Tokyo Paralympics 2021
-
పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్లో పురుషుల హై జంప్లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కాగా, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్ కుమార్ పేరును ఈ ఏడాది మేజర్ ధాన్చంద్ ఖేల్రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్తో పాటు టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్(షూటింగ్), సుందర్ సింగ్ గుర్జార్(జావెలిన్ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్రత్న అవార్డులకు రెకమెండ్ చేసింది. చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..! -
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్(రజత పతక విజేత)లు ఉపయోగించిన రాకెట్ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. ఇక, టోక్యో ఒలింపిక్స్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్కు రూ. 80లక్షల బేస్ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 90లక్షలు దాటింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా చేతి గ్లౌజులను రూ. 80 లక్షల బేస్ప్రైజ్ వద్ద వేలం ప్రారంభించగా.. ప్రస్తుతం రూ.1.80 కోట్ల వద్ద కొనసాగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్సైట్లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే -
ఆ విషయంలో సచిన్ నుంచి చాలా నేర్చుకున్నా: టోక్యో స్వర్ణ పతక విజేత
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటతీరు తనపై తీవ్ర ప్రభావం చూపిందని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్ అన్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ సహా ఎన్నో విజయాలకు సచినే కారణమని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఎలా ఉండాలో సచిన్ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భగత్ మాట్లాడుతూ... చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, దూరదర్శన్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగానని అన్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ చాలా ప్రశాంతంగా కనిపించేవాడని, మైదానంలో అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకునేదని, అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. సచిన్ క్రీడా స్ఫూర్తి తన లాంటి చాలామంది క్రీడాకారులపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. SL3 విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అయిన భగత్ గతవారం టోక్యోలో జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెతెల్ను ఓడించడం ద్వారా పసిడిని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ తుది సమరంలో ప్రమోద్ భగత్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. రెండో గేమ్లో ప్రత్యర్ధి అటాకింగ్ గేమ్ ఆడటంతో ఒకానొక సమయంలో ప్రమోద్ 8 పాయింట్లు వెనుకపడ్డాడు. అయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని దేశానికి స్వర్ణ పతకం అందించాడు. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల ప్రమోద్ భగత్ నాలుగేళ్ల వయసులో ఉండగా.. పోలియో బారినపడ్డాడు. అయినా ఎంతో దైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఆటపై మక్కువ పెంచుకుని అందులో రాణించాడు. అందుకు ఫలితంగా విశ్వక్రీడల్లో గోల్డ్ మెడల్ దక్కింది. చదవండి: యూఎస్ ఓపెన్ ఫైనల్లో పెను సంచలనం.. ప్రపంచ నంబర్వన్కు షాక్ -
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోదీ సమావేశం
-
భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే!
భారత ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు స్వర్ణాల పంట పండింది. టోక్యో ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) పసిడి అందించి చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్లో అవని లేఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణా నగర్, మనీష్ నర్వాల్ స్వర్ణాలు సాధించి గర్వకారణమయ్యారు. వీరితో పాటు మన క్రీడాకారులంతా మెరుగ్గా రాణించడంతో ఒలింపిక్స్లో మొత్తంగా 7 పతకాలు, పారాలింపిక్స్లో 19 పతకాలు మన సొంతమయ్యాయి. అయితే, మెడల్స్ సాధించిన ఆటగాళ్లలో చాలా మంది హర్యానాకు చెందిన వారే కావడం విశేషం. మొత్తంగా.. ఈ రాష్ట్రానికి చెందిన 9 మంది అథ్లెట్లు పతకాలు గెలవడం గమనార్హం. ముఖ్యంగా గత రెండు ఎడిషన్లలో పారాలింపిక్స్లో హర్యానా అథ్లెట్లు ఆరు మెడల్స్తో మెరవడం వారి ప్రతిభకు అద్దం పడుతోంది. మరి దేశ జనాభాలో కేవలం 2 శాతం గల ఈ చిన్నరాష్ట్రం భారత్కు క్రీడామణికాంతులను అందించే నర్సరీగా ఎలా మారింది? విశ్వ వేదికపై సత్తా చాటిన హర్యానా సక్సెస్ సీక్రెట్ ఏంటి? భారీ ఆర్థిక సాయం, నజరానాలు ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా హర్యానా భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్లో స్వర్ణం సాధిస్తే ఆరు కోట్లు, రజతానికి 4, కాంస్యానికి రెండున్నర కోట్ల రూపాయలు క్రీడాకారులకు ఇచ్చేది. అంతేకాదు తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల ప్రోత్సాహకం అందించేది. 2018 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించింది. ఇక తాజా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్రతీ ప్లేయర్కు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందించింది. ఈ తరహాలో క్రీడల కోసం భారీగా ఖర్చు చేయడం హర్యానాకు మాత్రమే సాధ్యమైంది. ఈ విషయం గురించి హాకీ ఇంటర్నేషనల్ మాజీ ప్లేయర్, ప్రస్తుత క్రీడా శాఖా మంత్రి సందీప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అలాంటి సందర్భాల్లో క్రీడలను కెరీర్గా ఎంచుకునే ధైర్యం చేయాలంటే ఈమాత్రం ప్రోత్సాహకాలు ఉండాలి. వారి కుటుంబాలకు కూడా ఓ భరోసా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందించే నజరానాల కంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం చాలా ఎక్కువ. విశ్వక్రీడల్లో పసిడి సాధిస్తే 75 లక్షలు, మిగతా ఒలింపియన్స్కు కేవలం లక్ష రూపాయల బహుమానం మాత్రమే ఉంటుంది. మూలాలే బలంగా.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ఒలింపిక్స్ లేదంటే ఇతర ప్రధాన ఈవెంట్లలో పతకం సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయి. కానీ హర్యానాలో అందుకు భిన్నం. మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి.. ఆర్థిక భరోసా ఉండేలా ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ మనోజ్కుమార్ ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘చాలా మంది చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినవారే. ఆర్థిక తోడ్పాటు లేనివారే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు. అందుకే, క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపడుతోంది. కాబట్టి ఇక వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఆటలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా పోలీస్ విభాగం సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటగాళ్లకు చోటు కల్పించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో హర్యానా ఉందనడంలో అతిశయోక్తి లేదు. మట్టిలోని మాణిక్యాలు.. ప్రతిభకు పదునుపెట్టి 2008 నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్లో హర్యానాకు చెందిన కనీసం ఒక రెజ్లర్ అయినా సరే కచ్చితంగా పతకం సాధించడం పరిపాటిగా మారింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్లో మొత్తం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రెజ్లర్లు ప్రాతినిథ్యం వహించారు. అదే విధంగా.. కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్షిప్స్, ఏసియన్ గేమ్స్లోనూ ఇప్పటికే సత్తా చాటారు. మాజీ రెజ్లర్, ప్రస్తుతం కోచ్గా సేవలు అందిస్తున్న ఈశ్వర్ దహియా(2016 ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఈయన శిక్షణలోనే రాటు దేలారు) ఈ విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మట్టిలో మాణిక్యాలను గుర్తించి, సహజమైన ప్రతిభను వెలికితీయడం ఇక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, ఇంకాస్త మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పతకాల పంట పండుతుంది. అయితే, కేవలం మెడల్స్ వస్తేనే మేం సంతృప్తి చెందం. సాధించాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించారు. విశ్వవేదికపై మెరిసిన హర్యానా ఆణిముత్యాలు టోక్యోలో హర్యానా ప్లేయర్లు అద్భుతమే చేశారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించగా.. రెజ్లర్లు రవికుమార్ దహియా(రజతం), భజరంగ్ పునియా(కాంస్యం) మెడల్స్ సాధించారు. అంతేగాక ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీస్ చేరిన మహిళా హాకీ జట్టులోనూ కెప్టెన్ రాణీ రాంపాల్ సహా తొమ్మిది మంది ప్లేయర్లు ఉండటం విశేషం. పసిడి సాధించిన నీరజ్ చోప్రా తమ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రజలు పోరాటయోధులు. క్రీడల్లో మా విజయానికి ఈ గుణమే కారణం. మేం దృఢంగా ఉంటాం. జాతీయంగా ఎప్పుడో మా ప్రతిభను నిరూపించుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్నాం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక పారాలింపిక్స్లో పసిడి నెగ్గిన షూటర్ మనీష్ నర్వాల్ కోచ్ రాకేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఫరిదాబాద్ వంటి పలు పట్టణాల్లో అనేక షూటింగ్ రేంజ్లు ఉన్నాయి. షూటింగ్ పట్ల ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం. బల్లాబ్ఘర్లో ఉన్న నా రేంజ్లోనూ దాదాపు 10 మంది అంతర్జాతీయంగా పోటీపడుతున్నారు. 30-35 మంది జాతీయంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. మా వ్యవస్థ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఉంది. విజయాలు సాధించడానికి మూలాలు బలంగా ఉండటమే కారణం’’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్లో హర్యానా 2008 బీజింగ్: ►రెండు కాంస్యాలు- బాక్సర్ విజేందర్సింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్ 2012 లండన్: ►ఒక రజతం(రెజ్లర్ సుశీల్ కుమార్), రెండు కాంస్యాలు(రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్) 2016 రియో: ►ఒక కాంస్యం(రెజ్లర్ సాక్షి మాలిక్) 2020 టోక్యో: ►ఒక స్వర్ణం(నీరజ్ చోప్రా), ఒక రజతం(రెజ్లర్ రవికుమార్ దహియా), 2 కాంస్యాలు(రెజ్లర్ భజరంగ్ పునియా), పురుషుల హాకీ జట్టు సభ్యులు పారాలింపిక్స్లో పతకాలు 2016 రియో ►రజతం(షాట్పుట్టర్ దీపా మాలిక్) 2020 టోక్యో: ►2 స్వర్ణాలు(జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షూటర్ మనీష్ నర్వాల్), ఒక రజతం(షూటర్ సింగ్రాజ్ అధానా), 2 కాంస్యాలు(అధానా, ఆర్చర్ హర్వీందర్ సింగ్) - వెబ్డెస్క్ చదవండి: Virat Kohli: అరె ఏంట్రా ఇది.. ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! -
ఇది ఆరంభం మాత్రమే: దీపా మలిక్
టోక్యో పారాలింపిక్స్లో 19 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. తొమ్మిది క్రీడాంశాల్లో కలిపి మొత్తం 54 మంది క్రీడాకారులతో టోక్యోకు బయలుదేరినపుడు ఈసారి మనం చరిత్ర సృష్టిస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 1968లో తొలిసారి పారాలింపిక్స్లో భారత్ అరంగేట్రం చేశాక 2016 రియో పారాలింపిక్స్ వరకు మనం మొత్తం 12 పతకాలు గెలిచాం. అయితే ఈసారి మనం ఏకంగా 19 పతకాలు నెగ్గడం... 162 దేశాలు పాల్గొన్న ఈ దివ్యాంగుల విశ్వ క్రీడల్లో 24వ స్థానంలో నిలువడం ఆనందం కలిగించింది. భారత క్రీడాకారులు పతకాలు గెలిచే క్రమంలో ప్రపంచ, పారాలింపిక్, ఆసియా రికార్డులు సృష్టించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మరికొందరు పతకాలను త్రుటిలో చేజార్చుకున్నా వారి ప్రదర్శనను ప్రశంసించాల్సిందే. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుండి నడిపించడంతో దేశం మొత్తం మమ్మల్ని అనుసరించి ఆదరించింది. పారాలింపిక్స్కు బయలుదేరేముందు ఆయన మాతో రెండు గంటలపాటు మాట్లాడి మాలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దేశానికి చెందిన అత్యున్నత నాయకుడి నుంచి ఈ తరహా మద్దతు లభిస్తే ఏ క్రీడాకారుడి కెరీర్ అయినా సాఫీగా సాగిపోతుంది. ఈసారి పారాలింపిక్స్లో భారత్ పతకాల పంట పండించడం ఎలా సాధ్యమైందని చాలాసార్లు నన్ను అడిగారు. కేంద్ర ప్రభుత్వం, భారత పారాలింపిక్ కమిటీ, ప్రభుత్వేతర సంస్థలు పారా స్పోర్ట్స్కు మద్దతు నిలవడంవల్లే ఈసారి మేము అత్యధిక పతకాలు గెలవగలిగాం. 2016 రియో పారాలింపిక్స్లో నాలుగు పతకాలు గెలిచిన తర్వాత పారా స్పోర్ట్స్ను ప్రత్యేక దృష్టి కోణంలో చూడటం మొదలైంది. వైకల్యం ఉన్నా ఆటల ద్వారా అత్యున్నత వేదికపై సత్తా చాటుకునే అవకాశం ఉందని, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చని దివ్యాంగులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రదర్శనతో భారత్లో పారాలింపిక్స్కు సంబంధించి కొత్త శకం మొదలైంది. టోక్యో కేవలం ఆరంభం మాత్రమే! చదవండి: Tokyo Paralympics 2021: కలెక్టర్ సాబ్ కథ ఇదీ.. Viral Video: ఊహించని ట్విస్ట్.. గ్రౌండ్లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్.. -
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
-
పారాలింపిక్స్లో పతకం సాధించిన కలెక్టర్ సాబ్ కథ ఇదీ..
టోక్యో: సుహాస్ యతిరాజ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అవడం కంటే గొప్ప కల ఏముంటుంది. కానీ ఇతను కల సాకారంతోనే ఆగిపోలేదు. కలని మించి ఆలోచించాడు. చక్కగా ఆచరణలో పెట్టాడు. అందుకే ఇపుడు టోక్యో పారాలింపిక్స్లో రజత పతక విజేత అయ్యాడు. కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ సుహాస్ 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్ అంటే ఎనలేని ఆసక్తి. అందుకేనేమో అందులో ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఎదిగాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ పారా క్రీడల్లో మనసుపెట్టి పోటీపడే ఈ ప్రొఫెషనల్ ఖాతాలో చాలా పతకాలే ఉన్నాయి. 2016లో బీజింగ్లో జరిగిన చాంపియన్షిప్లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘యశ్ భారతి’ పురస్కారంతో సుహాస్ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్లో టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్లో ఈ పారా షట్లర్ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు. చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఇదే సమయంలో ఇంత బాధ కూడా ఎప్పుడూ పడలేదు. పారాలింపిక్స్లో రజతం ఆనందమైతే... స్వర్ణం చేజార్చుకోవడం, జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశాన్ని కోల్పోవడం చాలా నిరాశ పరిచింది. ఓవరాల్గా పారాలింపిక్ పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. –సుహాస్ చదవండి: పారాలింపిక్స్లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
టోక్యో గెలిచింది
కరోనా వచి్చనా... వేరియంట్లతో కలకలం రేపినా... ఓ ఏడాది వాయిదా పడినా... ఆఖరి దాకా అనుమానాలే ఉన్నా... మెజార్టీ జపనీయులు వ్యతిరేకించినా... సక్సెస్ (ఒలింపిక్స్)... డబుల్ సక్సెస్ (పారాలింపిక్స్)... టోక్యో ఇప్పుడు వేదిక కాదు... ముమ్మాటికి విజేత! ఎనిమిదేళ్ల జపాన్ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా... ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి. టోక్యోకు జయ హో అన్నాయి. ఇక ఒలింపిక్ టార్చ్ చలో చలోమని పారిస్ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ఏర్పాట్లలో తలమునకలైంది. మనం... అందరం... కలుద్దాం పారిస్లో..! సందడి చేద్దాం ఒలింపిక్స్లో! ఎదురులేని చైనా మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్ 2024లో పారిస్లో జరుగుతాయి. -
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
పారాలింపిక్స్లో రజతంతో మొదలైన తమ పతకాల వేటను భారత క్రీడాకారులు స్వర్ణంతో దిగి్వజయంగా ముగించారు. ఈ క్రీడల ఆఖరి రోజు ఆదివారం భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్లో çకృష్ణ నాగర్ బంగారు పతకం... ఐఏఎస్ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్ రజత పతకం నెగ్గారు. ఓవరాల్గా భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. టోక్యో: ఆత్మవిశ్వాసమే ఆస్తిగా.... పట్టుదలే పెట్టుబడిగా... అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. చివరి రోజు ఒక స్వర్ణం, ఒక రజతం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేశారు. తొలుత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం ఫైనల్లో సుహాస్ యతిరాజ్ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్ లుకాస్ మజూర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి పారాలిం పిక్స్లో ఆడుతున్న 38 ఏళ్ల సుహాస్ తొలి గేమ్ను గెల్చుకున్నా ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయాడు. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్హెచ్–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్కు చెందిన కృష్ణ నాగర్ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం కాంస్య పతక పోరులో భారత ప్లేయర్ తరుణ్ ధిల్లాన్ 17–21, 11–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్–3/ఎస్ఎల్–5 కాంస్య పతక పోరులో ప్రమోద్ భగత్–పలక్ కోహ్లి (భారత్) ద్వయం 21–23, 19–21తో దైసుకె ఫుజిహారా–అకీకో సుగినో (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్–1 విభాగంలో బరిలోకి దిగిన భారత షూటర్లు సిద్ధార్థ బాబు, దీపక్, అవనీ లేఖరా క్వాలిఫయింగ్ను దాటలేకపోయారు. క్వాలిఫయింగ్లో సిద్ధార్థ బాబు 617.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... 612 పాయింట్లు స్కోరు చేసి అవని 28వ స్థానంలో... 602.2 పాయింట్లు సాధించి దీపక్ 46వ స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. దటీజ్ కృష్ణ... రెండేళ్లపుడే కృష్ణ నాగర్ వయసుకు తగ్గట్టుగా పెరగడని నిర్ధారించారు. కానీ అతనే ఇప్పుడు బంగారం గెలిచేంతగా ఎదిగిపోయాడు. జైపూర్ (రాజస్తాన్)కు చెందిన కృష్ణది ఎదగలేని వైకల్యం. కానీ దేన్నయినా సాధించే అతని పట్టుదల ముందు మరుగుజ్జుతనమే మరుగున పడింది. పొట్టొడే గట్టోడని టోక్యో పారాలింపిక్స్ స్వర్ణంతో నిరూపించాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పొట్టివాడే. కానీ పతకాలు కొల్లగొట్టేవాడు కూడా! తనకిష్టమైన బ్యాడ్మింటన్లో చాంపియన్. 14 ఏళ్ల వయసులో షటిల్ వైపు దృష్టి మరల్చిన ఈ పొట్టి కృష్ణుడు 2016 నుంచి గట్టి మేలే తలపెట్టాడు. ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్గా సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ నిలకడైన విజయాలతో ఎస్హెచ్–6 పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంకర్గా ఎదిగాడు. 2019లో బాసెల్లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో సింగిల్స్లో కాంస్యం, డబుల్స్లో రజతం సాధించాడు. గతేడాది బ్రెజిల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఓపెన్లో రన్నరప్గా (రజతం) నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్లో సింగిల్స్, డబుల్స్లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోటీల బరిలో అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అందనంత ఎత్తులో నిలబెడుతోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకానికి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతిష్టాత్మక ఈ విశ్వక్రీడల్లో ఏకంగా బంగారమే సాధిస్తే ఆ ఆనందం మాటలకందదు. మేం బ్యాడ్మింటన్లో ఐదారు పతకాలు సాధిస్తామనే ధీమాతో వచ్చాం. చివరకు నాలుగింటితో తృప్తిపడ్డాం. అనుకున్న దానికి ఒకట్రెండు తగ్గినా మా ప్రదర్శన ఎంతో మెరుగైందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ పతకాన్ని కరోనా వారియర్స్కు అంకితం ఇస్తున్నాను. –కృష్ణ నాగర్ -
Tokyo Paralympics 2021: ఘనంగా టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో వేదికగా జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి.12 రోజుల పాటు జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అద్బుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 19 పతకాలు లభించాయి. వాటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా 19 పతకాలతో పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది. పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖార ప్రాతినిధ్యం వహించింది.త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సాయంత్రం నిర్వహించిన ముగింపు ఉత్సవంలో బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్ లైటింగ్ షో ముగింపు వేడుకల్లో ఆకట్టుకున్నాయి. చదవండి: Pramod Bhagath:ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం టోక్యో నుంచి తిరిగి వస్తున్న భారత బృందాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మనకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అభినందించారు. అథ్లెట్లు, కోచ్ లు, వారి కుటుంబసభ్యులకు అందరూ మద్దతివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. చదవండి: పారాలింపిక్స్లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. Change begins with sports... First time a woman para athlete marches with the National Flag.. thank you @AvaniLekhara .. you so richly deserve this honor. You have in true sense won hearts of Indians. #Tokyoparalympics2020 #closingceremony Oh it's farewell time already. Sayonara pic.twitter.com/Zi6VaZdQRI — Deepa Malik (@DeepaAthlete) September 5, 2021 A historic performance by the Indian athletes helped India finish with 19 medals, including five gold!! Watch #AvaniLekhara participate as #TeamIndia's Flagbearer at the closing ceremony of the #TokyoParalympics VC: DD Sports pic.twitter.com/CZ7t0KcFXu — The Better India (@thebetterindia) September 5, 2021 -
చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్ పతకాల పంట పండిస్తుంది. నిన్న ఎస్ఎల్ 3 విభాగంలో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ పసిడిని ముద్దాడగా.. తాజాగా ఎస్హెచ్ 6 విభాగంలో కృష్ణ నాగర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాగర్.. ఫైనల్లో హాంకాంగ్ షట్లర్ చు మన్ కైను 21-17, 16-21, 21-17తేడాతో మట్టికరిపించాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్లో భారత పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తొలిసారి బ్యాడ్మింటన్లో పతకాలను సాధిస్తుంది. ఇందులో ఏకంగా 2 పసిడి(కృష్ణ నాగర్, ప్రమోద్ భగత్), రజతం(సుహాస్ యతిరాజ్), మరో కాంస్య(మనోజ్ సర్కార్) పతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పారాలింపిక్స్లో భారత్ ఈ స్థాయిలో(19) పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్లో భారత్ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. -
పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పథకాలు
-
పారాలింపిక్స్లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్..
టోక్యో: టోక్యో వేదికగా జరగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. తాజాగా ఆదివారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో 18 పతకాలు చేరాయి. పారాలింపిక్స్లో పతకం సాధించిన మొట్టమొదటి భారత ఐఏఎస్ అధికారిగా సుహాస్ యతిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుహాస్ పూర్తిపేరు సుహాస్ లలినకెరె యతిరాజ్... కర్ణాటకలో జన్మించిన సుహాస్, ఎన్ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.సుహాస్ యతిరాజ్ ప్రస్తుతం నోయిడాలోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాకి మేజిస్ట్రేట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన సుహాస్ యతిరాజ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు చదవండి: మొగ్గు మనవైపు! What. A. Match 🤯#FRA's Lucas Mazur and #IND's Suhas Yathiraj served up a true classic in the #ParaBadminton Men's Singles SL4 Final. 🔥 #Gold #Silver #Tokyo2020 #Paralympics pic.twitter.com/jUjC8QqboA — #Tokyo2020 for India (@Tokyo2020hi) September 5, 2021 A fantastic confluence of service and sports! @dmgbnagar Suhas Yathiraj has captured the imagination of our entire nation thanks to his exceptional sporting performance. Congratulations to him on winning the Silver medal in Badminton. Best wishes to him for his future endeavours. pic.twitter.com/bFM9707VhZ — Narendra Modi (@narendramodi) September 5, 2021 -
పసిడి కాంతులు...
మునుపెన్నడూ లేని విధంగా దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్కు నేటితో తెర పడనుండగా... శనివారం భారత దివ్యాంగ క్రీడాకారులు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను గెల్చుకున్నారు. షూటింగ్లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్హెచ్–1 ఫైనల్లో మనీశ్ నర్వాల్ పసిడి పతకం నెగ్గగా... సింగ్రాజ్ అధానా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్లోనూ భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–3 విభాగంలో ప్రపంచ చాంపియన్ ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించగా... మనోజ్ సర్కార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. టోక్యో: పారాలింపిక్స్లో మరోసారి భారత క్రీడాకారులు తమ ప్రతాపం చూపించారు. శనివారం ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టారు. ముందుగా షూటింగ్లో మనీశ్ నర్వాల్... సింగ్రాజ్ అధానా... అనంతరం బ్యాడ్మింటన్లో ప్రమోద్ భగత్, మనోజ్ సర్వార్ పతకాలు సొంతం చేసుకున్నారు. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచాడు. 39 ఏళ్ల సింగ్రాజ్ 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రీడల్లో సింగ్రాజ్కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సింగ్రాజ్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్గా మూడో భారత ప్లేయర్గా సింగ్రాజ్ గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్లో అథ్లెట్ జోగిందర్ సింగ్ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్లో మహిళా షూటర్ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది. ఫుట్బాలర్ కావాలనుకొని... హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్ జన్మతః కుడి చేతి వైకల్యంతో జని్మంచాడు. కొన్నాళ్లు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసి క్లబ్ స్థాయిలో మ్యాచ్లు కూడా ఆడిన మనీశ్ కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్బాల్లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తండ్రి దిల్బాగ్ మిత్రుడొకరు మనీశ్కు షూటింగ్ను పరిచేయం చేశాడు. స్థానిక 10ఎక్స్ షూటింగ్ అకాడమీలో చేరిన మనీశ్ రెండేళ్లలో ఆటపై పట్టు సాధించాడు. 2018లో ఆసియా పారా గేమ్స్లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్ పారా షూటింగ్ చాంపియన్షిప్లో రెండు కాంస్యాలు గెలిచాడు. ప్రమోదం నింపిన విజయం టోక్యో పారాలింపిక్స్లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు సూపర్ ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించాడు. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నా కల నిజమైంది. ఈ పతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాను’ అని ప్రమోద్ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్ ఇరుగు పొరుగు వారు బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఈ ఆటపై ఆసక్తి ఏర్పరచుకున్నాడు. 2006లో పారా బ్యాడ్మింటన్లో అడుగుపెట్టిన ప్రమోద్ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మరోవైపు ఎస్ఎల్–4 విభాగంలోనే భారత్కు చెందిన మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్కు చెందిన 31 ఏళ్ల మనోజ్ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితుడైన మనోజ్ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్íÙప్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. చివరి రోజు భారత ప్లేయర్లు 5 పతకాలపై గురి పెట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ స్వర్ణం కోసం... తరుణ్ కాంస్యం కోసం... ఎస్హెచ్ –6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణం కోసం... మిక్స్డ్ డబుల్స్లో ప్రమోద్–పలక్ ద్వయం కాంస్యం కోసం పోటీపడతారు. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో సిద్ధార్థ, దీపక్, అవని బరిలో ఉన్నారు. -
ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం
సాక్షి, వెబ్డెస్క్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపితం చేశాడు.. ప్రమోద్ భగత్. 1988 జూన్ 4న ఒడిశాలో జన్మించాడు. చిన్న వయసులోనే ప్రమోద్ భగత్ పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్లో మెలుకువలు నేర్చుకున్నాడు. అలా బ్యాడ్మింటన్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్వన్ పారా షట్లర్గా ఎదిగాడు. తాజాగా టోక్యో పారాలింపిక్స్లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3 కేటగిరీలో ప్రపంచనెంబర్వన్గా ఎదిగిన ప్రమోద్ భగత్ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం. చదవండి: చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రమోద్ భగత్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్ను ఆడుతుండగా చూసిన ప్రమోద్ దానినే తన కెరీర్గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్ కొల్లగొట్టాడు. అనంతరం పారా బ్యాడ్మింటన్వైపు అడుగులు వేసిన ప్రమోద్కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్ వేదికగా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీ పడిన ప్రమోద్ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు. టోక్యో పారాలింపిక్స్లో పతకం తెచ్చేవారిలో ప్రమోద్ భగత్ ముందు వరుసలో ఉండగా.. తాజా విజయంతో దానిని సాకారం చేశాడు. చదవండి: అంధ అథ్లెట్కు ట్రాక్పైనే లవ్ ప్రపోజ్ చేసిన గైడ్ ప్రమోద్ భగత్ సాధించిన పతకాలు.. రికార్డులు ►SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్గా ప్రమోద్ భగత్ రికార్డు ►ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్, డబుల్స్ ,మిక్సడ్ డబుల్స్ ఈవెంట్లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం. ►ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు. ►ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్లో గోల్డ్, కాంస్య పతకాలు ►2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు. ►RYLA ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు Meet World No. 1 Para-Shuttler @PramodBhagat83 who has 4 BWF World Championships titles under his name. With hard work & determination, he is now ready to win a medal for 🇮🇳 at @Tokyo2020 #Paralympics Let us #Cheer4India #Praise4Para @PMOIndia @ianuragthakur @NisithPramanik pic.twitter.com/OPzP3SQa6n — SAI Media (@Media_SAI) August 17, 2021 #RaiseARacket 🏸 for Team India's 🇮🇳 medal contender at the @Paralympics in the SL3 category, Pramod Bhagat.#Tokyo2020 Qualifiers 👉 https://t.co/qPz99LGlUs#BadmintonUnlimited pic.twitter.com/B3eRnfa8gD — BWF (@bwfmedia) August 12, 2021 India continues to impress at #Tokyoparalympics2020. History created by #PramodBhagat. Congrats to him for winning #gold medal in Men’s Badminton SL3 category. This is a special moment for all Indians.#ParaBadminton pic.twitter.com/aafvzUmEqv — Y. Satya Kumar (@satyakumar_y) September 4, 2021 -
చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్(SL3)లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్.. ఫైనల్స్లో ప్రపంచ నంబర్ టూ ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు. ఈ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు బ్యాడ్మింటన్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. -
భారత షట్లర్ల హవా.. మరో 3 పతకాలు ఖాయం
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు పతకాల పంట పండే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలు సొంతమవుతాయి. లేదంటే కనీసం మూడు రజత పతకాలు మాత్రం ఖాయం. పురుషుల బ్యాడ్మింటన్లో ప్రమోద్ భగత్, సుహాస్ యతిరాజ్, కృష్ణ నాగర్ పురుషుల సింగిల్స్లో తమ విభాగాల్లో ఫైనల్ చేరుకున్నారు. వీరు ముగ్గురు స్వర్ణం కోసం పోటీపడతారు. మనోజ్ సర్కార్, తరుణ్ ధిల్లాన్ సెమీస్లో ఓటమి పాలవ్వడంతో కాంస్యం కోసం పోరాడనున్నారు. అలాగే, మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో భగత్, పలక్ జోడీ కూడా సెమీస్లోనే వెనుదిరిగింది. దీంతో ఈ జోడీ కూడా కాంస్య పతక పోరులో నిలిచింది. కాగా, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ సెమీస్లో అత్యంత సునాయాస విజయం అందుకున్నాడు. ఎస్ఎల్ 3 సెమీస్లో జపాన్ ఆటగాడు డైసుక్ ఫుజిహారాను 21-11, 21-16 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశాడు. అతడు స్వర్ణ పతక పోరులో గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్తో పోటీపడనున్నాడు. ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్.. ఇండోనేసియా షట్లర్ సెతియవన్ను 21-9, 21-15 తేడాతో ఓడించాడు. సుహాస్ ఫైనల్లో టాప్సీడ్ లూకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. ఇక, ఎస్హెచ్ 6 విభాగంలో కృష్ణ నాగర్.. సెమీస్లో బ్రిటన్ ఆటగాడు క్రిస్టీన్ కూంబ్స్ను 21-10, 21-11 తేడాతో మట్టికరిపించి ఫైనల్కు చేరాడు. స్వర్ణం కోసం పోరులో కృష్ణ.. హాంకాంగ్ షట్లర్ చు మన్ కైతో పోటీపడతాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత పారాలింపిక్స్లో ఇప్పటివరకు భారత్ 15 పతకాలు సాధించింది. వీటిలో మూడు పసిడి, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యోకి బయల్దేరేముందు భారత పారాలింపిక్స్ ప్రతినిధులు కనీసం 15 పతకాలు సాధిస్తామని ఛాలెంజ్ చేసి మరీ విమానం ఎక్కారు. అన్న మాట ప్రకారమే భారత్ ఇప్పటికే 15 పతకాలు సాధించింది. ఈ సంఖ్య 25 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఈ స్థాయిలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్లో భారత్ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. చదవండి: క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
ఏపీ గవర్నర్తో ఇండోనేషియా కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, విజయవాడ: ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్ భవన్కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్కు వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరిచందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి) టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ అభినందన టోక్యో పారాలింపిక్స్లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్ , రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్ ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించారని ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని గవర్నర్ పేర్కొన్నారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్ను కూడా గవర్నర్ బిశ్వ భూషణ్ అభినందించారు. దేశ ప్రజలు వారి విజయాలను చూసి గర్వపడుతున్నారని, భవిష్యత్తులో దేశానికి మరిన్ని పురస్కారాలు అందించేదుకు కృషి చేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన) -
వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్పైనే అంధ అథ్లెట్కు లవ్ ప్రపోజల్
టోక్యో: పారాలింపిక్స్లో భాగంగా శుక్రవారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో రన్నింగ్ ట్రాక్పై ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అంధ అథ్లెట్కు ఆమె గైడ్ రన్నింగ్ ట్రాక్పైనే ప్రమోజ్ చేసి ఆమెతో సహా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కేప్ వర్డే దేశానికి చెందిన స్ప్రింటర్ క్యూలా నిద్రేయి పెరీరా సెమెడో.. సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే.. ఆమెకు మెడల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఉబ్బితబ్బిబిపోయింది. Keula Nidreia Pereira Semedo from Cape Verde got a surprise marriage proposal from guide after her Tokyo Paralympics 2020 Women's 200m T11 Heat 4 event.#YouDeserveIt #Paralympics pic.twitter.com/ZR6Lq7EwOb — SABC Sport (@SPORTATSABC) September 2, 2021 పరుగు పందాన్ని నాలుగో స్థానంతో ముగించిన అనంతరం ఆమె గైడ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా ట్రాక్పైనే పెరీరాకు లవ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా అవాక్కయిన పెరీరా.. అనంతరం ఓకే చెప్పడంతో సహచర అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రాక్పై లవ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సర్ప్రైజ్ లవ్ ట్రాక్ను పారాలింపిక్స్ నిర్వాహకులు అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీటారు. కాగా, టోక్యో ఒలింపిక్స్లో కూడా ఇలాంటి లవ్ ప్రపోజల్ సీన్ ఒకటి నెట్టింట హల్చల్ చేసింది. అర్జెంటీనా ఫెన్సర్ మరియా బెలెన్ పెరెజ్ మారిస్కు ఆమె కోచ్ లూకాస్ సౌసెడో లవ్ ప్రపోజ్ చేశాడు. 2010 పారిస్ ప్రపంచ ఛాంపియన్షిప్ సందర్భంగా కూడా సౌసెడో ఇలానే ప్రేమను వ్యక్తపరచడం విశేషం. చదవండి: కేబీసీలో.. కేటీఆర్? విషయం ఏమిటంటే? -
భారత్ ఖాతాలో మరో బంగారు పతకం..
-
పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా ప్రభుత్వం శనివారం భారీ నజరానా ప్రకటించింది. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన సింఘ్ రాజ్ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ ప్రకటించింది. కాగా అంతకముందు పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: Tokyo Paralympics 2021: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం.. -
పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో శనివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 15 పతకాలు చేరాయి. వీటిలో మూడు పసిడి, ఏడు రజత, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పారా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మనీష్ నర్వాల్, సింఘ్ రాజ్ అధనాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మరో వైపు బాడ్మింటన్ లో సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్ లు ఫైనల్స్ లోకి ప్రవేశించి ఇప్పటికే రెండు పతకాలను ఖాయం చేయగా... మరో ఇద్దరు ప్లేయర్స్ తరుణ్, మనోజ్ సర్కార్ లు కాంస్యాల కోసం పోరాడనున్నారు. చదవండి: Tokyo Paralympics: అవని అద్వితీయం #Paralympics#Praise4Para Perseverance. Podium. Pride. 🇮🇳 THANK YOU for this! 🙏 #Paralympics#Praise4Para Repeat after us - INDIAAAAA...INDIA! 🇮🇳 🥳🥳🥳 Para Shooters Manish Narwal and Singhraj Adhana dominate the podium as they bag GOLD and SILVER respectively in the Mixed 50m Pistol SH1 Event pic.twitter.com/mP2DLHxQAc — DD News (@DDNewslive) September 4, 2021 Manish Narwal and @AdhanaSinghraj make the country proud in the Mixed 50m Pistol SH1 pic.twitter.com/iQdQVJPTGW — DD News (@DDNewslive) September 4, 2021 Glory from the Tokyo #Paralympics continues. Great accomplishment by the young and stupendously talented Manish Narwal. His winning the Gold Medal is a special moment for Indian sports. Congratulations to him. Best wishes for the coming times. #Praise4Para. pic.twitter.com/gGHUXnetWA — Narendra Modi (@narendramodi) September 4, 2021 The outstanding Singhraj Adhana does it again! He wins yet another medal, this time in the Mixed 50m Pistol SH1 event. India rejoices due to his feat. Congrats to him. Wishing him the very best for the future endeavours. #Paralympics #Praise4Para. pic.twitter.com/EWa9gCRaor — Narendra Modi (@narendramodi) September 4, 2021 -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్పుట్లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
భారత్కు మరో పతకం; ఆర్చరీలో పతకం సాధించిన తొలి పారా అథ్లెట్గా
టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్ కిమ్ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్ సింగ్ సాధించిన పతకంతో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్హెచ్ 1 ఫైనల్లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్గా అవనీ లేఖరా సరికొత్త చరిత్ర సృష్టించింది. చదవండి: Tokyo Paralympics: సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు Avani Lekhara: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్కు మరో పతకం -
సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు
టోక్యో: ఆత్మ విశ్వాసం ముందు.. వైకల్యం తలవంచక తప్పదని చైనా స్విమ్మర్ జెంగ్ టావో నిరూపించాడు. టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్లో చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు. ఆ దేశానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి పెట్టాడు. స్విమ్మింగ్లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది పూర్తిగా రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్ టావో నాలుగు బంగారు పతకాలు సాధించి క్రీడా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. అంతకముందు రియో పారాలింపిక్స్లో రెండు పతకాలు, 2012 లండన్ ఒలింపిక్స్లో మూడు పతకాలు జెంగ్ టావో సాధించాడు. చిన్నతనంలో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన జెంగ్ టావో.. అంగవైకల్యం శరీరానికే కాని, మనస్సుకు కాదని... లక్ష్యంతో ముందుకు వెళ్లిన తీరు స్ఫూర్తిదాయకం. ఈ రోజు ప్రపంచ చరిత్రలో తన పేరును లిఖించుకుని అతడు అద్భుతమే చేశాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైన్ల్లో విజయం సాధించగానే.. చైనీయులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎందుకంటే 1984 న్యూయార్క్ పారాలింపిక్స్లో మొదలైన చైనా బంగారు పతకాల పంట నేటికి 500 కు చేరింది. ఆనతరం మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన జెంగ్ టావో... ‘‘నా చిట్టితల్లీ.. చూడు నాకు రెండు చేతులు లేనప్పటికీ నేను చాలా వేగంగా ఈత కొట్టగలను’’ అంటూ తన కుమార్తెకు వీడియో సందేశాన్ని పంపాడు. నివేదికల ప్రకారం.. జెంగ్ టోక్యో పారాలింపిక్స్ సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతిరోజూ కనీసం 10 కిలోమీటర్లు ఈత కొడుతూ ప్రాక్టీస్ చేసేవాడు. కాగా జెంగ్ టావో 13 సంవత్సరాల వయస్సులో స్విమ్మింగ్పై ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో పందొమ్మిదేళ్ల వయస్సులో నెదర్లాండ్స్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటిల్లో అరంగేట్రం చేశాడు. తరువాత 2012 లండన్ పారాలింపిక్స్లో 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో తన మొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది పారాలింపిక్ పతకాలు జెంగ్ టావో సాధించాడు. చదవండి: Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో.. Chinese para-swimmer Zheng Tao who has no arms picks up FOURTH gold medal at Tokyo 2020 https://t.co/tir4z54RDD — Daily Mail Online (@MailOnline) September 2, 2021 -
టోక్యో పారాలింపిక్స్: పురుషుల హై జంప్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు
-
Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో..
టోక్యో: సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టరు. అలాంటిది 35 ఏళ్ల లోరా వెబ్స్టర్(అమెరికా) 5 నెలల గర్భంతో విశ్వవేదికపై(సిట్టింగ్ వాలీబాల్) దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐదో పతకం వేటలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్లో, మరోసారి ఓ అంతర్జాతీయ వేదికపై గర్భంతోనే పోటీల్లో పాల్గొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లోరా.. నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, లోరా ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఇవాళ బ్రెజిల్తో సెమీస్ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గితే లోరా ఖాతాలో 5వ పతకం చేరడం ఖాయం. లోరా తొలిసారి ఏథెన్స్లో కాంస్య పతకం సాధించింది. ఆతర్వాత 2008, 2012 పారాలింపిక్స్లో రజతాలు గెలుచుకుంది. గత రియో పారాలింపిక్స్లో ఈ అమెరికన్ ధీర వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఏకంగా స్వర్ణం నెగ్గింది. కాగా, లోరాకు 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్ కారణంగా ఎడమ కాలు దెబ్బతింది. చదవండి: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్కు మరో పతకం -
'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్కు మరో పతకం
టోక్యో: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 50 మీటర్ల ఎయిర్ రైఫిల్(SH1) విభాగంలో కాంస్య పతకం సాధించి భారత పతకాల సంఖ్య 12కు చేర్చింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని.. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవని సాధించిన కాంస్య పతకంతో ఆమె మరో రికార్డును నెలకొల్పింది. పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ బేడీ, మరియప్పన్ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్గా రికార్డుల్లోకెక్కింది. చదవండి: ప్రవీణ్ కూమార్కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు -
ప్రవీణ్ కూమార్కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కూమార్ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కూమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి: IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..! Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para — Narendra Modi (@narendramodi) September 3, 2021 -
‘స్వర్ణ పతకం’ అందుకునేవాడే... కానీ ఆలస్యంగా వచ్చాడని..
టోక్యో: పాపం జియాద్... పారాలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండో స్వర్ణం సాధించాడన్న అతని ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. దురదృష్టం వెంట రావడంతో బంగారు పతకం కూడా ముఖం చాటేసింది! మలేసియా చెందిన ముహమ్మద్ జియాద్ జుల్కెఫ్లీ షాట్పుట్ ఎఫ్20 క్లాస్లో మొదటి స్థానంలో నిలిచాడు. రియో పారాలింపిక్స్లో కూడా స్వర్ణం గెలిచిన అతను దానిని నిలబెట్టుకున్నట్లు కనిపించాడు. అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్ జట్టు ఫిర్యాదు చేసింది. నిజానికి ‘అధికారిక ప్రకటన’ తర్వాత జియాద్ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా... ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా... ‘అనౌన్స్మెంట్ సరిగా వినిపించలేదని, భాష అర్థం కాలేదని’ అతను చెప్పాడు. దాంతో ఇది సరైన కారణం కాదంటూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ కమిటీ జియాద్ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్ నాట్ స్టార్ట్ (డీఎన్ఎస్) అని పెట్టేసింది. ఈ ఈవెంట్లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్కు దక్కగా, గ్రీస్ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: పతకాల వేటకు విరామం -
పతకాల వేటకు విరామం
టోక్యో: వరుసగా మూడు రోజులపాటు టోక్యో పారాలింపిక్స్లో పతకాల పంట పండించిన భారత దివ్యాంగ క్రీడాకారులు బుధవారం నిరాశపరిచారు. షూటింగ్, అథ్లెటిక్స్లో మెడల్ ఈవెంట్స్లో పోటీపడిన భారత అథ్లెట్స్ పతకాలు నెగ్గలేకపోయారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్–1 విభాగం క్వాలిఫయింగ్లో పోటీపడిన అవనీ లేఖరా 629.7 పాయింట్లు స్కోరు చేసి 27వ స్థానంలో నిలిచింది. భారత్కే చెందిన ఇతర షూటర్లు సిద్ధార్థ బాబు 625.5 పాయింట్లతో 40వ స్థానంలో... దీపక్ కుమార్ 624.9 పాయింట్లతో 43వ స్థానంలో నిలిచారు. సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని స్వర్ణం గెలిచి పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్లో పురుషుల ఎఫ్–51 డిస్కస్/క్లబ్ త్రో విభాగంలో పోటీపడిన భారత క్రీడాకారులు అమిత్ కుమార్, ధరమ్బీర్ నిరాశపరిచారు. అమిత్ డిస్క్ను 27.27 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో, ధరమ్బీర్ డిస్క్ను 25.59 మీటర్ల దూరం విసిరి ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ ఎస్బీ–7 ఈవెంట్ ఫైనల్లో పోటీపడిన భారత స్విమ్మర్ సుయశ్ జాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈత కొట్టి డిస్క్వాలిఫై అయ్యాడు. బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్ రేసు మొదలుపెట్టాక మలుపు వద్ద ఒక్కసారి మాత్రమే బటర్ఫ్లయ్ కిక్ చేయాలి. కానీ సుయశ్ ఒకటికంటే ఎక్కువసార్లు చేయడంతో అతడిపై అనర్హత వేటు వేశారు. బుధవారం పోటీలు ముగిశాక భారత్ 10 పతకాలతో 34వ స్థానంలో ఉంది. -
Tokyo Paralympics: ‘హై’ పైకి...
దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్లోగానీ, పారాలింపిక్స్లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో: పారాలింపిక్స్లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్–1 కేటగిరీలో సింగ్రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్గా భారత్ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్లోగానీ, పారాలింపిక్స్లోగానీ భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్ మనీశ్ నర్వాల్ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచింది. సొంతంగా రేంజ్ ఏర్పాటు చేసుకొని... హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్ రేంజ్కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్ చేసిన సింగ్రాజ్ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచకప్లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్కప్లో స్వర్ణం గెలిచిన సింగ్రాజ్ కోవిడ్–19 సమయంలో షూటింగ్ రేంజ్లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్రాజ్ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్ రేంజ్ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మళ్లీ మెరిసిన తంగవేలు... 2016 రియో పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్లో అడుగుపెట్టాడు. కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్ పారాలింపిక్స్లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు. నాన్న సలహాతో... టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్ ఈవెంట్ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్లో పాల్గొని శరద్ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్లో నాన్నకు వివరించాను. ఈవెంట్లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్ వివరించాడు. -
Paralympics 2021: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ T-63 విభాగంలో మరియప్పన్ తంగవేల్ భారత్కు రజత పతకం సాధించగా,శరధ్ కూమార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మొత్తం 10 పతకాలు చేరాయి. మరియప్పన్ తంగవేల్, శరధ్ కూమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 2016 రియో పారాలింపిక్స్లో మరియప్పన్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 కేటగిరీలో సింగ్రాజ్ అధానా కాంస్య పతకం సాధించాడు. పారా ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్ 30వ స్థానంలో ఉంది. చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్ Soaring higher and higher! Mariyappan Thangavelu is synonymous with consistence and excellence. Congratulations to him for winning the Silver Medal. India is proud of his feat. @189thangavelu #Paralympics #Praise4Para pic.twitter.com/GGhtAgM7vU — Narendra Modi (@narendramodi) August 31, 2021 The indomitable @sharad_kumar01 has brought smiles on the faces of every Indian by winning the Bronze Medal. His life journey will motivate many. Congratulations to him. #Paralympics #Praise4Para pic.twitter.com/uhYCIOoohy — Narendra Modi (@narendramodi) August 31, 2021 -
బుల్లెట్టు మరోసారి దిగింది.. షూటింగ్లో భారత్కు మరో పతకం
టోక్యో: పారాలింపిక్స్లో షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్(SH1) ఈవెంట్లో సింగ్రాజ్ అదానా కాంస్య పతకం సాధించాడు. కాగా, మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తంగా సింగ్రాజ్ అదానా కాంస్యంతో భారత పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. -
అదరహో... దేవేంద్ర, సుందర్
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలోనే భారత్కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్ జావెలిన్ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్ సింగ్ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో, 2016 రియో పారాలింపిక్స్లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు. వినోద్కు నిరాశ మరోవైపు ఆదివారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. యోగేశ్ అద్భుతం... పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–56 విభాగంలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్ డిస్క్ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్–1 కేటగిరీలో భారత షూటర్ స్వరూప్ ఉన్హాల్కర్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన స్వరూప్ 203.9 పాయింట్లు స్కోరు చేశా>డు. -
అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం
దేవేంద్ర ఝఝారియా గెలుపు ప్రస్థానమిది. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్లో భారత్కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్కు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. ‘మా నాన్న చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒలింపిక్స్ కోసం నా శిక్షణ సాగుతున్న సమయంలోనే క్యాన్సర్తో ఆయన మరణించారు. ఈ పతకం నాన్నకు అంకితం.’ – దేవేంద్ర -
కృత్రిమ కాలుతో కనకం వైపు...
‘ఫాంటమ్ లింబ్ పెయిన్’... కృత్రిమ కాలు అమర్చుకున్న వారిలో దాదాపు అందరికీ వచ్చే సమస్య. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే పరిస్థితి... కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతుంటే ఆ బాధ తట్టుకోవడం కష్టం! సాధన సమయంలో సుమిత్ అంటిల్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ తాను పారాలింపిక్స్లో పాల్గొనాలనే, పతకం సాధించాలనే లక్ష్యం నుంచి మాత్రం అతను తప్పుకోలేదు. ‘ప్రొస్థెటిక్ లెగ్’తోనే జావెలిన్లో ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం అతను తన కలను నిజం చేసుకున్నాడు. టోక్యోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. 2015 జనవరి 5 వరకు సుమిత్ జీవితం చాలా మందిలాగే సరదాగా సాగింది. హరియాణాలో గల్లీ గల్లీలో కనిపించే చాలా మందిలాగే రెజ్లింగ్ వైపు వెళ్లాడు. నాలుగైదేళ్లు పెద్దగా ఫలితాలు లేకపోయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతను ‘పహిల్వాన్’ కావాలనే కోరుకోవడంతో ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 17 ఏళ్ల వయసులో ట్యూషన్ నుంచి తిరిగొస్తూ జరిగిన ఒక ప్రమాదం సుమిత్ జీవితాన్ని మార్చేసింది. మోటార్ బైక్పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్తో అతను తన ఎడమ కాలును కోల్పోయాడు. మోకాలి కింది భాగం మొత్తం తొలగించాల్సి రాగా... 53 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. కృత్రిమ కాలు బిగించడంతో ఇక లోకమంతా విషాదంగా, ఏదో కోల్పోయినట్లుగా కనిపించింది. దాంతో ఇంటికే పరిమితమైన అతను పాత జ్ఞాపకాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ స్టేడియం వైపు మరలాడు. అదే సుమిత్ జీవితాన్ని మార్చింది. సోనెపట్ సమీపం లోని తన సొంత ఊరు ఖేవ్డాకు చెందిన ఒక పారాథ్లెట్ అతనికి పరిచయమయ్యాడు. అంతే... పారా క్రీడల గురించి మొత్తం తెలుసుకున్న అతను మళ్లీ ఆటల్లో కొత్త జీవితం వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. అథ్లెటిక్స్లో, అందులోనూ జావెలిన్ త్రోలో సత్తా చాటగలనని నమ్మకంతో సాధన మొదలుపెట్టిన సుమిత్ ఒక్కసారిగా దూసుకుపోయాడు. 2019లో వరల్డ్ పారా అథ్లెటిక్స్, వరల్డ్ గ్రాండ్ప్రి, పారిస్ ఓపెన్లలో అతను మూడు రజతాలు సాధించి సత్తా చాటాడు. వరల్డ్ నంబర్వన్గా, వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతతో టోక్యో బరిలోకి దిగిన సుమిత్ రాణించి విశ్వ క్రీడల్లో భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించగలిగాడు. -
Tokyo Paralympics : బుల్లెట్ దిగింది బల్లెం మెరిసింది
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తళుక్కుమన్నారు. ఊహించని విధంగా ఒకేరోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. 1984 న్యూయార్క్ పారాలింపిక్స్లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్లో 4 పతకాలు నెగ్గడమే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే సోమవారం టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి ఓవరాల్గా ఏడు పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 26వ స్థానంలో కొనసాగుతోంది. మరో వారంరోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. టోక్యో: ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో ఏ భారతీయ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను భారత టీనేజ్ షూటర్ అవనీ లేఖరా సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్హెచ్–1 కేటగిరీలో అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు (బ్యాడ్మింటన్)... 2020 టోక్యో ఒలింపిక్స్లో మీరాబాయి చాను (వెయిట్లిఫ్టింగ్).. 2016 రియో పారాలింపిక్స్లో దీపా మలిక్ (షాట్పుట్), 2020 టోక్యో పారాలింపిక్స్లో భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్) రజత పతకాలు గెలిచారు. అయితే 19 ఏళ్ల అవని పారాలింపిక్స్లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది. చెదరని గురి... ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. నిర్ణీత 10 షాట్ల తర్వాత అవని 103.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు షాట్లు ముగిశాక అవని 124.9 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది. అటునుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తన టాప్ ర్యాంక్ను కాపాడుకుంటూ చివరకు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 248.9 పాయింట్లతో క్యూపింగ్ జాంగ్ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) కాంస్యం గెలిచారు. అవని గురి పెట్టిన మొత్తం 24 షాట్లలో 20 షాట్లు 10 కంటే ఎక్కువ పాయింట్లవి ఉండటం విశేషం. అంతకుముందు 21 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్లో అవని 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. సూపర్ సుమిత్... బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్లోనే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ కాంతులను విరజిమ్మాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్ బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను మూడు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. హరియాణాకు చెందిన సుమిత్ బల్లెంను తొలి ప్రయత్నంలో 66.95 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2019లో దుబాయ్లో 62.88 మీటర్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సుమిత్ సవరించాడు. అనంతరం రెండో ప్రయత్నంలో సుమిత్ జావెలిన్ను 68.08 మీటర్ల దూరం పంపించాడు. ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్ల దూరం... నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరం విసిరిన సుమిత్ ఐదో ప్రయత్నంలో జావెలిన్ను 68.55 మీటర్ల దూరం విసిరి మూడోసారి ప్రపంచ రికార్డు సవరించడంతోపాటు పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు. సుమిత్కు రూ. 6 కోట్లు నజరానా పారాలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. -
స్వర్ణంతో సుమిత్ చరిత్ర సృష్టించాడు ఫొటోలు
-
సుమిత్ అంటిల్కు ప్రధాని మోదీ ఫోన్.. భావోద్వేగ వీడియో
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సుమిత్కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. "నీ ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చావు. ఈ విజయంతో భారతదేశ యువత నీ నుంచి అద్భుతమైన స్ఫూర్తిని పొందుతారు. సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది. సుమిత్ ఇలాగే భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి అని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమిత్ అంటిల్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం జావెలిన్ త్రో ఈవెంట్లో తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. చదవండి: Sumit Antil: సుమిత్ అంటిల్కు సీఎం జగన్ అభినందనలు That special moment when India’s 🇮🇳 Prime Minister calls to congratulate you… Just after you’ve won the #Paralympics GOLD🥇 and broken the world record… Well Done Sumit Antil !#Praise4Para #Cheer4India | @narendramodi @Media_SAI @PIB_India | pic.twitter.com/pZapR2bbAm — Anurag Thakur (@ianuragthakur) August 30, 2021 -
Sumit Antil: సుమిత్ అంటిల్కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. '' పారాలింపిక్స్లో స్వర్ణం సాధించినందుకు సుమిత్కు శుభాకాంక్షలు. నీ స్వర్ణంతో దేశానికి ఒకేరోజు రెండు బంగారు పతకాలు రావడం ఆనందం కలిగించింది. జావెలిన్ త్రోలో మూడు ప్రయత్నాల్లోనూ అద్బుత ప్రదర్శన చేసి కొత్త రికార్డు సృష్టించావు. నీ కెరీర్ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Sumit Antil for adding another #Gold medal to India's count at #TokyoParalympics and setting a new world record for each of the three attempts in the same event. @ParalympicIndia — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 ఇక టోక్యో పారాలింపిక్స్లో మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. చదవండి: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు టోక్యో పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత పారాఅథ్లెట్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖారా, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జావెలిన్ త్రోలో రెండవ స్వర్ణ పతకం సాధించినందుకు సుమిత్ ఆంటిల్, హైజంప్లో వెండి పతకం సాధించిన నిషద్ కుమార్, పురుషుల డిస్కస్ త్రోలో వెండి పతకం సాధించిన యోగేష్ కథునియా, జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన దేవేంద్ర జారియా, కాంస్య పతకం పొందిన సుందర్ సింగ్ గుర్జార్లకు శుభాకాంక్షలు తెలిపారు. -
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
-
పారా ఒలింపిక్స్ విజేతలకు ప్రధాని ఫోన్ కాల్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్ చేసి.. యోగేశ్ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు. 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట.. -
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించాడు. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే ఈవెంట్లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్ సందీప్ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: Avani Lekhara: ‘గోల్డెన్ గర్ల్’ విజయంపై సర్వత్రా హర్షం సుమిత్ సాధించిన పతకంతో కలిసి పారాలింపిక్స్లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు. చదవండి: Yogesh Kathuniya: కోచ్ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు What a start to the evening @ParaAthletics session 🤩 Sumit Antil throws a World Record on the first throw of the day, can anyone top that?#ParaAthletics #Tokyo2020 #Paralympics pic.twitter.com/cLB5qHYQ61 — Paralympic Games (@Paralympics) August 30, 2021 -
కోచ్ లేకుండానే పతకం సాధించిన అభినవ ఏకలవ్యుడు
టోక్యో: పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఈవెంట్లో 44.38 మీటర్లు డిస్కస్ను విసిరి రజత పతకం సాధించిన యోగేశ్ కతునియాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ 24 ఏళ్ల అథ్లెట్.. కోచ్ లేకుండానే పతకం సాధించి దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తెలిసుకున్న క్రీడాభిమానలు యోగేశ్ను అభినవ ఏకలవ్యుడిగా అభివర్ణిస్తున్నారు. పతకం సాధించిన సందర్భంగా యోగేశ్ మాట్లాడుతూ.. చాలాకాలంగా కోచ్ లేకుండానే సాధన చేశానని, ఈసారి స్వర్ణం తృటిలో చేజారినా(మీటర్ తేడాతో) బాధలేదని, ప్యారిస్ పారాలింపిక్స్లో మాత్రం ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మాటలు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సాధన చేసేందుకు యోగేశ్ గత రెండేళ్లుగా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కఠోరంగా సాధన చేసిన అతను.. ఖాళీ స్టేడియాల్లో, మార్గనిర్దేశకుడు లేకుండానే ఒంటరిగా సాధన చేశాడు. ఇలా ఎవరి సహాయ సహకారాలు లేకుండా పారాలింపిక్స్లో పతకం సాధించి భవిష్యత్తు తరం క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడు. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల వయసులోనే యోగేశ్కు పక్షవాతం వచ్చి శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా పోయాయి. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అతను.. ఎన్నో అడ్డంకులను అధిగమించి పారాలింపిక్స్కు సిద్ధమయ్యాడు. గురువు లేకుండానే పతకం గెలిచి క్రీడాభిమానల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. చదవండి: వినోద్ కుమార్కు భంగపాటు.. కాంస్య పతకాన్నిరద్దు చేసిన నిర్వాహకులు -
వినోద్ కుమార్కు భంగపాటు.. కాంస్య పతకాన్ని రద్దు చేసిన నిర్వాహకులు
టోక్యో: పారాలింపిక్స్ పురషుల డిస్కస్ త్రో(F52) కేటగిరీలో ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వినోద్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్లో ఉంచారు. అయితే, ఇవాళ ఫిర్యాదును సమీక్షించిన నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చి అతను గెలుచుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని టోక్యో పారాలింపిక్స్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. కాగా, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avani Lekhara: భారత 'అవని' పులకించింది.. -
అవని లేఖరాకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన షూటర్ అవని లేఖరాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించి క్రీడా ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించారంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రాణిస్తూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా పారాలింపిక్స్లో సత్తా చాటుతున్న క్రీడాకారులందరికీ సీఎం జగన్ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టోక్యోలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడారు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 7 పతకాలు చేరాయని, మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: వెన్నుపూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితం.. ఇప్పుడు ‘గోల్డెన్ గర్ల్’గా Congratulations @AvaniLekhara on becoming the first Indian woman to win a #Paralympics #Gold medal. With this record breaking performance you have created landmark for Indian sports and athletics. May you keep shining and bring more glory to the country. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 -
అవనికే తొలి ప్రత్యేక ఎస్యూవీ: ఆనంద్ మహీంద్ర ఆఫర్
సాక్షి,ముంబై: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదవండి : Avani Lekhara: గోల్డెన్ గర్ల్ విజయంపై సర్వత్రా హర్షం పారా ఒలింపిక్స్ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA — anand mahindra (@anandmahindra) August 30, 2021 Impressed with this technology.Sincerely hope Automobile world in India can give us this dignity and comfort.. I love to drive big SUVs but getting in and out is a challenge, Give me this seat n I buy your SUV @anandmahindra @TataCompanies @RNTata2000 @MGMotorIn #Tokyo2020 pic.twitter.com/0yFGwvl46V — Deepa Malik (@DeepaAthlete) August 20, 2021 -
స్వర్ణంతో చరిత్ర, ‘గోల్డెన్ గర్ల్’కు అభినందనల వెల్లువ
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరడమే కాకుండా పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా 19 ఏళ్ల అవని రికార్డు నెలకొల్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి : Avani Lekhara: ఆనంద్ మహీంద్ర స్పెషల్ ఆఫర్ ‘‘అద్భుతం..భారతీయ క్రీడలకు ఇది నిజంగా ప్రత్యే సందర్భం. షూటింగ్ పట్ల ఉన్న మక్కువ, నిబద్ధత, కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ’’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అవనిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. సోమవారం టోక్యో పారా లింపిక్స్లో పతకాల వర్షం కురుస్తోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించిన అవని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అవని గోల్ట్తో టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరడం విశేషం. చదవండి: Tokyo Paralympics: స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా అవని రికార్డు Congratulations @AvaniLekhara 👏 for wining #gold for #IND in #Paralympics #Praise4Para #Cheers4India #Hindustaniway @ananya_birla #AvaniLekhara — A.R.Rahman #99Songs 😷 (@arrahman) August 30, 2021 Phenomenal performance @AvaniLekhara! Congratulations on winning a hard-earned and well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) August 30, 2021 History!! History!! History!! Avani Lekhara became the first ever Indian woman to win a GOLD MEDAL 🏅 in #Paralympics She won Gold in the 10M Air Rifle event.#AvaniLekhara #Tokyo2020 #Avani #Gold #Teamindia https://t.co/8L0TDGni2y pic.twitter.com/hxfujeOl8j — Rishikesh Sharma (@kop_sports) August 30, 2021 #Paralympics#Praise4Para India's FIRST GOLDDDDD!!! 🇮🇳 @AvaniLekhara wins in Women's 10m AR Standing SH1 Final - she has shot 249.6 - a Paralympic record !! pic.twitter.com/etFEERYxbF — Aslam Gurukkal (@AslamGurukkal) August 30, 2021 -
Avani Lekhara: భారత 'అవని' పులకించింది..
AVANI LEKHARA Wins Gold Medal: టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో అవని 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఫైనల్లో అవని ఏకంగా 249.6 రికార్డు స్కోర్తో స్వర్ణాన్ని సాధించి భారతావనిని పులకింపజేసింది. అవని గోల్ట్తో టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకం హోల్డ్లో పెట్టడంతో అధికారికంగా భారత పతకాల సంఖ్య ఆరుగా ఉంది. ఇదిలా ఉంటే, జైపుర్కి చెందిన 19 ఏళ్ల అవని లేఖారా.. పదేళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. నడుము కింద భాగం చచ్చుబడిపోవడంతో ఆమె నరకం అనుభవించింది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. ఈ బాధను తనలో తానే దిగమింగుకున్న అవని.. ఏదైనా రంగంలో పట్టు సాధించాలని అప్పుడే నిర్ణయించుకుంది. తండ్రి సూచన మేరకు ఆర్చరీ, షూటింగ్లలో శిక్షణ పొందింది. శిక్షణలో రైఫిల్ని తొలిసారి తాకినప్పుడే అవని ఈ రంగంలో ఎలాగైనా రాణించాలని డిసైడ్ చేసుకుంది. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఎ షాట్ ఎట్ హిస్టరీ' పుస్తకం ఆమెలో స్పూర్తిని రగిల్చింది. అది చదివాక ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత రైఫిల్ కూడా లేక కోచ్ దగ్గర అరువు తెచ్చుకుని శిక్షణ ప్రారంభించిన అవని.. మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు పతకాలు సాధించింది. ఇక 2017లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ పోటీల్లో రజతాన్ని సాధించిన అవని అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. సరైన శిక్షణ, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేస్తూ.. పాల్గొన్న ప్రతి పోటీలో ఏదో ఒక పతకం సాధిస్తూ వచ్చింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం సాధించి తన కలను నెరవేర్చుకుంది. టోక్యో పారాలింపిక్స్లో భారత పతకధారులు: 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్త్రో) 7. వినోద్ కూమార్- కాంస్య పతకం(హోల్డ్) (డిస్కస్ త్రో) చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
టోక్యో పారా ఒలింపిక్స్లో ఇవాళ ఒక్కరోజే భారత్కు 4 పతకాలు
-
Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. జావిలన్త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అంతకు ముందు పారా ఒలింపిక్స్ భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవేంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్త్రో) చదవండి: Tokyo Paralympics 2021:పారా ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం -
పారా ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. పారా ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన అవని లేఖారాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిజంగా ఇది భారత క్రీడా రంగానికి స్పెషల్ మూమెంట్ అని మోదీ ట్వీట్ చేశారు. Phenomenal performance @AvaniLekhara! Congratulations on winning a hard-earned and well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) August 30, 2021 -
భవీనాకు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా
రజత పతకంతో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్కు స్వరాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ‘దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్’లో భాగంగా భవీనాకు రూ. 3 కోట్లు అందజేయనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘భవీనాకు అభినందనలు. మీ అద్భుత ప్రదర్శనతో యావత్ దేశం గర్వపడుతోంది’ అని గుజరాత్ సీఎం విజయ్ రుపానీ కొనియాడారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య భవీనాకు రూ. 31 లక్షల నజరానా అందజేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు భవీనాకు త్వరలో మార్కెట్లో విడుదల కానున్న ఆస్టర్ ఎస్యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎంజీమోటార్స్ ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల్లో కలిపి భారత్ తరఫున పతకం గెలిచిన తొమ్మిదో మహిళా క్రీడాకారిణి భవీనా. సమ్మర్ ఒలింపిక్స్లో మల్లీశ్వరి (వెయిట్లిఫ్టింగ్; 2000 సిడ్నీ–కాంస్యం), సైనా (బ్యాడ్మింటన్; 2012 లండన్–కాంస్యం), మేరీకోమ్ (బాక్సింగ్; 2012 లండన్–కాంస్యం), సింధు (బ్యాడ్మింటన్; 2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), సాక్షి మలిక్ (రెజ్లింగ్; 2016 రియో–కాంస్యం), మీరాబాయి (వెయిట్లిఫ్టింగ్; 2020 టోక్యో–రజతం), లవ్లీనా (బాక్సింగ్; 2020 టోక్యో–కాంస్యం)... పారాలింపిక్స్ లో దీపా మలిక్ (షాట్పుట్; 2016 రియో–రజతం) పతకాలు సాధించారు. -
డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినా...
పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 కేటగిరీలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. కోసెవిచ్ (పోలాండ్– 20.02 మీటర్లు) స్వర్ణం... సాండోర్ (క్రొయేషియా–19.98 మీటర్లు) రజతం గెల్చుకున్నారు. అయితే ప్రత్యర్థులు వినోద్ ఎఫ్–52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు చేశారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయయ లోపం ఉన్నవారు ఎఫ్–52 కేటగిరీలోకి వస్తారు. ‘నిర్వాహకులు 22వ తేదీన వినోద్ను పరీక్షించి అతను ఎఫ్–52 విభాగంలో పోటీపడవచ్చని నిర్ణయించారు. నేడు ఫిర్యాదును సమీక్షించి ఫలితాన్ని ప్రకటిస్తారు’ అని భారత చెఫ్ డి మిషన్ గురుశరణ్ సింగ్ వివరించారు. -
నిశాద్ సూపర్ జంప్...
