Women farmers
-
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్షాప్ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
గుడ్న్యూస్.. మహిళా రైతులకు రూ.12,000? ఈ బడ్జెట్లోనే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు అంటే రూ. 12,000 లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష, మహిళా రైతులిద్దరికీ రూ.6,000లను అందిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు 15 విడతల్లో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించే ఈ చర్యగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రణాళికపై అటు వ్యవసాయ శాఖ గానీ, ఇటు ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు. -
G20 Summit: చిరుధాన్యలక్ష్మికళ
కలెక్టర్ పిల్లలు కలెక్టర్, హీరో పిల్లలు హీరో, రాజకీయ నాయకుడు పిల్లలు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటే, ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు... తమలా తమ పిల్లలు ఇబ్బందులు పడకూడదని, తిని, తినక ఒక్కోరూపాయి పోగుచేసి, కష్టపడి చదివించి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం తమ పిల్లలు తమలా రైతులు కావాలని అస్సలు కోరుకోవడం లేదు. ‘‘పెద్దయ్యాక రైతును అవుతాను’’ అని కూడా ఎవరూ చెప్పరు. ‘‘మేము వ్యవసాయం చేస్తాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ప్రపంచ దేశాధ్యక్షులు సైతం మేము చెప్పబోయేది ఆసక్తిగా వినబోతున్నారు అదీ వ్యవసాయం గొప్పతనం’’ అని చాటిచెబుతున్నారు ఇద్దరు మహిళా రైతులు. అవును గొప్పగొప్ప చదువులు చదివినవారికంటే..తమ పూర్వీకుల నాటి నుంచి ఆచరిస్తోన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న రైతులకు జీ–20 సదస్సుకు ఆహ్వానాలు అందాయి. పెద్దపెద్ద డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ.. కేవలం వ్యవసాయం చేస్తున్నారన్న ఒక్క కారణంతో ... ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే ‘జీ–20 సమితి’లో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది. ఒడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు ౖ‘రెమతి ఘురియా, సుబాసా మోహన్తా’లకు ఈ అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ–20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. కోరాపుట్ జిల్లాలోని నౌగుడా గ్రామానికి చెందిన రైతే 36 ఏళ్ల రైమతి ఘురియా. భూమియా జాతికి చెందిన రైమతికి ముగ్గురు పిల్లలు. మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తోంది. ఏళ్లపాటు వరిధాన్యాలు పండించే రైమతి... చిరుధాన్యాల సాగు మెళుకువలు నేర్చుకుని మిల్లెట్స్ సాగు మొదలు పెట్టింది. అధునాతన సాంకేతికతను జోడించి పంటలో అధిక దిగుబడిని సాధిస్తోంది. సాగులోలేని 72 దేశీయ వరి రకాలు, ఆరు చిరుధాన్యాలతో కలిపి మొత్తం 124 రకాల ధాన్యాలను అంతరించిపోకుండా కాపాడుతోంది. మంచి దిగుబడితో సాధిస్తున్న రైతుగానేగాక, తోటి గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగులో సాయం చేస్తూ వారికీ జీవనోపాధి కల్పిస్తోంది. సంప్రదాయ పంటలైన వరి, మిల్లెట్ రకాలను పండిస్తూనే తన గిరిజన మహిళలెందరికో ఆదర్శంగా నిలుస్తూ... మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ పంటల్లో తెగులు నివారణ మెళకువల గురించి, స్కూలును ఏర్పాటు చేసి ఏకంగా 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. చిరుధాన్యాల సాగులో రైమతి చేసిన కృషికిగా గుర్తింపుగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. 2012లో జీనోమ్ సేవియర్ కమ్యునిటీ అవార్డు, 2015లో జమ్షెడ్జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు, టాటా స్టీల్ నుంచి ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డులేగాక, ఇతర అవార్డులు అందుకుంది. చిరుధాన్యాల సాగులో అనుసరిస్తోన్న పద్ధతులు, దిగుబడి, తోటి రైతులను ఆదుకునే విధానమే రైమతిని జీ20 సదస్సుకు వెళ్లేలా చేసింది. ఈ సదస్సు లో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో వివిధ రకాల చిరుధాన్యాలు, ఈ ధాన్యాలతో చేసిన విభిన్న వంటకాలు, చిరుధాన్యాలతో వేసిన ముగ్గులను ప్రదర్శించనుంది. చిరుధాన్యాల సాగులో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అధిక దిగుబడి కోసం అవలంబిస్తోన్న విధానాలు వివరించనుంది. మిల్లెట్ సాగులో అనుసరించాల్సిన అధునాతన సాంకేతికత, దాని ఉపయోగాల గురించి ఎమ్ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ ఇచ్చిన శిక్షణ సంబంధిత అంశాలను ప్రస్తావించనుంది. సుబాసా మొహన్తా మయూర్భంజ్ జిల్లాలోని గోలి గ్రామానికి చెందిన చిరుధాన్యాల రైతే 45 ఏళ్ల సుబాసా మొహన్తా. తన జిల్లాలో ఎవరికీ చిరుధాన్యాల సాగుపై ఆసక్తి ఏమాత్రం లేదు. 2018లో ఒడిశా ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల సాగు చేయమని మిల్లెట్ మిషన్ను తీసుకొచ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చింది సుబాసా. ఏళ్లనాటి గిరిజన సాగుపద్ధతులను ఉపయోగిస్తూ రాగుల సాగును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లెట్స్ను పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోంది. ఇది చూసిన ఇతర రైతులు సైతం సుబాసాను సాయమడగడంతో వారికి సాగు పద్ధతులు, మెళకువలు నేర్పిస్తూ మిల్లెట్ సాగును విస్తరిస్తోంది. సుబాసాను ఎంతోమంది గిరిజన మహిళలు ఆదర్శంగా తీసుకుని చిరుధాన్యాలు సాగుచేయడం విశేషం. సుబాసా కృషిని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. జీ20 సదస్సుకు హాజరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల సాగు, ఈ ధాన్యాల ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతాను. గిరిజన మహిళగా గిరిజన సాగు పద్ధతులను మరింత విపులంగా అందరికీ పరిచయం చేస్తా్తను. – రైమతి ఘురియా చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిచేస్తాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు గిరిజనుల ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. కానీ ఇప్పుడు పొలాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. నేను ధాన్యాలు పండించడం మొదలు పెట్టిన తరువాత నన్ను చూసి చాలామంది రైతులు చిరుధాన్యాలు సాగుచేయడం ప్రారంభించారు. ఇతర రైతులకు వచ్చే సందేహాలు నివృత్తిచేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాను. వరికంటే చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు వస్తుండడంతో అంతా ఈ సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. – సుబాసా మోహన్తా -
మహిళా రైతులతో సోనియా ముచ్చట్లు: మీరే పిల్లను చూడండి..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి నవ్వులు పూయించింది. హరియాణాకు చెందిన కొందరు మహిళలు ఢిల్లీలోని టెన్ జన్పథ్కు వచ్చి సోనియాగాంధీ కుటుంబంతో కాసేపు గడిపారు. వారిని సాదరంగా ఆహ్వానించిన గాంధీ కుటుంబం ఆతిథ్యమిచ్చింది. ఆ మహిళలతో కలిసి సోనియా, ప్రియాంక, రాహుల్ భోజనాలు చేశారు. ఆ తర్వాత కాసేపు వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ సోనియాతో ‘‘రాహుల్కి పెళ్లి చేద్దామా’’ అని అడిగారు. దానికి సోనియా నవ్వుతూ ‘‘మీరే పిల్లని చూడండి’’ అని వాళ్లతో చెప్పారు. పక్కనే ఉండి ఇదంతా వింటున్న రాహుల్ ‘‘అవుతుంది. అవుతుంది’’ అని అన్నారు. దీంతో ప్రియాంక రాహుల్ స్వీట్గా కనిపిస్తున్నా చాలా కొంటెవాడని చెప్పారు. వారి సమావేశం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు హరియాణా సోనిపట్ జిల్లాకు చెందిన మహిళలతో ముచ్చటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మహిళా కార్మికులతో కలిసి నాట్లు వేశారు. తాము ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీని చూడలేదని వారు చెబితే అప్పట్లోనే రాహుల్ వారికి ఢిల్లీకి పిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి ఢిల్లీ చూపించాక తమ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళలు రాహుల్కు ప్రేమగా తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోని రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మా ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చారు. ఈ రోజు మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. వారితో కలిసి భోజనం చేశాం. ముచ్చట్లు చెప్పుకున్నాం. వారంతా మాకు ఎంతో అమూ ల్యమైన కానుకలు ఇచ్చారు. దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో చేసిన ఊరగాయలు ఎంతో ప్రేమతో ఇచ్చారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ మహిళ లతో కలిసి సోనియా, ప్రియాంక స్టెప్పులు వేశారు. ఇదీ నేపథ్యం... నా ఇంటిని ప్రభుత్వం లాగేసుకుంది జూలై 8న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హరియాణాలోని సోనిపట్ జిల్లా మదినా గ్రామానికి వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఢిల్లీలోని రాహుల్ సొంతింటిని గురించి అడిగారు. అందుకు రాహుల్..తనకు సొంతిల్లు లేదని, దానిని ప్రభుత్వం తీసేసుకుందని బదులిచ్చారు. ఢిల్లీలోని తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఫోన్ చేశారు. రైతు మహిళలు భోజనానికి రావాలనుకుంటున్నారని చెప్పారు...ఇదంతా 12 నిమిషాల నిడివున్న వీడియోలో ఉంది. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ఊరంతా బాగుండాలి.. అందులో నేనుండాలి! ఎమ్మే బీఈడీ చదివి ఇప్పుడిలా..
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ. శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది. ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు. శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే. ‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ. గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే! ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన. – కోనేటి శైలజ, (9912197746),ఎస్బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం. – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫొటోలు: కేతారి మోహన్కృష్ణ నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
సేద్యానికి ఆర్థిక దన్ను
మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోంది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): సన్న, చిన్న కారు మహిళా రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళా రైతులతో ‘రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య’ గ్రూపులను ఏర్పాటు చేసి, వివిధ శాఖల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. బ్యాంక్లు, ప్రభుత్వ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు వారే కల్పించుకునేలా వసతులు సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో 24 మండలాల్లో 27,412 మంది సభ్యులతో 2,492 గ్రూపులు ఏర్పాటయ్యాయి. తొలివిడతలోని గ్రూపులు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. మహిళా రైతులు సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. డీఆర్డీఏ ద్వారా అమలు ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. మండలానికి 150 గ్రూపులు లక్ష్యంగా నిర్దేశించింది. సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వ శాఖల సహకారం ఏ విధంగా అందించాలి. వారి ఉత్పత్తులకు ధర పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. దీంతో డీఆర్డీఏ అధికారులు అంచలంచెలుగా జిల్లా అంతటా సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే తొలిదశలో సైదాపురం, రాపూరు, చేజర్ల, కలువాయి, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, రెండో దశలో మనుబోలు, వెంకటాచలం, ఇందుకూరుపేట, అల్లూరు, విడవలూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్పేట, వింజమూరు, మూడో దశలో కావలి, జలదంకి, సీతారామపురం, కొడవలూరు, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు, బోగోలు మండలాల్లో సంఘాలు ఏర్పాటయ్యాయి. సత్ఫలితాల దిశగా తొలిదశ సంఘాలు తొలి దశలో ఏర్పాటైన సంఘాలు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. చేజర్ల, రాపూరు, కలువాయి తదితర మండలాల్లో రుణం పొంది మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, పొట్టేళ్ల పెంపకం, సేంద్రియ ఎరువులతో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు. తద్వారా వచ్చే నాణ్యమైన ఉత్పత్తులను ‘కాలుగుడి’ యాప్లో పొందు పరచి ఆన్లైన్ మార్కెట్ చేసి లాభపడుతున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సహకారం వ్యవసాయశాఖ సంఘాలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. మౌలిక వసతులను కల్పిస్తోంది. భూసార పరీక్షలు చేయించడం. సమగ్ర వ్యవసాయ విధానంపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. సెర్ఫ్: బ్యాంక్ ఖాతాలను తెరిపించడంతో పాటు రుణాలు పొందే విధంగా ప్రోత్సహిస్తుంది. పుస్తక నిర్వహణపై శిక్షణ ఇస్తుంది. ఉద్యానశాఖ: ప్రభుత్వ, ఇతర సంస్థల సబ్సిడీ పథకాలను సంఘాలకు అందిస్తుంది. సాంకేతిక సహకారమందిస్తుంది. సమీకృత వ్యవసాయంపై శిక్షణ ఇస్తుంది. రైతు సాధికార సంస్థ: సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందేలా చూడడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం చేస్తుంది. పశుసంవర్థశాఖ: పాడి పశువులు, సన్న జీవాల కొనుగోలుకు సహకారమందిస్తుంది. వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయిస్తుంది. డెయిరీ కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్: గొర్రెలు, మేకలు, కోళ్లు, పశువుల షెడ్స్, ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది. రుణ పరపతి: ఒక్కో సంఘ సభ్యురాలికి రూ.25 వేల రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. సభ్యులంతా కలిపి తీసుకోవాలంటే రూ.1.50 లక్ష వరకు రుణం పొందవచ్చు. సభ్యులు పొదుపులోని నగదును రుణంగా పొందవచ్చు. వీటితోపాటు ఉద్యానశాఖ 75 శాతం రాయితీతో ఇస్తున్న పథకాలు పొందవచ్చు. సంఘాలు ఏర్పాటు చేశాం ఒకే రకం పంట సాగు చేసే మహిళా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు కూడా ఆరంభించాం. అధికారుల సూచనలు, సలహాలతో ఎలాంటి పంటలు వేస్తే లాభ దాయకంగా ఉంటుంది. ఆ సాగు పద్ధతులను గురించి అవగాహన చేసుకుంటున్నాం. మార్కెట్ మెళకువలు తెలుసుకుని త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.లక్ష్మిరాణి, అన్నదాత రైతు ఉత్పత్తి దారుల సంఘం, కొడవలూరు లాభదాయక సంఘాల స్ఫూర్తితో సాధికారత తొలి దశలో ఏర్పాటైన మా సంఘాలు ఇప్పటికే వివిధ రకాల పంటలు, రైస్ మిల్లు, ఆన్లైన్ మార్కెట్లు చేస్తూ లాభ పడుతున్నాయి. ఆ సంఘాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. వివిధ శాఖలు సహకారమందిస్తున్నందున తప్పక లాభాల బాట పడుతామన్న ధీమా ఉంది. ఉద్యాన శాఖ ద్వారా 75 శాతం రాయితీ రావడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా ఉంది. – కె.సుభాషిణి, వాసు రైతు ఉత్పత్తిదారుల సంఘం త్వరలో రూ.1.20 కోట్లతో సేకరణ కేంద్రాల ఏర్పాటు సంఘాలు పండించిన ఉత్పత్తులను ఒక చోటకు సమీకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి మండలానికో షెడ్డు నిర్మించనున్నాం. ఒక్కో షెడ్డుకు ప్రభుత్వం రూ.20 లక్షల వంతున మంజూరు చేస్తోంది. రూ.15 లక్షలు షెడ్డుకు, రూ.5 లక్షలు కోల్డ్ రూమ్కు మంజూరు చేస్తోంది. తొలివిడతలో కలువాయి, రాపూరు, చేజర్ల, గుడ్లూరు, సైదాపురం, ఓలేటివారిపాళెంలో షెడ్ నిర్మాణాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. రైతులు పండించిన పండ్లు, నిమ్మకాయలు, కూరగాయల్లాంటివి రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉండాల్సి వస్తే చెడిపోకుండా కోల్డ్ రూమ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాలను కూడా దశల వారీగా 37 మండలాల్లో ఏర్పాటు చేయనున్నాం. – కేవీ సాంబశివారెడ్డి, డీఆర్డీఏ పీడీ నెల్లూరు -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
తిక్రి వద్ద మహిళా రైతులను ఢీకొట్టిన ట్రక్కు
బహదూర్ఘర్: ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని తిక్రి వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిక్రి వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పంజాబ్లోని మన్సా జిల్లా ఖీరా ద్యాలువాలా గ్రామానికి చెందిన మహిళారైతులు పాల్గొన్నారు. అనంతరం వారు బహదూర్ఘర్ రైల్వేస్టేషన్కు వెళ్లేందుకు పకోడా చౌక్ వద్ద ఆటో కోసం నిల్చుని ఉండగా ఒక ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. రైతులను అణచివేస్తున్నారు: రాహుల్ గాంధీ తిక్రి వద్ద మహిళా రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరత్వం, విద్వేషం దేశాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. -
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు నేటితో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల దీక్షకు మద్దతుగా మహిళా రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. కిసాన్ సంసద్ పేరిట మహిళా రైతులు ఆందోళన చేపట్టనున్నారు. ఈ క్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా రైతులకు చెందిన పలు కాన్వాయ్లు సోమవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని.. మహిళా కిసాన్ సంసద్ పేరిట నిరసన తెలుపుతారు అని పేర్కొంది. భారతీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతు పాత్రను ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైతులు జంతర్ మంతర్ వద్ది కిసాన్ పార్లమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 200 మంది రైతుల పార్లమెంటు వెలుపల కూర్చుని నిరనస తెలుపుతారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఢిల్లీ సరిహద్దుల్లో నినదించిన మహిళా రైతులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలంటూ సింఘు, టిక్రీ, ఘాజీపూర్లలో రైతులు మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలతోపాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించిన మహిళలు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కొందరు భాంగ్రా నృత్యాలు చేశారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రైతు నిరసనల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని వారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, టెంపోలు, జీపుల ద్వారా వారు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పారు. -
ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం
న్యూఢిల్లీ/భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ సింగ్ తికాయత్ మార్చి నెలలో మధ్యప్రదేశ్లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్లో, మార్చి 14న రేవాలో, మార్చ్ 15న జబల్పూర్లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్పై మధ్య ప్రదేశ్లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ వారంట్ పెండింగ్లో ఉంది. ఆ సమయంలో జైతారిలో పవర్ప్లాంట్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్ అరెస్టయ్యారు. బెయిల్పై విడుదలైన తికాయత్ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్ జారీ అయింది. -
నన్ను బెదిరించలేరు, కొనలేరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ భారతీయ మహిళా రైతులకు అంకితం ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి వద్ద జరుగుతున్న రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు చంకలో బిడ్డల్ని ఎత్తుకొని నినాదాలు చేస్తున్న ఫొటోని మార్చి సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ‘‘నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు’’ శీర్షికతో ఉన్న ఆ కథనంలో ఎన్ని బాధలు ఎదురైనా వెన్ను చూపకుండా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళా రైతులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని కీర్తించింది. నిరసనలు కట్టిపెట్టి మహిళల్ని, వృద్ధుల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం చెప్పడం, సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలు వెనక్కి వెళ్లేలా బుజ్జగించండి అంటూ చెప్పినప్పటికీ తమ గళం వినిపిస్తూనే ఉన్నారని నీలాంజన భౌమిక్ రాసిన ఆ కథనం పేర్కొంది. -
మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్
రెండు నెలలుగా ఢిల్లీలో రైతుల పోరు. మళ్లీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు. నేటి చర్చల్లో ప్రభుత్వం ‘ఓకే’ అనలేదా.. ఈ ఏడాది ఢిల్లీలో రెండు పరేడ్లు! ఒకటి.. గణతంత్ర దినోత్సవ శకటాల పరేడ్. రెండు.. రైతుల రణన్నినాద ట్రాక్టర్ పరేడ్. ట్రాక్టర్ పరేడ్లోకి మహిళలూ దిగుతున్నారు. అందుకోసమే వాళ్లు హైవే పైకి వచ్చి.. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు! బండెనక బండి కట్టి మహిళలు కదలక ముందే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందా? రైతులకు, ప్రభుత్వానికి కొద్ది వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం జరుగుతోంది. రైతుల కోసం గత సెప్టెంబరులో పార్లమెంటు తెచ్చిన చట్టాలు మంచివని ప్రభుత్వం అంటుంటే.. ఆ చట్టాలు తమ బతుకును కోరేవి కాకపోగా బలి తీసుకునేవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి నలువైపులా ఎండకు, వానకు, చలికి చలించకుండా సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. మళ్లీ ఈ రోజు (జనవరి 8) చర్చలు జరుగుతున్నాయి. ఇవీ విఫలమైతే? విఫలమైన మరుక్షణం నుంచే రైతు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి రైతులు ట్రాక్టర్లు వేసుకుని ఢిల్లీ బయల్దేరతారు. జనవరి 26 నాటికి ఢిల్లీ చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్డే పరేడ్కి సమాంతరంగా ట్రాక్టర్ పరేడ్ జరుపుతారు. రైతు సంఘాల పోరు ప్రణాళిక ఇది. ఇందుకు మహిళా రైతులూ ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ నడపడం రాని మహిళలు సైతం హైవే మీదకు వెళ్లి ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నారు. మొదట ఇందుకు హర్యానా మహిళా రైతులు మార్గదర్శకులు అయ్యారు. హర్యానాలోని రొహ్టాక్లో ట్రాక్టర్ పరేడ్కు రిహార్సల్స్ వేస్తున్న మహిళా రైతులు ట్రాక్టర్ పరేడ్ కోసమే మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం పోరాట పథానికి ఒక కొత్త ఆదర్శం అయింది. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్లూ డ్రైవింగ్ నేర్చుకుని టూ–వీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతున్నప్పటికీ అదంతా ఆసక్తి ఉన్నందువల్లనో, అవసరం అయినందు వల్లో. అయితే ఒక ఉద్యమ పోరాటంలో పాల్పంచుకోడానికి మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే మరింతగా అభినందించాల్సిన సంగతి. అయితే మహిళా రైతు ఉద్యమకారులెవరూ అభినందనల్ని పట్టించుకునేంత స్థిమితంగా లేరు. హర్యానాలోని జింద్ జిల్లాలో గత సోమవారం నుంచీ జింద్–పటియాలా నేషనల్ హైవే మీద ఖట్కర్ టోల్ ప్లాజా సమీపంలో మహిళలు దీక్షగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. టోల్ ప్లాజా వాళ్లు కూడా వారి దగ్గర రుసుమేమీ వసూలు చేయడం లేదు! అదీ ఒక విధంగా రైతు ఉద్యమానికి మద్ధతు తెలియజేయడం అనుకోవాలి. ఆ ప్రదేశంలో డ్రైవింగ్ శిక్షణ పగలంతా మూడు విడతలుగా జరుగుతోంది. ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడం, స్టీరింగ్ తిప్పడం, వాహనానికి రెండువైపులా వచ్చే వాహనాలను అద్దాల్లో చూస్తూ రోడ్డు రెండు వైపులను పరిశీలిస్తూ ట్రాక్టర్ నడపడం వంటి ప్రాథమిక విషయాలను డ్రైవింగ్ వచ్చిన బంధువుల నుండి, ప్రత్యేక శిక్షకుల ద్వారా ఈ మహిళలంతా నేర్చుకుంటున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం దిగి రాకుంటే ఈసారి నేరుగా ఎర్రకోటలోకే మా ట్రాక్టర్లు దూసుకువెళ్తాయి’’ అని 38 ఏళ్ల నైన్ అంటున్నారు. ట్రైనింగ్ అవుతున్న మహిళలో నైన్ ఒకరు. నైన్ ఖట్కర్ గ్రామ మహిళ. అదే గ్రామం నుంచి ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చిన వారిలో సరోజ్ కూడా ఉన్నారు. ఆమెకు 35 ఏళ్లు. ‘‘నేను రైతు కూతుర్ని. రైతులపై ప్రభుత్వం ఇప్పటికే అనేక అరాచకాలకు పాల్పడింది. ఇప్పుడైతే మేము అస్సలు వెనక్కు తగ్గాలని అనుకోవడం లేదు. ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం అనుకోండి’’ అంటున్నారు సరోజ్. విజయేందర్ సిం«ధూ, సత్బీర్ పెహల్వాల్ కూడా అదే మాట చెబుతున్నారు. సత్బీర్ వయసులో పెద్దావిడ. అయినా ధైర్యంగా ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మేము మౌనంగా ఉంటే, మా తర్వాతి తరం వారికి ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా నోరు తెరిచే అవకాశమే ఉండదు. మా పిల్లలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్నారు. మా భర్తల్ని మాత్రం లోనికి పోనివ్వకుండా ఢిల్లీసరిహద్దుల్లోనే ఆపేశారు. ఏమైనా న్యాయంగా ఉందా?’’ అని సత్బీర్ అడుగుతున్నారు. రైతు సంఘాల వారికి, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. ఒక్కటీ సఫలం కాలేదు. ఎనిమిదో రౌంyŠ చర్చలు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రైతులు కోరుతున్నట్లు ఆ మూడు సాగుచట్టాల్ని ప్రభుత్వం రద్దు చేసిందా, కనీసం మార్పులు చేర్పులు చేసిందా.. ఢిల్లీలో ఒకే పరేడ్ జరుగుతుంది... గణతంత్ర దినోత్సవ పరేడ్. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం తలవొగ్గలేదా.. ట్రాక్టర్ పరేడ్ తప్పని వాతావరణం ఏర్పడుతుంది. ‘‘ఇప్పటి వరకు రైతు ఉద్యమాన్ని మాత్రమే ప్రభుత్వం చూసింది. ఇకముందు మహిళా రైతు దళం బలాన్ని కూడా కూడగట్టుకున్న రైతు మహోద్యమాన్ని చూడవలసి ఉంటుంది. అది మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్న హర్యానా మహిళలు. -
తియ్యండ్రా బండ్లు
ధైర్యాన్ని సడలించే చలి గాలులు. నిరసనను నీరుగార్చే అకాలవర్షం. టియర్ గ్యాస్.. జల ఫిరంగులు. ఉండటానికి లేదు. తినడానికి లేదు. వసతి లేదు. సదుపాయం లేదు. నెలలుగా రోడ్ల మీదే జీవనం. ప్రదర్శనలో సహచరుల మరణం! ఏడుసార్లు చర్చలు విఫలం. ఏ వైపునా కనిపించని ఆశాకిరణం. ఢిల్లీలో రైతు పోరు గెలుస్తుందా? ‘గెలిపిస్తాం’ అంటున్నారు మహిళా రైతులు! ‘తియ్యండ్రా బండ్లు’ అంటూ.. స్టీరింగ్ అందుకుంటున్నారు! పొలంలో కలుపును గుర్తించగల రైతులు పాలకుల నలుపు ఆలోచనల్ని పట్టేయలేరా! ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తెచ్చింది సెప్టెంబరులోనే అయినప్పటికీ, వాటిని తేబోతున్నట్లు ముందే గ్రహించిన రైతులు ఆగస్టు నుంచే ఢిల్లీకి చేరుకోవడం మొదలు పెట్టారు. వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా కేంద్రం ప్రవేశ ద్వారాలను మూసేసింది. సరిహద్దులైన తిక్రీ, సింఘు ప్రాంతాలలోనే వారిని నిలిపేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు సరిహద్దులనే తమ నిరసన శిబిరాలుగా చేసుకున్నారు. వీధుల్లోనే నినాదం, వీధుల్లోనే నివాసం. మహిళా నిరసనకారులకైతే ఇంకా కష్టం. కాలకృత్యాలకు మరింత కష్టం. అయినా వెరవలేదు. ఏ విధంగానూ అనుకూలం కాని ఆ ఆరుబయలు చలిని, ఎండను, అప్పుడప్పుడూ పడే వానను తట్టుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. ఆ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఆగస్టు 9న సన్నగా మొదలై, డిసెంబరులో ఉద్ధృతమైన రైతు ఉద్యమ పోరాటంలో ఇంతవరకు 25 మంది వరకు రైతులు గుండెపోటుతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. ప్రభుత్వం దిగిరాలేదు. వస్తుందన్న ఆశా కనిపించడం లేదు. ఈ తరుణం లో రైతు ఉద్యమం మెల్లిగా మహిళల చేతుల్లోకి చేరుకుంది. రైతు ఉద్యమం మహిళా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న సూచనలూ కనిపిస్తున్నాయి. అంటే.. రైతు ఉద్యమం గెలుపునకు దగ్గరగా ఉందనే. పొలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కష్టపడతారు. దేశంలోని సాగు భూమిలో 12 శాతానికి మాత్రమే హక్కుదారులైన మహిళలు సాగు పనుల్లో 75 శాతం వరకు ఉన్నారు. ఈ శక్తి చాలదా.. ప్రభుత్వాన్ని తూర్పార పట్టడానికి. తాలు చట్టాలను వదిలించడానికి. ∙∙ బుధవారం మంజీత్ కౌర్ అనే 62 ఏళ్ల మహిళా రైతు పంజాబ్లోని పటియాలా నుంచి ఢిల్లీలో రైతుల నిరసన స్థలి అయిన సింఘూ వరకు 257 కి.మీ. దూరం తనే స్వయంగా జీపును నడుపుకుంటూ వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. తనతోపాటు ఆమె మరో ఐదుగురు మహిళా రైతులను ఎక్కించుకుని వచ్చారు. ఈ సీన్ అచ్చంగా మన తెలుగు సినిమాల్లో వినిపించే ‘తియ్యండ్రా బండ్లు’ అనే పాపులర్ డైలాగ్ కి అతికినట్లుగా ఉంది. ట్విట్టర్లో మంజీత్ కు దేశవ్యాప్తంగా పూలమాలలు, అభినందనలు! ప్రభుత్వంతో కాయో పండో తేల్చుకోవాలన్న స్థిరచిత్తంతో ఢిల్లీకి చేరుకుంటున్న పెద్ద వయసు మహిళల్లో మంజీత్ ఒకరు మాత్రమే. వీళ్లంతా.. నిరాశ చెందుతున్న పురుష సహచరులలో పోరాట పటిమను పునరుజ్జీవింపజేస్తున్నారు. మంజీత్లానే.. బల్జీత్ కౌర్, కుల్వీందర్, ముల్కీత్, జస్పాల్, సుర్జీత్, పరమ్జీత్, పర్మీందర్ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి సెగ తగిలేలా సరిహద్దుల్లో నిరసనల వేడిని చల్లారనివ్వకుండా రాజేస్తున్నారు. మహిళా రైతు భూమాత అంశ మరి. తనను నమ్ముకున్న వారిలో సత్తువ నింపకుండా ఉంటుందా?! ఇప్పుడే గొంతెత్తాలి వ్యవసాయం మాకు ఉపాధి కాదు. అది మా రక్తంలోనే ఉంది. నేనిప్పుడు మా పొలంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాను! ఢిల్లీ టిక్రీ సరిహద్దులో. ఏం కర్మ. పొలంలో పంట పండించాల్సిన వాళ్లం నెల రోజులుగా రోడ్డు మీద ఉన్నాం. ప్రభుత్వానికి అర్థం కాదా?! మాకు ప్రయోజనం లేని కాలీ కానూన్లను (చీకటి చట్టాలను) తెస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు గొంతెత్తకపోతే మాకెప్పటికీ న్యాయం జరగదు. – బల్జీత్ కౌర్ (50) పిల్లల్ని ఎలా పోషించాలి?! కొత్త చట్టాలు మా పంటకు స్థిరమైన ధర లేకుండా చేస్తాయి. మా బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. పంటను ఎలా అమ్ముకోవాలి? మా పిల్లల్ని ఎలా పోషించాలి? నిరసన తొలిరోజు నుంచీ మేము ఇక్కడే ఉన్నాం. చట్టాలను రద్దు చేసేవరకు ఇక్కడి నుంచి కదలం. బతుకు మీద తప్ప ఇంటి మీద మాకు బెంగ లేదు. – కుల్వీందర్ కౌర్ పని ఉన్నా పొట్ట నిండదు ఏ పనీ తేలిక కాదు. తినాలంటే పని చేయాలి. మాకు తెలిసిన పని వ్యవసాయం. ఇప్పుడీ కొత్త చట్టాల వల్ల పని ఉన్నా మాకు తినడానికి ఉండదు. పెద్ద కంపెనీలకు మేలు చెయ్యడానికి రైతుల పొట్టలు కొడుతున్నారు. ఆ కంపెనీలు మా పంటలను ‘దొంగిలించి’ నాలుగు రెట్ల ధరకు నగరాలలో అమ్ముకుంటాయి. ఎంత అన్యాయం?! ప్రభుత్వానికి మా గోడు పట్టదా? – పర్మీందర్ కౌర్ మేమెక్కడికి వెళ్లాలి?! మా దిగుబడి ఎంతున్నా కనీస మద్దతు ధర లేకుంటే మా రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మేము ఎక్కడికి వలస వెళ్లాలి? ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పురుషుల కంటే మహిళలే పంట పనులు ఎక్కువగా చేస్తారు. కొత్తచట్టాలు అమలయితే వాటి ప్రభావం ముందుగా పడేది మహిళల మీదే. – ముల్కీత్ కౌర్ -
రైతుకు చేయూత
సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) నిధులతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరయ్యాయి. హైదరాబాద్ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. మహిళలే నిర్వాహకులు.. వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్ (ఎఫ్పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్పీజీలకు.. సీహెచ్సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు. అందుబాటులో ఉన్న పనిముట్లు.. ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్స్, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ట్రాక్టర్ ఆపరేటర్ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్ హైరిం గ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. సీహెచ్సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి. రైతులకు ఎంతో మేలు.. సీహెచ్సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం. – వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
స్వయం ఆధారిత పర్యావరణ సేద్యం!
స్వావలంబన (స్వయం ఆధారిత), స్థానికత.. కొవిడ్ తదనంతర కాలపు ఎజెండా ఇది. నిజానికి.. అచ్చం ఇదే ఎజెండాను జహీరాబాద్ ప్రాంత దళిత మహిళా రైతులు 30 ఏళ్లుగా అమలు చేస్తున్నారు. ఈ వర్షాకాలపు పంట(ఖరీఫ్) కాలంలో సుమారు 30 గ్రామాల్లో 1200 ఎకరాల్లో ఎప్పటి మాదిరిగానే తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవసాయం చేపట్టడానికి వెయ్యి మంది మహిళా రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతగా సారం లేని తమ ఎర్ర నేలల్లో వర్షాధార పంటలను.. మార్కెట్ కోసం కాదు, మా కోసం, మా సంప్రదాయ పద్ధతుల్లోనే పండించుకుంటామని ఇటీవల ముక్తకంఠంతో ప్రతినబూనారు. } పొలంలో వేసే ఎరువు మొదలుకొని భిన్నరకాల(చిరు/ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు..) విత్తనాలు.. పర్యావరణానికి, మనుషులకి, గొడ్డుగోదకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాల పిచికారీలు.. సేంద్రియ ఎరువుల వరకు ప్రతి దాన్నీ తమ దగ్గర ఉన్న వనరులతోనే రైతులు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రుపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు. పంట సీజన్ ముగిసే సరికి సంప్రదాయ సాగులోని విభిన్న పద్ధతులు, పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతారు. ఇది పర్యావరణ వ్యవసాయం యొక్క అత్యంత విలువైన లక్షణం. ఈ మొత్తం పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతిదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెబుతారు. సాగు పద్ధతి ఇదీ.. ► 1200 ఎకరాలకు 48,000 టన్నులకు (ఎకరానికి 40 టన్నులకు) పైగా పశువుల ఎరువు, ప్రత్యేకమైన ‘సమృద్ధి ఎరువు’ వాడతారు. ► విత్తన శుద్ధికి, పంట పెరుగుదలకు ఉపయోగపడే 2000 లీటర్ల బీజామృతం తయారు చేసుకొని వాడతారు. ► పంచగవ్య వంటి సుమారు 5,000 లీటర్ల ‘టానిక్స్’ వాడటం ద్వారా పంటల పెరుగుదల క్రమాన్ని బలోపేతం చేస్తారు. ► పూత ఎక్కువ రావడానికి, మొక్కలపెరుగుదలకు సహాయపడటానికి 48,000 లీటర్ల వర్మివాష్ 1200 ఎకరాలకు పిచికారీ చేస్తారు. ► ఈ మహిళలు జీవవైవిధ్య సాగు కోసం 10–15 రకాల 12,000 కిలోల సొంత విత్తనాలను తమ చేలల్లో నాటనున్నారు. ► ఈ ఖరీఫ్ పంట సీజన్నులో ఈ భూములపై తమ శ్రమతోపాటు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చు పెట్టనున్నారు. ► ఇక ఆర్థిక రాబడి ఎంతంటారా?.. నీటివసతి లేని ఈ ఎర్రనేలల నుంచి ఎకరానికి రూ.55,000 వరకు రాబడి తీస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ పంటల విధానం చిన్న కమతాలున్న మహిళా రైతుల అవసరాలను తీరుస్తుంది. తిండికి, పౌష్టికాహానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రతనివ్వడంతోపాటు పశువుల మేతకూ భద్రత ఇస్తోంది. ఎందుకంటే ఇక్కడ రసాయనిక మందుల వాడకం అంటూ ఉండదు. ఈ ప్రకృతిసిద్ధమైన పంటల వల్ల కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని మహిళా రైతులు మనోధైర్యంతో చెబుతున్నారు. సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మహిళా రైతులు చిన్నపాటి కమతాల్లో చేపట్టే ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవసాయానికి జేజేలు పలుకుదాం! -
బండి నిండుగా పండుగ
సంక్రాంతి పండుగ వచ్చింది. వస్తూ వస్తూ బండెడు ధాన్యాన్ని మోసుకొచ్చింది. ఏడాదంతా రైతులు పొలంలో పడిన కష్టానికి ప్రతిఫలం. ఈ పండుగ సందర్భంగా.. ‘రాబోయే ఏడాదికి ఈ పంటలు వేసి చూడండి..’ అంటూ అంతరించి పోతున్న పంట విత్తనాల ప్రదర్శన పెట్టారు మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్ గ్రామ మహిళా రైతులు. సంక్రాంతి.. పంటల పండుగే కాదు, విత్తనాల పండుగ కూడా అంటున్నారు ఈ మహిళా రైతులు. బండిని, ఎడ్లను అలంకరించి అరుదైన విత్తనాలను పెట్టెల్లో పెట్టి ఊరూరా తిప్పుతున్నారు. ఈ వేడుకను చూడడానికి విదేశాల నుంచి కూడా మహిళా రైతు ప్రతినిధులు పస్తాపూర్ వచ్చారు. వెస్ట్ ఆఫ్రికాలోని మాలి అనే చిన్న దేశం నుంచి వచ్చిన అలిమాత ట్రావోరే... మెదక్ జిల్లాలో ఇరవై ఏళ్లుగా జీవ వైవిధ్య పంటల సాగు చేస్తున్న మహిళా రైతులతో సమావేశమయ్యారు. నిన్న భోగి పండుగ రోజు ప్రారంభమైన జీవ వైవిధ్య సంచార జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. మీ నుంచి నేర్చుకున్నాం ‘‘భారతదేశం నుంచి అనేక మంది మహిళలు 2014లో వెస్ట్ ఆఫ్రికాలోని డిజిమినిలో జరిగిన విత్తన మేళాకు హాజరయ్యారు. డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) మహిళలు అవలంబిస్తున్న విత్తన బ్యాంకు విధానాన్ని మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ గ్రామీణ మహిళల స్పూర్తితో మా దేశాల్లో కూడా గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయగలిగాం. విత్తనాలను భద్రపరుస్తున్నాం. చిరు ధాన్యాల ప్రాసెసింగ్, మిల్లెట్ మార్కెటింగ్, చెట్ల మందులు తదితర వాటిపై వీడియోలు తీయడం కూడా నేర్చుకున్నారు’’ అని చెప్పారు ట్రావోరే. ఈ సమావేశానికి వచ్చిన సెనెగల్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్టర్, మహిళా రైతు ఫ్రాన్సిస్కాడౌఫ్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ మహిళల ఆహార పంటల సేద్యం చాలా బాగుంది. సేంద్రీయ వ్యవసాయం చేయడం ఎంతో గొప్ప విషయం. జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, ఇక్కడి అనుభవాల గురించి తెలుసుకునేందుకు వచ్చాను’’ అన్నారు. ప్రాన్స్ కు చెందిన జీవ వైవిద్య వినిమయం, అనుభవాలను పంచుకునే సంస్థ ప్రతినిధి ఆనె బర్సో మాట్లాడుతూ ‘‘మేము జీవ వైవిద్యం, ఆహారం కోసం పనిచేసే ఇతర సంస్థలను కలుపుకుని పనిచేస్తున్నాం. మా వ్యవసాయానికి, ఆహార భద్రతకు వాణిజ్య సంస్థల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలో ఒక కొత్త గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలన్నదే మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. జీవ వైవిద్యాన్ని పరిరక్షించుకునేందుకు గాను మనమంతా కలిసి మన గొంతుకలను పెద్దవిగా చేసి వినిపించాల్సిన అవసరం ఉందని మహిళా రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. – శ్రీనివాసరెడ్డి, సాక్షి, జహీరాబాద్ ఫొటోలు : బి. శివప్రసాద్ సాక్షి, సంగారెడ్డి -
సంప్రదాయసాగుపై అ‘సెస్’మెంట్
సాక్షి, హైదరాబాద్: ‘మెట్ట రైతులు అనాదిగా అనుసరిస్తున్న సమీకృత సంప్రదాయ వ్యవసాయకజ్ఞానం ప్రతికూల వాతావరణంలో సైతం పౌష్టికాహార, ఆదాయ భద్రతను అందిస్తుంది. రైతుల భావోద్వేగాలు, ఆచారాలు, సంస్కృతితో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది. వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి, కరువొచ్చినప్పుడు ఏ యే భూముల్లో ఏ యే పంటలు కలిపి వేసుకోవాలన్న సంప్రదాయ విజ్ఞానం జీవవైవిధ్య సంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం’అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) తదితర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. సెస్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డి.డి.ఎస్.), న్యూఫీల్డ్ ఫౌండేషన్(యు.ఎస్.) ఆధ్వర్యంలో గత ఏడాది ఖరీఫ్, రబీల్లో జహీరాబాద్ ప్రాంత రైతుల సాగు, జీవన స్థితిగతులపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు ఆర్.ఉమారెడ్డి, సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్రెడ్డి, డీడీఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్టు అధిపతి చిన్న నరసమ్మ, డీడీఎస్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ దంతలూరి తేజస్వి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్ అధ్యయనం చేశారు. వివరాలను వారు మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం... జహీరాబాద్ ప్రాంతంలోని 11 గ్రామాల్లో 20–30 మంది రైతులను 2017 జూన్ నుంచి 2018 మే వరకు అనేక దఫాలుగా కలుసుకొని, వారి సాగువిధానాన్ని సునిశితంగా పరిశీలించామని సెస్ అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేశ్రెడ్డి తెలిపారు. తాము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకోని విషయాలెన్నో ఆ రైతుల వద్ద నుంచి తెలుసుకున్నామన్నారు. ‘విత్తనాన్ని బుట్టల్లో బూడిద, వేపాకు, ఎర్రమట్టి కలిపి దాచుకుంటారు. దిగుబడి ఎన్ని బస్తాలు? అనేది ఒక్కటే కాదు, పశువులకు మేత, భూమికి బలిమినిచ్చేవి ఏ పంటలు అని వాళ్లు చూసుకుంటారు. వాళ్ల పొలాల్లో సాగు చేయకుండా పెరిగే మొక్కలు పోషక, ఔషధ విలువలున్న అద్భుతమైన ఆకుకూరలు, వాళ్ల భూములు కూడా జవజీవాలతో ఉన్నాయి. వీళ్ల వ్యవసాయం జూదప్రాయం కాదు. అప్పులు, ఆత్మహత్యలుండవు. వ్యవసాయ సంక్షోభం నివారణకు ఇది అనుసరణీయం’ అని సురేశ్రెడ్డి అన్నారు. -
స్కూటీతో సేద్యానికి...
‘నాకు రాదు’అంటే ఏదీ రాదు!లక్ష్మీపూర్ అయితే అసలే ఊరుకోదు.‘బండి నేర్చుకో’ అంటుంది.ఆ ఊళ్లో ఏడాదంతా పంటకాలమే.మహిళలు బండి వెనుక కూర్చున్నంతకాలంకాలంతో పోటీపడలేకపోయారు.బండి ముందు కూర్చున్నాకకాలమే వారితో పోటీ పడలేకపోతోంది!ఇప్పుడు వాళ్లు.. బండెనక బండి కడుతున్నారు.ఊరికి ధాన్య‘లక్ష్మీకళ’ను తెస్తున్నారు. ఆ గ్రామంలో యువ మహిళా రైతులు చదివింది పదోతరగతి లేదంటే ఇంటర్మీడియట్. అయినప్పటికీ.. ఓ వైపు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూనే, మరోవైపు దానికి ఆధునికతను జోడిస్తూ పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ భర్త చాటు భార్యగా మోటర్ సైకిల్పై వెనుక సీట్లోనే కూర్చుని వెళ్లేవారు ఇప్పుడు అదే మోటర్ సైకిల్పై డ్రైవింగ్ సీట్లో కూర్చుని తాము ముందుకు వెళ్లడమే కాదు, కుటుంబాన్ని సైతం ముందుకు తీసుకెళ్లుతున్నారు! ఈ దృశ్యం మీకు.. ఇప్పటికే రైతుల ఐకమత్యంతో లక్ష్మీపూర్ రైస్, లక్ష్మీపూర్ సీడ్తో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వెలుగొందిన లక్ష్మీపూర్లోనే కనిపిస్తుంది. ఇప్పుడా ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ స్కూటీ ఉందంటే అశ్చర్యం కలుగక మానదు. ఆ గ్రామ మహిళా యువ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏడాదంతా వ్యవసాయం! జగిత్యాల జిల్లా కేంద్రానికి 7 కి.మీ దూరంలో ఉండే లక్ష్మీపూర్ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎంత చదువుకున్నా వ్యవసాయాన్ని వదిలిపెట్టరు. అలాగే, వారి భార్యలు సైతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిందే. ఈ గ్రామంలో ఏదో ఒక్క పంటనే పండించకుండా పసుపు, వరి, మొక్కజొన్న, వేరుశెనగ.. ఇలా అన్నిరకాల పంటలు పండిస్తూ మిశ్రమ వ్యవసాయ సాగు చేస్తూ, ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఎండకాలంలో 10–20 రోజులు మినహాయిస్తే, ఏడాది మొత్తం వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో, వారి కుటుంబ నిర్వహణలో కూడా అధునికత సంతరించుకుంటుంది. దీంతో ఈ గ్రామానికి ఆడపిల్లను ఇచ్చేందుకు తల్లితండ్రులు పోటీ పడుతుంటే, మరికొందరు ఆడపిల్లలు మాత్రం వ్యవసాయంపై ఉన్న అభిమానంతోనే ఇక్కడి వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటి వరకు కాలే జీలకు వెళ్లిన ఆడపిల్లలు సైతం ఒకరిని చూసి ఒకరు వ్యవసాయం చేసేందుకే ఉత్సాహం చూపించడమే కాకుండా.. పాత వ్యవసాయ పనులకు భిన్నంగా నూతన ఒరవడితో సాగును ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏడాది పొడవునా పురుష రైతులతో సమానంగా మహిళా రైతులు తోటలకు వెళ్లి వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. రైతులు ఉదయాన్నే పనులకు వెళ్లుతుంటే, వారి భార్యలు, పిల్లలను స్కూళ్లకు పంపించి, అన్నం వండుకుని, నడుచుకుంటూ 2–3 కి.మీ దూరంలో ఉన్న పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. భార్యాభర్తలకు తోడు మరో ఇద్దరు కూలీలు అవసరమైనప్పుడు, వారిని తోటల వద్దకు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో.. స్కూటీలు వారి పనిని సుళువు చేశాయి. ధైర్యం చేసి నేర్చుకున్నారు వివిధ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు, ప్రతిరోజూ మహిళా రైతులను తమ మోటర్ సైకిల్పై తోట వద్ద విడిచిపెట్టడం కుదరడం లేదు. దీంతో, మూడేళ్ల క్రితం కొంతమేర చదువుకుని, ధైర్యంగా ఉండే యువ మహిళా రైతుల్లో ఒకరిద్దరు నూతన మోడళ్లలో వచ్చిన స్కూటీలను కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టారు. ఆ స్ఫూర్తితో దాదాపు 50 నుండి 60 మంది మహిళా రైతులు స్కూటీలు కొనుగోలు చేసి, వాటిపై కూలీలను, తోటి మహిళా రైతులను ఎక్కించుకుని రయ్..రయ్ మంటూ పంటపొలాలకు వెళ్లుతున్నారు. అంతేకాదు, దగ్గర్లోని బంధువు ఇళ్లకు, జగిత్యాల లాంటి పట్టణాలకు వచ్చినప్పుడల్లా తమ స్కూటీపైనే వస్తుంటారు. రైతులు జగిత్యాలకు వచ్చినప్పుడు పెట్రోల్ కొని తీసుకెళ్లి, స్కూటీల్లో పోస్తుంటారు. దీంతో, తోటలో వ్యవసాయ పని ఉన్నప్పుడల్లా భర్త కోసం ఎదురు చూడకుండా, తోటలో అవసరమయ్యే ఒకరిద్దరు కూలీలను ఎక్కించుకుని పనికి వెళ్లుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో భర్తకోసం భార్య, భార్య కోసం భర్త ఇలా.. ఒక్కరి కోసం ఒకరి సాయం కోసం ఒకరు చూసే అవసరం లేకుండా పోయింది. ఎవరి మోటర్ సైకిళ్లపై వారు వెళ్తున్నారు. స్కూటీ కంపెనీల ఆశ్చర్యం గ్రామానికి చెందిన మహిళా యువ రైతులు పోటీ పడి స్కూటీలు కొనుగోలు చేస్తుండటంతో, చాల కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, చివరకు ఈ గ్రామంలో స్కూటీ మోటర్ సైకిల్ మేళాలు కూడా ఏర్పాటు చేసాయి. మహిళా యువ రైతులను ఆకర్షించేందుకు కంపెనీలు పలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని, వ్యవసాయ పనులతో పాటు మహిళలు పలు శుభకార్యాలకు తమ బంధువులను ఎక్కించుకుని వెళ్లడానికి కుదురుతోంది. ఇదిలా ఉంటే, లక్ష్మీపూర్కి ఎవరైనా చుట్టం చూపుగా వచ్చిన వారు ఆ గ్రామ మహిళా యువ రైతులు స్కూటీలపై వెళ్లడం చూసి నోరు వెళ్లడం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల ఫొటోలు : ఏలేటి శైలేందర్ రెడ్డి బర్రెకు గడ్డి సైతం తోటలకు వెళ్లిన తర్వాత, అక్కడ గట్ల వెంబడి ఉండే గడ్డిని స్కూటీపై బర్రెలకు తీసుకు వస్తాను. మొదట స్కూటీ నడపడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు స్కూటీ నడపడం తేలిక కావడంతో రోజు స్కూటీపైనే వ్యవసాయ పనులకు వెళుతున్నాను. నాతోపాటు కూలీలను సైతం తీసుకెళ్తున్నాను. – మిట్టపల్లి వరలక్ష్మి సామానంతా స్కూటీపైనే వ్యవసాయ పనులకు అవసరమైన పార, గుల్ల, ఇతర సామానంతా స్కూటీపైనే తీసుకుని వెళ్తాను. తోటలు దూరంగా ఉండటంతో స్కూటీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తోట వద్ద దించి రావాలంటే భర్తకు కూడా కష్టమే. అందుకే స్కూటీ నేర్చుకుని నేను నడుపుతున్నా. కూలీలను ఎక్కించుకుని వెళ్తున్నా ప్రతిరోజూ ఇద్దరు కూలీలను ఎక్కించుకుని వ్యవసాయ పనులకు వెళుతుంటాను. మొదట స్కూటీ కొనిచ్చేందుకు నా భర్త భయపడ్డాడు. ఇప్పుడు నేనే స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ పనులకు వెళుతుండటంతో, నా భర్త ఇతర వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. -
నిన్నెలా నమ్మాలి లోకేశ్?
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేశ్కు అడుగడుగునా నిలదీతలు, సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు ఇవ్వని రైతులను వేధించడంతో రైతులంతా ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకుంటామని చెప్పి బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని 10 గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భూములు కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారని, ఐదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ 10 గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు ఉన్నారు. వీరంతా ఇప్పుడు లోకేశ్ను ఓడించేందుకు సిద్ధమయ్యారు. కొండ మీద ఇళ్లు తొలగించాలని నోటీసులు పర్యాటకాభివృద్ధి పేరుతో తాడేపల్లి మండలంలో కొండల మీద ఉన్న సుమారు 4 వేల ఇళ్లను తొలగించాలని ఇదివరకే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీంతో వీరంతా టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. గతంలోనూ చాలా హామీలు ఇచ్చారు! గత ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి రావడానికి టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా హామీలు ఇస్తున్నారని.. అయితే ఎన్నికలు అయిపోగానే తమ పని తాము చేసుకుపోయేందుకు టీడీపీ నాయకులు ఏ మాత్రం వెనుకాడరని భావిస్తున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లు తొలగించిన వారికి ఇళ్లు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్కు బై బై చెప్పాలి..! నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్కు ‘బై బై’ చెప్పాలనే నినాదం జోరుగా వినిపిస్తోంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సంప్రదాయం టీడీపీకి లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే కుంచనపల్లిలో 171 ఎకరాలను రిజర్వ్ జోన్లో ఉంచి తమ పార్టీ నాయకులకు మేలు చేకూర్చిన విషయాలను వారు చర్చించుకుంటున్నారు. ఇక్కడ లోకేశ్ను గెలిపిస్తే భూములు బలవంతంగా లాక్కుంటారని.. మంగళగిరిని కబ్జాలకు అడ్డాగా మార్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘‘అయిదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములివ్వని రైతులను వేధించారు. భూసేకరణ కింద భూములు కాజేసేందుకు తీవ్రంగా యత్నించారు. మా భూములు కాపాడుకునేందుకు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారు.?’’ – గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రచారానికి వచ్చిన లోకేశ్ను నిలదీసిన మహిళా రైతు ‘‘ 2015 కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లను తొలగించారు. నాలుగేళ్లవుతున్నా స్థలాలు చూపించలేదు. ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. తాడేపల్లి, ఉండవల్లిలో కొండ మీద ఉన్న ఇళ్లను తొలగించాలని నోటీసులిచ్చారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారైనా మా బాధలు విన్నారా? ఇప్పుడు ఎన్నికలు రాగానే మేము కనిపించామా?’’ – ఇవీ తాడేపల్లిలో లోకేశ్ నిర్వహించిన ప్రచారంలో స్థానికుల నుంచి ఎదురైన ప్రశ్నలు -
మల్బరీ సాగులో మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ.. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అవగాహన పెంచుకుంటే నష్టం రాదు నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. – గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం. – నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది. – కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి -
చిరు ధాన్యం.. ఆరోగ్యభాగ్యం
జహీరాబాద్: అంతరించి పోతున్న చిరు ధాన్యాల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహించడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన పాతపంటల జాతర రెండు దశాబ్దాలుగా నిరంతరంగా సాగుతోంది. సోమ వారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్నాయక్ తండాలో 20వ పాత పంటల జాతరను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు. జహీరాబాద్ మండలం రంజోల్లో 1999లో డీడీఎస్ ఈ జాతరకు శ్రీకారం చుట్టింది. నాటినుంచి ఏటా వివిధ గ్రామాల్లో జాతరను నిర్వహిస్తూ వస్తోంది. ఇలా ఇప్పటికి వంద గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించింది. డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీశ్ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో మహిళలను చిరు ధాన్యాల సాగువైపు ప్రోత్సహిస్తున్నారు. ఎకరం, రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు చిరు ధాన్యాలను సాగు చేస్తూ వస్తున్నారు. ఏడాదిపాటు వారి ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వచేసుకుని, మిగతా ‘చిరు’ధాన్యాన్ని డీడీఎస్ సంస్థకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 20 శాతం ఎక్కువ ధర చెల్లించి ఈ సంస్థ రైతులనుంచి పంటలను కొనుగోలు చేస్తోంది. ధాన్యాన్ని సంస్థ తరఫున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా సైతం అమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా.. సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా ఐదువేల మంది మహిళా రైతులు చిరు ధాన్యాలను పండిస్తున్నారు. ఇలా సాగుచేసిన చిరు ధాన్యాల పంటలకు అంతగా తెగుళ్లు సోకవని అంటున్నారు. పెట్టుబడులు అంతగా అవసరం ఉండవని, వర్షాభావాన్ని సైతం తట్టుకుని చిరు ధాన్యాలు పండుతాయని చెబుతున్నారు. చిరు ధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగుచేసుకుంటున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 30 రకాల పంటలను కలిపి సాగుచేస్తున్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమకు అవసరమైన విత్తనాలను నిల్వ చేసి ఉంచుతారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లోని 68 గ్రామాల్లో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఖరీఫ్లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్న, రబీ కింద శనగ, తెల్ల కుసుమ, సాయిజొన్న, అవుశ, వాము పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. తైదలు, కొర్రలను కూడా సాగు చేస్తున్నారు. రైతులకు అవగాహన ఈ ఏడాది పాత పంటల జాతర సోమవారం ప్రారంభమైంది. ఉత్సవాలను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ .. చిరు ధాన్యాల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్యాన్నిచ్చే చిరు ధాన్యాలను ప్రతి ఒక్కరూ తినేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభ పరిణామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 వరకు 24 గ్రామాల్లో జాతరను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు, ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. నిపుణులచేత పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంతో కలిగే ఉపయోగాల గురించి వివరిస్తారు. జాతర సందర్భంగా 16 ఎడ్ల బండ్లలో చిరు ధాన్యాలను ప్రదర్శిస్తారు. -
మహిళా రైతుల కుటుంబాలను ఆదుకోరా?
ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. మాడ సాగరిక, పాకాల మల్లవ్వ, కొరకండ్ల లక్ష్మి, గొంగళ్ల విజయ, రేగుల ఊర్మిళ.. ఈ మహిళలందరూ వ్యవసాయాన్ని ముందుండి నడిపిస్తూ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల్లో కొందరు మాత్రమే. మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం గత రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో ఉంది (ఎన్.సి.ఆర్.బి. గణాంకాలు). 2015లో తెలంగాణలో 153 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన పాకాల మల్లవ్వ చేయి మంచిదని తోటి రైతుల నమ్మకం. ఆమె చేతితో తమ పొలాల్లో విత్తనాలు వేయించుకునేవారు. కానీ, కౌలు రైతు అయిన మల్లవ్వ వరుసగా నాలుగేళ్లు నష్టాలపాలై 2015 డిసెంబర్ 12న ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మాడ సాగరిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు పత్రికల్లో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో చర్చనీయాంశమైంది. అయినా ఈ కుటుంబాలకు ఇప్పటి వరకూ ఎక్స్గ్రేషియా అందలేదు. మహిళా రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఇకనైనా ఆర్థికంగా ఆదుకోవాలి. – బి. కొండల్రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక -
సేంద్రియ మహిళా రైతుల బజార్!
తమిళనాడు ప్రభుత్వం స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలను సేంద్రియ సాగుకు ప్రోత్సహించడంతోపాటు.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్కు దేశంలోనే తొలి మహిళా రైతుల బజార్ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి సేంద్రియ ఉత్పత్తులను చెన్నై నగర వినియోగదారుల వద్దకు చేర్చడంలో తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్, ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్(ఓఎఫ్ఎమ్) సంయుక్తంగా మహిళా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. చెన్నై వల్లువర్కోట్టం హైరోడ్డులోని మదర్ థెరిసా ఉమెన్ కాంప్లెక్స్లో ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో మహిళల నేతృత్వంలో సేంద్రియ ఉత్పత్తుల బజార్ ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రారంభమైంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మహిళా రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోగలుగుతున్నారు. కూరగాయలు, పండ్లు, దేశవాళీ రకాల వరి బియ్యం, చిరుధాన్యాల బియ్యం, పప్పుధాన్యాలు, గానుగ నూనెలతోపాటు.. విలువను జోడించిన వివిధ ఉత్పత్తులను మహిళా సేంద్రియ రైతులు విక్రయిస్తున్నారు. ఒకే ఉత్పత్తిపై ఎక్కువమంది దృష్టి పెట్టి ధరపడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. సేంద్రియ సాగు, మార్కెటింగ్లో ఆరోగ్యకరమైన పోటీకి అద్దంపడుతున్నారు. తమా ఊరంతా సేంద్రియ సేద్యమే! మా ముత్తాత కాలం నుంచీ మా కుటుంబం వ్యవసాయంలో ఉంది. నేను నాలుగో తరం రైతును. గతంలో సాధారణ వ్యవసాయం చేసి, రెండేళ్ల క్రితం నుంచే సేంద్రియ సేద్యం చేస్తున్నాను. ఎనిమిదెకరాల్లో వరి, మూడెకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. వరిలో పెద్దగా లాభం రాకున్నా కాయగూరల్లో మంచి గిట్టుబాటుంది. గత నెల ఏర్పాటు చేసిన తొలి ఎగ్జిబిషన్ స్టాల్లో ఒకే రోజున రూ.12 వేల విలువైన కూరగాయలు అమ్మాను. రెండోరోజు స్టాల్ ఉన్నా సరకులేకపోయింది. మా ఊళ్లో రైతులంతా సేంద్రియ సాగే చేస్తున్నారు. – జయ, కారణపట్టి గ్రామం, కడలూరు జిల్లా 20 రకాల సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నా.. నా సొంతూరు తిరుత్తణి. తిరువళ్లూరులో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివి కొన్నేళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాను. సొంత ఊరు, వ్యవసాయంపై మమకారంతో తిరిగొచ్చేశా. వ్యవసాయంతోపాటు గోశాల, చేపల పెంపకం ఉంది. 2012లో పొలం కొన్నప్పటి నుంచి సేంద్రియ సేద్యంలోకి మారాను. నాలుగు తరాలుగా మా కుటుంబాలకు వ్యవసాయమే అధారం. ఉసిరి తదితరాలతో తయారు చేసిన 20 సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతాను. సౌందర్య పోషక సామాగ్రిని తయారు చేసి అమ్మటం మా ప్రత్యేకత. ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని తమిళనాడులోని అనేక ఆర్గానిక్ షాపులకు సౌందర్య సామాగ్రిని సరఫరా చేస్తాను. – అనురాధ బాలాజీ, పెరియపాళయం, తిరువళ్లూరు జిల్లా 12 సంవత్సరాలుగా సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతున్నా.. బీఎస్సీ చదివాను. 12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. నాలుగు ఎకరాల్లో వరి, ఒక ఎకరా కొబ్బరి తోట వేశాను. 18 పాడి ఆవులు, 22 బర్రెలు ఉన్నాయి. నేను, మా వారు కలిసి వీటి పనులు చూసుకుంటాం. 7 రకాల దేశవాళీ బియ్యం, నెయ్యి, పసుపు, కొబ్బరి నూనె, వర్మికంపోస్ట్, పంచగవ్య సహా 12 ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నాం. – సీతాలక్ష్మి, అరలికోటై్ట గ్రామం, శివగంగా జిల్లా వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు గర్విస్తున్నా! ప్లస్టూ వరకు చదువుకున్నాను. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తూ రైతును అని చెప్పుకునేందుకు గర్వబడుతున్నా. యజమాని పంట పొలాల్లో దిగి పని చేసినప్పుడే కూలీలు కూడా శ్రద్ధగా పని చేస్తారు. రెండెకరాల్లో వరి, ఒక ఎకరాలో పప్పు ధాన్యాలు, ఉసిరి కాయలు, చిరుధాన్యాలను పండిస్తున్నా. ఆరోగ్యదాయకమైన మురుకులు, వాంపొడి వంటి వాటితో చిరుతిళ్లలతోపాటు సుమారు 20 రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాను. ఈ ఉత్పత్తుల వల్ల ఎదుటి వారికి ఆరోగ్యం లభించడం వల్ల నాకు ఆదాయం, పుణ్యం రెండూ లభిస్తున్నాయి. సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాను. గత నెలలో స్టాల్ పెట్టినప్పుడు మొదటి రోజునే రూ. 15 వేలు, రెండో రోజున రూ. 17 వేలు అమ్మాను. – కవితా ఇళంగోవన్, పులియకుడి, తంజావూరు జిల్లా చదువు రాకపోయినా ఆర్థికంగా నిలదొక్కుకున్నా మా గ్రూప్లో 12 మంది మహిళా రైతులం కలసి సేంద్రియ పంటలు పండించి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై తదితర రాష్ట్రాల నుంచి మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొరియర్ ఖర్చులు కూడా వినియోగదారులే భరిస్తారు. 12 రకాల మసాలా వస్తువులు, పది రకాల టీ పొడులు అమ్ముతున్నా. తీరిక వేళల్లో నీలగిరిలోని సేంద్రీయ టీ ఆకు తోటల్లో పని చేస్తున్నా. రాయడం, చదవడం నాకు బొత్తిగా రాకున్నా, సేంద్రియ వ్యవసాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నా. – ఎస్.గోమతి, నీలగిరి ఉద్యోగం వదిలేసి వచ్చా.. బీఈ పాస్సై కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పని చేశాను. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి వచ్చాను. సోప్ నట్స్, శీకాకాయలు, కుంకుళ్లు వినియోగించి 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్ క్లీనింగ్ ల్విక్విడ్ ఎంతో మేలైనది. ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపాలని రెండేళ్ల క్రితం నుంచి ఆర్గానిక్ ఫుడ్ ట్రైనింగ్, వర్క్షాపులు నిర్వహిస్తున్నా. – ప్రియదర్శిని, చెన్నై ఉత్పత్తులకు రైతమ్మలే గిట్టుబాటు ధర నిర్ణయించుకుంటారు! సేంద్రియ ఉత్పత్తులు తినటంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబర్చడం వల్ల అమ్మకాలు సులువైనాయి. వాట్సప్, ఫేస్బుక్ల ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ధర ల విషయానికి వస్తే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఏమీ లేదు. డిమాండ్, దిగుబడిని బట్టి ధర పలుకుతోంది. మధుమేహ రోగులకు ప్రీతిపాత్రమైన బియ్యం మంచి ధర పలుకుతుంది. రైతులు తమ ప్రాంతాల్లో వనరులు, సాగుబడి ఖర్చులు, మార్కెట్కు చేరవేయండం తదితర ఖర్చులను బేరీజు వేసుకొని ఎవరికి వారే గిట్టుబాటు ధరను నిర్ణయించుకుంటారు. స్టాక్ ఎక్కువైనపుడు ధర పడిపోవడం సహజం. నేను రైతును కాను. అయితే, సమాజం, మార్కెటింగ్పై ఉన్న అవగాహనతో రైతమ్మలకు మార్గదర్శకం చేస్తుంటాను. – శుభ భరద్వాజ్(94449 26128), సమన్వయకర్త, సేంద్రియ మహిళా రైతుల మార్కెట్, చెన్నై ఉచితంగా స్టాళ్లు.. ప్రయాణ ఖర్చులు సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఒకే చోట క్రమం తప్పకుండా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ మార్కెట్ను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా రెండు రోజుల పాటు సేంద్రియ మహిళా రైతులకు స్టాళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రయాణ ఖర్చులు, భత్యం కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నాం. – సెంథిల్ కుమార్(97875 04035), తమిళనాడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ విభాగం అధికారి, చెన్నై – కథనం: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
చాకిరీ 60% భూమి 14%!
వ్యవసాయంలో మహిళల శ్రమ వాటా రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా, మహిళా రైతులుగా వారికి గుర్తింపు పెద్దగా దక్కటం లేదు. పితృస్వామిక వ్యవస్థ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతుల హక్కులకు గుర్తింపు లేకుండా పోతోంది. ఈ నెల 15న జాతీయ మహిళా రైతుల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా. కమతాలు చీలిపోయి చిన్నవి అవుతున్న కొద్దీ, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతున్న కొద్దీ పురుషులు ఇతర రంగాలవైపు దృష్టి సారించడం పెరుగుతోంది. అనివార్యంగా వ్యవసాయ పనులన్నీ మహిళలపైనే పడుతున్నాయి. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ అంచనా ప్రకారం మన దేశంలో ఆహారోత్పత్తిలో మహిళల శ్రమ 60–80 శాతం. పాడి పరిశ్రమలో 90%. ఇది ఇంటిపనికి అదనం. 2010–11 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. దేశంలో 11 కోట్ల 87 లక్షల మంది సాగుదారులుంటే ఇందులో 30.3% మంది మహిళా రైతులు. 14.43 కోట్ల వ్యవసాయ కూలీల్లో 42.6% మహిళలు.అయినా, మహిళలకు భూమిపై హక్కు 14% మాత్రమే. 2015 జనాభా గణన ప్రకారం.. వ్యవసాయ రంగంలో ఉన్న 86 శాతం మంది మహిళల పేరు మీద సెంటు భూమి కూడా లేదు. మహిళలకు భూమి హక్కు వచ్చినప్పుడే రైతుగా ప్రభుత్వ సహాయాన్ని, రుణాలను, శిక్షణావకాశాలను పొందగలుగుతారు. అభివృద్ధి చెందుతున్న మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించి గుర్తింపు ఇస్తే వ్యవసాయ ఉత్పత్తి 2.5–4% వరకు పెరుగుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేస్తోంది. వ్యవసాయ పనుల్లోని ప్రతి దశలోనూ నడ్దివిరిచే చాకిరీ చేసే మహిళల శ్రమ తగ్గించే యంత్రపరికరాలను, వారికి తగినట్టుగా తక్కువ బలాన్ని వినియోగించాల్సిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేయడం అవసరం. ఇప్పుడున్న యంత్ర పరికరాలన్నీ పురుషులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినవే. మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసే యంత్ర పరికరాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళా రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది! -
కలుపు మొక్కలు కావు.. కలిమి పంటలు!
అనేక ఆకుకూర పంటలు మనం విత్తనాలు వేసి సాగుచేసుకొని తింటున్నారు. అయితే, అంతకన్నా పోషక, ఔషధ విలువలున్న ‘సాగు చేయని ఆకుకూర పంటల’ ముచ్చట ఇది! సేంద్రియ జీవవైవిధ్య పంటలు సాగయ్యే పొలాల్లో నిశ్చింతగా ఇవి పెరుగుతున్నాయి..!! పంట పొలాల్లో వాటంతట అవే మొలిచే అనేక రకాల మొక్కలను కలుపు మొక్కలని పీకేస్తున్నాం లేదా కలుపు మందులు చల్లి చంపేస్తున్నాం. అయితే, ఇవి దేవుడిచ్చిన భాగ్యపు పంటలని జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు భావిస్తున్నారు. తమ మెట్ట భూముల్లో ఇరవై వరకు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు కలిపి పండిస్తున్నారు. ఈ సాగు చేయని ఆకుకూర పంటలను తరతరాలుగా తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉన్నారు. మనం పనిగట్టుకొని పండించుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ పాళ్లలో ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.)నిపుణులు తేల్చటం విశేషం. మరుగున పడిపోయిన ఈ అపురూపమైన ఆకుకూరల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు దిశ బియాండ్ ఆర్గానిక్స్, డక్కన్ డవలప్మెంట్ సొసైటీ ఇటీవల తెల్లాపూర్లోని ‘పాక’ సేంద్రియ హోటల్లో ‘సాగు చేయని ఆకుకూరల పండుగ’ కన్నుల పండువగా జరిపారు. దేశంలోనే ఇది ఈ తరహా తొలి పండుగ కావటం విశేషం. పొలాల్లోనే కాదు ఖాళీ ప్రదేశాల్లో, బంజర్లలో, పెరటి తోటల్లోనూ ‘సాగు చేయని ఆకుకూర మొక్కలు’ ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా.. పీకి పారెయ్యడమో.. కలుపుమందులు చల్లి నాశనం చేయడమో అవివేకమైన పని. కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాం. ఇకనైనా ఈ నిర్లక్ష్యాన్ని వదిలేద్దాం. దేవుడిచ్చిన ఈ ఆకుకూరలను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం.. ఈ స్ఫూర్తిని ‘సాగు చెయ్యని ఆకుకూరల పండుగ’ ఎలుగెత్తి చాటి చెప్పింది! జహీరాబాద్ మహిళా రైతులకు, డీడీఎస్కు, దిశ బియాండ్ ఆర్గానిక్స్ నిర్వాహకులకు జేజేలు!! కరువును జయించే పంటలు.. ఎకరానికి ఎన్ని జొన్నలు పండించారని వ్యవసాయ శాస్త్రవేత్తలు లెక్కలు అడుగుతుంటారు. అయితే, జహీరాబాద్ మహిళా రైతులు తమ మెట్ట భూముల్లో 20 రకాల పంటలను విత్తనాలు చల్లి పండిస్తున్నారు. వీటితోపాటు.. వాటంతట అవే మొలిచి పెరిగే ఆకుకూర పంటలు 50 రకాల వరకు ఉంటాయని మేం అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. డబ్బు రూపకంగా విలువ కట్టలేని పంటలివి. దేవుడిచ్చిన పంటలు. ఎంత డబ్బొచ్చింది అని మాత్రమే చూసే పాశ్చాత్య ధోరణి కలిగిన వారికి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం వల్ల జరిగే మేలు ఏమిటో బోధపడదు. కరువును జయించడంలో ఈ ‘అన్కల్టివేటెడ్ క్రాప్స్’ కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని పరిరక్షించుకోవాలంటే రసాయనిక వ్యవసాయ పద్ధతులను వదిలేసి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి. సేంద్రియ దిగుబడి ఒక్క దాని గురించే కాకుండా ఇతరత్రా ప్రకృతి సేవల విలువను కూడా గుర్తించడం మనం నేర్చుకోవాలి. – పి. వి. సతీష్, డైరెక్టర్, డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ వ్యవసాయ వర్సిటీలు ఇవి దేవుడిచ్చిన ఆకుకూరలు.. సర్కారీ ఎరువులేస్తే రావు.. ఇవి దేవుడిచ్చిన ఆకుకూర మొక్కలు. ఇవి మంచి బలమైన ఆకుకూరలు. పెంట ఎరువులేస్తే బాగా వస్తాయి. సర్కారీ ఎరువులేస్తే ఇవి రావు. మేం రోజుకో రకం తింటాం. ఇసువంటి కూరలే మాకు రోజూ దొరికే మాంసం. గట్టిగ ఉన్నాం. దవాఖానా అక్కర్లేదు. దొగ్గల కూరలో ఇనుముంటది.. 70 ఏళ్లున్నా నాకు మోకాళ్ల నొప్పులు లేవు. మేం వంద రకాల విత్తనాలు దాచిపెడతాం. కానీ, దేవుడు వందల రకాలు దాచిపెడతడు. వాటికవే మొలిచి రెండు నెలలుండేవి ఆకుకూరలు కొన్ని, 4 నెలలుండేవి కొన్ని, ఏ కాలంలోనైనా అందుబాటు లో ఉండేవి ఇంకొన్ని.. చాలా రకాలున్నయి. ఇది చాలా మంచి పండుగ. – చంద్రమ్మ, జహీరాబాద్, సేంద్రియ మహిళా రైతు కలుపు మొక్కలుగా చూడటం బాధాకరం! పేదలకు వరప్రసాదం వంటి ఈ సాగు చేయని పంటలు. జహీరాబాద్ ప్రాంతంలో 1999లో ఒక అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పేదలు సంవత్సరంలో కనీసం వంద రోజులైనా తుమ్మికూర, చెన్నంగి, పులిచింత/పుల్లకూర వంటి 15–20 రకాలు తింటారు. దొగ్గలి వంటి ఆకుకూరలను 30–40 సార్లయినా వండుకు తింటారు. వీటి ఆకులను జొన్న, సజ్జ రొట్టెల్లో కలుపుకొని తింటారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) వీటిపై అధ్యయనం చేసి పౌష్టికాహార విలువలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఖరీఫ్లో, రబీలో, నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో, మెట్ట భూముల్లో(41), సాగు నీటి సదుపాయం ఉన్న భూముల్లో పెరిగే(30) రకాలు వేర్వేరుగా ఉన్నాయి. మొక్కలే కాదు చాలా రకాల తీగజాతి ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఎలుక చెవుల కూర నల్ల రేగడి నేలల్లో చెరువు కట్టలపై కనిపిస్తుంది. జహీరాబాద్ ప్రాంతంలో కొన్ని రకాలుంటే.. అనంతపురం ప్రాంతంలో మరికొన్ని రకాలు ఉంటాయి. కోస్తా జిల్లాల్లో వేరే రకాలు కూడా కనిపిస్తాయి. వీటిని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ కలుపు మొక్కలుగానే చూస్తుండటం విషాదకరం. ఇవి పౌష్టికాహారంగా, ఔషధాలుగా ఉపయోగపడటమే కాకుండా భూసారాన్ని పెంపొందించేంకు కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల వల్ల అత్యంత విలువైన ఈ ఆకుకూరల సంపదను చాలా వరకు పోగొట్టుకున్నాం. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పశువుల ఎరువు వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా వీటిని పరిరక్షించుకోవాలి. ట్రాక్టర్లలో బాగా లోతు దుక్కులు దున్నటం మాని నాగళ్లతో దుక్కి చేసుకోవాలి. ప్రభుత్వం పశుపోషణను ప్రోత్సహించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వీటిని కలుపు మొక్కలుగా చూడటం మానేసి, సేంద్రియ రైతుల సంప్రదాయ జ్ఞానాన్ని గుర్తించాలి. పౌష్టికాహారంగా వీటి ప్రాముఖ్యతను గుర్తించి, పరిరక్షించాలి. పట్టణాలు, నగరాల్లోనూ ఈ మొక్కలు కనిపిస్తాయి. వీటి విలువను సమాజంలో అందరూ గుర్తించి పరిరక్షించుకోవాలి. – డా. బస్వాపూర్ సురేశ్రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, ‘సెస్’, సుస్థిర అభివృద్ధి అధ్యయన విభాగం, హైదరాబాద్ -
ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నం
గూడూరు : పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మరో చోట తమ వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మరో మహిళా రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బాధితుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని చిన్నఎల్లాపురం శివారు వెంగంపేటకు చెందిన మంగ్యానాయక్, భద్రమ్మ దంపతులు 15ఏళ్ల క్రితం ఊట్ల గ్రామశివారు సరస్వతి నగర్లో రెండెకరాల పోడు భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు ఆ పోడు భూమిలో విత్తనాలు వేసేందుకు పరిసర రైతులతో పాటు దుక్కి దున్నుతున్నారు. ఆ క్రమంలో గురువారం ఫారెస్టు అధికారి మంగతయారుతో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ఈ భూమి అటవీశాఖకు చెందిందని, వ్యవసాయం చేయొద్దని అడ్డుకున్నారు. దీంతో ఆవేదనకు గురైన బానోతు భద్రమ్మ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న భర్త మంగ్యానాయక్, ఇతర రైతులు కలిసి ఆమెను వెంటనే గూడూరు సీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. కమలాపూర్లో.. కమలాపూర్(హుజూరాబాద్): తమ భూమిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, ఆ భూమిని తమ పేరిట పట్టా చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మహిళా రైతు బోయిని సమ్మక్క ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కథనం ప్రకారం.. బోయిని సమ్మక్క–సారయ్య దంపతులకు అంబాలలో 1.36 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, తన వద్ద భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టా చేయడం లేదని ఆరోపించింది. తమ భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా దాడి చేస్తునారని ఆరోపించింది. భూమిని తమ పేరిట పట్టా చేసి న్యాయం చేయాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ సత్యనారాయణయాదవ్ను వివరణ కోరగా.. సమ్మక్క భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదని, ఏ ఆధారం లేనిదే తాము పట్టా చేయలేమని తెలిపారు. -
కుందేళ్లు చిన్నవి.. లాభాలు పెద్దవి!
అరకొరగా చదువుకున్న మహిళలు చాలా మంది వంటింటికే పరిమితం అవుతున్నప్పటికీ.. దృఢసంకల్పంతో ముందడుగేస్తున్న రాధమ్మ వంటి మహిళా రైతులు ఆదర్శప్రాయమైన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. వివిధ పంటల సాగుతోపాటు బర్రెలు, కుందేళ్ల పెంపకం చేపట్టారు. వివిధ నగరాల్లో తమ కుందేలు మాంసాన్ని గిట్టుబాటు ధరకు అమ్మడం ద్వారా చేతినిండా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ ఇంటర్ వరకు చదువుకున్నారు. తొలినాళ్లలో టైలరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత వ్యవసాయం, పశుపోషణ, కుందేళ్ల పెంపకంపై దృష్టిపెట్టారు. గ్రామ సమీపంలో ఓ షెడ్డు నిర్మించి రూ. 5 లక్షల పెట్టుబడితో మూడేళ్ల క్రితం కుందేళ్ల పెంపకం ప్రారంభించారు. 300 కుందేళ్లతో పెంపకం ప్రారంభించగా ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు చేరింది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్లూజర్ రకం గడ్డిని సాగు చేస్తున్నారు. దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్క పొడిని దాణాగా ఇస్తున్నారు. నలుగురు కూలీలను నియమించారు. ఆడ కుందేలు నెలకోమారు 5–10 పిల్లలు పెడుతుంది. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుంది. పిల్లలు నాలుగు నెలల్లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు పెరుగుతాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్పై కుందేళ్ల మాంసం సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో కుందేలు మాంసం కిలోకి రూ.650 ధర పలుకుతున్నది. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ.లక్ష నికరాదాయం వస్తున్నదని రాధమ్మ తెలిపారు. పదెకరాలలో మూడు బోర్లు వేయించి వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతోపాటు 10 బర్రెలను పోషిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని, రైతుగా తనకు చాలా సంతృప్తిగా ఉందని రాధమ్మ(89855 97106) సంతోషంగా తెలిపారు. – ఈటి సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా -
‘నేలమ్మ’ గొడుగు నీడలో..
చిన్న, సన్నకారు రైతులు కాలం కలసిరాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుండడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బాధిత కుటుంబాలకు చెందిన మహిళా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్తింటి వారి నుంచి భూములు, ఆస్తులపై హక్కులు దక్కని దుస్థితి కొందరిదైతే.. ఒంటరి మహిళలుగా వ్యవసాయం కొనసాగించడంలో సమస్యలు మరికొందరిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(సీసీసీ) అనే స్వచ్ఛంద సంస్థ నిస్సహాయులైన రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతో నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి అండగా నిలుస్తోంది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం లింగపల్లికి చెందిన పెద్దలింగన్నగారి బాలమణి అధ్యక్షతన రెండేళ్ల క్రితం ఈ సంఘం రిజిస్టరైంది. 30 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతోపాటు 200 మంది మహిళా రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరికి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంపై సంఘం శిక్షణ ఇప్పించింది. అనేక ఎకరాల పొలం కలిగి ఉన్నప్పటికీ .. ప్రతి ఒక్కరూ అరెకరం, పావెకరంలోనైనా సరే కంపోస్టు ఎరువుతో సేంద్రియ సేద్యం చేసి ఇంటికి సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. సంఘం అండదండలతో ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటూ పిల్లలను చదివించుకుంటున్నారు పలువురు రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిలో కొందరిని ‘సాగుబడి’ పలుకరించింది.. సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా.. మాకు ఎకరం చెల్క (మెట్ట) భూమి ఉంది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు పెట్టేవాళ్లం. నీటి కోసం 3 బోర్లు వేశాం. అప్పు పెరిగిందే గాని నీరు రాలేదు. కొడుకు పొట్ట చేతబట్టుకొని బొంబాయి వెళ్లాడు. నా భర్త పదేళ్ల క్రితం ఒకనాడు రాత్రి పదైనా ఇంటికి రాలేదు. చెట్టుకు ఉరిపోసుకున్నాడు.. సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా. బోరు నీటితో వరి వేశా.. రూ. 2 లక్షల అప్పుంది. బిడ్డ పెళ్లి చేయలేదు.. – పోతరాజు కనకమ్మ, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా లగ్గం అయిన మూడేళ్లకే.. ఐదెకరాల చెల్క ఉన్నా.. పంటలు పండేది రెండెకరాల్లోనే. వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.3 లక్షల అప్పు అయ్యింది. నా భర్త ప్రభాకర్ లగ్గం అయినాక మూడేళ్లకే మందు తాగి చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వమే బోరు వేయించింది. వరి ఎకరం(35–40 బస్తాల ధాన్యం పండుతుంది), అర్థెకరం పత్తి వేస్తున్నా. సంఘంతో కలిసి పనిచేస్తున్నా. – గుర్రాల సుగుణ, చెల్లంకిరెడ్డిపల్లి, చిన్నకొండూరు మండలం, సిద్దిపేట జిల్లా రెండెకరాల్లో వరి వేస్తున్నా.. రెండెకరాలుంది. 17 ఏళ్ల క్రితం నా భర్త రాములు 3 బోర్లు వేశాడు. నీరు రాలేదు. నీరు లేక 4 మడులు ఎండిపోయాయి. పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇద్దరు బిడ్డలు, కొడుకు. ఒక బిడ్డ బోన్కేన్సర్తో చనిపోయింది. ఇంకో బిడ్డ టీటీసీ చదివింది. రెండెకరాల్లో వరి వేస్తున్నా. సంఘం నేర్పిన విధంగా.. ఎటువంటి (రసాయనిక) మందులూ వేయకుండా చేస్తున్నా. – ఉప్పునూతల రామలక్ష్మి, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా సంఘం అండగా నిలబడింది.. మాది ఉమ్మడి కుటుంబం. ఆరెకరాల భూమి ఉంది. నా భర్త రమేశ్ ఏడేళ్ల క్రితం వర్షాధారంగా వరి వేశాడు. కోతకొచ్చే సమయంలో 2 బోర్లు ఫెయిలయ్యాయి. గుళికలు మింగి చనిపోయాడు.. మా భూమి మల్లన్నసాగర్లో పోయింది. మా పాప చదువుకు సంఘం తోడ్పడింది. అమ్మ వాళ్లింట్లోనే ఉండి సీసీసీ స్వచ్ఛంద సంస్థ వలంటీర్గా పనిచేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో తోటి మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నా. పెళ్లికి ముందు 9వ తరగతి చదివా. డిగ్రీ రాస్తున్నా.. – మెంగన సుజాత, లక్ష్మాపూర్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా ఏడాది పాటు సేంద్రియ సేద్యంపై శిక్షణ సంఘం సభ్యులకు గత ఏడాదిలో అనేక దఫాలుగా సేంద్రియ వ్యవసాయ నిపుణులు కిషన్రావు వద్ద శిక్షణ ఇప్పించాం. తాము తినడానికి వరకు సేంద్రియంగా పండించుకుంటున్నారు. మహిళా రైతుల హక్కుల సంఘం నేతలు ఆశాలత, లక్ష్మిల తోడ్పాటుతో బాధిత మహిళల భూమి హక్కులపై చైతన్యం తీసుకువస్తున్నాం. ప్రవాస తెలుగువారితో కూడిన ఐ4ఫార్మర్స్ బృందం బాధిత మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తున్నది. – సజయ (99483 52008), కేరింగ్ ఫర్ సిటిజెన్స్ కలెక్టివ్ -
ముగ్గురూ ముగ్గురే!
సాగుబడి మహిళ లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం, అత్యధిక సమయాన్ని కేటాయించడంలోనే కాదు.. నిర్ణాయకపాత్ర నిర్వహిస్తూ వ్యవసాయదారులుగా భేష్ అనిపించుకుంటున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఈ ముగ్గురూ తమ తరాల మహిళలకు స్ఫూర్తినందిస్తున్న మహిళా రైతులకు జేజేలు..! ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం..’ పిట్ల చిన్నమ్మి(65) పెద్దగా చదువుకోలేదు. ప్రభుత్వం అందించిన భూములను శ్రద్ధగా సాగు చేసుకుంటూ.. భర్త సింహాచలం తోడ్పాటుతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన దళిత మహిళా రైతుగా గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలంలో అలజంగి ఆమె స్వగ్రామం. తొలుత ప్రభుత్వం ఎకరా 30 సెంట్ల భూమిని అందించింది. డా. వై.ఎస్. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఎకరా భూమిని ఆమెకు ఇచ్చారు. ఆ భూమిలో అనుదినం కాయకష్టం చేసి పంటలు పండిస్తూ కుటుంబాన్ని కుదురుగా నడుపుతున్నదామె. ఆడవాళ్లు చేసే వ్యవసాయ పనులతోపాటు దుక్కి దున్నటం, ఎడ్ల బండి తోలటం.. చివరకు ట్రాక్టరు తోలడం కూడా ఆమె నేర్చుకొని చేస్తూ ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని పొలం పనులు స్వయంగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు మరికొంత భూమిని కూడా సమకూర్చుకున్నారు. ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది. ఎకరంలో చిలగడ దుంపలు, ఎకరాలో వేరుశెనగ, ఒకటిన్నర ఎకరాల్లో అరటి, మిగతా పొలంలో వరి పండిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతుంది? ఏ పంటకు ఎకరాకు ఎంత ఖర్చవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? వంటి విషయాలను తడుముకోకుండా చెబుతారు. ఎలాంటి భూమిని అయినా సాగు చేసి పంట దిగుబడి తీయడం చిన్నమ్మి ప్రత్యేకత. కుమారులు రమేష్, రాజశేఖర్ ప్రైవేటు కంపెనీలలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. ఉత్తమ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నారు. దుక్కి దున్నుతున్న చిన్నమ్మి ఆసక్తితో సేత్తన్నా.. ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం. మా అయ్య, అమ్మ ఈ పనులు నేర్పారు. సిన్న పని నుంచి పెద్ద పని వరకు నానే సేసేదాన్ని. అన్ని పనులు నేర్చుకుని వెవసాయంలో లీనమై అన్ని పనులూ నేనే సేసుకునే దాన్ని. నా పెనిమిటి సాయం సేసేవాడు. పిల్లలకు సదువు సెప్పిద్దామనే ఆలోచనతో వారికి వెవసాయం నేర్పలేదు. పొద్దు పోయాక పొలాల్లో నీరు కట్టడం దగ్గర నుంచి బండి తోలడం వరకు అన్నీ నేర్చుకున్నాను. నా పని నానే సేసుకోవాలనుకుని పొలం పనులు నేర్చుకున్నాను..’ అంటారు చిన్నమ్మి సగర్వంగా. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా సంతోషకరం.. ‘అక్షర’ సేద్యం! బీఎడ్ పూర్తి చేసిన సేంద్రియ సాగుపై మక్కువ చూపుతున్న యువతి బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన అక్షర (దీపిక) సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ సేంద్రియ వ్యవసాయం చేస్తుండడంతో ఆమె కూడా సంతోషంగా సాగు పనులు చేస్తూ తోటి మహిళా యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ ఏంబీఏ చదువుకొని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సంతృప్తి లేక తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆరేళ్లుగా తమ సొంత భూమిలో అధునాతన, శాస్త్రీయ సేంద్రియ పద్ధతులను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ వెదిర గ్రామానికి చెందిన బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసిన అక్షరను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ వ్యవసాయ పనులపై మక్కువ పెంచుకున్న అక్షర తన భర్తతో కలిసి సాగు పనుల్లో పాలు పంచుకున్నారు. అక్షర ప్రత్యేకంగా బోడ కాకర, కాకర, వంగ, టమటా, బెండ, చిక్కుడులాంటి కూరగాయలను ఎలాంటి క్రిమిసంçహారక మందులను పిచికారీ చేయకుండా సాగు చేస్తున్నారు. – వి.రాజిరెడ్డి, సాక్షి, రామడుగు, కరీంనగర్ జిల్లా సంతోషంగా ఉంది! ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా కూరగాయలు పండించడం చాలా ఆనందంగా ఉంది. వీటిని మార్కెట్లో మంచి ధరకు అమ్ముకుంటున్నాం. చదువుకున్న యువ మహిళలు ఆధునాతన పద్ధతులలో పంటల సాగుపై దృష్టి సారించాలి. – అక్షర, మహిళా రైతు, తిర్మలాపూర్, కరీంనగర్ జిల్లా డ్రిప్ పనుల్లో మహిళా రైతు అక్షర 18 ఏళ్లుగా అన్నీ తానై..! అధిక దిగుబడులు.. ప్రశంసలు.. సత్కారాలు.. యువ మహిళా రైతు మంజుల వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రుజువు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని రాగానిపల్లి ఆమె స్వగ్రామం. శివమ్మ, మాధవరెడ్డి దంపతుల కుమార్తె అయిన మంజుల ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రికి వయసు మీద పడటంతో ఆమె చదువుకు స్వస్తిపలికి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్లుగా వ్యవసాయంలో అన్నీ తానై రాణిస్తోంది. తమకున్న పదెకరాల పొలంలో వేరుశెనగ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మల్బరీ తదితర పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ట్రాక్టర్తో భూమి దున్నడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, చీడపీడల నివారణకు స్వయంగా మందుల పిచికారీ, వ్యవసాయ పరికరాలు సమకూర్చుకోవడం, పంటలకు నీరందించడం తదితర పనులన్నీ ఈమెకు వెన్నెతో పెట్టిన విద్య. వ్యవసాయ రంగంలో తనదైన ముద్రవేసుకున్న మంజుల వేరుశెనగ, వరి, మల్బరీ పంటల్లో రెట్టింపు దిగుబడులు సాధించి అధికారుల నుంచి ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తయారైన కే–5, కే–6, కే–134 రకాలను సాగుచేసి గతంలో రెట్టింపు దిగుబడులు సాధించారు. పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మంజులను సత్కరించారు. కదిరి తాలూకాలోనే అత్యధిక ధర పలికే పట్టుగూళ్లను పండించిన ఘనత మంజులది. పంటల సాగు, చీడపీడల నివారణకు గ్రామ రైతులు మంజుల సలహాలు తీసుకుంటుంటారు. ‘మంజుల మా గ్రామ సైంటిస్ట్’ అంటూ పలువురు రైతులు కొనియాడుతున్నారు. – సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న మహిళా రైతు మంజుల -
ధైర్యంగా కొన'సాగు'తూ..
ముంచుద్దో లాభమొస్తదో..చెప్పలేని ఎవుసాన్ని మహిళలు ధైర్యంగా చేస్తున్నారు. కుటుంబ భారం మోసేందుకు, తమపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు లాభాల ‘పంట’ పండిస్తున్నారు. శ్రమశక్తిని చాటుతూ..పురుషులకు ఏమీ తీసిపోకుండా..కష్టనష్టాలను ఓర్చుకుంటూ నిబ్బరంగాముందడుగేస్తూ శెభాష్అనిపించుకుంటున్నారు. ఖమ్మం, అశ్వారావుపేటరూరల్: మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామానికి చెందిన పేరం లక్ష్మి వ్యవసాయం చేస్తూ, లాభాల పంటలు పండిస్తూ ఆ ఇంటికి అండగా మారింది. ఆ ఊళ్లో వారికి మహిళా రైతు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఆమె పేరే. పెళ్లైన కొంతకాలం తర్వాత నుంచి వ్యవసాయంపై మక్కువతో వివిధ రకాల పంటలను సాగు చేస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా వ్యవ‘సాయం’ చేస్తోంది. తెల్లవారుజామున ఇంటి పనులు పూర్తి చేసుకొని రాత్రి వరకు పొలం బాటలోనే ముందుకు సాగిపోతోంది. సొంత వ్యవసాయ భూముల్లో భర్త పేరం కృష్ణ పామాయిల్, వరి పంటలను సాగు చేస్తుంటే ఆమె మాత్రం భూములను కౌలుకు తీసుకొని మరీ అనేక రకాల పంటలను పండిస్తుండడం విశేషం. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా..వీరందరికీ వివాహాలయ్యాయి. పెద్ద కొడుకు తల్లితోపాటు వ్యవసాయం చేస్తుండగా, రెండో అబ్బాయి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్లకు సొంతంగా పూర్వీకుల నుంచి 10 ఎకరాల సాగు భూమి వాటాగా రాగా, పామాయిల్ను సాగు చేస్తున్నారు. ఆమె ఇంటికే పరిమితం కాకుండా భర్త, కొడుకుతో పోటీపడి మరి సొంతంగా వ్యవసాయం చేస్తోంది. స్వగ్రామానికి సమీపంలో గల మొద్దులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో చెరకు పంట, మరో నాలుగు ఎకరాల్లో వాణిజ్య పంటైన మొక్కజొన్న పండిస్తోంది. మరో రెండెకరాల్లో చిక్కుడు, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తోంది. ఇంటి వద్ద ఐదు పాడి గేదలను సాకుతూ..పాలను విక్రయిస్తోంది. ఖమ్మంరూరల్: పంటలు కలిసిరాక..చేసిన అప్పులు తీర్చలేక గోళ్లపాడు శివారు ఊటవాగుతండాకు చెందిన రైతు తేజావత్ రాందాసు ఆత్మహత్య చేసుకుంటే..గుండెనిబ్బరంతో అతడి భార్య నీలమ్మ అదే వ్యవసాయాన్ని చేస్తూ ముగ్గరు బిడ్డలను చదివించుకుంటోంది. భర్త పోయాడనే బెంగ ఓ పక్క, చేసిన అప్పులెలా తీర్చాలోననే బాధ మరో పక్క వేధిస్తున్నా కళ్లముందు కనిపిస్తున్న ముగ్గురు ఆడపిల్లలను చదివించేందుకు కష్టాలను ఎదుర్కొంది. పెద్ద కూతురు శ్రావణి ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు సంధ్య ఎనిమిది, మరో కూతురు స్వాతి ఆరో తరగతి చదువుతున్నారు. నీలమ్మకు ఉన్న ఎకరం భూమికి తోడు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తోంది. ఈమెకు కూడా కాలం కలిసి రావట్లే. అప్పులు పెరుగుతున్నాయి. కానీ..దశ తిరగకపోతుందా అనే ఆశతో, ధైర్యంతో వ్యవసాయం చేస్తోంది. పిల్లలు కూడా ఖాళీ సమయాల్లో తల్లికి చేదోడువాదోడుగా సహకరిస్తున్నారు. భర్తను మింగిన అప్పులు.. నీలమ్మ భర్త మిర్చి, మొక్కజొన్న పంటలను పండించేవాడు. సాగునీటి కోసం రెండు బోర్లు వేయించినా అందులో చుక్కనీరు రాలేదు. కానీ..రూ.లక్ష అప్పు మిగిలింది. కౌలుకు తీసుకొని సాగు చేసిన ఏడెకరాల్లో మిర్చితోట దిగుబడి రాక ముంచింది. ఇలా మొత్తం రూ.5లక్షల అప్పులు మిగిలాయి. ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో 2011 అక్టోబర్లో చేను వద్దనే నీలమ్మ భర్త రాందాసు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కష్టాలను అధిగమిస్తూ..పిల్లలకు తానే పెద్ద దిక్కుగా మారింది. రోజంతా చేను పనే.. ఇంటి నుంచి చేనుకు పోయిందంటే..తిరిగి చీకటి పడుతుండగానే ఇంటికి చేరుతుంది ఈ లక్ష్మి. కూలీలు పొలానికి రాకముందే అక్కడికి చేరుకుని సిద్ధంగా ఉంటుంది. మొక్కజొన్న పంటకు తడి పెట్టడంతోపాటు, మడులు కట్టడం, కలుపు తీసే పనులు చేస్తుంది. చెరకు తోటల్లో చెరకు నరకడంతోపాటు, నాట్లు వేయడం, కలుపు నివారణ మందులు(పురుగుల మందు)సైతం స్ప్రేయింగ్ చేస్తుంది. ఇక కూరగాయాల తోటల్లో చిక్కుడు, కాకర కోతలు, వాటికి వివిధ రకాల మందులను పిచికారీ చేయడం వంటి పనులు కుడా ఆమె సొంతంగా చేస్తుంది. పెట్టుబడి ఖర్చులు పోను..నష్టాలు లేకుండా ఆదాయం పొందుతున్నట్లు ఆమె ఆనందంగా చెబుతోంది. సూపర్బజార్(కొత్తగూడెం): భర్త మరణం ఆమెను కుంగదీసింది. ఏం చేయాలో తోచలే. కానీ..పిల్లల కోసం కొత్త పయనం మొదలెట్టింది. వ్యవసాయాన్ని ఎంచుకొని రాజీ పడకుండా ముందుకు సాగింది. రేగళ్ల గ్రామ పంచాయతీ పెద్దతండాకు చెందిన జాటోతు రాజీ భర్త అనారోగ్యంతో చనిపోగా..ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడిని రెండెకరాల్లో వ్యవసాయం చేసి పెంచింది. కలుపు తీయడం, పురుగులమందు కొట్టడం, సాగు పనులన్నీ చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టుకొని నిలదొక్కుకుంది. పెద్ద బిడ్డ కవిత, రెండో కూతురు సునీతలకు వివాహం చేసింది. మూడో కూతురు హరిత ఆరో తరగతిలోనే చదువు ఆపేసి..అమ్మకు ఆసరాగా ఉంటోంది. కొడుకు మాదిరిగానే సహకరిస్తోంది. రాజీ కుమారుడు వీరన్న రేగళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెద్దయ్యాక అమ్మ కష్టాలను తీరుస్తానని చెబుతున్నాడు. -
సాగులో సగం
కడదాకా కలిసుంటానన్న మగ దిక్కు మధ్యలో ‘కాడి’ దింపేశాడు. అప్పులు బాధతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు భార్య, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కొంతకాలం ఆ మహిళలు దిక్కుతోచని స్థితి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వారికి పిల్లల పోషణ, చదువులు, కుటుంబ భారం గుర్తుకొచ్చింది! ఇంకేం భర్త దించిన ‘కాడి’నే ఎత్తుకున్నారు. కుటుంబానికి ఇంతకాలం అండగా ఉన్న, తాము నమ్ముకున్న భూమిలో వ్యవసాయం ఆరంభించారు. నష్టాలు వచ్చాయ్.. లాభాల్ని కళ్ల జూశారు.. అయినా ఎక్కడా ఆ ‘మహిళా మణులు’ తమ ధైర్యాన్ని కోల్పోలేదు. సాగులో ముందుకు సాగుతూ పిల్లలను ప్రయోజకుల్ని చేస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మహిళల్లో కొందరి కథనాలు.. కౌలు భూముల్లో వ్యవ‘సాయం’ మహబూబ్నగర్, గట్టు: మండలంలోని సల్కాపురం గ్రామానికి తూము రాములమ్మ భర్త నర్సప్ప 12 ఏళ్ల క్రితం చెరువులో మృతదేహమై తేలాడు. అప్పటికి ఈ కుటుంబానికి ఎకరా పొలం మాత్రమే ఉంది. అదీ కూడా వర్షాధారంగా పం టలు పడే భూమి. భర్త ఉన్న రోజుల్లో సేద్యం పనులు ఆయనే చూసుకునే వాడు. అయితే, ఆయన మృతితో నలుగురు పిల్లల భారం ఆమెపై పడింది. అప్పుడు కూలీ పనులు చేస్తూ ఆమె పిల్లలను పెంచసాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల చదువు మాత్రం మాన్పించలేదు. ఆ తర్వాత ఎకరం పొలం కౌలుకు తీసుకుని పత్తి, పొగాకు సాగు చేయసాగింది. పిల్లల్లో ఓ కుమార్తె మంగమ్మ వివాహం జరిపించగా, ఓ కుమారుడు తిమ్మప్ప తల్లికి వ్యవసాయ పనుల్లో అండగా ఉంటున్నాడు. మిగతా వారిలో గోవిందు 9వ తరగతి, హైమావతి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ ఎకరం పొ లం కౌలు తీసుకుని సాగు చేస్తూనే.. ఖాళీ సమయాల్లో పక్క పొలాల్లో కూలీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనలా పిల్లలు కావొద్దనే భా వనతో చదివిస్తున్నట్లు వెల్లడించారు. ‘మగ’రాణులు మహబూబ్నగర్, గోపాల్పేట: వ్యవసాయం చేయడంలో మగవారికి సాటి ఎవరూ రారని అనుకుంటారు. కానీ వ్యవసాయంలో సాయంగానే ఉన్న వారిద్దరూ భర్త మృతి చెందాక సొంతంగా మగ వారికి ధీటుగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ అందరి చేత ‘మగ’ రాణులు అనిపించుకుంటున్నారు సీత, మంగమ్మ. గోపాల్పేట మండలం బుద్దారం పంచాయతీ పరిధి జాంప్లాతండాకు చెందిన కాట్రావత్ గోపాల్కు మొదటి భార్య మంగమ్మ. ఈమెకు సంతానం లేకపోవడంతో సీతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మంగమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు, సీతకు ఒక కొడుకు జన్మించారు. అప్పటి నుంచి గోపాల్ తనకున్న 10 ఎకరాల పొలంపై ఆధారపడి తల్లిదండ్రులు లచ్యా, దేవ్లీతో పాటు కుటుంబాన్ని పోషిస్తుండగా.. పిల్లల చిన్న వయస్సులో 16 ఏళ్ల క్రితం గోపాల్ అనారోగ్యంతో మరణించాడు. తొలుత ఏం చేయాల్లో దిక్కుతోచక సీత, మంగమ్మ మనో వేదనకు గురయ్యారు. వారిద్దరూ పనుల కోసం ముంబై వెళ్తారని అందరూ భావించినా.. భర్త మరణం తర్వాత బీడు పడిన పొలాన్ని బాగు చేసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుని పిల్ల లను అత్తామామల పర్యవేక్షణ ఉంచి ముం దుకు సాగారు. వ్యవసాయం చేసుకుంటు పిల్లలను చదివించడం ప్రారంభించారు. బోర్లు ఎండిపోయినా.. ఏటా సీత, మంగమ్మ తమ పొలంలో మొక్క జొన్న, వేరుశనగ, వరి పండిస్తుండగా.. ఉన్న బోరు ఎండిపోవడంతో వరుసగా నాలుగేళ్లు నాలుగు బోర్లు వేయించిన నీళ్లు పడలేదు. అయినా మొక్కువోని ధైర్యంతో ప్రస్తుతం యాసంగిలో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. రూ.లక్ష ఖర్చు పెట్టి కిలోమీటర్ దూరం నుంచి పైప్లైన్ ద్వారా చెక్డ్యాం నుంచి పంటకు నీళ్లందిస్తున్నారు. ఇక పిలల్లు తమలా కావొద్దని చదివిస్తుండగా.. మంగమ్మ పెద్ద కొడుకు కురుమూర్తి డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. రెండో కుమారుడు చందు ఏడో తరగతి పూర్తయ్యాక హైదరాబాదులో ఆటో నడుపుతున్నాడు. కూతురు శారద వనపర్తిలోని మరికుంట గురుకులంలో ఇంటర్ చదువుతుండగా, సీత కొడుకు రాజు బుద్దారం హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం రానున్న పిల్లలను ప్రయోజకులను చేయాలన్న తపన వారిలో కనిపిస్తుంది. భర్త చనిపోయినా ఆగని కాడి నాగర్కర్నూల్ రూరల్: ఎప్పుడో 22 ఏళ్ల క్రితం తన భర్త పాముకాటుతో మరణించాడు. అప్పుడు ఆమె చేతిలో నాలు గో తరగతి చదువుతున్న బాబుతోపాటు మరో బాబు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వ్యవసాయం చేస్తూ తన పిల్లలను ఉన్నత చదువులకు పంపించింది నియోజకవర్గంలోని రాయిపాకులకు చెందిన వేనేపల్లి సులోచనమ్మ. ప్రస్తుతం పెద్ద కుమారుడు విజయేందర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసి చైనాలోని సైన్స్ జిన్టెక్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చదివేందుకు సీటు సాధించాడు. పెద్ద కుమార్తెను డిగ్రీ వరకు చదివించాక ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి చేయగా, ఇటీవలే చిన్న కుమారుడు, చిన్న కుమార్తెకు కూడా వివాహం జరిపించింది. పిల్లలు ప్రయోజకులైనా తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని మాత్రం సులోచనమ్మ కొనసాగిస్తుండడం విశేషం. వ్యవసాయం.. ఆమెకు ప్రాణం మదనాపురం: చిన్నప్పటినుండి అనేక రకాల పంటలు పండిస్తూ భూమినే నమ్ముకున్న మదనాపురం మండలం గోవిందహల్లికి చెందిన గౌనికాడి చెన్నమ్మ పలువురికి ఆదర్శంగా నిలుస్తోం ది. భర్త నాగన్న, కొడుకుల సహకారంతో తమకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఏటా ప్రకృతి సహకరించిన, సహకరించకపోయి నా ముందుకు సాగుతోంది. ఉదయాన్నే పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువుల చల్లడంతో పాటు ఇంటి దగ్గర ఉన్న గేదెకు మేత తీసుకురావడం, పాలు పితకడం వరకు అన్ని పనులు చెన్నమ్మ సజావుగా చేస్తుండడం విశేషం. ఇక పంటలకు ఏదైనా రోగాలు వస్తే ప్రమాదాన్ని గుర్తించి అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తుండడంతో నష్టాలు రావడం లేదు. ఈ సందర్భంగా చెన్నమ్మ మాట్లాడుతూ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి తనకు ప్రాణమని, వివాహమైన తర్వాత కూడా తన భర్తకు ఉన్న పొలంలో వ్యవసాయం సాగిస్తున్నానని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా గ్రామంలో వేరే రైతుల పొలాల్లో పనులు చేస్తానని పేర్కొంది. పండించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దక్కదని, ఒక్క రోజు పొలానికి వెళ్లకున్నా మనస్సుకు వెలితిగి ఉంటుందని తనకు పొలంపై ఉన్న ప్రేమను ఆమె తెలియజేసింది. కష్టాలకు ఎదురీదిన రాజేశ్వరమ్మ మరికల్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ మృతి చెందాడు.. పుట్టెడు దుఖాన్ని దిగమిగుతూ చేతికోస్తున్న పిల్లలను ఉన్నత చదువులను చదివించేందుకు భర్త చూపిన దారినే ఎన్నుకుంది. వ్యవసాయ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ. అంజిల్రెడ్డి–రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరికి పది ఎకరాల పొలం వుంది. అంజిల్రెడ్డి ఐదేళ్ల క్రితం కేన్సర్ బారిన పడడంతో చికిత్స రూ. 8 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో అటు భర్త వైద్యం కోసం చేసిన అప్పులు.. ఇటు పిల్లల పోషణ భారం ఒకేసారి మీద పడగా ధైర్యాన్ని కూడగట్టుకున్న ఆమె భర్త చూపిన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వరి, వేరు శనగా, పత్తి, కందులతో పాటు వివిధ రకాల తోటలు సాగు చేయగా.. ఓ ఏడాది లాభం, మరో ఏడాది నష్టం వచ్చినా వెనుతిరగలేదు. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయంతో భర్త వైద్యం కోసం చేసిన అప్పులు తీరుస్తూ, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ కుమార్తె అనితను కానిస్టేబుల్ను చేసింది ఆ తల్లి.పెద్ద కుమారుడు మురళీధర్రెడ్డి హైదరాబాద్లో పీజీ చేస్తూ ప్రైవేట్ ఉద్యోగంలో చేరగా, చిన్న కుమారుడు శ్రీనివాస్రెడ్డి నాగార్జునసాగర్లో డిగ్రీ రెండో సంవత్సరం చదివుతున్నాడు. వ్యవసాయంతో జీవన పోరాటం వెల్దండ: వెల్దండకు చెందిన గొడుగు యాదమ్మ వ్యవసాయాన్నే నమ్ముకుని ముందకు సాగుతోంది. ఆమె భర్త ఎనిమిదేళ్ల క్రితం, ఆ తర్వాత చిన్న కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత ఆవేదన చెందినా, కొద్దికాలానికి ధైర్యాన్ని కూడగట్టుకుని తమ నాలుగు ఎకరాల పొలంలో పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం టమాట, వంకాయ, చిక్కుడు తోటలు సాగు చేస్తోంది. -
సాగుమడిలో ధీర వనిత
నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ వ్యవ‘సాయం’ చేస్తున్న వారు కొందరైతే.. కుటుంబ పెద్ద దూరమై, బతుకు భారంగా మారిన పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ఇంటిని నడిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కూతుళ్లకు ఉన్నత విద్య ఆర్మూర్: అక్షరాలు రాకపోయినా చదువు విలువ తెలిసిన ఆ కన్నతల్లి వ్యవసాయాన్నే నమ్ముకొని ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు చెప్పించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఆ ఇద్దరు కూతుళ్లలో ఒకరు ఎంబీబీఎస్, మరొకరు కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కన్నవారి కలలు నిజం చేశారు. కూతుళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయి అమెరికాలో స్థిరపడ్డారు. అయినా ఇద్దరు పిల్లలు ఎప్పడు తల్లి వద్దకు వచ్చి వెళ్తూ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన సామ నర్సయ్య, గన్నుబాయి దంపతులకు నలుగురు ఆడపిల్లలు. కొడుకు లేకపోవడంతో పెద్ద కూతురైన గంగుబాయికి ఊర్లోనే సంబంధం చూసి గడ్డం చిన్న గంగారెడ్డికి ఇచ్చి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో మిగిలిన ముగ్గురు కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశారు. చిన్న గంగారెడ్డి, గంగుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వర్ణరెడ్డి, శ్వేతరెడ్డి పుట్టారు. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. కొద్ది రోజులకే ఇంటికి మగదిక్కైన తండ్రి నర్సయ్యతో పాటు అనారోగ్యంతో చిన్న గంగారెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఇంటి భారం గంగుబాయిపై పడింది. ప్రధానంగా వ్యవసాయాధారిత కుటుంబమే కావడం, తల్లిదండ్రులతో వ్యవసాయం పనులకు వెళ్లిన అనుభవం గంగుబాయి జీవనోపాధికి మార్గం చూపాయి. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనే భర్త కోరిక నెరవేర్చాలనే సంకల్పం మాత్రమే ఆమెకు మిగిలింది. అందుకోసం రేయింబగళ్లు కష్టపడింది. తానుపడే కష్టం పిల్లలు పడవద్దని వారిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిపించింది. గ్రామంలో తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉండేది. వ్యవసాయం పనులన్నీ గంగుబాయే చేసుకొనేది. పంటలు వేయడం మొదలుకొని పండించిన పంటను మార్కెట్ యార్డులో అమ్మాలన్నా, కూరగాయలను మార్కెట్కు తరలించాలన్నా అన్నీ తానే చూసుకొనేది. 2007 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. అమెరికాలో కూతుళ్లు.. తల్లి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు ఆడపిల్లలు నేడు ఉన్నత చదువులను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. పెద్ద కూతురు స్వర్ణరెడ్డి గుంటూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చిన్న కూతురు శ్వేత రెడ్డి నెల్లూర్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివింది. వీరిద్దరికి పెళ్లిళ్లుకావడంతో ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి తమ కోసం పడ్డ కష్టాన్ని చూసి ఆ కూతుళ్తు తల్లి వద్దకు ఎప్పుడు వస్తుంటారు. తల్లిబాగోగులు చూసుకుంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని.. నిజాంసాగర్(జుక్కల్): కట్టుకున్న భర్త దూరమవడంతో ఇద్దరు కూతుళ్ల భారం ఆమెపై పడింది. దీంతో భర్త పోయిన బాధను దిగమింగుకుంది. వ్యవసాయాన్ని నమ్ముకుంది. తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని సొంతంగా వ్యవసాయం చేస్తూ, పంట పండిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని పొలం పనులు చేసుకుంటుంది నిజాంసాగర్ మండలం తున్కిపల్లికి చెందిన మామిడి సంగవ్వ. నిజాంసాగర్ మండలం తున్కిపల్లి గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య, భూమవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు జన్మించారు. వీరికి మగ సంతానం లేదు. దీంతో పెద్దకూతురు మామిడి సంగవ్వను వెంకటనారాయణకు వచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. రెండో కూతురు గంగవ్వను పెళ్లి చేసి ఇవ్వగా, చిన్నకూతురు మృతి చెందింది. సంగవ్వ, వెంకటనారాయణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సుజాత, పద్మ జన్మించారు. భర్త మృతిచెందడంతో తల్లిదండ్రులు, కూతుళ్ల సంరక్షణ భారం సంగవ్వపై పడింది. దీంతో సంగవ్వ ధైర్యాన్ని కూడగట్టుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణను తన భుజాలపై వేసుకుంది. కొన్నాళ్లకు తల్లిదండ్రులు తనువు చాలించారు. కొంత కాలానికి పెద్ద కూతురు సుజాతకు అంజయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చింది. చిన్నకూతురు పద్మ వివాహం జరిపించింది. ఇంట్లోనే ఇల్లరికం ఉన్న పెద్ద కూతురు సుజాత, అంజయ్య దంపతులకు కుమార్తె మమత, కుమారులు అనిల్కుమార్, సాయికుమారు ఉన్నారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో మరోమారు విధి వక్రించింది. దురదృష్టవశాత్తు అల్లుడు అంజయ్య ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో సంగవ్వకు మరిన్ని కష్టాలు పెరిగాయి. వయస్సు పెరిగినా అధైర్యపడకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో ఉన్నదాంట్లో మనువళ్లు, మనవరాలిని చదివిస్తోంది. భర్త దూరమైన కూతురి ఆలనా పాలన చూస్తోంది. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి బాధలను దిగమింగుకుని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితంలో ముందుకు సాగుతూ పలువురు అభినందనలు పొందుతోంది. కష్టాలు ఎదురొడ్డి పోరాడుతున్నా.. : మామిడి సంగవ్వ చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తున్నా. ఇప్పటికి కష్టాలు తీరడం లేదు. తల్లిదండ్రులతో పాటు తాళికట్టిన భర్త దూరం కావడం, కన్న కూతురికి పెళ్లి చేసినా అల్లుడు అకాల మరణంతో కుటుంబంలో బోలెడు కష్టాలు వచ్చాయి. పిల్లలకు భవిష్యత్తు కోసం కూలినాలి పనిచేస్తూ కష్టపడుతున్నా. వారి ఆలనాపాలనా చూసుకుంటున్నా. 40 ఏళ్లుగా వ్యవసాయం బీర్కూర్: మండల కేంద్రానికి చెందిన మేత్రి కుర్మసాయవ్వ గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేని సాయవ్వ పొలం చూసి పంటకు ఏ రోగం వచ్చిందో.. ఏ మందు వేయాలో ఇట్టే చెప్పేస్తుంది. సాయవ్వ భర్త సాయిగొండ ఆరోగ్యం సహకరించకపోవడంతో అన్నీ తానై 10 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. నాట్లేయడం మొ దలుకుని పంటకోతకు వచ్చే వరకు అన్నీ తానై పంట సాగు చేస్తుంది. తన భర్తతో కలిసి వ్యవ సాయం చేస్తూ రెండు ఎకరాల నుంచి ఈరోజు 10 ఎకరాలకు ఆసామి అయ్యానంటూ సగర్వంగా చెప్పుకుంటుంది. భూతల్లి నమ్ముకున్న వారు ఎప్పుడు నష్టపోరని, రెక్కల కష్టం ఎన్నటికీ వృథా కాదంటోంది సాయవ్వ. చదువు లేని మాలాంటి వారు ఇంటిపట్టున కూర్చునే బదులు ఇలా వ్యవసాయం చేయడంతో తప్పులేదని అంటోంది. నా వయస్సు 50 ఏళ్లకు చేరుకున్నా పొలం గట్టుపై నిల్చుని సూచనలు ఇవ్వనని, కూలీలతో కలిసి అన్ని పనులు చేస్తానంటుంది. 9 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు – సాయవ్వ, బీర్కూర్ మా అమ్మగారు చిన్న దేవాడ. నాకు 9 ఏళ్ల వయస్సులోనే బీర్కూర్ చెందిన సాయిగొండతో పెళ్లి జరిగింది. అప్పుడు నా పెనిమిటి వయస్సు 15 ఏళ్లే. నేను చదువు కోలేదు. 12 ఏళ్ల వయస్సు నుంచే వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించా. మా అత్తమామలు ఉన్నప్పుడు మాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. నేను నా పెనిమిటి బాగా కష్టపడి వ్యవసాయం చేశాం. ఐదారు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పనిచేసే వాళ్లం. తర్వాత 8 ఎకరాల వరకు పొలం కొన్నాం. డాబా ఇల్లు కట్టుకున్నాం. మా ఆయనకు నాలుగేళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో మొత్తం 10 ఎకరాల వ్యవసాయం నేనే చూసుకుంటున్నా. మొదట్నుంచి కూడా నాట్లేయడం, కలుపుతీత, పంటకోత వరకు అన్ని పనులకు కైకిలోళ్లను నేనే పిలుస్తా. బిడ్డ పెళ్లి చేశాం. కొడుకు బీరప్ప ప్రయివేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. భర్తకు అండగా పశుపోషణ బోధన్రూరల్(బోధన్): ఈ మహిళ పేరు లోకిరెడ్డి ధనలక్ష్మి. బోధన్ మండలంలోని ఆచన్పల్లి గ్రామం. ఈమెది పేద, మధ్య తరగతి కుటుంబం. వీరికి సొంత పొలం లేదు. భర్త వ్యవసాయం మీద మక్కువతో ప్రతియేటా రెండు, మూడు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటాడు. తన భర్తకు అండగా నిలవాలనుకుంది. ఇంటి వద్ద మూడు పాడి గేదెలు, ఒక ఆవును పోషిస్తోంది. భర్త తీసుకునే కౌలు పొలంలో ఎకరం వరకు పచ్చి గడ్డిని సాగు చేస్తూ పాడి గేదెల పోషణపై దృష్టి సారించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు పాడి గేదెల సంరక్షణను చూసుకుంటుంది. ప్రతిరోజు గేదెలను వభ్రం చేయడం, వాటికి కావాల్సిన దాణ, గడ్డి టైంకు అందిచడం, ఉదయం, సాయంత్రం పాలు తీసి దగ్గరలోని పాల కేంద్రంలో అమ్ముతుంటారు. ప్రతి రోజు గేదెల నుంచి సుమారు 15 నుంచి 18 లీటర్ల పాలు వస్తాయని ధనలక్ష్మి చెబుతోంది. పాలన కేంద్రం రూ. 45 నుంచి రూ. 50లకు అమ్ముతున్నామని, పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు ఉపయోగిస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటూ భర్తకు బాసటగా నిలుస్తోంది. మొక్కవోని ధైర్యంతో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన డోకూరి శోభ, రవీందర్ రెడ్డి దంపతులు. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవీందర్ రెడ్డి తన భార్య శోభతో కలిసి వారికున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను పండిస్తూ జీవనాన్ని సాగించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రవీందర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాలా రోజుల పాటు మంచం పట్టిన భర్తకు అన్ని సేవలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. తొమ్మిదేళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పుడు కుమారుడు నితిన్ పదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె నిఖిత 8వ తరగతి చదువుతుంది. మగ దిక్కులేకపోవడంతో ఇద్దరు పిల్లలను పెంచి పోషించడం ఎలా అని తరచూ మదనపడుతుండేది. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలో దు:ఖాన్ని దిగమింగి మొక్కవోని ధైర్యంతో పిల్లల చదువుకు ఆటంకం కలగనీయకుండా చదివించింది. భర్త కొనసాగించిన వృత్తి అయినా వ్యవసాయం పనులు చేస్తూ పిల్లలను చదివించింది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రమేల్కొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీళ్ల పారకం చూసుకుంటూ మంచి దిగుబడి సాధిస్తుంది. భర్త లేని లోటును తీరుస్తుంది. ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది. కుమారుడు నితిన్ ఇంటర్ చదువుతుండగానే ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం కుమార్తె నిఖిత ఎంబీఏ చదువుతుంది. పిల్లలను గొప్ప ప్రయోజకులను చేయడమే నా లక్ష్యమంటుంది శోభ. భర్త ఆశయాన్ని బతికిస్తూ.. మోర్తాడ్(బాల్కొండ): వ్యవసాయంతో పది మందికి పట్టెడు అన్నం పెట్టవచ్చనే భావనతో నష్టమైనా, కష్టమైనా వ్యవసాయాన్ని వదలకుండా తన తుది శ్వాస వరకు వ్యవసాయమే ఊపిరిగా బతికిన తన భర్త ఆశయానికి ప్రతి రూపం ఇచ్చింది మోర్తాడ్ మండలం దొన్కల్ కు చెందిన మహిళా రైతు కౌసల్య. దొన్కల్కు చెందిన రైతు కుకునూర్ చిన్నయ్య వ్యవసాయాన్ని నమ్ముకుని రైతు నాయకుడిగా పేరు సంపాదించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వ్యవసాయ వృత్తినే నమ్ముకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఏడేళ్ల కింద చిన్నయ్య మరణించాడు. తన భర్త మరణంతో కౌసల్యకు తీరని లోటు ఏర్పడింది. అయితే తన భర్త తనతో వ్యవసాయం గురించి చెప్పిన ప్రతిమాటను తన మదిలో నిలుపుకుంది. తన భర్త మరణం వల్ల వ్యవసాయం కుంటు పడకూడదని భా వించి తమకు ఉన్న 12 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, ఎర్రజొ న్న, సోయా, సజ్జ, వరి పంటలను సాగు చేస్తోంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించింది. ఈ మహిళా రైతు పెద్దకొడుకు రాజశేఖర్రెడ్డి ఐర్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా, చిన్న కొడుకు చంద్రకాంత్రెడ్డి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తన భర్త ఆశయాన్ని బతికిస్తూ కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో కౌసల్య కృషి ఎంతో మందికి ఆదర్శం. పంట సాగుచేస్తూ.. మోర్తాడ్(బాల్కొండ): ఒక వైపు తన భర్త తమతో లేడనే వేదన.. మరో వైపు ఏమి తెలియని వయస్సులో ఉన్న ఇద్దరు కొడుకులు.. భర్త మరణంతో తాను కుంగిపోతే తన కొడుకులు ఏమైతారోననే ఆందోళనతో ఉన్న ఆ మహిళ గుండెను రాయి చేసుకుంది. తన భర్త తమ నుంచి భౌతికంగా దూరమైనా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలతో ముందుకు సాగాలని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. ఆమెనే మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన మహిళా రైతు లక్ష్మి. తన భర్త రాజేందర్, తనకు చదువు రాకపోయినా తమ కొడుకులు మాత్రం తమలా ఉండిపోకూడదనే ఉద్దేశంతో వారిని ఉన్నత చదువులు చదివించింది. సమాజంలో తమ కొడుకులకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది. లక్ష్మి తమకు ఉన్న 15 ఎకరాల భూమిలో కూలీల సహాయంతో వ్యవసాయం చేస్తూ నెట్టుకు వస్తుంది. పసుపు పంటతో పాటు, ఎర్రజొన్నలు, వరి, మొక్కజొన్న, సజ్జ, కూరగాయలను సాగిస్తూ వ్యవసాయంలో మగవారితో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తోంది. లక్ష్మి పెద్ద కొడుకు క్రాంతి కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రఘుదీష్ ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని కొడుకులను ఎంతో ప్రయోజకులను చేసిన లక్ష్మి ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తోంది. భర్తకు బాసటగా.. నస్రుల్లాబాద్: ఈ ఫొటో ఉన్న మహిళా రైతు పేరు కంది సావిత్రి.. ఈమెది నస్రుల్లాబాద్. భర్త మల్లేశ్. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం భర్త ఎనిమిదేళ్ల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. భర్త ఒక్కడే సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో భర్తకు అండగా నిలవాలనుకుంది. తమకు రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. పొలానికి నీరు పెట్టడం, ఎరువులు చల్లడం ఇలా అన్ని పనులు చేస్తుంటుంది. ఇతరులతో సమానంగా ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండిస్తుంది. భర్త పంపించే డబ్బుతో పాటు తాను వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయంతో బిడ్డలను చదివిస్తూ పెంచిపోషిస్తోంది. భర్త అన్న బిడ్డలను సైతం.. భర్త తోడబుట్టిన అన్నయ్య కంది సాయిలు దంపతులు మరణించడంతో వారి ఇద్దరు అమ్మాయిలను ఒంటరి చేయకుండా తన వద్ద ఉంచుకొని తన పిల్లలతో సమానంగా చూసుకుంటోంది సావిత్రి. నాలుగేళ్ల క్రితం బావ దుబాయ్లో కష్టపడి పెద్ద బిడ్డ పెళ్లి చేయడం కోసం అని స్వదేశానికి వచ్చి, ఆరోగ్యం క్షీణించి మూలన పడ్డాడు. ఆ సమయంలో తోడికోడలుకు ఆసరా ఉంటూ దగ్గరుండి పెళ్లి చేయించింది. కూతురు పెళ్లి జరిగిన మూణ్నెళ్లలో తోడి కోడలు రాధ ఆత్మహత్య చేసుకొని మరణించగా మిగతా ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా కాకుండా తన సొంత పిల్లలతో సమానంగా చదివిస్తూ, పెంచి పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బాధలను దిగమింగుకుంటూ.. మోర్తాడ్(బాల్కొండ): ఎంతో సంతోషంగా సాఫీగా సాగుతున్న తమ జీవితానికి విద్యుత్ షాక్ తీరని బాధను మిగిల్చినా, ఆ బాధను దిగమింగుకుంటూ ముందుకు సాగింది మోర్తాడ్కు చెందిన మహిళా రైతు తీగెల లక్ష్మి. దాదాపు 20 ఏళ్ల కింద తమ వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ను మరమ్మత్తు చేసే సమయంలో షాక్కు గురైన లక్ష్మి భర్త లింబాద్రి తమ కళ్ల ముందే మరణించాడు. ఆ సమయంలో చిన్న వయస్సులో ఉన్న కొడుకు, కూతురు, వృద్ధులైన అత్తామామలు ఇలా కుటుంబ భారం అంతా లక్ష్మిపైనే పడింది. దుఖాన్ని దిగమింగుకుంటూ లక్ష్మి కుటుంబ భారాన్ని మీదవేసుకుని వ్యవసాయాన్ని నమ్ముకుంది. తమ వ్యవసాయక్షేత్రం లో వరి, పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న, సజ్జ, సో యా పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తూ మగవారికి తానేమీ తీసిపోనని నిరూపించింది. కొ డుకు లింబాద్రిని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదివిస్తుండగా, కూతురు లక్ష్మిని ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదివిస్తోంది. కుటుంబ భారాన్ని మోస్తూనే వ్యవసాయాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న మహిళా రైతు తీగెల లక్ష్మి ఎంతో మందికి స్పూర్థిగా నిలుస్తున్నారు. కష్టాలను అధిగమిస్తేనే జీవితం ముందుకు సాగుతుందని నిరూపిస్తోంది. కష్టాలకు ఎదురొడ్డి సాక్షి, కామారెడ్డి: భర్త మరణం ఆమెను కుంగదీసినా, కన్నీళ్లను అదిమిపట్టుకుని పిల్లల కోసం బతుకుపోరాటం మొదలుపెట్టింది. తనకిష్టమైన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వ్యవసాయంలో మగవాళ్లకు దీటుగా ఆమె పనులు చేస్తోంది. తాను ఒడ్లు చెక్కుకోవడం, పంటలకు ఎరువులు చల్లం, నాట్లు, కలుపు తీయడం.. ఇలా అన్ని పనులు ఒంటి చేత్తో చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏ ఆస్తిపాస్తులు లేని రాజమణి రెక్కల కష్టం మీదనే పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసింది. ఓ కూతురి పెళ్లి చేసిన రాజమణి, చిన్న కూతురి పెళ్లి కోసం ఆరాటపడుతోంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటూ గ్రామస్తుల అభినందనలు పొందుతోంది కామారెడ్డి మండలం అడ్లూర్కు చెందిన రాజమణి. ‘నా పేరు కోమటిపల్లి రాజమణి. మా అవ్వగారు ఊరు కామారెడ్డి మండలం గూడెం. నాకు అడ్లూర్కు చెందిన లింగంతో ఇరువై రెండేండ్ల కిందట పెండ్లి అయ్యింది. ఇద్దరు బిడ్డెలు. చిన్న బిడ్డె పద్మ పదిహేను నెలల పిల్ల. పెద్దది పుష్పకు మూడేండ్లు అనుకుంట. మా ఆయనకు గుండెనొప్పి అచ్చి సచ్చిపోయిండు. అప్పటిదాకా ఇద్దరాలుమొగళ్లం కైకిలుగంబలి చేసుకుని బతికెటోళ్లం. ఇద్దరం కష్టపడితే ఇల్లు నడుస్తుండే. ఆయన పోయినంక నాకు కష్టాలు పెరిగినయి. చంటి పిల్లలతో ఎట్ల బతకాలె అని ఎంతో మదనపడ్డ. నాకు ఎవుసం పని అంటే ఎంతో ఇష్టం. ఎవుసం పనికి కైకిలుకు పోయేదాన్ని. కొంతకాలం అట్లనే బతికిన. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవల భూమి అన్న పాలుకు తీసుకుని సొంతంగా పంట పండించాలనుకున్న. పట్నంల ఉంటున్న మా ఊరి పటేండ్ల భూమిని అడిగితే వాళ్లు ఇచ్చిండ్రు. నాలుగెకరాలు ఉంటది. ఒక పాలు వాళ్లకు, రెండు పాళ్లు నాకు. రాత్రింబవళ్లు కష్టపడుకుంట వానకాలం, యాసంగి పంటలు తీస్తున్న. ఒక పంట దెబ్బతిన్నా, రెండో పంట మంచిగ పండేది. పిల్లలను నాతోటి అయిన కాడికి సదిపిచ్చి న. పెద్దమ్మాయి పుష్ప ఇంటర్దాకా సదివింది. సంబంధం చూసి పెండ్లి జేసిన. ఆమెకు ఇద్దరు పిల్లలు. చిన్నబిడ్డె పద్మ ఇప్పుడు డిగ్రీ సదువుతుంది. బిడ్డె పెళ్లి చేయాలంటే ఐదారు లక్షలు రూపాలు ఖర్చయితున్నయి. ఒక్కదాన్నే అన్ని పనులు జేయాలె. నా బిడ్డె గూడ సెలవు దినాలల్ల నాకు సాయంగా నాతోని పొలం కాడికి అస్తున్నది. ఆమెకు లగ్గం చేసి ఓ అయ్య చేతిల పెడితే నాకు ఎంతన్న తిరం అయితది. మొగోని కష్టమంతా జేస్కుంట అస్తున్న. నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. ఒక చిన్న రూము ఉన్నది. అండ్లనే ఉంట. సొంతంగా గంటెడు భూమి గూడ లేదు. సర్కారోళ్లు ఎవుసం జేసుకునేందుకు ఇంత భూమి ఇస్తే మంచిగుండని మస్తు సార్ల దరకాస్తు బెట్టిన. కాని మా ఊళ్లె భూమి దొరకలేదని ఇస్తలేరు. యాడ భూమి దొర్కలేదు. ఇగ లాభం లేదని, పాలుకు వట్టుకుని జేస్కుంటున్న’అని తన జీవన గమనాన్ని వెలిబుచ్చింది. -
సాగులో సిరులు పండిస్తున్నారు
తాగుడుకు బానిసై ఒకరు.. విద్యుదాఘాతానికి గురై మరొకరు.. మనస్తాపంతో ఇంకొకరు..! ఇలా వేర్వేరు కారణాలతో ఇంటి యజమానులు కుటుంబాన్ని వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆశయం.. పలువురు మహిళలను ముందుకు నడిపించింది. కన్నీళ్లను దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి వారు సాగుబాట పట్టారు. భూమాతను నమ్ముకుని వ్యవసాయ రంగంలో మేము సైతం అంటూ దూసుకెళ్తున్నారు.. పిల్లలను చక్కగా చదివిస్తూ.. పెళ్లిళ్లు చేయిస్తూ.. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు మహిళా రైతుల విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం. శభాష్ లత భీమదేవరపల్లి(హుస్నాబాద్): ఆమె నాగలి దున్నుతోంది.. గొర్రు కొడుతోంది.. పురుషులతో సమానంగా ప్రతి వ్యవసాయ పనిని చేస్తోంది.. ఏడుగురు ఆడపిల్లలున్న కుటుం బంలో ఒక్కతే పలుగు, పార పట్టింది.. తండ్రి, భర్త మరణించినా.. మనోధైర్యంతో కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది.. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు పాటిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలు స్తోంది ఓ మహిళా రైతు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన తోట రాజయ్య–రాజమ్మ దంపతులకు ఏడుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి నాలుగెకరాల భూమి ఉంది. అయితే రాజయ్య ఆరో కూతురు లత తనకు ఏడేళ్ల వయస్సు నుంచే తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేది. కాగా, రాజయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఐదుగురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. 14 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మంచం పట్టాడు. అప్పటినుంచి లత వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించింది. తండ్రి కుదుట పడేందుకు పలు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆయన 2004లో మృతి చెందాడు. తండ్రి మరణంతో లత జీవితం పూర్తిగా వ్యవసాయానికే అంకితమైంది. ఆ సమయంలోనే నాగలి దున్నడం, గొర్రు కొట్టడం తదితర పనులు నేర్చుకుంది. అప్పటి నుంచే ఇంటికి పెద్ద దిక్కుగా మారి ఆర్థిక వ్యవహారాలన్ని కూడా ఆమె చూసుకునేది. అక్క, బావలను పండుగలకు ఆహ్వానించడం, శుభకార్యాలు నిర్వహిస్తూ ఉండేది. వివాహం.. ఇంటికి మగ దిక్కు ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్కు చెందిన సంపత్తో గత 8 ఏళ్ల క్రితం లతకు వివాహమైంది. ఈ సందర్భంగా సంపత్ను ఇల్లరికం తీసుకొచ్చారు. కొద్దికాలాని కి కుమారుడు అవినాష్ జన్మించాడు. అయితే ఆర్థిక ఇబ్భందుల కారణంగా భర్త సంపత్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ వైపు తండ్రి, మరో వైపు భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన లత కొన్ని రోజులకు గుండె ధైర్యం తెచ్చుకుని ముందుకుసాగింది. చెల్లి, అమ్మ, కుమారుడి పోషణకు తిరిగి వ్యవసాయ పనులు ప్రారంభించిం ది. కాగా, లత.. తల్లి రాజమ్మ కిడ్నీ వ్యాధితో అనారోగ్యబారిన పడగా ఆమెకు చికిత్స చేయించింది. ఆమె ఏడా ది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. లత తన చెల్లె మాధవిని పీజీతో పాటుగా బీఈడీ పూర్తి చేయించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఆమెకు డీఎస్సీ కోచింగ్ ఇప్పిస్తోంది. ఉన్న ఎకరంలో వరి, మరో ఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తూనే మూడు పాడి గేదెలను పెంచుతూ జీవిస్తుంది. కష్టపడి పని చేస్తా.. నన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నా. చెల్లెలు మాధవికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. తర్వాత నా కుమారుడు అవినాష్ను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తా. ప్రభుత్వం నాకు ఏదైనా సాయం అందించాలి. –తోట లత సలాం.. శకుంతల ఏటూరునాగారం: తాగుడుకు బానిసై భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఓ మహిళ తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. భూమాతను నమ్ముకుని అహర్నిషలు శ్రమిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తోంది. అందుబాటులో ఉన్న వనరులతో పిల్లలను మంచిగా చదివిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్కు చెందిన గగ్గూరి రాంబాబు, శకుంతల దంపతులకు లక్ష్మీకాంత, స్వప్న, తిరుపతమ్మ, సంధ్యారాణి నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరికి మూడెకరాల భూమి ఉంది. అయితే నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్న సమయంలో రాంబాబు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శకుంతల గుండెలవిసేలా రోదించింది. చిన్న పిల్లలను పట్టుకుని కాలం ఎలా వెళ్లతీయాలని లోలోపల కుమిలిపోతుండేది. అయితే కళ్ల ముందే కనిపిస్తున్న కూతుర్లకు మంచి భవిష్యత్ కల్పించాలంటే తాను ఏదైనా పనులు చేయాలని భావించింది. దీంతో 15 ఏళ్ల క్రితం వ్యవసాయరంగంలోకి దిగింది. సాగుపనులను నిర్విరామంగా చేస్తూ దూసుకుపోతోంది. తనకున్న 3 ఎకరాల్లో వరి, మిరప పంటలను పండిస్తూ పిల్లలను చదివిస్తోంది. కాగా, పెద్ద కూతురు లక్ష్మీకాంతను పదో తరగతి వరకు చదివించి 2012లో వివాహం చేసింది. రెండో కూతురు స్వప్నను ఇంటర్ వరకు చదివించి 2014లో, మూడో కూతురు తిరుపతమ్మను ఇంటర్ వరకు చదివించి 2016లో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం నాలుగో కుమార్తె సంధ్యారాణి వరంగల్లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిస్తోంది. శకుంతల వరి, మిరప పంటలను సాగు చేసేందుకు మహిళా సంఘాల వద్ద, అడ్తి వ్యాపారస్తులు, బ్యాంకులో నుంచి ఏటా రుణం తీసుకుంటుంది. ఇంటిపెద్ద లేకపోయినా నలుగురు ఆడపిల్లలను చదివించి పెద్దచేసి శకుంతల తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. భళా.. భాగ్యలక్ష్మి పరకాల రూరల్: చిన్న కుటుంబం, ఇద్దరు కూతుర్లు, భర్తతో సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో విధి ఆమెపై విషం చిమ్మింది. వ్యవసాయ పనులు చేస్తూ హాయిగా కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కరెంట్ కాటేసి మంచానికి పరిమితం చేసింది. అయితే తమకున్న ఆస్తుల్లో కొంత అమ్ముకుని భర్తకు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నాలుగేళ్లు నరకయాతన అనుభవించిన ఇంటి యజమాని కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. గుండెను రాయి చేసుకుని ఓ మాతృమూర్తి పిల్లల భవిష్యత్కు బాటలు వేస్తోంది. పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన ఎల్లస్వామితో భాగ్యలక్ష్మీకి 1997లో వివాహమైంది. అనంతరం వీరికి ఇద్దరు కూతుర్లు రాఘవి, రవళి జన్మించారు. అయితే తనకున్న రెండెకరాల పది గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుం టూ భార్య, పిల్లలను పోషించుకుంటున్న క్రమంలో ఎల్లస్వామి 2007 ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భాగ్యలక్ష్మి తన భర్తను బాగు చేసుకునేందుకు ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 2011లో ఎల్లస్వామి మృతి చెందాడు. భూమాతను నమ్ముకుని.. ఎల్లస్వామి చనిపోయిన సమయంలో పెద్ద కూతురు రాఘవికి 9 ఏళ్లు, చిన్న కూతురుకి రవళికి 3 ఏళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబ బాధ్యతలను భాగ్యలక్ష్మి తన భుజాలపై వేసుకుని ముందుకుసాగింది. ఉన్న భూమిలో ఏటా పత్తి, వరిని పండిస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ప్రస్తుతం పెద్ద కూతురు కస్తూర్బా పాఠశాలలో తొమ్మిది, చిన్న కూతురు నాగారం ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భర్త చనిపోయినప్పుడు తీవ్రంగా కుం గిపోయానని, కూతుర్లలోనే భర్తను చూసుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇద్దరు పిల్లల ను విద్యావంతులను చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
మెదక్ జిల్లాలో విషాదం
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో రామాయంపేట్ మండలం విషాదం చోటు చేసుకుంది. కాట్రీయల్ గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. మహిళా రైతుల పొలానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అదే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపేటలో రాసమల్ల రాజేందర్(45) అనే రైతు పంట చేను వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా రైతులకు 30 శాతం నిధులు!
వ్యవసాయ పథకాల్లో కేటాయించాలని కేంద్రం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్హెచ్జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాల ని భావిస్తోంది. గతేడాది నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది. మహిళా రైతే కేంద్ర బిందువుగా వ్యవసాయ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ను అమలు చేయాలని స్పష్టంచేసింది. అప్పుడే వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకతలు పెరిగి ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేయవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని వ్యవసాయ ఉన్నతాధికారులను కోరింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో తగ్గుదల దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చినట్లు కేంద్రం తెలిపింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. భారతదేశం సహా పలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ మహిళ భాగస్వా మ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు దేశంలో గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పురుషులు, మహిళల సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో పని చేసే పురుషుల సంఖ్య 81 శాతం నుంచి 63 శాతానికి తగ్గగా, మహిళల సంఖ్య 88 శాతం నుంచి 79 శాతానికి తగ్గిందని జాతీయ సర్వేలో వెల్లడైనట్లు కేంద్రం వివరించింది. సాపేక్షికంగా ఇప్పటికీ వ్యవసాయంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉందని తెలిపింది. అందువల్ల వ్యవసాయ పథకాల బడ్జెట్లలో 30 శాతం మహిళా రైతులకు కేటాయించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని స్పష్టంచేసింది. మహిళా రైతులదే కీలక పాత్ర వ్యవసాయ రంగంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగు మొదలు కోత వరకు పంటలకు అవస రమైన అన్ని పనుల్లో ఉంటున్నారు. పశువులు కాయడం, గడ్డి సేకరించడం, కోళ్ల పెంపకం, డెయిరీ నిర్వహణ ఇలా బహుళ రకాల వ్యవసాయ అనుబంధ పనుల్లోనూ కీలకంగా మారారు. కాని వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. పురుషుల కంటే వారితో ఎక్కువ పని చేయించి తక్కువ కూలీ ఇవ్వడం సర్వ సాధారణమైంది. ఈ పరిస్థితి మారాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాల్లో మహిళా రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించింది. -
కరువును తరిమిన మహిళలు
♦ సేంద్రియ మిశ్రమ పంటల సాగుతో మరాఠ్వాడా మహిళా రైతుల స్వావలంబన ♦ కరువును ఎదిరించి గెలిచిన మహిళా రైతులు ♦ ఐక్యరాజ్య సమితి ఈక్వేటర్ పురస్కారానికి ఎంపిక రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏదో ఒకటే పంటను సాగు చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఎడతెగని సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చేస్తున్నది వ్యవసాయమే అయినప్పటికీ ఇంట్లోకి కూరగాయలు, పప్పులు కూడా కొనుక్కొని తినాల్సిన దుస్థితి. వెరసి పేదరికం, పౌష్టికాహార లోపం కుటుంబాలను కుంగదీస్తూ ఉంటుంది. ఇక రైతు ఆత్మహత్య పాలైన కుటుంబాల్లో కుటుంబ పోషణతోపాటు వ్యవసాయ బాధ్యతలు కూడా మహిళలపైనే పడుతోంది. మహారాష్ట్ర మరట్వాడా ప్రాంత మహిళా రైతులు పుణేకు చెందిన స్వయం శిక్షణ ప్రయోగ్ (ఎస్ఎస్పీ) సంస్థ తోడ్పాటుతో ఆర్థిక, పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మిశ్రమ పంటల సాగుతో పౌష్టికాహర, ఆదాయ భద్రతను సాధిస్తున్నారు. అంతేకాదు.. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యు.ఎన్.డి.పి.) ఇచ్చే ప్రతిష్టాత్మక ఈక్వేటర్ పురస్కారాన్ని గెల్చుకున్నారు... కరువు దెబ్బకు వందల మంది రైతులు ప్రాణాలొదిన నేల మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతం అది. స్వయం శిక్షణ్ ప్రయోగ్ (ఎస్ఎస్పీ) సంస్థ సహకారంతో అదే కరువు భూమిలో సేంద్రియ సాగు చేపట్టిన సామాన్య మహిళలు ఆహార స్వావలంబన సాధించారు. కరువు లోనూ కుటుంబాలకు ఆహార భద్రత, ఆదాయ భద్రతను సాధించటమే లక్ష్యంగా ఎస్ఎస్పీ ఎకరా నమూనా విధానాన్ని రూపొందించింది. 2009లో తొలిసారిగా మరట్వాడా ప్రాంతంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అప్పటి వరకు.. అక్కడి రైతులు లాభార్జనే ధ్యేయంగా వాణిజ్య పంటలను సాగు చేసేవారు. కానీ ఎకరం నమూనా పద్ధతిలో మాత్రం కుటుంబ అవసరాలకే పెద్దపీట. మరట్వాడా ప్రాంతంలో వరుసగా తీవ్ర కరువు తాండవించడం, రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పత్తి వంటి ఏక పంటలను సాగు చేయడం అలవాటు. దీంతో, అప్పులపాలై ఏటా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరెన్నో రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దీన స్థితిలో ఉన్నాయి. సంక్షోభ పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతు కుటుంబాల్లో బరువు బాధ్యతలన్నీ మహిళల నెత్తినే పడతాయి. అలాంటి కుటుంబాలలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి, స్వల్ప ఖర్చుతో చేసే సేంద్రియ సేద్యం వైపు దృష్టి మళ్లించింది ఎస్ఎస్పీ సంస్థ. మగవాళ్లయితే అధికాదాయం ఆశతో అధిక అప్పులు చేసి వాణిజ్య పంటలను సాగు చేసేవారు. కానీ మíßళలకు తమ ఇంటి పోషకాహార అవసరాలపై అవగాహన ఉంటుంది. అందుకే ఎస్ఎస్పీ మహిళలను దృష్టిలో ఉంచుకొని ఎకరం నమూనా సేంద్రియ సేద్య పథకానికి రూపకల్పన చేసింది. రసాయన ఎరువులకు బదులు జీవన, సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఖర్చు తగ్గింది. సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు బిందు, తుంపర సేద్యాన్ని అనుసరించారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిని కూడా పరిచయం చేశారు. నీటికుంటలు, బోరు బావుల రీచార్జి వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. కరువు కాలంలోనూ ఎకరా నమూనా పద్ధతిలో మిశ్రమపంటలను సాగు చేయటంతో కుటుంబాలకు పోషకాహారం లభ్యమయింది. మరోవైపు భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చి నికరాదాయం పెరిగింది. ఇప్పుడు 600 గ్రామాల్లోని మహిళలు ఎకరా నమూనా పద్ధతిలో సాగు చేస్తున్నారు. వారు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు 5,500 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. 20 వేల మంది మహిళా రైతుల జీవితాల్లో ఎకరం నమూనా పద్ధతి కొత్త వెలుగులు నింపింది. కరువు ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపి) ఏటేటా ఇచ్చే ‘ఈక్వేటర్’ పురస్కారానికి ఎస్ఎస్పీ ఎంపికైంది. సెప్టెంబర్లో న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 72వ సర్వసభ్య సమావేశాల్లో ఈ పురస్కారాన్ని ఎస్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమ గోపాలన్ అందుకుంటారు. సేంద్రియ సేద్యంతో ఆహార, ఆదాయ భద్రత సుస్థిర వ్యవసాయం, ప్రపంచ ఆహార భద్రత కోసం పాటుపడుతున్న మాకు యూఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో 5 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మా ఎస్.ఎస్.పి. బృంద సభ్యులు, గ్రామీణ మహిళా రైతులు అందరం ఆశ్చర్యానికి లోనయ్యాం. కరువు పీడిత మరట్వాడా ప్రాంతంలో పేద రైతు కుటుంబాలకు చెందిన 20 వేల మందికి పైగా మహిళా రైతులు కరువును తట్టుకునే ఒక ఎకరం వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకపోవడం, కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకోగలగడంతో వీరంతా సంతోషంగా ఉన్నారు. ఏయే పంటలు వేయాలి? ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా అమ్మాలి? కరువును తట్టుకునే వ్యవసాయం ఎలా చేయాలి? అనే విషయాలపై మహిళలే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. మహిళలను రైతులుగా గుర్తిస్తే.. సేంద్రియ సేద్యం ద్వారా ఆహార, ఆదాయ భద్రతను సాధించడం సాధ్యమేనన్న విషయాన్ని ప్రభుత్వాలకు నచ్చజెప్పి, విధానాల్లో మార్పు తేవడానికి ఈక్వేటర్ ప్రైజ్ మాకు కొత్త శక్తినిచ్చింది. – ప్రేమ గోపాలన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్వయం శిక్షణ్ ప్రయోగ్, పుణే, మహారాష్ట్ర www. sspindia,org, sspindia1@gmail.com మా కాళ్ల మీద మేం నిలబడ్డాం.. ఎకరా భూమిలో సేంద్రియ పద్ధతుల్లో అనేక పంటలను కలిపి సాగు చేయడం నేర్చు కున్నా. నా భర్తకు సుగర్, అధిక రక్తపోటు సమ స్యలున్నాయి. అందుకే మా కుటుంబానికి మంచి పౌష్టికాహారం కోసం సేంద్రియ సేద్యం చేస్తున్నా. 3 ఎకరాల్లో 15 రకాల పంటలను సాగుచేస్తున్నా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పంటల దిగుబడి 3 రెట్లు పెరిగింది. ఖర్చు పోను ఎకరాకు రూ. 18 వేల ఆదాయం వస్తోంది. మా కాళ్ల మీద మేం నిలబడ్డాం. నా కూతుళ్లను పీజీ దాకా చదివిస్తా. – వనితా బల్బీమ్ మనిషెట్టి, సేంద్రియ మహిళా రైతు, చివ్రి, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర ఆరోగ్యం, ఆదాయం మా సొంతం! ఎస్ఎస్పీ శిక్షణ పొందిన తర్వాత మా గ్రామంలో 16 మంది మహిళలం ఒక సంఘంగా ఏర్పడ్డాం. విత్తన ఎంపిక, మిశ్రమ పంటల సాగు, సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి పలు అంశాలపై మాకు శిక్షణ ఇచ్చారు. గోధుమ, సోయాబీన్, జొన్న, పెసర, టమాటా, పచ్చిమిర్చి వంటì మిశ్రమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. సాగు ఖర్చు తగ్గటంతో పాటు కుటుంబానికి ఆరోగ్యకరమైన పౌష్టిహారం లభిస్తోంది. నేను తెలుసుకున్న విషయాల గురించి నా తోటి మహిళలకు చెపుతున్నాను. వ్యక్తులు మారినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. – రాజశ్రీ మనే, సేంద్రియ మహిళా రైతు, అన్సుర్దా, ఉస్మానాబాద్ జిల్లా, మహారాష్ట్ర మా జీవితాలు మారిపోయాయి! మొదట్లో మా గ్రామం అంతా రసాయన సేద్యం చేసేవాళ్లం. ఎరువులు పురుగుమందుల కొనుగోలుకు చాలా డబ్బు ఖర్చయ్యేది. 2013లో ఎస్ఎస్పీ శిక్షణకు హాజరయ్యా. నాకు ఒక ఆవు, ఎకరా భూమి ఉంది. సేంద్రియ ఆవాలు, కూరగాయలు, ఉల్లి, గోధుమ పంటలను సాగు చేస్తున్నాం. పంచగవ్య, సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని వాడతాం. మేం తినగా మిగిలిన కూరగాయలు, పంచగవ్య అమ్ముతున్నాను. నెలకు రూ. 9 వేలు సంపాదిస్తున్నా. – షీలాదేవి, సేంద్రియ మహిళా రైతు, గోడియారి, దర్బంగ జిల్లా, మహారాష్ట్ర – సాగుబడి డెస్క్. -
వాట్సాప్లో వాతావరణ సమాచారం
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా రైతులకు వాతావరణ సమాచారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవ పథకం (జీకేఎంఎస్) ద్వారా ప్రణాళిక రచించింది. దీనిపై వర్సిటీలో బుధవారం వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సామాజిక మా ధ్యమాలను వాడుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. ఇప్పటికే స్వయం సేవా సంఘాల ద్వారా మహిళా రైతులు వాట్సాప్ గ్రూపులుగా సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దాన్ని మరింత విస్తృతపరిచాలనేది వ్యవసాయ శాఖ ఉద్దేశం. -
తెలంగాణలో రైతుల విత్తన దీక్ష
-
విత్తన దీక్ష
పోలీసు పహారా మధ్య పంపిణీ.. రాత్రంతా కేంద్రాల వద్దే జాగరణ ఓచోట చలిమంట వేసుకొని నిద్ర కాస్తున్నారు.. ఇంకోచోట అక్కడే నిద్రపోతున్నారు.. మరోచోట ఇలా బారులు తీరి కనిపిస్తున్నారు.. అవును వీరంతా రైతులు! గింజ దశ నుంచే కష్టాలను కావలించుకొని ‘విత్తన దీక్ష’ చేస్తున్న కష్టజీవులు!! కామారెడ్డి జిల్లాలోని పలు విత్తన విక్రయ కేంద్రాల ముందు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ శనగ విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: రబీలో శనగ విత్తనాల కోసం రైతాంగం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో విత్తనాల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా బారులుదీరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో శనగ విత్తనాలకు భారీగా డిమాండ్ ఉంది. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో శనగ విత్తనాల కోసం భారీగా రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జుక్కల్, మద్నూర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మద్నూర్ మండల కేంద్రంలో విత్తనకేంద్రం వద్దే శుక్రవారంరాత్రి రైతులు పడిగాపులు కాశారు. కొందరు చలి మంట వేసుకొని నిద్ర కాస్తే.. ఇంకొందరు అక్కడే నిద్రించారు. మహిళారైతులు సైతం విత్తనాల కోసం కేంద్రాల వద్దకు వచ్చారు. బహిరంగ మార్కెట్లో శనగ విత్తనాలు క్విం టాలు రూ.13 వేలు ధర పలుకుతోంది. ప్రభుత్వం 39 శాతం రాయితీపై అందిస్తోంది. దీంతో రైతులు ఇలా విత్తన పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కో పాస్బుక్పై రెండు బ్యాగుల విత్తనాలే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు ఎకరాలభూమి ఉందని చెబుతున్నా, రెండు ఎకరాలకే సరిపడా విత్తన బ్యాగులు ఇస్తుండడంతో సగం భూమి అలికి, మిగిలిన సగం విత్తనాల కోసం బహిరంగ మార్కెట్ను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో కొందరు రైతులకు దళారులు ఆశపెట్టి వారి పాస్బుక్లపై విత్తనాలు తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తానూరులో పోలీసు బందోబస్తు మధ్య.. తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం శనగ విత్తనాల పంపిణీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే బారులుదీరి గంటల తరబడి నిరీక్షించారు. విత్తనాలు అందక కొందరు నిరాశతో వెనుదిరిగారు. విత్తనాలు అవసరం లేని ఇక్కడి రైతులు కొందరు మహా రాష్ట్రలోని తమ సంబంధీకులకు పట్టా పుస్తకాలు ఇస్తున్నారు. దీంతో వారు ఇక్కడికి వచ్చి సబ్సిడీ విత్తనాలు పొందుతున్నారు. మరి కొం దరు ఇక్కడ సబ్సిడీపై రూ.1,600కు పొం దిన విత్తనాలను మహారాష్ట్ర రైతులకు రూ.2,200కు అమ్ముకుంటున్నారు. దీంతో సరిహద్దులో అధి కారులు, పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అక్రమంగా తరలిస్తున్న 22 సబ్సిడీ శనగ విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరమ్మ(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
పొలంలో నీళ్ల కోసం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ మహిళా రైతు కరెంటు షాక్ తో మృతి చెందింది. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా కడెం మండలం పాతకొండుకూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పుల భూమక్క(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అయితే.. స్విచ్ వద్ద విద్యుత్ ప్రసారం కావడంతో.. ఆమె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా రైతు ఆత్మహ త్య
అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారపిన్ని కాసులమ్మ(45) తనకున్న 90 సెంట్ల(ఎకరానికి కొంచె తక్కువ) భూమిలో కూరగాయాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు 10లక్షల వరకూ పెరిగి పోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను అనకాపల్లి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. -
మహిళా రైతు ఆత్మహత్య
కమలాపూర్ మండలం గోపాల్పూర్లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. కౌలుకు తీసుకున్న పొలంలో పంట సరిగా పండక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. -
మిత్రపురుగులతో తెల్లదోమకు చెక్!
పంటలను కాపాడిన మహిళా రైతుల నైపుణ్యం పంజాబ్లోని భటిండా ప్రాంతానికి చెందిన పత్తి రైతులను తెల్లదోమ ఈ ఏడాది తీవ్రంగా నష్టపరిచింది. వేలాది ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకు పోవడంతో రైతులు కుదేలయ్యారు. 200 మందికి పైగా పంజాబ్ పత్తి రైతులు ఆత్మహత్యల పాలయ్యారంటే తెల్లదోమ దెబ్బ ఎంత విధ్వంసకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవచ్చు. శక్తివంతమైన రసాయనిక పురుగుమందులకూ తెల్లదోమ లొంగలేదు. తెల్లదోమ నష్టానికి గురైన ప్రతి ఎకరానికి రూ. 50 వేల మేరకు పరిహారం ఇవ్వాలంటూ పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు.. అయితే.. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నప్పటికీ తెల్లదోమ దెబ్బకు తల్లడిల్లని కొన్ని గ్రామాలు వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. హర్యానా లోని జింద్ జిల్లాలో నిధానా, లలిత్ ఖేరా అనేవి చిన్న గ్రామాలు. అక్కడి రైతులకు తెల్లదోమ అసలు సమస్య కానే కాదు. రసాయనిక పురుగుమందుల పిచికారీని చాలా ఏళ్ల క్రితమే నిలిపివే సి.. వాటికి బదులు మిత్ర పురుగులను ఉపయోగిస్తుండడమే ఇందుకు కారణం. తెల్లదోమకు సహజ శత్రువులైన కీటకాలను ఇళ్ల దగ్గర పెంచి, పొలాల్లో వదలటం ద్వారా తె ల్లదోమను కట్టడి చేయగలుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి రైతులు మిత్రపురుగులతో స్నేహం చేసే కళను గత కొన్నేళ్లుగా ఒంటబట్టించుకున్నారు. హర్యానాలోని సిర్సా జిల్లాలో 70, భీవానిలో 10 ఎకరాల్లో, రోహ్తక్ జిల్లాలోని 10 ఎకరాల్లో, పంజాబ్లోని మన్సా జిల్లాలో 62 ఎకరాల్లో, భటిండా జిల్లాలోని మరికొందరు రైతులు కూడా రసాయన రహిత పద్ధతుల్లో రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఈ ప్రాంతంలో మిత్రపురుగుల వినియోగం పెరగడానికి కీ. శే. సురేంద్ర దలాల్ కృషే కారణం. ఆయన హర్యానా వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేశారు. 150 మంది రైతులకు అప్పట్లో ఆయన సమగ్ర శిక్షణ నిచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళా రైతులే. శత్రుపురుగులను గుర్తించటం, వాటిపై మిత్ర కీటకాలను ప్రయోగించటంలో వీరు సుశిక్షితులయ్యారు. కొంచెం చదువునేర్చిన మహిళలు, నిరక్షరాస్య మహిళా రైతులు సైతం తెల్లదోమను నియంత్రించటంలో పైచేయి సాధించారు. జాతీయ సమీకృత చీడపీడల నివారణ సంస్థ (న్యూఢిల్లీ) ఈ పద్ధతులను పరిశీలించి ఆమోద ముద్ర వేసింది కూడా. ఈ నిధాన ప్రాంతంలో రైతులు అనుసరిస్తున్న నమూనాని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని జిస్టిస్ ఎస్. ఎన్. అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. స్థానికంగా ఇనో, ఈరో అని పిలిచే రెండు కీటకాలను వారు తెల్లదోమపైకి ప్రయోగించి మట్టుబెడుతున్నారు. ఈ పద్ధతినే ఇక్కడి రైతులందరూ అనుసరిస్తున్నారు. ఒక్క మిత్ర పురుగు 100 శత్రు కీటకాలను మట్టుపెడుతుంది. ఈ మిత్ర కీటకాలు పంటకు హాని చేసే ఇతర కీటకాలను కూడా తినేస్తాయి. 170 రకాల కీటకాల గురించి ఇక్కడి మహిళా రైతులకు తెలుసు. ఈ ఒక్క విషయం చాలు ఇక్కడి మహిళా రైతుల నేర్పరితనం ఏపాటిదో అర్థం చేసుకోవటానికి అంటారు ప్రముఖ వ్యవసాయ రచయిత దేవిందర్ శర్మ. వీళ్ల దగ్గర్నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నేర్చుకునే ప్రయత్నం చేయకపోవటం సిగ్గుపడాల్సిన విషయమని అభివర్ణించారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
ముగ్గురు మహిళా రైతులు అరెస్ట్
నిజామాబాద్ : గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు ముగ్గురు గిరిజన మహిళా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... అటవీ శాఖ అధికారులు మంగళవారం రావుట్ల గ్రామంలో గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో పంటను నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అటవీ భూముల్లో కందకాలను తవ్వేందుకు అటవీ అధికారులు నాలుగు జేసీబీలతో ఈ రోజు గ్రామానికి చేరకున్నారు. పోలీసులు సహాయంతో వచ్చిన అటవీ అధికారులను గిరిజన మహిళా రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు ముగ్గురు మహిళా రైతులను అరెస్ట్ చేశారు. కాగా, భూములను పరిశీలించేందుకు వచ్చిన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తదితరులను గ్రామంలోనే అడ్డుకొని పీఎస్కు తరలించారు. పోలీసులు సహాయంతో అటవీ శాఖ అధికారులు కందకం తవ్వకాలను కొనసాగిస్తున్నారు. -
ఆశల సేద్యంలోనూ అవనిలో సగం!
సేంద్రియ పత్తిలో లాభదాయకంగా అంతరపంటల సాగు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళా రైతుల విజయగాథ మెట్ట సేద్యం అనగానే అప్పులు.. రైతులనగానే ఆత్మహత్యలు.. ఆత్మహత్యలనగానే పురుగుమందులు.. పత్తి పంట.. చటుక్కున మనసులో మెదలటం పరిపాటైపోయిన రోజులివి...! ‘ప్రాణాలు తీసే పంట’గా పేరు పడిన పత్తిని సేంద్రియ సాగు పద్ధతులతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతులు మచ్చిక చేసుకున్నారు! సేంద్రియ పత్తితోపాటు ఆహార పంటలనూ కలిపి పండిస్తూ.. ఆర్థిక భద్రతతోపాటు ఆరోగ్య భద్రతనూ పొందుతున్నారు. సంఘటిత స్ఫూర్తితో బతుకును పండించుకుంటున్నారు. అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగయ్యే కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైతే.. తెలంగాణలో అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లా ఆదిలాబాద్. ఈ జిల్లాలోని ఆదివాసీ మహిళా రైతులు పత్తి రైతులకు ఉరి పేనుతున్న సమస్యలను సంఘటిత శక్తితో అధిగమిస్తున్నారు. రైతుకు, భూమికి నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక సేద్యాన్ని, పొలమంతటా ఒకే (ఏక) పంటను పండించే పద్ధతిని, అన్నదాతల మధ్య అనైక్యతను.. మొక్కవోని సహకార స్ఫూర్తితో తుత్తునియలు చేస్తున్నారు. కెరమెరి మండలం చౌపన్గైడలో పదేళ్ల క్రితం ఈ సాగుకు అంకురార్పణ జరిగింది. సహకార సంఘాల ద్వారా ఏకమైన చిన్న, సన్నకారు ఆదివాసీ రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను క్రమంగా అలవర్చుకున్నారు. పత్తితోపాటే ఆహార పంటల సాగు దేశవాళీ (నాన్ బీటీ) పత్తి విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కషాయాలు వాడుతున్నారు. ఆదాయం కోసం పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తూనే.. పత్తి సాళ్ల మధ్యలో కుటుంబ పోషణకు ఉపయోగపడే కూరగాయ పంటలు పండించుకుంటున్నారు. 8 పత్తి సాళ్లకు ఒక సాలు చొప్పున కూరగాయలు, పప్పుదినుసులు సాగు చేస్తున్నారు. సగటున పొలంలో 25% విస్తీర్ణం మేరకు అంతరపంటలు, 75% వరకు పత్తి వేస్తున్నారు. తమ జీవనం కొనసాగించేందుకు భూమిపైనే ఆధారపడుతూ, ఆ భూమి నిస్సారమైపోకుండా, కోల్పోయిన సారాన్ని తిరిగి సమకూర్చుకునేందుకు ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే రసాయనిక వ్యవసాయం చేసే రైతులకన్నా ఎక్కువ దిగుబడితోపాటు, ఎక్కువ నికరాదాయాన్నీ పొందుతున్నారు. ‘చేతన’ గొడుగు కింద.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి పరిసర మండలాల్లో 423 మంది మహిళా ఆదివాసీ రైతులు దేశీ పత్తితోపాటు కూరగాయలు పండిస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ గొడుగు కింద ఉన్న 154 రైతు బృందాల్లో 2 వేలకు పైచిలుకు రైతులతోపాటు ఈ మహిళా రైతులు కలసి కట్టుగా కదులుతూ ఆదాయ భద్రతను పొందుతున్నారు. కలకత్తాకు చెందిన రాజ్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు ప్రతి ఏటా వీళ్ల దగ్గర సేంద్రియ పత్తిని కొనుగోలు చేస్తోంది. తొలుత నెదర్లాండ్ ఈటీపీ సంస్థ మూడేళ్ల పాటు తోడ్పడింది. 2007లో చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ రిజిస్టరైంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి సేంద్రియ పత్తి రైతు అయిన ఆత్రం కుసుంభరావు (94411 38 567) సారథ్యంలోనే అసోసియేషన్ నడుస్తోంది. ‘రైతులకు నాన్బీటీ పత్తి విత్తనాలు, సాగు సలహాలందించడంతోపాటు సేంద్రియ సర్టిఫికేషన్, మార్కెట్ సదుపాయం వరకు అసోసియేషనే చూసుకుంటుంద’ని ఫీల్డ్ సూపర్వైజర్ ఎస్. అంబాదాస్ (81797 60042) తెలిపారు. సగం ఖర్చుతోనే సేంద్రియ సాగు ఈ అసోసియేషన్ నేతల సమాచారం మేరకు.. కెరమెరి పరిసరాల్లో రసాయనిక వ్యవసాయంలో పత్తి సాగు చేసే రైతు ఎకరానికి ఏడాదికి రూ. 15-20 వేలు ఖర్చవుతుంటే.. సేంద్రియ పత్తి సాగుకు రూ. 5-10 వేలకు మించడం లేదు. ఈ ఏడాది తక్కువ వర్షం వల్ల ఎకరానికి 4, 5 క్వింటాళ్ల సేంద్రియ పత్తి దిగుబడి వచ్చింది. మామూలు పత్తి క్వింటాలుకు రూ.3,800-రూ. 4,000 ధర వచ్చింది. సేంద్రియ పత్తికి రూ. రూ. 4,200 వరకు వచ్చింది. కొన్న ప్రతి క్వింటాలో పత్తికి రూ. 300 చొప్పున అసోసియేషన్కు ప్రీమియంగా కంపెనీ చెల్లిస్తుంది. ఈ డబ్బుతో రైతులకు శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ మహిళా సేంద్రియ రైతు సిడాం భీంబాయి(కెరమెరి మండలం భీమన్గోంది) 2006లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బిర్లా సైన్స్ ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు. భీంబాయి బాటలో వందలాది మహిళా రైతులు నడుస్తుండటం విశేషం. బడుగు రైతులు ఏకతాటిపైకి వచ్చి సేంద్రియ సేద్యం చేపడితే బతుకు ఎలా బాగుపడుతుందో వీరిని చూస్తే అర్థమవుతుంది. - కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు..! నాకు ఆరెకరాల సాగు భూమి ఉంది. పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నా. దిగుబడి, ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం వర్షం తగ్గినా ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండింది. క్వింటాలోకు రూ. 4,200 ధర పలికింది. - కుర్సెంగ మారుబాయి, పెద్దసాకడ, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా ఎన్నడూ నష్టం రాలేదు! సేంద్రియ పంటను పదేళ్ల నుంచి చేస్తున్న. ఏ సంవత్సరం కూడా నష్టం జరగలేదు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్న. - సిడాం భీంబాయి, భీమన్గోంది, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా సేంద్రియ పంటకు అధిక ధర నాకు ఆరెకరాల భూమి ఉంది. చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న. ఏడేళ్లుగా పత్తి పండిస్తున్నా. ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండుతుంది. బయటి ధరకంటే సేంద్రియ పంటకు ధర అధికంగా ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 40 వేల నికరాదాయం వస్తోంది. - సోయం మారుబాయి, బాబేఝరి, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా పత్తిలో అంతర పంటలు.. నాన్ బీటీ పత్తి పంటలోనే కంది, పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, మొక్కజొన్న, మినుములు వంటి అంతర పంటలు వేస్తున్నాం. సేంద్రియ పంటల వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. - ఆత్రం సోంబాయి, ఢబోలి, జైనూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా -
బలవంతంగా తీసుకోలేరు: వైఎస్ జగన్
* ఏపీ రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా * మీ అంగీకారం ఉంటేనే భూ సమీకరణ జరుగుతుంది * లేకపోతే చంద్రబాబే కాదు.. వాళ్ల నాయన దిగివచ్చినా తీసుకోలేరు సాక్షి, హైదరాబాద్: ‘మీ అందరి అంగీకారం లేకుండా మీ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదు కదా, వాళ్ల నాయన దిగి వచ్చినా తీసుకోలేరు. మీ అంగీకారం ఉంటేనే అక్కడ రాజధాని కోసం భూ సమీకరణ జరుగుతుంది లేకుంటే లేదు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని ప్రాంత గ్రామాల రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రతి చర్యను తమ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుందని చెప్పారు. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. బాధిత రైతాంగానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. సారవంతమైన, అత్యంత విలువైన తమ భూములను వదులుకోవడానికి ఇష్టపడని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ కార్యాలయంలో జగన్ను కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూములు ఇవ్వబోమన్నందుకు రైతులను దొంగల మాదిరిగా పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. కొందరైతే తమ బాధలు వివరించేటప్పుడు కన్నీటిని ఆపుకోలేకపోయారు. సుమారు రెండు గంటల పాటు రైతులు చెప్పింది విన్న తర్వాత జగన్ మాట్లాడారు. రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. అసెంబ్లీలో సీఆర్డీఏ చట్టాన్ని చేసేటప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఒప్పుకుంటేనే వారి భూములను తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం.. పోలీసులతో బెదిరించడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య ఏమాత్రం లేని గ్రామాల్లోకి పోలీసులు అడుగు పెట్టాలంటే ఏదో ఒకసాకు కావాలని, ఆ సాకు కోసమే వాళ్లంతట వాళ్లే పొలాలను కాల్చేశారని చెప్పారు. పైగా రైతులను పోలీస్స్టేషన్లకు పిలిచి వారిని మానసిక క్షోభకు గురిచేయడమే కాకుండా, కొందరిపై చేయి కూడా చేసుకోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడాల్సిన ప్రభుత్వం వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలను కోవడం దారుణమన్నారు. ‘రాజధాని కోసం సేకరిస్తున్న 50 వేల ఎకరాలకు గాను 25 వేల ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, కనీస సదుపాయాల కల్పన చేస్తారట. మిగిలిన 25 వేల ఎకరాల్లో నుంచి రైతులకు పోను మిగిలిన 13 వేల ఎకరాల్లో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందట. ప్రభుత్వం చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?’ అంటూ ప్రశ్నించారు. ‘ప్రభుత్వం వాస్తవంగా చేయాల్సిందేమిటంటే.. ఫలానా ప్రాంతం రాజధానికి సంబంధించినదని నోటిఫై చేయాలి. దాని చుట్టూ రోడ్డు వేయాలి. రోడ్లు వేయడానికి కావాల్సిన మేరకు భూమిని తీసుకుంటే అభ్యంతరం లేదు. రోడ్లు వేశాక జోనింగ్ చేయాలి. ఫలానాది రెసిడెన్షియల్ (జనావాసం), ఫలానాది కమర్షియల్ (వాణిజ్యం) అంటూ జోనింగ్ చేసి వదలాలి. వ్యాపారం చేసుకోవాలనుకుంటే రైతులే ఆ పని చేసుకుంటారు. అలా కాకుండా రైతుల భూమితో చంద్రబాబు సింగపూర్తోనో మరొకరితోనో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేసుకోవాలి..’ అని నిలదీశారు. రైతుల భూములను లాక్కుని, వారికి కాస్తో, కూస్తో శనక్కాయలు (వేరుశనగలు), బెల్లం ఇచ్చినట్లుగా స్థలాన్ని ఇచ్చి, వారి భూములతో అధిక లాభాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం దిగుతోందని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదల్చుకుంటే సారవంతమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పుడు రాజధాని ప్రాంతంగా ప్రకటించిన చోటికి ఓ నాలుగడుగులు అటువైపు వినుకొండ ప్రాంతంలో కావాల్సినంత ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఉందని అక్కడ వారు ఇదే వ్యాపారం చేసుకోవచ్చని సూచిం చారు. పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, కె.పి.సారథి, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డీఏ సోమయాజులు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, మహ్మద్ ముస్తఫా, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, కోన రఘుపతి, నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, కరణం ధర్మశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘అధికారం ఉంది కదా అని చంద్రబాబు ఇష్టానుసారం చేస్తున్నారు. అయితే ఈ అధికారం దేవుడు అనుగ్రహిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు, అసలు నాలుగేళ్లు ఉంటుందో.. జ్యోతిష్కులంతా రెండేళ్లలోనే పడిపోతుందంటున్నారు. నాకైతే తెలియదు గానీ ఆయన ఏం చేసినా ఈ అధికారం పోయే లోపే. నేను ప్రతి రైతుకూ చెబుతున్నా... మీ అంగీకారం ఉంటేనే భూ సేకరణ జరుగుతుంది. బలవంతంగా ఏ కార్యక్రమం చేసినా కచ్చితంగా తిరగదోడి పునరుద్ధరిస్తాం. భూములపై మళ్లీ రైతులకు హక్కులు కల్పిస్తాం. ఈ విషయంలో న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉంటే అంతవరకు పోరాడుదాం. ఆ తర్వాత మాత్రం మీ కొడుకు, మీ మనవడు, మీ తమ్ముడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని, అందరికీ న్యాయం చేస్తాడనే సంగతి మాత్రం గుర్తుంచుకోండి..’ - రాజధాని రైతులతో వైఎస్ జగన్ -
రైతును ముంచిన అకాల వర్షం
మిరుదొడ్డి, న్యూస్లైన్: అకాల వర్షాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఇదే నెల మొదటి వారంలో రెండుసార్లు కురిసిన వడగళ్ల వానలకు పంటలను కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రైతన్న మరోమారు ఇబ్బందుల పాలయ్యారు. మిరుదొడ్డితోపాటు అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు 5 ఎకరాల్లో సాగు చేస్తున్న మునగ తోట నేల పాలైంది. దీంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. తనను ఆదుకోవాలంటూ బాధితుడు కనకయ్య అధికారులను కోరారు. మిరుదొడ్డి, జంగపల్లి, రుద్రారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లోని ధాన్యం కల్లాల వద్ద వర్షపు నీరు నిలిచి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వర్షపు నీటిని మహిళా రైతులు ఎత్తి పోశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
మహారాష్ట్రలో మహిళా రైతుల పర్యటన
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 23మంది మహిళా రైతులు ఇటీవల మహారాష్ట్రలో విజ్ఞాన యాత్రకు వెళ్లి వచ్చారు. వీరిలో ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా రైతులతో పాటు జిల్లాలోని పెద్దేముల్, ధారూరు, గండేడ్, చేవెళ్ల తదితర మండలాలకు చెందిన మరో 16 మంది మహిళా రైతులు ఉన్నారు. ఐదు రోజుల యాత్రలో మహారాష్ట్రలోని పలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుసుకోవడం విశేషం. యాత్ర మొదటి రోజున మహారాష్ట్రలో పూనే జిల్లాలోని బారామతి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి కృషి (కేవీకే) విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి అక్కడ చేపడుతున్న పలు కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రం ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ సచిన్ కలాడే ఆధ్వర్యంలో అక్కడి మట్టి పరీక్షా ల్యాబ్, మ్యూజియం, బయో ఫర్టిలైజర్, శారద మహిళా సంస్థ నిర్వహిస్తున్న మేకల పెంపకం యూనిట్ను, రైతుల కోసం నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియో స్టేషన్ను సందర్శించారు. ఆ తర్వాత కేవీకే నిర్వహిస్తున్న నర్సరీలో దానిమ్మ, సపోటా, జామ, చింత, చెరుకు పంటలను మహిళా రైతులు పరిశీలించారు. అక్కడే ఇజ్రాయిల్ పద్ధతిలో నిర్వహిస్తున్న డెయిరీని సందర్శించారు. పర్యావరణానికి ప్రతీకగా హజారే స్వగ్రామం రాలేగావ్సిద్ధి యాత్ర లో రెండో రోజు బారామతి సమీపంలోని షల్టాన్లో నారీ నీంబ్కర్ వ్యవసాయ పరిశోధనా సంస్థను సందర్శించారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆ తర్వాత రైతులు అక్కడే ఉన్న మేకలు, గొర్రెల పెంపకం క్షేత్రాన్ని సందర్శించారు. యాత్ర మూడో రోజున రైతులు అహ్మద్నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని సందర్శించారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్వగ్రామం ఇదే కావడం విశేషం. గ్రామాభివృద్ధికి అన్నా హజారే చేసిన కృషిని, కార్యక్రమాలను రైతులు పరిశీలించారు. పర్యావరణానికి ప్రతీకగా నిలిచిన ఈ గ్రామాన్ని చూసి రైతులు అచ్చెరువొందారు. మహిళా రైతులు అన్నా హజారేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి హజారే మాట్లాడుతూ గ్రామాల్లో వాటర్షెడ్లు నిర్మించుకోవాలని కోరారు. వర్షం చుక్కను సద్వినియోగం చేసుకున్నప్పుడే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రైతులకు హజారే సూచించారు. అనంతరం దేవ్రాలి ప్రవరా గ్రామంలో మందాతాయి చౌహాన్ అనే ఆదర్శ మహిళా రైతును కలుసుకున్నారు. ఐదుగురు పిల్లలు కలిగిన మందాతాయి తన భర్త చనిపోయినప్పటికీ అదైర్య పడకుండా తనకున్న 35 ఎకరాల భూమిని ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఎలా సాగు చేసింది వివరించింది. దీంతో ఆమె ద్వారా జిల్లా మహిళా రైతులు స్ఫూర్తి పొందారు. ఉత్సాహం నింపిన విజ్ఞాన యాత్ర యాత్ర నాలుగో రోజున రైతులు షిర్డీ సమీపంలోని బాబులేశ్వర్లోని కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ 600 స్వయం సహాయక సంఘాల నిర్వహణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై శిక్షణ నిస్తారు. స్వయం సహాయక సంఘాల కార్యక లాపాలకు సంబంధించి తాంబేర్, దేవ్రాలి ప్రవరా గ్రామాలను మహిళా రైతులు సందర్శించారు. యాత్ర చివరి రోజు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకొని రైతులు హైదరాబాద్కు తిరిగి రైలులో బయలుదేరారు. ఈ పర్యటనలో రైతుల వెంట రాజేంద్రనగర్ రైతు శిక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు కె. సునీత, వ్యవసాయాధికారి ఆర్. శ్రీలక్ష్మీ ఉన్నారు. ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడిందని, వ్యవసాయపరంగా ఎన్నో విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నామని మహిళా రైతులు తెలిపారు.