vishwanathan anand
-
శారీరక శిక్షణే అతిపెద్ద 'గేమ్ ఛేంజర్'.!: విశ్వనాథన్ ఆనంద్
మాజీ చెస్ గ్రాండ్మాస్టర్(Chess Grandmaster) విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. 16వ ఏటనే జాతీయ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాండ్మాస్టర్గా అవతరించారు. ఎంతటి విజేతకైనా అప్పడప్పడూ ఓటమి పలకరిస్తుంటుంది. తడబాటులు తప్పవు. అలాంటప్పుడూ ఒక్కసారిగా ఎదురయ్యే నైరాశ్యం నుంచి బయటపడేందుకు తన భార్య ఇచ్చిన పనిష్మెంట్ తనకు ఉపకరిస్తుందని అంటున్నారు ఆనంద్. అది తనకు పెద్ద 'గేమ్ ఛేంజర్' అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందామా..!విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) అర్జెంటీనాలో ఒక టోర్నమెంట్ (Tournament)లో ఆడుతున్నాడు. ఆ టోర్నమెంట్ గెలిచాడు కానీ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొనక తప్పలేదు. అయితే అక్కడ ఆనంద్ చేసినవి చాలా సిల్లీ తప్పులట. దీంతో అతడి భార్య అరుణకు ఆయన మీద పిచ్చకోపం వచ్చి..ఈ రాత్రికి డిన్నర్ కావాలంటే.. ముందు చకచకా 50 పుష్అప్లు(Pushups) చేయండని ఆదేశించిందట. అసలే ఓటమితో భారంగా ఉన్న ఆనంద్ చేసేదేమిలేక మారు మాట్లాడకుండా పుష్అప్లు చేసి తర్వాత డిన్నర్ కానిచ్చారట. ఆ తర్వాత బాడీ అలసిపోవడంతో మంచి నిద్ర పట్టేసిందట. మరుసటి రోజు ఆ ఓటమి తనని శారీరకంగా గానీ మానసికంగా(Mental) డిస్ట్రబ్ చేయలేదట.దీంతో రిఫ్రెష్గా కొత్త ఎత్తులతో గేమ్ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించాడట. అందుకే ఆయన శారీరక శిక్షణ అనేది చాలా పెద్ద గేమ్ ఛేంజర్ అని నమ్మకంగా చెబుతున్నారు. నిజానికి అందరూ చదరంగం ఒక మానసిక గేమ్ అని భావిస్తారు కానీ అది తెలియకుండానే ఫిజికల్ గేమ్గా మారుతుందని తన భార్య తరచు చెబుతుంటుందని అన్నారు. ఇక్కడ రికార్డులు బ్రేక్చేసే క్రీడాకారుడికి తప్పనిసరిగా శారీక బలం తోపాటు, మానసిక దృఢత్వం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆటల్లో ఓటమి తెలియని ఒత్తిడికి గురయ్యేలా చేసి అలసట తెప్పిస్తుందట. చెప్పాలంటే ఇక నావల్ల కాదనేలా కుంగిపోతారట. అలాంటప్పుడు శారీరక శిక్షణ వారిని ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని కైవసం చేసుకునేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు నిపుణులు. ఆ పనే ఇక్కడ ఆనంద్ భార్య అరుణా చేశారు. ఇక్కడ ఆతడి భార్య తన ఆర్థిక లావదేవీలు చూసే మేనేజర్గానే కాకుండా వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉండేలా చేసే శిక్షకురాలిగా సూచనలిచ్చింది. ఫిట్నెస్, ఆరోగ్యం అనేవి మానసిక క్షేమంతో ముగిపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ అరుణ చెప్పిన పుష్ అప్లు ఏకగ్రాతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మెదడు సహజ స్థితి పెంచేలా ఎండార్ఫిన్లను విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుందని తెలిపారు. తద్వారా ఆయా వ్యక్తుల్లోని ఆత్మవిశ్వాసం పుంజుకుని, మనసును లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుందట. ప్రయోజనాలు..ఇది ఆటగాళ్లకే ఇంత ప్రయోజనాలందిస్తే..రోజువారీ టెన్షన్లు, ఆందోళనలతో నలిగిపోయే సామాన్యులకు కూడా ఇంకెన్ని ప్రయోజనాలను ఇవ్వగలదో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోర్ కండరాలను బలోపేతం చేయడమే గాక మొత్తం శరీరం, మనసును బలోపేతం చేసే వ్యాయామం ఇది. అయితే దీనిని సరైన విధంగా చేయాలి. ఇప్పుడే కొత్తగా మొదలుపెడుతున్నవారు.. వ్యాయామ నిపుణుల సలహాలు సంప్రదింపులతో చేయడం మంచిది. View this post on Instagram A post shared by CircleChess (@circlechess) (చదవండి: ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!) -
కావాలనే ఓడిపోయాడా?.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే
క్రీడల్లో ఆటగాళ్లు పొరపాటు చేయడం సహజమని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ తెలిపారు. అంత మాత్రాన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో పోటీతత్వం, తీవ్రత లేవనే విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. సింగపూర్ సిటీ వేదికగా గురువారం ముగిసిన వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చెస్ ఆట అంతమైందంటూభారత్కు చెందిన ఈ 18 ఏళ్ల టీనేజ్ గ్రాండ్మాస్టర్ పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ టోర్నీ పోటీలపై మాజీ ప్రపంచ చాంపియన్, రష్యా గ్రాండ్మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ స్పందిస్తూ చెస్ ఆట అంతమైందని తీవ్ర పదజాలాన్ని వాడాడు. చెస్లో 14 రౌండ్ల పాటు జరిగిన గేముల్లో పోటాపోటీ కొరవడిందని, గట్టి పోటీ కనిపించనే లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.అతడివి పిల్లచేష్టలు.. ఏ ఆటలోనైనా సహజమేఅంతేకాదు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ వేసిన ఎత్తులు పిల్లచేష్టలుగా అభివర్ణించాడు. దీనిపై రష్యాకే చెందిన వొర్కొవిచ్ స్పందిస్తూ ‘క్రీడల్లో పొరపాట్లు చాలా సహజం. ఈ పొరపాట్లనేవి జరగకపోతే ఫుట్బాల్లో గోల్సే కావు. ప్రతీ ఆటగాడు పొరపాట్లు చేస్తాడు. ఆ తప్పుల కోసమే ప్రత్యర్థి కాచుకొని ఉంటాడు. సరైన అవకాశం రాగానే అందిపుచ్చుకుంటాడు. ఇదంతా ఏ ఆటలోనైనా సహజమే. ప్రపంచ చెస్ టైటిల్ కోసం తలపడిన లిరెన్, గుకేశ్లకు అభినందనలు, టైటిల్ గెలిచిన గుకేశ్కు కంగ్రాట్స్’ అని అన్నారు.ఇక వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మాగ్నస్ కార్ల్సన్ కూడా కొన్ని రౌండ్లు చూస్తే ప్రపంచ చెస్ టైటిల్ కోసం జరిగినట్లుగా తనకు అనిపించలేదని... ఏదో ఓపెన్ టోర్నీలోని గేములుగా కనిపించాయని అన్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదుకానీ భారత సూపర్ గ్రాండ్మాస్టర్, ఐదుసార్లు చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అంతా అయ్యాక ఇలాంటి విమర్శలు రావడం ఎక్కడైనా జరుగుతాయని, వీటిని గుకేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదని కొత్త చాంపియన్కు సూచించాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ కొత్త చరిత్ర లిఖించాడని హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ సైతం వ్లాదిమిర్ క్రామ్నిక్, కార్ల్సన్ విమర్శలను కొట్టిపడేస్తూ గుకేశ్కు అండగా నిలవడం విశేషం.చదవండి: గుకేశ్కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
గుకేశ్పై విమర్శలు: కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీ
తన గెలుపును విమర్శిస్తున్న వారికి ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేమ్లు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ చాంపియన్ను నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు.కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీవీటిన్నింటిని నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాననేది కూడా నిజం. అయితే కీలక సమయాల్లో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నా’ అని గుకేశ్ వివరించాడు. చదరంగం చచ్చిపోయింది అంటూ విమర్శలుకాగా.. ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్లు చూస్తే అసలు వరల్డ్ చాంపియన్షిప్లా లేదు... చదరంగం చచ్చిపోయింది... ఒక చిన్న తప్పు వరల్డ్ చాంపియన్ను నిర్ణయించడం ఏమిటి?’... గురువారం గుకేశ్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి! స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేశ్ ఘనతకు గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుకేశ్ పైవిధంగా స్పందించాడు. వరల్డ్ చాంపియన్షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు.విమర్శలను పట్టించుకోవద్దు: ఆనంద్ వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత గుకేశ్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తిప్పి కొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేశ్కు సూచించాడు. ‘గుకేశ్ చరిత్ర సృష్టించడం నేను కళ్లారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతీ మ్యాచ్కు వస్తూనే ఉంటాయి.విజయాలు సాధించినప్పుడు ఇలాంటివి సహజం. వరల్డ్ చాంపియన్ అయ్యాక ఎవరో అనే ఇలాంటి మాటలను లెక్క చేయవద్దు. లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ చాంపియన్షిప్లో దాదాపు ప్రతీ మ్యాచ్లో వస్తాయి. గుకేశ్ దానిని బాగా వాడుకున్న తీరును ప్రశంసించాలి’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు ‘‘గుకేశ్ విశ్వ విజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమమైనది. ఇన్నేళ్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేశ్ ప్రపంచ చాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా. పది నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేశ్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తానూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్తో ఆ కష్టమంతా సంతోషంగా మారిపోయింది’’ అని గుకేశ్ తల్లి పద్మాకుమారి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: గుకేశ్కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
ఆనంద్కు మూడో స్థానం!
