virendra sehwag
-
సేంద్రీయ వ్యవసాయంపై అక్షయ్ కుమార్,వీరేంద్ర సెహ్వాగ్ పెట్టుబడులు!
సేంద్రీయ ఎరువులతో సేంద్రీయ పద్దతులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడీ ఆర్గానిక్ ఫార్మింగ్పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) అనే స్టార్టప్ సంస్థ ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా..అందరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) ప్రయాణంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాల సాధికారత కోసం సంస్థ దృష్టి ,నిబద్ధతను నమ్ముతున్నాను" అని అక్షయ్ కుమార్ అన్నారు. ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ బలమైన ప్రాధాన్యత కారణంగా తాను tbofలో పెట్టుబడి పెట్టానని ఆయన పేర్కొన్నారు. రైతులు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా సంస్థ నిబద్ధత తనను ప్రేరేపించిందని కాబట్టే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. -
ఏంటమ్మా పాండ్య ఇలా అయితే కప్పు కష్టమే
-
RCB బ్యాటింగ్ పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
-
ఓ మైలురాయి అందుకోకుండా కోహ్లి నన్ను అడ్డుకున్నాడు.. సెహ్వాగ్ సంచలన కామెంట్స్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై డాషింగ్ ఆటగాడు, భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో వీరూ మాట్లాడుతూ.. తాము కలిసి ఆడే రోజుల్లో విరాట్ కోహ్లి తనను ఓ మైలురాయిని అందుకోకుండా అడ్డుకున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్లో ఓ భారీ రికార్డు అందుకునే క్రమంలో కోహ్లి ఓ క్యాచ్ డ్రాప్ చేసి తన పేరిట రికార్డు నమోదు కాకుండా చేశాడని ఫీలయ్యాడు. ఆ సమయంలో పట్టలేనంత కోపం వచ్చి కోహ్లిపై గట్టిగా అరిచానని, తాను ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా అంతలా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లో కోహ్లిని అందరూ పెద్ద స్టార్ ఆవుతాడని అనేవారని, తాను మాత్రం ఆ విషయంతో ఏకీభవించలేదని తెలిపాడు. అయితే శ్రీలంకపై ఓ మ్యాచ్లో కోహ్లి అద్భుతమైన సెంచరీ చేశాక, తనతో పాటు చాలామంది అభిప్రాయాలు మారాయని పేర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలో కోహ్లి 75 సెంచరీలు చేస్తాడని ఎవరూ ఊహించలేదని, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి వంద అంతర్జాతీయ సెంచరీల దిశగా దూసుకుపోవడం అందరి కంటే తనకే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. కోహ్లి తన నిలకడైన ఆటతీరుతో తనతో పాటు చాలామందిని రాంగ్గా ప్రూవ్ చేశాడని, భవిష్యత్తులో అతను సచిన్ 100 సెంచరీల రికార్డును తప్పక అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 44 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటర్గానే కాకుండా అద్భుతమైన పార్ట్ టైమ్ బౌలర్గానూ సేవలందించాడు. అతని జమానాలో వీరూ.. పాంటింగ్, గిల్క్రిస్ట్, హేడెన్, హస్సీ, సంగక్కర, జయవర్ధనే, దిల్షన్, లారా లాంటి హేమాహేమీలను బోల్తా కొట్టించాడు. టెస్ట్ల్లో 40 వికెట్లు పడగొట్టిన వీరూ.. వన్డేల్లో 96 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. రిచర్డ్ లెవి విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. -
'కొంచెం హుందాగా ప్రవర్తించండి'.. సెహ్వాగ్, పార్థివ్లకు చురకలు
టి20 ప్రపంచకప్లో శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్లు వర్షార్పణమయ్యాయి. అందులో ఒకటి అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు కావడం సగటు అభిమానికి బాధ కలిగించింది. అఫ్గానిస్తాన్ ఈసారి నేరుగా టి20 ప్రపంచకప్కు అర్హత సాధించగా.. ఐర్లాండ్ మాత్రం క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడింది. క్వాలిఫయింగ్లో స్కాట్లాండ్ను ఓడించిన ఐర్లాండ్.. రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్ అయిన విండీస్కు గట్టిషాక్ ఇచ్చింది. గ్రూఫ్ టాపర్గా సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్-12లో ఇంగ్లండ్ను డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో ఓడించిన ఐర్లాండ్.. లంక చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక అఫ్గానిస్తాన్ పరిస్థితి దారుణం. ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు రద్దు కాగా.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ రెండు జట్లు సెమీస్ చేరడం కష్టమే. అయితే ఐర్లాండ్కు కాస్త అవకాశం ఉంది. ఈ సంగతి పక్కనపెడితే టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్లకు ఒక క్రికెట్ అభిమాని చురకలంటించాడు. అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను సభ్య దేశాలుగా పేర్కొనడంతోనే ఈ తంటంతా వచ్చి పడింది. విషయంలోకి వెళితే.. శుక్రవారం అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ ప్రీ మ్యాచ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్, పార్ధివ్ పటేల్లు పాల్గొన్నారు. మాటల్లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను వీరిద్దరు సభ్య దేశాలుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇరుజట్లు ఐసీసీలో శాశ్వత జట్లుగా ఎప్పుడో గుర్తింపు పొందాయి. అటు ఆఫ్గన్.. ఇటు ఐర్లాండ్కు టెస్టు సభ్యత్వం కూడా ఉంది. ఈ విషయం మరిచిపోయి వాటిని సభ్య దేశాలు అనడం ఒక అభిమానికి చిరాకు తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్, పార్థివ్ పటేల్కు చురకలంటించాడు. ''కొంచెం హుందాగా ప్రవరిస్తే మంచిది..'' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్లో సగం మ్యాచ్లు వర్షార్పణం అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తారంటూ ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. అదేంటో గానీ ఈ వరల్డ్కప్లో వర్షం కూడా ఒక టీమ్లా తయారైంది. ఈసారి గట్టిగా కురుస్తూ మ్యాచ్లను రద్దు చేసే పనిలో పడింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో పాయింట్ల పట్టికలో వరుణుడు టాప్లో ఉన్నట్లు అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Some professionalism please... pic.twitter.com/whYV7UPuA5 — Karthik Raj (@kartcric) October 27, 2022 చదవండి: ‘భారత్పై గెలిస్తే నవ్వుకుంటారుగా.. అంత ఏడుపు ఎందుకులే..’ -
అతన్ని ఓపెనర్గా పంపండి.. సెహ్వాగ్లా సక్సెస్ అవుతాడు..!
ఐపీఎల్ 2022 సీజన్లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్) సృష్టించిన ఇంగ్లండ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్ను టెస్ట్ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్గా పంపిస్తే సెహ్వాగ్లా సూపర్ సక్సెస్ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. సెహ్వాగ్ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్ ఆర్డర్లో పంపారని, ఆతర్వాత ఓపెనర్గా ప్రమోషన్ వచ్చాక సెహ్వాగ్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్ల్లో కూడా ఓపెనర్గా ప్రమోట్ చేస్తే రెడ్ బాల్ క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడే బట్లర్ టెస్ట్ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్లు ఆడిన బట్లర్.. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ గతేడాది యాషెస్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్ టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్ ఓవర్స్లో అతని భీకర ఫామ్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్కు బట్లర్కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్ విసురుతుంది. భారత్తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, జో రూట్ చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
IPL 2022: ఈ మ్యాచ్లో ఓడిపోయారో మీ పని ఇక అంతే!
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం నాలుగింట మాత్రమే గెలుపొందింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే పంత్ సేన నెట్రన్ రేటు పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వరుస ఓటములు కలవరపెట్టే అంశంగా పరిణమించాయి. మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరుగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ అజయ్ జడేజా, మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు క్రిక్బజ్తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకమైనది. మిగతా జట్ల కంటే ఢిల్లీ ఒకే ఒక్క మ్యాచ్ తక్కువగా ఆడింది. కానీ వాళ్లకు ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఎస్ఆర్హెచ్ను ఓడించినా.. ఇతర జట్లతో కలిసి సంయుక్తంగా 10 పాయింట్లతో నిలుస్తారు. అందుకే ఈ మ్యాచ్ గెలవడం ఢిల్లీకి అత్యంత ముఖ్యం. ఇటీవలి మ్యాచ్లను పరిశీలిస్తే వాళ్లకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారంటే.. ఈ సీజన్లో వారి ప్రయాణం ముగింపునకు వచ్చినట్లే అవుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ‘‘ఓపెనింగ్ భాగస్వామ్యాలు పర్లేదు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు ఇంకా కూడా కుదురుకోలేకపోతున్నారు. పరుగులు సాధించలేకపోతున్నారు. ఇక అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో కూడా బౌలర్లు విఫలమవుతున్నారు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సన్రైజర్స్ తొమ్మిదింట 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్కింగ్స్ చేతిలో ఓడగా.. ఢిల్లీ.. లక్నో చేతిలో ఓటిమిని మూటగట్టుకుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారగా... గెలిచి ఫామ్లోకి రావాలని భావిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ 50: సన్రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: బ్రబౌర్న్ స్టేడియం, ముంబై సమయం: రాత్రి 07:30 నిమిషాలకు ఆరంభం చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Our last few games have been about small margins. It's time to seize the clutch moments, starting with today. And @tripathirahul52 concurs. 💪🏾🗣️#DCvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/JKLhXJZuJV — SunRisers Hyderabad (@SunRisers) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
11 ఏళ్లలో ఒకే ఒక్కడు.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్
Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade: ముంబై వేదికగా న్యూజిలాండ్తో రెండో టెస్ట్లో టీమిండియా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. తద్వారా మయాంక్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్పై మయాంక్ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్ వేదికగా కివీస్పై శిఖర్ ధావన్ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్ ఓవరాల్గా టెస్ట్ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమానర్హం. చదవండి: T20 World Cup 2021: రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో బాబర్కి నేనే చెప్పా... -
కోహ్లీకి సిరాజ్ స్పెషల్ విషెస్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పరుగుల వీరుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అటు అభిమానులు, ఇటు సహచర ఆటగాళ్లు కోహ్లీకి శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆర్సీబీ సహ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఒక వీడియోద్వారా విరాట్కు సర్ప్రైజ్ విషెస్ అందించాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే అంటూ ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీకి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్, బీసీసీఐ, ఐసీసీ, యూసుఫ్ పఠాన్, అజింక్యా రహానే , వసీం జాఫర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్లో నేడు(శుక్రవారం) కీలకమై పోటీ జరగనుంది. సూపర్ 12 పోరులో మెన్ ఇన్ బ్లూ స్కాట్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కోహ్లీ సేన కసరత్తు చేస్తోంది. Wishing a very happy birthday to @imVkohli, have a great day and year ahead 🤗 #MajorThrowback 😅 #HappyBirthdayViratKohli pic.twitter.com/doSw7m6D08 — Wasim Jaffer (@WasimJaffer14) November 5, 2021 కాగా 1988 నవంబర్ 5 వ తేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా సారధిగా ఎదిగాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ అనేక రికార్డులను నమోదు చేశాడు. టెస్టుల నుంచి వన్డే, టీ2 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ 1 బ్యాట్స్మెన్గా నిలిచిన ఏకైక భారత బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) 23,159 intl. runs & going strong 💪 Most Test wins as Indian captain 👍 2011 World Cup & 2013 Champions Trophy-winner 🏆 🏆 Wishing @imVkohli - #TeamIndia captain & one of the best modern-day batsmen - a very happy birthday. 🎂👏 Let's relive his fine ton in pink-ball Test 🔽 — BCCI (@BCCI) November 5, 2021 -
అమ్మ వైరల్ ఫోటోకి సెహ్వాగ్ స్పందన
న్యూఢిల్లీ : అమ్మ అంటే అమ్మే ..ఆమెకు సాటి మరెవరు రారు.. అమ్మ పడుతున్న కష్టం చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. అంతేకాదు ఆ అమ్మకు తక్షణమే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆక్సిజన్ సపోర్ట్ ఆక్సిజన్ సపోర్ట్తో తన కుటుంబానికి వంట చేస్తున్న ఓ మాతృమూర్తి ఫోటో ఒకటి, గత రెండు రోజులుగా నెట్టింట వైరల్గా మారింది. తల్లి ప్రేమకు నిర్వచనం అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు కరోనా కష్టకాలంలోనూ అమ్మకు పని చెప్పారంటూ విమర్శించారు. అయితే వీరేంద్రుడు వీరికి భిన్నంగా స్పందించాడు. తన ఫౌండేషన్ తరఫున ఆ అమ్మకు అవసరమైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందిస్తానని... తనకు సంప్రదించాలంటూ వాట్సప్ నెంబర్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వంట చేసి పెడతాం కేవలం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందివ్వడంతోనే తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు వెటరన్ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్. ఆ అమ్మకు పని భారం తగ్గించేందుకు .. ఆమెకు, ఆమె కుటుంబం మొత్తానికి తానే ఆహారం అందిస్తానంటూ ప్రకటించాడు. ఆ అమ్మ నుంచి స్పందన రావడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో తనే చొరవ తీసుకున్నాడు. ఎవరైనా ఆ.. అమ్మ అడ్రస్ , ఫోన్ నంబర్ తెలిస్తే వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ , అమృతాషుగుప్తాలకు తెలియజేయాలని కోరాడు. -
ధోనిపై ద్రవిడ్ ఆగ్రహం; మళ్లీ ఆ అవకాశం ఇవ్వలేను
న్యూఢిల్లీ: ‘ది వాల్’ గా పేరున్న భారత మాజీకెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతహాగా మృదు స్వభావి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన ప్రశాంతంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓర్పు, సహనం ప్రదర్శించి మిస్టర్ కూల్కు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అయితే ఈ మిస్టర్ కూల్కు ధోనిపై ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చిందట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఇటీవల ద్రవిడ్ ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఈ మిస్టర్ డిపెండబుల్ కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంటాడు. ప్రస్తుతం ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా ద్రవిడ్ ఆగ్రహించాడా అని చాలా మందికి ఓ ప్రశ్న ఎందురైంది. ఈ సందర్భంగా సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ద్రవిడ్ ధోనిపై ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేశాడు. 2006లో పాకిస్థాన్తో వన్డే సిరిస్ సమయంలో ధోనీపై ద్రవిడ్ అరిచాడని పేర్కొన్నాడు. ‘ధోనీ ఓ మ్యాచ్లో పాయింట్ దిశలో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్ కోప్పడ్డాడు. అలాగేనా ఆడేది..? మ్యాచ్ను నువ్వే ముగించాల్సింది అంటూ అరిచాడని’ తెలిపాడు. ధోని-ద్రవిడ్ ఆంగ్ల సంభాషణలో తనకీ విషయాలు అర్థమయ్యాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాతి మ్యాచ్లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవతలి ఎండ్లో ఉన్న సెహ్వాగ్ వెళ్లి బౌండరీల కోసం ప్రయత్నించడం లేదని ధోనిని అడగాడట. అందుకు ధోని ‘ద్రవిడ్ తనని మళ్ళీ తిట్టడం ఇష్టం లేదని, కనుక ఇన్నింగ్స్ను ముగించేవరకు తాను క్రీజ్లోనే కొనసాగాలనుకున్నట్లు’ తెలిపాడని ఈ సందర్భంగా సెహ్వాగ్ వెల్లడించారు. ( చదవండి: రాబోయే రోజుల్లో క్రికెట్లో మార్పులపై ద్రవిడ్ వ్యాఖ్యలు ) Does #MSDhoni never answer his phone? @VirenderSehwag & Ashish Nehra bust myths around MSD, on #CricbuzzLive Hindi#IPL2021 #CSKvDC pic.twitter.com/OJUFeM5tuR— Cricbuzz (@cricbuzz) April 10, 2021 -
మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా!
ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్నటికి మొన్న మెదుడు ఫోటో షేర్ చేసి ఇంగ్లండ్కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్ తాజాగా సచిన్కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో సచిన్ ఫిజియో పక్కన కూర్చొని తన మణికట్టు కింది భాగంలో సూదులు గుచ్చుకొని కనిపిస్తాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్.. ఫిజియోను ఉద్దేశించి '' సచిన్ పాజీ తర్వాతి మ్యాచ్ ఆడుతాడా'' అంటూ అడిగాడు. దీనికి ఫిజియో... అవునన్నుట్లుగా తలూపాడు.. అయితే సచిన్ మాత్రం.. ఏదో ఇది చిన్న ప్రయత్నం మాత్రమే.. ఎందుకంత బాధపడుతున్నావు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీంతో పక్కనే ఉన్న యువరాజ్ ..''నీకు ఇలానే కావాలి వీరు బాయ్'' అంటూ చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా మాజీ క్రికెటర్లంతా కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 పేరిట సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సచిన్ కెప్టెన్సీలో సెహ్వాగ్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ సహా ఇతర ఆటగాళ్లు ఇండియా లెజెండ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 5న బంగ్లాదేశ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో సెహ్వాగ్ 35 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. 33 పరుగులతో సచిన్ అతనికి సహకరించాడు. కాగా ఇండియా లెజెండ్స్ తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లండ్ లెజెండ్స్ను ఎదుర్కోనుంది. చదవండి: వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు సచిన్ పాజీతో మళ్లీ బ్యాటింగ్.. సూపర్ ఇన్నింగ్స్! Pratikriya from God ji @sachin_rt pic.twitter.com/AekD0vEaLZ — Virender Sehwag (@virendersehwag) March 8, 2021 -
డీజేలో తాత చిందులు.. కర్రతో బామ్మ ఎంట్రీ..
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరచూ ఆసక్తికర విషయాలను, సరదాల సంఘటనలను పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అంతేగాక ఆ పోస్టులపై తనదైన శైలిలో చురకలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ ఆకట్టుకుంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఓ తాత డీజేలో కుర్రాళ్లతో సమానంగా చిందేలేస్తు కనిపించాడు. అలా పెళ్లి డీజేలో డ్యాన్స్ చేస్తున్న ఆ తాత దగ్గరికి అతడి భార్య ఆకస్మాత్తుగా చేతి కర్రతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఫుల్ జోష్తో డ్యాన్స్ చేస్తున్న ఆ వృద్దుడు ఆమెను చూడగానే హడలేత్తిపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ వీడియోని వీరూ తన ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేస్తూ ‘వయసు తాత్కాలికం.. కానీ భార్య చేతి కర్ర మాత్రం శాశ్వతం’ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
రహానే కెప్టెన్సీ భేష్..
మెల్బోర్న్: ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్లో అశ్విన్, బుమ్రా, సిరాజ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే ఎంతో తెలివిగా ఫీల్డింగ్ సెట్ చేశాడంటూ కొనియాడాడు. ఈ మేరకు.. ‘‘మొదటి రోజు ఆటలోనే, కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం గొప్ప విషయం. రహానే, బౌలర్ల సేవలను ఉపయోగించుకున్న తీరు అమోఘం. ఫీల్డింగ్ విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్, బుమ్రా, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉంది’’ అని వీరూ ట్వీట్ చేశాడు. (చదవండి: రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!) ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం జట్టు ఆట తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలి రోజు. బౌలర్లు గొప్పగా రాణించారు. అద్భుతమైన ముగింపు కూడా’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా తన భార్య, నటి అనుష్క శర్మ తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో అజింక్య రహానే తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కాగా రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసి సత్తా చాటడంతో.. ఆసీస్ను 195 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా బాక్సింగ్ డే టెస్టుతో హైదరాబాదీ సిరాజ్ సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. Top day 1 for us. Great display from the bowlers and a solid finish too. 🇮🇳👏 — Virat Kohli (@imVkohli) December 26, 2020 -
'కాంకషన్పై మాట్లాడే అర్హత ఆసీస్కు లేదు'
ఢిల్లీ : ఆసీస్తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన యజ్వేంద్ర చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) 'టీమిండియా కాంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్ సమయంలో స్టార్క్ బౌలింగ్లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు. ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్కు రాగానే హెల్మట్ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అతను ఫీల్డింగ్కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్ సబ్స్టిట్యూట్ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్ లేదా బౌలింగ్కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్ను కాంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఆడించింది. చహల్ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్ పదం ఆసీస్కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్ ఇలానే వివాదం చేసేదా.. అయినా కాంకషన్ నిర్ణయంపై ఆసీస్కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్ గాయపడిన స్మిత్ స్థానంలో మార్నస్ లబుషేన్ను ఆడించింది. ఆ మ్యాచ్లో లబుషేన్ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్ రిఫరీ బూన్ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంకషన్పై ఆసీస్ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) -
అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్
మెల్బోర్న్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలపై ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్లో మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్లీడర్’’ అంటూ సెహ్వాగ్ మాక్స్వెల్ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్ ట్రిప్ను ఎంజాయ్ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’) ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్వెల్.. ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. -
అదుర్స్: రజనీ గెటప్లో సెహ్వాగ్!
ఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ మొదలైనప్పటి నుంచి ‘వీరు కి బైఠక్’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఆకట్టున్నాడు. ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ గెటప్లో.. ముంబైతో మ్యాచ్లో పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై జట్టును సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కాపాడలేడని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. వాష్రూమ్కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరడమేంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ నిన్నటి మ్యాచ్లో.. బంతి వికెట్ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు. దీంతోపాటు ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్నెస్ పెద్దగా లేని ఆటగాళ్లకు వీరు చురకలు వేశాడు. గాయం కారణంగా చెన్నైతో మ్యాచ్కి దూరమైన రోహిత్ శర్మ స్థానంలో సౌరభ్ తివారీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బరువు విషయంలో రోహిత్ కన్నా సౌరబ్ తక్కువ వాడేం కాదనే ఉద్దేశంలో.. ‘వడా పావ్కు బదులు.. సమోసా పావ్ మ్యాచ్లో పాల్గొంది’ అని వీరు చమత్కరించాడు. ఇక చెన్నై జట్టులోని 41 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ను తాహిర్ చాచా (అంకుల్) అని వీరు పేర్కొన్నాడు. కాగా, షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. 9 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసింది. అందులో సామ్ కరన్ ఒక్కడివే 52 పరుగులు. ఇక సమష్టి ప్రదర్శనతో ముంబై అలవోక విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. -
జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్, సర్దార్
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ ఈ ప్యానల్కు చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ సింగ్, ‘టాప్స్’ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు. -
‘గిల్క్రిస్ట్-సెహ్వాగ్ల ఓపెనింగ్ చూడాలి’
సిడ్నీ: పదకొండు మంది సభ్యులతో కూడిన భారత్-ఆస్ట్రేలియా ఆల్టైమ్ అత్యుత్తమ వన్డే జట్టును ఆసీస్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. గురువారం ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జట్టును ప్రకటించాడు. అయితే ఫించ్ ప్రకటించిన జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు లేకపోవడం గమనార్హం. అయితే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి అనూహ్యంగా వన్డే జట్టులో అవకాశం కల్పించాడు. ఓపెనర్లను ఎంపిక చేయడానికి ఫించ్ తర్జనభర్జన పడ్డాడు. ఒక ఓపెనర్గా ఆడమ్ గిల్క్రిస్ట్ను ఎంపిక చేయగా.. అతడికి జోడిగా ఎవరిని తీసుకోవాలనేదానిపై తీవ్రంగా ఆలోచించాడు. (సోషల్ మీడియాకు దూరంగా ధోని..) ‘నా తొలి ప్రాధాన్యత వీరేంద్ర సెహ్వాగే. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. కానీ అతని ఆట ముగిసింది. దీంతో రోహిత్ శర్మను తీసుకుంటున్నా. అతని వన్డే రికార్డులు అత్యద్భుతం. కానీ గిల్క్రిస్ట్-సెహ్వాగ్లు ఓపెనర్లుగా దిగి ఆడితే చూడాలని ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడు, నాలుగు స్థానాల కోసం రికీ పాంటింగ్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేస్తా. హార్దిక్ పాండ్యా, ఆండ్రూ సైమండ్స్లు ఆల్రౌండర్ల స్థానాన్ని భర్తీ చేస్తారు’ అని ఫించ్ వివరించారు. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిని కూడా భారత్-ఆసీస్ వన్డే జట్టులో ఎంపిక చేశాడు. అయితే ధోని భవిత్యంపై మాట్లాడేందకు ఫించ్ నిరాకరించాడు. ‘ధోని భవిష్యత్పై మాట్లాడను. అతడు ఒక అద్భుతమైన ఆటగాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ ధోని ఆటను ఆస్వాదిస్తుంటాను. అయితే అతని భవిష్యత్పై వస్తున్న వార్తలపై స్పందించలేను. ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు’ అని ఫించ్ అన్నాడు. ఇక బ్రాడ్ హాగ్, హర్భజన్ సింగ్లలో ఒకరిని స్పిన్నర్గా జట్టుతోకి తీసుకుంటానని ఫించ్ పేర్కొన్నాడు. బ్రెట్లీ, గ్లెన్ మెక్గ్రాత్, జస్ప్రిత్ బుమ్రాలతో బౌలింగ్ విభాగాన్ని భర్తీ చేశాడు. (విదేశాల్లో ఐపీఎల్-2020?) -
‘అక్తర్.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్, క్రికెటేతర విషయాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానళ్లో ఆసక్తికర, సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండే అక్తర్కు ఎందుకో మూడేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. దీంతో వెంటనే ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా ఓ వీడియోను రూపొందించి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. అయితే అనేదంతా అనేసి చివర్లో ‘వీరూ భాయ్ సరదాగా అన్నాను.. నా వ్యాఖ్యలను నువ్వు కూడా సరదాగా తీసుకో’అని అక్తర్ పేర్కొనడం కొసమెరుపు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సెహ్వాగ్ ప్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. భారత్, భారత క్రికెట్ గురించి మాట్లాడకుంటే పాకిస్తాన్ క్రికెటర్లకు వ్యాపారం సాగదు కదా అని సెహ్వాగ్ అప్పుడెప్పుడో వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అక్తర్ మూడేళ్ల తర్వాత రియాక్ట్ అయ్యాడు. ‘నా స్నేహితుడు సెహ్వాగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారం కోసమే అక్తర్ భారత క్రికెట్ గురించి మాట్లాడతాడంటూ ఆ వ్యాఖ్యల్లో ఉంది. అయితే వీరూ భాయ్కు ఒక్కటే చెప్పదల్చుకున్నారు. డబ్బు అనేది నాకు భారత్ ఇచ్చింది కాదు. ఆ భగవంతుడు ఇచ్చాడు. నీ(సెహ్వాగ్) తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ డబ్బే నా దగ్గర ఉంది. పదిహేనేళ్లు పాకిస్తాన్ తరుపున సుదీర్ఘ క్రికెట్ ఆడటంతో నాకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సరిపడేంత డబ్బు సంపాదించుకున్నాను. ఇంకా డబ్బు కోసం ఎందుకు వెంపర్లాడుతాను. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయాలు చెప్పాను. ఇక టీమిండియా సిరీస్ గెలిచాక మెచ్చుకున్నాను. కోహ్లి సేన ఓడిపోయినప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా గతంలో ఎప్పుడో సెహ్వాగ్ అన్న మాటలను తాజాగా ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. అందుకే నేను చెప్పాల్సింది చెప్పాను. అయితే సెహ్వాగ్పై నాకు ఎలాంటి కోపం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. సెహ్వాగ్ చాలా సరదా వ్యక్తి. సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే ఆ వ్యాఖ్యలు కూడా సరదాగానే అని ఉంటాడని భావిస్తున్నా’అని అక్తర్ పేర్కొన్నాడు. అయితే చివర్లో తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని సీరియస్గా తీసుకోవద్దని సెహ్వాగ్తో పాటు భారత ఫ్యాన్స్కు అక్తర్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. చదవండి: కోహ్లి అప్పుడా వచ్చేది? ‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’ -
మా తరంలో మ్యాచ్ విన్నర్ అతడే: దాదా
ముంబై: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్పై బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సహచర క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. తన క్రికెట్ కెరీర్లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగే అని కితాబిచ్చాడు. భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లతో కలసి ఎన్నో మ్యాచ్ల్లో ఆడిన గంగూలీ... తన తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్గా మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ను ఎంచుకున్నాడు. ‘ఓపెనర్గా సెహ్వాగ్ మా కాలంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్. అతడిని ఓపెనర్గా బరిలోకి దిగమని చెప్పింది నేనే. అలాగే జట్టు కోసం అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగడానికి సన్నద్ధంగా ఉండాలని సైతం చెప్పాను. వన్డేల్లో నాలుగు, ఐదు స్థానాల్లో నేను బ్యాటింగ్ చేస్తే పూర్తిగా రాణించలేను. సచిన్ కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తే ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న పరుగుల్లో సగమే చేసేవాడేమో. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సెహ్వాగ్ను బ్యాటింగ్ చేయమని చెప్పా. ఆ నిర్ణయం సెహ్వాగ్కు టీమిండియాకు ఎంతో లాభించింది’అని గంగూలీ వ్యాఖ్యానించాడు. -
కంటతడి పెట్టిస్తున్న ఫొటో
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. 1938లో బ్రిటీష్ వారి తుపాకీ గుళ్లకు బలైపోయిన బాజీ రౌత్ అనే బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. దేశ రక్షణకై బాల్యంలోనే అతడు చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సెహ్వాగ్... బాలల దినోత్సవం నాడు బాజీని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకతను తన పోస్టులో వివరించాడు. అతి చిన్న వయస్సులోనే ప్రజల రక్షణకై ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తొలి(పిల్లవాడైన) అమరుడిగా అభివర్ణించాడు. ఈ మేరకు.. ‘ఒడిశాలోని నీలకాంతపూర్కు చెందిన అమరుడు బాజీ రౌత్. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు.. ఓ బ్రిటీష్ దళం తమను పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకువెళ్లాల్సిందిగా అడిగింది. అయితే అదే దళం తమ గ్రామంలోని ఎంతో మంది అమాయకులను అత్యంత పాశవికంగా చంపిందంటూ వారి గురించి కథలు కథలుగా విన్న బాజీ.. వారు తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారు కదా ఆలోచించాడు. అందుకే తీరం దాటించే ప్రసక్తే లేదని వారితో కరాఖండిగా చెప్పాడు. దాంతో చంపేస్తామంటూ బ్రిటీష్ సేనలు బాజినీ భయపెట్టాయి. అయినప్పటికీ బాజీ వారికి తలొగ్గలేదు. వాళ్ల మాటలకు ఎదురుచెప్పాడు. ఇంతలో కోపోద్రిక్తుడైన ఓ బ్రిటీష్ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోయాడు. అయినప్పటికీ బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చిచెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా... మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్ మాలిక్, ఫగూ సాహో, హృషి ప్రదాన్, నాటా మాలిక్ కూడా మృత్యువాత పడ్డారు. బాలల దినోత్సవం నాడు ఆ ధైర్యశాలికి సెల్యూట్ చేస్తున్నా. అత్యంత పిన్నవయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు’ సెహ్వాగ్ తన ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో.. ‘చాలా గొప్ప వ్యక్తిని గుర్తుచేశారు. అతడి త్యాగం మరవలేనిది. ఆ అమాయకపు ముఖం కంటతడి పెట్టిస్తోంది. మీకు ధన్యవాదాలు వీరూ భాయ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాజీ రౌత్ ఒడిశాలోని నీలకాంత్పూర్లో 1926లో జన్మించాడు. పేద కుటుంబానికి చెందిన అతడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. అతడి తల్లి ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో 1938లో బాజీ రౌత్ బ్రిటీష్ సేనల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. -
‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’
భారత క్రికెట్కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో.. సముద్రంలో సునామీ అనుకోవాలో.. బౌలర్ల్ హిట్ లిస్ట్లో ఉండే ఆ హిట్ మ్యాన్ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా. టీమిండియా ఓపెనర్, సిక్సర్ల కింగ్, సెహ్వాగ్ స్క్వేర్, అభిమానులు ముద్దుగా పిలిచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. (చదవండి: ప్రతీ క్షణం అతడి గురించే చర్చ) వన్డే క్రికెట్లో అసాధ్యమనుకునే డబుల్ సెంచరీని అవలీలగా మూడు సార్లు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి డబుల్ సెంచరీ సాధించనప్పుడు ఏదో గాలి వాటమనుకున్నారు.. రెండో ద్విశతకం సాధించనప్పుడు ప్రత్యర్థి జట్టుకే కాదు.. భారత ఫ్యాన్స్కు నిద్రలోనూ రోహిత్ బ్యాటింగే గుర్తొచ్చేదంటే అతిశయోక్తి కాదు. బౌండరీ నలువైపులా చూడముచ్చటైన షాట్లు.. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు.. రోహిత్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో దిక్కుతోచక పసిపిల్లలయ్యారు. ఈ అపూర్వ ఘట్టం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. రోహిత్ విశ్వరూపం ప్రదర్శించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్ సాధించిన ఘనతను గుర్తుచేస్తూ ఐసీసీ, బీసీసీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా హిట్మ్యాన్కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ మ్యాచ్లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇక ట్రిపుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు అనే రీతిలో రోహిత్ బ్యాటింగ్ సాగింది. అయితే ఆ మ్యాచ్లో రోహిత్ నాలుగు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను లంక ఆల్రౌండర్ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో లంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆ క్యాచ్ వదిలేసినందుకు పెరీరా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఇక రోహిత్ సునామీ ఇన్నింగ్స్కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో 153 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. అంతకుముందు.. ఆ తర్వాత రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు. 2013లో నవంబర్ 2న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఖాయమైంది. ఇక ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఆ మ్యాచ్లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్గా నిలిచి ట్రిపుల్ డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రోహిత్తో పాటు ఇంకెవరు? వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. 2010లో దక్షిణాఫ్రికాపై ఆ ఘనత సాధించి వన్డేల్లోనూ ద్విశతకం సాధించవచ్చని సచిన్ ప్రాక్టికల్గా రుజువు చేసి చూపించాడు. ఇక సచిన్ శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ గురువు దారిలోనే పయనించాడు. 2011లో ఇండోర్ స్టేడియంలో వెస్టిండీస్పై 219 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్పై(237 నాటౌట్), యూనివర్సల్ స్టార్ క్రిస్ గేల్ జింబాబ్వే(215)పై ద్విశతకాలు నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. (చదవండి: మనసులో మాట బయటపెట్టిన రోహిత్) #OnThisDay in 2014, Rohit Sharma went big! The Indian opener smashed 264, the highest ever ODI score 🤯 The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL — ICC (@ICC) November 13, 2019 -
సెహ్వాగ్.. సెహ్వాగే: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్తో తనను పోల్చడం సరికాదని టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ అన్నాడు. తామిద్దరం ఒకేలా ఆడతాం అని జనం అనుకుంటున్నారని చెప్పాడు. అయితే సెహ్వాగ్తో కలిపి తన పేరు వినబడటం సంతోషంగానే ఉందని పేర్కొన్నాడు. ‘కానీ సెహ్వాగ్ సెహ్వాగే. క్రికెట్లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది. నేను ఎలా ఆడాలని టీమ్ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారమవుతున్నాయ’ని రోహిత్ శర్మ అన్నాడు. టెస్టులో ఓపెనర్గా సత్తా చాటడం పట్ల ‘హిట్మాన్’ సంతోషం వ్యక్తం చేశాడు. ఓపెనర్గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నాడు. టెస్టుల్లో ఓపెనర్గా అవకాశం ఆలస్యంగా వచ్చినా తనకు మంచే జరిగిందన్నాడు. ఈడెన్ గార్డెన్లో పింక్ బాల్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు. -
కొత్త లుక్లో ధోని; వైరల్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త లుక్ తళుక్కున మెరిశాడు. తలకు నలుపు రంగు గుడ్డ కట్టుకుని టీషర్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ధోని వీడియోను అభిమానులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ముంబైలో వాణిజ్య ప్రకటనల చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు, అభిమానులతో కలిసి ధోని దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పారామిలటరీలో సేవలందించి తిరిగొచ్చిన ‘మిస్టర్ కూల్’ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని ఆగస్టు 15న లేహ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా, ధోని రిటైర్మెంట్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రిటైర్మెంట్ విషయంలో ధోనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఫిట్గా ఉన్నంతకాలం అతడిని కొనసాగించాలని సూచించాడు. ఆటకు ఎప్పుడు వీడ్కోలు చెప్పాలో ధోనికి తెలుసునని అన్నాడు. (చదవండి: సైనిక దుస్తుల్లో ధోని బ్యాటింగ్; విజిల్ పోడు..!) -
అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే జైట్లీకి క్రికెట్తో ఎనలేని బంధం ఏర్పడింది. బీసీసీఐతో ఉన్న సత్ససంబంధాలతో ప్రతిభ ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను టీమిండియా తరుపున ఆడించే ప్రయత్నం చేశారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వారు. ఇక ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆరుణ్ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్తో పాటు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, హర్ష బోగ్లే, తదితర ఆటగాళ్లు అరుణ్ జైట్లీ మరణానికి ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం అరుదైన ఫోటో ట్వీట్ చేసిన కపిల్ సిబల్ -
‘కుంబ్లేను చీఫ్ సెలక్టర్గా చూస్తాం!’
న్యూఢిల్లీ: టీమిండియా లెజండరీ బౌలర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేను భవిష్యత్లో జాతీయ చీఫ్ సెలక్టర్గా చూస్తామని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఆ పదవికి కుంబ్లే అన్ని విధాల అర్హుడని స్పష్టం చేశాడు. బుధవారం ఓ సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘2007-08లో ఆస్ట్రేలియా సిరీస్కు తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాను. మ్యాచ్ రోజు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న నా దగ్గరికి వచ్చి ఇంకో రెండు సిరీస్ల వరకు నువ్వు జట్టుతోనే ఉంటావు. స్వేచ్చగా ఆడు.. అంటూ ప్రొత్సహించాడు. ఇలా ఓ ఆటగాడిపై సారథిగా అంత కాన్ఫిడెంట్ ఉండటం మామూలు విషయం కాదు. ఇక సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజాలతో ఆడాడు, అదేవిధంగా యువ క్రికెటర్లను ఎంతగానో ప్రొత్సహిస్తున్నాడు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి కుంబ్లేను సెలక్టర్గా చూడటానికి? నన్ను ఎవరూ కోరలేదు 2017లో బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి నన్ను ప్రత్యేకంగా కోరడంతోనే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాను. కానీ ఈ సారి ఎవరూ నన్ను అడగలేదు అందుకే దరఖాస్తు చేయలేదు. ఇక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఎంఎస్ ధోనిని ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తే మ్యాచ్ సమీకరణాలు వేరేలా ఉండేవి. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కొన్ని వ్యూహాలు బెడిసికొడతాయి. ఇక శ్రీశాంత్పై జీవితకాల నిషేధం ఎత్తివేయడం సంతోషకరం. త్వరలో టీమిండియా తరుపున ఆడాలని ఆకాంక్షిస్తున్నా’అంటూ సెహ్వాగ్ వివరించాడు. ఇక ప్రస్తుత సెలక్షన్ బృందంపై అన్ని వైపులా విమర్శలు వస్తున్న తరుణంలో సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆసక్తి నెలకొన్నాయి. ప్రస్తుతమున్న సెలక్టర్లలో ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన వారు కాదని, 15కి మించి వన్డే/టెస్టులు ఆడలేదని మాజీ క్రికెటర్లు విమర్శించిని విషయం తెలిసిందే. దీంతో సెలక్టర్ల కాంట్రాక్టు ముగుస్తున్న తరుణంలో బీసీసీఐ వారిని కొనసాగిస్తుందా లేదా వేరే ఎవరైనా దిగ్గజాలకు అవకాశం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి. -
నువ్వు కూడా అంతే కదా దాదా...!!
