tiruvuru
-
సొంత ఎమ్మెల్యేపై టీడీపీ సీరియస్..
-
బయట పడ్డ బెల్టు షాపులు.. బాబు పరువు బజారు పాలు
-
రైతుల్ని దూషించిన కొలికపూడి శ్రీనివాస్
ఎన్టీఆర్,సాక్షి: రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని తెలిపారు. రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై కృష్ణా జిల్లా చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు భగ్గుమన్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్లు పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తన రక్షణ కావాలని వేడుకున్నారు. -
తిరువూరు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం..
-
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు
-
తిరువూరు: కొలికపూడి అరాచకం.. కేసు నమోదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదైంది. నిన్న(మంగళవారం) జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై కేసు నమోదు చేసిన ఏ.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 60 మందికిపైగా పోలీసులు గుర్తించారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. -
కొలికపూడి కక్ష రాజకీయం పోలీసులను తోసేసి మరి...
-
పచ్చ మద్యం స్వాధీనం..
-
మంచి చేసిన జగన్ నే గెలిపించండి ఇంటింటి ప్రచారం
-
సంక్షేమం కొనసాగాలంటే..మళ్లీ జగనే రావాలి
-
మనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం జగన్ వల్లే దక్కింది: అడపా శేషు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని.. ఈ కాలంలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమిలో 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని మండిపడ్డారు. జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తిరువూరులో వైఎస్సారీసీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్ ,తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. కాపులకు అండగా ఉంటానని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 30 మందిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. కొలికపూడి శ్రీనివాస్పై అడపా శేషు ఫైర్.. ‘రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం. వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం వైఎస్ జగన్. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి .పథకాలు ఆగిపోతాయి. కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్. మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే. చిరంజీవి, పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు’ అని అడపా శేషు మండిపడ్డారు. -
కాలకేయులను తిరువూరు నుంచి తరిమికొట్టండి: కేశినేని
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్
గుంటూరు, సాక్షి: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామిదాస్ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్! -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
AP: నన్ను గొట్టంగాడన్నా భరించా: కేశినేని నాని
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ పొలిట్బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టంగాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపికపడుతున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గతంలోనూ తాను చాలా అవమానాలు పడ్డానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బుధవారం టీడీపీ సమన్వయ సమావేశంలో గొడవ తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ మీటింగ్ జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ వ్యక్తి మాటలపైనా పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు. నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా. నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను పార్టీ కార్యకమాలకు దూరంగా ఉంటున్నా. తిరువూరు టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ పూజకు పనికిరాని పువ్వు. గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా. కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం. అతనేమైనా పార్టీలో ఎంపీనా... ఎమ్మెల్యేనా. తిరువూరు ఇంఛార్జ్ పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది. కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా. రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా. రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు’అని నాని అన్నారు. స్పందించిన చిన్ని తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ఇవాళ జరిగిన తిరువూరు గొడవను అధిష్టానం చూసుకుంటుందని అన్నారాయన. ఇదీచదవండి..రణరంగంగా నాని వర్సెస్ చిన్ని -
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు : ఎమ్మెల్యే రక్షణనిధి
-
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో ఉద్రిక్తత..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ నేతల సవాళ్లకు ధీటుగా వైఎస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్కు ధీటుగా వైఎస్సార్సీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో, బోసుబొమ్మ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. తాడేపల్లి: తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘రూ.14వందల కోట్లతో చేసిన అభివృద్ధి వారికి కనపడదు. డయాలసిస్ సెంటర్లు నిర్మిస్తున్నాం. సీఎం సభకు వచ్చిన జనాన్ని చూశాక టీడీపీ పని అయిపోయిందని వారికి అర్థం అయింది. అందుకే మాపై సవాల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ఎంపి కేశినేని నాని ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ టీడీపీ లేదని ఆయనకి బాగా అర్థం అయింది. ఇవ్వాళ మా సెకండ్ క్యాడర్ వస్తేనే బోస్ సెంటర్ కిటకిటలాడింది. ఇక నేను కూడా వెళ్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. మాపై ప్రజలకు ఉన్న ప్రేమ అలాంటిది. పోలీసులు వారి పని వారు చేసుకుపోతారు. నేను నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటాను. మేము చేసిన అభివృద్ధి సాక్ష్యాధారాలతో సహా చూపించటానికి ఎప్పుడైనా సిద్దమే అని పేర్కొన్నారాయన. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీడీపీ నేతల పోటాపోటీ సవాళ్లు
-
అంతు చిక్కని వ్యాధిగ్రస్తులకు సీఎం భరోసా
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల వైద్యానికి సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గాదే సురేష్, గాయత్రి దంపతుల పెద్ద కుమార్తె వేదశ్రీ దుర్గ(12), చిన్న కుమార్తె సాహితీ శ్రీ ప్రియ(8) పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించగా కంజెనిటల్ మేస్తేనిక్ సిండ్రోమ్–4సీగా వైద్యులు తేల్చారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేమని, మందుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని చెప్పారు. పెయింటర్గా పనిచేస్తున్న సురేష్కు వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ద్వారా వారు తిరువూరులో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. తక్షణ సాయంగా కలెక్టర్ వారికి రూ.లక్ష చెక్కును అందజేశారు. చిన్నారి కోలుకునే వరకు అండగా.. బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్న తమ కుమారుడు మారిపోగు రంజిత్(13)ను ఆదుకోవాలని తిరువూరు మండలం కొమ్మారెడ్డి పల్లెకు చెందిన మారిపోగు శ్రీను, వెంకట్రావమ్మ దంపతులు తిరువూరులో సీఎం వైఎస్ జగన్కు మొరపెట్టుకున్నారు. రంజిత్ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. బాలుడి వైద్య ఖర్చులకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రూ.లక్ష చెక్కు తల్లిదండ్రులకు అందజేశారు. -
నా ధైర్యం మీరే.. నా నమ్మకం మీరే.. నన్ను నడిపించేది మీరే
తాడేపల్లి : దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా తన ధైర్యం, తన నమ్మకం ప్రజలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరువూరు సభలో మాట్లాడిన కొన్ని అంశాలను మరొకసారి ట్వీట్ చేశారు సీఎం జగన్. ‘దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే… నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే… నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా.. మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అని పేర్కొన్నారు. కాగా, ఈరోజు(ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. దుష్టచతుష్టయం చేస్తున్న కుతంత్రాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే…. నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే…. నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా, మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. pic.twitter.com/DCkwTvaSPG — YS Jagan Mohan Reddy (@ysjagan) March 19, 2023 ఇక్కడ చదవండి: ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్ -
ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్.. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్.. గత ప్రభుత్వంలో డీబీటీ.. దోచుకో, పంచుకో, తినుకో’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. ‘‘సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు కాదని.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని సీఎం చెప్పారు. 9.86 లక్షల మందికి మంచి చేసే కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపుగా 9.86 లక్షల మంది పిలల్లకు మంచి చేస్తూ... నేరుగా బటన్ నొక్కి 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా దాదాపు రూ.700 కోట్లు జమ చేస్తున్నాం. విద్యాదీవెన కార్యక్రమం గురించి నాలుగు మాటలు చెబుతాను.. భవిష్యత్తు బాగుండాలనే.... ఈ కార్యక్రమం వలన ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. చీకటి నుంచి వెలుగులోకి చదువుతోనే సాధ్యం... అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోనికి, ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే.. అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే.మనిషి తలరాతను కానీ, కుటుంబం తలరాతను కానీ, వెనుకబడిన కులాల తలరాతలు కానీ, దేశాల తలరాతలనైనా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఈ రోజు 17 నుంచి 20 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాలు పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బ్రతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్ధిశించేది ఒక్క చదువు మాత్రమే. కాబట్టి మన రాష్ట్రంలో ఇవాళ ఎల్కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఎదిగి మంచి డాక్టరో, ఇంజనీరో కావాలి. మన కళ్లెదుటే కనిపిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇవాళ కలెక్టర్గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా బ్రతుకులు మారాలి. చదువుకు పేదరికం అడ్డం రాకూడదని... మన జీవితాలు మారాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి తమ్ముడుకూ అన్నగా... ఆ చదువులుకు భరోసా ఇస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నాం. ఈ రోజు ఇలాంటి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ద్వారా చదువులు అందిస్తూ... పిల్లలను చేయిపట్టుకుని నడిపిస్తూ.. వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రెండింటి ద్వారా మంచి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మీ జగనన్న ప్రభుత్వం మాత్రమే. కాలేజీలు ఫీజులు ఎంతున్నా సరే, పిల్లలు ఎంతమంది చదివినా ఆ పూర్తి ఫీజులు బాధ్యత మీ జగన్ తీసుకుంటాడు. అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లల పూర్తి ఫీజు రీయింబర్స్ చేసే కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం –అరా కొరా ఫీజులు... గత ప్రభుత్వంలో మనందరికి గుర్తు ఉంటుంది. కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో చూశాం. ఫీజులు చూస్తే రూ.70, రూ.80వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు కూడా ఉంటే... ఇచ్చేదేమో అరకొరా ఇచ్చేవారు. ఆ రూ.35 వేలు కూడా ఎప్పుడిస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల పడుతున్న అవస్ధలు చూశాం. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. తల్లిదండ్రుల అవస్ధ మార్చాలనే... ఈ రెండింటిని మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం. ఫీజులు ఎంత ఉన్నా రూ.60వేలు, రూ.70, నుంచి రూ.1.20 లక్షల వరకు ఎంతైనా కానీ, ఎంతమంది పిల్లలు కుటుంబం నుంచి చదివినా, ఆ ఫీజులు కొరకు ఏ తల్లితండ్రీ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదని, అలా జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు మీ జగన్ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు. ప్రతి విద్యాసంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు, సమయానికి చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి మూడు నెలలకొకసారి అంటే ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ అయినవెంటనే దానికి సంబంధించిన ఫీజులు పూర్తిగా వాళ్ల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాల 9.86 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్లు జమ చేస్తున్నాం. 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా నూటికి నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ... జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండు సంవత్సరాలు 2017–18, 2018–19కు సంబంధించి తాను ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ఆ పెద్దమనిషి బకాయిలు పెట్టి పోతే మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ప్రశ్నించే హక్కు కోసం తల్లుల ఖాతాల్లో జమ... మరో విషయం కూడా చెప్పాలి. ఈ ఫీజులు మొత్తం కూడా నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం ఆ తల్లులకు కాలేజీలను ప్రశ్నించే హక్కు వారికి ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకొకసారి కాలేజీలకు వెళ్లి, తమ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్లే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీలో వసతులు లేకపోతే వాటిని కల్పించమని కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ మంచి కార్యక్రమానికి మార్పులు చేశాం. కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్ చేస్తే... నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారికి వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐటీఐ చదువుతున్న విద్యార్ధులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్ధులకు రూ.15వేలు, మెడిసిన్, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు రెండు దఫాలుగా జగనన్న వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి వసతి దీవెన రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఏఫ్రిల్ 11న ఇవ్వాలని నిర్ణయించాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని.... నా పిల్లలు బాగా చదవాలని, నా పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం.మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. ఈ విద్యాదీవెన, వసతి దీవెన కేవలం ఈ రెండు పథకాలకు 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఖర్చు చేసింది. చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ఈ రోజు ఈ రెండు పథకాల వల్ల ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యాకోర్సులను చదవడానికి ఎంచుకుంటే... 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య 1.20 లక్షల మందికి చేరింది. కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, పిల్లలకు ఉంది కాబట్టే. ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23కు వచ్చే సరికి ఈ సంఖ్య 22,387 కు తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు. ఇది కూడా సున్నా కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. 2018–19లో 37వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021–22 నాటికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఏకంగా 85వేలకు చేరింది. ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్ధుల సంఖ్య దేశంలో సగుటున 27శాతం అయితే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. ఈ రోజు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా( జీఈఆర్) అంటే 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు బడిబాట పట్టి కాలేజీలలో చదవాలని మాట్లాడుతారు. జీఈఆర్ రేషియో 2018–19లో దేశం సగటు 32.4శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకుని పోవాలని తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. మీ పిల్లల చదువుల బాధ్యత నాది.... ప్రతి అక్కకూ మంచి తమ్ముడుగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా ఒక మాట చెబుతున్నాను. మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని మాట ఇస్తున్నాను. అమ్మఒడితో మొదలుపెడితే గోరుముద్ద, విద్యాకానుక, నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషుతో బైలింగువల్ టెక్ట్స్బుక్స్, మారుతున్న స్కూళ్లు రూపురేఖలు, ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గది కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్తో డిజిటల్ క్లాసురూములు కాబోతున్నాయి. అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వతరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్ రూమ్లలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నాం. 8వతరగతిలో అడుగుపెట్టిన ప్రతి పిల్లాడికి కూడా నా పుట్టిన రోజునాడు ఆ పిల్లలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న తపనతో వారికి ట్యాబ్స్ ఇచ్చి పదోతరగతివరకు తీసుకునిపోయే కార్యక్రమం చేస్తున్నాం. రెండేళ్ల టైం ఇవ్వండి.... రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తాను. రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా చేస్తాను. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూం డిజిటలైజ్ అవ్వబోతుంది. ఒక్కసారి ప్రభుత్వ బడులు డిజిటలైజ్ అయిపోతే ప్రైవేటు వాళ్లు కూడా పోటీపడక తప్పదు. 8వతరగతి పిల్లలకు ప్రభుత్వ బడులలో ట్యాబులు ఇస్తున్నాం. రెండో సంవత్సరం కూడా ట్యాబులు ఇస్తే... ప్రయివేటు బడులు కూడా 8వతరగతి పిల్లాలకు ట్యాబులు ఇవ్వకతప్పని పరిస్థితుల్లోకి పోతారు. ఉన్నత విద్యలోనూ మార్పులు.... హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఇవాల అక్కడ కూడా చదువులు మారుస్తున్నాం. మూడేళ్ల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేసాం. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. డిగ్రీ చదువులు ఇంగ్లిషు మీడియంలోకి మార్చాం. కరిక్యులమ్తో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకొచ్చాం. జాబ్ ఓరియెంటెడ్గా కరిక్యులమ్ను మార్చుకుంటూ పోతున్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్ధలన్నీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేటట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. మారనున్న విద్యార్ధుల భవిష్యత్తు.. ఈ పథకాలతో మన విద్యార్ధుల భవిష్యత్తు, మన విద్యాసంస్థల రూపురేఖలు మారనున్నాయి. మనబడి నాడు నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. ఉన్నతవిద్యకు మరింత ఊతమిచ్చే అనేక చర్యలు తీసుకున్నాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలోనూ, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులోనూ, వైయస్సార్అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం. ఈ యేడాది పులివెందులలో అగ్రికల్చర్ కాలేజీను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా... అంతే కాకుండా వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా నాడు నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుపరిచే కార్యక్రమం కోసం అడుగులు వేస్తున్నాం. నిండు మనసుతో ఈరోజు నిండు మనస్సుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాం. ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతల పట్ల కానీ, అక్కచెల్లెమ్మల పట్లకానీ, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ ఒక కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం. గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత విధంగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఈ 45 నెలల పరిపాలనపై మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. గతాన్ని గుర్తుచేసుకొండి. గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల్లో మీ అన్న, మీ తమ్ముడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఈ 45 నెలల్లో ఎలాంటి వివక్షకు చోటు లేకుండా, లంచాలకు చోటు లేకుండా కేవలం బటన్ నొక్కి నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు జమ చేశాను. ఎక్కడా ఏ అక్కచెల్లెమ్మను అడిగినా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు అన్న మాట వినిపిస్తుంది. ఏ ఒక్క సిఫార్సుకు తావులేకుండా మా అన్న ఇచ్చాడు అన్న మాట వాళ్లో నోటిలో నుంచి వస్తోంది. ఈ 45 నెలలుగా ఇదీ మీ బిడ్డ పరిపాలన అని చెప్పడానికి గర్వపడుతున్నాను. దుష్టచతుష్టయంతో యుద్ధం... ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న మీ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి. దోచుకో, పంచుకో, తినుకో( డీపీటీ)ని నడిపిన ప్రతిపక్షంతో.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్( డిబీటీ) నడుపుతున్న మీ బిడ్డ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా ? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. తోడేళ్లు ఏకమవుతున్నాయి... ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు. వీరిని మరోసారి అడుగుతున్నాను. ఎన్నికల బరిలో మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175 కు 175 సీట్లలో ముఖాముఖి, ఒంటరిగా ఎదుర్కునే సత్తా వీరికుందా అని అడుగుతున్నాను. దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడు మీద, మీ మీద మాత్రమే. వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. వీళ్ల మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తులు మీద కాదు. నేను నమ్ముకున్నది ఆ దేవుడుని, మిమ్నల్నే. వీళ్లందరికీ ఛాలెంజ్ విసురుతున్నాను. ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా అదే కనిపిస్తుంది. భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది. బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా అదే ఏ సినిమాకు వెళ్లినా కూడా ఆ సినిమాలో హీరోనే నచ్చుతాడు కానీ, విలన్లు నచ్చరు. దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు బిడ్డపై ఎల్లప్పుడూ ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇళ్లూ కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనస్సుతో కోరుకుంటూ చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్ధిస్తున్నాను. చివరిగా... తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధిగారు కొన్ని అభివృద్ది కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి గురించి అఢిగారు. దానికోసం రూ.26 కోట్లు అవసరం కాగా.. దాన్ని మంజూరు చేస్తున్నాను. ఏ.కొండూరులో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి మంచి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయినా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలు మంచినీటి సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. అవి కూడా కేటాయిస్తున్నాను. దాదాపుగా 8వేలపై చిలుకు ఇంటి స్ధలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై ఇళ్లు వేగంగా కడుతున్నారు. మరో 6వేల ఇళ్లుకావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాను. పదివేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే దాదాపు రూ.250 కోట్లు. అదే విధంగా రోడ్ల రిపేరు కోసం రూ.10 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. రూ.4 కోట్లతో డ్రైనేజీ కోసం మంజూరు చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ అడిగారు. ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ, డ్రాపౌట్స్ కోసం ప్లంబర్లు, ఏసీ మెకానిక్స్ వంటి స్కిల్ ఎన్హేన్స్మెంట్ కోర్సులు) ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. రాబోయే రోజుల్లో స్కిల్ సెంటర్ ఇక్కడ వస్తుంది. వీటన్నింటి ద్వారా మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. చదవండి: రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు -
సీఎం జగన్ కు విద్యార్థులు, వారి తల్లుల ఘన స్వాగతం
-
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
Updates: ►జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. సీఎం జగన్ ప్రసంగం: ♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు ♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో.. ♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం ♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి ♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం ♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం ♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం ♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు ♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు ♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం ♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత ♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం ♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నాం ♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం ♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం ♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్ ♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే ♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం ♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే ♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి ♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు ♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు ♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే ♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు ♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు ♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం ♦గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు ♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు ♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం ♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం ♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం ♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం ♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది ♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్కు ఘన స్వాగతం ►కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ►తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ►జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్లోని హెలీప్యాడ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ►గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. -
నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. నేడు సీఎం వైఎస్ జగన్ తిరువూరు పర్యటన తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19న (ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సీఎం జగన్ పర్యటన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమచేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం జగన్ తిరువూరు పర్యటన నేపథ్యంలో.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారని ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెనను చేరువ చేశారని తెలిపారు. ‘గతంలో పేదలకు చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్. అందుకే విద్యకు పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. విద్యాదీవెన కార్యక్రమం రేపు తిరువూరులో సీఎం ప్రారంభిస్తారు. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలనేది సీఎం ఆలోచన. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉంది. రూ. 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. చంద్రబాబు విద్యారంగాన్ని విస్మరించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సీఎం జగన్ తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఏపీలోలాగా తమ రాష్ట్రాల్లోని స్కూల్స్ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి. - ప్రభుత్వ విప్, సామినేని ఉదయభాను చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్! -
సైకిల్ బ్రాండ్ పాలిట్రిక్స్.. టీడీపీలో రచ్చ రచ్చ..
సాక్షి, కృష్ణా జిల్లా: పచ్చ పార్టీలో ఆయనో సీనియర్ నేత. లోక్ సభ సభ్యుడు కూడా. కాని ఆయన నియోజకవర్గంలో తిరగడంలేదట. కాని తనకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తే మాత్రం ఏ స్థాయి నేతైనా అయినా సరే ఏకిపారేస్తున్నారట. తాజాగా ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదం పార్టీల్లో రచ్చ రచ్చ అవుతోంది. నాన్ స్టాప్ ట్రావెల్స్ విజయవాడ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్ళుగా పార్టీ అధినేత చంద్రబాబుతో దూరం మెయింటెన్ చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఆయన దూరం కావడానికి కారణమని అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. ప్రతీ సెగ్మెంట్లోనూ పార్టీ ఇంఛార్జిలు వర్సెస్ క్యాడర్ అనేలా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. ఒంటెద్దు పోకడతో పోయేవారు కొందరైతే... ఈసారి టిక్కెట్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పోటీ పడేవారు మరికొందరు. ఐతే ఇలాంటి పంచాయతీనే తిరువూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య చిచ్చు రాజేసింది. పైగా ఎంపీ కేశినేని నానికి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి నెట్టెం రఘురామ్కు మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది. పక్కలో బళ్లెం తిరువూరు నియోజకవర్గం టీడీపీకి శావల దేవదత్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి తిరువూరులోని సీనియర్ల పెత్తనానికి దేవదత్ చెక్ పెడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దేవదత్ వైఖరి నచ్చకపోయినప్పటికీ సీనియర్లు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే... అతని ఒంటెద్దు పోకడలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ సామాజిక మాధ్యమం ఐటీడీపీ కార్యకర్త ఒకరు దేవదత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేవదత్ ఎంపీ కేశినేని నాని వద్ద పంచాయతీ పెట్టారు. తన వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టేయడంతో కేశినేని నానికి.. దేవదత్ మీద పీకల వరకూ కోపం ఉందట. అందుకే దేవదత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తను తన కార్యాలయానికి పిలిపించి...దేవదత్ ఎదుటే అతన్ని సన్మానించారట కేశినేని. అంతటితో ఆగకుండా ఈసారి తిరువూరు టిక్కెట్ నీకు రాదు...ఇప్పటి వరకూ పార్టీ కోసం చేసిన ఖర్చుకి లెక్కలు చెబితే ఆ డబ్బు ఇచ్చేస్తానంటూ దేవదత్పై మండిపడ్డారట. ఊహించని ఈ పరిణామంతో దేవదత్ ఖంగుతిన్నారని సమాచారం. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ఈ పరిణామం తర్వాత తిరువూరులో దేవదత్ తో పొసగని కేశినేని నాని వర్గం అంతా ఏకమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జిగా దేవదత్ తమకొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వద్ద పంచాయతీ పెట్టారట. దీనిపై నెట్టెం ఇంట్లో మాట్లాడినదంతా తెల్లారేసరికి టీడీపీ అనుకూల పత్రికల్లో వచ్చేయడంతో ఆయన షాక్ తిన్నారట. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బయటికి లీక్ చేస్తే సహించబోనని.. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ నెట్టెం రఘురాం హెచ్చరించారట. ఇప్పటికే తన వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆక్రోశంలో ఉన్న కేశినేని నాని సడెన్ గా తెరపైకి వచ్చి.. నెట్టెం రఘురామ్ చేసిన ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. పైగా.. నిజంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ రుజువులతో సహా పంపిస్తాం.. చర్యలు తీసుకుంటారా మరి అంటూ సెటైర్లు వేశారు కేశినేని నాని. నాని ఫేస్ బుక్ పోస్టు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసిందని సమాచారం. బాబు తెచ్చిన బాధ అసలే పార్టీ అధినేతతో సరిగా పొసగని కేశినేని... ఇలా తనకు కోపం తెప్పిస్తే ఎవరినైనా సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తుండటంతో తెలుగు తమ్ముళ్ళు విసుక్కుంటున్నారట. పార్టీలో గొడవలుంటే సర్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నవారే ఇలా రచ్చకెక్కుతుంటే మా గతేంకానూ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పచ్చ పార్టీ కార్యకర్తలు. -
కలలు కల్లలు.. భార్యా, భర్తల బలవన్మరణం
తిరువూరు రూరల్ (ఎన్టీఆర్ జిల్లా): పని కోసం దుబాయ్ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ విషయం తెలిసి తట్టుకోలేక అతడి భార్య కూడా బలవన్మరణం చెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నిరాశ చెంది.. తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన గూడూరు నాగిరెడ్డి(38), స్వర్ణకుమారి(34) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగిరెడ్డి స్థానికంగా ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సరైన ఆదాయం లేకపోవడంతో నాగిరెడ్డి ఏదైనా పని కోసం దుబాయ్ వెళ్లాలనే ప్రయత్నంలో వీసా కోసం దరఖాస్తు చే శాడు. పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ సాంకేతిక కారణాలతో వీసా పొందలేకపోయాడు. సమయం, డబ్బు వృథా కావడంతో పాటు ఇక తాను విదేశాలకు వెళ్లే అవకాశం లేదని ఆందోళనకు గురైన నాగిరెడ్డి బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..) భర్త మృతిని తట్టుకోలేక.. గురువారం తెల్లవారుజామున తర్వాత భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య స్వర్ణకుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. అంత్యక్రియలు పూర్తి కాకముందే ఆమె కూడా పురుగుమందు తాగింది. అపస్మారక స్థితికి చేరిన స్వర్ణకుమారిని గుంటూరు తరలించగా, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 38 గంటల్లో ఛేదించారు. కేసు వివరాలను డీఎస్పీ బి.శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన మొబైల్ షాప్ యజమాని భార్యను కత్తితో బెదిరించి బ్యాగులో ఉన్న రూ.57 వేల నగదుతో ఉడాయించిన నిందితులను తిరువూరు బస్టాండ్ సెంటర్లో అరెస్ట్ చేశామని తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని ముంబై, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తునట్లు డీఎస్పీ వెల్లడించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిరువూరు(కృష్ణా) : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భూక్యా స్వప్న (17) బుధవారం ఉదయం కళాశాల హాస్టలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంపలగూడెం మండలం వినగడపకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా వాల్యా కుమార్తె స్వప్న ఉదయం తోటి విద్యార్థినులు స్టడీ అవర్కు వెళ్తుండగా తనకు అనారోగ్యంగా ఉందని హాస్టల్లోనే ఉంది. అయితే, స్వప్న గది తలుపులు తీయకపోవడంతో హాస్టలు వార్డెను, వాచ్మెన్ కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కొందరు యువకుల సహకారంతో స్వప్న మృతదేహాన్ని కిందకు దింపిన వార్డెన్ కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. తమ కుమార్తె మరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హాస్టలుపై దాడి చేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. విద్యార్థిని స్వప్న మృతదేహం విద్యార్థి సంఘాలు సైతం స్వప్న మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హాస్టలు ఎదుట ధర్నా చేశారు. మైలవరం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి కళాశాల యాజమాన్యంతో, విద్యార్థి సంఘాలతో, మృతురాలి తల్లిదండ్రులతో చర్చించారు. స్వప్నను ఓ అధ్యాపకుడు కళాశాల తరగతి గదిలో మందలించిన కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల ఎదుట ఆరోపించారు. అయితే, పోలీసు స్టేషన్లో కళాశాల యాజమాన్యానికి, విద్యార్థిని తల్లిదండ్రులకు రాజీ కుదిర్చిన పోలీసులు.. స్వప్న కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్–1 ఎస్ఐ సుబ్రహ్మణ్యం, గంపలగూడెం ఎస్ఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..
మానవత్వం మంటగలిసింది... బంధాలు బరి తెగిస్తున్నాయి.. స్నేహాలు చెడుమార్గంలో నడుస్తున్నాయి.. సంబంధాలు అవసరాలకు పరిమితమవుతున్నాయి.. క్షణక్షణం అనుమానంతోనే స్నేహం.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పాకులాట.. అంతిమంగా ప్రాణం తీసేందుకు వెనకాడని తత్వం.. అందులోనూ ఓ మహిళ కక్ష కట్టింది.. నమ్మకంగా స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లింది.. కసితీర కత్తితో నరికి దారుణంగా హత్య చేసింది. ఘటన తంగిళ్లబీడులో గురువారం సంచలనం రేపింది. సాక్షి, తిరువూరు(కృష్ణా) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్నేహితురాలు అతిదారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాలు.. విజయవాడ పోరంకికి చెందిన అవనిగడ్డ గణేష్ (46) గతలో ఆగిరిపల్లి మండలంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశాడు. అప్పట్లో తిరువూరు సమీపంలోని తంగిళ్లబీడుకు చెందిన రేణుకతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే ఇటీవలే గణేష్కు బదిలీ కావడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరగా సంబంధం కొనసాగుతోంది. అయితే జనవరి నుంచి రేణుకకు డబ్బులు ఇవ్వడం లేదని సమాచారం. దీనికితోడు అనారోగ్యంతో గణేష్ మెడికల్ లీవ్లో ఉన్నాడు. పథకం ప్రకారమే హత్య ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వని గణేష్ మీద రేణుక కక్షపెంచుకుంది. తరుచూ ఫోన్లో డబ్బులు ఇవ్వాలని కోరుతోంది. అయితే జనవరి నుంచి డబ్బులు సర్దుబాటు చేయకపోగా గణేష్ కనిపించకుండా తిరుతున్నాడు. ఫోన్లో సంప్రందించినా పట్టించుకోవడం లేదని రేణుక భావించింది. దీంతో తోటి వారి సాయం తీసుకుంది. విస్సన్నపేట నుంచి ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకుని విజయవాడ పోరంకి వెళ్లింది. గణేష్ను మాయమాటలు చెప్పి తీసుకురావాలని వారికి పని అప్పగించింది. అందరు కలసి పథకం ప్రకారం ఇంటికి వెళ్లి కారులో గణేష్ను ఎక్కించుకున్నారు. తరువాత కారును నేరుగా తిరువూరు తంగిళ్లబీడులోని తన ఇంటికి తీసుకెళ్లింది. విస్సన్నపేట నుంచి తీసుకొచ్చుకున్న కిరాయి వ్యక్తులతో కలసి గణేష్ను కత్తితో నరికి చంపేశారు. నిందితులు పరయ్యారు. విస్సన్నపేటకు చెందిన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ రేణుక పలు హత్యానేరాల్లో నిందితురాలు. ఆమె భర్తను కూడా హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉంది. ఆమెపై తిరువూరు పోలీసుస్టేషన్ రౌడీషీటు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..
సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్ 2, ఏ కొండూరు ఎస్ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్కుమార్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలో రైతేరాజు: కొక్కిలిగడ్డ
-
డిపాజిట్ దక్కితేనే గౌరవం..!
సాక్షి, మచిలీపట్నం : ఒక్క ఓటు తక్కువైనా పర్లేదు.. డిపాజిట్ మాత్రం వచ్చేటట్టు చూస్కో.. అన్నట్లుంది బరిలోకి దిగే అభ్యర్థుల పరిస్థితి. సార్వత్నిక ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు ఇరు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండిపెండెంట్, ఇతర పార్టీల నుంచి అధిక మంది బరిలోకి దిగారు. ఈ సారి పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండటంతో.. అంతగా ప్రజాదరణ లేని పార్టీల తరపున, ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసిన వారు ఓట్లు రాబట్టుకుని ఎలాగైనా డిపాజిట్ మొత్తం వెనక్కు తీసుకునే ప్రయత్నాలు సైతం చేస్తుండగా.. మరి కొందరు తాము పోటీ చేశామన్న ప్రఖ్యాతి గడించేందుకు ఉర్రూతలు ఊగుతున్నారు. మరికొంత మంది తమకు డిపాజిట్లు దక్కకపోతే ప్రజల్లో శృంగభంగం తప్పదన్న భావనలో ఉన్నారు. బరిలో 232 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీకు 205 మంది పోటీలో నిలిచారు. పార్లమెంట్కు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ మాత్రమే అభ్యర్థి కేవలం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించారు. అయితే పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందితేనే డిపాజిట్లు ఇస్తారు. లేకపోతే ఆ డబ్బులన్నీ ఖజానాలోకి చేరుతాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరం పోలైన ఓట్లలో డిపాజిట్లు పొందిన వారికి మాత్రమే తిరిగి వస్తుంది. దీంతో గౌరవప్రదంగా డిపాజిట్ దక్కించుకునేలా ఓట్లు పొందాలని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అసెంబ్లీకు, పార్లమెంట్కు సగం డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవార్గల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా డిపాజిట్ నగదు వెనక్కు వస్తుంది. రూ.26.95 లక్షల డిపాజిట్ త్వరలో జరగబోయే ఎన్నికలకు డిపాజిట్ నగదు పారింది. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది బరిలో ఉండగా.. వారి ద్వారా రూ.6.75 లక్షలు, 16 శాసనసభ స్థానాలుండగా.. అందులో 3 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. 13 నియోజకవర్గాల పరిధిలో 172 మంది బరిలో ఉండగా..రూ.17.20 లక్షలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో 33 మంది అంటే.. రూ.1.65 లక్షలు సెక్యురిటీ డిపాజిట్గా ఎన్నికల అధికారులు సేకరించారు. -
హెరిటేజ్ కోసం సర్వం దోచుకున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తిరువూరు: చంద్రబాబు నాయుడి పాలనలో పేదవాడికి ఏది కావాలన్న జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు రేషన్ తీసుకోవాలన్నా, బాత్రూమ్ నిర్మించుకోవాలన్నా ప్రభుత్వానికి లంచం చెల్లించాల్సిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వంలో ఉందని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని, రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు తప్ప మరేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ఇరవై రోజులే ఉన్నందున అనేక అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబు సిద్ధమైయ్యారని, ఆయనతో యుద్ధం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నేతలు మూటల కొద్ది డబ్బులు పంచుతున్నారని, మూడువేల తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికీ అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా తిరువూరు ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. సభలో ఆయన మాట్లాడుతూ..‘‘నియోజకవర్గానికి నాగార్జునసాగర్ పక్కనే ఉన్నా సాగునీరు అందక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతన్నారు. ప్రజలకు తాగునీరు కూడా దొరకడంలేదు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. గతంలో ఇదే సమస్య ఉన్నప్పుడు నూటిపాడు వద్ద దివంగత వైఎస్సార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇదే ప్రాంతంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కూడా నిర్మించారు. ఈ ప్రభుత్వం వాటి ద్వారా అయినా కనీసం రైతులను ఆదుకోవడంలేదు. కిృష్ణా జలాలను రైతులకు అందిస్తామని ఎన్నికల ముందు శిలాఫలకాలు వేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత పాలకులు మనకు అవసరమా?. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుకు ప్రజల కష్టాలు గుర్తుకురావు. ఈ ప్రాంతంలో లక్షఎకరాలకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. రైతులు కనీసం మద్దతు ధర కూడా లభించట్లేదు. తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం దళారీలకు నాయకుడిగా చంద్రబాబు మారి రైతులను దోచుకుంటున్నారు. 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రంలో ప్రజల కష్టాలను చూశాను. వారందరికీ హామీ ఇస్తున్నా నేను ఉన్నాను. ప్రతి ఒక్కరి నుంచి చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు అనే మాటలే విన్న. ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు. ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా లేదు. 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం భర్తీ చేయదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు. బాబు పోతేనే జాబు వస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తాం. ఇంజనీరింగ్ చదువుకు లక్షల రూపాయలు ఖర్చుఅవుతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను ఉచితంగా చదివిస్తానని హామీ ఇస్తున్నా. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగుల చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు వచ్చినా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ విధానానికి చెక్ పెడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విధంగా చట్టం చేస్తాం. ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ను ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న పదిమందికి అక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ పథకాలకు లంచాలు ఇచ్చే దుర్మర్గాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఏ అప్లికేషన్ పెట్టుకున్నా 72 గంటల్లో అమలు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నవరత్నాలు ద్వారా పేదల బతుకుల్లో మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.’’ అని వ్యాఖ్యానించారు. -
గ్లాసు వదిలి.. ఏనుగెక్కారు!
సాక్షి, తిరువూరు : జనసేన–బీఎస్పీ పొత్తు నేపథ్యంలో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సీటును బీఎస్పీకి కేటాయించడంతో జనసేన తరపున పోటీ చేయాలని ప్రచారసామగ్రి సన్నద్ధం చేసుకున్న అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు రాత్రికి రాత్రి పార్టీ మారిపోయారు. తాను సిద్ధం చేసిన ప్రచార వాహనాలపై గ్లాసు గుర్తు స్థానంలో ఏనుగు గుర్తు ఉంచి పోటీకి సిద్ధమయ్యారు. బీఎస్పీ కార్యాలయం నుంచి బీఫారం తెచ్చుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు నంబూరి ఐదు పార్టీలు మారారు. తొలుత 2009లో ప్రజారాజ్యం టికెట్ ఆశించిన ఆయన చివరిక్షణంలో అధిష్టానం మొండిచేయి చూపడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టరుగా కొద్దికాలం పనిచేశారు. తదుపరి తెలుగుదేశంలో చేరిన ఆయన పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించడంతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తిరువూరు సీటును బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో జనసేన కోల్పోవడంతో బహుజన సమాజ్ పార్టీలో చేరి టికెట్ పొందారు. -
రాజకీయాల్లో హుషారు..తిరువూరు
సాక్షి, తిరువూరు : జిల్లాకు వాయువ్యంలో కొలువై ఉంది తిరువూరు నియోజకవర్గం. నాలుగు మండలాలు, 71 పంచాయతీలతో ఉన్న ఈ ప్రాంతం పశ్చిమ కృష్ణాలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల చెంతన ఉంది.నియోజకవర్గానికి మూడువైపులా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు, మధిర, కల్లూరు మండలాలున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి పారే కట్లేరు, పడమటివాగు, తమ్మిలేరు, గుర్రపువాగు, వెదుళ్ళవాగులు ఈ నియోజకవర్గంలో ప్రవహించి మున్నేరులో కలుస్తున్నాయి. నియోజకవర్గంలో 360 సాగునీటి చెరువులు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచక నిరుపయోగంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా కంటే తెలంగాణా ప్రాంతంతోనే ఈ నియోజకవర్గ వాసులకు ఎక్కువ అనుబంధం ఉంది. తిరువూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు అప్పట్లో కలిసి ఉండగా, 1955లో పునర్విభజన చేశారు. 1967లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేశారు. ఇదీ నియోజకవర్గ చరిత్ర 2014లో తిరువూరు నియోజకవర్గాన్ని మూడోసారి పునర్విభజన చేశారు. ప్రస్తుతం చాట్రాయి మండలాన్ని నూజివీడు నియోజకవర్గంలో చేర్చగా, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఏకొండూరు మండలాన్ని పూర్తిగా తిరువూరులో విలీనం చేశారు. తిరువూరులో రెండుసార్లు గెలిచిన కోనేరు రంగారావు కంకిపాడులో ఒకసారి గెలిచారు. గెలిచిన మూడుసార్లు ఆయన మంత్రివర్గంలో పదవి పొందటం ఆయన ప్రత్యేకత. కోట్ల క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నిర్వహించారు.ఇక స్వామిదాస్, కోట రామయ్య, పేట బాపయ్య రెండు సార్లు గెలుపొందారు. విజయవాడ లోక్ సభ పరిధిలో తిరువూరు కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్లు పట్టం కట్టారు. తండ్రీ కొడుకుల పోటీ! 1952లో తండ్రి–కొడుకులు పరస్పరం పోటీపడగా కొడుకు పేట రామారావు విజయం సాధించారు. తిరిగి 1955లో తండ్రి పేట బాపయ్య కుమారుడిని ఓడించారు. కుమారుడు సీపీఐ పక్షాన, తండ్రి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. పాడి పరిశ్రమతో ఉపాధి మెట్ట ప్రాంతమైన తిరువూరుతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో పాడిపరిశ్రమాభివృద్ధికి లక్ష్మీపురం పాలశీతల కేంద్రం విశేష కృషి చేస్తోంది. కృష్ణా మిల్క్ యూనియన్ సహకారంతో రైతులకు పాడిపశువుల సంరక్షణలో శిక్షణ ఇవ్వడం, పాలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ బోనస్ కూడా చెల్లిస్తున్నారు. దీంతో 50 గ్రామాల్లో పలు కుటుంబాలు పాడి పరిశ్రమనే జీవనాధారం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. విద్యారంగంలో వెనుకబాటు ఉన్నత విద్యాభివృద్ధికి గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు పలు ప్రణాళికలు వేసినప్పటికీ అమలుకు నోచలేదు. ప్రైవేటు రంగంలో తిరువూరులో ఇంజనీరింగ్ కళాశాల, విస్సన్నపేటలో పీజీ కళాశాల మినహా ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు కాలేదు. తిరువూరులో మహిళా తదితర కళాశాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సెంటిమెంటు తిరగబడింది! తిరువూరు నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచీ ఎప్పుడూ అధికారపక్షం అభ్యర్థి గెలుపొందడమే సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ పండితుల విశ్వాసం. 2014లో ఈ సెంటిమెంటు కాస్త తిరగబడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రక్షణనిధి ఇక్కడ గెలుపొందినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ హయాంలోనే అభివృద్ది పలువురు ప్రముఖులు తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనే ఈ నియోజకవర్గంలో పలు శాశ్వత ప్రాజెక్టులకు బీజం పడింది. సాగు, తాగునీటి వెతలు తీర్చడానికి ఎత్తిపోతల పథకాలను వైఎస్ ప్రారంభించారు. నాగార్జునసాగర్ నీటిపై ఆధారపడిన నూతిపాడు, మాధవరం, తెల్లదేవరపల్లి, ఎత్తిపోతల పథకాలు రాష్ట్ర విభజన తర్వాత నిరుపయోగంగా మారాయి. మొత్తం జనాభా : 2,58,000 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 234 మొత్తం ఓటర్లు : 2,05,000 పురుషులు: 99,802 స్త్రీలు : 1,05,191 ఇతరులు : 7 అత్యధిక మెజారిటీ : కోనేరు రంగారావు : 17,300 (2004) -
పేదల పాలిట సంజీవని.. ఆరోగ్యశ్రీ
సాక్షి, గంపలగూడెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ లేకుంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే స్థాయి పేద, మధ్య తరగతి కుటుంబాలకు లేదు. ఆ పరిస్థితిలో పెద్ద రోగం వస్తే దేవుని మీద భారం వేసి స్థానికంగా ఉండే వైద్య సేవల్ని మాత్రమే పొందుతూ ఉండే వారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక ఎంతో ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు ఉచితంగా పొందామంటూ ప్రజలు మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైఎస్ మరణానంతరం ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం తిరిగి పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందరికో ప్రాణదానం చేసింది.. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది. పేదలకు సంజీవని లాంటిది. ఆరోగ్యశ్రీకి ముందు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడేవారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చింది. – కోట దాసు, మాజీ ఎంపీపీ, గంపలగూడెం పథకాన్ని టీడీపీ నీరుగార్చింది.. పేదలకు వరంలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుంది. ఈ పథకం ద్వారా అవసర సమయాల్లో నిరుపేదలు సైతం లక్షలాది రూపాయల వైద్య సేవల్ని పొందగలిగారు. ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. –చెరుకు నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కనుమూరు ఉచితంగా పెద్ద ఆపరేషన్లు.. ఆరోగ్యశ్రీ పథకంతో అవసరమైన రోగులకు పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహించటంతో ప్రాణదానం అయ్యింది. ఈ పథకమే లేకుంటే ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవి. వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తానని జగన్ ప్రకటించడం పేదలకు మరింత మేలు చేసే విధంగా ఉంది. – బొల్లా కరుణాకరరావు, కొణిజెర్ల -
కృష్ణా జిల్లాలో దారుణం; బాలుడిపై అత్యాచారం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరువూరు నగర పంచాయతీలోని భగత్సింగ్లో నగర్లో బాలుడిపై అత్యాచారం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు కేకలు వేయడంతో యువకులు పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలడ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరువూరు టీడీపీలో తగువు
-
ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
చెన్నై: తమిళనాడు, తిరుపూర్లో అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశ్ వాసులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో జరుగుతున్న పలు నేరాలలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరస్థులు తరచుగా పట్టుబడుతున్నారు. దీంతో సరైన ఆధారాలు లేకుండా నివసిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపూరులో పని చేస్తున్న బనియన్ల కంపెనీలలో వేల సంఖ్యలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. తిరుపూర్ రామ్నగర్లో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఐదుగురు బస చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్బాబు (27), మహ్మద్ మమున్ (22), రసూన్మల్ సర్ధార్ (22), మహ్మద్ సహాదత్ (28), ఆసిక్ (20)గా గుర్తించారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
తిరువూరులో ఏసీటీవో పద్మ కలకలం
-
ఏసీటీవో పద్మ హల్చల్
విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో ఏసీటీవో పద్మ హల్చల్ చేశారు. ఓ సిమెంట్ షాప్ వద్ద తనిఖీలు చేయాలంటూ హంగామా సృష్టించారు. సిమెంట్ షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మ వారిపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్కు తరలించారు. అయితే గత కొంతకాలంగా పద్మ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్ తొక్కి ఆంధ్రా ఉద్యోగుల్లో పద్మ స్పూర్తి నింపిన విషయం తెలిసిందే. -
ఏసీటీవో పద్మ హల్చల్
-
నోట్ల రద్దు నిర్ణయం విప్లవాత్మకం
తిరువూరు : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్ సమర్థించుకున్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శనివారం యువమోర్చా కార్యకర్తల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం విచారకరమన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు, ఏటీఎంలకు చాలినన్ని కరెన్సీ వచ్చినందున ఇకపై ప్రజలు బారులు తీరి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను బీజేవైఎం కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దారా మాధవరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాచలం, ప్రకాశరావు పాల్గొన్నారు. -
న్యాయవాదుల నిరసన
తిరువూరు: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిపై సోమవారం సాయంత్రం జరిగిన దాడి సంఘటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. కక్షిదారుతో కోర్టు ఆవరణలో మాట్లాడుతున్న తనపై ప్రతివాది బడుగు భాస్కరరావు దాడిచేశారని న్యాయవాది వాకదాని లక్ష్మీనారాయణ జడ్జికి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ళ మోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళనలో న్యాయవాదులు సంకురాత్రి జనార్థనరావు, మాకరాజు రాంమోహనరాజు, అత్తునూరు ప్రభాకరరెడ్డి, మేకల నాగేంద్రప్రసాద్, మోదుగుమూడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, సీత, శ్రీనివాసరావు, మురహరి పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
తిరువూరు : స్థానిక గణేశ్ సెంటర్లోని ఒక షోరూం వద్ద బోర్డు ఏర్పాటు కోసం గురువారం కొలతలు తీస్తున్న వెల్డింగ్ పని చేసే కార్మికుడు విద్యుత్ షాక్కు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.... బైపాస్ రోడ్డులో ఫౌండ్రీ పనులు చేసే సుతారి రామబ్రహ్మాచారి(35) ఒక షోరూం బోర్డు ఏర్పాటుకు కొలతలు తీసేందుకు వచ్చాడు. ఆ షోరూం భవనాన్ని ఆనుకుని హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి. అతను బోర్డు ఏర్పాటు కోసం కొలతలు తీసే క్రమంలో హైటెన్షన్ విద్యు™Œ వైరు చేతికి తగిలి కింద పడిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రామబ్రహ్మాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే పరామర్శ రామబ్రహ్మాచారి భౌతికకాయం వద్ద ఎమ్మెల్యే రక్షణనిధి, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామబ్రహ్మాచారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, ఏరువ ప్రకాష్రెడ్డి, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి తదితరులు కూడా రామబ్రహ్మాచారి మృతదేహానికి ఏరియా ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. -
ఒకరికోసం ఇంకొకరు..
భర్తకు ప్రాణహాని భయంతో భార్య ఆత్మహత్య భార్య మృతితో మనస్తాపం చెంది భర్త బలవన్మరణం మృత్యువుతో పోరాడుతున్న కుమార్తె తిరువూరు : రోజువారీ కూలీ పనులు చేసుకుని ఉన్నంతలో సంతృప్తికరమైన జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో ఒక కోయదొర సృష్టించిన అలజడి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారం రోజుల క్రితం ‘నీ భర్తకు ప్రాణగండం ఉందని, పూజలు చేస్తే గండం నుంచి బయట పడతాడని’ కాకర్లకు చెందిన గజ్జెల్లి ఏడుకొండలు (వెంకటేశ్వరరావు) భార్య నాగమణికి ఒక కోయదొర జోస్యం చెప్పాడు. అతని మాటలు నమ్మిన నాగమణి తన భర్త ప్రాణరక్షణ కోసం రెండు బంగారు ఉంగరాలను ఇవ్వగా కోయదొర ఒక తాయెత్తు ఇచ్చి ఏడుకొండలుకు కట్టమని ఇచ్చి వెళ్లిపోయాడు. భర్తకు ఎటువంటి హాని జరుగుతుందోననే ఆందోళనతో ఐదు రోజుల క్రితం నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతితో మనస్తాపానికి గురైన ఏడుకొండలు తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాము లేకుంటే పిల్లలు అనాథలుగా మిగులుతారనే ఉద్దేశంతో వారికీ విషమిచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. ఏడుకొండలు రాజమండ్రిలో ఒక బేకరీలో పనిచేస్తుండగా, భార్య నాగమణి కూలీపని చేసి కుటుంబ పోషణలో సహకరిస్తోంది. అస్తికలు కలిపి తిరిగి వస్తూ.. భార్య అస్తికలను బుధవారం తన కుమార్తె నవ్య, కుమారుడు పృథ్వి, మరో బంధువుతో కలిసి విజయవాడలోని కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పిల్లలిద్దరికీ మంచినీటిలో పురుగుమందు కలిపి ఇచ్చేందుకు ఏడుకొండలు నిర్ణయించుకున్నాడు. గ్రామానికి చేరుకున్న అనంతరం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తనతో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేలోపు మంచినీరు అడిగింది. దీంతో పురుగుమందు కలిపిన మంచినీటిని ఆమెకు ఇచ్చి తానూ తాగాడు. తండ్రి ఇచ్చిన నీటిని తాగిన నవ్య ఇంటికి చేరుకుని కుప్పకూలగా, ఏడుకొండలు అస్వస్థతకు గురయ్యాడు. ఇరువురినీ తిరువూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఏడుకొండలు మృతిచెందాడు. నవ్య మృత్యువుతో పోరాడుతోంది. పాపం పసివాడు ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, మృత్యువుతో పోరాడుతున్న సోదరి గురించి తెలియని చిన్నారి పృథ్వి బంధువుల ఇంట ఆడుకుంటుండడం చూపరులను కంట తడిపెట్టిస్తోంది. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే బంధువర్గం పృథ్వీని అక్కున చేర్చుకుంది. -
'చంద్రబాబుకు గుణపాఠం తప్పదు'
- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తిరువూరు (కృష్ణా జిల్లా) : అప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆటలు ఇక సాగవని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కృష్ణాజిల్లా తిరువూరు వెళ్లిన ఆయన డీసీసీ కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు సంతాప సభలో పాల్గొన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పార్టీయే ముఖ్యమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కార్యకర్తల్ని అక్రమ సంపాదనతో బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా తమదే అధికారమని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నిరంకుశ విధానాలు అనుసరిస్తే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రభుత్వం అథఃపాతాళానికి వెళ్లడం ఖాయమని, ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాస్వామిక విలువలకు పాతరేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ, విజయవాడ పార్లమెటరీ నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ అవినాష్, తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ రాజీవ్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తిరువూరు (కృష్ణా జిల్లా) : పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుత్షాక్కు గురై మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపాడులో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గానుగపాడు గ్రామానికి చెందిన షేక్ బడే సాహెబ్(56) గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద మోటర్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అభివృద్ధికి దారులు
జిల్లాలో రెండు రహదారులకు డీపీఆర్ ప్రతిపాదనలు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు ఒకటి తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రకాశం వరకు మరొకటి కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ : జిల్లాలో రెండు భారీ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తీరప్రాంతం వెంట కూడా జాతీయ రహదారి నిర్మిస్తే సరకు రవాణాకు ఉపయుక్తంగా ఉంటుందనే యోచనతో కోస్తా కారిడార్ వెంబడి మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. కేంద్ర భూఉపరితల రవాణ శాఖ పరిధిలో ఉండే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ వీటి బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. కొన్ని నెలల క్రితమే రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మాత్రమే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ఫోర్ట్ అండ్ హైవేస్ కార్యాలయాలున్నాయి. మచిలీపట్నంలో ఈ కార్యాలయం ఉంది. గతంలో ఆర్ అండ్ బి జాతీయ రహదారుల విభాగం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని, వారి పరిధిలో ఉన్న కొన్ని జాతీయ రహదారుల్ని ఈ సంస్థ స్వీకరించింది. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు 70 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీని కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఖరారు కాగానే పనులను కేటాయించనున్నారు. ఇది జగదల్పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 390 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. 390 కిలోమీటర్ల రహదారి కావడంతో నిర్మాణానికి వందల కోట్లు ఖర్చవుతుంది. అధికారులు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో మొదలయ్యే రహదారి కాకినాడ, అమలాపురం, యానాం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోని దిగుమర్రు, కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, కృత్తివెన్ను, మచిలీపట్నం, బంటుమిల్లి, చల్లపల్లి, పెనుమూడి వారధి వరకు.. గుంటూరు జిల్లా రేపల్లె మీదుగా ప్రకాశం జిల్లా వరకు కోస్తా కారిడార్కు అనుసంధానంగా రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. -
ముక్కిపోయిన రేషన్ బియ్యం
తిరువూరు : తిరువూరు రాజుపేటలోని ఒక రైస్మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌరసరఫరాల అధికారులు తదుపరి వాటి గురించి పట్టించుకోకపోవడంతో ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. 2012 జనవరిలో తిరువూరు ఎంఎల్ఎస్ పాయింటుకు చేరాల్సిన రేషన్బియ్యం బస్తాల లోడును నల్లబజారుకు తరలించడంలో భాగంగా రాజుపేట మిల్లులో నిల్వచేశారు. రేషన్బియ్యంతోపాటు స్వాధీనం చేసుకున్న మిల్లులో అనధికారికంగా ఉంచిన సాంబమసూరి బియ్యం మాత్రం పౌరసరఫరాల అధికారులు వేలం వేసి పాడుకున్న వ్యక్తికి అప్పగించారు. రేషన్బియ్యాన్ని కనీసం ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించకపోవడం, గత ఏడాదిన్నర కాలంగా మిల్లులో ఉన్న బియ్యం పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పురుగులుపట్టి ముక్కిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. శుక్రవారం పౌరసరఫరాల విభాగం అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్ భరద్వాజ ఈ బియ్యాన్ని పరిశీలించారు. రైస్మిల్లు యజమాని హరి తమ మిల్లునుంచి ఈ బియ్యం బస్తాలను తొలగించాలని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డిని పీడీఎస్ అధికారులు సంప్రదించారు. నిబంధనల పేరుతో కాలయాపన చేసిన అధికారులు రేషన్బియ్యాన్ని వృథా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. -
తిరువూరు ఆర్టీసీ డిపో ఎత్తివేత!
కార్మికుల్లో ఆందోళన శాటిలైట్ డిపోగా నిర్వహించేందుకు యత్నం తమకు తెలియదంటున్న డిపో అధికారులు తిరువూరు, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లో 30 ఆర్టీసీ డిపోలను ఎత్తివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని తిరువూరు డిపోను మూసివేయనున్నారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన కార్మికవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 1965లో ఏడు బస్సులతో ఫ్యాక్టరీ సెంటర్లో తిరువూరు డిపోను ప్రారంభించారు. 1969లో రాజుపేట ఊరచెరువులో గ్యారేజీ నిర్మించి 69 బస్సులతో డిపోను నిర్వహించారు. 1985లో బస్స్టేషన్ ను అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభిం చారు. ఈ డిపో కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని 10 మండలాల ప్రయాణికులకు సేవలందిస్తూ స్వర్ణోత్సవాలకు చేరువవుతోంది. రోజుకు 10 వేల మందికి పైగా ప్రయాణికులు తిరువూరు డిపో బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. జిల్లాలో మారుమూల ఉన్న తిరువూరులో ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవలను విద్యార్థులు, గ్రామీణ ప్రజలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరువూరు డిపోలో 380 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న ఈ డిపోను వేరొకచోటికి తరలిస్తే ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మైలవరానికి తరలింపు తిరువూరు, ఇబ్రహీంపట్నం డిపోలను విలీనం చేసి మైలవరంలో కొత్త డిపో ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిరువూరు డిపో నుంచి అత్యధికంగా ఖమ్మం జిల్లాకు సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ సర్వీసులను కుదించాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిపో మరింత వెనుకబడకుండా మైలవరానికి తరలించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తిరువూరు డిపోను నూజివీడు డిపోకు అనుసంధానంచేసి శాటిలైట్ డిపోగా నిర్వహించాలనే మరో ప్రతిపాదన కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చర్యల పేరుతో తిరువూరు డిపోను మూసివేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రయాణికులను సైతం కలవర పరుస్తున్నాయి. జిల్లాలో మారుమూల ఉన్న తమకు ఆర్టీసీ బస్సులే ఆధారమని, డిపో ఎత్తివేస్తే ప్రయివేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలియదు తిరువూరు ఆర్టీసీ డిపో తరలింపు ప్రతిపాదనలు మాకు తెలియదు. ఇంతవరకు యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారమూ మాకు అందలేదు. - ప్రవీణ్కుమార్, తిరువూరు డిపో మేనేజర్ -
'చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోంది'
తిరువూరు : తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. ఆరోజు మీకు పోలవరం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, హంద్రీనీవా ప్రాజెక్ట్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు సంధించారు. మన రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే.. ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తావు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుని మోడీ ప్రధాని కావాలా? మరొకరు కావాలా? అనేది మనమే నిర్ణయిద్దామని జగన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 9ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీనైనా అమలు చేశారని అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.రూ.5.25 చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి...ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు తీసుకొచ్చింది ఆయనేనని జగన్ గుర్తు చేశారు. రామరాజ్యం అయితే తాను చూడలేదని...వైఎస్ఆర్ సువర్ణయుగం చూశానని వైఎస్ జగన్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన పేర్కొన్నారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
'జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు'
తిరువూరు: సంక్షేమ పథకాలతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డు సృష్టించారని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒక్క రూపాయి కూడా ప్రజలపై పన్ను భారం పడనివ్వలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కృష్ణా జిల్లా తిరువూరులో జరిగిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేశారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేసిందని గుర్తు చేశారు. జగనన్నను సీఎం చేద్దాం, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. జగనన్న సీఎం అయితే మహానేత వైఎస్సాఆర్ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పారు. ఒక్క అవకాశమిస్తే తన జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా జగనన్న ఉన్నారని తెలిపారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని షర్మిల అన్నారు. కాగా, షర్మిల రోడ్ షోకు తరలివచ్చిన జనంతో తిరువూరు జనసంద్రంగా మారింది. -
తిరువూరు జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
ఉక్కిరిబిక్కిరి
ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఈసారి 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కానున్నారు. ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీల్లో ఈసారి మొత్తం 10,41,306 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండున పూర్తవుతుంది. అనంతరమే విజయవాడ నగర మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలకు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే ఏడున ఎన్నికలు జరుగుతాయి. ఈసారి జిల్లాలోని 31,76,086 మంది ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇటీవల చేరిన కొత్త ఓటర్లు 69 వేల మందికిపైగా ఉన్నారు. తాజాగా ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం మరో అవకాశం ఇవ్వడంతో జిల్లాలో మరింతమంది కొత్త ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రెండున్నరేళ్లకు మోక్షం... జిల్లా పరిషత్, మండల పరిషత్లకు రెండున్నరేళ్ల తర్వాత మోక్షం దక్కింది. జెడ్పీ చైర్మన్గా కుక్కల నాగేశ్వరరావు పాలకవర్గ పదవీకాలం 2011 జూలై 22తో ముగిసింది. అదే ఏడాది జూలై 21న మండల పరిషత్ల పదవీకాలం కూడా పూర్తయింది. అప్పటినుంచి పాలకవర్గాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఖరారు చేసిన యంత్రాంగం శనివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు ప్రకటించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఏప్రిల్ 6న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. అధికారులకు కష్టకాలమే... వరుస ఎన్నికలు ఒకేసారి రావడంతో యంత్రాంగం సతమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి ఇది నిజంగా కష్టకాలమే అని చెప్పక తప్పదు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్రావు కొద్దిరోజులుగా వెన్నునొప్పితో బాధపడుతూనే ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోన్ ఆదేశాలను ఆయన చూసుకుంటూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్, సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఎస్పీ జె.ప్రభాకరరావు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా వరుస బందోబస్తులతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అవస్థలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల బందోబస్తు సైతం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న పోలీసులకు వరుస ఎన్నికలు ఊపిరి సలపనిచ్చేలా లేవు. మిగిలిన ఎన్నికల సిబ్బందికి సైతం వరుస ఎన్నికలను తలచుకుంటేనే గుండె జారిపోతోంది. అభ్యర్థులకు అగ్ని పరీక్షే... సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుపొందాలని గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ముందు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే తమ గెలుపు అవకాశాలపై ప్రభావం ఉంటుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అనివార్యంగా మున్సిపాలిటీల్లోను, స్థానిక సంస్థల్లోను గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించేలా భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఆశావహులకు వరుస ఎన్నికలు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. అరుదైన రికార్డే... ఇటు మున్సి‘పోల్స్’ అటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున నడుమ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైంది. స్థానిక సంస్థలకు కూడా ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇవ్వడంతో అరుదైన రికార్డే అవుతుంది. ఐదు ఎన్నికలను నిర్వహిస్తే పట్టణాల్లోని ఓటర్లు మూడు ఓట్లు, గ్రామీణ ఓటర్లు నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. -
పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ
తిరువూరు, న్యూస్లైన్: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరువూరులోని కూరగాయల మార్కెట్ పక్కన నివసిస్తున్న వ్యాపారి రాయల ప్రభాకరరావు ఇంట్లోకి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు యువకులు ప్రవేశించి ఆయన భార్య శకుంతలను మంచినీళ్లు అడిగారు. నీరిచ్చేలోపు ఆ ఇద్దరూ తమతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో చల్లి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కారు. ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో పరారయ్యారు. స్ప్రే ప్రభావంతో శకుంతలకు ఊపిరాడని పరిస్థితితో పాటు ముక్కునుంచి రక్తస్రావమైంది. ఈ ఘటనపై ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు మచిలీపట్నం నుంచి క్లూస్ టీంను రప్పించి నిందితుల ఆచూకీ కోసం గాలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తిరువూరులో పడకేసిన పారిశుద్ధ్యం
కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె తో తిరువూరులో గత మూడురోజులుగా పారి శుధ్య పనులు అరకొరగా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీధు ల్లో చెత్తాచెదారం తొలగించక, మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నగరపంచాయతీలో 35 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుండగా, 14 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అసలే చాలీచాలని పారిశుద్ధ్య సిబ్బందితో పట్టణంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కార్మికుల సమ్మెతో పరిస్థితి మరింత దిగజారింది. నగరపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కుండీలలో చెత్త పేరుకుపోయి, వీధుల్లో చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశుధ్య లేమితో పట్టణంలో దోమల బెడద తీవ్రతరమైంది. రాత్రివేళల్లో దోమకాటుకు గురై పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో చెత్తతొలగింపులో ఇబ్బంది కలుగుతోందని నగరపంచాయతీ కమిషనర్ మల్లేశ్వరరావు ‘న్యూస్లైన్’కు తెలిపారు. -
పత్తికి తెగుళ్ల బెడద
=మొదటితీత దశలోనే ప్రారంభం =పది రోజుల వ్యవధిలోనే చనిపోతున్న మొక్కలు =రైతుల బెంబేలు =సర్వే చేస్తున్నామంటున్న అధికారులు మచిలీపట్నం, న్యూస్లైన్ : పత్తి పైరుకు తెగుళ్ల బెడద సోకింది. దీంతో మొదటితీత దశలోనే పచ్చని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఆఖరి దశలో పత్తి మొక్క ఆకులు రంగుమారే అవకాశం ఉందని, ఈ ఏడాది మొదటితీత దశలోనే వైరస్ (ఎర్ర తెగులు) వ్యాపించి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముంచుకొచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అదనుకు వర్షాలు పడినా వైరస్ తెగులుతో పాటు పురుగుల బెడద అధికం కావటంతో పత్తి సాగు చేసిన రైతులకు నష్టాలే మిగులుతాయనే భావన వ్యక్తమవుతోంది. పనిలో పనిగా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా తేమ సాకు చూపి దళారులు తమ ఇష్టానుసారం ధర నిర్ణయిస్తున్నారు. వచ్చిన తెగులేమిటో తెలుసుకుని మందులు వాడేలోపే మొక్కలు చనిపోతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని ఆశించగా, 1.37 లక్షల ఎకరాల్లోనే సాగు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, గంపలగూడెం, తిరువూరు, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఎ.కొండూరు తదితర ప్రాంతాల్లో పత్తి అధికంగా సాగైంది. ప్రారంభదశలోనే పైరుకు తెగుళ్లు సోకటంతో పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. నాణ్యమైన బీటీ విత్తనం సరఫరా కాకపోవటం వల్ల పైరు ప్రారంభ దశలోనే తెగుళ్ల బారిన పడిందని రైతులు చెబుతున్నారు. ఖర్చులు తడిసిమోపెడు... విత్తనం ఖర్చు, అరక దున్నటం, పైపాటు, పురుగు మందుల పిచికారీ, కౌలు చెల్లింపు లెక్క వేసుకుంటే ఎకరానికి రూ.30 నుంచి రూ.35వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. క్వింటాలు పత్తి తీయాలంటే రూ.800 కూలి ఖర్చు అవుతుందని, దీనిని లారీ వద్దకు చేర్చేందుకు ఖర్చులు అదనమని రైతులు అంటున్నారు. సారవంతమైన భూములకు ఎకరానికి రూ.15 వేలు కౌలుగా ముందే చెల్లించామని, ప్రారంభదశలోనే తెగుళ్లు సోకటంతో ఖర్చులైనా వస్తాయో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొదటితీత తరువాత పత్తిపంట పూత, గూడ తొడుగుతున్న దశలో వైరస్ తెగులు సోకి వారం, పదిరోజుల వ్యవధిలోనే ఆకులు నల్ల రంగులోకి మారి మొక్కలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పత్తికి కనీసంగా ఎనిమిది తీతలు తీస్తామని, మొదటిదశలోనే తెగుళ్లు సోకటంతో దిక్కుతోచటం లేదని వాపోతున్నారు. తేమ శాతం పేరుతో టోకరా... గత ఏడాది క్వింటాలు పత్తికి రూ.3,900 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది మొక్కుబడిగా రూ.100 పెంచి రూ.4 వేలు మద్దతు ధరగా నిర్ణయించింది. మరోపక్క వ్యాపారులు తేమశాతం అధికంగా ఉందనే సాకు చూపి రైతులను నిలువునా దోచేస్తున్నారు. వారు క్వింటాలు పత్తికి రూ.2,200 నుంచి రూ.3,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. నాణ్యమైన పత్తికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల్లో మంచి డిమాండ్ ఉందని, అయినా ప్రభుత్వం ఎగుమతులకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వే చేస్తున్నాం - బాలునాయక్, వ్యవసాయశాఖ జేడీ పత్తికి వైరస్ తెగులు వ్యాపించిందనే విషయం మా దృష్టికి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి పరిశీలన చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ఎర్రతెగులు పత్తికి రావటం సహజమే అయినా ముందస్తుగా రావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే తెగులును అరికట్టే అవకాశముంది.