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్లో ఓడిపోయి, మరో గేమ్లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం.. -
సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర
చెన్నై చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్గా నిలిచాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనందన్ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నంబర్ 1 ప్రజ్ఞానంద ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్ ర్యాంకర్గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు అంతేకాదు.. లిరెన్పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్లో వరల్డ్ చాంపియన్ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్ చాంపియన్పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. అదానీ, సచిన్ ప్రశంసలు కాగా భారత టాప్ ర్యాంకర్గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం
భారత చెస్లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్ చరిత్రలో 'నయా కింగ్'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating! There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ — International Chess Federation (@FIDE_chess) August 3, 2023 ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్ను మించిన తొలి ప్లేయర్గా నిలుస్తాడు. చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు -
లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త యాడ్ ఇంటర్నెట్లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సబ్వే కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్వేలో ఆన్లైన్ ఆర్డర్ల గందరగోళానికి చెక్ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్ మేడ్ సూపర్ సింపుల్ అంటున్న ఈ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్ క్యాపిటల్పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్) సబ్వే అవుట్లెట్లో గ్రాండ్మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన రొట్టె రకం, ఫిల్లింగ్లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్లు మసాలా దినుసులపై సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్కి చెమటలు పట్టేస్తాయి. చెస్లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే అన్న ట్యాగ్లైన్తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్తో, ఆనంద్ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్ కమెంట్స్ చేశారు. గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా కొనుగోలు చేస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు. ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఆస్వాదించడం చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్వేలో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటే అదో గందరగోళం అనే ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే మెన్షన్ చేస్తూనే సబ్వే శాండ్విచ్ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్ లో పేర్కొంది. Admin paneer sub khaane gaya tha 😅 pic.twitter.com/4BqLUX3LdU — Viswanathan Anand (@vishy64theking) July 10, 2023 -
సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
భారత చెస్ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు షాక్ తగిలింది. భారత 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజధాని జగ్రెబ్లో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ పడ్డారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడతానని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేను ఎంతగానో ఆరాధించే ఆటగాడిపై విజయం చాలా స్పెషల్గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. చెన్నైకి చెందిన గుకేశ్కి విశ్వనాథన్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అతడిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్దయ్యాక చెస్ ప్లేయర్ కావాలనుకన్నాడు. అండర్ -13 చాంపియన్గా నిలిచాడు. అయితే.. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెలలో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్లోసన్(Magnus Carlsen)ను ఓడించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఆనంద్పై పైచేయి సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం -
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు కీలక పదవి
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. విఖ్యాత చెస్ గ్రాండ్మాస్టర్ ఆనంద్ ‘ఫిడే’ కార్యవర్గంలోకి రావడం పట్ల వొర్కోవిచ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆనంద్కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఇకపై ‘ఫిడే’ భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయి’ అని అన్నారు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ సంచలన నిర్ణయం
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (31) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది (2023) తన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. గత దశాబ్ద కాలంగా చెస్ ప్రపంచాన్ని మకుటం లేని మారాజులా ఏలుతున్న కార్ల్సన్.. గతేడాది (2021) ఛాంపియన్షిప్ సాధించిన అనంతరమే ఈ విషయమై క్లూ ఇచ్చాడు. తాజాగా తాను టైటిల్ డిఫెండ్ చేసుకోవట్లేదని ఇవాళ స్పష్టం చేశాడు. చెస్ ఛాంపియన్ హోదాపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన ఫ్రెండ్కు ఇచ్చిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కార్ల్సన్ గతేడాది ఇయాన్ నెపోమ్నియాచిపై ఐదో టైటిల్ నెగ్గి ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఇదిలా ఉంటే, కార్ల్సన్ నిర్ణయంపై భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ స్పందించాడు. కార్ల్సన్ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 1975లో బాబీ ఫిషర్ కూడా ఇలాగే ఆటను మధ్యలోనే వదిలేశాడని, ఇలా చేయడం వల్ల చదరంగం క్రీడకు నష్టం జరుగుతుందని అన్నాడు. చదవండి: బాంబుల మోత నుంచి తప్పించుకొని పతకం గెలిచి.. -
ఆనంద్కు తొలి ఓటమి
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు తొలి పరాజయం ఎదురైంది. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్ను ఆనంద్ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్లో ఫలితం తేలడానికి ‘అర్మగెడాన్’ గేమ్ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్లో సో వెస్లీ 46 ఎత్తుల్లో ఆనంద్ను ఓడించాడు. -
వ్యాఖ్యాతగా విశ్వనాథన్ ఆనంద్
Viswanathan Anand Commentary Role.. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్ ఈనెల 24 నుంచి దుబాయ్లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ మ్యాచ్కు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), నెపోమ్నియాచి (రష్యా) ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు. గతంలో ఆన్లైన్ టోర్నీలకు వ్యాఖ్యాతగా పనిచేసిన ఆనంద్ ఈసారి గెలుపోటముల టెన్షన్ లేకుండా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ కోసం వెళ్తుండటం సరదాగా ఉందన్నాడు. -
Covid-19: చెస్ స్టార్స్ విరాళం రూ. 37 లక్షలు
చెన్నై: కరోనాతో పోరాడుతున్న వారికి తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన భారత చెస్ స్టార్ క్రీడాకారులు 50 వేల డాలర్లను (దాదాపు రూ. 37 లక్షలు) సేకరించారు. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఏర్పాటు చేసిన ‘చెక్మేట్ కోవిడ్’ కార్యక్రమంలో భాగమైన విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, రమేశ్ బాబు ఇతర చెస్ ప్లేయర్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడటం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు. ఇక దీనిని రెడ్ క్రాస్ ఇండియాకు అందజేస్తామని ఏఐసీఎఫ్ తెలిపింది. రెండు వేలలోపు ఫిడే రేటింగ్స్ ఉన్న చెస్ ప్లేయర్లు ఆనంద్తో సహా మిగిలిన నలుగురు క్రీడాకారులతో మ్యాచ్లు ఆడేందుకు ఏఐసీఎఫ్ అవకాశ మిచ్చింది. ఆనంద్తో ఆడాలంటే 150 డాలర్ల (రూ. 11 వేలు)ను... మిగిలిన నలుగురితో ఆడాలనుకుంటే 25 డాలర్ల (రూ.1,835)ను రిజిస్ట్రేషన్ రుసుముగా పెట్టింది. ఇందులో 105 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు. చదవండి: Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’ -
ఆనంద్కు స్పాన్సర్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చెన్నై: గాన గంధర్వుడు, సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. 1983లో జాతీయ టీమ్ చాంపియన్షిప్ సందర్భంగా తమ జట్టు చెన్నై కోల్ట్స్కు బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్షిప్ అందజేశారని చెప్పాడు. 2002 ప్రపంచ కప్ అనంతరం ఎయిర్పోర్ట్లో ఆయనను కలిసినట్లు ఆనంద్ వెల్లడించారు. ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్న ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఎస్పీకి నివాళి అర్పించారు. ‘నాకు 13 సంవత్సరాల వయస్సులో నేషనల్ టీమ్ చాంపియన్షిప్లో మా జట్టుకు ఆయన స్పాన్సర్గా వ్యవహరించారు. ఆ ఈవెంట్ తర్వాతే నాకు పేరొచ్చింది. మేం ఆ టోర్నీ గెలుపొందాం. అప్పుడు ఆయనతో పరిచయం లేదు. కానీ 2002లో ఎయిర్పోర్ట్లో తొలిసారి కలిసినపుడు స్పాన్సర్షిప్ గురించి మాట్లాడాను. ఆ విషయం తనకూ గుర్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయనో గొప్ప వ్యక్తి’ అని 50 ఏళ్ల ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. -
చెస్ స్టార్స్ విరాళం రూ. 4 లక్షల 50 వేలు
చెన్నై: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు తమవంతుగా చేయూతనిచ్చారు. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తోపాటు గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అభిమానులతో ఆన్లైన్లో 20 బోర్డులపై చెస్ గేమ్లు ఆడారు. చెస్.కామ్–ఇండియా వెబ్సైట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చెస్ స్టార్స్తో ఆడిన వారు స్వచ్ఛందంగా కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. ఓవరాల్గా ఈ టోర్నీ ద్వారా చెస్ స్టార్స్ మొత్తం ఆరు వేల డాలర్లు (రూ. 4 లక్షల 50 వేలు) సమకూర్చారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. -
రెండో స్థానంలో ఆనంద్
షంకిర్ (అజర్బైజాన్): వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదు రౌండ్లలో అతను ఒక్క నార్వే సూపర్ గ్రాండ్మాస్టర్ కార్ల్సన్తో మాత్రమే ఓడిపోయాడు. రెండు గేమ్ల్లో గెలిచి మరో రెండు గేముల్ని డ్రా చేసుకున్నాడు. దీంతో 3 పాయింట్లతో కర్యాకిన్ (రష్యా)తో కలిసి ఉమ్మడిగా రెండోస్థానంలో నిలిచాడు. కార్ల్సన్ (నార్వే) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో రౌండ్ గేమ్లో అనిశ్ గిరి (నెదర్లాండ్స్)పై ఆనంద్ గెలిచాడు. -
చెన్నై కుర్రాడు... చరిత్రకెక్కాడు