-
దాదా నువ్వు కూడా అంతే; సచిన్ కౌంటర్!!
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెగాటోర్నీ వరల్డ్ కప్-2019 కోసం కామెంటేటర్గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి కామెంటరీ బాక్స్లో సందడి చేశాడు. ఇక బుధవారం సఫారీలతో టీమిండియా తలపడిన నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సరికొత్త ఉత్సాహంతో తనదైన శైలిలో మాటల బాణాలు వదిలాడు. సెహ్వాగ్తో కలిసి దాదాపై పంచుల మీద పంచులు వేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. నువ్వు కూడా అంతే కదా దాదా...!! వరల్డ్ కప్-2019లో భాగంగా తమ మొదటి మ్యాచ్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సఫారీల కెప్టెన్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను ఫీల్డింగ్కు ఆహ్వానించాడు. అయితే భారత బౌలర్ల పదునైన బౌలింగ్తో సౌతాఫ్రికా 9వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేయగలింది. కాగా పిచ్ను సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి పేసర్లు రబడ (2/39), మోరిస్ (1/36) చుక్కలు చూపారు. ఇందులో భాగంగా క్రిస్ మోరిస్ తన మొదటి ఓవర్లోనే విజృంభించాడు. అతడి బౌలింగ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాట్ విరిగిపోయింది. ఈ విషయం గురించి కామెంటరీ బాక్స్లో ఉన్న గంగూలీ మాట్లాడుతూ... ‘బ్యాట్ కొసభాగం పలుచగా ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ సచిన్ బ్యాట్ మాత్రం విరిగిపోదు’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా..అవును నిజమే ఆయన బ్యాట్ ఎలా విరిగిపోతుందిలే దాదా అంటూ సెహ్వాగ్ బదులిచ్చాడు. వెంటనే మళ్లీ అందుకున్న గంగూలీ..‘ ఆయన బ్యాట్ కింద కొన్ని బంతులే పడతాయి. బ్యాట్ మధ్య భాగంలో పడే బంతులే ఎక్కువగా ఉంటాయి. అయినా సచిన్ బ్యాట్తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక్కోసారి బ్యాట్కు ఫెవిక్విక్ పెడతాడు. గ్లూ వాడతాడు. ఇలా ఏది వాడినా బ్యాట్ను సంభాలించుకోగలుగుతాడు’ అంటూ సచిన్ను టీజ్ చేశాడు. వీరిద్దరి సరదా సంభాషణలో ఎంట్రీ ఇచ్చిన సచిన్..కేవలం తనే కాదు దాదా కూడా బ్యాట్తో ఇలాంటి ఆటలే ఆడతాడు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా లార్డ్స్లో తామిద్దరం కలిసి ఆడిన తొలి టెస్టు మ్యాచ్ తాలూకు ఙ్ఞాపకాలు గుర్తు చేస్తూ... నవ్వులు పుయించాడు. కాగా ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం సాధించిన మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది. -
అప్పుడు సెహ్వాగ్ను ఏడిపించా: సచిన్
లండన్ : ఎప్పుడూ సరదాగా ఇతర ఆటగాళ్లను ఆటపట్టించే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఓ సారి సరదాగా ఏడిపించానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ప్రపంచకప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో సచిన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అది 2003 ప్రపంచకప్. పాకిస్తాన్తో మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సెంచూరియన్ వేదికగా మార్చి1న జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ సరదాగా సెహ్వాగ్ను ఆటపట్టించాడు. ఒపెనర్గా తాను ఎప్పుడూ స్ట్రైక్ తీసుకోనని, కానీ ఆరోజు సెహ్వాగ్ వచ్చి తనని తొలి బంతి ఆడమన్నాడని, దానికి తాను అంగీకరించలేదన్నాడు. అప్పటికే తాను సెహ్వాగ్ను ఏడిపించాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు. ‘సెహ్వాగ్.. నీ గ్యాస్తో అందరిని ఇబ్బంది పెడ్తున్నావు’ అని గట్టిగా నవ్వుతూ అన్నట్లు.. సచిన్ నాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఇక ఆ మ్యాచ్లో సెహ్వాగ్ 21, సచిన్ 98 పరుగులు చేశారు. సచిన్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ 26 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
‘అతడు ఈ తరం సెహ్వాగ్’
న్యూఢిల్లీ: యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో పోల్చాడు. ఇలాంటి ఆటగాడిని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని, సహజంగా ఆడనివ్వాలని సూచించాడు. ‘రిషబ్ పంత్ను ఈ తరానికి చెందిన వీరేంద్ర సెహ్వాగ్గా చెప్పుకోవచ్చు. భిన్నంగా చూడాల్సిన బ్యాట్స్మన్లో అతడు ఒకడు. పంత్ను జట్టులోకి తీసుకున్నా, తీసుకోకపోయినా అతడి ఆటతీరు మాత్రం మారద’ని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్–12లో బుధవారం విశాఖపట్నంలో సన్రైజర్స్ హైదరాబాద్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి ‘మ్యాన్ ద మ్యాచ్’ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో ఈరోజు జరగనున్న క్వాలిఫయర్ –2 మ్యాచ్లో పంత్పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సీజన్లో రిషబ్ పంత్ ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడి 450 పరుగులు చేశాడు. (చదవండి: ఐపీఎల్ 12; కుర్రాళ్లు కుమ్మేశారు!) -
సెహ్వాగ్ను తలపిస్తున్నాడు
వెస్టిండీస్కు మర్చిపోలేనిదిగా మిగిలిన ఈ పర్యటనను భారత జట్టు 3–0తో ముగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ విండీస్ చెన్నైలో జరిగే చివరి మ్యాచ్లోనైనా ఆతిథ్య జట్టుకు పోటీనిస్తుందా చూడాలి. వారి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకావడం లేదు. టీమిండియా ఆటగాళ్లు అటు బంతితో, ఇటు బ్యాట్తో అదరగొడుతున్నారు. కొత్త ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వన్డే, టి20 సిరీస్ల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.అచ్చం సెహ్వాగ్ను తలపించాడు. ఒక్కసారి జోరు అందుకుంటే అతన్ని ఆపడం కష్టం. భారీ సెంచరీల కోసం ఆకలిగొన్న వాడిలా విరుచుకుపడుతున్నాడు. ఓ బంతిని బౌండరీకి తరలించాక మరో భారీ షాట్ కొట్టే ముందు సెహ్వాగ్ ఓసారి మైదానాన్ని గమనించేవాడు. రోహిత్ మాత్రం అలవోకగా మరో షాట్కు యత్నిస్తాడు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కనబరిచే దూకుడు టెస్టుల్లోనూ కొనసాగించగలిగితే సంప్రదాయ క్రికెట్లో వివ్ రిచర్డ్స్, సెహ్వాగ్ తర్వాత ప్రపంచంలో అత్యంత విధ్వంసకర బ్యాట్స్మన్గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్, లారా, పాంటింగ్ లాంటి దిగ్గజాలు నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. కానీ రిచర్డ్స్, సెహ్వాగ్లాగా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడలేదు. వీరిద్దరూ తమ ఆటతీరుతో బౌలర్లను బెంబేలెత్తించారు. చివరి మ్యాచ్లో కుల్దీప్కు విశ్రాంతి కల్పించడంతో చహల్కు అవకాశం దక్కనుంది. అతను కూడా విండీస్ పనిపట్టడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భువనేశ్వర్కు మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. అరంగేట్రం ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా ఆకట్టుకున్నారు. చివరి మ్యాచ్లో ఫలితం ఎలా ఉన్నా... ఈ ఏడాది భారత్లో పర్యటించిన జట్లకు అంతగా కలిసి రాలేదు. -
చిత్ర విచిత్ర రనౌట్లు!
బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్మన్ రనౌట్ అవుతుంటారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ బ్యాట్స్మన్ అజహర్ అలీ వింతగా, నిర్లక్ష్యంగా రనౌట్ అవ్వడం తెలిసిందే. అయితే క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు కోకొల్లలు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇంజమాముల్ హక్, మిస్బావుల్ హక్, మహ్మద్ అమిర్, టీమిండియా బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇయాన్ బెల్, అలిస్టర్ కుక్, శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీథరన్లు ఉన్నారు. క్రీజులో పాతుకపోతున్నారు, ఇక గెలిచినట్టే అన్న తరుణంలో సిల్లీగా రనౌట్లు అవ్వడం అటు జట్టుకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు కామనే. కానీ టెస్టుల్లో, వన్డేల్లో మధ్య ఓవరల్లో నిర్లక్ష్యంతో రనౌటవ్వడం అందరికీ కోపాన్ని కలిగించే అంశం. వినూత్నంగా రనౌటవ్వడంలో పాక్ మాజీ సారథి ఇంజమాముల్ హక్ తొలి స్థానంలో ఉంటాడు. అందులోనూ కామెడీగా రనౌట్లయినవి 23 వరకు ఉండటం గమనార్హం. టీమిండియాతో వన్డే మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న ఇంజమామ్.. ఫీల్డర్ వికెట్ల వైపు విసిరిన బంతిని అడ్డుకోవడంతో అంపైర్ రనౌట్గా ప్రకటించాడు. అప్పుడు ఇలాంటి రనౌట్లు కూడా ఉంటాయా అని అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మిస్బావుల్ హక్, అమిర్, అజహర్ అలీలు కూడా ఫన్నీగా రనౌటయ్యారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్కు పరుగెత్తడం కన్నా బౌండరీలు బాదడం ఈజీ అనుకుంటాడు. 2007లో శ్రీలంక నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఫామ్లో ఉన్న సెహ్వాగ్ సిల్లీగా రనౌటవ్వడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. 2011లో టీమిండియాతో టెస్టు సందర్భంగా బంతి బౌండరీ దాటిందని ఇంగ్లండ్ బ్యాట్స్మన్ ఇయాన్ బెల్ పిచ్ మధ్యలో సహచర బ్యాట్స్మన్తో రిలాక్స్ అవుతున్నాడు. అయితే బౌండరీ వద్ద బంతి అందుకున్న ఫీల్డర్ ప్రవీణ్ కుమార్, కీపర్ ధోని సహకారంతో బెల్ను రనౌట్ చేశాడు. దీంతో షాక్లోనే బెల్ మైదానాన్ని వీడాల్సివచ్చింది. 2012లో కోల్కతాలో ఇంగ్లండ్-టీమిండియా టెస్టు సందర్భంగా ఆతిథ్య జట్టు బ్యాట్స్మన్ కుక్ భయంతో సిల్లీగా అవుటయ్యాడు. సింగిల్ తీస్తున్న క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతిని భయంతో తప్పించకోబోయి రనౌటగా వెనుదిరుగుతాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత సిల్లీ రనౌట్ అంటే ముత్తయ్య మురళీథరన్దే అని చెప్పవచ్చు. 2006లో న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్లో ఈ కామెడీ రనౌట్ చోటుచేసుకుంది. వరుసగా వికెట్లు పడుతుంటే ఒంటరి పోరాటం చేస్తున్న కుమార సంగక్కర ఒక్క పరుగు తీస్తే సెంచరీ పూర్తవుతుంది. అయితే స్ట్రైకింగ్లో ఉన్న సంగక్కర సింగిల్ తీసి శతకం అభివాదం చేస్తుండగానే అవతలి ఎండ్లో మురళీధరన్ అవుటని అంపైర్ ప్రకటించాడు. దీంతో సంగక్కర షాక్కు గురయ్యాడు. సహచర ఆటగాడిని అభినందించాలనే తొందరలో స్పిన్ మాంత్రికుడు సిల్లీగా రనౌటయ్యాడు. -
క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్లు
-
అలాంటిది చూడ్డం చాలా అరుదు : సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికేట్కు దూరమైనా, ట్వీటర్లో తనకు నచ్చిన వీడియోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. శనివారం ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆయన తన పోస్ట్లో ఓ పేషంట్ను తెగపొగిడేశారు. ఆ పేషంట్ డాక్టర్లకు సహకరిస్తున్న తీరుకు ఆయన ముచ్చటపడిపోయారు. ఇంతకీ ఎవరా పేషంట్ అనుకుంటున్నారా?.. సెహ్వాగ్ పొగిడింది, ముచ్చటపడ్డది ఓ ఏనుగును చూసి. ‘‘ఇలాంటిది చూడ్డం చాలా అరుదు. ఎంత అందంగా డాక్టర్లకు సహకరిస్తోంద’’ని పేర్కొన్నారాయన. ఆయన పోస్ట్ చేసిన ఆ వీడియోలో... ఓ ఏనుగు మెల్లగా డాక్టర్ వెంట నడుచుకుంటూ స్కానింగ్ రూంలోకి వస్తుంది. డాక్టర్ చెప్పగానే బుద్దిగా నేలపై పడుకుంటుంది. ఓ సారి కొద్దిగా లేవమనగానే లేచి మళ్లీ పడుకుంటుంది. డాక్టర్లు స్కానింగ్ చేసేంత వరకు అలా కదలకుండా నేలపై పడుకుంటుంది. Rare sight. How beautifully does this patient cooperate with the doctors ! pic.twitter.com/5Fp7Wo14U3 — Virender Sehwag (@virendersehwag) July 21, 2018 -
ఆ మెయిల్ గురించి చెప్పింది నేనే : సెహ్వాగ్
కోల్కతా : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా అప్పటి కోచ్ గ్రేగ్ చాపెల్ బీసీసీఐకి మెయిల్ రాయడాన్ని దాదాకు చెప్పింది తానేనని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. శుక్రవారం కోల్కతాలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన వీరు ఆనాటి రోజులను నెమరువేసుకున్నారు. ‘కడుపు నొప్పిగా ఉందని అంపైర్స్కు చెప్పి నేను ఫీల్డీంగ్ చేయకుండా మైదానం వీడాను. ఐదు ఓవర్లు విశ్రాంతి కావాలని కోరాను. నేను వెళ్లి గ్రేగ్చాపెల్ (అప్పటి టీమిండియా హెడ్ కోచ్) వెనుకాల కూర్చున్నాను. ఆ సమయంలో గ్రేగ్.. గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్ రాయడం చూశాను. వెంటనే ఈ విషయాన్ని దాదాకు తెలియజేశానని’ సెహ్వాగ్ 2005 జింబాంబ్వే పర్యటనలోని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన గ్రేగ్చాపెల్ను బీసీసీఐ 2005లో భారత క్రికెట్ జట్టుకు హెడ్కోచ్గా నియమించింది. ఆ సమయంలో కెప్టెన్గా ఉన్నా గంగూలీకి, కోచ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరి.. వివాదస్పదమైన విషయం తెలిసిందే. చివరకు గంగూలీ జట్టు నుంచి స్థానం కూడా కోల్పోయాడు. క్రికెటర్గా అవి మధుర క్షణాలు.. ఆ రోజుల్లో తాను టెస్టులు ఆడలేనని, కేవలం తెల్లబంతితోనే రాణించగలనని అందరూ అంటుండేవారని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ‘టెస్టుల్లో తొలి సెంచరీ సాధించినప్పుడు గంగూలీ కౌగిలించుకొని.. టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించాడు. దీంతో నేనేంటో నిరూపించాలనుకున్నాను’.అని టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాపై 2001లో అరంగేట్ర మ్యాచ్లోనే సెహ్వాగ్(105) తొలి సెంచరీ నమోదు చేశాడు. ఓపెనింగ్ అవకాశం ఇచ్చింది గంగూలే సచిన్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాలని గంగూలీ, అప్పటి కోచ్ జాన్రైట్లు తనకు సూచించారని సెహ్వాగ్ తెలిపాడు. ‘సచిన్, గంగూలీలు ఉన్న తర్వాత నేనేందుకు అని వారిని ప్రశ్నించా. మిడిలార్డర్లో ఆడనివ్వండని కోరా. కానీ సౌరవ్, జాన్రైట్లు ఆ ఓపెనింగ్ స్థానం నీకోసమేనని పట్టుబట్టి ఆడించారు.’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సెహ్వాగ్ కింగ్స్ పంజాబ్ మెంటర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కొత్తగా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్, అశ్విన్లను ఈ డాషింగ్ ఓపెనర్ కొనియాడాడు. దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్లలో తమిళనాడు కెప్టెన్గా వ్యవహరించాడని, అశ్విన్ చాలా స్మార్ట్ అని, బౌలర్గా మైదానంలోని పరిస్థితులను అర్థచేసుకోగలడని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ ఇరు జట్ల మధ్య కోల్కతాలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. -
అతనో వినూత్నమైన కెప్టెన్: నాయర్
సాక్షి, స్పోర్ట్స్ : ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్పై ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్ చాలా మంచి వ్యక్తి. వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్గా ఉన్న తనకు ఐపీఎల్లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో పంజాబ్ జట్టు.. కరుణ్ నాయర్తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్ను ఈ సీజన్లోని పంజాబ్ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
ఆయన సూపర్స్టార్.. ఇది ఓపెన్ సీక్రెట్!
ట్విటర్లో ఫన్నీమ్యాన్ ఎవరంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్దే.. ఇపుడు ఆ స్థానాన్ని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. గతంలో సెహ్వాగ్ బర్త్డేకు ఉల్టా ట్వీట్తో విష్ చేసిన సచిన్ తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు కూడా ఇదేవిధంగా ఫన్నీగా విషెస్ చెప్పాడు. ‘హ్యపీ బర్త్డే ఆమిర్ ఖాన్.. నువ్వు సూపర్స్టార్వి.. అందులో సీక్రెట్ ఏమీలేదు.. హాహాహా’ అంటూ సచిన్ ట్వీటాడు. ఆమిర్ ఇటీవల ‘సీక్రెట్ సూపర్స్టార్’ సినిమా తీసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరును ఉటంకిస్తూ.. సచిన్ ఇలా సరదాగా ఆమిర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘విష్ యూ ద బెస్ట్ ఆల్వేస్ మై ఫ్రెండ్’ అంటూ జోడించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీగా అనేక విజయాలు అందించిన సెహ్వాగ్, సచిన్లు ఇప్పుడు ట్విటర్లోనూ తమదైన రీతిలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. సూపర్స్టార్ బర్త్డే గిఫ్ట్... హిట్ల మీద హిట్లు కొడుతూ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న బాలీవుడ్ సూపర్స్టార్ అమిర్ ఖాన్ తన అభిమానులకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం 53వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మంగళవారం ఫోటో షేరింగ్ మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు. మొదటి పోస్ట్గా తల్లి జీనత్ హుసేన్ ఫోటోను అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్లో అభిమానులతో టచ్లో ఉండే అమిర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో చేరటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ట్విటర్లో 23 మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 15 మిలియన్ల లైక్స్తో దూసుకుపోతున్నఅమీర్ ఖాన్ ఇన్స్టాగ్రామ్లో చేరిన కొద్ది గంటల్లోనే 2.41 లక్షలమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. Happy birthday, @aamir_khan. You are a superstar and that's no secret... HaHaHa 😝 Wish you the best always my friend. pic.twitter.com/qbUXsARKMI — Sachin Tendulkar (@sachin_rt) March 14, 2018 -
‘ధోనిని 4వ స్థానంలో పంపండి’
న్యూఢిల్లీ : మాజీ కెప్టెన్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపితే బావుంటుందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అవసరమైన సమయంలో ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకోవడంలో ముందుండే మహేంద్ర సింగ్ ధోని ట్వంటీ-20 ఫార్మాట్లో గత కొంతకాలంగా క్రీజులో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల్లో ధోని బరిలోకి దిగనున్నాడు. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాల తర్వాత ధోనీ బ్యాటింగ్కు వస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తుండటంతో కుదురుకోవడానికి సమయం దొరకడం లేదు. దీంతో పెద్దగా పరుగులేమీ చేయకుండా వెనుదిరగాల్సి వస్తోంది. దీని గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ధోనీకి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పిస్తే బావుంటుందని అన్నాడు. నాలుగో స్థానంలో ధోనిని పంపడం వల్ల భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ఈ విషయం కోహ్లికి తెలుసని, ధోని త్వరగా అవుటైతే తర్వాత పరిస్థితి ఏంటి? అనే ఉద్దేశంతోనే ఆ ధైర్యం చేయడం లేదేమోనని అన్నాడు. ఈ విషయంపై ఎలాంటి డైలమా అవసరం లేదని చెప్పాడు. మనీష్ పాండే, హార్దిక్, జాదవ్ల్లో ఒకరికి ఇన్నింగ్స్ ఫినిషింగ్ బాధ్యతను అప్పజెప్పడమే బెటరని సూచించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్కు ట్వంటీ-20ల్లో మంచి రికార్డే ఉంది. ధోని సారథ్యంలోని టీమిండియా 2007లో టీ-20 ప్రపంచకప్ను గెలుపొందింది. -
అప్పుడు గంగూలీ.. ఇప్పుడు కోహ్లి
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి సారి సిరీస్ గెలిచిన కోహ్లి సేనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంగూలీ అప్గ్రేడ్ వర్షనే కెప్టెన్ విరాట్ కోహ్లి అని ఆకాశానికెత్తాడు. ఓ టీవీ చానెల్లో మాట్లాడుతూ.. ‘కోహ్లి నెం.1 కెప్టెన్. గత ఎనిమిది సిరీస్ విజయాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప సారథిని ఇప్పటి వరకు మనం చూనసండం. అయితే ఇప్పుడే కోహ్లిని దిగ్గజ మాజీ కెప్టెన్లలోఎవరితో మనం పొల్చకూడదు. వారి స్థాయి చేరుకోవాలంటే కోహ్లికి ఇంకొంచెం అనుభవం అవసరమని’ అభిప్రాయపడ్డాడు. కోహ్లి దూకుడు చూస్తే గంగూలీ దూకుడుకు అప్గ్రేడ్ వర్షన్లా ఉందని ఈ డాషింగ్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ‘గంగూలీ నాయకత్వంలో మేం కొన్ని ఓవర్సీస్ విజయాలు సాధించాం. ప్రస్తుతం విరాట్ కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీతో తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకున్నాడు. కోహ్లి సారథిగా ఎప్పుడు ఒత్తిడికి లోనుకాడు. బాధ్యతతో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫిట్నెస్ పరంగా సైతం కోహ్లి ట్రెండ్ అయ్యాడని’ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి సేన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో సైతం విజయం సాధిస్తోందని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్గా కోహ్లి వ్యక్తిగత ప్రదర్శనతో అదరగొట్టడమే ఇక్కడ ప్రాధాన్యమైన అంశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. -
‘కోహ్లి.. ఆయనకు అప్గ్రేడెడ్ వర్షన్’
సాక్షి, స్పోర్ట్స్ : దశాబ్దాల తర్వాత సఫారీ గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించటంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లిని ఆకాశానికెత్తేస్తున్నాడు. కోహ్లీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అప్గ్రేడెడ్ వర్షన్ లాంటోడని పొగడ్తలు గుప్పించాడు. ‘ కోహ్లీ కెప్టెన్సీని గనుక గమనిస్తే పలు సిరీస్లు కైవసం చేసుకున్నాం. గత 8 సిరీస్లను గనుక గమనిస్తే.. మిగతా దేశాల కెప్టెన్లతో పోలిస్తే కోహ్లినే ఉత్తమ సారథిగా మనకు కనిపిస్తాడు. గతంలో గంగూలీ సారథ్యంలో కూడా టీమిండియా ఇలానే దూకుడు చూపించేది. ముఖ్యంగా విదేశీ గడ్డలపై జట్టు మంచి విజయాలను సాధించింది. అలాగని గతంలోని అత్యుత్తమ కెప్టెన్లతో అతని పోల్చటం సరికాదు. వారి స్థాయిని అందుకోవటానికి అతనికి మరింత అనుభవం, విజయాలు అవసరం’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీతో కోహ్లిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడని, అన్నింటికన్నా ముఖ్యంగా అతని ఆట మరింతగా మెరుగుపడిందని సెహ్వాగ్ చెబుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉందన్న వీరూ.. ఎప్పుడైతే బౌలర్లు మెరుగ్గా రాణించలేకపోతారో అప్పుడే కోహ్లి పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్న నేపథ్యంలో అద్భుత ప్రదర్శన ఇవ్వాలంటూ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. -
ఐస్ క్రికెట్ : మళ్లీ ఓడిన సెహ్వాగ్ టీం
సెయింట్ మోర్టిజ్ : సీనియర్ క్రికెటర్ల ఐస్ క్రికెట్ రెండో రోజు సైతం సరదాగా సాగింది. ఈ మ్యాచ్లోనూ భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డైమండ్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్రిది రాయల్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ డైమండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రిది రాయల్స్ జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జాక్వస్ కల్లీస్(90 నాటౌట్), ఒవైస్ షా(37 నాటౌట్)గా నిలిచారు. డైమండ్స్ జట్టు బౌలింగ్లో దారుణంగా విఫలమమడంతో రాయల్స్ జట్టు అలవోక విజయం సాధించింది. అంతకు ముందు డైమండ్స్ జట్టులో సైమండ్స్ (67), మహ్మద్ కైఫ్ (57), సెహ్వాగ్ (48) పరుగులు చేశారు. చాల రోజుల అనంతరం బ్యాట్ పట్టిన ఈ సీనియర్ క్రికెటర్లు అద్భుత షాట్లతో అభిమానులను అలరించారు. ఇక బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో సైతం ఆఫ్రిది జట్టే గెలుపొందిన విషయం తెలిసిందే. -
‘గేల్ను అందుకే తీసుకున్నాం’
సాక్షి, స్పోర్ట్స్ : క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్ సీజన్ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన గేల్ను ఈ సారి వేలంలో ఆ జట్టు ఉద్వాసన పలికింది. అంతేగాకుండా ఏ ప్రాంచైజీ గేల్ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో రెండు సార్లు వేలంలో అతని పేరు ప్రకటించినా ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఇక అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కనికరించి అదే బేస్ ప్రైస్కు సొంతం చేసుకుంది. అంత వరకు విముఖత కనబర్చి తరువాత ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీనిపై మాజీక్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు. ‘గేల్ ఓపెనింగ్ వస్తే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. ఏ ప్రత్యర్థి జట్టుకైనా గేల్ విధ్వంసకర ఆటగాడు. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు. కింగ్స్ పంజాబ్ జట్టుకు ఆరోన్ ఫించ్, స్టోయినిస్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లతో మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిఉంది. ఈ లైనప్కు గేల్తో మరింత బలం చేకూరుతుంది. ఇక గేల్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఓపెనింగ్కు బ్యాక్ అప్గా తీసుకున్నాం’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. -
ఆలోచింపజేస్తున్న సెహ్వాగ్ ట్వీట్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో పోస్టులు ఎంత సరదాగా ఉంటాయో.. ఒక్కోసారి అంత ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లు వేయటమే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్లో గాడ్ (దేవుడు) పేరిట వరల్డ్(ప్రపంచం) అనే గ్రూప్ను సృష్టించి.. దానికి మనుషులు, ప్రేమ, మానవత్వాన్ని యాడ్ చేశారు. ఆపై మనుషులు దానికి కులం, మతాల్ని జత చేర్చగా... భరించలేని దేవుడు గ్రూప్ నుంచే ఎగ్జిట్ అయిపోయాడు. దీనిని వీరూ సరిగ్గా సరిపోయేది అంటూ తన ట్విట్టర్లో గురువారం పోస్టు చేశాడు. పాతదే అయినప్పటికీ వీరూ అకౌంట్లో ఇది దర్శనమివ్వటం.. ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. Very apt ! pic.twitter.com/bDBVy2T1YX — Virender Sehwag (@virendersehwag) January 4, 2018 -
ఈ రోజు ఇరు జట్లకు ప్రత్యేకం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 15) వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ - శ్రీలంక జట్లకు ప్రత్యేకం. రాజ్కోట్ వేదికగా నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ సగటు భారత అభిమానికి గుర్తుండే ఉంటుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు 400కు పైగా పరుగులు చేయడం రెండోసారి మాత్రమే. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్ల టాప్-3 బ్యాట్స్మెన్లు 50పైగా పరుగులు చేయడం తొలి సారి. అప్పటికి వన్డేల్లో భారత్ కూడా అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. (తర్వాత 2011లో వెస్టిండీస్పై భారత్ 418 పరుగులు చేసింది.) ఈ మ్యాచ్లో ఇరు జట్ల బ్యాట్స్మెన్ పరుగుల తుఫానునే సృష్టించారు. నువ్వా-నేనా అన్నట్లు చివరి వరకు సాగిన ఈ సమరంలో నెహ్రా అద్భుత బౌలింగ్తో విజయం భారత్నే వరించింది. మ్యాచ్ భారత్ గెలిచినా ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకంగా నిలిచిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(146) విరోచిత ఇన్నింగ్స్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్(63), మహేంద్ర సింగ్ ధోని(72)లు తోడవ్వడంతో భారత్ అలవోకగా శ్రీలంకకు 414 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యానికి ఎంత మాత్రం భయపడని ఆతిథ్య జట్టు దిల్షాన్(160) భారీ ఇన్నింగ్స్కు సంగక్కర(90), ఉపుల్ తరంగ (67)లు చెలరేగడంతో 411 పరుగులు చేసి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ధోని మార్క్ కెప్టెన్సీ.. చివరి ఓవర్లో లంక విజయానికి 11 పరుగుల కావాలి.. క్రీజులో ఆలౌరౌండర్ బ్యాట్స్మన్ మాథ్యూస్ ఉన్నాడు. అప్పటి వరకు చాలా పరుగులిచ్చిన నెహ్రాకు బౌలింగ్ ఇచ్చాడు ధోని. ఇక శ్రీలంక విజయం సులవనుకున్నారు అందరూ.. కానీ ఇక్కడ ధోని మార్క్ కెప్టెన్సీ లంక విజయాన్ని అడ్డుకుంది. మాథ్యూస్ అవుట్ చేయడంలో సఫలమైన నెహ్రా ఒక్క బౌండరీ ఇవ్వకుండా కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించడం భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ మధుర క్షణం ప్రతి అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. -
సిక్సర్ల సింగ్కు డాషింగ్ బ్యాట్స్మెన్ స్పెషల్ మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : నేటితో 37వ ఏట అడుగెడుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్, సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్కు సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ప్రతి ఒక్కరి బర్త్డే ప్రత్యేకంగా విషెస్ చెప్పే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువీకి సైతం తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఏ బీ సీ డీ.. జెడ్ల్లో ‘యూవీ’ కనబడదు. ఎందుకంటే యూవీ ఒక్కడే. హ్యాపీ బర్త్డే మిత్రమా.. నీవు ఇలా ముందుకు సాగుతూ.. మరింత మందికి స్పూర్తిని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని ట్వీట్ చేశాడు. ఇక సహచర క్రికెటర్లంతా తన పోరాటపటిమను, కష్టపడే తత్వాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనుక్షణం మాలో పోరాటతత్వాన్ని అలవరిచిన వాడివి. ఎన్నోసార్లు నీ అద్భుత ప్రదర్శనతో మమ్మల్నందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. యువీ.. దేవుడు నిన్ను దీవించుగాక.- సురేశ్ రైనా నీ సంకల్ప శక్తితో స్పూర్తిని కలిగిస్తూ.. పోరాటపటిమను రగిలించిన యువీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీవు మరింత ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా- వీవీఎస్ లక్ష్మణ్ నా జీవితంలో నాకు స్పూర్తిని కలిగించిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. యువీ ఈ ఏడాది నీవు ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నా- మహ్మద్ కైఫ్ పెద్దన్నకు పుట్టి రోజు శుభాకాంక్షలు.. ఈ ఏడాది నీ జీవితంలో గొప్పది కావలని ఆశిస్తున్నా.- శిఖర్ ధావన్ హ్యాపీ బర్త్డే యువీ పాజీ. ఈ ఏడాది నీవు మరిన్ని విజయాలు అందుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.- జస్ప్రీత్ బుమ్రా A B C D E F G H I J K L M N O P Q R S T W X Y Z , you will find in plenty. But UV is only one rare one. Happy Birthday dear friend @YUVSTRONG12 . May your fight continue to inspire many. pic.twitter.com/hV06ByVZBW — Virender Sehwag (@virendersehwag) 12 December 2017 To someone who has taught us to keep fighting always. You've made us all proud at various stages with your powerful performances. Wishing you a very happy birthday @YUVSTRONG12 May God bless you.✌️🎂💪 pic.twitter.com/yngSHrJc5e — Suresh Raina (@ImRaina) 12 December 2017 -
యో-యో టెస్ట్ నాకు ఈజీ.. కానీ యువరాజ్కే..
కోల్కతా: యో-యో టెస్ట్ నెగ్గడం పేస్ బౌలర్గా తనకు సులువైనదని, కానీ యువరాజ్ వంటి క్రికెటర్లకు ఇబ్బందిగా మారిందని టీమిండియా మాజీ బౌలర్ అశీష్ నెహ్రా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి కామెంటేటర్గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ మాజీ బౌలర్ ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించే యోయో టెస్ట్పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న నెహ్రాకు మరో వ్యాఖ్యాత వీరేంద్ర సెహ్వాగ్ మధ్య యోయో టెస్ట్పై ఆసక్తికర సంభాషణ నడిచింది. తొలుత సెహ్వాగ్ అసలు తీవ్ర చర్చనీయాంశమైన యో-యో టెస్ట్ అంటే ఏమిటని నెహ్రాను ప్రశ్నించాడు. దీనికి నెహ్రా ‘యో-యో టెస్ట్ 2001-02 మధ్యలో నిర్వహించిన బ్లిప్ టెస్ట్ వంటిదే. ఈ పరీక్షల్లో ఆటగాళ్లు ఒక స్థానం నుంచి ప్రారంభమై మళ్లే అదే స్థానానికి చేరాలి. ఇలా మెత్తం 20 మీటర్ల పరిధి పరుగును నిర్ణిత సమయంలో పూర్తి చేయాలి. టీమిండియా ఈ టెస్టుకు అర్హత మార్క్గా 16.1 మీటర్లు పెట్టింది. త్వరలో 16.5 మీటర్లు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక అత్యధికంగా న్యూజిలాండ్ 18.5 మీటర్ల మార్క్ను పరీక్షిస్తోంది. వేగంగా పరుగెత్తితేనే ఈ పరీక్షను నెగ్గుతాం. అని నెహ్రా పేర్కొన్నాడు. ఇక 38 ఏళ్ల వయసులో ఈ టెస్టు నెగ్గడంపై నెహ్రా స్పందిస్తూ.. పేస్ బౌలర్గా ఇది నాకు చాల సులభం. కానీ యువరాజ్ వంటి కొంత మంది క్రికెటర్లకు ఈ పరీక్ష నెగ్గడం చాలా కష్టంగా ఉంది. ఇక భారత ఆటగాళ్ల యో-యో స్కోర్లపై మాట్లాడుతూ.. అందరూ 16.1 అర్హత మార్క్ను దాటాల్సిందే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా నిర్వహించిన యో-యో టెస్ట్లో హార్దిక్ పాండ్యా స్కోరు 19, మనీష్ పాండే 19, తనది 18.5 స్కోర్ అని నెహ్రా తెలిపాడు. ఇక కెప్టెన్ కోహ్లి స్కోర్ గురించి సెహ్వాగ్ ప్రస్తావించగా అది తెలియదు. కోహ్లి స్కోరు చూడలేదని నెహ్రా పేర్కొన్నాడు. ఇక యువీ యో-యో టెస్ట్ నెగ్గితే టీమిండియా జట్టులో చోటు దక్కడం సులువని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. -
‘నాకు హిందీ నేర్పింది వీరే’.. అంటూ వీరూకి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో మాటలయుద్దానికి సై అన్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ తన చివరి సందేశంతో ఈ ఫన్నీ వార్ను ముగించాడు. కివీస్తో సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి వీరి మధ్య సరదా మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏప్పటిలాగే సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్లతో టేలర్ను టైలర్గా సంబోధిస్తూ ఆటపట్టించాడు. అయితే అనూహ్యంగా టేలర్ సెహ్వాగ్కు హిందీలో ట్వీట్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ఎంతలా అంటే టేలర్ హిందీకీ ఆధార్ ఇచ్చేయండి అని సెహ్వాగే స్వయంగా యూఐడీఏఐను కోరేంత. మాజీ కెప్టెన్ గంగూలీ నీకు హిందీ ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసేంతా.. భారత అభిమానులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యేంతా.. ప్రతి మ్యాచ్ అనంతరం వీరి మధ్య జరిగిన సరదా ట్వీట్లతో భారత అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. భారత్ టీ20 సిరీస్ గెలుచుకున్న అనంతరం సెహ్వాగ్ ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ఈ ట్వీట్కు లేట్గా అయినా లేటేస్ట్గా స్పందించాడు టేలర్. తనకు హిందీ నేర్పిన వారితో దిగిన ఫోటోతో ఇన్స్ట్రాగ్రమ్ పోస్ట్ చేశాడు. ఆ ఇద్దరు తన టీమ్ మెట్ అయిన ఇష్ సోదీ, భారత స్టాఫర్ దేవ్లు అని పేర్కొన్నాడు. ‘భారత్లో ఆడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, సెహ్వాగ్తో మాటలయుద్దానికి నాకు ఈ ఇద్దరే సాయం చేశారు. ధన్యవాదాలు దేవ్, సోదీ, ఉతకడం, కుట్టడానికి చాలా సమయం ఉంది సెహ్వాగ్జీ.. ఈ చివరి మెసేజ్తో ముగిస్తున్నాను. అని పోస్ట్ చేశాడు. As always India it was a pleasure. FYI - the two responsible for helping me with banter with @virendersehwag are here in this photo, thanks Dev and @ic3_odi , signing off with one last message: Dhullai aur Silaai Anne waale samay mein jaari rahegi ☺️#India #indvnz #Mumbai #darji A post shared by Ross Taylor (@rossltaylor3) on Nov 8, 2017 at 7:30am PST Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7 — Virender Sehwag (@virendersehwag) 7 November 2017 -
కివీస్ ఓటమిపై వీరూ మరో ఫన్నీ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్పై కోహ్లి సేన టీ20 సిరీస్ నెగ్గడంతో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్తో మరోసారి వార్తల్లో నిలిచాడు. తొలి వన్డే అనంతరం నుంచే కివీస్ బ్యాట్స్మెన్ టేలర్కు సెహ్వాకు ఫన్నీ ట్విట్టర్ వార్ నడుస్తుంది. టేలర్, టైలర్గా సంబోదిస్తూ సెహ్వాగ్ సరదా ట్వీట్లు చేశాడు. దీనికి టైలర్ ఏమాత్రం తక్కువ కాకుండా హిందీలో సెహ్వాగ్కు కౌంటర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక రెండో టీ20 అనంతరం టేలర్ ఓ దర్జీ షాపు ముందు కూర్చోని.. రాజ్కోట్లో దుకాణం బంద్ అయింది. కొత్త దుకాణం తిరువనంతపురంలో.. బట్టలు కుట్టించుకోవాలంటే అక్కడికి రా సెహ్వాగ్ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు. టైలర్ హిందీకి సెహ్వాగ్తో పాటు భారత అభిమానులు కూడా నివ్వేరపోయారు. సెహ్వాగ్ అయితే టేలర్ హిందీకి ఏకంగా ఆధారే ఇవ్వమన్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న డాషింగ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ విజయానంతరం.. ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ప్రతి ట్విట్కు స్పందించిన టేలర్ ఈ ట్వీట్కు మాత్రం ఇంకా సమాదానం ఇవ్వలేదు. బాక్సింగ్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించిన మేరీకోమ్కు సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపాడు. Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7 — Virender Sehwag (@virendersehwag) November 7, 2017 -
టేలర్కు ఆధార్!.. సెహ్వాగ్కు కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ల ట్వీట్ల యుద్దం మరింత ఫన్నీగా కొనసాగతుంది. వ్యంగ్య చలోక్తులతో ట్వీట్ చేసే సేహ్వాగ్కు హాస్యం జోడించడంలో ఏ మాత్రం తక్కువ కాదంటూ బదులిస్తున్నాడు రాస్ టేలర్. భారత్ తో తొలి వన్డేలో కివీస్ విజయం అనంతరం మొదలైన వీరి సరదా ట్విట్ల సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు తిరవనంతపురం బయలు దేరే ముందు రాజ్కోట్లోని ఓ దర్జీ షాపు ముందు కూర్చోని దిగిన ఫోటోను రాస్ టేలర్ హిందీలో ‘ రాజ్కోట్ మ్యాచ్ అనంతరం దర్జీ షాపు బంద్ అయింది. తరువాతి మ్యాచ్ తిరువనంతపురంలో ఆర్డర్ ఉంటే అక్కడికి రా సెహ్వాగ్’ అనే క్యాఫ్షన్తో ట్విట్ చేశాడు. దీనికి సెహ్వాగ్ ఏహే మనోడికి హిందీ తెగ వచ్చేసింది ఆధార్ కార్డు ఇచ్చేయండి అనే ట్వీట్తో బదులిచ్చాడు. అయితే ఈ ట్వీట్కు అనూహ్యంగా యూఐడీఏఐ స్పందించింది. భాష ఒక్కటే ముఖ్యం కాదు.. నివాస గృహం సంగతేంటని ప్రశ్నిస్తూ.. ఆధార్ కావల్సిన నియమాలను వివరిస్తూ ట్వీట్ చేసింది. తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించిన టేలర్ను అభినందిస్తూ... వీరూ తన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ జీ (టేలర్ ను టైలర్ అన్నడన్న మాట). దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి తగ్గట్లే హిందీలోనే ఆ దర్జీ(టేలర్) రిప్లై ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల పర్వం ఇక్కడితోనే ఆగలేదు. ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా లూజ్ గా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ దానికి తగ్గట్లే ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది కుట్టడంలో అయినా.. మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే టేలర్ హిందీ నైపుణ్యానికి భారత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. @virendersehwag #Rajkot mein match k baad, #darji (Tailor) Ki dukaan band. Agli silai #Trivandrum mein hogi... Zaroor Aana. #India #IndvNZ A post shared by Ross Taylor (@rossltaylor3) on Nov 5, 2017 at 2:30am PST Highly impressed by you @RossLTaylor . @UIDAI , can he be eligible for an Aadhaar Card for such wonderful Hindi skills. https://t.co/zm3YXJdhk2 — Virender Sehwag (@virendersehwag) November 6, 2017 Language no bar. Resident status is what matters. — Aadhaar (@UIDAI) November 6, 2017 -
సెహ్వాగ్కి ఊహించని కౌంటర్.. అంతా షాక్
సాక్షి, స్పోర్ట్స్ : సోషల్ మీడియలో సెటైర్లు వేయటంలో టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైమింగ్ పంచులతో విరుచుకుపడటం వీరూకి చాలా మామలు విషయం. అయితే.. ఈ ట్విట్టర్ కింగ్ కే కౌంటర్(సరదాగా) ఇచ్చి సోషల్ మీడియాలో అందరిచేత నోళ్లు వెళ్లబెట్టించాడు ఓ ఆటగాడు. అది ఎవరో కాదు.. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్. భారత్ తో తొలి వన్డేలో కివీస్ విజయం సాధించిన విజయం తెలిసిందే. అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాస్ టేలర్ విజయానికి కారణమయ్యాడు. దీంతో టేలర్ అభినందిస్తూ... వీరూ తన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ జీ (టేలర్ ను టైలర్ అన్నడన్న మాట). దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు. Thanks @virendersehwag bhai agli Baar Apna order time pe Bhej dena so Mai Apko agli Diwali ke pehle deliver kardunga ....happy Diwali — Ross Taylor (@RossLTaylor) 23 October 2017 అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్. దానికి తగ్గట్లే హిందీలోనే ఆ దర్జీ(టేలర్) రిప్లై ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల పర్వం ఇక్కడితోనే ఆగలేదు. ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా లూజ్ గా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. Has your Darji not done a good job this Diwali 😜? — Ross Taylor (@RossLTaylor) 23 October 2017 No one can match up to your high standards of stitching Darji ji , whether it is a pant or a partnership @RossLTaylor https://t.co/WDInvXL4EW — Virender Sehwag (@virendersehwag) 23 October 2017 ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ దానికి తగ్గట్లే ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది కుట్టడంలో అయినా.. మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే దాదా సౌరవ్ గంగూలీ సీన్ లోకి ఎంటర్ అయ్యి నీకు హిందీ వచ్చా అంటూ.. రాస్ టేలర్ ని ప్రశ్నించాడు. ఒక్క దాదానే కాదు.. ఈ ట్వీట్లు చూసిన ప్రతీ ఒక్కరూ టై(టే)లర్ టైమింగ్కు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో రాస్ టేలర్ ఐపీఎల్ లో సెహ్వాగ్ తో కలిసి ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడాడు కూడా. -
బాదుడు బాద్షా!
భయానికే మీనింగ్ తెలియని క్రికెటర్.. ఓపెనర్ అంటే ఇలానే ఆడాలని కొత్త నిర్వచనం చెప్పిన విధ్వంసకర బ్యాట్స్మెన్.. సెంచరీ చెరువలో ఉన్నా బంతిని బౌండరీకి తరలించే సాహసి.. ప్రతి బంతిని బ్యాట్తో బాది ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయమని చెప్పిన త్రిశతక వీరుడు.. అతడే మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతని బ్యాటింగ్ రికార్డులు ఒక ఎత్తయితే .. వివాద రహితుడిగా కెరీర్ను కొనసాగించడం మరో ఎత్తు.. సీనియర్లకు తమ్ముడిలా.. జూనియర్లకు పెద్దన్నలా.. క్రమశిక్షణతో వ్యవహరించడం అతనికే సాధ్యం. నేడు 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ లెజెండ్ గురించి మరిన్ని విశేషాలు.. సచిన్ గాయంతో ఓపెనర్గా.. దాయాది పాకిస్తాన్పై 1999లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్ తొలి రోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి వన్డేలో ఒక్కపరుగుకే అవుటయ్యాడు. అతని నాలుగో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై కీలక ఇన్నింగ్స్లో 54 బంతుల్లో 58 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 2001 న్యూజిలాండ్ సిరీస్లో సచిన్ టెండూల్కర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సెహ్వాగ్కు ఓపెనింగ్ అవకాశం లభించింది. ఇక ఈ సిరీస్లో న్యూజిలాండ్పై 69 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే అతని తొలి సెంచరీ కావడం విశేషమైతే.. భారత తరుపున రెండో వేగవంతమైన సెంచరీ. ఈ ఘనతతో జట్టులో రెగ్యులర్ బ్యాట్స్మెన్గా కొనసాగాడు. అంతేగాకుండా సచిన్ను మిడిలార్డర్కు పంపించి సెహ్వాగ్ను ఓపెనింగ్ పంపించడం మొదలెట్టారు. 2003 ప్రపంచ కప్ .. సెహ్వాగ్ కెరీర్లో 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓ మైలు రాయి. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 360 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడంలో భారత్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డారు. ఒకవైపు వికెట్లు పడుతున్న తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ ద్రవిడ్తో సమన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరగడంతో భారత అభిమానుల ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. కానీ 10 ఫోర్లు..3 సిక్పర్లతో సెహ్వాగ్ చేసిన 82 పరుగులు అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ టోర్నీలో మొత్తం సెహ్వాగ్ 299 పరుగులు చేశాడు. ముల్తాన్ సుల్తాన్.. ముల్తాన్ వేదికగా పాక్పై సెహ్వాగ్ 2004లో ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇది అతని కెరీర్లో తొలి ట్రిఫుల్ సెంచరీకాగా.. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగమైన ట్రిఫుల్ సెంచరీ కూడా ఇదే. ఇక ఈ ట్రిఫుల్ సెంచరీని సిక్సర్తో సాధించడం మరో విశేషం. ఈ సిరీస్లో సెహ్వాగ్ రెచ్చిపోయి ఆడటంతో అప్పటి పాక్ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్ మా సింహా స్వప్నం సెహ్వాగే అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. కెప్టెన్గా.. సెహ్వాగ్ 2006 లాస్ఏంజిల్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్లో భారత్గెలిచింది. సెహ్వాగ్ వన్డే, టెస్టులకు వైస్కెప్టెన్సీ హోదాలో కొన్ని మ్యాచ్లకు నాయకత్వం వహించారు. టెస్టుల్లో 4 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా భారత్ 2 గెలిచింది, ఒకటి డ్రా అవ్వగా మరొకటి ఓడింది. ఇక సెహ్వాగ్ కెప్టెన్సీలో వన్డేల్లో 12 మ్యాచ్లకు 7 గెలిచి, 5 ఓడింది. సెహ్వాగ్ ఘనతలు టెస్టుల్లో తొలి ట్రిఫుల్ సెంచరీ, రెండు ట్రిఫుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు సెహ్వాగ్. అర్జున అవార్డు, పద్మ శ్రీ,ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ది ఇయర్ 2010, విజ్డన్ లీడ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ 2008,2009. తొలి టెస్టు– సౌత్ ఆఫ్రికాతో 2001, చివరిది ఆస్ట్రేలియాతో హైదరాబాద్లో 2013. తొలి వన్డే– పాకిస్థాన్తో మొహాలీలో 1999. చివరిది పాకిస్థాన్తో కోల్ కత్తాలో 2013. తొలి టీ 20 సౌత్ ఆఫ్రికా 2006. చివరిది సౌత్ ఆఫ్రికాతో 2012. -
సెహ్వాగ్ బర్త్ డే.. సచిన్ ఉల్టా ట్వీట్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, వీరేంద్ర సెహ్వాగ్ 39వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, క్రికెట్ లెజెండ్స్ నుంచి విషెస్ వెల్లువెత్తాయి. అయితే ఇతరుల బర్త్డేకు సరదాగా విషెస్ చెబుతూ అందరిని ఆకట్టుకునే వీరూ.. తన బర్త్డే విషెస్కు కూడా విభిన్నంగా స్పందిస్తూ నా స్టైలే వేరంటున్నాడు. క్రికెట్లో సిక్సులతో అలరించిన వీరూ.. రిటైర్మెంట్ అనంతరం ట్వీట్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే. సెహ్వాగ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ.. వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ ట్వీట్ చేయగా.. వీరు స్పందిస్తూ.. ఫేమస్ సినిమా టైటిల్ అయిన చోటా చేతన్తో పార్దీవ్ను పోలుస్తూ రిప్లయ్ ఇచ్చాడు. ఇదేవిధంగా సురేశ్ రైనాను లగే రహో( బాగా కష్టపడూ).. క్రిస్ గేల్ను యూనివర్సల్ బాస్ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. కుంబ్లే ట్విట్కు నీ మద్దతుకు రుణపడి ఉంటా అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు అభిమానులు కూడా తమ ఎడిటింగ్ నైపుణ్యంతో వీరును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సచిన్ ఉల్టా ట్విట్.. ఇక క్రికెట్ గురూ సచిన్ ఇంకో అడుగు ముందుకేసి వీరూ రూట్లోనే ఉల్టా ట్వీట్తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘ ఫీల్డ్లో నేను ఏది చెప్పినా దానికి ఉల్టా చేస్తావు కదా అందుకే నీకు విషెస్ కూడా ఉల్టా చెప్తా.. హ్యాపీ బర్త్ డే సెహ్వాగ్ అని’ ట్వీట్ చేశారు. అలాగే బీసీసీఐ హ్యాపీ బర్త్డే నజఫ్ఘర్ నవాబ్ అని ట్వీట్ చేసింది. ఫియర్ లెస్ అనే పదానికి అర్ధం తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రహానే.. మమ్మల్ని ఇంకా అలరించు అని ఇషాంత్ శర్మ ట్వీట్ చేశారు. .ǝɯ ɯoɹɟ ǝuo s,ǝɹǝɥ os ˙😜pןǝıɟ uo noʎ pןoʇ ǝʌɐɥ ı ʇɐɥʍ ɟo ɐʇןn ǝuop sʎɐʍןɐ ǝʌ,noʎ ˙ɹɐǝʎ ʍǝu ǝɥʇ oʇ ʇɹɐʇs ʇɐǝɹƃ ɐ ǝʌɐɥ ¡nɹıʌ 'ʎɐpɥʇɹıq ʎddɐɥ pic.twitter.com/L1XTzhzoiU — sachin tendulkar (@sachin_rt) 20 October 2017 Thank you God ji 🙏🏼Uparwala sab dekh raha hai, yeh to suna tha, par aaj samajh aaya, woh neeche waalon ke liye likhta kaise hai ! https://t.co/stdodewNuJ — Virender Sehwag (@virendersehwag) 20 October 2017 Thank you dearest Chota Chetan ! https://t.co/i9P2Q8UXyj — Virender Sehwag (@virendersehwag) 20 October 2017 -
అనిల్ కుంబ్లేకు సెహ్వాగ్ 'బర్త్డే' గిఫ్ట్ ఇదే..!
'దంతెరస్' రోజు భారత్కు అతిపెద్ద 'ధన'మైన అనిల్ కుంబ్లే భాయ్కి పుట్టినరోజు శుభకాంక్షలు.. జైజై శివశంభో.. హ్యాపీ బర్త్డే జంబో'.. పుట్టినరోజు సందర్భంగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు మాజీ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చెప్పిన బర్త్డే విషెస్ ఇవి.. భారత్ క్రికెట్కు కుంబ్లే అతిపెద్ద ధనమంటూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భుజాలు అరిగిపోయేలా భారత జట్టు కోసం ఎడాపెడా బౌలింగ్ చేసిన స్పిన్ దిగ్గజం.. అనిల్ కుంబ్లే పుట్టినరోజు నేడు. ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. సెహ్వాగ్తోపాటు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. On Dhanteras, wishing one of India's greatest Dhan @anilkumble1074 bhai a very happy birthday. Jai jai Shiv Shambho, Happy Birthday Jumbo ! pic.twitter.com/avEDcOgeWJ — Virender Sehwag (@virendersehwag) 17 October 2017 Wish you a very happy birthday, Kumbels! You have been an inspiration for generations together and will continue to be one. pic.twitter.com/3vqMpqhu6E — sachin tendulkar (@sachin_rt) 17 October 2017 Wishing a very happy birthday Anil Bhai. May all your dreams come true @anilkumble1074 ! pic.twitter.com/2UNvZof2tb — Mohammad Kaif (@MohammadKaif) 17 October 2017 Wishing one of India's greatest match winners , @anilkumble1074 a very happy birthday. May you have a great day and year ahead. pic.twitter.com/JBCvgOeIBk — VVS Laxman (@VVSLaxman281) 17 October 2017 -
భారత జట్టుకు సచిన్, సెహ్వాగ్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఫిఫా అండర్-17 వరల్డ్కప్లో పాల్గొనబోతున్న భారత జట్టుకు టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్లు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆటను ఆస్వాదిస్తూ మీ కలలను సాకారం చేసుకోవాలంటూ సచిన్ జట్టుకు విషేస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు’. ట్విట్టర్ రారాజు సెహ్వాగ్ మాత్రం తొలి సారి ఫుట్ బాల్కు ఆతిథ్యం ఇస్తున్నందుకు, టోర్నీలో పాల్గొంటున్న అండర్-17 జట్టుకు శుభాకాంక్షలు. మీరు అద్భుత ప్రదర్శనను ఇస్తారని భావిస్తున్నా. అని ట్వీట్ చేశాడు. ఇంకాసేపట్లో భారత్, అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. My best wishes to the @IndianFootball U-17 team for the World Cup! Enjoy your game & chase your dreams because dreams do come true! @FIFAcom pic.twitter.com/lrqgX1olD5 — sachin tendulkar (@sachin_rt) 5 October 2017 Best wishes to @IndianFootball for organising & participating in #FIFAU17WC for the first time. May u give your best on & off-field@FIFAcom — Virender Sehwag (@virendersehwag) 6 October 2017 -
సచిన్ ఆడినప్పుడు.. నెహ్రాకు ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: 40 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు. ఆసీస్ తో మూడు టీ20లకు ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో నెహ్రాకు అనూహ్యంగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే రైనా, యువరాజ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కకుండా ఈ సీనియర్ బౌలర్కు అవకాశం రావడం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ విషయంలో సెలక్టర్లను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ క్రికెట్ కు వయస్సుతో సంబంధం లేదని నెహ్రా ఎంపికపట్ల మద్దతుగా నిలవగా తాజాగా సెహ్వాగ్ ఆ జాబితాలో చేరారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ‘నెహ్రా ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అతను జట్టులో చోటు దక్కించుకోవడం చాల సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నా. నెహ్రా ఎంపిక వెనుక ఉన్న రహస్యం అతని ఫిట్ నెస్. అతను అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనప్పుడు పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తాడు. అంతేగాకుండా ఆటగాళ్లకు నిర్వహించే ఫిట్నెస్ పరీక్ష యో-యో టెస్టులో నెహ్రా 18 స్కోరు సాధించాడు. ఇది దాదాపు కోహ్లి స్కోరుకు సమానం. ఫిట్నెస్కు అతని హైట్ కలిసొచ్చే అంశం. ఫాస్ట్ బౌలర్ కావడంతో పరుగులో కూడా ఎలాంటి సమస్య లేదు. క్రికెట్ ఆడటానికి వయస్సుతో సంబంధం లేదని నేను భావిస్తాను. శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 42 ఏళ్ల వయసులో, సచిన్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడలేదా? అలాంటప్పుడు ఫిట్గా ఉన్న నెహ్రాకు వచ్చిన సమస్య ఏమిటి? యువరాజ్, రైనాలు యో-యో టెస్టు అర్హత సాధించలేకపోవడంతో జట్టులో వారికి చోటు దక్కలేదు. క్రికెట్లో కొనసాగాలంటే ఫిట్నెస్ ముఖ్యం. ఫిట్గా ఉంటే హిట్ చేయవచ్చు. ప్రస్తుత జట్టులో అన్ఫిట్ ఎవరూ లేరు’. అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. -
ముంబై ఘటనపై క్రికెటర్ల దిగ్భ్రాంతి
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన విషాద ఘటనపై భారత క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఎల్ఫిన్స్టన్ రోడ్, పరేల్ సబర్బన్ రైల్వే స్టేషన్లను కలిపే ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించగా మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించిన టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మరణించిన అమయాక ప్రజలకు నివాళులు అర్పించారు. ‘మానవ జీవితం చౌకబారు ఘటనలతో అంతమవుతోంది. పన్నులు చెల్లించినా ప్రభుత్వాల అలసత్వంతో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. నగరాల్లో ప్రజలు రిస్క్తో ప్రయాణిస్తున్నారు. ప్రజలకు కల్పించాల్సిన భద్రత చాలరోజులుగా కరువైంది. ఎల్ఫిన్స్టన్ ప్రమాదం హృదయ విచారక ఘటన.. వారి తప్పులేకున్నా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారికి నా ఘననివాళులు’ అని సేహ్వాగ్ వరుస ట్వీట్లతో ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ఘటన వార్త విని గుండె పగిలిందని రోహిత్, ఆకస్మిక ఘటన బాధను కలిగించిందని వీవీఎస్ లక్ష్మణ్ మృతులకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ మహ్మాద్ కైఫ్ తొక్కిసలాట ఘటన మృతులకు నివాళులర్పిస్తూ క్షతగాత్రులు కోలుకోవాలని ట్వీట్ చేశారు. In the city of dreams, people travel with such high risks. Before anything else,citizens security is the need of the hour,long been ignored. — Virender Sehwag (@virendersehwag) 29 September 2017 Heartbreaking to see what happened in Mumbai earlier today. — Rohit Sharma (@ImRo45) 29 September 2017 Deeply pained and saddened by the loss of lives in Mumbai, #elphinstone . Prayers for the injured. Human lives need far more value. — Mohammad Kaif (@MohammadKaif) 29 September 2017 Deeply pained and saddened by the unfortunate loss of lives in the stampede in Mumbai #elphinstone .Condolences to the families ! — VVS Laxman (@VVSLaxman281) 29 September 2017 -
అమెరికా అధ్యక్షుడిగా సెహ్వాగ్!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు న్యూయర్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని శనివారం ఉదయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచిన సెహ్వాగ్ హ్యాపీ 'ఏప్రిల్ ఫూల్స్ డే' అని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ స్మిత్ ఈ కథనాన్ని రాసినట్లు సెహ్వాగ్ షేర్ చేసిన ఆర్టికల్ కటింగ్ క్లిప్లో ఉంది. కాగా, కొద్దిరోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ షేర్ చేసిన కథనంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ను ఉద్దేశించి ఇన్ డైరెక్టుగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి. తరచూ అమెరికా వస్తున్న వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్గా టచ్లో ఉంటోందని ఆర్టికల్లో ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్లో స్టీఫెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికా పర్యటనకు మోదీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోదీతో ఈ మేరకు చర్చిస్తారని ఉంది. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సెహ్వాగ్ హ్యూమరస్ ట్వీట్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే. Hahaha ! pic.twitter.com/xyvzQV1Ug8 — Virender Sehwag (@virendersehwag) April 1, 2017 -
అండర్సన్ కు సెహ్వాగ్ చురకలు!
విశాఖ: భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్లో చమత్కారం స్థాయి చాలా ఎక్కువ. ఈ విషయం అతను క్రికెట్ నుంచి రిటైరైన తరువాతే మనకు బోధ పడింది. ఇటీవల కాలంలో ట్విట్టర్ వేదికగా వీరూ తన చమత్కరాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. అయితే ఈసారి మన ట్విట్టర్ కింగ్.. కింగ్ పెయిర్(తొలి బంతికే డకౌట్) అస్త్రాన్ని అండర్సన్పై ప్రయోగించాడు. దానికి కారణం భారత్ తో రెండో టెస్టులో అండర్సన్ రెండు ఇన్నింగ్స్ల్లో మొదటి బంతికే డకౌట్గా పెవిలియన్ చేరడమే. 'గతంలో నేను కింగ్ పెయిర్ కావడానికి నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు అలానే అయ్యావు. లెక్క సరిపోయినట్లుంది' అని సెహ్వాగ్ చురకలంటించాడు. ఈ సందర్భంగా భారతదేశ గణితశాస్త్ర అగ్రగణ్యుడు ఆర్యభట్టను సెహ్వాగ్ ఉదహరించాడు. ప్రధానంగా '౦' ను ఆర్యభట్ట కనిపెట్టడమే సెహ్వాగ్ ఉద్దేశం కావొచ్చు. 2011లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్ లో తొలి బంతికే బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ బౌలింగ్ లో మొదటి బంతికి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు భారత్ తో రెండో టెస్టు సందర్భంగా అండర్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లో తొలి బంతికే నిష్ర్కమించడంతో సెహ్వాగ్ తన సృజనకు పదునుపెట్టి మరీ చమత్కరించాడు. ఒకవేళ బ్రాడ్ తొలి బంతికే అయ్యుంటే అతన్ని కూడా సెహ్వాగ్ టార్గెట్ చేసేవాడేమో! -
'కుంబ్లేలా ఎవరూ అండగా నిలవలేదు'
న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే తన ఫేవరెట్ కెప్టెన్ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కుంబ్లే మాదిరిగా తనకు ఏ కెప్టెన్ కూడా అండగా నిలవలేదని చెప్పాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంటే కుంబ్లేనే తనకు ఎక్కువ మద్దతు ఇచ్చాడని సెహ్వాగ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీరూ ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే భారత్ క్రికెట్కు దశాబ్దంపైగా సేవ చేసిన తనకు ఫేర్వెల్ మ్యాచ్ లేకపోవడం వెలితిగా ఉందంటూ సెలెక్టర్లను విమర్శించిన వీరూ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్లో ఆడాలని భావించిన సమయంలో తనను జట్టు నుంచి తప్పించారని చెప్పాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ను ముగించాలని కోరుకున్నానని సెహ్వాగ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. -
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. అయితే పంజాబ్ విజయంలో మాక్స్ వెల్, బెయిలీ, ఫెరీరాలు కీలక పాత్ర వహించారు. మాక్స్ వెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు, బెయిలీ 27 బంతుల్లో 5 ఫోర్లతో 34, ఫెరీరా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశారు. హోబర్ట్ జట్టులో బొలింగర్ 2, హిల్ ఫెన్ హస్, లాలీన్, గుల్బీస్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన హోబర్ట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. -
పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. అయితే 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది.