే స్థాయి ఆనందం మనవళ్లు, మనవరాళ్ల వల్లే దక్కుతుందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాలియా ఐవీ లీగ్ స్కూల్లో చేరారు. -
మేరీ విగ్రహం నుంచి రక్తం, కన్నీరు..!
గుంటూరుపల్లి చర్చిలో వెలుగులోకి.. ఐనవోలు(వర్ధన్నపేట): వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత చర్చిలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు, రక్తం లాంటి ద్రవం కారుతుండ డంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆదివారం చర్చిలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, బుధవారం ఉదయం విగ్రహం కళ్లలోంచి రక్తంతో కూడిన కన్నీరు రావడాన్ని చర్చ ఫాదర్ గుర్తించారు. ఈ విషయం ఇన్చార్జ్ బిషప్ జోసఫ్కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. సమీప గ్రామస్తులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేరీమాతను దర్శించుకుంటున్నారు. -
ఆగని రోదన.. తీరని వేదన
-
నిన్న కంది..నేడు ఉల్లి
-
శోక సంద్రం
-
భూమాకు కన్నీటి వీడ్కోలు
– అశ్రునయనాల మధ్య భూమా అంతిమ యాత్ర – భారీగా తరలివచ్చిన ప్రముఖులు – జనసంద్రమైన ఆళ్లగడ్డ – అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అభిమాన నేత భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఊర్లు ఊర్లే కదిలివచ్చాయి. ప్రియతమ నాయకుడు ఇక లేడని తెలిసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. అన్న ఇక తిరిగి రాడని..ఆప్యాయ పలుకులు ఉండబోవని అనుచరులు కుమిలి కుమిలి ఏడ్చారు. నాన్నా..ఇక మాకెవరు దిక్కంటూ కుమార్తెలు అఖిల ప్రియ, నాగ మౌనిక రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రజా నాయకుడిగా..సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా భూమా నిలిచిన తీరు నాయకగణం కీర్తించింది. ఆళ్లగడ్డలో సోమవారం నంద్యాల ఎమ్మెల్యే భూమా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య కొనసాగాయి. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, ముఖ్యనేతలు భూమా పార్థీవ శరీరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆళ్లగడ్డ: గుండె పోటుతో మృతి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. అండగా నిలిచిన వారికోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. అభిమానుల సందర్శనార్థం భూమా పార్థీవ దేహాన్ని ఆళ్లగడ్డలోని ఆయన స్వగృహంలో ఉంచారు. భూమాకు నివాళులర్పించేందుకు సోమవారం ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. విగతజీవిగా ఉన్న ప్రియతమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జై భూమా.. భూమా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జనసమూహం మధ్య భూమా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభా ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రియతమ నాయకుడిని కడసారి చూసుకునేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గం నుంచే కాక రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో భూమా గృహంతోపాటు ఆళ్లగడ్డలోని ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిబంధనల ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహించి, ఆకాశంలోకి తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం భూమా చితికి ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్రెడ్డి నిప్పటించారు. హాజరైన పలువురు నేతలు భూమా అంత్యక్రియలకు రాష్ట్రంలోని పలువురు నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉపముఖ్యమంత్రులు కేయి కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాత, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, కర్నూలు ఎంపీ బుట్టారేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాదు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి.. తదితరులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
రైతు కంట ‘తడి’
– ఆదుకోని రెయిన్గన్లు – నీళ్లు, కరెంటు లేక ముందుకు సాగని రక్షకతడులు – మూడు రోజుల్లో 4 వేల హెక్టార్లను కూడా తడపని వైనం – ప్రమాదంలో పడిన 3.50 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట – నేడు జిల్లాకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖరీఫ్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రక్షకతడులు (లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్) ఇచ్చి పంటను కాపాడుతామంటూ పాలకులు, అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పది శాతం కూడా ఫలితం కనిపించడం లేదు. 20 రోజులైనా వాన చినుకు నేలకు పడకపోవడం, ఎండలు ముదిరిపోవడం, గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ‘అనంత’లో అప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పంటకు నీరందించలేకపోతుండటంతో రైతులు కంట తడి పెడుతున్నాడు. జిల్లాకు 4,200 సెట్ల చొప్పున రెయిన్గన్లు, స్ప్రింక్లర్ యూనిట్లు, డీజిల్ ఇంజిన్లు, అలాగే 1.30 లక్షల సంఖ్యలో హెచ్డీ పైపులు కేటాయించగా.. అందులో 3,107 సెట్ల రెయిన్గన్లు, 2,827 సెట్ల స్ప్రింక్లర్ యూనిట్లు, 1,626 డీజిల్ ఇంజిన్లు, 1.07 లక్షల హెచ్డీ పైపులు సరఫరా అయ్యాయి. వీటి ద్వారా ఈ నెల 18 నుంచి వేరుశనగ పంటకు రక్షకతడులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. కానీ... అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో రైతుల్లో రోజురోజుకు ఆందోళన ఎక్కువవుతోంది. నీళ్లు, కరెంటు సమస్య వర్షాలు లేక పంట కుంటలు, ఫారంపాండ్లు పూర్తిగా ఎండిపోవడం, భూగర్భజలాలు సగటున 19 మీటర్ల లోతుకు పడిపోవడంతో నీటి వనరుల లభ్యత సమస్యగా మారుతోంది. దానికి తోడు విద్యుత్ సరఫరా కూడా పగటి పూట మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే ఉండటంతో ఆ సమయంలో ఒక్కో రెయిన్గన్ ద్వారా ఒక ఎకరా పొలాన్ని కూడా తడుపుకోలేని పరిస్థితి నెలకొంది. రెయిన్గన్లను కూడా పూర్తిస్థాయిలో వాడని పరిస్థితి. అందులోనూ కొన్ని మండలాల్లో తెలుగు తమ్ముళ్లు తమకే రెయిన్గన్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో పంట ఎండినా కూడా కొందరు రైతులకు రెయిన్గన్ల ద్వారా నీటి తడులు ఇవ్వడానికి అధికారులు వెనుకాడుతున్నారు. 3.50 లక్షల హెక్టార్ల పంట వర్షాభావం వెంటాతుండటం, రెయిన్గన్ల ద్వారా ఫలితం కనిపించకపోవడంతో 3.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట ప్రమాదంలో పడింది. అధికారులు రూపొందించిన ప్రత్యేకయాప్లో 10 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించారు. వాస్తవానికి 3.50 లక్షల హెక్టార్ల పంట కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. కానీ... గత మూడు రోజులుగా రెయిన్గన్ల ద్వారా కేవలం 4 వేల హెక్టార్లకు కూడా నీటి తడులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే నీటి వనరులను అందుబాటులోకి తెస్తే రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, పైపులైన్ల ద్వారా కొంతవరకైనా పంటను కాపాడుకునే వీలుంది. అలా కాకుండా అన్నీ రైతులే చూసుకుంటే రెయిన్గన్లు ఇస్తామంటే రోజుకు 2 వేల హెక్టార్లు కూడా తడపడం కష్టంగానే కనిపిస్తోంది. నేడు జిల్లాకు మంత్రి ప్రత్తిపాటి రెయిన్గన్ల ద్వారా వేరుశనగ పంటకు ఇస్తున్న రక్షకతడుల పరిశీలనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ప్రాంతాల్లో ఆయన పర్యటన ఉంటుందంటున్నారు. ప్రత్తిపాటి రాకతోనైనా వేరుశనగ రైతులకు కనీస ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది వేచిచూడాలి. -
చిన్ని బతుకులకు అంతులేని కష్టాలు
ఊరంతా రాఖీ పండుగ చేసుకుంటోంది. కానీ ఆ అక్కాతమ్ముళ్లు మాత్రం ఈ పూట ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నారు. అందరూ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకుంటున్నారు. కానీ వారు మాత్రం తమ రోజులు ఎప్పుడు మారుతాయా అని ఎదురు చూస్తున్నారు. లాలన చూసే తల్లి లేక, పాలన చూసే తండ్రి లేక ఆ పిల్లల బతుకులు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం కోసమే స్కూలుకు వెళ్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఉన్న వారు కూడా దూరమైపోతారేమో అన్న భయంతో ఓ చిన్న అబ్బాయి నవోదయలో సీటు కూడా వదిలేశాడంటే నమ్మాల్సిందే. ఈ రాఖీ పండుగ నాడు ఈ అక్కాతమ్ముళ్ల బతుకులను ఓ సారి చూద్దాం. నిత్యం వారి కన్నుల్లో ప్రవహిస్తున్న జీవనదుల లోతుల్ని తెలుసుకుందాం. – జలుమూరు మండలంలోని గొటివాడ గ్రామానికి చెందిన రాము, లక్ష్మి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరితో పాటు ఓ ఆడబిడ్డను కోల్కతా నుంచి వీరు పెంచడానికి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి పేరు నీలిమ. కొన్నాళ్ల వరకు సాఫీగానే సాగిన వీరి సంసార నావ లక్ష్మి కారణంగా మొదటి సారి అదుపు తప్పింది. ఇంత మంది ఆడపిల్లలను పోషించలేక ఆమె తన భర్తతో బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. దీంతో సంతాన పోషణ బాధ్యత మొత్తం రాముపైనే పడింది. ఆ భారం మోయలేక రాము మంచానపడ్డాడు. నాలుగేళ్లు మరణంతో పోరాడి ఓడిపోయాడు. తల్లీతండ్రి చనిపోయాక ఈ పిల్లల బతుకులు మరింత దుర్భరమైపోయాయి. అంతకుముందే కూతుళ్లలో పెద్దవారైన మల్లెమ్మ, సంధ్యలు గుంటూరుకు పని కోసం వెళ్లి అక్కడే వివాహాలు చేసుకుని స్థిరపడిపోయారు. మూడో అమ్మాయి దివ్య కూడా పది పాసై ఆ తర్వాత చదవడానికి ఆర్థిక స్థోమత సరిపోక గుంటూరుకే వెళ్లిపోయింది. తండ్రి చనిపోవడం, చూసే వారు లేకపోవడంతో పసివారైన ముగ్గురు పిల్లలకు అసలు కష్టాలు మొదలయ్యాయి. వీరిలో నీలిమే పెద్ద అమ్మాయి. అప్పటి వరకు చదువుతూ ఉన్న నీలిమ అక్కలందరూ వెళ్లిపోవడంతో తమ్ముడు అప్పలనాయుడు, చెల్లి వెన్నెలను చూసుకోవడానికి చదువు మానేసింది. వెన్నెల ఇప్పుడు గొలివాడ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. అప్పలనాయుడు తిమడాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు చదువుతున్నాడు. అబ్బాయికి ఏపీ రెసిడెన్షియల్, నవోదయ పాఠశాలల్లో చదివేందుకు సీట్లు లభించినా అక్క, చెల్లిని వదిలి వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ స్కూలులోనే భోజనాలు కానిచ్చేస్తున్నారు. రేషన్ కార్డు ఉండడంతో ఒక పూట భోజనం అయిపోతోంది. కానీ ఈ ముగ్గురు పిల్లలే బతకాలంటే ఈ సదుపాయాలు ఏ మాత్రం సరిపోవు. అందుకే ఈ చిట్టి చేతులు కాసింత బలాన్ని కోరుతున్నాయి. కుటుంబానికి పెద్దవారంటూ ఎవరూ లేకపోవడంతో కాసింత సాయం అర్థిస్తున్నాయి. వీరు ఉంటున్న పాక కూడా చాలా చిన్నది. కొద్దిగా పెద్ద వాన వస్తే వీరికి నరకమే. రాత్రివేళల్లో నిద్రపట్టే రోజులు చాలా తక్కువ. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడడానికి వీరు నానా కష్టాలు పడుతున్నారు. ఇళ్లు విడిచి వెళ్లిన వారు వీరి గురించి పట్టించుకోవడం లేదు. స్థానికులు, స్థానిక సర్పంచ్ మురళీకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వీరికి కొంత ఆర్థిక సాయం చేశారు. అలాగే మరికొంత మంది స్పందిస్తే తమ బతుకులు బాగు పడతాయని ఈ చిన్నారులు కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 7036507287 నంబర్కు సంప్రదించాలని కోరుతున్నారు. ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు ఎస్బీఐ అకౌంట్ నంబరు 31495326846లో సాయం జమ చేయవచ్చని తెలిపారు. -
గెలిస్తే కన్నీళ్లు వస్తాయ్
జయహో కనేటో మహిళల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో జపాన్ స్మిమ్మర్ కనేటో రీ స్వర్ణం సాధించింది. వివాదాస్పద (రెండుసార్లు డోపింగ్ నిషేధం ఎదుర్కొన్న) రష్యా అథ్లెట్ యులియా ఎఫిమోవా కన్నా 1.67 సెకన్ల ముందు రేసు పూర్తి చేసింది. విజయం తర్వాత ఆనందాన్ని తట్టుకోలేక ఈమె ఉద్వేగానికి గురైంది. అయితే విజయం ఆనందాన్నిచ్చినా.. మరింత ఉత్తమ టైమింగ్ నమోదు చేయనందుకు బాధగా ఉందని కనేటో తెలిపింది. చైనాకు చెందిన షీజింగ్ లిన్ మూడో స్థానంతో కాంస్యాన్ని అందుకుంది. 16 ఏళ్లకే స్వర్ణం అమెరికా స్విమ్మర్.. పదహారేళ్ల సిమోన్ మాన్యుయెల్ మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో బంగారు పతకం గెలుపొందింది. ఈ విజయంతో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తొలి ఆఫ్రో-అమెరికన్గా రికార్డులకెక్కింది. చిన్నవయసులో ప్రపంచ అత్యుత్తమ క్రీడా వేదికపై అవార్డు అందుకునే అవకాశం రావటంతో సిమోన్ ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అయితే ఈ రేసులో సిమోన్తో పాటు కెనడా స్విమ్మర్ పెన్నీ ఒలెక్సియాక్ ఒకే సమయంలో (52.70 సెకన్లు) రేసు పూర్తి చేయటంతో ఇద్దరికీ స్వర్ణపతకాన్ని అందించారు. మా లాంగ్.. మహదానందం టీటీలో చైనా హవా కొనసాగుతోంది. ప్రపంచ నెంబర్ వన్ మా లాంగ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్లో చైనాకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ ఝాంగ్ జైక్పై 4-0 (14-12, 11-5, 11-4, 11-4) తేడాతో గెలిచి.. టీటీలో ఐదో మేల్ గ్రాండ్స్లామ్ (ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ కప్, ఒలింపిక్ గోల్డ్) విజేతగా నిలిచాడు. లాంగ్కు ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణం. ఇది రియోలో చైనాకు 11వ బంగారు పతకం. లండన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్లోనే ఇంటిబాట పట్టిన లాంగ్.. ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ను ఓడించాడు. సిమోనా మజాకా! అమెరికా జిమ్నాస్టిక్ సంచలనం సిమోన్ బైల్స్ రియోలో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఆల్రౌండ్ టైటిట్ను తన ఖాతాలో వేసుకుంది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బైల్స్ రియోలో 62.198 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఓ ప్రపంచ చాంపియన్.. ఒలింపిక్స్ గోల్డ్ గెలవటం 1996 తర్వాత ఇదే తొలిసారి కావటం విశేషం. టీమ్ ఆల్రౌండ్ ఈవెంట్లోనూ అమెరికా స్వర్ణం గెలవటంలో సిమోన్ బైల్స్ పాత్ర కీలకం. వారెవా.. అలెగ్జాండ్రియా లండన్ ఒలింపిక్స్లో వ్యక్తిగత ఆల్రౌండ్ ఈవెంట్లో టైబ్రేక్తో తృటిలో పోడియం అవకాశాన్ని కోల్పోయిన అమెరికా జిమ్నాస్ట్ అలెగ్జాండ్రియా రైజ్మాన్... ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా రజతాన్ని అందుకుంది. అప్పటి పతకం మిస్సైన బాధేంటో ఆమెకు తెలుసు. అందుకే రజతం అందుకోగానే కన్నీటితో ఆనందాన్ని వ్యక్తపరిచింది. రష్యన్ జిమ్నాస్ట్ ముస్తాఫినా ఆలియా.. మూడో స్థానంలో నిలిచింది. 2012లో ముస్తాఫినా కారణంగానే.. అలెగ్జాండ్రియా పతకం మిస్సైంది. -
ఒబామా దిగిపోతున్నారని తెలియగానే..
న్యూయార్క్: అమెరికాలోనైనా సరే, ఆఫ్రికాలోనైనా సరే నాలుగేళ్ల పిల్లలకు దేశాధ్యక్షుడెవరో సాధారణంగా తెలియదు. కానీ అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలోని బీవర్టన్ నగరానికి చెందిన నాలుగేళ్ల పాప అబెల్లా టామ్లిన్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అని తెలియడమే కాకుండా ఆయనకు వీరాభిమాని కూడా. బరాక్ ఒబామా త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నారని కారులో కూర్చున్న చిట్టి తల్లి అబెల్లాకు తల్లి ఆండ్రియా చెప్పగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది. డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఒబామా ప్రసంగాన్ని వింటున్న ఆండ్రియా, ఒబామా దిగిపోతున్న విషయాన్ని తన కూతురుకు చెప్పగానే ఆ పాప ఏడపందుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఒబామా స్థానంలో హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షులుగా ఎన్నికవుతారంటూ తల్లి సముదాయించేందుకు ప్రయత్నించినా ఆ పాప తన ఏడుపాపలేదు. ఒబామా ఉన్నాక మరో అధ్యక్షుడు మనకెందుకు అంటూ అమాయకంగా తల్లిని ప్రశ్నించింది. చిన్నప్పటి నుంచి ఒబామా అంటే తన పాపకు ఎంతో ఇష్టమని మామ్ చెప్పారు. ‘ఒబామా అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం మనతో కలసి భోంచేస్తారా, చెప్పు!’ అంటూ తల్లి బుజ్జగించేందుకు ప్రయత్నించినా, అసలు ఎందుకు తప్పుకోవాలంటూ ఆ పాప ఎదురు ప్రశ్నించింది. ఒబామా తర్వాత హిల్లరీ ఎన్నికవుతారని, ఆమె కూడా చాలా మంచిదేనని నచ్చచెప్పానని, ఉద్దేశపూర్వకంగానే హిల్లరీతో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పలేదని ఆండ్రియా వివరించారు. ప్రతికూల దృక్పథంతో మాట్లాడేవారి గురించి తన పాపకు చెప్పడం తకను ఇష్టం లేదని ఆమె అన్నారు. పాప వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలను ఆండ్రియా వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడావీడియో హల్చల్ చేస్తోంది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాక వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ఒబామా తన పదవికి రాజీనామా చేస్తున్న విషయం తెల్సిందే. -
అందరూ ఉన్న అనాథ!
ఆమెకు కన్న బిడ్డలు ఉన్నారు... కానీ ఆకలి అంటే అన్నం పెట్టే వారు కరువయ్యారు. అయిన వారు చాలా మందే ఉన్నారు... దాహం వేస్తే గుక్కెడు నీరు అందించే వారు మాత్రం లేకపోయారు. జగమంత కుటుంబాన్ని నడిపించినా ఆఖరులో ఏకాకి జీవితాన్ని గడుపుతోంది. సత్తువ ఉన్నంత కాలం కుటుంబాన్ని రెక్కల కష్టంతో లాగినా... ఆ రెక్కలు పోయాక దిక్కులేని పక్షిలా గుడిసెకే పరిమితమైపోయింది. సొంత వారు పరాయి వారైపోయి, ఇరుగుపొరుగు వారు ఆప్తులైన వేళ ఆ ముదుసలి బతుకు శోకతప్తమైంది. కళ్లు కనిపించకపోయినా కన్నీరు పెట్టని రోజు లేదు, నోరు రాకపోయినా సంతానాన్ని తలిచి పిలవని రోజూ లేదు. – పొందూరు పొందూరు మండలంలోని బాణాం గ్రామంలో కొల్లి అంకమ్మ(80) జీవన చరమాంకంలో పడరాని కష్టాలు పడుతోంది. అంకమ్మ భర్త సూరినాయుడు 45 ఏళ్ల కిందటే చనిపోయారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి అంకమ్మే కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. సంతానానికి పెళ్లిళ్లు చేసింది. కూతురు లావేరు మండలంలో అగ్రహారంలో తన భర్తతో పాటే ఉంటుంది. కొడుకు మాత్రం పొందూరు మండలంలోని దళ్లిపేట గ్రామంలో తన భార్య, పిల్లలుతో కలిసి ఉంటున్నాడు. వీరు పదేళ్ల కిందట తల్లిని విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అంకమ్మ కన్నీళ్లు మింగుకుంటూ, కష్టాలు అనుభవిస్తూ బతుకుతోంది. తల్లిని చూసేందుకు కూతురు అప్పుడప్పుడూ వచ్చి Ðð ళ్తూ ఉంటుంది. ఆమె వచ్చినప్పుడల్లా అంకమ్మ మురిసిపోతుంది. కానీ కొడుకు, కోడలు రావడం లేదనే దిగులు మాత్రం అంకమ్మను ఉండనివ్వడం లేదు. దీనిపై స్థానికులు కూడా కొడుకు, కోడలితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఊరివారే బంధువులు... కొడుకు, కోడలు విడిచి పెట్టినప్పటి నుంచి అంకమ్మకు ఊరివారే బంధువులయ్యారు. వృద్ధాప్య పింఛన్, రేషన్ బియ్యంతో బతుకీడుస్తోంది. రోజూ వీధిలో రెండు కుటుంబాల వారు అంకమ్మ ఆకలి తీరుస్తున్నారు. అయితే అంకమ్మ నడవలేని స్థితిలో ఉండి మలమూత్రాలకు కూడా వెళ్లలేకపోతోంది. ఈ పరిస్థితిని కూడా ఎదురుగా ఉన్న ఓ వికలాంగురాలు గుర్తించి రోజూ అంకమ్మను ఎలాగోలా బయటకు తీసుకువచ్చి కాలకృత్యాలు తీర్చుకొనేలా చేస్తోంది. వికలాంగురాలు, వారి తల్లి, మరో ఇద్దరు మహిళలు వృద్ధురాలికి ఆకలి దప్పికలు తీరుస్తున్నారు. నా కొడుకు పిలిస్తే వెల్లిపోతా... వృద్ధురాలు ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతోంది. వర్షం పడితే ఆమె ఉండే గుడిసె మొత్తం బురదగా మారిపోతుంది. చలి వేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేదు. తన కొడుకు పిలిస్తే వెంటనే వెళ్లిపోతానని ఆమె అంటున్నారు. కొడుకు పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు. -
సీబీఐ కోర్టులో యడ్యూరప్ప కన్నీరు
బెంగళూరు: బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం చీఫ్ బి.ఎస్.యడ్డ్యూరప్ప సోమవారం సీబీఐ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన సీఎంగా ఉన్నపుడు జరిగిన మైనింగ్ స్కాం కేసుకు సంబంధించి కోర్టు ఆయనను పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న ప్రేరణ ట్రస్ట్కు రూ. 20 కోట్లు నిధులు అందాయన్న ఆరోపణలపై ప్రశ్నించింది. రెండున్నర గంటల పాటు సాగిన విచారణలో యడ్డ్యూరప్పకు జడ్జి 475 ప్రశ్నలు వేశారు. ఈ అంశంపై ఆయన ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని జడ్జి ప్రశ్నించినపుడు యడ్యూరప్ప కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘నేనే తప్పూ చేయలేదు. నేను ఏం చేసినా చట్టం పరిధులకు లోబడే చేశాను. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లలేదు’ అని భావోద్వేగంతో చెప్పారు. -
వెబ్క్యామ్ ముందు ఏడ్వండి!
పారిస్: నవ్వు నాలుగు విధాల చేటంటారు పెద్దలు. మరి ఏడ్వడం? ఏడిస్తే...ముఖ్యంగా వెక్కి వెక్కి ఏడిస్తే గుండెలో గూడుకట్టుకున్న విషాదం తొలగిపోతుందట. హృదయం తేలిక పడుతుందట. ఒంటరి తనం దూరమవుతుందట. తనువు తాపం తీరిపోతుందట. శరీరంలో కొత్త శక్తి పుట్టుకొచ్చి నూతనోత్సాహం కలుగుతుందట. ఇదీ పారిస్కు చెందిన ఓ యువ కళాకారిణి డోరా మౌటోట్ ఫిలాసఫీ. గత కొంతకాలంగా ఒంటరితనాన్ని భరించలేక కంప్యూటర్ వెబ్క్యామ్ ముందు పదే పదే ఏడ్చిన డోరా ఇప్పుడు తన కన్నీళ్లను ప్రపంచంతో పంచుకోవడానికి ‘వెబ్క్యామ్ టియర్స్’ పేరిట ఏకంగా ఓ ప్రాజెక్ట్నే చేపట్టింది. ‘నా కన్నీళ్లను షేర్ చేసుకోవడానికి మీరు కూడా వెబ్క్యామ్ ముందు ఒంటరిగా ఏడ్వండి. ఇదేమి నా పిచ్చి కాదు. ఈ సమాజంలో ఏడ్వడానికి ఎందుకు సిగ్గుపడతారు? ఏడ్వడం బలహీనతకు గుర్తనుకుంటున్నారా? అదేమి కాదు. ఈ ప్రపంచంతో మీ కన్నీళ్లను పంచుకోండి. ఆ వీడియో క్లిప్లను నాకు పంపించండి’ అని ఆమె ఫేస్బుక్, టంబ్లర్ పేజీల్లో పిలుపునిచ్చింది. అంతే సోషల్ వెబ్సైట్లో ఏడ్వడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఆమెకు ఏడ్చే వీడియోలు దాదాపు వంద వచ్చాయట. అలా వచ్చిన వీడియోల క్లిప్పులన్నింటినీ ఓ చోట చేర్చి మళ్లీ సోషల్ మీడియాకు చూపిస్తుందట. ‘ 365 డేస్: ఏ కాటలాగ్ ఆఫ్ టియర్స్’ పేరిట ఏడాది పాటు తన విషాదాన్ని వెళ్లలగక్కిన లారెల్ నకాడేట్ అనే ఆర్టిస్ట్ను స్ఫూర్తిగా తీసుకొని తానీ ప్రాజెక్ట్ను చేపట్టానని, వెబ్సైట్లలో జననాంగాలను చూసి ఆశ్చర్యపడే రోజులు పోయాయని, ఇకముందు టియర్స్ కూడా కొత్తరకం పోర్నోగ్రఫీ అని వ్యాఖ్యానించారు. -
మానని గాయం
క్రైమ్ ఫైల్ జూన్ 22, 2004... బ్రెజిల్... మంచమ్మీద కూర్చుని డైరీ తెరిచింది ఇరవయ్యేళ్ల సబీన్. పెన్నును చేతిలోకి తీసుకుంది. కానీ ఏం రాయాలో అర్థం కావడం లేదు. కలం నుంచి అక్షరాలు జారి పడటం లేదు. కళ్ల నుంచి కన్నీళ్లు మాత్రం రాలిపడుతున్నాయి. ‘‘ఎందుకురా ఏడుస్తున్నావ్? ఇకనైనా ఈ కన్నీటికి ఫుల్స్టాప్ పెట్టు’’... ఎప్పుడు వచ్చిందో ఆమె తల్లి, బాధగా అంది. కళ్లు తుడుచుకుంది సబీన్. ‘‘కన్నీళ్లకే కాదమ్మా, ఈ జీవితానికే ఫుల్స్టాప్ పెట్టాలని ఉంది’’ అంటూ బావురుమంది. అల్లాడిపోయింది తల్లి. గబగబా వెళ్లి కూతుర్ని గుండెకు హత్తుకుంది. ‘‘ఊరుకో తల్లీ. అయిపోయిందేదో అయిపోయింది. ఇక అన్నిటినీ మర్చిపో. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు’’ అంటూ అనునయించే ప్రయత్నం చేసింది. ‘‘లేదమ్మా. పాత గాయాలు సలుపు తుంటే కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టమంటావ్. ఒకవేళ నేను మర్చిపోవా లని అనుకున్నా ఈ సమాజం నన్ను మర్చి పోనివ్వద్దు. పొద్దుట్నుంచీ మీడియా మళ్లీ నా వెంట పడుతోంది. ఇంకెలాగమ్మా నేను మర్చిపోయేది?’’ ఆమె అలా అంటూ ఉండగానే ఫోన్ మోగింది. తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘నేనొక టీవీ రిపోర్టర్ని మేడమ్. మార్క్ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది కదా! దాని గురించి మీ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి తనని పిలుస్తారా?’’ సబీన్ తల్లి ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘ఇంటర్వ్యూ కావాలా? అసలు జాలనేదే లేదా మీకు? ఎందుకు దాన్నిలా హింసిస్తున్నారు?’’... అరిచింది. అయినా అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేయలేదు. సబీన్ తల్లి ఎంత చెప్తున్నా ఆమె వదలడం లేదు. దాంతో సబీన్ ఫోన్ లాక్కుని ‘‘నేను సబీన్ని మాట్లాడు తున్నాను’’ అంది. ‘‘సబీన్ మీరా? మీకోసమే ఫోన్ చేశాను. మీరోసారి...’’ ‘‘మీ స్టూడియోకి రావాలి అంతే కదా’’... ఆమె మాట పూర్తి కాకుండానే అంది సబీన్. ‘‘నేను వస్తాను. ఇంటర్వ్యూ ఇస్తాను. ఏర్పాట్లు చేసుకోండి’’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ‘‘సబీన్... నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా? వద్దురా’’ అంది తల్లి. ‘‘లేదమ్మా. నేను వెళ్తేనే ఈ కథకు ముగింపు దొరుకుతుంది’’ అంటూ లేచి బాత్రూమ్లోకి వెళ్లింది సబీన్. గంట తర్వాత... చానెల్ స్టూడియోలో ఉంది సబీన్. మొదలుపెడదామా అన్నట్టు సైగ చేసింది యాంకర్. సరేనన్నట్టు తలూపింది సబీన్. ‘‘అందరికీ నమస్కారం. ఈరోజు మార్క్ డ్యూట్రాక్స్ అనే సీరియల్ కిల్లర్కి ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. ఆ కిరాతకుడి చేతి నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి సబీన్ డార్డెన్. ఆమె ఈ రోజు మన ముందు ఉన్నారు. ఆవిడ కథ ఏమిటో, అసలు ఆమె జీవితంలో ఏం జరి గిందో ఆవిడ ద్వారానే తెలుసుకుందాం’’ అని సబీన్ వైపు తిరిగింది యాంకర్. మరుక్షణం సబీన్ టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యింది. ‘‘చెప్పండి మిస్ సబీన్? ఎనిమిదేళ్ల క్రితం ఏం జరిగింది? పోలీసులు సీరియల్ కిల్లర్ మార్క్ ఇంటి మీద దాడి చేసి నప్పుడు మీరు అక్కడ దొరికారు. కానీ మీ పట్ల ఏం జరిగిందనేది ఇంతవరకూ మీరు చెప్పలేదు. అసలు మీరు ఆ సీరియల్ కిల్లర్ చేతికి ఎలా చిక్కారు?’’ గొంతు సవరించుకుంది సబీన్. మెల్లగా పెదవి మెదిపింది. ‘‘నా కథ తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంది. నాపట్ల ఏం జరిగిందో తెలుసు కోవాలని ఉత్సుకతగా ఉంది. అందుకే ఎనిమిదేళ్లుగా మీడియా నా వెంట పడుతూనే ఉంది. కానీ నేనేరోజూ నోరు విప్పలేదు. ఎందుకంటే... పీడకలని పదే పదే తలచుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నా కథ చెప్పాలని అనుకుంటున్నాను. దానికి కారణం ఉంది. ఆ కారణం చివర్లో చెప్తాను. ముందు నా కథ వినండి’’ అంటూ చెప్పడం మొదలు పెట్టింది సబీన్. ఆగస్ట్ 13, 1996... స్కూలు నుంచి సైకిల్ మీద ఇంటికి బయలుదేరింది సబీన్. ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేసరికి ఒక కారు దూసుకొచ్చి ఆమె ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగాడు. సబీన్ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి కారులోకి నెట్టాడు. తప్పించుకోవా లని ప్రయత్నించింది సబీన్. ఆ అవకాశం ఇవ్వలేదతను. సబీన్ చెంపల మీద పిడి గుద్దులు గుద్దాడు. పన్నెండేళ్ల చిన్నపిల్ల... తట్టుకోలేకపోయింది. అతడి బలం ముందు ఓడిపోయి సొమ్మసిల్లింది. కళ్లు తెరిచేసరికి ఒకచోట బందీగా ఉంది సబీన్. ఆ చోటు ఏమిటో, ఎక్క డుందో అర్థం కాలేదు. కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయి. నోటిలో గుడ్డలున్నాయి. కదలడానికి లేదు. కనీసం అరవడానికి కూడా లేదు. దుఃఖం పొంగుకొచ్చింది. మౌనంగా ఏడుస్తూ చుట్టూ చూసింది. అదేదో ఇంటి బేస్మెంట్లా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా చెత్త, పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్ లాంటివి ఉన్నాయి. అంతా మురికి మురికిగా ఉంది. కడుపులో దేవినట్లయ్యింది సబీన్కి. తన ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంట్లో కాస్త దుమ్ము ఉన్నా ఇష్టం ఉండదు అమ్మకి. వెంటనే శుభ్రం చేస్తుంది. తన పక్క దుప్పటి కాస్త మురికిగా అనిపిస్తే వెంటనే తీసేసి తెల్లని దుప్పటి పరుస్తుంది. ‘‘ఆ మురికి అంటి నీ కూతురేం మాసిపోదులే’’ అని నాన్న సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది తాను ఇలాంటి మురికి కూపంలో ఉన్నానని తెలిస్తే అమ్మకెలా ఉంటుంది! అమ్మానాన్నలు గుర్తురాగానే దుఃఖం మరింత ఎక్కువయ్యింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సబీన్ గుండె జారిపో యింది. భయంగా తలుపు వైపు చూసింది. లోపలికి వచ్చి తలుపు గడియ పెడుతున్నాడతను. తనను ఎత్తుకొచ్చింది అతనే. ఇప్పుడు తనని ఏం చేస్తాడు? మెల్లగా సబీన్ దగ్గరకు వచ్చాడా వ్యక్తి. కట్లు విప్పాడు. నోటిలో ఉన్న గుడ్డలు లాగేశాడు. సబీన్ ఏదో మాట్లాడ బోయింది. కానీ అతడు అవకాశమివ్వ లేదు. పశువులా మీదపడ్డాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా మృగంలా విరుచుకుపడ్డాడు. పన్నెండేళ్ల ఆ లేత కుసుమాన్ని క్రూరంగా నలిపేశాడు. అలా ఒక్కసారి కాదు... ఎన్నోసార్లు చేశాడు. ఎనిమిది రోజుల పాటు తన పశువాంఛకు ఆ పసిదాన్ని బలి తీసుకున్నాడు. చెప్పడం ఆపి వెక్కి వెక్కి ఏడుస్తోంది సబీన్. టీవీల ముందు కూర్చుని చూస్తున్న వాళ్లందరి కళ్లూ కూడా చెమరుస్తున్నాయి. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ సబీన్... తర్వాత ఏమైంది?’’ అడిగింది యాంకర్. నిభాయించుకుంది సబీన్. ‘‘ప్రతి మగాడూ నాన్నలాంటివాడే అనుకునే వయసు అది. కానీ అందరూ నాన్నలా ఉండరని వాణ్ని చూశాక అర్థమయ్యింది. వాడెవడో నాకు తెలీదు. ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలీదు. ఎందుకు నా శరీరంతో అలా ఆడుకుంటున్నాడో అర్థం కాదు. వాడు చేసే పనుల వల్ల నా శరీరం బాధకు గురవుతుంటే, వాడికి ఆనందం ఎందుకు కలుగుతోందో తెలిసేది కాదు. ఎనిమిది రోజులు నరకయాతన పడ్డాను. తర్వాత పోలీసులు వచ్చారు. నా తర్వాత మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడ ని, అది ఎవరో చూసి తమకు ఫోన్ చేసి చెబితే వాణ్ని అరెస్ట్ చేశామనీ చెప్పారు. నన్ను ఆ నరక కూపం నుంచి బయటకు తీసుకొచ్చారు. అదీ నా కథ.’’ ‘‘ఓహ్... సారీ సబీన్. మీ పట్ల ఇంత ఘోరం జరగడం నిజంగా బాధాకరం’’ అంది యాంకర్. వెంటనే పెద్దగా నవ్వింది సబీన్. ఒక క్షణం.. రెండు క్షణాలు... ఐదు క్షణాలు... అలా పగలబడి నవ్వుతూనే ఉంది. యాంకర్ విస్తుపోయింది. టీవీ చూస్తోన్న ప్రేక్షకులదీ అదీ పరిస్థితి. ఎందుకు నవ్వుతోందామె? నవ్వి నవ్వి ఆగింది సబీన్. ‘‘నిజంగా మీకు అంత బాధగా ఉందా?’’ అంది యాంకర్వైపు చూసి. తత్తరపడిందామె. ఏం మాట్లాడాలో అర్థం కాక గుటకలు మింగింది. ‘‘మీరు నిజంగా అంత బాధపడేవాళ్లే అయితే... ఈరోజు నేను ఇక్కడికి రావలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు... ఆ సమయంలో... ఆ రాక్షసుడు నాకు ఎనిమిది రోజుల పాటే నరకం చూపించాడు. కానీ మీరు... మీరు నన్ను ఎనిమిదేళ్ల పాటు నరకయాతన పెట్టారు’’... అరిచినట్టే అంది సబీన్. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ‘ ‘ఒక ఆడపిల్లని. తెలిసీ తెలియని వయసులో ఓ రాబందు రెక్కల మాటున బందీని అయ్యాను. వాడి క్రూరచర్యలకు బలయ్యాను. అదృష్టంకొద్దీ తప్పించుకుని బయటపడ్డాను. నా భవిష్యత్తు పాడు కాకూడదని, పోలీసులు నా పట్ల జరిగినదాన్ని దాచిపెట్టారు. కోర్టు కూడా నన్ను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేసింది. కానీ ఏం లాభం? మీరంతా కలిసి నాకసలు భవిష్యత్తే లేకుండా చేశారు. ఈ కేసు గురించి చర్చ వచ్చినప్పుడల్లా నన్ను మీడియా వాళ్లు బయటకు లాగాలని చూశారు. నన్ను వెంటాడారు, వేధించారు. బయటకు వెళ్తే ప్రతి ఒక్కరూ గుచ్చి గుచ్చి చూశారు. ఆ చూపులు గుండెల్లోకి గునపాల్లా దూసుకెళ్లా యని, ఆ చూపుల్లో ఉన్న వంద సందే హాలు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఛిద్రం చేసి పారేశాయని మీకెవ్వరికీ తెలియదు. నా మీద జాలి చూపమని నేనెవ్వరినీ అడగ లేదు. నా గాయాన్ని రేపకుండా ఉంటే చాలనుకున్నాను. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. నాపట్ల ఏదో జరిగిందని మీ అనుమానం. అదేంటో తెలిసేవరకూ మీరు నన్ను వదలరని నాకు తెలుసు. అందుకే ఈరోజు మీ అందరి ముందుకూ వచ్చాను. మార్క్ డ్యూట్రాక్స్ నా జీవితాన్ని నాశనం చేశాడు కానీ నన్ను చంపలేదు. కానీ మీరు మీ చూపులతో, ప్రశ్నలతో ప్రతి క్షణం నన్ను చంపుతున్నారు. వాడు చేసిన గాయాన్ని పదే పదే రేపుతూ, వాడి కంటే ఎక్కువగానే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంతకంటే ఆ రోజు నేను వాడి చేతుల్లోనే చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది’’ అనేసి ఆవేశంగా లేచి వెళ్లిపోతోన్న సబీన్ వైపు నివ్వెరపోయి చూస్తూండిపోయింది యాంకర్. ఆ క్షణంలో టీవీ ముందు కూర్చున్న ఎంతోమంది మనసులు సిగ్గుతో చితికిపోయాయి. మానవ మృగం: మార్క డ్యూట్రాక్స్ మార్క్ డ్యూట్రాక్స్ ఓ సీరియల్ కిల్లర్. పదిహేనేళ్ల లోపు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బంధించేవాడు. వాళ్లను రాక్షసంగా అనుభవించేవాడు. అదంతా వీడియో తీసి బ్లూఫిల్ముల వ్యాపారం చేసేవాడు. కొత్త అమ్మాయిని తీసుకు రాగానే పాత అమ్మాయిని తిండి పెట్టకుండా మాడ్చి చంపేసేవాడు. అలా పదమూడుమంది అమ్మాయిల్ని పొట్టనబెట్టుకున్నాడు. సబీన్ని బందీగా ఉంచిన సమయంలోనే మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అది చూసిన ఓ వ్యక్తి మార్క్ కారు నంబరును పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు మార్క్ని, అతనికి సహకరించిన అతడి భార్య మిషెల్ని అరెస్ట్ చేశారు. సబీన్ని కాపాడారు. మార్క్కి న్యాయస్థానం ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్షను, మిషెల్కి పాతికేళ్ల శిక్షనూ విధించింది. ఇద్దరూ బ్రెజిల్ జైల్లో మగ్గుతున్నారు. - సమీర నేలపూడి -
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్టేకర్గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు. -
అమీర్తో కన్నీళ్ళు పెట్టించిన సినిమాలు
-
ఏడ్చినా సంతోషంగా ఉండొచ్చట!
లండన్: ఏదైనా విషయంలో బాధ కలిగి ఏడవాలినిపిస్తే వెంటనే ఏడ్చేయండి. అంతేకానీ బాధను దిగమింగుకుని మనసులో దాచుకుంటే అది మరింత ఎక్కువవుతుంది. అయితే మనసారా కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడొచ్చని, అనంతరం మనసు ప్రశాంతంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నెదర్లాండ్స్కు చెందిన టిల్బర్గ్ యూనివర్సిటీ నిపుణులు 60 మందిపై అధ్యయనం జరిపి ఈ విషయాలు వెల్లడించారు. దీనిలో భాగంగా పరిశోధనలో పాల్గొన్న వారికి బాధకలిగించే చిత్రాలను 90 నిమిషాలపాటు ప్రదర్శించారు. వీరిలో ఆ చిత్రాలను చూస్తూ 28 మంది వెంటనే ఏడ్చేశారు. మరో 32 మంది మాత్రం కన్నీళ్లు పెట్టుకోకుండా లోలోపలే బాధపడ్డారు. చిత్రాలు చూసిన అనంతరం ఏడ్చిన వారి మూడ్ మారిపోగా, ఏడవకుండా ఉన్న వారి మూడ్లో ఎలాంటి మార్పూ లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సినిమా చూడకముందు ఎలాంటి ఆనందమైన మూడ్లో ఉన్నారో ఏడ్చినవారు అదే మూడ్కు చేరుకోగా, ఏడ్వని వారు మాత్రం తిరిగి ఆ స్థితికి రావడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఈ పరిశోధనను బట్టి ఏదైనా బాధ కలిగితే వెంటనే ఏడ్వడం ద్వారా తిరిగి మామూలు స్థితికి రావొచ్చని, లేకుంటే దాని ప్రభావం ఎక్కువ సేపు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
కన్నీళ్లు పెట్టిన కరుణ
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి విలపించారు. తన సోదరి ఇక లేదన్న సమాచారంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శోక సంద్రంలో మునిగిన ఆయన్ను పీఎంకే అధినేత రాందాసు, డీఎంకే వర్గాలు ఓదార్చే యత్నం చేశాయి. షణ్ముగ సుందరత్తమ్మాల్(99) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ముత్తు వేలర్, అంజుగత్తమ్మాల్ దంపతుల కుమారుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇద్దరు అక్కయ్యలు. పెద్ద అక్కయ్య పెరియ నాయకీ ఎప్పుడో కాలం చెందారు. రెండో అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాల్ అంటే, కరుణానిధికి ప్రాణం. ఆమె మాటను నేటికి కూడా ఆయన జవదాటరు. ఆమె అంటే, కరుణానిధికి గౌరవం, మర్యాద, ఆప్యాయత ప్రేమా అభిమానులు ఎక్కువే. కుటుంబ పెద్ద గా ఆమెను భావిస్తుంటారు. కరుణ కుటుం బంలో ఎదురైన అనేక సంక్లిష్ట పరిస్థితుల్ని ఆమె దారిలో పెట్టారని చెప్పవచ్చు. షణ్ముగ సుందరత్తమ్మాల్ పెద్దకుమారుడే కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత మురసోలి మారన్. అందుకే మేనల్లుడు మురసోలి మారన్ అంటే కరుణకు ఎంతో ఇష్టం. ఆయన బతికి ఉన్నంత కాలం కరుణ వెన్నంటి ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మురసోలి మారన్, మల్లికా మారన్ల పిల్లలే కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్. కరుణానిధి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన షణ్ముగత్తమ్మాల్ (99) కొంతకాలంగా వయోభారంతో బాధ పడుతున్నారు. గోపాల పురంలోని ఇంట్లో ఉంటూ వైద్య సేవలు పొందుతూ వచ్చారు. కన్నీళ్లు పెట్టిన కరుణ: బుధవారం ఉదయం పద కొండు గంటలకు షణ్ముగ సుందరత్తమ్మాల్ మరణించిన సమాచారం కరుణానిధిని శోక సంద్రంలో ముంచేసింది. వయో భారంతో బాధపడుతున్న అక్కయ్యను వా రంలో ఓ మారైనా కలిసి వెళ్లే కరుణానిధి , ఇక ఆమె లేరన్న సమచారంతో దిగ్భ్రాంతికి గురి అయ్యారు. పార్టీ కోశాధికారి, తనయుడు స్టాలిన్తో కలసి ఆమె ఇంటికి చేరుకుని భౌతిక కాయాన్ని చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆమె చేతుల్ని పట్టుకుని బోరున విలపించారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కరుణానిధి సైతం వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన్ను అక్కడి నుంచి మరో గదికి వెంటనే తీసుకెళ్లి పోయారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబీ కులు, ఆప్తుల సంద ర్శనార్థం గోపాల పురం ఇంట్లో ఉంచారు. సమాచారం అందుకున్న షణ్ముగ సుందరత్తమ్మాల్ చిన్న కుమారుడు మురసోలి సెల్వం, కోడలు సెల్వి, మనవళ్లు, మనవరాళ్లు, కుటుంబీకులు దయానిధి మారన్, కళానిధి మారన్, మూక్తా తమిళరసు, అమృతం, డిఎంకే నాయకులు దురై మురుగ న్, టీ ఆర్ బాలు, ఎ రాజ, విపీ దురై స్వామి, అన్భలగన్, శేఖర్ బాబు, ఎం సుబ్రమణియన్ తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు : షణ్ముగ సుందరత్తమ్మాల్ భౌతిక కాయానికి గురువారం అం త్యక్రియలు జరగనున్నాయి. గోపాల పురం ఇంటి నుంచి ఉదయం పది గంటలకు ఊరేగింపుగా భౌతిక కాయాన్ని బీసెంట్ నగర్ వ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కరుణానిధిని పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చే పనిలో పడ్డారు. పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటన ద్వారా తన సానుభూతి తెలియజేశారు. అక్కయ్య అంటే కరుణానిధి ఎంతో మర్యాద, ప్రేమ,ఆప్యాయతల్ని కల్గి ఉన్నారన్నారు. కష్టాల్లో కరుణానిధి వెన్నంటి ఆమె ఉన్నారని, ఆమె లేని లోటు ఆయనకు తీర్చలేనిదిగా పేర్కొన్నారు. -
బాలిక కళ్ల వెంట నీళ్లు కాదు... రాళ్లు వస్తున్నాయి!
చెన్నూర్ రూరల్ (ఆదిలాబాద్): బాధ, భావోద్వేగం, అమితానందం.. వీటిలో ఏ భావానికి లోనైనా... కళ్ల వెంట నీరు రావడం సర్వసాధారణం. కానీ, ఈ బాలిక కళ్ల నుంచి ఉన్నట్టుండి రాళ్లు బయటకు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్పల్లి గ్రామానికి స్వర్ణలత (8)కు గురువారం నుంచి రెండు కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 30 రాళ్లు బయటకు వచ్చాయని బాలిక తల్లిదండ్రులు నరిగె సమ్మయ్య-సమ్మక్క తెలిపారు. బాలికను సమీపంలోని అంగ్రాజ్పల్లి ప్రాథమిక ఆస్పత్రిలో చూపించగా... హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు. -
అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా
-
ఆనంద బాష్పాల అంతుచిక్కిందా?!
బాధాకరమైన సందర్భంలో, మనసుకు కష్టం కలిగినప్పుడే కాదు... అత్యంత ఆనందకరమైన సమయంలో కూడా వచ్చేది కన్నీరే. వీటినే మనం ఆనంద బాష్పాలుగా చెప్పుకొంటాం. సాధారణంగా పెళ్లిళ్లలో కూతురిని సాగనంపినప్పుడు, క్రీడాకారులు ఒక గొప్ప ఫీట్ను సాధించినప్పుడు, ఏ వ్యక్తి అయినా జీవిత సాఫల్యతను సాధించానని భావించినప్పుడు... కళ్లు వర్షిస్తాయి. మరి ఎందుకలా... అనే అంశం గురించి పరిశోధన నిర్వహించారు యేల్ విశ్వవిద్యాలయం వాళ్లు. అలా ఎందుకు జరుగుతుందనే అంశం గురించి కొంత వివరణ కూడా ఇచ్చారు... సంతోషకరమైన సమయాల్లో కన్నీరు పెట్టుకోవడం ఒకింత అసంకల్పిత ప్రతీకార చర్యగానే అభివర్ణించారు. భావోద్వేగ సమతుల్యత సాధించడానికే ఇలా కన్నీరు పెట్టుకోవడం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా కలిగే ఆనందాన్ని తట్టుకోలేని సమయంలో... ఇలా కన్నీరు పెట్టుకోవడం ద్వారా మనసు కొంత వరకూ తేలికపడుతుందని వివరించారు. ఆనందకరమైన సమయాల్లో కన్నీరు రావడం అంటే అది భావోద్వేగం తీవ్ర స్థాయికి చేరిందనడానికి నిదర్శనమని తెలిపారు. అంతే కాదు... మనిషి అసహాయ స్థితిలో, బాగా నిరాశ పడ్డ సమయంలో కూడా ఒక నవ్వు నవ్వుతాడు. దాన్ని వెర్రినవ్వుగా చెప్పుకొంటాం. సంతోషకరమైన స్థితిలో కన్నీరు రావడం, నిస్సహాయ స్థితిలో నవ్వడం.. ఈ రెండూ కూడా పరస్పర భిన్నమైన భావాలు, భావోద్వేగ సమతుల్యత కోసం మనసు అంతర్గత స్పందనకు ఇవి నిదర్శనాలు అని యేల్ పరిశోధకులు వివరించారు. -
శ్రీజను చూసి పవన్ కళ్యాణ్ కంటతడి!
-
శ్రీజను చూసి పవన్ కళ్యాణ్ కంటతడి!
ఖమ్మం: బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్నశ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించి పోయారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. తనను చూడాలని ఉన్న చిన్నారి శ్రీజ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చేందుకు ప్రయత్నించారు. పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పవన్ పిలిచినట్టు, అయితే బాలిక స్పందించకపోవడంతో ఆవేదనకు గురయ్యారరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైద్యం కోసం కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలను,శ్రీజ కోసం ఆట వస్తువులను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. -
భార్యకు క్షమాపణ చెప్పండి!
సుద్దాల అశోక్తేజ - అంతర్వీక్షణం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది! మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం? నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం? వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని. ఎలాంటి వారిని ఇష్టపడతారు? మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను. డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం? సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది. మీకు నచ్చిన పుస్తకాలు..! అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది. ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు? ... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను. మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ. మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు! మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి. తొలి పాట రాసినప్పటి అనుభూతి ... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం. తొలి సంపాదన! ... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన. అలాంటి మనసు నిండిన మరో సంఘటన? నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్లర్గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి? ...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే. అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం? ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు. ఎవరికైనా క్షమాపణ చెప్పారా? మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను. మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో? ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’. భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా? సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం. పాటల్లో ఉపయోగించే భావం... కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు? నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని. - వి.ఎం.ఆర్ -
కవి స్వేచ్ఛాజీవి
- సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆ కలానికి జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఆ సాహిత్యం.. ప్రజా సమస్యల ప్రతిబింబం. పదంపదంలో ఉద్యమపథం.. మాటమాటలో పోరాట కెరటం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తెలుగు పద ప్రయోగంలో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీకవి, సాహితీమూర్తి సుద్దాల అశోక్ తేజ. ఆయన రాసిన పాటల పూదోటలో ఎన్నో కుసుమాలు.. మరెన్నో కాంతి శిఖరాలు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న అశోక్ తేజ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. - విజయవాడ కల్చరల్ సాక్షి : కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం అందుకున్నందుకు అభినందనలు.. అశోక్ తేజ : థ్యాంక్స్.. సాక్షి : మీది సుదీర్ఘ సినీ ప్రస్థానం కదా.. ఇందులో మీరు నేర్చుకున్నదేమిటీ? అశోక్ తేజ : లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సాక్షి : ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. అవన్నీ స్వేచ్ఛగా రాసినవేనా.. అశోక్ తేజ : కవి ఎప్పుడూ స్వేఛ్చాజీవే. అతడిని శాసించేవారు ఏకాలంలోనూ ఉండరు. సాక్షి : ప్రజాకవిగా జనంకోసం బతికిన సుద్దాల హనుమంతు కుమారుడు మీరు. మీపై మీ తండ్రి ప్రభావం ఏమైనా ఉందా.. అశోక్ తేజ : నా మాట.. పాట.. అంతా మా నాయనగారే. నేను ఈస్థానంలో ఉండటానికి ఆయనే కారణం. అందుకే ఆయన పేరుతో ప్రారంభించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా కవులను సత్కరిస్తున్నా. సాక్షి : మీరు రాసిన ఏ పాటకైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశపడ్డారా.. అశోక్ తేజ : నాకు బాగా ఇష్టమైన పాటల్లో ‘ఒకటే మరణం ఒకటే జననం..’ అనే పాటకు వస్తుందని ఆశపడ్డా.. సాక్షి : సినీ రంగంలో ప్రతిభకు స్థానం ఉందా.. అశోక్ తేజ : తప్పకుండా ఉంటుంది. సినీ రంగంలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అరుునా నేను 20ఏళ్లు ఈ రంగంలోనే నిలబడ్డా. కాసింత అదృష్టం కూడా ఉండాలి. సాక్షి : మీ పాటల వెనుక ప్రోత్సాహం ఎవరు? అశోక్ తేజ : జనం ఉన్నారు. జనం కోసం బతికిన కవులున్నారు. నా పాట వెనున ఆవేదన ఉంది. అన్నింటికంటే నా తండ్రి ఉన్నారు. సాక్షి : సినీకవికి కావాల్సిన అర్హతలేమిటీ? అశోక్ తేజ : సాహిత్యం తెలిసి ఉండాలి. కాస్త సంగీత పరిజ్ఞానం కూడా అవసరం. సాక్షి : తెలుగు సినిమా పాటల్లోని ఆంగ్ల పదాల వల్ల భాష చనిపోతోందని భాషావేత్తల ఆవేదన. దీనికి మీ సమాధానమేంటి? అశోక్ తేజ : ఆంగ్ల పదాలు 20 శాతం ఉంటే ఫర్వాలేదు. అంతకుమించి ఉంటే ప్రమాదమే.. సాక్షి : ఒక పాట రాసిన తరువాత.. ఇది ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించిన సంఘటనలేమైనా ఉన్నాయూ.. అశోక్ తేజ : దాదాపు లేవు. ఒక పాట రాసిన తరువాత దాని గురించి నేను ఆలోచించను. సాక్షి : తెలంగాణ రాష్ర్ట సాధనకు కవులంతా ఏకమయ్యూరు. సీమాంధ్రలో ఆ స్ఫూర్తి లేకపోవ డానికి కారణం. అశోక్ తేజ : అది వారివారి ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు. అశోక్ తేజ : 800 సినిమాల్లో 2వేలకు పైగా పాటలు రాశాను. సాక్షి : జానపద కళలను కాపాడుకోవటమెలా.. అశోక్ తేజ : కేవలం వ్యక్తుల వల్లో.. కళాసంస్థల వల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వం కళా పీఠాలు స్థాపించాలి. వాటికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. దేశం మెత్తంమీద ఉన్న జానపద సంపదల వివరాలు తెలుసుకోవాలి. వాటిని ప్రదర్శించే వారికి ఉపాధి సౌకర్యాలు కలిపించాలి. సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగును ఎలా కాపాడుకోవాలి? అశోక్ తేజ : భాషను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భాషను కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజలకు రావాలి. -
నా గొప్పదనమేం లేదు.. తల్లికి సేవ చేశానంతే..
-
కన్నీళ్లు పెట్టుకున్న థాయ్లాండ్ ప్రధాని
థాయ్లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆమె మంగళవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంటును రద్దు చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘మనమంతా థాయ్ వాసులం. ఎందుకు ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటున్నాం? ఇప్పటికే నేను చాలా రాజీ పడ్డాను. ఇంకెంత దూరం నన్ను వెనక్కు వెళ్లమంటారు? థాయ్ నేలపై నేను అడుగుకూడా పెట్టకూడదని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆందోళనకారులను ఉద్ధేశించి పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. -
మేరిమాత కంటి నుంచి కారుతున్న రక్తం