చెన్నై: తమిళనాడు కుర్రాడు డి.గుకేశ్ పన్నెండేళ్ల వయసులోనే గ్రాండ్మాస్టర్ హోదాతో రికార్డులకెక్కాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ గ్రాండ్మాస్టర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. తన రాష్ట్ర సహచరుడు ఆర్.ప్రజ్ఞానంద జూన్లో సాధించిన రికార్డు (12 ఏళ్ల 10 నెలల వయసులో)ను ఏడాది తిరగకుండానే చెరిపేశాడు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మంగళవారం తొమ్మిదో రౌండ్లో డి.కె.శర్మను ఓడించడం ద్వారా గుకేశ్ గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా పొందాడు. మొత్తం మీద భారత చదరంగ క్రీడాకారుల్లో అతను 59వ జీఎం. 2002లో ఉక్రెయిన్కు చెందిన సెర్గీ కర్యాకిన్ 12 ఏళ్ల ఏడు నెలల వయసులో సాధించిన జీఎం ఘనత ప్రపంచ అతిపిన్న రికార్డు కాగా, గుకేశ్ కేవలం 17 రోజుల తేడాతో ఆ రికార్డుకు దూరమయ్యాడు. నిజానికి గత నెలలోనే గుకేశ్కు ‘ప్రపంచ రికార్డు’ అవకాశం వచ్చినా... తృటిలో చేజార్చుకున్నాడు. డిసెంబర్లో జరిగిన బార్సిలోనా టోర్నీలో అతను మూడో రౌండ్లో ఇటలీ గ్రాండ్మాస్టర్ డానియెల వొకటురో (ఇటలీ) చేతిలో ఓడిపోవడంతో మూడో జీఎం నార్మ్తో పాటు ‘ప్రపంచ అతిపిన్న’ ఘనత చేజారింది. తిరిగి నెల వ్యవధిలోనే తమిళ తంబి తన ఎత్తులకు పదును పెట్టాడు. తల్లిదండ్రులతో ఆడుతూనే... ఎత్తులు–పైఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న ఈ చిచ్చర పిడుగు ‘చెస్’ నేపథ్యం కేవలం ఓ ‘ఆటవిడుపు’గా మొదలైంది. గుకేశ్ తల్లి పద్మ, తండ్రి రజినీకాంత్ ఇద్దరూ వైద్యులే. వాళ్లిద్దరు ఇంట్లో ఆడుతుంటే చూసిన చిన్నారి గుకేశ్ సరదాగా ఎత్తులు వేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో దీటుగా పోటీపడ్డాడు. అతని ఎత్తులకు, ఓర్పుగా దెబ్బతీసే పైఎత్తులకు వాళ్లిద్దరూ అబ్బురపడేవారు. అతని ఆసక్తిని ఆటవిడుపుకే పరిమితం కాకుడదని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారిని చెస్ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడ్నుంచి ఆట కాస్త చెస్ బాట అయ్యింది. ఇక ఆనంద్ సర్తో ఆడతా చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్మాస్టరైనందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. మూడో జీఎం నార్మ్తో పాటు గ్రాండ్మాస్టర్ టైటిల్ దక్కింది. ఇక విశ్వనాథన్ ఆనంద్ సర్తో తలపడాలనుకుంటున్నా. ఈ గేమ్ (9వరౌండ్)కు ముందు నేనేమీ ఒత్తిడిని ఎదుర్కోలేదు. అయితే ఆటమధ్యలో కాస్త ఎదురైనప్పటికీ ఆటపైనే దృష్టిపెట్టి ముందడుగు వేశాను. స్పెయిన్ (బార్సిలోనా)లోనే కర్యాకిన్ రికార్డును చెరిపేసే అవకాశం చేజార్చినందుకు నిరాశగా ఉంది. ఆ తర్వాత ముంబై టోర్నీలోను సాంకేతిక కారణాల వల్ల ప్రపంచ రికార్డును కోల్పోయాను’ – గుకేశ్ -
చాంపియన్ ఆనంద్
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్, హికారు నకముర (అమెరికా) 12.5 పాయిం ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్ను నిర్వహించగా... ఆనంద్ 1.5–0.5తో నకమురను ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. టైబ్రేక్ తొలి గేమ్లో ఆనంద్ 55 ఎత్తుల్లో గెలిచాడు. రెండో టైబ్రేక్ గేమ్ను అతను 72 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నిర్ణీత 18 రౌండ్లలో ఆనంద్ తొమ్మిది విజయాలు సాధించి, ఏడింటిని ‘డ్రా’గా ముగించి, రెండింటిలో ఓడిపోయాడు. విజేతగా నిలిచిన ఆనంద్కు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 41 వేలు) ప్రైజ్మనీ లభించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ 8 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... హరికృష్ణకు ఆరో స్థానం, విదిత్కు ఏడో స్థానం దక్కింది. సూర్యశేఖర గంగూలీ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. -
సంయుక్తంగా మూడో స్థానంలో హరికృష్ణ, ఆనంద్
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లు ముగిశాక భారత గ్రాండ్మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ 5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హరికృష్ణ ఆడిన తొమ్మిది గేముల్లో మూడింట గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, లెవాన్ అరోనియన్లపై నెగ్గిన హరికృష్ణ... మమెదైరోవ్, సెర్గీ కర్జాకిన్, ఆనంద్, విదిత్లతో గేమ్లను ‘డ్రా’గా ముగించాడు. నకముర, సో వెస్లీలతో జరిగిన గేముల్లో హరికృష్ణకు ఓటమి ఎదురైంది. 6.5 పాయింట్లతో నకముర (అమెరికా) ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... సో వెస్లీ (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నేడు మిగతా తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. -
రెండో స్థానంలో హరికృష్ణ
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జరిగిన మూడు గేమ్లను కూడా హరికృష్ణ ‘డ్రా’గా ముగించడం విశేషం. నిహాల్ సరీన్ (భారత్)తో జరిగిన నాలుగో గేమ్ను 51 ఎత్తుల్లో... విశ్వనాథన్ ఆనంద్ (భారత్)తో జరిగిన ఐదో గేమ్ను 38 ఎత్తుల్లో... సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఆరో గేమ్ను 50 ఎత్తుల్లో హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం 4.5 పాయింట్లతో హికారు నకముర (అమెరికా), లెవాన్ అరోనియన్ (అర్మేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉన్నాడు. ఆదివారం చివరి రౌండ్ మూడు గేమ్లు జరుగుతాయి. కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జరిగిన మూడు గేమ్లను కూడా హరికృష్ణ ‘డ్రా’గా ముగించడం విశేషం. నిహాల్ సరీన్ (భారత్)తో జరిగిన నాలుగో గేమ్ను 51 ఎత్తుల్లో... విశ్వనాథన్ ఆనంద్ (భారత్)తో జరిగిన ఐదో గేమ్ను 38 ఎత్తుల్లో... సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఆరో గేమ్ను 50 ఎత్తుల్లో హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం 4.5 పాయింట్లతో హికారు నకముర (అమెరికా), లెవాన్ అరోనియన్ (అర్మేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉన్నాడు. ఆదివారం చివరి రౌండ్ మూడు గేమ్లు జరుగుతాయి. -
సంయుక్తంగా అగ్రస్థానంలో హరికృష్ణ
కోల్కతా: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో పురుషుల ర్యాపిడ్ విభాగంలో తొలి మూడు రౌండ్లు ముగిశాక... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండు పాయింట్లతో అరోనియన్, మమెదైరోవ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మొదలైన ఈ మెగా టోర్నమెంట్లో 10 మంది గ్రాండ్మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం పోటీపడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్, లెవాన్ అరోనియన్ (అర్మేనియా), షకిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), సో వెస్లీ (అమెరికా), హికారు నకముర (అమెరికా), సెర్గీ కర్జాకిన్ (రష్యా)లాంటి మేటి గ్రాండ్మాస్టర్స్తోపాటు భారత్కే చెందిన సూర్యశేఖర గంగూలీ, విదిత్, నిహాల్ సరీన్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. సూర్యశేఖర గంగూలీతో జరిగిన ర్యాపిడ్ తొలి గేమ్ను 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... రెండో గేమ్లో 42 ఎత్తుల్లో మమెదైరోవ్ను ఓడించాడు. నకమురతో జరిగిన మూడో గేమ్ను హరికృష్ణ 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. విశ్వనాథన్ ఆనంద్ తాను ఆడిన మూడు గేమ్లను ‘డ్రా’గా ముగించాడు. తొలి గేమ్ను సో వెస్లీతో 145 ఎత్తుల్లో... రెండో గేమ్ను కర్జాకిన్తో 31 ఎత్తుల్లో... మూడో గేమ్ను అరోనియన్తో 38 ఎత్తుల్లో ఆనంద్ ‘డ్రా’ చేసుకున్నాడు. -
పురుషులు ‘ఆరు’... మహిళలు ‘ఎనిమిది’
బటూమి (జార్జియా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు చెస్ ఒలింపియాడ్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్లతో కూడిన భారత పురుషుల జట్టు 16 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్లతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన 11వ రౌండ్లో పోలాండ్తో జరిగిన మ్యాచ్ను భారత పురుషుల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆనంద్–జాన్ క్రిస్టోఫ్ డూడా గేమ్ 25 ఎత్తుల్లో... హరికృష్ణ–రాడోస్లా గేమ్ 30 ఎత్తుల్లో... విదిత్–కాక్పెర్ గేమ్ 48 ఎత్తుల్లో... ఆధిబన్–జాసెక్ టామ్జాక్ గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఓవరాల్గా భారత్ ఏడు మ్యాచ్ల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు మంగోలియాతో జరిగిన చివరి మ్యాచ్ను భారత మహిళల జట్టు 3–1తో గెలిచింది. హారిక–బతుయాగ్ మున్గున్తుల్ గేమ్ 72 ఎత్తుల్లో... ఇషా–ముంక్జుల్ గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... తానియా 60 ఎత్తుల్లో నోమిన్పై, పద్మిని 65 ఎత్తుల్లో దులామ్సెరెన్పై విజయం సాధించారు. ఓవరాల్గా భారత జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... హంగేరి చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో రౌండ్లో హంగేరి చేతిలో ఓటమి భారత జట్టు పతకావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో చైనా విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. పురుషుల విభాగంలో చైనా, అమెరికా, రష్యా 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు స్వర్ణం... అమెరికా ఖాతాలో రజతం చేరగా... రష్యా జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో చైనా, ఉక్రెయిన్ 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు పసిడి పతకం ఖాయమైంది. ఉక్రెయిన్కు రజతం, 17 పాయింట్లు సాధిం చిన జార్జియా జట్టుకు కాంస్యం లభించింది. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. కెనడాతో బుధవారం జరిగిన మూడో రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలుపొందింది. భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, శశికిరణ్ నెగ్గగా... విదిత్ తన గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. ఆనంద్ 33 ఎత్తుల్లో ఎరిక్ హాన్సెన్పై, హరికృష్ణ 33 ఎత్తుల్లో రజ్వాన్ ప్రెటుపై, శశికిరణ్ 28 ఎత్తుల్లో అమన్ హంబిల్టన్పై గెలిచారు. విదిత్, ఎవగెని బరీవ్ మధ్య గేమ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. మరోవైపు సెర్బియాతో జరిగిన మ్యాచ్ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులను ఓడించగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్లకు పరాజయం ఎదురైంది. -
భారత జట్ల శుభారంభం
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఎల్ సాల్వడార్ జట్టుపై... భారత మహిళల జట్టు 4–0తో న్యూజిలాండ్పై విజయం సాధించాయి. తొలి మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారికలకు విశ్రాంతి ఇచ్చారు. పురుషుల జట్టు తరఫున పెంటేల హరికృష్ణ 33 ఎత్తుల్లో జార్జి ఎర్నెస్టో గిరోన్పై, విదిత్ 23 ఎత్తుల్లో రికార్డో చావెజ్పై, ఆధిబన్ 30 ఎత్తుల్లో డానియల్ ఎరియాస్పై నెగ్గగా... కార్లోస్ బర్గోస్తో జరిగిన గేమ్ను శశికిరణ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల జట్టు తరఫున కోనేరు హంపి 36 ఎత్తుల్లో హెలెన్ మిలిగన్పై, తానియా సచ్దేవ్ 67 ఎత్తుల్లో వ్యాన్లా పున్సాలన్పై, ఇషా కరవాడే 37 ఎత్తుల్లో జాస్మిన్ జాంగ్పై, పద్మిని రౌత్ 36 ఎత్తుల్లో నికోల్ కిన్పై గెలిచారు. ఈ విజయాలతో భారత జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. -
హారిక ఖాతాలో ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో హారిక 32 ఎత్తుల్లో అమెరికా గ్రాండ్మాస్టర్ జియాంగ్ జెఫ్రీని నిలువరించింది. ఇదే వేదికపై జరుగుతున్న మాస్టర్స్ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 27 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్ ఆనంద్
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఐదు రౌండ్లు ముగిశాక భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో వీ యి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను ఆనంద్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్తోపాటు అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మమెదైరోవ్ (అజర్బైజాన్) 3.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆనంద్కు కాంస్యం
రియాద్: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాదిని గొప్పగా ముగించాడు. మూడు రోజుల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఆనంద్... అదే వేదికపై జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించాడు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 48 ఏళ్ల ఆనంద్ నిర్ణీత 21 రౌండ్లు పూర్తయ్యాక 14.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా కర్జాకిన్కు రెండో స్థానం, ఆనంద్కు మూడో స్థానం లభించాయి. ఒక్కొక్కటి మూడు నిమిషాల నిడివిగల 21 గేముల్లో ఆనంద్ తొమ్మిదింటిలో గెలిచి... 11 ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్లో ఓడిపోయాడు. 16 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్ సాధించాడు. -
ఆనంద్ నిష్క్రమణ
తిబిలిసి (జార్జియా): గతంలో రెండుసార్లు (2000, 2002లో) చాంపియన్గా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్కు ఈసారి ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో చేదు అనుభవం ఎదురైంది. 15 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ బరిలోకి దిగిన ఆనంద్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆశలు సజీవంగా ఉండాలంటే ఆంటోన్ కొవల్యోవ్ (కెనడా)తో గురువారం జరిగిన రెండో గేమ్లో తప్పనిసరిగా గెలవాల్సిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. దాంతో 0.5–1.5తో కొవల్యోవ్ చేతిలో ఆనంద్ ఓడిపోయాడు. మరోవైపు లీ క్వాంగ్ లియెమ్ (వియత్నాం)తో జరిగిన రెండో గేమ్ను విదిత్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 1.5–0.5తో గెలుపొంది మూడో రౌండ్కు చేరాడు. పెంటేల హరికృష్ణ–సేతురామన్ల మధ్య; ఆదిబన్–నెపోమ్నియాచి (రష్యా)ల మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో శుక్రవారం టైబ్రేక్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. -
కాస్పరోవ్, ఆనంద్లకు నిరాశ
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్)... సెయింట్ లూయిస్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో కాస్పరోవ్ పదో స్థానంలో, ఆనంద్ తొమ్మిదో స్థానంలో నిలువడం గమనార్హం. 3.5 పాయింట్లతో డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), కాస్పరోవ్, ఆనంద్ సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సాధించిన విజయాల సంఖ్య, ముఖాముఖి గేమ్ల ఫలితాల ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... నవారా ఎనిమిదో స్థానంలో, ఆనంద్ తొమ్మిదో స్థానంలో, కాస్పరోవ్ పదో స్థానంలో నిలిచారు. ఆరు పాయింట్లు సాధించిన లెవాన్ అరోనియన్ (అర్మేనియా) టైటిల్ను దక్కించుకున్నాడు. -
కాస్పరోవ్ను నిలువరించిన ఆనంద్
సెయింట్ లూసియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ (రష్యా)ను భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నిలువరించాడు. కాస్పరోవ్తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్కు ఏడో స్థానం
స్టావాంజర్ (నార్వే): పది మంది సూపర్ గ్రాండ్మాస్టర్స్ మధ్య జరిగిన నార్వే ఓపెన్ బ్లిట్జ్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏడో స్థానంలో నిలిచాడు. తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లు సాధించాడు. ఆరు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్, రెండింటిలో ఓడి, మరో గేమ్లో గెలిచాడు. మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో మంగళవారం జరిగిన క్లాసికల్ విభాగం తొలి గేమ్లో మాక్సిమ్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆనంద్కు రెండో ఓటమి
లండన్: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్ గేమ్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 54 ఎత్తుల్లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఆనంద్కిది రెండో పరాజయం. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయిం ట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. -
‘రారాజు’కుసత్కారం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీ నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు రూ.29 కోట్లను కేటాయించింది. ఈ నెల ఏడో తేదీన నెహ్రూ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీని ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిదో తేదీ నుం చి నగరంలోని ఓ స్టార్ హోటల్లో చెస్ టోర్నీ ఆరంభం అయింది. టైటిల్ గెలుచుకోవడం లక్ష్యంగా భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, నార్వేకు చెందిన 22 ఏళ్ల యువకుడు స్వెన్ మాగ్నస్ కార్ల్సెన్ తలపడ్డారు. పన్నెండు రౌండ్ల మ్యాచ్లో 6.5 పాయింట్లు సాధించిన వారే విజేతగా నిలుస్తారు. అయితే, పది రౌండ్లలోనే విజయం కార్ల్సెన్ను వరించింది. తొలుత డ్రా దిశగా రౌండ్లు సాగినా, ఐదు, ఆరు, తొమ్మిది రౌండ్లు కార్ల్సెన్కు అనుకూల వాతావరణాన్ని కలిగించడంతో ప్రపంచ చెస్ రారాజుగా నిలిచాడు. బహుమతి ప్రదానోత్సవం: ప్రపంచ చెస్ టైటిల్ దక్కిం చుకున్న విజేతకు బహుమతి ప్రదానోత్సవం సోమవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రపంచ చెస్ రారాజు కార్ల్సెన్ను నీలగిరుల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారంతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ వేడుక నిమిత్తం హోటల్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి మహ్మద్ మజీముద్దీన్, క్రీడల అభివృద్ధి శాఖ కార్యదర్శి కే రాజారామన్, ఫిడే ప్రతినిధి హరిహరన్ ఘన స్వాగతం పలికారు. అఖిల భారత చెస్ సమ్మేళనం అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. ఫిడే అధ్యక్షుడు ఇల్లిం షినోను తమిళనాడు చెస్ సంఘం అధ్యక్షుడు వెంకటరామరాజ ఆహ్వానం పలికారు. ముందుగా తమిళ్ తాయ్ వాల్త్, ఫిడే పాటల్ని ప్రార్థనా గీతంగా ఆలపించడం విశేషం. సత్కారం: ఫిడే ప్రపంచ చెస్ టోర్నీ టైటిల్ విజేత కార్ల్సెన్, రన్నరప్గా నిలిచిన ఆనంద్ను బంగారు, వెండి పతకాలతో ఆ సంస్థ అధ్యక్షుడు ఇల్లిం షినో సత్కరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా సత్కారం చేశారు. ఆనంద్కు 1350 గ్రాముల వెండితో తయారు చేసిన షీల్డ్ను, రూ.ఆరు కోట్ల మూడు లక్షల నగదు బహుమతితో కూడిన చెక్ను అందజేశారు. అనంతరం రారాజు కార్ల్సెన్కు నీలగిరి కొండల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారాన్ని జయలలిత అందజేశారు. అలాగే, 3.5 కిలోల బంగారం పూతతో సిద్ధం చేసిన షీల్డ్ను బహుకరించారు. రూ. 9.90 కోట్ల ఫ్రైజ్ మనీని చెక్కు రూపంలో అందజేశారు. చివరగా భారత జాతీయ గీతంతో పాటుగా నార్వే జాతీయ గీతంతో 2013 చెస్ టోర్నీ టైటిల్ విజేత బహుమతి ప్రదానోత్సవాన్ని ముగించారు. -
ఎట్టకేలకు ఓ ఫలితం
చెన్నై: సులువైన అవకాశాలు చేజార్చుకోవడం... పదునులేని ఎండ్ గేమ్... కావలసినంత అనుభవం ఉన్నా... ప్రత్యర్థి ఎత్తుగడకు సరైన ప్రతి వ్యూహంలేక... ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ఐదో గేమ్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన గేమ్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) 58 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఫలితంగా టోర్నీలో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తెల్లపావులతో తొలిసారి తనదైన ఆటతీరును ప్రదర్శించిన నార్వే గ్రాండ్మాస్టర్.. నోటోబ్బామ్ ఓపెనింగ్తో గేమ్ను ప్రారంభించి క్రమంగా మార్షల్ గ్యాంబిట్లోకి తీసుకెళ్లాడు. ఊహించని ఈ వ్యూహానికి కాస్త కంగారుపడ్డ విషీ ... అప్పటికప్పుడు కొత్త ఎత్తుగడతో సులువుగానే అడ్డుకట్ట వేశాడు. ఓ దశలో ఆనంద్ పాన్ను కోల్పోయినా గేమ్లో ప్రత్యర్థితో సమానంగా నిలిచాడు. అయితే 45వ ఎత్తులో చేసిన తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడు. కింగ్ను పక్కనబెట్టి తర్వాత వేసిన ఎత్తుతో మళ్లీ గేమ్లోకి వచ్చినట్లే కనిపించినా... ఎండ్గేమ్లో రూక్స్, పాన్లతో ఆడటం పూర్తిగా దెబ్బతీసింది. రాబోయే రెండు గేమ్ల్లో కనీసం ఒక్క విజయమైనా సాధించకుంటే టోర్నీలో ముందుకెళ్లేకొద్దీ ఆనంద్కు కష్టాలు తప్పవు. -
ఈ ‘డ్రా’లతో ఆనంద్కే మేలు
చెస్ బోర్డులోని గడుల్లాగే నాలుగో గేమ్ 64 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఆనంద్ రెండో గేమ్ ఓపెనింగ్నే కొనసాగించినా... కార్ల్సెన్ వ్యూహం మార్చి బెర్లిన్ డిఫెన్స్ను ఉపయోగించాడు. ఈ ఓపెనింగ్తోనే క్రామ్నిక్ బాగా పాపులర్ అయ్యాడు. 2001లో కాస్పరోవ్ను ఇదే ఆయుధంతో ఓడించాడు కూడా. కార్ల్సెన్ సెకండ్స్లో నార్వే నుంచి జాన్ లూడ్విగ్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. బెర్లిన్ డిఫెన్స్లో తనకు చాలా వైవిధ్యాలు తెలుసు. దీనికి కార్ల్సెన్ బృందం బాగా సన్నద్ధమయింది. మరోవైపు ఆనంద్ ఆశ్చర్యకరంగా దీనికి సన్నద్ధం కాలేదు. నాలుగో గేమ్లో కార్ల్సెన్కు చాలా అవకాశాలు కనిపించినా... ఎక్కడా అతను గెలుస్తాడని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం స్కోరు 2-2గా ఉంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఆడిన తర్వాత ఒక రోజు విశ్రాంతి అవసరం. ఇప్పటివరకూ ఇద్దరూ ప్రత్యర్థి ఓపెనింగ్స్ను బాగా చదివారు. ఇక తర్వాతి గేమ్లలో కాస్త వేగం ఉంటుందని నా అభిప్రాయం. కార్ల్సెన్ రెటి ఓపెనింగ్కు కట్టుబడి 1, 3 గేమ్ల కంటే కాస్త మెరుగ్గా ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ నల్లపావులతో ఆడిన వాళ్లే గేమ్లో బాగా ఆడారు. నాలుగు గేమ్స్లో మూడుసార్లు నల్లపావులతో ఆడిన వాళ్లే ఆధిపత్యం చూపారు. తెల్లపావులతో ఆడటం వల్ల ఉండే లాభాన్ని ఇద్దరూ వినియోగించుకోలేదు. ప్రపంచ చాంపియన్షిప్లో ఇది ఆశ్చర్యకరమే. తెల్లపావులతో ఓపెనింగ్ చేసేవాళ్లు సాధారణంగా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతారు. కానీ ఈసారి గేమ్లు అలా సాగడం లేదు. ఆనంద్ నల్లపావులతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఐదోగేమ్లో కార్ల్సెన్ కాస్త దూకుడు పెంచి విజయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇద్దరూ ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం చూపలేదు. డ్రా ల సంఖ్య పెరిగే కొద్దీ ఆనంద్కే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కార్ల్సెన్పై ఒత్తిడి పెంచే అంశం. ఇలా వరుసగా డ్రాలు అయ్యే పరిస్థితిని గతంలో కార్ల్సెన్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి ఇది ఆనంద్కు మేలు చేసే అంశం. ఈ ఒక్క గేమ్ నల్లపావులతో ఆడితే... తర్వాత ఆనంద్ వరుసగా రెండు గేమ్లు తెల్లపావులతో ఆడొచ్చు. కాబట్టి మరో డ్రా జరిగినా ఆనంద్కు లాభమే.