సాక్షి, అమరావతి: యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతన్నారని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి వాహనంపై.. పవన్ బూతులు, అబద్దాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాను చేసే ప్రతి పని వెనుక ఓ కథ ఉంటుంది.. కథలు చెప్పే కంత్రీ నాయకుడిగా పవన్ మారిపోయాడని ఎద్దేవా చేశారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్.. రాజకీయాలకు అనర్హుడని దుయ్యబట్టారు.
లోకేష్ యువగళానికి అసలు గళమే లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని.. ప్రజలు ఆయనపై విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అన్నీ వరాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. మళ్లీ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్నే వస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment