tri series
-
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్లన్నీ డే మ్యాచ్లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్కప్కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్తో తలపడనుంది. -
'పాక్ కెప్టెన్కు కొంచెం కూడా తెలివి లేదు.. అదొక చెత్త నిర్ణయం'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు పాకిస్తాన్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన కరాచీ వేదికగా జరిగిన పైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. అయితే ఓ దశలో కివీస్కు గట్టిపోటీ ఇచ్చిన పాక్ జట్టు.. ఆ తర్వాత సొంత తప్పిదాల వల్ల మ్యాచ్పై పట్టుకోల్పోయింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన పాక్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో కూడా బ్లాక్ క్యాప్స్ చేతిలోనే పాక్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ అండ్ కోపై పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆట తీరు ఎలా ఉందో తేటతెల్లమైందని షెహజాద్ మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ జట్టు ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచింది."టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఘోర తప్పిదంగా పరిగణించాలి. నిజంగా అదొక చెత్త నిర్ణయం. ఎందుకంటే ఈ వేదికలో జరిగిన గత మ్యాచ్లో పిచ్ రాత్రిపూట బ్యాటింగ్కు అనుకూలించడం మనం చూశాము. తేమ ఎక్కువగా వల్ల స్పిన్నర్లు కూడా పట్టు సాధించలేకపోయారు. అందువల్ల బంతి చక్కగా బ్యాట్పైకి వచ్చింది.అయినప్పటికి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అస్సలు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎందుకు నాకు ఆర్దం కావడం లేదు. ఇదొక్కటే కాదు ఈ మ్యాచ్లో చాలా తప్పులు చేశారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మరీ చైల్డీష్గా ఉన్నాయి. ప్రత్యర్థి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే మనం విజయం సాధించే అవకాశముంటుంది.అంతేకాకుండా జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సైతం రాణించాల్సిన అవసరముంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సమస్యలు ఎదుర్కొకతప్పదు అని షెహజాద్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.బాబర్ మళ్లీ ఫెయిల్.. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్తో 45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.కానీ బాబర్ ఆజం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి ఆజం పెవిలియన్కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మైకేల్ బ్రేస్వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 243 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు డెవాన్ కాన్వే (74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కూడా రాణించాడు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
ట్రై సిరీస్ ఫైనల్.. చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాక్
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.పాక్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్లో పాక్, న్యూజిలాండ్తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్లు ఆడాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో బ్రీట్జ్కీ ఈ ఫీట్ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్లో తొలి మ్యాచ్కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్తో తలపడుతుంది.న్యూజిలాండ్తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్తో మ్యాచ్కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
నెదర్లాండ్స్కు షాకిచ్చిన కెనడా
నెదర్లాండ్స్ ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నెదర్లాండ్స్.. కెనడా చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో భాగంగా నిన్న (ఆగస్ట్ 26) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటంగ్కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్కు ఇది తొలి పరాజయం కాగా.. కెనడాకు తొలి విజయం. ఈ టోర్నీలో పాల్గొంటున్న మరో జట్టు యూఎస్ఏ. ఆ జట్టు ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.రాణించిన శ్రేయస్, జాఫర్తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా శ్రేయస్ మొవ్వ (33), సాద్ బిన్ జాఫర్ (33) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. కెనడా ఇన్నింగ్స్లో ఆరోన్ జాన్సన్, పఠాన్, రవీంద్రపాల్ డకౌట్లు కాగా.. నికోలస్ కిర్టన్ 13, హర్ష్ థాకర్ 10, పర్వీన్ కుమార్ 4, అఖిల్ కుమార్ 9, డిల్లన్ హేలిగర్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. డచ్ బౌలర్లలో కైల్ క్లెయిన్, వాన్ మీకెరెన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. డొరామ్ 2, విక్రమ్జీత్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన కెనడా బౌలర్లు133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది.పర్వీన్ కుమార్, కలీమ్ సనా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హేలిగర్, సాద్ బిన్ జాఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో నోవహా క్రోయిస్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ కైవసం
నేపాల్లో జరిగిన ముక్కోణపు సిరీస్ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. నేపాల్తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ వాన్ డర్ గుగ్టెన్ చివరి ఓవర్ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్గా మలిచి నెదర్లాండ్స్ను గెలిపించాడు. గుగ్టెన్ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్ను విజయతీరాలకు చేర్చాడు. The Nepal crowd is simply amazing in every manner! 🇳🇵pic.twitter.com/giCO1hA1oE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 గుగ్టెన్ మెరుపు ఇన్నింగ్స్కు ముందు సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. Netherlands' victory lap. - Nepal fans cheering and applauding them in numbers. 👏pic.twitter.com/uc8ch0XO52 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (47), గుల్సన్ ఝా (34), కుశాల్ మల్లా (26), రోహిత్ పౌడెల్ (25), కుశాల్ భుర్టెల్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. లెవిట్ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్ (48), గుగ్టెన్ (21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ ఓడౌడ్ (22), విక్రమ్జిత్ సింగ్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సిరీస్లో నేపాల్, నెదర్లాండ్స్తో పాటు నమీబియా పాల్గొంది. -
నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్
స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్ (50) అర్దసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. ఆఖర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్పాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
నేపాల్ బ్యాటర్ల వీరోచిత పోరాటం
నేపాల్ టీ20 ట్రై సిరీస్లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడి నేపాల్ను విజయానికి చేరువ చేశారు. అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్లో 9 పరుగులు, 18వ ఓవర్లో 18, 19వ ఓవర్లో 15, 20వ ఓవర్లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు. ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. విండీస్పై ఘన విజయం
Womens T20I Tri Series South Africa 2023: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో (వర్షం కారణంగా ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత్.. ఇవాళ (జనవరి 30) విండీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (4-2-11-3), పూజా వస్త్రాకర్ (4-1-19-2) గైక్వాడ్ (4-1-9-1) బౌలింగ్లో సత్తా చాటడంతో విండీస్ను 94 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) నియంత్రించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (34) విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా నిలిచింది. 95 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. జెమీమా రోడ్రిగ్స్ (42 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (32 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో రాణించడంతో 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి మంధన (5), హర్లీన్ డియోల్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. విండీస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో సంబంధం లేకుండా ఇదివరకే ఫైనల్కు చేరిన భారత్.. ఫిబ్రవరి 2న టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. -
Ind Vs Pak: భారత్తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
NZ- Ban- Pak Tri Series- T20 World Cup 2022- India Vs Pakistan: క్రికెట్ ప్రేమికుల హాట్ ఫేవరెట్ మ్యాచ్లలో అన్నింటి కంటే ముందు వరుసలో ఉండేది ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండటంతో దాయాదుల పోరుపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రెండు సార్లు తలపడిన రోహిత్ సేన- బాబర్ ఆజం బృందం.. టీ20 వరల్డ్కప్-2022లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న టీమిండియా- పాక్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఈ మెగా పోరుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహా ఇతర ఆటగాళ్లు.. మైండ్గేమ్ మొదలుపెట్టారు. టీమిండియాతో మ్యాచ్ కోసం ఇలా.. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్లో ట్రై సిరీస్ ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా భాగమైన ఈ సిరీస్లో కివీస్- పాక్ ఫైనల్కు చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్-2022 కోసం ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలోనే తాము ఈ సిరీస్లో పాల్గొన్నట్లు వెల్లడించాడు. ‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. అయితే, ఇలాంటి మ్యాచ్లో ప్రశాంతమైన మైండ్సెట్తో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మెరుగ్గా ఆడగలం. ఇండియాతో మ్యాచ్లో కచ్చితంగా పూర్తిస్థాయిలో.. వందకు వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’ అని తమ ప్రణాళిక గురించి చెప్పాడు. ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహం అదే విధంగా న్యూజిలాండ్లో ట్రై సిరీస్లో ఆడటం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని.. ఈ సిరీస్ ద్వారా మెగా టోర్నీకి ముందు తమకు మంచి అవకాశం దొరికింది అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా ట్రై సిరీస్లో భాగంగా శుక్రవారం (అక్టోబరు 14) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్లో కనీవినీ ఎరుగని రీతిలో ‘కోహ్లి సేన’ పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈలో పాకిస్తాన్తో మ్యాచ్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. చదవండి: Babar Azam: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ T20 WC 2022: మెగా టోర్నీలో అరుదైన ఘనతల ముంగిట రోహిత్ శర్మ! అదే జరిగితే రికార్డులన్నీ బద్దలే! -
జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక జర్నలిస్టు అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 173 పరగుల టార్గెట్ను 19.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అర్థసెంచరీలతో చెలరేగగా..మహ్మద్ నవాజ్ 45 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్ జట్టుకు ఈ మధ్య కాలంలో ఫైనల్ మ్యాచ్లు పెద్దగా కలిసిరావడం లేదు. ముందుగా ఆసియా కప్ చూసుకుంటే శ్రీలంకతో జరిగిన ఫైనల్లో బోల్తా కొట్టిన పాక్ చివరికి రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ను 4-3తో కోల్పోయింది. అయితే తాజాగా టి20 ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో జరుగుతున్న ట్రై సిరీస్లో పాకిస్తాన్ మరోమారు ఫైనల్కు చేరింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం బాబర్ ఆజం ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ''మీరు ఒక కెప్టెన్గా అన్ని ఫైనల్స్ ఓడిపోతున్నారు.. మరి ఈసారి ఫైనల్ గెలుస్తారన్న నమ్మకం ఉందా'' అంటూ ఒక జర్నలిస్టు తిక్క ప్రశ్న వేశాడు. దీంతో మండిపోయిన బాబర్ ఆజం.. ''మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. మ్యాచ్లో గెలుపోటములు సహజం.. ఫైనల్ మ్యాచ్ గెలుస్తామా లేదా అన్నది ముందే ఎలా చెప్పగలం. ఆట ఆడడం మా నైతిక ధర్మం.. అంతేకానీ విజయం అనేది మా చేతుల్లో రాసిపెట్టిలేదు. వంద శాతం గెలిచేందుకే ప్రయత్నిస్తాం.. ఓడిపోతే మేం ఏం చేయగలం.. ప్రతీదాన్ని భూతద్దంలో చూడకండి'' అంటూ బదులిచ్చాడు. ఇక ట్రై సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో టీమిండియాను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!
న్యూజిలాండ్ ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ట్రై సిరీస్ ఆడడంలో బిజీగా ఉంది. టి20 ప్రపంచకప్కు మంచి ప్రాక్టీస్లా ఉపయోగపడుతున్న ఈ ట్రై సిరీస్లో ఇప్పటికే బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్, కివీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్లో నజ్ముల్ షాంటో ఇచ్చిన సులువైన క్యాచ్ను న్యూజిలాండ్ ఆటగాళ్లు వదిలేశారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన గుడ్లెంగ్త్ బంతిని షాంటో గాల్లోకి లేపాడు. అంతే క్యాచ్ తీసుకోవడానికి ఏకకాలంలో నలుగురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. చూసినవాళ్లు కచ్చితంగా ఆ నలుగురిలో ఎవరో ఒకరు క్యాచ్ తీసుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పట్టుకోలేదు. దీంతో బౌల్ట్.. ఏంటిది అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ 48 పరుగులతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్ కాన్వే(40 బంతుల్లో 64 పరుగులు), గ్లెన్ పిలిప్స్(24 బంతుల్లో 60 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుప్టిల్ 34, ఫిన్ అలెన్ 32 పరుగులతో రాణించారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబ్ అల్ హసన్ (44 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోవడంతో ఈ టోర్నీలోని మూడో జట్టు పాకిస్తాన్ కూడా ఫైనల్ చేరింది. నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ఉంది. No way 😂😭😂pic.twitter.com/UMIfm8zeMG — Out Of Context Cricket (@GemsOfCricket) October 12, 2022 చదవండి: తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు రక్తం కళ్ల చూసిన ఫుట్బాల్ మ్యాచ్.. వీడియో వైరల్ -
NZ Vs Ban: దంచి కొట్టిన ఫిలిప్స్.. బంగ్లా అవుట్! ఫైనల్లో న్యూజిలాండ్తో పాటు..
New Zealand T20I Tri-Series 2022- New Zealand vs Bangladesh, 5th Match: న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ త్రైపాక్షిక టీ20 సిరీస్లో భాగంగా ఆతిథ్య కివీస్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. క్రైస్ట్చర్చ్ వేదికగా బుధవారం (అక్టోబరు 12) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది. 48 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన సౌథీ బృందం.. ఫైనల్లో పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్కప్-2022 సన్నాహకాల్లో భాగంగా అక్టోబరు 7న కివీస్, పాక్, బంగ్లా జట్ల మధ్య ట్రై సిరీస్ ఆరంభమైంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్లలో పాకిస్తాన్ రెండింట.. ఆతిథ్య న్యూజిలాండ్ మూడింట గెలుపొంది ఫైనల్కు అర్హత సాధించాయి. ఇక ఈ టూర్లో బంగ్లాదేశ్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తాజాగా కివీస్తో జరిగిన మ్యాచ్లోనూ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దంచికొట్టిన గ్లెన్ ఫిలిప్స్ క్రైస్ట్చర్చ్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది షకీబ్ అల్ హసన్ బృందం. బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు ఫిన్ అలెన్(32), డెవాన్ కాన్వే(64) అదిరిపోయే ఆరంభం అందించారు. వన్డౌన్లో వచ్చిన మార్టిన్ గప్టిల్ సైతం 34 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 24 బంతుల్లో 2 బౌండరీలు, 5 సిక్స్లు బాది 60 పరుగులు సాధించాడు. 🔊 Well taken in the crowd! Glenn Phillips with back to back sixes in the 16th over. Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvBAN pic.twitter.com/dSnyIyvUVH — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 షకీబ్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా ఈ మేరకు బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు మెరుగైన ఆరంభం లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన షకీబ్ అల్ హసన్ 44 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నా.. లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలైంది. దీంతో 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిని మూటగట్టుకుంది బంగ్లాదేశ్. కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీకి రెండు, ఆడం మిల్నేకు మూడు, మైఖేల్ బ్రాస్వెల్కు రెండు వికెట్లు దక్కాయి. Full and straight! Adam Milne strikes with his third ball LIVE in NZ on @sparknzsport 🔥 #NZvBAN pic.twitter.com/326Q4EQOuh — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ ఇక అద్భుత ఇన్నింగ్స్తో అదరొట్టిన కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్.. గురువారం పాకిస్తాన్తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. మరోవైపు.. కివీస్, పాకిస్తాన్ శుక్రవారం (అక్టోబరు 14) ఫైనల్లో తలపడనున్నాయి. చదవండి: T20 World Cup 2022: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్ ట్రోల్! -
ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ
క్రైస్ట్చర్చ్: టి20 ప్రపంచకప్కు జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో పాక్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, షాన్ మసూద్ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తస్కీన్ అహ్మద్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది. యాసిర్ అలీ (21 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), లిటన్ దాస్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. వసీమ్ 3, నవాజ్ 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ తలపడుతుంది. -
మెగా ఈవెంట్కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్- కివీస్- బంగ్లా సిరీస్!
T20 WC 2022- Pakistan New Zealand Bangladesh Tri Series: టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ మేరకు జరిగే సిరీస్కు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ వేదిక కానుంది. కాగా విధంగా గతేడాది న్యూజిలాండ్ జట్టు అర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో అక్కడికి వెళ్లేందుకు కివీస్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్టోబరు 16న టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సుమారు వారం రోజుల ముందు జరుగనున్న ఈ ట్రై సిరీస్తో పాక్, కివీస్, బంగ్లా జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. ఇక అక్టోబరు 8న న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచాయి. అయితే, సెమీస్లో పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. ఫైనల్లో అదే ఆసీస్ జట్టు చేతిలో పరాజయం పాలై న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచింది. పాకిస్తాన్- న్యూజిలాండ్- బంగ్లాదేశ్: ట్రై సిరీస్ షెడ్యూల్-హాగ్లే ఓవల్ మైదానం, క్రైస్ట్చర్చ్ ►అక్టోబరు 8: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 9: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ►అక్టోబరు 10: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 11: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 12: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 14: ఫైనల్ చదవండి: నాన్న రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
తొలి స్వదేశీ వన్డేలో ఓటమి
ఖాట్మండు; ముక్కోణపు సిరీస్లో భాగంగా తమ సొంత గడ్డపై ఆడిన అధికారిక తొలి వన్డేలోనే నేపాల్ ఓటమి పాలైంది. నేపాల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహిస్తున్న ట్రై సిరీస్లో ఆ దేశంతో పాటు అమెరికా, ఒమన్లు తలపడుతున్నాయి. దీనిలో భాగంగా ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో నేపాల్ 18 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా, నేపాల్ 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఒమన్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు మహ్మద్ నదీమ్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 96 బంతుల్లో అజేయంగా 69 పరుగులు సాధించాడు. ఇక నేపాల్ జట్టు శరద్ విశ్వాకర్ 55 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. కాగా, తమ దేశం తొలిసారి అధికారిక వన్డే సిరీస్కు ఆతిథ్యం ఇవ్వడంపై నేపాల్ కెప్టెన్ జ్ఞానేంద్ర మల్లా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ దేశం మొత్తం గర్వించే క్షణమన్నాడు. తాము క్రికెట్ ఆడుతున్నప్పట్నుంచీ ప్రతీ ఒక్కరరూ వన్డే హోదా రావాలని కోరుకున్నారని, ఇప్పుడు అతి పెద్ద క్రికెట్ను ఆస్వాదిస్తున్నారన్నాడు. స్వదేశంలో జట్టుకు కెప్టెన్గా ఉండి మ్యాచ్ ఆడటం సరికొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. ఖాట్మాండు తమ ఫేవరెట్ గ్రౌండ్లలో ఒకటని తెలిపాడు. 2018లో నేపాల్కు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా నేపాల్తో పాటు స్కాట్లాండ్,యూఏఈలు వన్డే హోదా సాధించాయి. -
భారత మహిళల జట్టు ఓటమి
కాన్బెర్రా: ముక్కోణపు టి20 మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి (35; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హర్మన్ప్రీత్ (28; 4 ఫోర్లు) రాణించారు. ఎలీస్ పెర్రీ (4/13) భారత్ను కట్టడి చేసింది. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. పెర్రీ (49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. -
క్రికెట్లో సింగపూర్ కొత్త చరిత్ర
సింగపూర్: అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని సింగపూర్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సింగపూర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సభ్యత్వం గల దేశంపై తొలి విజయాన్ని అందుకుని నయా రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించడంతో 18 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: టీ20లో సరికొత్త రికార్డు) టిమ్ డేవిడ్(41), మన్ప్రీత్ సింగ్(41)లు రాణించడంతో చాలెంజింగ్ స్కోరును జింబాబ్వే ముందుంచుంది. కాగా, జింబాబ్వే 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. జింబాబ్వే కెప్టెన్ సీమ్ విలియమ్స్(66), ముటోంబోడ్జి(32)లు రాణించినా ఆ జట్టును విజయం అందించలేకపోయారు. సింగపూర్ బౌలర్లలో మహబూబ్, జనక్ ప్రకాశ్ తలో రెండు వికెట్లు సాధించగా, విజయ్ కుమార్, గోపీనాథ్ ఆచర్లు చెరో వికెట్ తీశారు. సింగపూర్ తాజా విజయంతో రెండు పాయింట్లు సాధించింది. -
ఆసీస్పై పాక్ జయభేరి
అబుదాబి: బాబర్ ఆజమ్ (55 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్స్), ఇమాద్ వసీమ్ (3/20) రాణిం చడంతో పాకిస్తాన్ పొట్టి ఫార్మాట్లో ఆసీస్పై భారీ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ జూలైలో హరారేలో 45 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును సవరించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బాబర్తో పాటు వన్డౌన్లో దిగిన మొహమ్మద్ హఫీజ్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. 105 పరుగుల వరకు ఒకే వికెట్ను కోల్పోయిన పాక్ మరో 28 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్టాన్లేక్, ఆండ్రూ టై మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆసీస్ 16.5 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫించ్ (0), షార్ట్ (4)లను వసీమ్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 22 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ కూల్టర్నీల్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. -
ఆసీస్పై పాక్ గెలుపు : కైఫ్ ఒక దేశద్రోహి!
ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా ఆసీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో పాక్ను గెలిపించాడు. దీంతో ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అయితే ఫఖర్ జమాన్ అద్భుత ఇన్నింగ్స్కు ఫిదా అయిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ జట్టు అద్భుత విజయం సాధించింది. గ్రేట్ ఇన్నింగ్స్తో పాక్ విజయానికి కారణమైన ఫఖర్ జమాన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్.. కంగ్రాచ్యులేషన్స్’ అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు స్పందించిన నెటిజన్లు ‘దేశద్రోహి’ అంటూ కైఫ్పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ గెలిస్తే మీరు కూడా సంతోషపడతారా‘... ‘పాకిస్తాన్పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అయితే అక్కడే ఉండొచ్చుగా’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Well done to Pakistan on winning the T20 series final against Australia. Great innings from Fakhar Zaman , looks a big match player. Congratulations #PakvAus — Mohammad Kaif (@MohammadKaif) July 8, 2018 देशद्रोही 😞😞😞😞 @MohammadKaif — Deepika Padukone FC (@deepikapadukonz) July 8, 2018 -
ట్రై సిరీస్ విజేత పాకిస్తాన్
హరారే: ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆదివారం ఆసీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో షహిబ్జాదా ఫర్హాన్, హుస్సేన్ తలాట్లు డకౌట్లగా నిరాశపరిచినప్పటికీ, ఫకార్ జమాన్(91; 46 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి జతగా షోయబ్ మాలిక్(43 నాటౌట్), సర్ఫరాజ్ అహ్మద్(28)లు తలో చేయి వేయడంతో పాకిస్తాన్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు డీఆర్సీ షార్ట్(76;53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), అరోన్ ఫించ్(47; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. -
ఆసీస్దే ట్రై సిరీస్
ముంబై: మహిళల ముక్కోణపు టీ20 సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్తో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆసీస్ 57 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను చేజిక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ క్రీడాకారిణుల్లో నటాలీ స్కీవర్(50) హాఫ్ సెంచరీతో రాణించగా, డానియెల్లీ వ్యాట్(34), ఎలెన్ జోన్స్(30)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ప్రధానంగా ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఇంగ్లండ్కు ఘోర పరాజయం ఎదురైంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు 209 పరుగులు సాధించారు. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. అలైస్సాహేలీ (33), గార్డనర్(33)లు మోస్తరుగా ఆకట్టుకోగా, కెప్టెన్ మెగ్ లాన్నింగ్(88 నాటౌట్;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. దాంతో ఆసీస్ రికార్డు స్కోరు సాధించింది. -
ఆసీస్ రికార్డు స్కోరు
ముంబై: మహిళల ముక్కోణపు టీ20 ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రికార్డు స్కోరు సాధించింది. శనివారం ఇంగ్లండ్తో తుది పోరులో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్కు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్ నాల్గో బంతికి ఓపెనర్ బెత్ మూనీ డకౌట్గా పెవిలియన్ చేరారు. ఆపై అలైస్సా హేలీ(33), గార్డనర్(33)లు కుదురుగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ తడబడినట్లు కనిపించింది.కాగా, కెప్టెన్ మెగ్ లాన్నింగ్(88 నాటౌట్;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. ఈ జోడి నాల్గో వికెట్కు 139 పరుగులు జోడించడంతో ఆసీస్ రెండొందల మార్కును సునాయసంగా దాటడంతో పాటు రికార్డు స్కోరును నమోదు చేసింది. -
నువ్వా నేనా..?
ముంబై: భారతగడ్డపై వారంరోజులపాటు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ మహిళాజట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్దశలో తాను ఆడిన చివరిరెండు మ్యాచ్ల్లో దూకుడు ప్రదర్శించిన ఆసీస్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ టోర్నీలో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగానే రాణించింది. బేత్ మూనీ, అలీసా హీలీ, కెప్టెన్ మెగ్ ల్యానింగ్, ఎలీసా విలానీ, ఎలీసా పెర్రీలు బ్యాట్తో ఆకట్టుకున్నారు. తమదైన రోజున ఏ బౌలింగ్ విభాగాన్నైనా వీరు సమర్థంగా ఎదుర్కొనగలరు. ముఖ్యంగా లీగ్ తొలిగేమ్లో విఫలమైన ల్యానింగ్ ప్రస్తుతం మంచి టచ్లో ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే మెగన్ ష్కట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇంగ్లండ్ను త్వరగా పెవిలియన్కు పంపాలంటే ష్కట్ స్థాయికి తగ్గట్లుగా రాణించాల్సి ఉంది. తనకు పేసర్ దిలీసా కిమిన్స్, స్పిన్నర్లు ఆష్లే గార్డెనర్, జోనాసెన్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. మరోవైపు ఫీల్డింగ్ విభాగం మెరుగుపడాలి. టోర్నీలో ఆసీస్ ప్లేయర్లు చాలా క్యాచ్ల్ని జారవిడిచారు. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే రెండు వరుస విజయాలతో టోర్నీలో శుభారంభం చేసింది. ఇందులో భారత్పై చేసిన 199 పరుగుల ఛేదన అద్భుతమనడంలో సందేహంలేదు. అయితే అనంతరం జోరు కొనసాగించడంలో ఇంగ్లిష్జట్టు విఫలమైంది. చివరిరెండు మ్యాచ్ల్లో ఆసీస్, భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలైంది. ముఖ్యంగా 97, 107 పరుగులకే ఇంగ్లిష్ జట్టు బోల్తాపడడం ఆ జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో ఈ మ్యాచ్లో సత్తాచాటి విజేతగా నిలివాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఓపెనర్ డేనియెలి వ్యాట్పైనే బ్యాటింగ్ భారం ఉంది. తను ఈ మ్యాచ్లో సత్తాచాటాల్సిన అవసరముంది. తనతోపాటు నటాఈ స్కివర్, తమ్సిమ్ బీమంట్, కెప్టెన్ హీథర్ నైట్లు ఆకట్టుకోవాలి. కేటీ జార్జ్, టాష్ ఫర్రంట్, జేనీ గన్లపై ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం ఆధారపడి ఉంది. జట్లు ఆస్ట్రేలియా: ల్యానింగ్ (కెప్టెన్), రేచల్ హేన్స్, నికోలా కారే, గార్డెనర్, హీలీ, జోనాసెసన్, కిమిన్స్, సోఫీ మోలినెక్స్, మూనీ, పెర్రీ, ష్కట్, స్టేల్బర్గ్, విలానీ, వెల్లింగ్టన్. ఇంగ్లండ్: నైట్ (కెప్టెన్), బీమంట్, డేవిడ్సన్, ఎకిల్స్టోన్, ఫర్రంట్, కేటీ, గన్, హర్ట్లీ, హెల్, అమీ జోన్స్, ఆన్య ష్రబ్సోల్, స్కివర్, విల్సన్, వాయ్ట్. -
ఎట్టకేలకు గెలిచారు..
ముంబై: ఇప్పటికే ముక్కోణపు టీ 20 సిరీస్లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొని ఫైనల్కు చేరడంలో విఫలమైన భారత మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విజయం దక్కింది. గురువారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్లో భారత మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి భారత జట్టు విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్ మిథాలీ రాజ్(6) మరోసారి నిరాశపరిచినా, స్మృతీ మంధాన(62 నాటౌట్; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమెకు జతగా హర్మన్ ప్రీత్ కౌర్(20 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. డానియల్లీ వ్యాట్(31) మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, జోన్స్(15), బీమౌంట్(10), నటాల్లీ స్కీవర్(15), హీథర్ నైట్(11)లు నిరాశపరిచారు. ఐదుగురు ఇంగ్లండ్ మహిళా క్రీడాకారిణులు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత మహిళా బౌలర్లలో అనుజా పటిల్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్లు తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్కు చేరిన తరుణంలో తాజా ఓటమి ఆ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. శనివారం ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. -
హ్యాట్రిక్ ఓటములు.. టీమిండియా ఔట్
సాక్షి, ముంబై : హ్యాట్రిక్ ఓటములతో టీమిండియా మహిళల జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి నిష్క్రమించింది. పేటీఎం కప్లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రాబౌర్నే స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలబడ్డాయి. 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు ఆస్టేలియాను బ్యాటింగ్ను ఆహ్వానించింది. ఎలిసే విలని 61 పరుగుల స్కోర్ సాధించటంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు సాధించింది. ఇక 187 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచే తడబడింది. ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ బౌలింగ్ ధాటికి రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మృతి మంధాన(3), మిథాలీ రాజ్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ వికెట్ను కూడా దక్కించుకోవటంతో హ్యాట్రిక్ సాధించి.. టీ20లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియన్ బౌలర్గా(ఓవరాల్గా ఏడో బౌలర్) మెగాన్ స్కట్ నిలిచారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన టీమిండియా జట్టు 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ ఫైనల్ బెర్త్కు దూరమైంది. అయితే ఇంగ్లాండ్తో మరో నామ మాత్రపు మ్యాచ్ను భారత్ ఆడనుండగా.. కప్ కోసం ఫైనల్లో ఇంగ్లాండ్-ఆసీస్లు తలపడనున్నాయి. -
మా ఫీల్డింగ్ బాగా మెరుగుపడాలి : హర్మన్ ప్రీత్
సాక్షి, స్పోర్ట్స్ : ఫీల్డింగ్ తప్పిదం వల్లనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో వైట్వాష్కు గురికావాల్సి వచ్చిందని టీమిండియా మహిళా క్రికెట్ టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ల ముక్కోణపు టీ20 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ మీడియాతో మాట్లాడారు. టీ20ల్లో అంతగా అనుభవం లేని భారత మహిళల జట్టు ఈ టోర్నీ ద్వారా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను ఢీకొట్ట బోతుందన్నారు. బీగ్బాష్ లీగ్తో వారంతా టీ20ల్లో రాటుదేలారని, అయినప్పటికి భారత మహిళలం సాయశక్తులు పోరాడుతామని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టు నేర్చుకునే దశలో ఉందని, టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుందని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చారు. వారితో పోలిస్తే మా బలం చాలా తక్కువనే విషయం తమకి తెలుసన్నారు. తమ ఫీల్డింగ్ మెరుగుపడాల్సిన అవసరమెంతో ఉందని, వన్డే సిరీస్లో జరిగిన తప్పిదాలను సరిచేకుంటామన్నారు. దక్షిణాఫ్రికా పర్యటన విజయానంతరం భారత మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని , అదే ఉత్సాహంతో ఈ సిరీస్ను గెలుస్తామని హర్మన్ ప్రీత్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మహిళల క్రికెట్ పట్ల ఆదరణ పెంచేందుకు బీసీసీఐ ఈ టోర్నీ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా వీక్షించే సౌకర్యం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. -
గెలిపించింది దినేశ్ కాదు.. ధోనీనే!
సాక్షి, స్పోర్ట్స్: ఆల్టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ ఘనత గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టీమ్లో ఉన్నా, లేకున్నా చర్చలోకి మహీని లాగాల్సిందే! నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారత్ చిత్తుచేసిన సందర్భంలోనూ ధోనీ ఉన్నాడు. అవును. కీపింగ్తోపాటు మ్యాచ్ ఫినిషింగ్ బాధ్యతలు కూడా తీసుకున్న దినేశ్లో ధోనీని చూసుకుంటున్నారు అభిమానులు. చిరునవ్వులు చిందిస్తోన్న దినేశ్ను కట్టేసి, ముసుగు తీస్తే ధోనీ కనిపిస్తాడనే అర్థంతో రూపొందిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అందుకు తగ్గట్లే కార్తీక్ కూడా ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బహుశా నాకీ శక్తి అతని నుంచే వచ్చి ఉండొచ్చు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కామ్గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమైంది. మ్యాచ్ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నాను. నేనేకాదు ప్రతిఒక్కరూ ధోనీ నుంచి తెల్సుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..’ అని డీకే చెప్పాడు. నాగిని డ్యాన్స్ ఎక్స్టెండ్ అయితే.. : మధ్యలో ఆసీస్-సఫారీల మధ్య మాటల యుద్ధాలు, గిల్లికజ్జాలను క్రీడాభిమానులు మర్చిపోకముందే నిదహాస్ టీ20 ట్రోఫీలోనూ ఉద్వేగ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకలో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్లేయర్లు చేసిన నాగిని డ్యాన్స్కు క్రీడాలోకం విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. నిన్నటి ఫైనల్స్లోనూ బంగ్లా వ్యతిరేకులు కొందరు.. పాములా బుసకొట్టడం చూశాం. ఇక మ్యాచ్ తర్వాతైతే సోషల్ మీడియా నిండా నాగిని ఫొటోలే! సరదాగా రూపొందించిన ఆ ఫొటోల్లో కొన్ని.. Take a bow, Dinesh Karthik👏👏👏 pic.twitter.com/O9gy8NTH6P — All India Bakchod (@AllIndiaBakchod) March 18, 2018 #INDvBAN pic.twitter.com/fNuH0anSLN — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Pic 1: Before Match Pic 2: After Match#INDvBAN pic.twitter.com/zXwgWuwEUU — PhD in Bakchodi (@Atheist_Krishna) March 18, 2018 Rohit Sharma #INDvBAN pic.twitter.com/C7E9L6pSRF — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Dinesh Karthik after saving Vijay Shankar's career. #INDvBAN pic.twitter.com/cd5Uj87qjx — SAGAR (@sagarcasm) March 18, 2018 Dear Bangladesh, never underestimate an Indian wicketkeeper on the last ball of a T20 match. #IndvBan #DineshKarthik pic.twitter.com/TIg9kkkoBH — Bollywood Gandu (@BollywoodGandu) March 18, 2018 -
దినేశ్ కార్తీక్కు క్షమాపణలు
కొలంబో/ముంబై: నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ పోరులో భారత్ను విజేతగా నిలిపిన దినేశ్ కార్తీక్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇదే చర్చ.. సోషల్మీడియాలోనూ ట్రెండింగ్ నేమ్ డీకేదే. ‘వాట్ ఏ గేమ్.. వాట్ ఏ ప్లేయర్..’ అంటూ కామెంట్లు..! అందరిలాగే సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఓ ట్వీట్ వదిలారు. కానీ అందులో సంఖ్యలు తప్పుగా రాయడంతో, దినేశ్ కార్తీక్కు క్షమాపణలు చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు. అందుకే శంకర్ను ముందు పంపాం: రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం దినేశ్ కార్తిక్ నాలుగో డౌన్లో(98 పరుగుల వద్ద రోహిత్ ఔటైన తర్వాత) రావాల్సింది. కానీ అనూహ్యంగా శంకర్ క్రీజ్లోకి వచ్చాడు. అనుభవలేమితో సతమతమౌతూ వరుసగా బంతుల్ని మింగుతూ శంకర్.. అభిమానుల టెన్షన్ను మరింత పెంచాడు. ఆ నిర్ణయంపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చుకున్నాడు. ‘కీలకమైన తరుణంతో అనుభవమున్న ఆటగాడి అవసం చాలా ఉంటుంది. మ్యాచ్ను విజయవంతంగా ముగించగల సత్తా కార్తీక్కు ఉందని నేను గట్టిగా నమ్మాను. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాం. అనుకున్నట్లే డీకే తనదైన నైపుణ్యంతో రాణించాడు’’ అని రోహిత్ చెప్పాడు. 20 ఏళ్ల తర్వాత లంక గడ్డపై.. శ్రీలంక 50వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా 1998లో తొలిసారి నిదహాస్ ముక్కోణపు వన్డే ట్రోఫీని నిర్వహించారు. అప్పుడు శ్రీలంక-భారత్-న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్లో సచిన్ టెండూల్కర్ సూపర్ సెచరీ(128)తో భారత్ 307 పరుగులు చేయగా, లంక 301 పరుగులకే ఆలౌటైంది. అలా తొలి ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత.. అంటే శ్రీలంక 70వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా రెండోసారి నిదహాస్ ట్రోఫీని నిర్వహించారు. వన్డేలకు బదులు టీ20లు ఆడించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో బంగ్లాదేశ్పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ లభించగా, వాషింగ్టన్ సుందర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. (చదవండి : దినేశ్ కార్తీక్ సూపర్ హిట్) T 2747 - that should read 34 needed in 2 overs .. NOT 24 .. apologies to Dinesh Kartik .. pic.twitter.com/yH6rVjWzpk — Amitabh Bachchan (@SrBachchan) 18 March 2018 -
మా వాళ్లదే తప్పు.. క్షమించండి
-
మా వాళ్లదే తప్పు.. క్షమించండి
ఢాకా : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం నెలకొన్న తీవ్ర పరిణామాలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశ ఆటగాళ్లే తప్పు చేశారంటూ క్షమాపణలు తెలియజేసింది. ఈ మేరకు బీసీబీ.. శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. ‘మా ఆటగాళ్ల వ్యవహార శైలి మూలంగానే విధ్వంసకాండ జరిగింది. ఇతరులను రెచ్చగొట్టే విధంగా మైదానంలో ఆటగాళ్లు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించబోరు. తప్పంతా మా వాళ్లదే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మా ఆటగాళ్లు వ్యవహరించారు. అందుకు బీసీబీ క్షమాపణలు తెలియజేస్తోంది’ అంటూ బీసీబీ పేర్కొంది. కాగా, మ్యాచ్ చివరి ఓవర్లో రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్మన్ అసహనానికి గురయ్యారు. బంగ్లా సబ్స్టిట్యూట్ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. ఒక్క బంతి తేడాతో మ్యాచ్ గెలిచాక లంక ఆటగాళ్లను, ప్రేక్షకులను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేయగా.. అందుకు ప్రతిగా మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. -
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
-
నేనేం చెప్పానో మీకు తెలుసా?: షకీబ్
కొలంబో : శ్రీలకతో జరిగిన మ్యాచ్లో నోబాల్ వివాదం, ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు, అంపైర్లతో వాగ్వాదం ఘటనలపై బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భిన్నంగా స్పందించారు. మైదానం నుంచి తమ బ్యాట్స్మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘(ఉదాన వేసిన) 20వ ఓవర్లో తొలి బంతి.. ముస్తాఫిజుర్ భుజం కంటే ఎత్తులో వెళ్లడంతో స్క్వేర్ లెగ్ అంపైర్ ‘నో బాల్’ ప్రకటించారు. కానీ మరుక్షణంలోనే మెయిన్ అంపైర్తో మాట్లాడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండో బంతి కూడా అంతే ఎత్తులో బౌన్సైంది. కానీ అంపైర్లు నోబాల్ ఇవ్వలేదు. ఆటలో పొరపాట్లు సహజం. ఆ పొరపాటు గురించే అంపైర్లతో మాట్లాడానుగానీ మరో ఉద్దేశమేదీ లేదు. ఇకపోతే, మా బ్యాట్స్మన్లను బయటికి వచ్చేయమని నేను అననేలేదు. నా సైగలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేనేం చెప్పానో మీకు(మీడియాకు) ఎలా తెలుస్తుంది? జరిగిందేదో జరిగిపోయింది, ప్రస్తుతం మా గురి భారత్తో ఫైనల్ మ్యాచ్పైనే..’’ అని షకీబ్ అన్నారు. అవును.. కొంచెం అతి చేశాం : లంకతో జరిగిన మ్యాచ్లో ఆటగాళ్ల భావోద్వేగాలు శృతిమించాయన్నది వాస్తవమేనని బంగ్లా సారధి అంగీకరించారు. ‘‘గీత దాటి ప్రవర్తించానా? అని నాక్కూడా అనిపించింది. నన్ను నేను తమాయించుకోవడం అవసరమనిపించింది. సరే, ఏదేమైనా ఆటలో ఇలాంటి ఉద్వేగాలు సహజమే’ అని ముగించాడు షకీబ్. డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. -
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
కొలంబో : నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో తీవ్ర పరిణామాలు జరిగాయి. మ్యాచ్ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : మ్యాచ్ చివరి ఓవర్లో బంగ్లా-లంక ప్లేయర్లు పరస్పరం వాదులాడుకున్నారు. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు. ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. అసలేం జరిగింది? ఫైనల్స్లో బెర్త్ కోసం బంగ్లాతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో మరో బంతి మిగిలుండగానే బంగ్లా 160 పరుగులు సాధించి విక్టరీ కొట్టింది. అయితే ఇన్నింగ్స్ చివరి(20వ) ఓవర్లో హైడ్రామా చోటుచేసుకుంది. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్మన్ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్ రనౌటైన గ్యాప్లో గ్రౌండ్లోకి వచ్చిన బంగ్లా సబ్స్టిట్యూట్ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్ షకీబ్ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’ అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. -
బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం
-
బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం
కొలంబో : ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. శ్రీలంక నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సాధించి శభాష్ అనిపించింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(47;29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), లిటాన్ దాస్(43;19 బంతుల్లో 2 ఫోర్లు, 5 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి తర్వాత రహీమ్ (72; 35 బంతుల్లో) బౌండరీల మోత మోగించి బంగ్లాదేశ్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. అంతకుముందు శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లంక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆది నుంచి దూకుడుగా ఆడారు. శ్రీలంక ఓపెనర్లలో దనుషా గుణతిలకా (26;19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) దాటిగా ఆడే క్రమంలో తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, కుశాల్ మెండిస్(57;30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్ను ఝుళిపించాడు. ఇక ఫస్ట్ డౌన్ ఆటగాడు కుశాల్ పెరీరా (74; 48 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగి ఆడాడు. క్రీజ్లోకి వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కుశాల్ ద్వయం 85 పరుగులు జోడించింది. అయితే ఓ దశలో 8 పరుగుల వ్యవధిలో షనకా(0), చండిమాల్(2)లు పెవిలియన్ చేరడంతో శ్రీలంక తడబాటకు గురైంది. అటు తర్వాత పెరీరాకు జత కలిసిన ఉపుల్ తరంగా సమయోచితంగా ఆడాడు. మరొకవైపు పెరీరా బౌండరీలతో ఎదురుదాడి చేస్తూ లంక బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత పెరీరా ఐదో వికెట్గా అవుటయ్యాడు. ఇక ఉపుల్ తరంగా(32 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 ఫోర్) కడవరకూ క్రీజ్లో ఉండి లంక స్కోరును రెండొందలు దాటించాడు. ఇది శ్రీలంకకు టీ 20 ల్లో నాల్గో అత్యుత్తమ స్కోరు. అదే సమయంలో బంగ్లాదేశ్పై అత్యధిక టీ 20 స్కోరును సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. -
లంకలో ఎమర్జెన్సీ.. మరి మ్యాచ్ జరుగుతుందా?
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీ లంకలో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని విధించగా.. ప్రస్తుతం అక్కడ ఉన్న టీమిండియా ఆటగాళ్ల భద్రతపై అభిమానుల్లో కలవరపాటు మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ ఓ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ‘అల్లర్లు క్యాండీలోనే చెలరేగాయి. కొలంబోలో కాదు. అక్కడి అధికారులను సంప్రదించాకే పరిస్థితులు అదుపులో ఉన్నాయని నిర్ధారించుకున్నాం. ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పించినట్లు వారు తెలిపారు. నేటి మ్యాచ్ జరిగి తీరుతుంది’ అని పేర్కొంది. శ్రీలంక వేదికగా నేటి(మంగళవారం) నుంచి ముక్కోణపు సిరీస్ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబోలోని ప్రేమ దాస మైదానంలో సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎందుకంటే... -
ప్రాక్టీస్లో భారత్-లంక బిజీబిజీ
-
ట్రై సిరీస్.. ఆదిలోనే బంగ్లాకు ఎదురుదెబ్బ
ఢాకా: భారత్, శ్రీలంక జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్లో తలపడబోయే బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ట్రై సిరీస్ నుంచి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, కీలక ఆటగాడు షకిబుల్ హసన్ గాయం కారణంగా వైదొలిగాడు. ప్రస్తుతం వేలి గాయంతో బాధపడుతున్న షకిబుల్.. ట్రై సిరీస్కు దూరం కానున్న విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఇటీవల ఢాకాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరస్లో గాయపడిన షకిబుల్.. ట్వంటీ 20 ట్రై సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని తొలుత భావించారు. కానీ అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో షకిబుల్కు మరికొన్ని రోజులు విశ్రాంతినిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. షకిబుల్ గాయంపై డాక్టర్ల నిర్ణయం తర్వాతే అతనికి రెస్ట్ ఇవ్వడానికి టీమ్ మేనేజ్మెంట్ ముందుకొచ్చింది. మంగళవారం(మార్చి6వ తేదీ) నుంచి ముక్కోణపు టీ20 సిరీస్ ఆరంభం కానుంది. -
ట్రై సిరీస్కు మాథ్యూస్ దూరం
కొలంబో:వచ్చే నెల మొదటి వారంలో భారత్, బంగ్లాదేశ్ జట్లతో ఆరంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక కీలక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మాథ్యూస్కు కాలిపిక్క గాయం కావడంతో అతను ట్రైసిరీస్కు దూరమవుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ప్రకటించింది. ట్రై సిరీస్ నుంచి మాథ్యూస్ ఉన్నపళంగా తప్పుకోవడం నిరాశకు గురి చేసిందని లంక మేనేజ్మెంట్ పేర్కొంది. గత నెల్లో శ్రీలంక వన్డే జట్టుకు కెప్టెన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన మాథ్యూస్.. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే మాథ్యూస్కు గాయం పెద్దది కాకపోయినా, ఎస్ఎల్సీ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ లభించలేదు. ఫలితంగా సిరీస్కు మాథ్యూస్ దూరం కానున్నాడు. మార్చి 6 వ తేదీ నుంచి శ్రీలంకలో ట్రై సిరీస్ ఆరంభం కానుంది. -
ఫైనల్లో న్యూజిలాండ్
హామిల్టన్: ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆ జట్టు రెండు పరుగులతో ఓటమి పాలైనా... మెరుగైన రన్రేట్తో ఫైనల్కు చేరింది. బుధవారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మోర్గాన్ (46 బంతుల్లో 80; 4 ఫోర్లు, 6 సిక్స్లు) రాణించాడు. అనంతరం కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి ఓడింది. గప్టిల్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మున్రో (21 బంతుల్లో 57; 3 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగినా ఫలితం లేకపోయింది. -
ఇంగ్లండ్పై కివీస్దే గెలుపు
వెల్లింగ్టన్: ముక్కోణపు టి20 టోర్నీ మ్యాచ్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్దే పైచేయి అయింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 72; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాటం 184 పరుగులకే పరిమితమైంది. అలెక్స్ హేల్స్ (24 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్లు), మలాన్ (40 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మంచి భాగస్వామ్యం అందించినా మిగతావారు విఫలమమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/46), శాన్ట్నర్ (2/29), ఇష్ సోధి (2/29) రాణించారు. విలియమ్సన్కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. -
హ్యాట్రిక్ విజయంతో ఫైనల్కు..
మెల్బోర్న్:న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగుతున్న ముక్కోణపు టీ 20 సిరీస్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సిరీస్లో హ్యాట్రిక్ విజయాన్ని ఆసీస్ ఖాతాలో వేసుకుని ముందుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ల్లో ఆసీస్ ఘన విజయాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్(46), శ్యామ్ బిల్లింగ్స్(29)లు మాత్రమే మోస్తరుగా రాణించగా మిగతావారు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డసన్ మూడు వికెట్లు సాధించగా, స్టాన్లేక్ రెండు వికెట్లు తీయగా, టైకు వికెట్ దక్కింది. ఆపై 138 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. ఆసీస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(2) నిరాశపరిచినప్పటికీ, ఆర్సీ షాట్(36), క్రిస్ లిన్(31), మ్యాక్స్వెల్(39), అరోన్ ఫించ్(20 నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొందింది. -
ట్రై సిరీస్ శ్రీలంకదే
ఢాకా: బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ను 41.1 ఓవర్లలో 142 పరుగులకే పరిమితం చేసిన లంకేయులు ట్రై సిరీస్ను చేజిక్కించుకున్నారు. బంగ్లా ఆటగాళ్లలో మొహ్మదుల్లా(76) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిచిపించలేకపోయాడు. బంగ్లా ఆటగాళ్లలో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో మదుషనక హ్యాట్రిక్ వికెట్లతో బంగ్లాను కట్టడి చేయగా, చమీరా, అకిల ధనంజయలు తలో రెండు వికెట్లు తీసి విజయంలో తమ పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో రెండు రనౌట్లు ఉండగా, షకిబుల్ హసన్ ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. ఉపుల్ తరంగా(56), కుశాల్ మెండిస్(28), నిరోషన్ డిక్వెల్లా(42), దినేశ్ చండిమాల్(45)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు. -
22 పరుగులకే మూడు వికెట్లు
ఢాకా: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. శ్రీలంక నిర్దేశించిన 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లా ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్(3), మొహ్మద్ మిథున్(10), షబ్బీర్ రెహ్మాన్(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. ఉపుల్ తరంగా(56), కుశాల్ మెండిస్(28), నిరోషన్ డిక్వెల్లా(42), దినేశ్ చండిమాల్(45)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు. -
ట్రై సిరీస్కు జో రూట్ దూరం
సిడ్నీ:వచ్చే నెల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో జరిగే ముక్కోణపు సిరీస్ నుంచి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ వైదొలిగాడు. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో రూట్ విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. దానిలో భాగంగా ముక్కోణపు సిరీస్కు దూరం కానున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో ఆడిన రూట్.. ఐదు వన్డేల సిరీస్లో కూడా ఆడతున్నాడు. దాంతో చిన్నపాటి బ్రేక్ తీసుకోవాలని రూట్ కోరిన నేపథ్యంలో దాన్ని ఈసీబీ అంగీకరించింది. దీనిపై రూట్ మాట్లాడుతూ..' విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నాకు ఒక బ్రేక్ కావాలి. నాకు స్వతహాగా గేమ్స్ మిస్ కావడం ఇష్టం ఉండదు. కాకపోతే కాస్త అలసటగా అనిపిస్తోంది. దాంతోనే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నా. ఫిబ్రవరి చివర్లో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు అందుబాటులోకి వస్తా' అని రూట్ తెలిపాడు. -
శ్రీలంక గెలిచిందోచ్...
ఢాకా: వరుస ఓటములతో డీలాపడ్డ శ్రీలంకకు కాస్త ఊరట లభించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన లంక ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత జింబాబ్వే 44 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటవ్వగా... శ్రీలంక 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలుపొందింది. లంక తరఫున కుశాల్ పెరీరా (49), కెప్టెన్ చండిమాల్ (38 నాటౌట్), తిసారా పెరీరా (39 నాటౌట్) రాణించారు. -
ఫైనల్ కు చేర్చిన మనీష్
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్-ఎ జట్టు ఫైనల్ కు చేరింది. దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మ్యాచ్ లో భారత-ఎ జట్టు వికెట్ తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్ విజయంలో కెప్టెన్ మనీష్ పాండే(93 నాటౌట్; 85 బంతులు) కీలక పాత్ర పోషించాడు. మనీష్ చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది. అతనికి జతగా సంజూ శాంసన్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇది భారత్ కు వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ జట్టు.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
డివిలియర్స్ అరుదైన మైలురాయి
బార్బోడాస్:దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ముక్కోణపు సిరీస్లో ఆదివారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా డివిలియర్స్ 200వ వన్డే మార్కును చేరాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరపున ఆ ఘనతను పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు 200 వన్డే మార్కును చేరిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జాక్వస్ కల్లిస్, హెర్ష్లీ గిబ్బ్, జాంటీ రోడ్స్, మార్క్ బౌచర్, షాన్ పొలాక్ లు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉండగా డివిలియర్స్ రెండొందల వన్డే వర్షార్పణం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగిన సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం ఎంతకీ విరామం ఇవ్వకపోవడంతో ఆ మ్యాచ్ ను రద్దు చేశారు. ఇదిలా ఉండగా, గత నవంబర్లో భారత్ తో టెస్టు సిరీస్ సందర్భంగా బెంగళూరు మ్యాచ్ ద్వారా డివిలియర్స్ వంద టెస్టులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రా ముగిసింది. కేవలం ఒక రోజు ఆట మాత్రమే సాధ్యమైన ఆ టెస్టు మ్యాచ్లో డివిలియర్స్ 85 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ డివిలియర్స్ 106 టెస్టులు ఆడితే, 205 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ఐదు వన్డేలు మాత్రం ఆఫ్రికా ఎలెవన్ తరపున డివిలియర్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా తరపున 200 వన్డేలు ఆడటం పట్ల డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన అరుదైన గౌరంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. -
డీన్ ఎల్గర్కు పిలుపు
గయనా: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ రిలీ రస్క్వో ముక్కోణపు సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో డీన్ ఎల్గర్కు స్థానం కల్పిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. మంగళవారం నాటి మ్యాచ్లో రస్క్వో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం రస్క్వోను ఆస్పత్రికి తరలించి ఎక్స్రే తీయించగా అతని కుడి భుజం జాయింట్లో కొద్దిగా చీలిక వచ్చినట్లు టీమ్ మేనేజర్ మొహ్మద్ మూసాజీ స్పష్టం చేశాడు. దీంతో తదుపరి మ్యాచ్ల్లో రస్క్వో పాల్గొనే అవకాశం లేదన్నారు. ఈ నేపథ్యంలో డీన్ ఎల్గర్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 47 పరుగుల తేడాతోవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు. సోమవారం ఇక్కడ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33.5 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(56), రిషాబ్ పాంట్(35) శుభారంభాన్నివ్వగా, అనంతరం రికీ భుయ్(29), కెప్టెన్ ఇషాన్ కిషన్(12)లు మిగతా పనిని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో దమిత్ సిల్వా మూడు వికెట్లు తీశాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని 47.2 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక ఆటగాళ్లలో విషాద్ రందికా డిసిల్వా(58) హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. భారత్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, మయాన్ దాగర్ లు కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇదిలా ఉండగా, ముక్కోణపు టోర్నీలో ఒక మ్యాచ్ ల్లో కూడా ఓటమి చెందంకుండా ట్రోఫీని అందుకున్న యువ భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అభినందించింది. -
భారత్ జైత్రయాత్ర
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గురువారం ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో తన చివరి లీగ్ ను ఘనంగా ముగించిన భారత్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో కవీన్ బండారా(74), కిమిందు మెండిస్(65)లు రాణించగా, కెప్టెన్ చరితా అసలంకా(22) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు సాధించి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. శ్రీలంక చివరి ఆరు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత యువజట్టు 47.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(61), విరాట్ సింగ్(60 నాటౌట్) లు మరోసారి ఆకట్టుకుని జట్టు గెలుపులో సహకరించారు. -
గెలిస్తేనే టీమిండియాకు ఫైనల్ చాన్స్!
సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భారత్కు మరో సవాల్ ఎదురవుతోంది. రిపబ్లిక్ డే రోజున టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో గెలవడం చాలా కీలకం. ధోనీసేన చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ముక్కోణపు సిరీస్లో ఓటమెరుగని ఆసీస్ (13 పాయింట్లు) హ్యాట్రిక్ విజయంతో ఫైనల్కు దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం భారత్ (0), ఇంగ్లండ్ (5) పోటీ పడుతున్నాయి. భారత్కు రెండు మ్యాచ్లు మిగిలివుండగా, ఆసీస్, ఇంగ్లండ్ ఓ మ్యాచ్ మాత్రమే ఆడాలి. ఈ సిరీస్లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా ప్రత్యర్థికి బోనస్ పాయింట్ సమర్పించుకుంది. దీంతో భారత్ ఫైనల్ చేరాలంటే ఆసీస్, ఇంగ్లీష్ మెన్తో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గాలి. ఒకవేళ ఆసీస్తో మ్యాచ్లో ధోనీసేన ఓడితే ఇంగ్లండ్పై బోనస్ పాయింట్తో గెలిస్తేనే ఫైనల్ అవకాశముంటుంది. ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తే బోనస్ పాయింట్ అటుంచి గెలిస్తే చాలు అన్నట్టుగా ఉంది. అందులోనూ భారత్ కంటే ఇంగ్లండ్ కే ఎక్కువ రన్ రేట్ ఉంది. దీంతో కంగారూలతో మ్యాచ్ ధోనీసేనకు చావోరేవో లాంటిది. ఆస్ట్రేలియా చివరి మ్యాచ్లోనూ గెలిచి సమరోత్సాహంతో ఫైనల్ దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్, ఆసీస్ బలాబలాలను పరిశీలిస్తే సొంతగడ్డపై కంగారూలే ఫేవరేట్! బౌలింగ్లో ఆసీస్కు తిరుగులేకపోగా.. భారత్ను బలహీనతలు వెంటాడుతున్నాయి. ఇక బ్యాటింగ్లనూ టీమిండియా సమస్యలు ఎదుర్కొంటోంది. సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. కీలక వన్డే ప్రపంచ కప్ ముందు ధోనీసేన బలహీనతలను అధిగమించాల్సిన అవసరం ఎంతో ఉంది. జట్లు: భారత్: రహానె, ధవన్, రాయుడు, కోహ్లీ, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), అక్షర్ పటేల్, బిన్నీ/అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్/ఉమేష్/షమీ (ముగ్గురిలో ఇద్దరు) ఆస్ట్రేలియా: ఫించ్, వార్నర్, బెయిలీ (కెప్టెన్), స్మిత్, మ్యాక్స్వెల్, మార్ష్/సంధు, హాడిన్ (కీపర్), ఫాల్కనర్, స్టార్క్, హజ్లెవుడ్, డోహర్టీ సిడ్నీలో కంగారూలే: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఆసీస్ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడగా, టీమిండియా ఓ మ్యాచ్ మాత్రమే నెగ్గింది. వర్ష సూచన: ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. మ్యాచ్ సమయం: ఉదయం 8:50 గంటల నుంచి -
ముక్కోణపు సిరీస్: రేపే భారత్ కు తొలి పరీక్ష
మెల్ బోర్న్: వన్డే ప్రపంచ కప్ సమరానికి ముందు భారత్ మినీ పోరుకు సిద్ధమైంది. గత రెండు ప్రపంచ కప్ విజేతలు, వన్డే ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణి జట్లయిన భారత్ (నెంబర్ 2), ఆస్ట్రేలియా (నెంబర్ 1) మధ్య ఆసక్తికర పోరు కొన్ని గంటల్లో ఆరంభంకానుంది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. టెస్టు సిరీస్లో ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకున్న టీమిండియా.. వన్డేల్లో దూకుడు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. టెస్టులకు గుడ్ బై చెప్పిన కెప్టెన్ ధోనీ పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే పూర్తిగా దృష్టిసారిస్తున్నాడు. గత ప్రపంచ కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ధోనీ ఈ సారి కూడా జట్టును విజయపథంలో నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ ముందు ముక్కోణపు సిరీస్లో సత్తా చాటాలని కంగారూలు ఉవ్విళ్లూరుతున్నారు. సొంత వేదిక, అభిమానుల మద్దతు వారికి కలసి వచ్చే అంశం. యువ ఆటగాళ్లతో కూడిన భారత్ బ్యాటింగ్లో బలోపేతంగా కనిపిస్తోంది. ధవన్తో పాటు రోహిత్ లేదా రహానె ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రైనా, ధోనీ అదనపు బలం. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ ఇషాంత్ గాయాల నుంచి కోలుకున్నా ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఉమేష్, షమీ, అశ్విన్ కీలకం. ఆస్ట్రేలియా విషయానికొస్తే బౌలింగ్లో బలోపేతంగా ఉంది. బ్యాటింగ్లో కూడా పించ్ హిట్టర్లకు, స్టార్ బ్యాట్స్మెన్కు కొదవలేదు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశముంది. జట్లు (అంచనా) భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రహానె, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, భువనేశ్వర్, ఉమేష్ ఆస్ట్రేలియా: అరోన్ ఫించ్, వార్నర్, వాట్సన్, స్మిత్, బెయిలీ (కెప్టెన్), మ్యాక్స్వెల్, బ్రాడ్ హాడిన్ (కీపర్), ఫాల్కనర్, స్టార్క్, కమిన్స్, డోహర్టీ పిచ్: ఎంసీజీ వికెట్ స్లోగా ఉంటుంది. పేస్, బౌన్స్కు కొద్దిగా సహకరించవచ్చు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. సమయం: ఉదయం 8:50 నుంచి