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్లో 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్ వైజ్ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్ టౌన్సెండ్ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. చేయి లేకపోతేనేం... మన దైనందిన పనులు చక్కబెట్టేదే కుడి చేయి. అలాంటి చేతినే కోల్పోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కష్టమైనా, ఓ చేయి లేకపోయినా పతకం గెలవడం నిజంగా విశేషమే కదా! హిమాచల్ ప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ అదేపని చేశాడు. నిశాద్ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఉనా జిల్లాలోని అంబ్ గ్రామంలో సాగుబడే వారి జీవనాధారం. 8 ఏళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నిశాద్ గడ్డికోసే యంత్రంలో గడ్డిని కత్తిరిస్తుండగా కుడి చేయి తెగిపడింది. అప్పుడు విలవిల్లాడిన ఆ బాలుడు రెండేళ్లకే క్రీడాశిక్షణపై దృష్టిపెట్టాడు. స్కూల్ గ్రౌండ్లో హైజంప్లో ప్రాక్టీస్ చేసేవాడు. జాతీయ స్కూల్ గేమ్స్లో ఏకంగా సాధారణ అథ్లెట్లతో పోటీపడి పదో స్థానంలో నిలిచాడు. పాఠశాల విద్య అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచ్కులాలోని దేవిలాల్ స్టేడియంలో హైజంప్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే నిశాద్ పారాథ్లెట్గా ఎదిగాడు. 2019లో తొలి సారి దుబాయ్లో పోటీపడ్డాడు. అక్కడ జరిగిన ఫజార్ పారాథ్లెటిక్స్ గ్రాండ్ప్రిలో అతను టి47 కేటగిరీ హైజంప్లో 1.92 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. అనంతరం అక్కడే జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో 1.94 మీటర్ల జంప్తో కాంస్యం సాధించాడు. దీంతోనే టోక్యో పారాలింపిక్స్ కోటా దక్కింది. గత ఏడాది కాలంగా రెండుసార్లు కోవిడ్ బారిన పడినా కూడా ప్రాక్టీస్ను అలక్ష్యం చేయలేదు. నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో తాజాగా దివ్యాంగుల విశ్వక్రీడల్లో రజత పతకం గెలిచాడు. -
Bhavinaben Patel: రజత సంబరం
జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ పటేల్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–47 విభాగంలో నిశాద్ కుమార్ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 విభాగంలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు. టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్ క్లాస్–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్వన్ యింగ్ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో యింగ్ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్ దశలోనూ యింగ్ జౌతో జరిగిన మ్యాచ్లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్లో పోటీపడిన గుజరాత్కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది. రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు. –భవీనాబెన్ పటేల్ విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది. –ప్రధాని మోదీ -
పారాలింపిక్స్ పతకధారులకు ఏపీ సీఎం అభినందనలు
అమరావతి: టోక్యో పారా ఒలంపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు భవీనాబెన్(మహిళల టేబుల్ టెన్నిస్లో రజతం), నిషద్ కూమార్(పురుషుల హై జంప్లో రజతం), వినోద్ కూమార్(పురుషుల డిస్కస్ త్రోలో కాంస్యం)లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వీరు సాధించిన పతకాలు దేశం యావత్తుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
వినోద్ కూమార్కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం
Update: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కూమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో పారాలింపిక్స్లో ఒకేరోజు మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు. దీంతో నిషద్ కుమార్ రజతం కైవసం చేసుకున్నాడు.మరో వైపు ఆదివారం భవీనా బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించింది. పారాలింపిక్స్లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పురుషల హై జంప్ టీ47 విభాగంలో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to Nishad kumar for winning silver 🇮🇳🇮🇳… Great work 🙏🙏#TokyoParalympics #Tokyo2020 … https://t.co/hQQ9PvK4M7 — Saina Nehwal (@NSaina) August 29, 2021 More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics A JUMP TO #SILVER! 😍 Asian record holder Nishad Kumar jumps 2.06m in Men's High Jump T47 Final to earn #IND's second medal of the day - setting another new Asian record along the way! 🤩#Tokyo2020 #Paralympics #ParaAthletics @nishad_hj pic.twitter.com/t3M5VZdL68 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 — Narendra Modi (@narendramodi) August 29, 2021 India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics — Narendra Modi (@narendramodi) August 29, 2021 చదవండి: మరో టీమ్కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
భవీనా పటేల్కు రజతం.. ప్రముఖుల ప్రశంసల వెల్లువ
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో రజతం సాధించిన భవీనాబెన్ పటేల్పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకొని పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రజతం సాధించిన భవీనా పటేల్కు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ 2020 లో కృషి, పట్టుదల, సంకల్పంతో రజత పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావినాబెన్ పటేల్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. పటేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసారన్నారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడలలో టేబుల్ టెన్నిస్లో ఆమె సాధించిన రజత పతకం దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. చదవండి: పారాలింపిక్స్లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ► పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics "...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY — ANI (@ANI) August 29, 2021 ► భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తుంది - ప్రధాని నరేంద్ర మోదీ PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics "The remarkable Bhavina Patel has scripted history! ...Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7 — ANI (@ANI) August 29, 2021 ► టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics pic.twitter.com/89CCkOUhR6 — Vice President of India (@VPSecretariat) August 29, 2021 -
పారాలింపిక్స్లో భారత్కు తొలి పతకం
-
శెబ్బాష్ భవీనా.. ఈమె జీవితం నేర్చుకోవాల్సిన పాఠం
Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా డైలాగ్. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. సాక్షి, వెబ్డెస్క్: టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో విజయాలు సాధించింది. చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్ పటేల్కు రజతం An accomplishment that will echo through #IND 🗣️ Bhavina Patel receives her medal as she wins the nation's first #silver in #ParaTableTennis at the #Tokyo2020 #Paralympics ❤️pic.twitter.com/l4xzgHpYWK — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 పోలియో బారిన పడి... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
Tokyo Paralympics: పారాలింపిక్స్లో భారత్కు తొలి పతకం
టోక్యో: పారాలింపిక్స్లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓడిన భవీనాబెన్ పటేల్ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్లో భారత్కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. పారాలింపిక్స్లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భవీనాబెన్ పటేల్ను అభినందించారు. చదవండి: సీజన్లో తొలి టైటిల్కు విజయం దూరంలో... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. చదవండి: మూడో టెస్టులో టీమిండియా పరాభవం -
Paralympics 2021: చరిత్రకు చేరువలో...
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా) వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించేందుకు టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్కు స్వర్ణావకాశం దక్కింది. టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 మహిళల సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ ఫైనల్కు అర్హత సాధించింది. చైనా ప్లేయర్ యింగ్ జౌతో నేడు జరిగే తుది పోరులో భవీనా గెలిస్తే బంగారు పతకంతో కొత్త చరిత్ర లిఖిస్తుంది. టోక్యో: ఏమాత్రం అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పసిడి కాంతులు విరజిమ్మేందుకు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 34 ఏళ్ల ఈ గుజరాతీ మహిళ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను బోల్తా కొట్టిస్తూ ఏకంగా పసిడి పతకం పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన క్లాస్–4 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భవీనా 7–11, 11–7, 11–4, 9–11, 11–8 తో 2012 లండన్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 2014 ప్రపంచ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ మియావో జాంగ్ (చైనా)పై నెగ్గింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్ నంబర్వన్ యింగ్ జౌతో భవీనాబెన్ తలపడుతుంది. తుది పోరులో గెలిస్తే భవీనాబెన్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో సెమీఫైనల్లో యింగ్ జౌ 11–4, 11–3, 11–6తో జియోడాన్ జు (చైనా)పై గెలిచింది. చదవండి: వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్ లెక్క సరిచేసింది... గతంలో మియావో జాంగ్తో ఆడిన 11 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భవీనాబెన్ ఈసారి మాత్రం అదరగొట్టింది. తొలి గేమ్ను కోల్పోయినా నిరాశ చెందకుండా ఆడిన భవీనా రెండో గేమ్ను, మూడో గేమ్ను సొంతం చేసుకొని 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్లో మియావో గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో గేమ్లో భవీనాబెన్ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. 9–5తో ఆధిక్యంలోకి వచ్చి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే మియావో వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో ఆధిక్యాన్ని ఒక పాయింట్కు తగ్గించింది. అయితే కీలకదశలో భవీనాబెన్ నిగ్రహం కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చదవండి: మూడో టెస్టులో భారత్కు పరాభవం రాకేశ్ ముందంజ... మరోవైపు పురుషుల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... శ్యామ్ సుందర్ స్వామి రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్లో ఆడిన రాకేశ్ కుమార్ 144–131తో కా చుయెన్ ఎన్గాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో శ్యామ్ 139–142తో మ్యాట్ స్టుట్జ్మన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రంజీత్ విఫలం... పురుషుల అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఎఫ్–57 కేటగిరీ లో భారత ప్లేయర్ రంజీత్ భాటి నిరాశపరిచాడు. రంజీత్ తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు. రంజీత్ ఆరు త్రోలూ ఫౌల్ కావడంతో ఫైనల్లో పాల్గొన్న 12 మందిలో అతను చివరి స్థానంలో నిలిచాడు. పతకం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే నేను టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగాను. వందశాతం శ్రమిస్తే తప్పకుండా పతకం వస్తుందని భావించాను. ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ పోరాడితే స్వర్ణం గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. పోలియో కారణంగా నా కాళ్లు అచేతనంగా మారిపోయినా ఏనాడూ నేను దివ్యాంగురాలిననే ఆలోచన మనసులోకి రానీయలేదు. చైనా క్రీడాకారిణులను ఓడించడం అంత సులువు కాదని చెబుతుంటారు. కానీ పట్టుదలతో పోరాడితే ఎంతటి మేటి క్రీడాకారిణులనైనా ఓడించగలమని నిరూపించాను. –భవీనా పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ మహిళల ఆర్చరీ కాంపౌండ్ ఎలిమినేషన్ రౌండ్: జ్యోతి X కెరీ (ఐర్లాండ్); ఉ. గం. 6:55 నుంచి మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్–4 సింగిల్స్ ఫైనల్: భవీనా X యింగ్ జౌ (చైనా); ఉ. గం. 7:15 నుంచి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ X థాయ్లాండ్; ఉదయం గం. 9 నుంచి అథ్లెటిక్స్ పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 ఫైనల్: వినోద్ కుమార్; మధ్యాహ్నం గం. 3:54 నుంచి. అథ్లెటిక్స్ పురుషుల హైజంప్ ఎఫ్–47 ఫైనల్: నిశాద్, రామ్పాల్; మధ్యాహ్నం గం. 3:58 నుంచి. దూరదర్శన్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్ ఫైనల్స్కు భవీనాబెన్
టోక్యో: పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భవీనాబెన్ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి లయలో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. -
Tokyo Paralympics 2021: భారత్కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న గుజరాత్కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్పుట్లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్లో అథ్లెట్ దీపా మలిక్ షాట్పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
Ram Nath Kovind: దేశమంతా గర్వపడుతోంది
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు. ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు.