Germany
-
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..) -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
గాయాన్ని గంటల్లో మాన్పే మాయా చర్మం
అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం! ఎంతటి గాయాన్నయినా నాలుగే గంటల్లో 90 శాతం దాకా మాన్పుతుంది. 24 గంటల్లో పూర్తిగా నయం చేసేస్తుంది. వినడానికి ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలా అన్పిస్తున్నా అక్షరాలా నిజమిది. ఈ మాయా చర్మం అందుబాటులోకి వస్తే వైద్యచికిత్స కొత్తపుంతలు తొక్కడం ఖాయమని చెబుతున్నారు. అచ్చం చర్మాన్ని తలపించే కొత్త రకం హైడ్రోజెల్ను రూపొందించడంలో సైంటిస్టులు విజయవంతమయ్యారు. చర్మానికి ఉండే స్వీయచికిత్స సామర్థ్యాన్ని ఇది ఎన్నో రెట్లు పెంచుతుందట. ఫిన్లండ్లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. నిజానికి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవేవీ ఇప్పటిదాకా అంతగా విజయవంతం కాలేదు. చర్మం తాలూకు విలక్షణతే అందుకు కారణం. సాగే లక్షణం, దీర్ఘకాలిక మన్నిక, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మం సొంతం. వీటన్నింటినీ మించి గాయాలను తనకు తాను నయం చేసుకునే సాటిలేని సామర్థ్యం చర్మానికి ఉంది. ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మం రూపకల్పన ఇన్నేళ్లుగా సైంటిస్టులకు సవాలుగానే నిలిచింది. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ మాత్రం పూర్తిగా చర్మం లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన, తెగిన గాయాలపై ఈ జెల్ను అమరిస్తే వాటిని చిటికెలో నయం చేస్తుంది. తర్వాత దాన్ని తొలగించవచ్చు. లేదంటే క్రమంగా అదే కరిగిపోతుంది. ఇలా సాధించారు... అతి పలుచనైన నానోషీట్తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మం రూపకల్పన సాధ్యపడింది. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానోషీట్లతో చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్కు గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మంలాంటి హైడ్రోజెల్ రూపొందించింది. ‘‘అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం. హైడ్రోజెల్కు ఇది గట్టిదనం ఇవ్వడమే గాక గాయాల వంటివాటిని తనంత తానుగా నయం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కట్టబెట్టింది’’ అని అధ్యయన బృందం పేర్కొంది. ‘‘జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్నా స్వీయచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయి. సింథటిక్ హైడ్రోజెల్లో ఈ లక్షణాలను చొప్పించడం ఇప్పటిదాకా సవాలుగానే నిలిచింది. దాన్నిప్పుడు అధిగమించాం’’ అని వివరించింది. కృత్రిమ చర్మ పరిజ్ఞానంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ‘‘కాలిన, దీర్ఘకాలిక గాయాలను సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుంది. అంతేగాక వైద్య చికిత్సలోనే గాక ప్రోస్తటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంది’’ అని వివరించింది. మిల్లీమీటర్ మందంలోని జెల్లో దాదాపు 10 వేల నానోïÙట్లుంటాయి. ఫలితంగా దానికి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ జెల్ ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. వైద్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఐదేళ్లకు పైగా పట్టవచ్చు. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ మెటీరియల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఏమిటీ హైడ్రోజెల్ సింపుల్గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. దీన్ని పాలిమర్ తదితర మెటీరియల్స్తో తయారు చేస్తారు. వెంట్రుకల చికిత్స మొదలుకుని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్ను కూడా పరిశీలించారు. రీసెర్చ్కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం
ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన విజయ ప్రస్థానాన్ని జర్మనీ పాఠ్యాంశాల్లో భాగంగా చేశారు. విద్యార్ధుల్లో పర్యావరణంపై స్ఫూర్తి నింపేందుకు జర్మనీ ప్రభుత్వం శ్రీనిహాల్ పర్యావరణం కోసం చేస్తున్న కృషిని పాఠ్యాంశంగా మార్చి విద్యార్ధులకు బోధిస్తుంది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన శ్రీనిహాల్ మన తెలుగు వాడు కావటం నిజంగా యావత్ తెలుగుజాతి అంతా గర్వించదగ్గ విషయం. ఇప్పటికే శ్రీ నిహాల్ తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ కు అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టిపదేళ్ల ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీనిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించడమే గాక వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ-సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది..2019 లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 900 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు ఆరు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు నాలుగు కోట్ల మందికి బ్యాటరీల రీసైక్లింగ్పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. ఈ రోజు వరకూ తొమ్మిది వందల మంది విద్యార్థులు శ్రీ నిహాల్ తో చేతులు కలిపి ఈ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. 600,000 పైగా బ్యాటరీలను ఇప్పటివరకూ రీసైకిల్ చేసి 39 మిలియన్లకు పైగా ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఇంకా, శ్రీనిహాల్ ఇటీవలే స్కూల్ బ్యాటరీ ఛాలెంజ్ను ప్రారంభించాడు. ఇందులో ప్రతి పాఠశాలలోని తరగతులు ఒకదానితో ఒకటి పోటీపడి, ఎవరు ఎక్కువ బ్యాటరీలను రీసైకిల్ చేస్తారో ఆ తరగతి పిజ్జా పార్టీని గెలుచుకుంటుంది. ఇప్పటి వరకు ఛాలెంజ్ ద్వారా రెండు నెలల్లో, వారు మూడు పాఠశాలల నుండి 30,000 బ్యాటరీలను రీసైకిల్ చేశారు. నిహాల్ ఈ ఛాలెంజ్ని 30 పాఠశాలలకు విస్తరించాడు. మూడు లక్షల బ్యాటరీలను రీసైకిల్ చేయాలనే లక్ష్యంతో మొత్తం రీసైకిల్ చేయబడిన బ్యాటరీలను వన్ మిలియన్ అంటే పది లక్షలకు పెంచాడు.(చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
వైఫల్యం నుంచి చాన్స్లర్ దాకా..
జర్మనీకి కాబోయే చాన్స్లర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ పేరు జర్మనీ అంతటా మార్మోగిపోతోంది. న్యాయవాదిగా అపార అనుభవం గడించి ఆర్థిక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన మెర్జ్ చివరకు మళ్లీ రాజకీయాల్లో చేరి ఎట్టకేలకు చాన్స్లర్ పదవికి తాను సరైన వ్యక్తిని అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో ఆసక్తితో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) వైపు అడుగులు వేసిన మెర్జ్ తదనంతరకాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు. కానీ సిద్ధాంతపరమైన విభేదాలు ఆయనను పార్టీ వీడేలా చేశాయి. ఒక దశాబ్దంపాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ రాజకీయ గాలిసోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పగ్గాలు సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేశారు. ఒకానొక సమయంలో విఫల రాజకీయ నాయకుడిగా మీడియా ముద్రవేసింది. అయినాసరే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అలుపెరుగని పోరాటం చేసి ఎట్టకేలకు పార్టీ పగ్గాలను రెండేళ్ల క్రితం సాధించారు. కేవలం ఈ రెండేళ్లలోనే పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెట్టి తన రాజకీయ చతురతను చాటారు. అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్న మెర్జ్ రాజకీయ ఆటుపోట్ల ప్రయాణాన్నిఓసారి తరచిచూద్దాం. మిలియనీర్ కార్పొరేట్ లాయర్బడా వ్యాపార సంస్థల తరఫున కేసులు వాదించే సీనియర్ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న మెర్జ్ ఆకాలంలో కోట్ల రూపాయలు సంపాదించి మిలియనీర్గా అవతరించారు. 70వ దశకంలో సైనికుడిగా ఆ తర్వాత చాన్నాళ్లు న్యాయవాదిగా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించి సైనిక, న్యాయ, శాసన వ్యవస్థల్లో అపార అనుభవం గడించారు. మెర్జ్ 1972 నుంచి సీడీయూ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. 1989లో పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు. 1994లో హోచ్ సౌర్లాండ్ క్రీస్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టారు. సీడీయూలో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2000 సంవత్సరంలో పార్టీ పార్లమెంటరీ నేతగా ఎదిగారు. 2005 ఏడాది నుంచి ఆయన రాజకీయ పతనం మొదలైంది. సీడీయూ, సీఎస్యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తనకు సరైన పార్టీలో, ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గ్రహించారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఏంజెలా మెర్కల్తో పోటీపడి అలసిపోయారు. దీంతో చివరకు 2009లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పునరాగమనం ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2018లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఆ ఏడాది సీడీయూ నేతగా ఏంజెలా మెర్కల్ దిగిపోయారు. దీంతో తనకు రాజకీయ అవకాశాలు బలపడతాయని గ్రహించి మెర్జ్ మళ్లీ పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ పదవికి పోటీచేసి 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. దీంతో మీడియా ఈయనపై విఫలనేత ముద్రవేసింది. 2021లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. పార్టీలో కీలకనేతగా ఎదిగి చిట్టచివరకు 2022లో పార్టీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీ మూలాలు దెబ్బకొడతానని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యవహారాల్లో ఉత్తర అమెరికా దేశాలతో యూరప్ దేశాలు కలిసి మెలసి ఉండాలనే ‘అట్లాంటిక్ వాదం’ను మెర్జ్ మొదట్నుంచీ గట్టిగా వినిపంచేవారు. ఈ ఒక్క విషయంలో జర్మనీలో ఎక్కువ మంది మెర్జ్ను గతంలో బాగా విమర్శించేవారు. అయినాసరే అమెరికా, కెనడా వంటి దేశాలతో జర్మనీ సత్సంబంధాలు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని బలంగా వాదించారు. ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడే వాగ్ధాటి, కార్పొరేట్ లాయర్గా దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం, లాబీయింగ్ నైపుణ్యం, వివిధ పెట్టుబడుల బ్యాంక్ బోర్డుల్లో సాధించిన అనుభవం.. మెర్జ్కు రాజకీయాల్లో బాగా అక్కరకొచ్చాయి. ఈ అర్హతలే మెర్జ్ను ఛాన్స్లర్ పీఠం వైపు నడిపించాయి. ‘జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’ వంటి నినాదాలు, ‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం, సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా. రష్యాను ఎదుర్కొనేలా ఉక్రెయిన్కు సాయపడతా’ వంటి వాగ్దానాలు ఈయనను నయా జర్మనీ నేతగా నిలబెట్టాయి. రెండు విమానాలకు యజమానిచాంధసవాదానికి, గ్రామ సమాజాలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ జర్మనీలోని బ్రిలాన్ పట్టణంలో 1955 నవంబర్ 11న మెర్జ్ జన్మించారు. కుటుంబానికి న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మెర్జ్ తండ్రి న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఆయన సీడీయూ పార్టీలోనూ కొనసాగారు. మెర్జ్ సైతం న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అంతకు ముందు 1975లో జర్మన్ సైన్యంలో సైనికుడిగా దేశసేవ చేశారు. 1985లో న్యాయవిద్యను పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు. 1986లో జడ్జి పదవికి రాజీనామా చేసి కార్పోరేట్ లాయర్ అవతారం ఎత్తారు. మూడేళ్లపాటు జర్మన్ రసాయనరంగ సంఘానికి ప్రైవేట్ లాయర్గా పనిచేశారు. 1981లో తోటి న్యాయవాది, ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న షార్లెట్ మెర్జ్ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. మెర్జ్ రాజకీయాల నుంచి విరామం తీసుకున్న దశాబ్దం పాటు అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు. అట్లాంటిక్ సంబంధాలను సమర్థించే లాబీ అయిన ‘అట్లాంటిక్–బీఆర్ 1/4కే’కు సారథ్యం వహించారు. పైలట్ శిక్షణా తీసుకున్నారు. ఈయనకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఈయనకు సొంతంగా రెండు విమానాలు కూడా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది. ఆ మాత్రానికే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన్నో ఫెయిల్డ్ పొలిటీయన్గా అభివర్ణించాయి. మరోవైపు సొంత అధిష్టానం సైతం ఆయన నాయకత్వంపై బలమైన విమర్శలు చేసింది. వాటిని ఆయన తట్టుకోలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోపు దేశాన్ని తీవ్ర సంక్షోభాలు వచ్చి పడ్డాయి. అనూహ్యంగా.. మళ్లీ ఆయనకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో ఆయన విధానాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. అద్భుత విజయంతో జర్మనీ ఛాన్స్లర్ పీఠంపై ఫ్రెడరిక్ మెర్జ్ను కూర్చోబెట్టబోతున్నాయి. 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU) తరపున అక్కడి ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులు, బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తికి నేరుగా.. జర్మనీ ఛాన్స్లర్గా అవకాశం ఎందుకు దక్కబోతోంది?. 👉ఫ్రెడరిక్ మెర్జ్(Fedrich Merz).. 1955, నవంబర్ 11న బ్రిలన్లో జన్మించారు. వాళ్లది న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబం. బోన్, మార్బర్గ్ యూనివర్సిటీల్లో న్యాయవిద్య పూర్తి చేశారు. 1975 నుంచి 76 దాకా మిలిటరీలో పని చేశారు. న్యాయమూర్తిగా, ఆపై కార్పొరేటర్ లాయర్గానూ పని చేశారు👉1972లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU Party)లో చేరారు. 1989లో తొలిసారి యూరోపియన్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1994లో హోచ్సౌర్లాండ్క్రీస్ నియోజకవర్గం నుంచి జర్మనీ ముఖ్య సభ బుండెస్టాగ్కు తొలిసారి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంట్లో బుండెస్టాగ్, బుండెస్రాట్ సభలు ఉంటాయి. ఇవి మన లోక్సభ, రాజ్యసభలను పోలి ఉంటాయి.👉2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి సీడీయూ అధినేత్రి.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(Angela Merkel) సీడీయూ పార్లమెంటరీ నేతగా మెర్జ్కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. రెండేళ్ల తర్వాత మెర్కెల్ ఆయన్ని పక్కనపెట్టారు. అందుకు కారణాలు లేకపోలేదు. 👉2002లో జరిగిన జనరల్ ఫెడరేషన్ ఎన్నికల్లో సీడీయూపై స్వల్ప ఆధిక్యంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఈ ఓటమిని ఏంజెలా మెర్కెల్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్రెడరిక్ మెర్జ్ను విఫల నాయకుడిగా ఏకిపారేశాయి. అదే టైంలో.. 👉ఒకే పార్టీ అయినప్పటికీ ఏంజెలా మెర్కెల్కు ఫ్రెడరిక్ మెర్జ్ నడుమ రాజకీయ సిద్ధాంతాలపరంగా బేధాలున్నాయి. పదహారేళ్ల పాటు(2005 నుంచి 2021) జర్మనీ ఛాన్సలర్గా పని చేసిన మెర్కెల్ సెంట్రిస్ట్ కావడం.. మెర్జ్ సంప్రదాయ రాజకీయవాది, పైగా అతిమితవాద పార్టీ మద్ధతుదారుడు కావడం గమనార్హం. ఈ క్రమంలో.. జనరల్ ఫెడరేషన్ ఎన్నికల ఓటమిని సాకుగా చూపించి ఆయన్ని పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారని అప్పట్లో ఆమెపై సీడీయూలోనే విమర్శలు వచ్చాయి. 👉కొన్నాళ్ల సీడీయూలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 2009లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తిరిగి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు లాబీయిస్ట్ అవతారం ఎత్తారు. జర్మనీ బ్లాక్రాక్ సూపర్వైజరీ బోర్డు చైర్మన్గానూ వ్యహరించారు.👉ఈలోపు ఏంజెలా మెర్కెల్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే టైంలో.. సీడీయూకి నాయకత్వం వహించేది ఎవరనే చర్చ జోరుగా చర్చ నడిచింది. 2018, 2021 రెండుసార్లు సీడీయూ నాయకత్వం మారగా.. ఆ రెండుసార్లు ఫ్రెడరిక్ మెర్జ్ పేరే వినిపించింది. కానీ, 👉అన్నెగ్రెట్ క్రాంప్(2018-21), అర్మిన్ లాస్చెట్(2021-22)లు ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు.. 2022లో ఫ్రెడరిక్ మెర్జ్కు ఉన్న రాజకీయ అనుభవం పరిగణనలోకి తీసుకుని, ఆయన కన్జర్వేటివ్ విధానాలకే ఓటేస్తూ నాయకత్వ బాధ్యతలను సీడీయూ అప్పగించింది.👉2022లో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫ్రెడరిక్ మెర్జ్.. బుండెస్టాగ్లో ప్రతిపక్ష నేతగా దూకుడుతనం ప్రదర్శించారు. అదే సమయంలో.. ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృతంలోని సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో.. ప్రజాకర్ష విధానాలను ప్రదర్శించారు మెర్జ్. 👉దశాబ్దాలుగా జర్మనీ ఆర్థిక, దౌత్యపరమైన సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో మెర్జ్ అక్కడి ప్రజలకు ఓ ఆశాకిరణంగా కనిపించారు. 👉 తాజాగా ఆదివారం జరిగిన జర్మనీ పార్లమెంటరీ ఎన్నికల్లో..ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి సీడీయూ+సీఎస్యూ(Christian Social Union in Bavaria) విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విషయాన్ని ఖరారు చేశాయి. విశ్వసనీయుడిచేత జర్మనీ పాలించబడబోతోంది అని ఆయన మద్ధతుదారులు సంబురాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడి కానున్నాయిఅయితే మెర్జ్ విధానాలపై విమర్శలు లేకపోలేదుశరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. అయితే ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీని ఏంజెలా మెర్కెల్ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అతి మితవాద మద్దతుదారుడిగా ఉన్న మెర్జ్.. అల్టర్నేటివ్ ఫర్ జెర్మనీ(AfD) పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాన్ని సీడీయూలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు మెర్జ్ రూపొందిచిన ఆర్థిక విధానాలు.. ధనవంతులకు.. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా ఉండడం మరో మైనస్అన్నింటికి మంచి.. వ్యాపార ధోరణితో కూడిన ఆయన నాయకత్వ లక్షణంపై అటు విమర్శలతో పాటు ఇటు పొగడ్తలూ వినిపిస్తుంటాయిఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్ కావడం ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఓ సీనియర్ నేతగా సీడీయూ ఆమె అభిప్రాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది అంతే.:: సాక్షి వెబ్డెస్క్ -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్గోల్తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్లో భారత్కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
భారత 'శ్రమ'కు మస్త్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్నదేశం మనదే. అత్యధికంగా ఉద్యోగ, కార్మిక శక్తి లభ్యత ఉన్న దేశం కూడా భారతే. ఈ భారతీయ వర్క్ఫోర్స్ను ఇప్పుడు కొన్ని దేశాలు కళ్లకద్దుకొని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత ఉద్యోగ, కార్మిక శక్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అమెరికా వద్దన్నా..డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఆ దేశంలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆసియా, యూరప్లో మనవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారత కార్మిక శక్తికి ఇప్పటికే పశ్చిమాసియా అతిపెద్ద జాబ్ మార్కెట్గా ఉంది. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ దేశాల్లో 30 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించవచ్చని కేంద్ర కార్మికశాఖ అంచనా వేసింది.ఒక్క సౌదీ అరేబియాలోనే పదేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభించవచ్చని పేర్కొంది. ఆ దేశంలో నిర్మాణ, రిటైల్, రవాణా, స్టోరేజీ, హెల్త్కేర్ తదితర రంగాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు.సీఐఐతో కలిసి ‘ఫ్రేమ్వర్క్’ తయారీసౌదీ, ఖతార్, ఒమన్, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియాలో భారత వర్క్ఫోర్స్కు అవకాశాలు పెంచేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో కలిసి కేంద్ర కార్మికశాఖ ఓ ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తోంది. కార్మికుల నైపుణ్యాలు, విద్యార్హతలను గుర్తించి పై దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటం ఈ ఫ్రేమ్వర్క్ ముఖ్య ఉద్దేశమని అధికారవర్గాలు తెలిపాయి. ఒమన్లో ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఖతార్లో ఆతిథ్యం, ఏవియేషన్, స్పోర్టింగ్ ఈవెంట్లతో ముడిపడిన పరిశ్రమలు.. జపాన్లో నర్సింగ్, ఆతిథ్యం, ఉత్పత్తి, ట్రాన్స్పోర్టేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్వీఏసీ) రంగాల్లో భారతీయులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, దక్షిణాఫ్రికా, కువైట్, గుయానా, కెనడా, మలేసియాలలో కూడా భారత వర్కర్లకు అవకాశాలు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.యూఏఈ అతిపెద్ద మార్కెట్వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. మనదేశంలో అందుబాటులో ఉన్న వర్క్ఫోర్స్ తదితర అంశాలపై విశ్లేషణ కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్లో నమోదైన డేటాను కేంద్ర కార్మికశాఖ విశ్లేషించింది. దీని ప్రకారం యూఏఈ భారత వర్కర్లకు అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తున్నట్టు వెల్లడైంది. 2023–24లో ఇజ్రాయెల్లో భారత వర్కర్లకు గణనీయంగా ఉద్యోగాలు లభించాయి. నిపుణులకు జర్మనీ ఆహ్వానంజర్మనీలో వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల మంది భారతీయ వర్కర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. జర్మనీ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఆ దేశంలో 70 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఏర్పడనుంది. ఆస్ట్రేలియాలో నర్సులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఫిన్లాండ్లో హెల్త్కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం భారతీయులకు కాంట్రాక్టు, ప్రాజెక్టు ఆధారిత ఉపాధి అధికంగా ఉంది. కానీ, ఫుల్టైమ్ ఉద్యోగాల కల్పనకు మనదేశం మొగ్గుచూపుతున్నట్టు కార్మికశాఖ చెబుతోంది. -
జగజ్జేత జర్మనీకి భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
ఇతర దేశాలనూ గౌరవించండి
మ్యూనిచ్: తాము మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తామని, మిగతా దేశాలకు వాటి గురించి కొత్తగా నేరి్పస్తున్నట్లు తరచూ హితబోధ చేసే పశ్చిమదేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి సమాధానమిచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జరుగుతున్న భద్రతా సదస్సులో ‘‘ఓటేసేందుకు జీవించే ఉందాం: ప్రజాస్వామ్య సవాళ్లను ఎదుర్కొందాం’’అంశంపై బృందచర్చలో ఆయన ప్రసంగించారు. తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పశ్చిమదేశాల వైఖరిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మీరు(పశ్చిమదేశాలు) నిజంగా భావిస్తే వివిధ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాలను మీరూ ఆదరించాల్సిందే. కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే పశ్చిమదేశాలు తమ దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు మాట్లాడుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రజాస్వామ్యేతర విధానాలను ఈ పశ్చిమదేశాలు రుద్దుతున్నాయి. పశ్చిమదేశాలు సొంత గడ్డపై ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తాయో గ్లోబల్ సౌత్ దేశాల ప్రజాస్వామ్యానికీ అంతే విలువ ఇవ్వాలి. ఇంటి విధానాలను బయటా ఆచరించి చూపండి’’అని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లోని విజయాలను గ్లోబల్ సౌత్ దేశాలూ అందిపుచ్చుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం అన్నం పెడుతుంది ప్రజాస్వామ్యం అన్నం పెట్టదని సెనేటర్ ఎలిసా చేసిన వ్యాఖ్యలను జైశంకర్ పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘మీరు చెప్పేది తప్పు. వాస్తవానికి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆహారాన్ని అందించగలదు. భారత ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలకు మేం పౌష్టికాహారం అందిస్తున్నాం. 80 కోట్ల మందికి(రేషన్ ద్వారా) ఆహార భరోసా కల్పించాం. వాళ్లిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ల కడుపులు నిండాయా లేదా అనేది ప్రధానం’’అని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై.. ‘‘ఇటీవలే నా సొంత రాష్ట్రం ఢిల్లీ(అసెంబ్లీ ఎన్నిక)లో ఓటేశా. నా వేలికి ఉన్న ఈ సిరా గుర్తు ఆ ఓటుదే. గత ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అర్హులైన ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఓటేశారు. అంటే 90 కోట్ల మందిలో ఏకంగా 70 కోట్ల మంది ఓటేశారు. ఇన్ని కోట్ల ఓట్లను మేం ఒకే రోజులో లెక్కించాం’’అని అన్నారు. ఈ చర్చలో జైశంకర్తోపాటు నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్, అమెరికా సెనేట్ సభ్యురాలు ఎలిసా స్లోట్కిన్, వార్సా నగర మేయర్ రాఫల్ ట్రజస్కోవ్క్ పాల్గొన్నారు. -
రష్యా పైకి ‘ఆర్మీ ఆఫ్ యూరప్’
మ్యూనిక్: యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్ యూరప్’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మనీలోని మ్యూనిక్లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జెలెన్స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు. శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు. ‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్ యూరప్’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు. -
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ కాన్సరెన్స్ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం. -
ప్రేమ, సామరస్యమే క్రీస్తు బోధనల సారం
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. -
జర్మనీ క్రిస్మస్ మార్కెట్ ఘటన : మీడియా తీరుపై మస్క్,వాన్స్ విమర్శలు
మగ్దెబర్గ్ : క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో మగ్దెబర్గ్ నగరంలో క్రిస్మస్ మార్కెట్పై అగంతకుడు జనంపైకి కారును నడిపాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తుండగా.. ప్రముఖ దిగ్గజ మీడియా సంస్థలు విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి.జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో నిందితుడు తాలెబ్ తన కారుతో జనం పైకి కారును నడిపాడు. మూడు నిమిషాల్లో జరిగిన దారుణంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే, పలు ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ‘జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్లో ఒక కారు జనాలపై దూసుకెళ్లింది ’ అని మాత్రమే హైలెట్ చేశాయి. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, అతడి వివరాలు వెల్లడించినా మీడియా సంస్థలు నామ మాత్రంగా కథనాలు ఎందుకు ప్రచురించ దేశాదినేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.You don’t hate the lying legacy media enough https://t.co/gMtjbp2EMG— Elon Musk (@elonmusk) December 20, 2024 అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం క్రిస్మస్ మార్కెట్లో జనంపై కారు దూసుకెళ్లింది. మరి ఆ కారును ఎవరు డ్రైవ్ చేశారు’అని ప్రశ్నించారు. ఎలాన్ మస్క్ సైతం మీడియా తీరును తప్పుబట్టారు. పలువురు నెటిజన్లు సైతం మీడియా కథనాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. జనంపై కారు దూసుకెళ్లింది. అందులో డ్రైవర్ పేరు, అతడి వివరాలు తెలిసినా ఎందుకు హైలెట్ చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. Who was driving the car? https://t.co/A6Bq8WuswL— JD Vance (@JDVance) December 20, 2024 -
జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో దారుణం
న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్దెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లో జనంపైకి ఓ ఆగంతకుడు కారును వేగంగా నడిపాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ కారు మార్కెట్లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా వెళ్లినట్లు సీసీఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో కనీసం 41 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని మీడియా తెలిపింది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ.(50)అనే వ్యక్తిని సాయుధ పోలీసులు వెంటనే చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన దారినే తిరిగి వెళ్లేందుకు కారును మళ్లించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా కేవలం మూడే మూడు నిమిషాల్లో జరిగిపోయింది. కారు ముందుభాగం, విండ్ స్క్రీన్ ధ్వంసమైంది. రద్దీగా మార్కెట్లో పాదచారుల మార్గంపైకి బీఎండబ్ల్యూ కారు వెళ్తున్న దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది. తాలెబ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని అధికారులు తెలిపారు. భయానక విషాద ఘటన ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితులను తరలించేందుకు 100 మంది పోలీసులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లతోపాటు 50 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. దారుణం తెలిసిన వెంటనే ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ మగ్దెబర్గ్ వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. దాడిని భయానక విషాద ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆనందానికి మారుపేరుగా ఉన్న మగ్దెబర్గ్లో ఘోరం చోటుచేసుకుందన్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో జర్మనీ వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ వారాంతపు మార్కెట్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. 7 Indian nationals have been injured in Magdeburg, Germany. 3 have been discharged from the hospital. Indian Mission is in touch with all those injured in the attack: Sources— ANI (@ANI) December 21, 2024ఖండించిన భారత్క్రిస్మస్ మార్కెట్లో జరిగిన దాడిని భారత్ ఖండించింది. దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, గాయపడిన భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. గాయపడిన భారతీయులతో, అలాగే వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. సాధ్యమైన మేరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని ’ తెలిపింది. -
జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు
బెర్లిన్ : జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.🚨 2 Dead, 60 Injured in German Christmas Market Attack 🚨A car plowed into a bustling Christmas market in Magdeburg, Germany, killing two people, including a toddler, and injuring over 60 others in what authorities are calling a deliberate act, potentially linked to terrorism.… pic.twitter.com/8o6zVv62Vu— CanAm Network (@Canam_Network) December 21, 2024 2016లో ఇదే తరహా దాడిఎనిమిదేళ్ల క్రితం జర్మన్ రాజధాని బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Police arresting the Attacker 50-year-old Saudi doctor in Magdeburg, Germany#Terroristattack #Germany #Magdeburg #Weihnachtsmarkt #MagdeburgAttack #MagdeburgerWeihnachtsmarkt #festundflauschig pic.twitter.com/JO1nuTLal5— Chembiyan (@ChembiyanM) December 20, 2024 -
మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు. -
కుప్పకూలిన విమానం..
-
జర్మనీలో నెల్లూరు వాసి ఉపేంద్రరెడ్డి మృతి
-
నెతన్యాహు అరెస్టవుతారా?
వాషింగ్టన్: గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్ను హమాస్ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్ వెళ్లలేదు. -
భారత్లో ఎస్ఏపీ అపార పెట్టుబడులు
న్యూఢిల్లీ: జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ భారత్లో అపారమైన పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగాలను కలి్పంచే ప్రణాళికల్లో ఉందని కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్ చెప్పారు. తమకు అత్యంత వేగవంతమైన వృద్ధిని అందించడంతో పాటు భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కూడా భారత్ నిలుస్తుందన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన విషయాలను వెల్లడించారు. ‘భారత్ టాప్–10 మార్కెట్లలో ఒకటి. ఈ ర్యాంక్ అంతకంతకూ ఎగబాకుతోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్డీ కార్యకలాపాలపై భారీగా వెచ్చించనున్నాం. జర్మనీ తర్వాత ఇక్కడే కంపెనీకి అత్యధిక సిబ్బంది ఉన్నారు. ఇతర ఎస్ఏపీ ల్యాబ్లతో పోలిస్తే అసాధారణ రీతిలో నియమాకాలను చేపట్టనున్నాం. అతి త్వరలోనే అతిపెద్ద హబ్గా భారత్ ఆవిర్భవిస్తుంది. ఏఐ భారీ అవకాశాలను అందించనుంది. భారత్లోని ఏఐ నిపుణుల పనితీరు అద్భుతం’ అని క్లీన్ చెప్పారు. కాగా, భారత్లోని ఎస్ఏపీ ఆర్అండ్డీ సెంటర్లలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 15,000 కొలువులు కల్పించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. -
త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్పోస్పోలిటా నివేదించింది.జెక్పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!రూ.66 వేలకోట్లతో కొనుగోలుబాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. -
నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్తంగా ఎస్ఎమ్ కేర్, హాలో లాంగ్వేజ్ సంస్థలతో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ వివరించారు. ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్ఎం కేర్ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు. -
జర్మనీకి భారత్ షాక్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుతో గురువారం జరిగిన చివరిదైన రెండో మ్యాచ్లో టీమిండియా 5–3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (34వ, 48వ నిమిషాల్లో), కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (42వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... అభిషేక్ (45వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. జర్మనీ జట్టుకు ఇలియన్ మజ్కోర్ (7వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... హెన్రిక్ మెర్ట్జెన్స్ (60వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 0–2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో భారత్ నెగ్గడంతో సిరీస్ 1–1తో సమమైంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజేతను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జర్మనీ 3–1తో భారత్పై గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. -
TG: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు కాసేపట్లో
సాక్షి,హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23) మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ ఆరేళ్లుగా సాగింది. తుది వాదనలు విన్న హైకోర్టు మంగళవారం ఈ కేసులో తీర్పు రిజర్వు చేసింది. రమేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా పిటిషన్లో ఆది శ్రీనివాస్ కోరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిశ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. -
భారత్ బదులు తీర్చుకునేనా!
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో జర్మనీ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం భారత పురుషుల హాకీ జట్టుకు లభించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో నేడు, రేపు జరిగే రెండు మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పదేళ్ల తర్వాత స్థానిక మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం అంతర్జాతీయ హాకీ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుండటం విశేషం. చివరిసారి 2014లో వరల్డ్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు ధ్యాన్చంద్ స్టేడియం వేదికగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోయి ఫైనల్కు చేరుకోలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో జర్మనీ జట్టు రెండో స్థానంలో, భారత జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్ సూపర్ ఫామ్లో ఉంది. కెపె్టన్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ రాణిస్తే భారత జట్టు పైచేయి సాధించే అవకాశముంది. భారత్, జర్మనీ జట్లు ముఖాముఖిగా ఇప్పటి వరకు 107 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 54 మ్యాచ్ల్లో జర్మనీ జట్టు గెలుపొందగా... 26 మ్యాచ్ల్లో భారత జట్టుకు విజయం దక్కింది. మరో 27 మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ 11వ బతుకమ్మ కార్యక్రమాన్ని బెర్లిన్లోని గణేష్ ఆలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా, బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి మంత్రి (పర్సనల్) డాక్టర్ మన్దీప్ సింగ్ తులి, అతని కుటుంబ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ తులి సంప్రదాయానికి గౌరవ సూచకంగా బతుకమ్మను తలపై ఎత్తుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ రఘు చలిగంటి, రుచికరమైన తెలంగాణ ఆహారాన్ని తయారు చేసిన వాలంటీర్లకు, ముఖ్యంగా వంట టీమ్, క్లీనింగ్ అండ్ డెకరేషన్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఏజీ కార్యవర్గానికి చెందిన రామ్ బోయినపల్లి, శరత్ రెడ్డి కమ్డి, నటేష్ చెట్టి గౌడ్ యోగానంద్ నాంపల్లి, బాల్రాజ్ అందె, శ్రీనాథ్ రమణి, అమూల్య పోతుమంచి, అవినాష్ రాజు పోతుమంచి, స్వేచ్ఛా రెడ్డి బీరెడ్డి, వేణుగోపాల్రెడ్డి బీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజ చేసినందుకు ప్రశాంత్ గోలీకి, ఫోటోలు తీసినందుకు నిదాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
‘సిక్లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్లీవ్లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్లీవ్లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
మర్రిచెట్టు తండా అమెరికాకు అలంకరణ
జర్మనీ లేదా అమెరికాలో తయారైన కళాకృతులు, వస్త్రాలు మారుమూల మర్రిచెట్టు తండాలో కనిపించడం విశేషం కాకపోవచ్చు. అయితే మర్రిచెట్టు తండాలో తయారైన కళాకృతులు జర్మనీ, అమెరికాలాంటి ఎన్నో దేశాల్లో కనిపించడం కచ్చితంగా విశేషమే. ‘గిరిజన’ అనే మాటతో ప్రతిధ్వనించే శబ్దం... కళ. ఆ కళ ఆటలు, పాటలు, వస్త్రాలు, కళాకృతుల రూపంలో వారి దైనందిన జీవితంలో భాగం అయింది. ప్రపంచీకరణ ప్రభావంతో ‘అత్యాధునికత’ అనేది పురా సంస్కృతులు, కళలపై కత్తిలా వేలాడుతుంది. ఆ కత్తి వేటు పడకుండా తమ సంప్రదాయ కళలను రక్షించుకోవడమే కాదు... ‘ఇది మా కళ’ అని ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది మర్రిచెట్టు తండా...నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని మరిచ్రెట్టు తండా... ఒక కేక వేస్తే తండా మొత్తం వినిపించేంత చిన్న తండా. వ్యవసాయపనులు, బయటి ఊళ్లల్లోకి వెళ్లి కూలిపనులు చేసుకునేవాళ్లే తండాలో ఎక్కువమంది ఉన్నారు.వ్యవసాయం అయినా, కూలిపనులు అయినా శ్రమతో కూడుకున్నవి. ఇంటికి వచ్చిన తరువాత తండాలోని మహిళలకు ఆ శ్రమభారాన్ని తగ్గించేవి కళలు. అందులో ప్రధానమైనవి చేతివృత్తుల కళలు. తాతముత్తాతల నుంచి పరంపరగా వస్తూ తమ చేతికి అందిన ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేస్తున్నాయి.అద్దాలు, దారాలు, గజ్జెలు, పూసలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఇంటికి అవసరమైన అలంకరణ వస్తువులను, గిరిజన సంప్రదాయ దుస్తులను రూపొందిస్తున్నారు. ఈ తండావాసుల హస్తకళలు నాబార్డ్ దృష్టిలో పడడంతో కొత్త ద్వారం తెరుచుకుంది. తండావాసులు తయారు చేసిన కళాకృతులు, దుస్తులను మార్కెటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని నాబార్డ్ ముందుకు వచ్చింది. నాబార్డు నిర్వహించే ఎగ్జిబిషన్లలో మర్రిచెట్టు తండావాసుల స్టాల్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవాళ్లు.నాబార్డ్ చొరవతో తండాకు మాత్రమే పరిమితమైన కళాకృతులు లోకానికి పరిచయం అయ్యాయి. సంప్రదాయ గిరిజన దుస్తులు, వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేసి రాజస్థాన్, హరియాణా, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మర్రిచెట్టు తండా మహిళలు తయారు చేస్తున్న పన్నెండు రకాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా పురుషులు అలంకరణగా ధరించే ‘విరేనాపాటో’కు మంచి ఆదరణ ఉంది.తమ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా గొప్ప విజయం సాధిస్తే వారిని ఈ ‘విరేనాపాటో’తో సత్కరిస్తారు. దీంతోపాటు దర్వాజా తోరణం, చేతి సంచులు, కోత్లో (పైసలు దాచే సంచి), పులియాగాల (తలపై బుట్ట ధరించేది), గండో(మేరమ్మ అమ్మ వారి ప్రతీక), దాండియా డ్రెస్, కవ్య (పెళ్లయిన గిరిజన మహిళలు ధరించేవి), దడ్ప (ఫ్రిజ్ కవర్లు) మొదలైన వాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.‘మేము తయారు చేస్తున్న వస్తువులతో రాబడి వస్తోందనే సంతోషం కంటే వాటి గురించి ఎక్కడెక్కడి వాళ్లో మెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోంది. బట్టలు కూడుతున్నప్పుడో, బుట్టలు చేస్తున్నప్పుడో పని చేస్తున్నట్లుగా ఉండదు. హుషారుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏ పని లేనప్పుడు ఈ పనులు చేసేవాళ్లం. ఇప్పుడు ఈ పనే మాకు పెద్ద పని అయింది’ అంటుంది నేనావత్ చాంది.‘బయట ఊళ్లకు పోయినప్పుడు మాది మర్రిచెట్టు తండా అని గర్వంగా చెప్తా. పనుల కోసం తండా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు ఇక్కడే ఉండొచ్చు’ అంటూ ఉపాధి కోసం దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లను అమ్మలాంటి తండాకు తిరిగి రావాలని కోరుకుంటుంది బాణావత్ పద్మ. వారికోసం హస్తకళలు ఎదురుచూస్తున్నాయి.‘ఇప్పుడు మేము చేస్తున్నవే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటుంది నేనావత్ సుబ్బులు. గిరిజన కళాకృతులలో ఎన్నో మరుగునపడిపోయాయి. వాటి గురించి తెలిసిన వారు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. అలాంటి వారితో మాట్లాడితే తెరమరుగైపోయిన ఎన్నో కళాకృతులు మళ్లీ కొత్త కాంతులతో వెలుగుతాయి.నేనావత్ చాంది, నేనావత్ సుబ్బులు, బాణావత్ పద్మ... వీరు మాత్రమే కాదు మర్రిచెట్టు తండాలోని 150 మంది మహిళలు చేతివృత్తుల కళాకారులే కాదు చరిత్ర చెప్పే ఉపన్యాసకులు కూడా! ‘విరేనాపాటో’ నుంచి ‘గండో’ వరకు వాటి తయారీ గురించి మాత్రమే కాదు వాటి వెనుక చరిత్ర కూడా ఈతరానికి తెలియజేస్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది!– చింతకింది గణేశ్, సాక్షి, నల్లగొండ,కుటుంబానికి ఆసరాగా...తండాలో దాదాపు 150మందికి పైగా మహిళలం చేతి అల్లికల ద్వారా సంప్రదాయ వస్త్రాలు, వస్తువులను తయారు చేస్తున్నాం. ఏ కొంచెం తీరిక దొరికినా ఎవరి ఇండ్లలో వాళ్లం వీటిని తయారు చేస్తుంటాం. ఒక్కో వస్తువు తయారు చేసేందుకు వారం రోజులు పడుతుంది. వీటిని అమ్మగా వచ్చే డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.– బాణావత్ పద్మవిదేశాల నుంచి వస్తున్నారుమేము తయారు చేసే అల్లికలను చూడడం కోసం మా తండాకు విదేశాల నుండి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటూ మా పనులు చేసుకుంటూనే సంప్రదాయ పద్ధతిలో చేతితో అల్లికలు అల్లుతున్నాం. తీజ్ వేడుకల్లో గిరిజనులు ధరించే విరేనాపాటోతో పాటు పులియాగాల(తలపై ధరించేది)వంటి అలంకరణ వస్త్రాలు తయారు చేస్తున్నాం.– నేనావత్ సుబ్బులుసబ్సిడీ ఇవ్వాలిసంప్రదాయ దుస్తులతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే అలంకరణ వస్తువులను 30 ఏళ్లుగా తయారు చేస్తున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లినా తీరిక వేళల్లో వీటిని తయారు చేస్తాం. మేము తయారు చేసిన వాటిని కొనేందుకు పట్టణాల నుంచి చాలామంది వస్తుంటారు. కొనడమే కాదు వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. అల్లికలకు ఉపయోగించే వస్తువులపై సబ్సిడీ ఇవ్వడంతోపాటు, పట్టణాల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ్రపోత్సహించాలి.– నేనావత్ చాంది -
పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే: భారత కెప్టెన్
ఢిల్లీలో హాకీ మ్యాచ్ ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అన్నాడు. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదని.. దేశ రాజధానిలోని యువత హాకీ వైపు ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపేందుకు తమకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ హాకీ జట్టు వచ్చే నెలలో భారత్లో పర్యటించనుంది. ప్యారిస్లో కాంస్యం నెగ్గిన భారత జట్టుతో రెండు మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 23, 24న ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారి ఢిల్లీ అంతర్జాతీయ హాకీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశ రాజధానిలో.. చారిత్రాత్మక మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో ఆడనుండటం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఎంతో ప్రత్యేకం కూడా! దేశ రాజధానిలో మరోసారి హాకీ స్ఫూర్తిని జ్వలింపచేసే అవకాశం రావడం.. ఆ జట్టుకు నేను సారథిగా ఉండటం నా అదృష్టం.ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుగా ఉంది.వారితో పోటీ పడటం అంటే కఠిన సవాలుకు ఎదురీదడమే. అయితే, ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉంటే మాలోని అత్యుత్తమ ప్రదర్శన అంతగా బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత హాకీ జట్టు ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది‘భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ నిర్వహించనున్నాం. ఇది ఆట ఉన్నతితో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ పేర్కొన్నాడు. ‘భారత్, జర్మనీ మధ్య హాకీ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది. జర్మనీ వంటి పటిష్ట జట్టుతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’ అని భోళానాథ్ సింగ్ అన్నాడు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
సాహసానికి సై యామి... భయమా... డోంట్ ఖేర్
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన చిరకాల స్వప్నం ‘ఐరన్ మ్యాన్ 70.3’ గురించి చెప్పినప్పుడు అభినందించిన వాళ్ల కంటే అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. ‘సినిమాల్లోలాగా అక్కడ డూప్లు ఉండరు’ అని నవ్వారు కొందరు. అయితే ఇవేమీ తన సాహసానికి అడ్డుగోడలు కాలేకపోయాయి.ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్గా ‘ట్రయథ్లాన్: ఐరన్మ్యాన్’ రేస్ గురించి చెబుతారు. 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల బైసికిల్ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగుతో ‘ఐరన్ మ్యాన్’ రేసు పూర్తి చేసిన తొలి బాలీవుడ్ నటిగా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఫ్రెండ్స్కు తన కల గురించి సయామీ ఖేర్ చెప్పినప్పుడు ‘నీలాగే చాలామంది కలలు కంటారు. రేస్ పూర్తి చేయని ఫస్ట్ టైమర్లు ఎందరో ఉన్నారు’ అన్నారు వాళ్లు. వెనక్కి తగ్గిన వారిలో తాను ఒకరు కాకూడదు అనుకుంది ఖేర్. ఫిబ్రవరిలో ‘ఐరన్ మ్యాన్’ రేస్ కోసం ట్రైనింగ్ మొదలైంది. మొదట్లో 3 కిలోమీటర్లు పరుగెత్తడం, ఈత ‘అయ్య బాబోయ్’ అనిపించేది. త్వరగా అలిసి పోయేది. సాధన చేయగా... చేయగా... కొన్ని నెలల తరువాత పరిస్థితి తన అదుపులోకి వచ్చింది. అప్పుడిక కష్టం అనిపించలేదు. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటైంది.రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి శిక్షణ కోసం సిద్ధం అయ్యేది. ట్రైనింగ్లో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి లోతుగా ఆలోచించేది. ‘శిక్షణ బాగా తీసుకుంటే వాటిని అధిగమించడం కష్టం కాదు’ అని కోచ్ చెప్పిన మాటను అనుసరించింది.‘ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మారథాన్లలోపాల్గొంటున్నాను. అయితే నా దృష్టి మాత్రం ఐరన్ మ్యాన్ రేస్ పైనే ఉండేది. నా కలను నెరవేర్చుకోడానికి సన్నద్ధం అవుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. దీంతో నా కల తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికైనా నా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటుంది సయామీ ఖేర్.ఖేర్ మాటల్లో చెప్పాలంటే ‘ఐరన్ మ్యాన్ రేస్ అనేది శారీరక సామర్థ్యం, సహనానికి పరీక్ష.‘ఆటలు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతం చేస్తాయి. ఐరన్ మ్యాన్ రేస్ పూర్తి చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం నా నట జీవితానికి ఉపయోగపడుతుంది’ అంటుంది 32 సంవత్సరాల సయామీ ఖేర్.ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‘ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్’ అనేది వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటిసి) నిర్వహించే రేసులలో ఒకటి. దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పోర్ట్ ఈవెంట్గా చెబుతారు. ఈ రేసు సాధారణంగా ఉదయం ఏడుగంటలకు మొదలై అర్ధరాత్రి ముగుస్తుంది. ఓర్పు, బలం, వేగానికి సంబంధించి ట్రయథ్లెట్లు రేసుకు కొన్ని నెలల ముందు కఠిన శిక్షణ తీసుకుంటారు.అయిననూ ఛేదించవలె...గత సంవత్సరం బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డాను. కొన్ని నెలల రెస్ట్. మరోవైపు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు అవసరమా!’ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు సరి కదా ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. ‘ఏదైనా చేయాలి అని మనసు బలంగా అనుకుంటే దానికి అనుగుణంగా శరీరం కూడా సన్నద్ధం అవుతుంది’ అంటారు. ఇది నా విషయంలో అక్షరాలా నిజం అయింది.అయితే ప్రతికూల పరిస్థితులు మళ్లీ ముందుకు వచ్చాయి. రేసుకు వారం ముందు కెనడాకు నా ప్రయాణం (వర్క్ ట్రిప్) పీడకలగా మారింది. విమానాలు ఆలస్యం కావడం నుంచి కాంటాక్ట్స్ కోల్పోవడం వరకు ఎన్నో జరిగాయి. నా బ్యాగ్లు మిస్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం సహకారంతో ఆ సమస్య నుంచి ఎలాగో బయటపడ్డాను. ఇక ‘ఐరన్ మ్యాన్ రేస్’లో నా గేర్ మొదలైనప్పుడు గాలులు తీవ్రంగా వీచడం మొదలైంది. అయినప్పటికీ ఈత కొట్టడానికి, రైడ్ చేయడానికి వెళ్లాను. నా మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఆస్వాదించాలని గట్టిగా అనుకున్నాను. నీరు గడ్డకట్టినప్పటికీ రేసును ఒక వేడుకలా భావించాను. కోల్డ్వాటర్లో 42 నిమిషాలు ఈదాను. – సయామీ ఖేర్ -
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 21 ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో సాకరి తొలి సెట్ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
NRI: 'టాగ్' ఆధ్వర్యంలో బెర్లిన్లో 'వన భోజనాలు'..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో ఆదివారం బెర్లిన్లోని చారిత్రక వోక్స్పార్క్లో "వన భోజనాలు" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రఘు చలిగంటి మాట్లాడుతూ, వన భోజనాలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. చాలా కుటుంబాలు హాజరయ్యాయి. ఒకరితో ఒకరు పరిచయం కావడం ఆనందంగా అనిపించింది.ఈ ఈవెంట్ మాకు ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా మారింది, ప్రతి వేసవిలో కొత్తగా ఇక్కడకు వచ్చిన కుటుంబాలను స్వాగతించడానికి, మా కమ్యూనిటీ బంధాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.ఈ ఈవెంట్ను నిర్వహించేందుకు అంకితభావంతో పనిచేసిన టాగ్ కార్యదర్శులు శరత్, అలేకీ, నరేష్లకు అలాగే ఈవెంట్ను విజయవంతం చేయడానికి తమ సమయాన్ని, కృషిని అందించిన వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. - డాక్టర్ రఘు చలిగంటి, టాగ్ అధ్యక్షుడు -
జర్మనీలో కత్తితో దాడి.. ముగ్గురి మృతి
బెర్లిన్: పశ్చిమ జర్మనీలోని సోలింగెన్ నగరంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి సోలింగెన్ నగర 650వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఉత్సవాల్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి పులువురిపై విక్షణారహితంగా కత్తితో దాడి చేశాడని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో పలువరు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’అని సోలింగెన్ మేయర్ టిమ్-ఒలివర్ కుర్జ్బాచ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో ఘోరమైన కత్తిపోట్లు, కాల్పులు తరచూ జరుగుతుంటాయి. ఇక.. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం ప్రత్యేక టీంలో గాలిస్తున్నారు. సోలింగెన్ పట్టణం నార్త్ రైన్-వెస్ట్ఫాలియా రాష్ట్రంలో ఉంది. నెదర్లాండ్స్ సరిహద్దులో ఉన్న అత్యధిక జనాభా నగరం సోలింగెన్. -
జర్మనీలో జాబ్.. ఇదే మంచి అవకాశం!
జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి గతంలో 9 నెలలు పట్టేది. ఇప్పుడు దానిని కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు.తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ తెలిపారు. ఈ డిమాండ్ను తీర్చడానికి, వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించనున్నారు. మింట్ నివేదిక ప్రకారం.. జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం, జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. వర్క్ వీసా ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది.జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మన్ ఆర్థిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ ప్రకారం, ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకు 80 వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు.కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు 14న జర్మన్ ఎంపీలు జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్లను కలిశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో జుర్గెన్ హార్డ్ , రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు. -
మెర్సిడెస్ కొత్త మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్లో మరో రెండు టాప్ ఎండ్ మోడళ్లను గురువారం విడుదల చేసింది. వీటిలో ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే, సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎక్స్షోరూంలో ప్రారంభ ధర రూ.1.10 కోట్లు. ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే మోడల్కు 1,991 సీసీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, ఏఎంజీ స్పీడ్íÙఫ్ట్ ఎంసీటీ 9జీ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ మోడల్ 1,999 సీసీ ఇన్లైన్–4 టర్బోచార్జ్డ్ ఇంజన్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో చేరుకుంటుంది. కాగా, 2023–24లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయంగా 18,123 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరి–జూన్లో 9 శాతం వృద్ధితో 9,262 యూనిట్లు రోడ్డెక్కాయి. 2024లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మైబాహ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబరులో భారత్లో అడుగు పెడుతుందని వెల్లడించారు. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
Paris Olympics 2024: ఫైనల్ వేటలో...
పారిస్: ఒలింపిక్స్లో భారత హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ను ‘షూటౌట్’లో ఓడించిన భారత్... మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన టీమిండియా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది. 1980కి ముందు ఒలింపిక్స్లో ఎనిమిది స్వర్ణాలతో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన భారత్.. తిరిగి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్లో అడుగు పెట్టిన హర్మన్ప్రీత్ సింగ్ బృందం.. క్వార్టర్స్లో బ్రిటన్పై అసమాన ప్రదర్శన కనబర్చింది. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడగా.. మిగిలిన 10 మందితోనే అద్భుతం చేసింది. ఇక ‘షూటౌట్’లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలవడంతో 1972 తర్వాత భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అదే జోరులో జర్మనీని కూడా చిత్తుచేస్తే.. 44 ఏళ్ల తర్వాత టీమిండియా విశ్వక్రీడల తుదిపోరుకు అర్హత సాధించనుంది. చివరిసారి భారత జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్లో ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్న శ్రీజేశ్ మరోసారి కీలకం కానుండగా.. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిదాస్పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో అతడు జర్మనీతో సెమీస్ పోరుకు అందుబాటులో లేడు. అయితే ఇలాంటివి తమ చేతిలో లేవని... మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతామని ఈ టోరీ్నలో ఏడు గోల్స్ చేసిన భారత సారథి హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే పతకం దక్కించుకున్న టీమిండియా... మరోసారి జర్మనీని చిత్తు చేసి ముందంజ వేయాలని ఆశిద్దాం. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్తో స్పెయిన్ తలపడనుంది. రోహిదాస్పై ఒక మ్యాచ్ నిషేధం భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. బ్రిటన్తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా.. రోహిదాస్ హాకీ స్టిక్ బ్రిటన్ ప్లేయర్ తలకు తగిలింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. మ్యాచ్ రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపి మైదానం నుంచి తప్పించాడు. దీనిపై భారత జట్టు అప్పీల్ చేయగా.. వాదనలు విన్న అనంతరం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అతడు నేడు జరిగే సెమీఫైనల్కు అందుబాటులో లేకుండా పోయాడు.‘నియమావళిని అతిక్రమించినందుకు అమిత్ రోహిదాస్పై ఒక మ్యాచ్ నిషేధం విధించాం’అని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. -
టెస్లాలో కాఫీ కప్పుల దొంగలు.. 65 వేల కప్పులు మాయం!
టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్లు మాయవుతున్నాయట.కాఫీ మగ్ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.బెర్లిన్కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్తో తలపడనుంది. -
ఇంగ్లండ్ను గెలిపించిన జూడ్ బెలింగమ్
‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ పట్టణంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఇంగ్లండ్ 1–0 గోల్ తేడాతో సెర్బియాపై నెగ్గింది. ఆట 13వ నిమిషంలో జూడ్ బెలింగమ్ ఇంగ్లండ్కు గోల్ అందించాడు. మరోవైపు రొమేనియా జట్టు 24 ఏళ్ల తర్వాత ‘యూరో’ టోరీ్నలో తొలి విజయం అందుకుంది. మ్యూనిక్లో జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్లో రొమేనియా 3–0తో ఉక్రెయిన్పై గెలిచింది. ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన గ్రూప్ ‘ఇ’ మరో మ్యాచ్లో స్లొవేకియా 1–0తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించింది. -
జర్మనీలో మన రుచులు
నిర్మల్ఖిల్లా: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో నిర్వహిహించిన ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్లో నిర్మల్కు చెందిన అజయ్కుమార్–శ్రీలత దంపతులు పాల్గొని ఇక్కడి తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు. అక్కడివారికి చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెలు తదితర వంటకాల రుచి చూపించారు. జర్మనీ ప్రజలు డబల్ క మీఠా వంటకాన్ని ఇష్టంగా ఆరగించినట్లు వారు తెలిపారు. అక్కడి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వారూ హాజరయ్యారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన అజయ్కుమార్–శ్రీలత దంపతులు చేసిన వంటకాలకు అక్కడి నిర్వాహకులు, స్థానికుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారంతా ఒక్కచోట కలుసుకుని మన దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్కుమార్–శ్రీలత దంపతులు పేర్కొన్నారు. -
Euro 2024: యూరో కప్లో బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్
ఫుట్బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో స్కాట్లాండ్పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్హాఫ్లో మరో రెండు గోల్స్ను అందించారు. దీంతో ఫస్ట్హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెకెండ్ హాఫ్లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్లో జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. -
‘యూరో’ పోరుకు వేళాయె!
ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్బాల్ టోర్నమెంట్కు నేడు తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి మ్యూనిక్లో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య జర్మనీ జట్టుతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. జర్మనీలోని 10 పట్టణాల్లో జరిగే ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్లో జరిగే ఫైనల్తో ముగుస్తుంది. 2020 యూరో టోర్నీలో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. లీగ్ దశ ముగిశాక ఆరు గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 12 జట్లు... మూడో స్థానంలో నిలిచిన నాలుగు ఉత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ‘యూరో’ టోర్నీని భారత్లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్కు రావాలి -
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ను ఓడించిన మూడో ప్లేయర్గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే... అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సహానుభూతి అంటారు ఈ ఫీలింగ్ను. ఇంకొంతమంది ఆయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చివరకు మాటసాయమైనా చేసే ప్రయత్నం చేస్తారు. ‘‘నేను ఉన్నాను’’.. ‘‘నువ్వు ఒంటరి కాదు’’ అన్న భరోసా... నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము. ఇదంతా ఇప్పుడెందుకు అంటే... ఎక్స్లో (గతంలో ట్విట్టర్) కనిపించిన ఈ ట్వీట్ను చూడండి. మనసులను కదిలించే చిన్ని గాథ! జర్మనీలోని ఆరేళ్ల బాలుడి కథ ఇది! మోటర్సైకిళ్లంటే మహా పిచ్చి! పెద్దయ్యాక రేసుల్లో పాల్గొనే వాడేనేమో కానీ... కేన్సర్ మహహ్మారి అంత ఎదిగేందుకు అవకాశం ఇచ్చేలా లేదు. అందుకే... ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఆన్లైన్లో పోస్ట్ పెట్టారు! ‘‘మా వాడికి బైక్లంటే బాగా ఇష్టం. వీలున్న వారు ఎవరైనా మోటర్సైకిల్పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా?. మా వాడి కళ్లల్లో ఆనందం ఇంకోసారి చూసుకోగలం’’ అని అభ్యర్థించారు. అందరివీ బిజి బిజీ బతుకులు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ... 20, 30 మంది వరకూ వస్తారనునన వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓ సముద్ర కెరటంలా ‘మనీషి’ కదిలాడు. వేయి.. రెండు వేలు కూడా కాదు.. ఎకాఎకిన ఇరవై వేల మంది మోటర్ సైకిళ్లపై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్లలో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ కుర్రాడి ముఖం చంద్రబింబంలా మెరిసి పోయి ఉంటుందా? కచ్చితంగా మెరిసిపోయే ఉంటుంది. వీడియో మూడు నాలుగేళ్ల కిందటిదే అయినా.. ఆ చిన్నారి తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. మానవత్వం ఈ భూమ్మీద మిగిలే ఉందని, లోకం మనం అనుకునేంత చెడ్డదేం కాదని నిరూపించింది ఈ ఘటన. In Germany, a 6 year old boy who loved Motorcycles was diagnosed with cancer. His family posted online asking if someone can ride pass their house to cheer him up. They expected 20-30 people. But in the end, nearly20,000 bikers showed up. pic.twitter.com/ZX2Gqpw74m— Restoring Your Faith in Humanity (@HumanityChad) April 30, 2024 -
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు!
జర్మనీలోని శ్రీ గణేష్ ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 200 కుటుంబాలు దాక పాల్గొన్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జర్మనీ రాయబారి హెచ్ఈ పర్వతనేని హరీష్ విచ్చేశారు. ఈ ఉగాది కార్యక్రమాలు తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి సారథ్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్, వాలంటీర్ టీమ్ సహాయ సహకారాలతో జయప్రదం చేశామని డాక్టర్ రఘు అన్నారు. ఈ సంప్రదాయ కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు సమాజా స్ఫూర్తికి అర్థానిచ్చేలా విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు వెల్లడించారు. అంతేగాదు ఈ ఉగాది కార్యక్రమాలు ఇంతలా గుర్తుండిపోయేలా విజయవంతం చేసినందుకు వాలంటీర్లకు, సహకరించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక కొత్త ఏడాదిని మాత్రమే కాకుండా, బెర్లిన్లో తెలుగు ప్రవాసులలో బలమైన సమాజ బంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని హైలెట్ చేసిందని నిర్వాహకులు కొనియాడారు. (చదవండి: సింగపూర్లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
నిందలూ... నిజాలూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఈ సంగతి రుజువవుతోంది. మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శ కంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు. పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్య వేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి మన అసంతృప్తిని, అభ్యంత రాన్ని తెలియజేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందో ళన వ్యక్తం చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటాన్ని కూడా ప్రస్తా వించింది. ఇక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరేసరి. అన్ని టికీ అతీతమని భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడకుండా వుండలేరు. అలాగే విమర్శలొచ్చినప్పుడూ, తప్పును ఎత్తిచూపినప్పుడూ పౌరుషం పొడుచు కురావటం కూడా సహజం. పాశ్చాత్య దేశాలు అవసరార్థమో, అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు. అయితే వాటినుంచి వచ్చే విమర్శలు అలా కాదు. అవి అరుదే కావొచ్చుగానీ ఆలోచించదగినవి. ఇందిరాగాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరకాలంలో మేధావులనూ, పౌరహక్కుల సంస్థల నేతలనూ అరెస్టు చేసిన సందర్భాల్లో పాశ్చాత్య ప్రపంచంస్పందించకపోలేదుగానీ... ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకూ, అవి ప్రాతినిధ్యంవహించే రాజ్యాలకూ అంతర్జాతీయంగా ఆమోదనీయత, విశ్వసనీయత వుంటాయి. అయితే అస మ్మతి విషయంలో వాటి వైఖరి ఎలావుందన్నదాన్నిబట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది. దాన్ని పొందాలంటే సంయమనం పాటించటం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా వుండటం అవసరమవుతాయి. అగ్రరాజ్యాలు అన్నాయని కాదుగానీ, మన దేశంలో అంతా సవ్యంగానే వున్నదని భావించగలమా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు రెండేళ్లనుంచి మద్యం కుంభకోణం గురించీ, అందులో కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా పేరు వినిపిస్తూనే వుంది. కానీ తనను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీ వాల్ వాదనకు జవాబిచ్చేందుకు మూడు వారాల వ్యవధి కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో వుండటం ఈడీ తీరుతెన్నులపై అనుమా నాలు రేకెత్తించదా? ఆమధ్య మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనపై అప్రూవర్లు ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ముందే ఆసంస్థ అంగీకరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్టు చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు. దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలంటారు. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. అన్ని పార్టీలూ తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారమిస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ వున్నదంటే నమ్మలేం. మరో మూడు నాలుగు నెలలు ఆగితే ఇందులో కొంపమునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబులేదు. నేరం నిరూపణయ్యేవరకూ నిందితుడు నిర్దోషేనని న్యాయ శాస్త్రం చెబుతుంది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు. పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణలను విస్మరించటం, నీరు కార్చటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రావా? మన దేశంలో ఇప్పటికీ ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థకు విశ్వసనీయత అధికం. దాన్ని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహారశైలి వుండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతలావుంచి దేశ పరువుప్రతిష్ఠలకే భంగం వాటిల్లుతుంది. అమెరికా రెండోసారి కూడా అన్నదనో, జర్మనీ విమర్శించిందనో, ఐక్యరాజ్యసమితి సైతం మాట్లాడిందనో కాదు... చట్టం ముందు పౌరులంతా సమానమన్న రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేదా అన్న అంశంలో ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు. సహ ప్రజాస్వామిక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో బాధ్యతతో మెలగాలనీ, దాన్ని విస్మరించటం సరికాదనీ మన విదేశాంగ శాఖ హితవు పలికింది. కానీ మానవహక్కుల ఉల్లంఘనల అంశంలో మనం కూడా వేరే దేశాల తీరుతెన్నులను విమర్శించిన సందర్భాలున్నాయని గుర్తించాలి. మనం అన్ని విషయాల్లోనూ సక్రమంగానే వున్నామన్న భావన ఇంటా బయటా కలగజేయటం ప్రభుత్వ బాధ్యత. దానికి భిన్నమైన పరిస్థితులుంటే అవి ఎందుకు తలెత్తాయో సమీక్షించుకోవటం అవసరం. -
కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంతప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్కు కూడా వర్తిస్తుంది’అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్టుపై వివాదాస్పద ప్రకటన చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చ్ 21న అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. 26న ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. బీజేపీ ఖాతాల్లోకే లిక్కర్ సొమ్ము -
Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం
బెర్లిన్: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్ తాజాగా బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. ఇదీ చదవండి.. కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా -
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కు అల్లు అర్జున్
జర్మనీ వెళ్లారు హీరో అల్లు అర్జున్. ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటారు అల్లు అర్జున్. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాప్రాముఖ్యత, చరిత్ర గురించిన అంశాలను అల్లు అర్జున్ మాట్లాడనున్నారని తెలిసింది. అంతేకాదు...ఈ ఫెస్టివల్లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ప్రత్యేక ప్రదర్శన కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్లతో అల్లు అర్జున్ మాట్లాడతారట. ఇక బెర్లిన్ ఫెస్టివల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో పాల్గొంటారు అల్లు అర్జున్. రష్మికా మందన్నా, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
బ్యాక్ టు హోమ్
మహేశ్బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిట్నెస్ ట్రైనింగ్, ఓ వర్క్షాప్లో భాగంగా మహేశ్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లవారు. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్లోని స్వగృహానికి చేరుకున్నారాయన. కాగా ఈ సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. -
వారానికి 4 రోజులే పని..ఫిబ్రవరి 1 నుంచే అమలు!
ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కంపెనీలు ఉద్యోగులకు శుభవార్త చెబుతున్నాయి. వారానికి నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహించేందుకు స్థానిక కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి. ఓ వైపు ద్రవ్యోల్బణం మరోవైపు ఇమ్మిగ్రేషన్, తక్కువ జనన రేటుతో సమస్యలను జర్మనీ ఎదుర్కొంటోంది. ఫలితంగా జర్మన్ కంపెనీలు ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఆ దేశంలో నిర్మాణ సంఘం 930,000 మంది కార్మికులకు 20శాతం కంటే ఎక్కువ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జర్మనీలోని సంస్థలు ఫిబ్రవరి 1 నుండి నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 45 కంటే ఎక్కువ సంస్థలు ఆరు నెలల పాటు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నాయి. వారానికి నాలుగు రోజుల పని కారణంగా దేశం పని-జీవిత సమతుల్యతను ఆశించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ చర్య ఆర్థిక అభివృద్ధి, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని భావించిన జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండ్నర్ చెబుతున్నారు. మరి ఈ అంశం ఎటువైపుకి దారి తీస్తుందో తెలియాల్సి ఉంది. -
జర్మనీలో మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?
జర్మనీ వెళ్లారు మహేశ్బాబు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రధానంగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ప్రీప్రోడక్షన్ వర్క్స్ను ఈపాటికే మొదలుపెట్టారు రాజమౌళి. తాజాగా ఈ పనులు మరింత ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన లుక్, మేకోవర్ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించిన పనుల కోసం మహేశ్బాబు జర్మనీ వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను విజయేంద్రప్రసాద్ దాదాపు పూర్తి చేసేశారని, వేసవిలో షూటింగ్ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. -
ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్ 'ఢీ'
Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్; అమెరికాతో జపాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరిన రెండు జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్ ఖరారవుతుంది. దాంతో భారత్తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
రోజుల వ్యవధిలో ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాల కన్నుమూత
మ్యూనిక్: రోజుల వ్యవధిలో రెండు ఫుట్బాల్ దిగ్గజాలు నేలరాలాయి. శనివారం బ్రెజిల్ మాజీ ఆటగాడు, నాలుగు సార్లు వరల్డ్కప్ విన్నర్ మారియో జగల్లో (92) తుది శ్వాస విడువగా.. ఆదివారం జర్మనీ ఫుట్బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్బాయెర్ కన్నుమూశారు. 78 ఏళ్ల ఈ జర్మన్ మాజీ కెప్టెన్ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. జర్మనీ ఫుట్బాల్లో బెకెన్బాయెర్ శిఖరం. డిఫెండర్ పొజిషన్లో ఆడే ఆయన తొలుత కెప్టెన్గా తదనంతరం కోచ్గా విజయవంతమై జర్మనీకి రెండు ప్రపంచకప్ టైటిళ్లను అందించారు. పశ్చిమ జర్మనీ కెప్టెన్గా 1974లో ప్రపంచకప్ టైటిల్ను అందించిన ఆయన 1990 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన జర్మనీకి కోచ్గానూ వ్యవహరించారు. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
భారత్ X జర్మనీ
కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్గా నిలిచింది. అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్ నాలుగో సారి ఫైనల్ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్ తేడాతో డచ్పై జయభేరి మోగించింది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్ కీపర్ మోహిత్తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడుతుంది. -
సీఎం వైఎస్ జగన్ సహకారం మరువలేనిది
పుంగనూరు: జర్మనీకి చెందిన తమకు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్ చెప్పారు. తాము చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హేగర్, ఆయన బృందం శుక్రవారం పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో పెప్పర్ మోషన్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ షన్మోహన్తో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా హేగర్ జిల్లా కలెక్టర్తో, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం పెప్పర్ మోషన్ సంస్థకు రెండో పుట్టినిల్లు అని తెలిపారు. 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఇక్కడ 800 ఎకరాలలో రూ.4,640 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 8,100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు. మూడు దశల్లో నిర్మాణం చేస్తామని తెలిపారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీతో పాటు విడిభాగాల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది: జిల్లా కలెక్టర్ పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్క్ట్రికల్ బస్సుల సంస్థ పరిశ్రమ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని జిల్లా కలెక్టర్ షన్మోహన్ కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఘన స్వాగతం పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియస్ హేగర్కు, ఆయన బృందానికి కర్ణాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి సన్మానించారు. హేగర్తోపాటు ఆ సంస్థ సీటీవో డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్డర్, సీఐవో రాజశేఖర్రెడ్డి, సీఎస్వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, ఉర్త్ ఎల్రక్టానిక్స్ ఎండీ హర్ష ఆద్య తదితరులు ఉన్నారు. -
భారత మహిళల ఓటమి
సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్కు తర్వాతి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్ ఖాన్ (24వ ని.) గోల్స్ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్ (17వ ని.), కరోలిన్ సీడెల్ (38వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లోనే 2 గోల్స్ సాధించి ముందంజలో నిలిచిన భారత్ మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ కొట్టింది. ఆఖరి క్వార్టర్లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో బెల్జియంతో తలపడుతుంది. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్బర్గ్లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్స్ట్రిప్కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!
కనువిందు చేసే కొన్ని దృశ్యాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. అంతే బెదరగొడతాయి. ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యమైన కథలే అందుకు ప్రతీకలు. జర్మనీ, సాక్సోనీ రాష్ట్రం, గోర్లిట్జ్ జిల్లా, గబ్లెంజ్ సమీపంలోని రాకోట్జ్ సరసుపైనున్న వంతెన అలాంటిదే. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన కుమ్లౌ అజేలియా రోడడెండ్రన్ పార్క్కి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రకృతి అందం.. కనురెప్పలను క్షణం కూడా వాల్చనివ్వదు. ఎటు తిరిగి చూసినా స్వప్నలోకంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వంతెనకు.. సర్కిల్ బ్రిడ్జ్, బసాల్ట్ బ్రిడ్జ్, కుమ్లౌ బ్రిడ్జ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుందరమైన ఈ వంతెన.. సరసులో ప్రతిబింబిస్తూ.. ఎటు నుంచి చూసినా.. కచ్చితమైన కొలతలతో.. వృత్తాకారంలో కనువిందు చేస్తుంది. చలికాలంలో కిందున్న నీరంతా గడ్డకట్టి.. ఓ ఆర్చ్లా ఆకట్టుకుంటుంది. అగ్నిపర్వతాల శిల నుంచి ఏర్పడిన ‘బసాల్ట్’ అనే రాతితో పాటు మరిన్ని సహజమైన రాళ్లతో ఇది నిర్మితమైందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే ఇది జనజీవనాన్ని కలిపే వారధి కాదని, కేవలం వీక్షకుల అహ్లాదం కోసం నిర్మించిన కట్టడం మాత్రమేనని కొందరు నిపుణుల ఉద్దేశం. దీన్ని 19వ శతాబ్దంలో ఓ మోతుబరి దగ్గరుండి కట్టించాడని స్థానికంగా కొన్ని కథనాలున్నా వాటికి సరైన ఆధారాల్లేవు. వైవిధ్యమైన ఒంపుతో మలచిన ఈ వంతెన.. ఎలాంటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని కొనలు.. ముళ్ల కిరీటాన్ని తలపిస్తాయి. ఇంత గొప్ప కట్టడం మనుషులకు సాధ్యంకాదని, దెయ్యాలు దీన్ని నిర్మించాయని, సైతాను ఆదేశంతో ఇది ఏర్పడిందని, ఈ వారధి సమీపంలో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ ప్రత్యేకమైన కలువ పువ్వులు, అరుదైన వృక్షజాతులు.. రకరకాల రంగులతో ఆకట్టుకుంటాయి. మరోవైపు కొందరు దైవచింతన కలవారు.. ఈ వంతెన నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తారు. ఇది మరొక ప్రపంచానికి మార్గమని సూచిస్తారు. దాన్నే బలంగా నమ్ముతుంటారు. ఇక్కడి అందాలను చూడటానికి చాలామంది ఔత్సాహికులు ఎగబడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు. చుట్టూ ఉన్న అందాలను మాత్రం తరించొచ్చు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్ని నిర్మించింది ఎవరు? ఎందుకు నిర్మించారు? ఎందుకు దెయ్యం పేరుతో భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి? అసలు ఆ కాలంలో ఇంత గొప్ప నిర్మాణం ఎలా సాధ్యమైంది లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు. --సంహిత నిమ్మన (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
జర్మనీలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
-
జర్మనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ బెర్లిన్లో బతుకమ్మ పండుగా 10 వార్షికోత్సవం అలాగే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. శనివారం బెర్లిన్లో ఈ వేడుక అద్భుతంగా జరిగింది. దశాబ్దంగా ఈ బతుకమ్మ పండుగా బెర్లిన్లో జరుతుండటం మరింత విశేషం. ఈ వేడుకలో తెలంగాణకు చెందిన వారు, తెలుగు సంతతికి సంబంధించిన విభిన్న నేపథ్యల వారు పాల్గొని వేడుకగా జరుపుకున్నారు. బెర్లిన్ తెలంగాణ కమ్యూనిటీ అక్కడ దొరికే తాజా పూలతో అద్బుతంగా బతుకమ్మను తయారుచేశారు. ఈ పండుగ ఒక విధంగా మనలో దాగున్న కళను వెలికి తీయడమే గాక మన ఐక్యతను గుర్తు చేస్తుందని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో తెలుగంణ సంప్రదాయ వంటకాలు హైలెట్గా నిలిచాయి. పాకశాస్త్ర నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్న అతిధులకు తెలంగాణ వారసత్వ వంటకాలను తమదైన శైలిలో తయారుచేసి రుచిచూపించారు. ఈసారి బెర్లిన్ తెలంగాణ అసోషియేషన్ తమ కమ్యూనిటిలోకి విభిన్న సాంస్కృతిక కమ్యూనిటీ నాయకులను కూడా చేర్చకోంది. అంతేగాదు బెర్లిన్లో కాస్మోపాటిటన్ వాతావరణానికి అర్థం పట్టేలే ఈ బతుకమ్మ పండుగ వేడుకలో విభిన్న వర్గాల ప్రతినిధులు హాజరవ్వడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా బెర్లిన్లో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు జరిగాయి. జర్మనీలోని తెలంగాణ అసోసీయేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘ చలిగంటి ఈ వేడుకును ఇంతలా జయప్రదం చేసిన వాలంటీర్లకు, బెర్లిన్ తెలంగాణ అసోసీయేషన్ కమ్యూనిటీ బృందానికి హృదయపూర్వక ధన్వావాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేలా ప్రోత్సహించడానికి వారి చేస్తున్న అచంచలమైన కృషిని, నిబద్ధతను కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో జర్మనీ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా రఘు చలిగంటి (అధ్యక్షుడు), బాల్రాజ్ అందె (కోశాధికారి), రమణ బోయినపల్లి (వైస్ ప్రెసిడెంట్), అలేక్య బి (సాంస్కృతిక కార్యదర్శి), శరత్ రెడ్డి (కార్యదర్శి), యోగానంద్ (మీడియా కార్యదర్శి), శ్రీనాథ్ (మీడియా కార్యదర్శి), నటేష్ అండ్ మిస్టర్ నరేష్ (ఆఫీస్ బేరర్స్) తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సింగపూర్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!) -
రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు
పుల్లల చెరువు మండలం సుద్దకురువ గిరిజన తండా నుంచి బనావత్ పవన్కుమార్ నాయక్ జర్మనీలో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ రైతు. తనకున్న 35 సెంట్లతో పాటు, ఐదు ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు కరాళ నృత్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది. ఇక పవన్కుమార్ చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నా కొడుకు ఆసక్తి గమనించిన తల్లి పద్మావతి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తూ వస్తోంది. పవన్కుమార్ కూడా చదువుపై దృష్టిని లగ్నం చేశాడు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికై జర్మనీలో చదువుకుంటున్నాడు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పవనకుమార్ తల్లికి ఇంటి పట్టా ఇచ్చి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆమెకు ప్రతి నెలా వితంతు పెన్షన్ రూ.2,750 ఇచ్చి ఆదుకుంటోంది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక అప్పుల పాలయ్యామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నా బిడ్డను జర్మనీ పంపించి చదివిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది . -
జర్మనీలో విప్రో సైబర్ డిఫెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్డార్ఫ్లో సైబర్ డిఫెన్స్ సెంటర్ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది. -
G20 Summit: బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ► ‘మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్చేశారు. ► జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్లో పర్యటించిన ఓలాఫ్కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ► శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ► వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ► జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ► వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ► డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ► వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
బెర్లిన్లో ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. దీపావళికి కుంభాభిషేకం!
యూరప్ దేశమైన జర్మనీలో 20 ఏళ్లపాటు సాగిన విశేష కృషి అనంతరం హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. రాజధాని బెర్లిన్లో నిర్మితమైన ఈ గణేశ దేవాలయం 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి సాగించిన అవిశ్రాంత కృషి ఫలితం. కాగా ఈ ఆలయంలో ఇంకా దేవుని విగ్రహం ప్రతిష్ఠితం కాలేదు. ఈ ఏడాది (2023)దీపావళి సందర్భంగా బ్రహ్మాండమైన పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మీడియాతో మాట్లాడిన విల్వనాథన్ కృష్ణమూర్తి తాను 50 సంవత్సరాల క్రితం జర్మనీకి వచ్చానని తెలిపారు. ఆయన బెర్లిన్లో ఉంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేశారు. జర్మనీకి వచ్చినప్పటి నుండి అతని కల దేవాలయం నిర్మించడం. ఈ కల సాకారం అయ్యేందుకు 2004లో ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో బెర్లిన్ జిల్లా యంత్రాంగం ఆలయ నిర్మాణానికి హాసెన్హైడ్ పార్క్ వెలుపల ఒక ప్లాట్ను కేటాయించింది. అదిమొదలు విల్వనాథర్ ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు. 2007లోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ 2010 వరకు కూడా ప్రారంభం కాలేదు. రుణాలు తీసుకువచ్చి ఆలయం నిర్మించడం తనకు ఇష్టం లేదని కృష్ణమూర్తి తెలిపారు. అందుకే ఆయన విరాళాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బెర్లిన్లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని, దీంతో విరాళాలు అందడం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. బెర్లిన్లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారంతా విరాళాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా యువత హృదయపూర్వకంగా విరాళాలు అందజేస్తున్నారన్నారు. రాబోయే దీపావళి సందర్భంగా 6 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు విల్వనాథన్ కృష్ణమూర్తి తెలిపారు. ఇది కూడా చదవండి: అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్కు.. Germany's largest #Hindutemple is set to open in Berlin in November 2023. Sri-Ganesha Hindu Temple will be located in the tallest high-rise building currently under construction in Berlin, known as the "Amazon Tower." Opening of the temple is expected to coincide with the… pic.twitter.com/qwkq5SQ7IH — Centre for Integrated and Holistic Studies (@cihs_india) September 4, 2023 -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్కు చేసిన కరోనా టెస్ట్లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. భర్త నోట్ బుక్లో ఏముంది?
ఒక వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బంధీగా ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు టార్చర్ చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం జర్మనీలో చోటుచేసుకుంది. ఫోను చేతికి చిక్కడంతో.. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్బ్యాక్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 2011లో భర్త ఆమెను కిడ్నాప్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని.. భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్ రూం చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్ రూమ్ తలుపులు తెరిపించారు. సెమీ న్యూడ్గా బాధితురాలు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్ రూమ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. నోట్ బుక్లో టార్చర్ వివరాలు ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం. ఇది కూడా చూడండి: చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు.. ఆ ట్రాప్లో పడితే ... అంతే సంగతులు ! -
విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్లోను, 7.50 మీటర్ల మోడల్లోను దొరుకుతుంది. ‘సీల్వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. (చదవండి: ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు.. జ్యోతి సురేఖకు హ్యాట్సాఫ్!
World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్స్లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు. కాగా జర్మనీలోని బెర్లిన్లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్స్లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక బుధవారం నాటి ఈవెంట్లో రెండో సీడ్గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. మన అమ్మాయి బంగారం కాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. HISTORIC win for India 🇮🇳🥇 New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR — World Archery (@worldarchery) August 4, 2023 -
రెండో సీడ్గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే..
అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనకొండ ఎక్కడుందంటే.. ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్లోని సెన్కెన్బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. An exhibit of an anaconda devouring a capybara at the Senckenberg Natural History Museum in Frankfurt is undergoing restoration. Taxidermists say climate change is one of the reasons why it needs a makeover pic.twitter.com/KM1LataPZL — Reuters (@Reuters) July 6, 2023 ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే.. ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి. We will be next. #ExtinctionRebellion #DieIn under dinosaurs at the @Senckenberg Natural History Museum in #Frankfurt, during the #MuseumsNight #ndmffm. @ExtinctionR @ExtinctionR_DE pic.twitter.com/jIlP4MOzJ8 — JuliaKrohmer (@JuliaKrohmer) May 12, 2019 అనకొండలో రకాలివే.. అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది. @jsnell @imyke my thought when you spoke of the snail and the pig on Upgrade. My favorite exhibit as a kid in the natural history museum in Frankfurt pic.twitter.com/TkhOGYLGJZ — Jenni Brehm (@Pfenya) May 13, 2018 ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. -
ప్రియుడిని పెళ్లాడిన బిగ్బాస్ బ్యూటీ.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
బాలీవుడ్ బుల్లితెర నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ శ్రీజితా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మైఖేల్ బ్లోమ్-పేప్ను పెళ్లి చేసుకుంది. జర్మనీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను శ్రీజిత దే తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! ) శ్రీజిత ఇన్స్టాలో రాస్తూ..'ఈ రోజు మన జీవితంలో ఎప్పుడు లేని ఒక గొప్ప ప్రారంభం. ఒకరి చేతిలో ఒకరి చేయి వేసిన మధుర క్షణం' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే తాను ప్రియుడిని పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరోసారి ఇండియాకు వచ్చాక భారతీయ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కాగా.. శ్రీజిత దే బిగ్ బాస్ -16వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఉత్తరన్ సీరియల్తో బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకుంది. (ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!) View this post on Instagram A post shared by Sreejita De (@sreejita_de) -
ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!
బాలీవుడ్ బుల్లితెర నటి శ్రీజిత దే త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఉత్తరన్ సీరియల్లో ముక్తా రాథోడ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకున్న భామ తన ప్రియుడు మైఖేల్ బ్లోమ్ను పెళ్లాడనుంది. బిగ్ బాస్-16వ సీజన్లో మెరిసిన ముద్దుగుమ్మ పలు టీవీ షోలలో కనిపించింది. ఆమె బాలీవుడ్ చిత్రం తాషన్లో కూడా నటించింది. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) జూలై 1 జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేసింది. మా పెళ్లికి మీ అందరికీ ఆహ్వానం అంటూ వెడ్డింగ్ కార్డ్ను పంచుకుంది. అయితే తన స్నేహితులు చాలా మంది వివాహానికి హాజరు కాకపోవడంతో తాను నిరాశకు గురవుతున్నట్లు శ్రీజిత తెలిపింది. ఇన్స్టాలో రాస్తూ..'నేను నా పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ అదే సమయంలో ఒక విషయం నన్ను బాధపెడుతోంది, నా సన్నిహితలు, మిత్రులు నా వివాహానికి హాజరు కావడం లేదు. ఇది నాకు కొంచెం బాధ కలిగించింది. ఈ ప్రత్యేక ఈవెంట్లో లేనందుకు ప్రత్యేకమైన ప్లాన్ చేస్తున్నా. ఇండియాలో మరోసారి జరిగే వివాహంలో తప్పకుండా కలుసుకుంటాం. అప్పుడు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అంటూ పోస్ట్ చేసింది. జూలై 1న జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజిత.. ప్రియుడు మైఖేల్ బ్లోమ్తో 21 డిసెంబర్ 2021న నిశ్చితార్థం చేసుకుంది. (ఇది చదవండి: అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!) View this post on Instagram A post shared by Sreejita De (@sreejita_de) View this post on Instagram A post shared by ETimes TV (@etimes_tv) -
3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
బెర్లిన్: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్లింజెన్లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. -
ద్రవ్యోల్బణంపై రుతుపవనాల ప్రభావం
ముంబై: భారత్లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది. జూలై, ఆగస్ట్లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. వృద్ధిపైనా ప్రభావం రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. -
ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!
మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ బాగా వచ్చేందుకు ఇంటి మేడపైకి, ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్తాం. మాగ్జిమమ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకపోతే నానా తిప్పలు పడి మరీ యాక్సెస్ అయ్యేలా చేసుకుంటాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్ పనిచేస్తాయ్. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకెళ్తే..జర్మనీలో ఉంది ఈ రాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. దానిలో థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ అమర్చబడి ఉంది. దాన్ని మంటల వద్ద పెడితే వేడిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి. వాస్తవానికి అది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్ అలైవ్ అని పిలుస్తారు. ఎరామ్ బర్తోల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆ ఆవిష్కరణ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్ల వాయిస్ ఓవర్) -
ఏపీలో వైద్య విధానాలు భేష్
సాక్షి, అమరావతి: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వంతో కలి సి పనిచేసేందుకు సిద్ధంగా ఉ న్నట్లు జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ చెప్పారు. విజ్ఞా న సముపార్జనలో భాగంగా వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనల్లో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గురువారం మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినితో ఆమె భేటీ అయ్యారు. కుచ్లర్ మాట్లాడుతూ..కోవిడ్ సమయంలో భారత్ అందించిన సహాయానికి జర్మనీ రుణపడి ఉంటుందన్నారు. ఏపీలోనూ కోవిడ్ బాధితులకు వైద్యం అందించిన తీరును ప్రశంసించారు. యోగ, ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విధానాలను తమ దేశంలో అమలు చేసేలా.. అక్కడి వైద్య సాంకేతికతను ఏపీకి అందించేలా ఒప్పందాలకు ప్రతిపాదించారు. మంత్రి రజిని మాట్లాడుతూ..రూ.16వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తూ ఏపీని హెల్త్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ టాప్లో నిలుస్తోందన్నారు. ఏపీలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణకు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారని..వారికి కళాశాలల్లో జర్మన్ భాష నేరి్పంచేలా ఆలోచిస్తున్నామన్నారు. జర్మనీ వెళ్లే తమ విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితితో వీసాలు ఇవ్వాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా తమ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. జర్మనీ వైద్య రంగంలో మానవ వనరుల కొరతను భారత్ సాయంతో అధిగమిస్తామని మైకేలా చెప్పగానే..ఇప్పటికిప్పుడు 10వేల మంది నర్సింగ్ సిబ్బందిని జర్మనీకి పంపేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖలోని మెడ్టెక్ జోన్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా మైకేలా సానుకూలంగా స్పందించారు. వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వెంటేశ్వర్లు, డీఎంఈ నర్సింహం పాల్గొన్నారు. -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
పనోడి సాయంతో పేషెంట్కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..
వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్కి కాలు తీసేవేసే ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్ సాయం తీసుకున్నాడు. పేషెంట్కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్ థియోటర్ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా, సర్జరీ చేయించుకున్న పేషెంట్కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ) -
ఉక్రెయిన్కు జర్మనీ భారీ సాయం
బెర్లిన్: ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక వ్యవస్థలు, మందుగుండు సామగ్రి సహా సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అదనపు సైనిక సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఉక్రెయిన్కు మద్దతు విషయంలో తాము నిజాయితీతో ఉన్నామని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మొట్ట మొదటిసారిగా జెలెన్స్కీ ఆదివారం జర్మనీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. రష్యా ఇంధనంపై ఆధారపడిన జర్మనీని ఉక్రెయిన్ మొదటి నుంచి అనుమానిస్తోంది. అయితే, ఎంజెలా మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ చాన్సెలర్గా బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్–జర్మనీల మధ్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. -
వైరల్ వీడియో: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి..
-
150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్
బెర్లిన్: జర్మనీలో ఓ వంతెన క్షణాల్లో నేలమట్టమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లుడెన్స్కీడ్లోని రమీడ్ వ్యాలీలో ఉన్న ఈ బ్రిడ్జిని 1965, 1968 మధ్య నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో కొద్ది కాలంగా మూసివేశారు. ఎలాంటి వాహనాలను దీనిపైకి అనుమతించడం లేదు. ఈక్రమంలోనే ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేశారు అధికారులు. చుట్టుపక్కల ఇళ్లు, భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని బ్రిడ్జిని కూల్చివేశారు. 450 మీటర్ల పొడవైన ఈ వంతెనను నేలమట్టం చేసేందుకు 150 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు అధికారులు. ఈ బ్రిడ్జి కూల్చివేతను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది అక్కడకు తరలివెళ్లారు. కొద్ది దూరంలో నిల్చోని చూశారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్గా మారాయి. చదవండి: షాకింగ్.. భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..! -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
మూడు రోజుల వ్యవధిలో విశ్వవిజేతకు రెండోసారి షాకిచ్చిన భారత్
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్లో భాగంగా ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 6–3 గోల్స్తో గెలిచింది. మూడు రోజుల వ్యవధిలో జర్మనీపై భారత్కిది రెండో గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో భారత్ 17 పాయింట్లతో ‘టాప్’లోకి వచ్చింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (24వ, 46వ ని.లో), అభిషేక్ (22వ, 51వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (26వ ని.లో), జుగ్రాజ్ (21వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జర్మనీ తరఫున గ్రామ్బుష్ (3వ ని.లో), పీలాట్ (23వ ని.లో), హెల్విగ్ (33వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
ఏడాదిన్నరగా కస్టడీలోనే.. మా పాపను భారత్కు రప్పించండి: కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు
భారతీయులు బతుకు దెరువు కోసం దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తెలియకుండానే ఆ దేశాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా జర్మనీకి వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తమ చిన్నారికి దూరంగా గడపాల్సి వస్తోంది. చివరికి ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. అసలేం ఏం జరిగిందంటే... ఇదేం అన్యాయం.. మా పాపను ఇప్పించండి గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ జంట ఉపాధి కోసమని జర్మనీకి వెళ్లారు. అక్కడ ఆ దంపతులకి ఓ అడబిడ్డ(అరిహా షా)జన్మించింది. ఓ రోజు అనుకోకుండా ఆ పాప ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తు ప్రైవేట్ పార్ట్ దెబ్బతింది. వెంటనే పాప చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అతను చెకప్ చేసి పాప బాగుందని చెప్పి వాళ్లని వెనక్కి పంపారు. కొన్ని రోజుల తదుపరి తనిఖీ కోసం వెళ్ళగా.. ఈ సారి కూడా క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు కానీ జర్మనీలోని చైల్డ్ సర్వీసెస్ అధికారులని పిలిచి, వారి కస్టడీలో ఆ పాపని ఉంచారు. దీంతో షాకైన తల్లిదండ్రులు అధికారులను గట్టిగా నిలదీశారు. పాపపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పారు. అన్ని రిపోర్ట్లు ఇచ్చినా.. మళ్లీ మొదటికి అయితే ఆ దంపతులు వాళ్ల పాపను వెనక్కి తెచ్చకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 2021లో పాపపై లైంగిక వేధింపుల అనుమానాలాను ఆ ఆసుపత్రిలోని వైద్యులు తోసిపుచ్చిన రిపోర్ట్ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో మరింత స్పష్టత కోసం తల్లిదండ్రుల డీఎన్ఏ పరీక్ష, పోలీసు విచారణ, వైద్య నివేదికలు ఇలా వీటి తర్వాత, లైంగిక వేధింపుల కేసును ఫిబ్రవరి 2022లో మూసేశారు. ఈ ఆధారాలతో ఆ దంపతులు జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులను కలిశారు. అయితే వారు ఆ పాపను ఇవ్వకపోగా తిరిగి దంపతులపై కేసు పెట్టారు. దానిపై పాప తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా... అక్కడ వాళ్లు పిల్లలను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో సైకాలజిస్టు పాప తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు. దీంతో వారికున్న దారులన్నీ మూసుకుపోయాయి. ప్రధాని మాకు న్యాయం చేయాలి.. ఈ విషయంపై పాప తల్లి మాట్లాడుతూ.. జర్మనీలో ఉన్న తమ పాపను కలిసేందుకు ప్రతి నెలా ఒక గంట పాటు అనుమతిస్తున్నారని పేర్కొంది. చివరికి పాపను భారత్కు పంపేందుకు అక్కడి అధికారులు అంగీకరించట్లేదని అవేదన వ్యక్తం చేసింది. చేసేదేమి లేక అరిహా షా తల్లిదండ్రులు ఇటీవలే ముంబైలో దిగారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, జర్మనీ ప్రభుత్వం నుంచి తమ కుమార్తెను తిరిగి ఇప్పించాలని ఆ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. మూడేళ్ల బాలిక గత ఏడాదిన్నర కాలంగా జర్మనీ అధికారుల కస్టడీలో ఉంది. -
ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్లెస్గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్లెస్గా సన్బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్లెస్గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
FIH Pro League: జర్మనీపై భారత్ విజయం
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత్ ఖాతాలో కీలక గెలుపు చేరింది. రూర్కెలాలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3–2 గోల్స్ తేడాతో ప్రపంచ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (30వ నిమిషం) పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించగా... సుఖ్జీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ (31వ ని., 42వ ని.) నమోదు చేశాడు. జర్మనీ నుంచి రెండూ ఫీల్డ్ గోల్స్ వచ్చాయి. 44వ నిమిషంలో కాఫ్మన్ పాల్ ఫిలిప్, 57వ నిమిషంలో స్ట్రత్ఆఫ్ మైకేల్ గోల్స్ కొట్టారు. మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3–1తో ఆధిక్యంలో నిలిచినా...చివరి క్వార్టర్లో జర్మనీ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీని భారత్ సద్వినియోగం చేసుకోగలిగింది. భారత్ తమ తర్వాతి పోరులో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
Hamburg shooting: జర్మనీ చర్చిలో నరమేధం!
బెర్లిన్: జర్మనీలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హాంబర్గ్లోని ఓ చర్చిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి కారకులు ఎవరు? కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, స్థానికులను బయటికి రావొద్దని సూచించారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ యెహోవా విట్నెస్ సెంటర్ అది. మూడు అంతస్థుల భవనం. మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందంటూ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు ఎవరో. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. కింది ఫ్లోర్లో రక్తపు మడుగుల్లో కొందరు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. వాళ్లలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పైఫ్లోర్లో ఓ వ్యక్తి మృతదేహాం పడి ఉండడాన్ని గుర్తించారు. బహుశా ఆ వ్యక్తే కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఘాతుకం అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడింది అతనేనా? లేదా ఆ దుండగుడు పరారీలో ఉన్నాడా? అసలు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జర్మనీ మీడియా సంస్థలు చనిపోయింది ఆరుగురే అని చెప్తుండగా.. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు హైఅలర్ట్ జారీ చేసిన పోలీసులు.. స్థానికులను బయటకు రావొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందాలని కోరారు. ఇదిలా ఉంటే.. జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపుల దాడులతో జర్మనీ గత కొన్నేళ్లుగా దాడులకు గురవుతోంది. ప్రముఖంగా చెప్పుకోవాలంటే.. డిసెంబర్ 2016లో బెర్లిన్లోని ఓ క్రిస్మస్ మార్కెట్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 12 మంది మరణించారు. ఇక ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు జరిపిన కాల్పుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. -
సోలిస్ ట్రాక్టర్స్ చేతికి జర్మనీ కంపెనీ థాలర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ గ్రూప్ అనుబంధ సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అగ్రికల్చరల్ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్ ట్రాక్టర్స్ యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అలాగే 19–75 హెచ్పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఎండీ దీపక్ మిట్టల్ తెలిపారు. జర్మనీలోనీ థాలర్ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్ కార్యక్రమంలో ఐటీఎల్ గ్రూప్ ఎండీ దీపక్ మిట్టల్, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్ఫ్రెడ్ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శాంతి ప్రక్రియలో భాగస్వామ్యానికి సిద్ధం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే చెబుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి శాంతి ప్రక్రియలోనైనా భాగస్వామిగా మారేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో శనివారం జర్మన్ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్తో చర్చలు జరిపారు. ఏడాదిగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం పర్యవసానాలు ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత వంటి పలు అంశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, వాతావరణ మార్పు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో షోల్జ్..‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తీవ్ర విపత్తు, ఇది ప్రపంచంపై విపరీత దుష్ప్రభావాలను కలుగజేసింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సహా అన్ని వేదికలపై మనం వేసే అడుగులపై స్పష్టత అవసరం’అని పేర్కొన్నారు. హింసామార్గం ద్వారా సరిహద్దులను ఎవరూ మార్చ జాలరని షోల్జ్ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్వేచ్ఛావాణిజ్యం ఒప్పందం(ఎఫ్టీఏ), పెట్టుబడుల రక్షణ ఒప్పందాలను సాధ్యమైనంత తొందరగా ఖరారు చేయాలనుకుంటున్నట్లు షోల్జ్ చెప్పారు. భారత్ వైఖరి మొదట్నుంచీ అదే ‘ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మొదట్నుంచీ కోరుతోంది. ఇందుకు సంబంధించి జరిగే శాంతి ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఇదే విషయం కుండబద్దలు కొట్టిందన్నారు. ‘భారత్, జర్మనీల మధ్య రక్షణ, భద్రత సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది. ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలను అన్వేషించాలి. ఉగ్రవాదం, వేర్పాటు వాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని మోదీ అన్నారు. భారత్లో రెండు రోజుల పర్యటనకు గాను షోల్జ్ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. -
India Buying Russian Oil: భారత్ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే.. ఇలా చేశారంటే..
బెర్లిన్.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్ యూనియన్లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే. అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్ అగ్రికల్చర్ను మరింత సీరియస్గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 200 కమ్యూనిటీ గార్డెన్లు.. పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు. బెర్లిన్లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్స్కీ అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. బెర్లిన్లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్ కూరగాయల డిమాండ్లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్స్కీ పేర్కొన్నారు. అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. సవాళ్లు అనేకం.. నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా? నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు. అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మారియన్ డి సిమోన్. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలు.. సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి. స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్ గార్డెనింగ్పై సీరియస్గా దృష్టి పెట్టడం బెర్లిన్కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?! -పంతంగి రాంబాబు చదవండి: ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి! -
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ
భువనేశ్వర్: 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్ డెత్’లో తొలి షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్లో నెదర్లాండ్స్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. -
జర్మనీ నిర్ణయం సబబేనా?
ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రేపో మాపో పరిసమాప్తం కాకతప్పదని, పెను సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవటం మొదలవుతుందని ఆశిస్తున్నవారిని తాజా పరిణామం తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఉక్రెయిన్కు లెపార్డ్ 2 రకం భారీ యుద్ధ ట్యాంకులు అందజేయడానికి గత కొన్ని నెలలుగా ససేమిరా అంటున్న జర్మనీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. యుద్ధంలో ఆయుధ సంపత్తి ప్రధానమే కావొచ్చుగానీ... ప్రతిఘటనదారుల సంకల్పబలం ముందు అవి దిగదుడుపేనని యుద్ధ నిపుణులంటారు. ఒక చిన్న దేశం వియత్నాం ముందు అరవయ్యో దశకంలో అమెరికా చిత్తయిన ఉదంతం మొదలుకొని తాజాగా రష్యాపై ఉక్రెయిన్ సాగిస్తున్న ప్రతిఘటన వరకూ అది రుజువవుతూనే ఉంది. నెలరోజుల్లో ఉక్రెయిన్ను పాదాక్రాంతం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది గడిచాక దాన్నుంచి బయటి కొచ్చే దారీతెన్నూ కానక ఆపసోపాలు పడుతున్నారు. అందరూ ఏకమై పుతిన్ మెడలువంచి ఆయన్ను చర్చలకు ఒప్పించాల్సివున్న ఈ తరుణంలో ఉక్రెయిన్కు ఆయుధాలందిస్తూ ఆ యుద్ధాన్ని మరింత సాగదీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే జర్మనీ అంత సులభంగా ట్యాంకు లివ్వటానికి అంగీకరించలేదు. అమెరికా తన ఎం1 అబ్రామ్ ట్యాంకుల్ని కూడా తరలించేందుకు ఒప్పుకుంటేనే లెపార్డ్ 2 ట్యాంకులు అందిస్తామన్న షరతు విధించింది. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్ ఒలోఫ్ షుల్జ్ మనసు మారేలా చేసేందుకు అమెరికా అన్నివిధాలా ప్రయత్నించింది. జర్మనీలోని పాలక, ప్రతిపక్షాలతోపాటు నాటో కూటమి దేశాలు సైతం షుల్జ్పై ఒత్తిళ్లు తెచ్చాయి. నేరుగా ఉక్రెయిన్కు ఇవ్వటం అభ్యంతరమైతే తమకు సరఫరా చేసిన లెపార్డ్లివ్వటానికైనా అనుమ తించాలని పోలెండ్ గత కొన్ని వారాలుగా డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇది ట్యాంకు లివ్వటంతో ఆగదు. విమాన విధ్వంసక చీతా ట్యాంకులివ్వాలని కూడా జర్మనీపై ఒత్తిడి ఉంది. వాటితోపాటు ఉక్రెయిన్ ఎఫ్–16 యుద్ధ విమానాలివ్వాలని చాన్నాళ్లుగా అమెరికాను కోరుతోంది. ఉక్రెయిన్కు ఏడాదిగా జర్మనీ చేస్తున్న సాయం తక్కువేం కాదు. కానీ అదంతా నాటో కూటమి సాయంలో భాగంగా ఉంది. ప్రత్యక్షంగా ట్యాంకులు పంపటం మొదలైతే ఆ చర్య రష్యాను రెచ్చ గొడుతుందన్న భయం షుల్జ్కి ఉంది. అదే జరిగితే ఆర్థికంగా, సైనికంగా కూడా జర్మనీ నష్టపోతుందని ఆయన అంచనా. దానికితోడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని జర్మనీకి ఆ దేశంపై ఎన్నో సంశయాలున్నాయి. యుద్ధంలోకి దిగాక చివరివరకూ అమెరికా అండగా ఉంటుందా అన్నది దాని ప్రధాన సందేహం. అబ్రామ్ ట్యాంకులు విడుదల చేయటం ససేమిరా కుదరదని అధ్యక్షుడు బైడెన్ చెప్పటం ఆ సందేహాన్ని మరింత పెంచింది. అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ జర్మనీని ఈ విషయంలో ఒప్పించటానికి అన్నివిధాలా ప్రయత్నించి విఫలమయ్యాక చివరకు బైడెన్ను అంగీకరింపజేయగలిగారు. అయితే తన అమ్ములపొదిలో ఉన్న ట్యాంకులు కాకుండా తయారీదారులనుంచి కొనుగోలు చేసుకోవాలని అమెరికా అంటోంది. జర్మనీకి మరో సమస్య కూడా ఉంది. దానిదగ్గర ప్రస్తుతం లెపార్డ్ 2 ట్యాంకులు భారీ సంఖ్యలో లేవు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 4,000 వరకూ ఉండే ఆ ట్యాంకుల సంఖ్య ఇప్పుడు 300కు పడిపోయింది. వాటిని పెంచుకోవాలంటే చాన్నాళ్లు పడుతుంది. పైగా తోటి యూరప్ దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేసిన ట్యాంకులకు విడి భాగాలు అందించాల్సివుంది. నిజానికి అమెరికా సైతం అలాంటి అభ్యంతరమేచెప్పింది. ప్రస్తుతం తమ బలగాల దగ్గరున్న 4,000 ట్యాంకులు దేశ భద్రతరీత్యా కదల్చటం సాధ్య పడదంటున్నది. అందుకు బదులు కొనుగోలు చేసుకోవాలంటున్నది. అమెరికా తయారీ అబ్రామ్ లముందు లెపార్డ్లు కొంత తీసికట్టే. గల్ఫ్ యుద్ధంలో, 2003 నాటి ఇరాక్ దురాక్రమణలో, అఫ్గానిస్తాన్ దురాక్రమణలో అమెరికాకు అబ్రావ్ులు అక్కరకొచ్చాయని సైనిక నిపుణులంటారు. అయితే ఇందుకు ఎంతో సమన్వయం అవసరం. అఫ్గాన్లో మందుపాతరలనూ, ఇతర బాంబు దాడులనూ అవి తట్టుకున్నాయి. కానీ వాటి సాంకేతికత అత్యంత సంక్లిష్టమైనది. నెలల తరబడి శిక్షణ ఉంటేనే వాటిని వినియోగించటం సాధ్యం. అదీగాక అబ్రామ్ల వ్యయం, వాటి విడి భాగాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి. ఈ విషయంలో లెపార్డ్లు మెరుగే అయినా వాటిపైన కూడా ప్రత్యేక శిక్షణ అవసరం. అందువల్ల తక్షణం ఈ ట్యాంకులు యుద్ధ క్షేత్రానికి రాలేవు. తనపై నేరుగా లడాయికి దిగే ధైర్యం నాటోకు ఉండదని, ఆ కూటమిలో చీలిక రావటం ఖాయమని మొదటినుంచీ అనుకుంటున్న రష్యాకు జర్మనీ నిర్ణయం శరాఘాతమే. నేరుగా తమ గడ్డపై దాడి చేయగల భారీ ట్యాంకుల్నీ, అధునాతన యుద్ధ విమానాలనూ మోహరిస్తే ఆత్మ వినాశనం కొని తెచ్చుకున్నట్టేనని రష్యా చేస్తున్న హెచ్చరికల సారాంశం పుతిన్ మొదటినుంచీ బెదిరిస్తున్న అణుయుద్ధమే అయితే ప్రపంచానికి చేటుకాలం దాపురించినట్టే. తమ ఆహార అవస రాల్లో 80 శాతం వరకూ ఉక్రెయిన్పైనే ఆధారపడ్డ ఈజిప్టువంటి దేశాలు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. ఇతరత్రా ఉత్పత్తులు మందగించి ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించేలా మారణాయుధాలు తరలించటంకాక యుద్ధం ఆపేందుకు అవసరమైన ఇతరత్రా చర్యలన్నిటిపైనా దృష్టి సారించాలి. ఆ విషయంలో శాంతిని కోరుకునే ప్రపంచ ప్రజానీకం ఒత్తిళ్లు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి కుదుటపడుతుంది. -
Hockey WC 2023: 13 ఏళ్ల తర్వాత సెమీస్లోకి జర్మనీ
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భువనేశ్వర్లో బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’ లో 4–3తో ఇంగ్లండ్ను ఓడించింది. నిరీ్ణత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. 2010 తర్వాత ఈ మెగా టోరీ్నలో జర్మనీ సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–1తో కొరియాను ఓడించి సెమీస్ చేరింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో ఆ్రస్టేలియాతో జర్మనీ; బెల్జియంతో నెదర్లాండ్స్ ఆడతాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు: జర్మనీ
బెర్లిన్: తమ మిత్ర దేశాలకు కచ్చితంగా సహకరిస్తామని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ హామీ ఇచ్చారు. రష్యా సైన్యంపై పోరాడుతున్న ఉక్రెయిన్కు అత్యాధునిక లియోపార్డ్–2 ఏ6 యుద్ధ ట్యాంకులు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్కు తమ సొంత ఆయుధాగారం నుంచి తొలుత ఒక కంపెనీలు ట్యాంకులను (14 వాహనాలు) పంపించనున్నట్లు జర్మనీ ప్రభుత్వం ఒక తాజాగా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్కు మొత్తం 88 యుద్ధ ట్యాంకులను త్వరలో సమకూర్చాలని జర్మనీతోపాటు మిత్రదేశాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్కు సాయం అందించే విషయంలో తమ మిత్ర దేశాలతో కలిపి పని చేస్తున్నామని ఒలాఫ్ షోల్జ్ వెల్లడించారు. తమ దేశంలో తయారైన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సైన్యం మరోసారి రష్యా సేనలపై ఎక్కుపెట్టబోతోందని జర్మనీ సైనికాధికారి ఎకెహర్డ్ బ్రోస్ చెప్పారు. రష్యా దండయాత్రను అడ్డుకొనేలా ఉక్రెయిన్కు బాసటగా నిలవాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్కు అందుతున్న విదేశీ సైనిక సాయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు. -
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్తో క్వార్టర్స్ బెర్త్లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్ల్లో జపాన్తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో జపాన్పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
బెర్లిన్: సంక్రాంతి పండుగను దేశదేశాల్లోని తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో సంక్రాంతి పర్వదినాన్ని తెలుగువారు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు భారత రాయబారి పర్వతనేని హరీష్, ఆయన సతీమణి నందిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆట పాటలతో సాగిన వేడుకల్లో పిల్లాపాపలతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. అమికల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శార్వరి పనంగిపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన, సర్వాణి గురజాడ శాస్త్రీయ గానం సభికులను అలరించాయి. పిల్లల కోసం డ్రాయింగ్ పోటీలు.. మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. బెర్లిన్లో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వారికి దౌత్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వేడుకల నిర్వహణలో మద్దతుగా నిలిచిన శివమ్ భాయ్, కృష్ణ మూర్తి, జైరాం నాయుడు, శ్రీనివాస్లకు ‘టాగ్’ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ‘టాగ్’ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు రామ్ బోయినపల్లి, కార్యదర్శి అలేఖ్య భోగ, కోశాధికారులు బాల్రాజ్ అందె, యోగానంద్ నాంపల్లి, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ కమిడి, నరేష్ తౌతం, సోషల్ మీడియా సెక్రటరీలు శ్రీనాథ్, శివరామ్.. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. (క్లిక్ చేయండి: వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు) -
రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా రిలయన్స్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలను కొనుగోలు చేసిన కంపెనీ తాజాగా జర్మనీ దిగ్గజం మెట్రో ఏజీకి భారత్లో ఉన్న టోకు వ్యాపార విభాగాన్ని దక్కించుకుంటోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెట్రో ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 2,850 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ డీల్ పూర్తి కానుంది. ‘చిన్న వ్యాపారస్తులు, సంస్థల క్రియాశీలక భాగస్వామ్యంతో విశిష్టమైన వ్యాపార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్న మా లక్ష్యానికి మెట్రో ఇండియా కొనుగోలు తోడ్పడుతుంది‘ అని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ‘వృద్ధి చెందుతున్న, లాభదాయక హోల్సేల్ వ్యాపారాన్ని సరైన సమయంలో విక్రయిస్తున్నాం. మెట్రోను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ సరైన భాగస్వామి కాగలదని మేము విశ్వసిస్తున్నాం‘ అని మెట్రో ఏజీ సీఈవో స్టీఫెన్ గ్రూబెల్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇప్పటిదాకా భారీ కిరాణా స్టోర్స్ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిందని, మెట్రో హోల్సేల్ బిజినెస్ కొనుగోలు చేయడం దానికి ఉపయోగకరంగా ఉండగలదని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ వెల్లడించింది. లాట్స్ హోల్సేల్ సొల్యూషన్స్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న సియామ్ మాక్రో వంటి సంస్థలు కూడా మెట్రోను కొనుగోలు చేసేందుకు పోటీపడినా చివరికి రిలయన్స్ దక్కించుకుంది. రూ. 7,700 కోట్ల అమ్మకాలు .. భారత్లో మెట్రో కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 21 నగరాల్లో 31 స్టోర్స్ను కంపెనీ నిర్వహిస్తోంది. వీటిలో సగం స్టోర్స్ దక్షిణాదిలోనే ఉన్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. పండ్లు, కూరగాయలు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తుల వరకూ వివిధ ఉత్పత్తులను హోటల్స్, రెస్టారెంట్లు, ఆఫీసులు, కంపెనీలు, చిన్న రిటైలర్లు, కిరాణా స్టోర్స్ మొదలైన వర్గాలకు మెట్రో విక్రయిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 7,700 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. కంపెనీ భారత్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. 30 లక్షల మంది వ్యాపార కస్టమర్లు ఉండగా 10 లక్షల కస్టమర్లు క్రమం తప్పకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 16 వేల పైగా రిలయన్స్ స్టోర్స్.. ఆర్ఆర్వీఎల్కు 16,600 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. 18 బిలియన్ డాలర్ల ఆదాయాలతో ప్రపంచంలో టాప్ రిటైలర్ల జాబితాలో 56వ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందితున్న రిటైల్ సంస్థల లిస్టులో దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. జస్ట్ డయల్, డన్జోలను కొనుగోలు చేయడంతో పాటు ఇటీవలే ఇండిపెండెన్స్ పేరిట సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్ను కూడా ఆవిష్కరించింది. దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 60 లక్షల కోట్లుగాను, ఇందులో సంఘటిత రంగం వాటా 12%గా ఉంటుందని అంచనా. సంఘటిత రంగంలోని ఫుడ్, గ్రోసరీ విభాగంలో రిలయన్స్కు ఇప్పటికే 20 శాతం వాటా ఉంది. పోటీ సంస్థ ‘మోర్’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కూడా రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు 2020లో రిలయన్స్ ప్రకటించింది. కానీ, రుణదాతల నుంచి మద్దతు లభించకపోవడంతో దాన్నుంచి విరమించుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది. ఎగ్జిన్లో 23.3% వాటాలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎగ్జిన్ టెక్నాలజీస్లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ 23.3 శాతం వాటాలు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 207 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. జీపీఎస్ వంటి నేవిగేషన్ టెక్నాలజీ లేకపోయినా క్లిష్టమైన ప్రాంతాల్లోనూ డ్రోన్లు, రోబోలు తిరిగేందుకు ఉపయోగపడే అటానమీ సాంకేతికతను ఎగ్జిన్ అందిస్తుంది. -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్గా భువనేశ్వర్లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్కి హెడ్ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్ని అర్థం చేసుకోగలిగితే టీమ్తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
అక్వేరియం బద్దలైంది..!
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. 2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. -
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్తో మ్యాచ్లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్లో ఫ్రాన్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్లో 2010 చాంపియన్ స్పెయిన్ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్పై 6–1తో విజయం వరల్డ్కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్లో చేసిన హ్యాట్రిక్తో అతను క్లబ్ ఫుట్బాల్లో ఒక్కసారిగా హాట్ స్టార్గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్కప్లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్లో ఉన్న బ్రెజిల్ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్కప్లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్లలో విజయం సాధిస్తే ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్లో డచ్ బృందం 19 మ్యాచ్లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్కప్లో 5 మ్యాచ్లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
FIFA WC: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్లోనే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ అనూహ్యంగా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2014లో ఛాంపియన్స్ అయిన జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే వెళ్లిపోవడం సగటు అభిమానిని బాధించింది. అయితే ఓటమికి తోడూ దురదృష్టం కూడా తోడయ్యి జర్మనీని ఇంటిబాట పట్టించింది. కాగా జట్టు ఓటమితో గోల్కీపర్ కెవిన్ ట్రాప్స్ సొంత దేశానికి వెళ్లిపోయాడు. అయితే అతని భార్య ఇజాబెల్ గౌలర్ట్ మాత్రం ఖతర్లోనే ఉండిపోయింది. అదేంటి భర్త వెళ్లిపోయాడు.. భార్య వెళ్లకపోవడం ఏంటి అనేగా మీ డౌటు. నిజానికి ఇజాబెల్ గౌలర్ట్కు తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ కంటే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టు అంటే ప్రాణం. అంతేకాదు ఇజాబెల్ బ్రెజిల్లోనే పుట్టి పెరిగింది. అందుకే తన స్వంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం భర్త వెళ్లిపోయినప్పటికి ఆమె మాత్రం ఖతర్లోనే ఉండిపోయింది. ఇక ప్రీక్వార్టర్స్లో దక్షిణ కొరియాతో బ్రెజిల్ తలపడగా.. మ్యాచ్కు ఇజాబెల్ గౌలర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెజిల్ స్టార్ నెమ్మర్ జూనియర్ తండ్రి పక్కన కూర్చొని ఇజాబెల్ మ్యాచ్ను ఎంజాయ్ చేసింది. అనుకున్నట్లుగానే బ్రెజిల్ క్వార్టర్స్కు చేరడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. భర్త అనుమతితోనే ఖతర్లో ఉండిపోయిన ఇజాబెల్ బ్రెజిల్ విజేతగా నిలిస్తే చూడాలని ఉందని పేర్కొంది. అలా మొత్తానికి తన భర్త వెళ్లిపోయినా.. సొంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం ఇజాబెల్ ఖతర్లోనే ఉండిపోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక దక్షిణ కొరియాను 4-1తో మట్టికరిపించిన బ్రెజిల్ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. నవంబర్ 9న జరగనున్న క్వార్టర్ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్ అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: గాయం సాకుతో బంగ్లా టూర్కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా ప్రాక్టీస్ సెషన్కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్ను లైవ్లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్కు, డూప్లికేట్కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్ను కాస్త రియల్ గేమ్లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
Germany: ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర భగ్నం
బెర్లిన్: జర్మనీలో భారీ కుట్ర భగ్నం అయ్యింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో సుమారు 25 మందిని అరెస్టు చేశారు. అతివాదులు, మాజీ సైనిక దిగ్గజాలు ఈ కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని అతివాదులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్-13 ఈ ప్రణాళికలు వేసినట్లు అంచనా వేస్తున్నారు. సుమారు మూడు వేల మంది పోలీసులు.. 150 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర చేసిన బృందంలో సుమారు 50 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. రీచ్బర్జర్ తీవ్రవాదులు ఈ పన్నాగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
FIFA WC: జపాన్ గోల్పై వివాదమెందుకు? నిజంగానే జర్మనీ నాకౌట్కు చేరేదా?!
FIFA World Cup 2022 Japan Vs Spain: ఫిఫా వరల్డ్కప్-2022లో స్పెయిన్తో మ్యాచ్లో జపాన్ సాధించిన రెండో గోల్ వివాదాస్పదంగా మారింది. రిట్సు కొట్టిన కిక్తో బంతి స్పెయిన్ గోల్పోస్ట్ ఎడమ వైపునకు వెళ్లింది. అయితే దానిని వెంబడించిన మిటోమా బంతిని నియంత్రణలోకి తెచ్చుకొని వెనక్కి తోశాడు. అక్కడే సిద్ధంగా ఉన్న టనాకా దానిని గోల్గా మలిచాడు. అయితే అసిస్టెంట్ రిఫరీ గోల్ చెల్లదని ప్రకటించాడు. బంతి ‘బైలైన్’ను దాటేసిందని, ఆ తర్వాతే మిటోమా వెనక్కి తోశాడు కాబట్టి గోల్ను గుర్తించలేదు. అయితే ఇది వీడియో అసిస్టెంట్ రిఫరీ (వార్) వద్దకు వెళ్లింది. ఎన్నో కోణాల్లో రీప్లేలు చూసి తర్జనభర్జనల అనంతరం గోల్ సరైందేనని, బంతి ఇంకా గమనంలోనే ఉందన్న రిఫరీ గోల్ను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇదే వివాదంగా మారింది. రీప్లే తొలి యాంగిల్ నుంచి చూస్తే బంతి లైన్ దాటేసినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తర్వాతి టాప్ యాంగిల్లో మాత్రం ఇంకా లోపలే ఉన్నట్లుగా ఉంది. భౌతిక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ‘ప్యారలాక్స్ ఎర్రర్’ (వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు వస్తువు యొక్క స్థానంలో కలిగే తేడా–దృష్టి విక్షేపం) ప్రభావమిది. ఇక్కడ సరిగ్గా అదే పని చేసింది. పైనుంచి చూస్తే బంతిలో కొంత భాగం లైన్పైనే ఉన్నట్లుగా ఉంది. ‘ఫిఫా’ నిబంధనలను బట్టి దీనినే చివరకు సరైందిగా నిర్ధారించారు. తద్వారా ఈ మ్యాచ్లో విజయం సాధించిన జపాన్ గ్రూప్- ఇ టాపర్గా నాకౌట్ దశకు చేరుకుంది. జపాన్ వల్ల.. అలా జర్మనీ కథ ముగిసింది ప్రపంచకప్ తొలి మ్యాచ్లో నాలుగుసార్లు విశ్వ విజేత జర్మనీని చిత్తు చేసిన జపాన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ అదే దూకుడు కనబర్చి మరో మాజీ చాంపియన్ను ఓడించింది. ఫలితంగా వరుసగా రెండో వరల్డ్ కప్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో 2010 విజేత స్పెయిన్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. జపాన్ తరఫున రిట్సు డోన్ (48వ ని.లో), ఆవో టనాకా (51వ ని.లో) గోల్స్ సాధించగా, స్పెయిన్ జట్టు నుంచి మొరాటా (11వ ని.లో) ఏకైక గోల్ను నమోదు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్లో ఓడినా స్పెయిన్కు నష్టం జరగలేదు. రెండో స్థానంతో స్పెయిన్ ముందంజ వేసింది. పాయింట్ల సంఖ్యలో జర్మనీతో సమానంగానే నిలిచినా...గోల్స్ అంతరంలో జర్మనీని స్పెయిన్ వెనక్కి తోసింది. బంతి స్పెయిన్ ఆధీనంలోనే ఉన్నా... మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ దూకుడు కనబర్చింది. 11వ నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని స్పెయిన్ సమర్థంగా ఉపయోగించుకుంది. సీజర్ అజ్పిలిక్యూటా ఇచ్చిన క్రాస్ పాస్ను హెడర్ ద్వారా మొరాటా గోల్గా మలిచాడు. అయితే రెండో అర్ధ భాగంలో జపాన్ ఒక్కసారిగా చెలరేగింది. 142 సెకన్ల వ్యవధిలో ఆ జట్టు రెండు గోల్స్తో ముందంజ వేసింది. సబ్స్టిట్యూట్గా వచ్చిన రిట్సు అనూహ్యంగా స్పెయిన్ ఆటగాళ్లందరినీ తప్పించి కొట్టిన కిక్కు కీపర్ ఉనై సైమన్ వద్ద జవాబు లేకపోయింది. కొద్ది సేపటికే టనాకా కొట్టిన గోల్ స్పెయిన్ నివ్వెరపోయేలా చేసింది. జపాన్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మ్యాచ్ మొత్తంలో కేవలం 17.7 శాతం సమయం మాత్రమే బంతి జపాన్ ఆధీనంలో ఉంది. వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ సమయం బంతిని ఆధీనంలోకి ఉంచుకొని మ్యాచ్ నెగ్గిన జట్టుగా జపాన్ రికార్డు నెలకొల్పింది. జర్మనీ గెలిచినా... 2018లోనూ గ్రూప్ దశకే పరిమితమైన జర్మనీ వరుసగా రెండోసారి నాకౌట్కు అర్హత సాధించడంలో విఫలమైంది. చివరి మ్యాచ్లో జర్మనీ 4–2 తో కోస్టారికాపై నెగ్గింది. జర్మనీ తరఫున జ్ఞాబ్రీ (10వ ని.లో), హావెట్జ్ (73వ, 85వ ని.లో), ఫల్రగ్ (89వ ని.లో) గోల్స్ సాధించగా... కోస్టారికా ఆటగాళ్లలో తెజెదా (58వ ని.లో), నూయెర్ (70వ ని.లో) గోల్స్ కొట్టారు. టోర్నీ తొలి మ్యాచ్లో జపాన్ చేతిలో ఓడటంతోనే జర్మనీ అవకాశాలకు గండి పడింది. స్పెయిన్తో మ్యాచ్ ‘డ్రా’ చేసుకోవడంతో ఇక్కడ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు 4–2 సరిపోలేదు. చదవండి: IND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన FIFA WC 2022: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: వరల్డ్ కప్లో చారిత్రాత్మక ఘట్టం.. ఆ మహిళామణులు ఎవరంటే!
FIFA World Cup 2022 Germany Vs Costa Rica: తొలిసారి మహిళా రిఫరీలు వరల్డ్ కప్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా జర్మనీ, కోస్టారికా మ్యాచ్కు ముగ్గురు మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం విశేషం. పురుషుల ప్రపంచకప్ మ్యాచ్లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి. కాగా... స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్) ఫీల్డ్ రిఫరీగా, న్యూజా బ్యాక్ (బ్రెజిల్), కరెన్ డియాజ్ (మెక్సికో) అసిస్టెంట్ రిఫరీలుగా ఈ ఘనతలో భాగమయ్యారు. తదుపరి మ్యాచ్ల్లో సలీమా ముకన్సంగా (రువాండా), యోషిమి యామషిటా (జపాన్) కూడా ఫీల్డ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. 38 ఏళ్ల స్టెఫానీ 2019లో లివర్పూల్, చెల్సీ జట్ల మధ్య యూరోపియన్ కప్ పురుషుల సూపర్ కప్ ఫైనల్లో, 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్లో, గత సీజన్లో ఫ్రెంచ్ కప్ ఫైనల్లోనూ రిఫరీగా వ్యవహరించింది. చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే
ఫుట్బాల్ చరిత్రలో జర్మనీది ప్రత్యేక స్థానం. సాకర్ సమరంలో నాలుగుసార్లు చాంపియన్స్గా నిలిచిన జర్మనీ.. అత్యధిక వరల్డ్కప్స్ సాధించిన జట్టుగా ఇటలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 2014లో జర్మనీ నాలుగోసారి చాంపియన్స్గా అవతరించింది. అంతకముందు 1954,1974,1990లో ఫిఫా వరల్డ్కప్ అందుకుంది. కానీ ఇదంతా గతం. చివరగా 2014లో ఫిఫా వరల్డ్ చాంపియన్స్గా నిలిచిన జర్మనీ వరుసగా రెండు ప్రపంచకప్లలో గ్రూప్ దశను దాటలేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేదు. థామస్ ముల్లర్, మారియో గోట్జే, లుకాస్ క్లోస్టర్మెన్, జోనస్ హాప్మన్ ఇలా ఎవరికి వారే సాటి. కానీ ఈ వరల్డ్కప్లో మాత్రం వీళ్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత సంచలనం నమోదైంది. కోస్టారికాపై 4-2 తేడాతో ఘన విజయం సాధించినప్పటికి జర్మనీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అందుకు కారణం జర్మనీ తమ తొలి మ్యాచ్ జపాన్ చేతిలో ఓడడమే. ఆ తర్వాత బలమైన స్పెయిన్తో మ్యాచ్ డ్రా చేసుకోవడం ఆ జట్టును కొంపముంచింది. ఆ తర్వాత జపాన్.. స్పెయిన్ను ఓడించడంతో జర్మనీ కథ ముగిసింది. ఓటమికి తోడు దురదృష్టం కూడా తోడవ్వడంతో జర్మనీ వరుగగా రెండోసారి ఫిఫా వరల్డ్కప్ నుంచి భారంగా వైదొలిగింది. ఇక స్పెయిన్తో పాటు జపాన్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక జర్మనీలో వ్యక్తిగతంగా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టుగా విఫలమైందని ఆ దేశ అభిమానులు పేర్కొన్నారు. అభిమానులే కాదు అక్కడి మీడియా కూడా జర్మనీ ఫుట్బాల్ టీంపై విమర్శలు వ్యక్తం చేసింది. ''వ్యక్తిగతంగా చూస్తే అందరు మంచి ఆటగాళ్లుగానే కనిపిస్తున్నారు.. కానీ జట్టులా చూస్తే అలా అనిపించడం లేదు. 2014లో జర్మనీ ఫిఫా వరల్డ్కప్ గెలవడంలో బాస్టియన్ ష్వీన్స్టీగర్ , లుకాస్ పోడోల్స్కీలది కీలకపాత్ర. వారు రిటైర్ అయ్యాకా జర్మనీ ఆట కళ తప్పింది. జర్మనీ జట్టు వైభవం కూడా వారితోనే పోయింది. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఆడతున్నారు తప్పిస్తే ఒకటిగా కలిసి ఆడడం లేదు. ఇదే మా కొంపముంచింది. మాకు ఇది కావాల్సిందే'' అంటూ కామెంట్ చేశారు. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన ఇటలీ కనీసం ఫిఫాకు అర్హత సాధించలేదు. అర్హత సాధించిన జర్మనీ కూడా వైదొలగడం సగటు ఫిఫా అభిమానిని బాధిస్తుంది. రెండు పెద్ద జట్లు లేకుండానే ఫిఫా వరల్డ్కప్ ముందుకు సాగుతుంది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ వచ్చే ఫిఫా వరల్డ్కప్ వరకైనా బలంగా తయారవ్వాలని.. మునుపటి ఆటతీరు ప్రదర్శిచాలని కోరుకుందాం. -
FIFA: 2 గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్కప్-2022లో జర్మనీకి ఊహించని షాక్ తగిలింది. నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు ఈసారి కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది. కోస్టారికాపై ఘన విజయం సాధించినప్పటికీ... జపాన్ కారణంగా దురదృష్టకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసలేం జరిగిందంటే.. Germany Vs Costa Rica: గ్రూప్-ఇలో భాగమైన జర్మనీ శుక్రవారం నాటి మ్యాచ్లో కోస్టారికాను 4-2తో ఓడించింది. అయితే, ఈ జట్టు ప్రిక్వార్టర్స్ చేరే క్రమంలో.. ఇదే గ్రూపులో ఉన్న జపాన్- స్పెయిన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో అనూహ్య రీతిలో జపాన్, స్పెయిన్ను 2-1తో ఓడించింది. దీంతో జర్మనీ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. జర్మనీ అవుట్.. ఎందుకంటే.. Japan Vs Spain: తాజా విజయంతో ఈ టోర్నీలో రెండు మ్యాచ్లు గెలిచిన జపాన్ ఆరు పాయింట్లతో గ్రూప్- ఇ టాపర్గా నిలిచింది. ఇక జర్మనీ, స్పెయిన్ ఒక్కో విజయం సాధించి.. రెండేసి పాయింట్లు సంపాదించినప్పటికీ జర్మనీకి పరాభవం తప్పలేదు. ఈ రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ గోల్స్ విషయంలో జర్మనీ(6 గోల్స్) వెనుకబడింది. తాజాగా జపాన్తో ఒక గోల్ చేయగలిగిన స్పెయిన్ మొత్తంగా 9 గోల్స్తో జర్మనీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. నిజానికి జపాన్ గనుక ఈ మ్యాచ్లో ఓడి ఉంటే.. జర్మనీ, స్పెయిన్ రౌండ్ 16కు అర్హత సాధించేవి. స్పెయిన్తో మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన జపాన్ ఖాతాలో మొత్తంగా ఉన్నవి నాలుగు గోల్సే. అయినప్పటికీ గెలుపుతో ఆరు పాయింట్లు కొట్టేసి ముందడుగు వేసింది. కాబట్టి జర్మనీని దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. ఇక గ్రూప్-ఇ టాపర్గా జపాన్, రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ ప్రిక్వార్టర్స్కు చేరుకోగా.. జర్మనీ ఇంటిబాట పట్టింది. ఇక నవంబరు 23 నాటి మ్యాచ్లో మొదట జర్మనీని(1-2తో) ఓడించిన జపాన్.. తాజాగా స్పెయిన్ ఓడించింది. దీంతో జర్మనీ పాలిట జపాన్ శాపంగా మారిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి డేట్ ఫిక్స్! సెలవు మంజూరు చేసిన బీసీసీఐ! -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
FIFA WC: ‘నోరు మూసుకొని’ నిరసన! జర్మనీ ఆటగాళ్లు ఇలా ఎందుకు చేశారంటే
FIFA World Cup 2022 Germany Vs Japan- దోహా: ‘వన్ లవ్’ ఆర్మ్బ్యాండ్పై అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) తీసుకున్న నిర్ణయానికి జర్మనీ ఆటగాళ్లు వినూత్న నిరసన తెలిపారు. ఆటగాళ్లెవరైనా ‘వన్ లవ్’ బ్యాండ్తో బరిలోకి దిగితే వేటు(ఎల్లో కార్డ్) తప్పదని ‘ఫిఫా’ జర్మనీ సహా ఏడు యూరోపియన్ ఫుట్బాల్ సమాఖ్యలను హెచ్చరించింది. దీనికి నిరసనగా జర్మనీ ఆటగాళ్లు కుడిచేతితో తమ ‘నోరు మూసుకొని’ నిరసన తెలిపారు. ‘ఫిఫా’ నిర్ణయంపై యూరోపియన్ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఖతర్లో వివిధ వర్గాలపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ మ్యాచ్ల సందర్భంగా ‘వన్ లవ్’ ఆర్మ్బ్యాండ్ ధరించి సంఘీభావం తెలపాలని ఏడు యూరోపియన్ జట్లు నిర్ణయం తీసుకున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జపాన్ చేతిలో అనూహ్య రీతిలో జర్మనీ ఓటమి పాలైంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో జపాన్... నాలుగుసార్లు చాంపియన్గా నిలిచిన జర్మనీని 2–1 స్కోరుతో ఓడించింది. చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్లతో! Suryakumar Yadav: సూర్యను కొనగలిగే స్థోమత, డబ్బు మా దగ్గర లేదు.. ఆటగాళ్లందరిపై వేటు వేస్తేనే! -
FIFA World Cup Qatar 2022: జర్మనీకి జపాన్ షాక్
FIFA World Cup 2022 Germany Vs Japan Highlights: ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో అనూహ్య ఫలితం వచ్చింది. మంగళవారం రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాను సౌదీ అరేబియా బోల్తా కొట్టిస్తే... బుధవారం ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన జర్మనీ జట్టును జపాన్ ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆసియా గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచకప్లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఆసియా జట్లు అద్భుతం చేశాయి. దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో మేటి జట్లు, మాజీ చాంపియన్లకు ఆసియా జట్లు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయి. బుధవారం గ్రూప్ ‘ఇ’లో భాగంగా నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని జపాన్ కంగుతినిపించింది. ఇద్దరు సబ్స్టిట్యూట్ ప్లేయర్లు రిత్సు డాన్, టకుమా అసానో చివరి 15 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్తో జపాన్ 2–1 స్కోరుతో జర్మనీని గట్టిదెబ్బే తీసింది. తరచూ జర్మన్ క్లబ్లలో ఆడే రిత్సు (75వ ని.), అసానో (83వ ని.) ఈ ప్రపంచకప్లో ఆ జాతీయ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్ (33వ ని.) గోల్ సాధించాడు. ఈ గ్రూప్లో టైటిల్ ఫేవరెట్ జట్టయిన జర్మనీ ఆరంభం నుంచే గోల్స్ ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ క్రమంలో 24 సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్లు ఆడింది. ప్రథమార్ధంలోనే గుయెండగన్ గోల్తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తీవ్రమైన ఒత్తిడిలో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్కు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు అసాధారణ ఫలితాలను సాధించి పెట్టారు. జపాన్ 2–1 ఆధిక్యంతో గెలుపు దారిలో పడగా... జర్మనీ మాత్రం ఎక్కడా పట్టు సడలించలేదు. ఆఖరి నిమిషం దాకా కష్టపడింది. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్ 9 నిమిషాల పాటు స్కోరు సమం చేసేందుకు కడదాకా చెమటోడ్చింది. ఫుల్క్రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే అదేపనిగా ప్రత్యర్థి గోల్పోస్ట్పై షాట్లు ఆడారు. అయితే జపాన్ డిఫెండర్లు, గోల్ కీపర్ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. జపాన్ గోల్ కీపర్ షుయిచి గొండా పెట్టని కోటలా నిలుచున్నాడు. ప్రపంచకప్ చరిత్ర లో ఆసియా జట్టు చేతిలో ఓడిపోవడం జర్మనీకిది రెండోసారి. 2018 ప్రపంచకప్లో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2తో ఓడిపోయింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్లతో! -
పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి
ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 109 మ్యాచ్లు ఆడిన జట్టుగా బ్రెజిల్తో సమానంగా జర్మనీ నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే, జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. అయితే 2014లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన తర్వాత జర్మనీ ఆటలో తిరోగమనం కనిపిస్తోంది. 2018 ప్రపంచకప్లో జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం యూరో టోర్నీలోనూ జర్మనీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖతర్’లో జర్మనీ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్పలేని స్థితి. –సాక్షి క్రీడా విభాగం జర్మనీ మాజీ చాంపియన్ స్పెయిన్తో మ్యాచ్ను మినహాయిస్తే... గ్రూప్ ‘ఇ’లోని ఇతర జట్లయిన కోస్టారికా, జపాన్లపై జర్మనీ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత పొందడం ఖాయమనుకోవాలి. గుండోగన్, జమాల్ ముసియాలా, కాయ్ హవెర్ట్, లెరాయ్, మార్కో రెయిస్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: నాలుగుసార్లు చాంపియన్ (1954, 1974, 1990, 2014). ‘ఫిఫా’ ర్యాంక్: 11. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్ లో గ్రూప్ ‘జె’ విజేత. స్పెయిన్ సమన్వయంతో ఆడటంలో స్పెయిన్ ఆటగాళ్లు సిద్ధహస్తులు. గత ఆరేళ్లలో ఆ జట్టు ఆడిన మ్యాచ్ల్లో రెండు గోల్స్ తేడాతో ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ ప్రపంచకప్లో తమ గ్రూప్లో జర్మనీతో మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పెద్రీ, ఫెరాన్ టోరెస్, మొరాటా, సిమోన్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 7. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్లో గ్రూప్ ‘బి’ విజేత. జపాన్ వరుసగా ఏడో ప్రపంచకప్లో ఆడుతున్న జపాన్ మూడుసార్లు గ్రూప్ దశలో నిష్క్రమించగా, మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆసియా క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో జపాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ గెలిచింది. మంగోలియాపై 14–0తో, మయన్మార్పై 10–0తో నెగ్గిన జపాన్ రెండో రౌండ్లో ఏకంగా 46 గోల్స్ కొట్టి కేవలం రెండు గోల్స్ సమర్పించుకుంది. మూడో రౌండ్లో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. దైచి కమాడా కీలక ఆటగాడు. జర్మనీ, స్పెయిన్లతో మ్యాచ్ ఫలితాలే ఈసారి జపాన్ ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2002, 2010, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 24. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్లో మూడో రౌండ్ గ్రూప్ ‘బి’ రన్నరప్. కోస్టారికా ఆరోసారి ప్రపంచకప్లో ఆడుతున్న కోస్టారికా అద్భుతంగా రాణిస్తే తప్ప ఈసారి గ్రూప్ దశను దాటే అవకాశాలు కనిపించడంలేదు. జర్మనీ, స్పెయిన్లలో ఒక జట్టును ఓడిస్తే తప్ప కోస్టారికా ముందుకు వెళ్లడం కష్టమే. అర్సెనల్ జట్టుకు ఆడే జోయల్ క్యాంప్బెల్ కీలక ఆటగాడు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2014). ‘ఫిఫా’ ర్యాంక్: 31. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్–ఓసియానియా క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. -
తెలివిగా యూ టర్న్ తీసుకున్న చైనా!... రష్యాకి షాక్
తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాని యుద్ధం మరింత తీవ్రతరం చేయవద్దని అణ్వాయుధాలు ఉపయోగించందంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో బీజింగ్ సందర్శించి రష్యా అణ్వయుధ దాడిని వ్యతిరేకించాలని కోరిన నేపథ్యంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్లో 20వ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జాతీయ కాంగ్రెస్ ముగిసిన తర్వాత చైనా అధ్యక్షుడుని కలిసిన తొలి యూరోపియన్ నాయకుడు స్కోల్జ్. ఆయన బీజింగ్ గ్రేట్ హాల్ ఆప్ పీపుల్లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్పై రష్యా అణు బెదిరింపును నిరోధించడం, వ్యతిరేకించడం వంటివి చేయాలని జిన్పింగ్కి చెప్పారు స్కోల్జ్. ఐతే చైనా ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగడానికి ముందు నుంచి రష్యాతో తమకు హద్దులు లేని స్నేహం ఉందని ప్రకటించడంతో యూరోపియన్తో సహా పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధం మొదలయ్యాక కూడా రష్యాకి మద్దతిస్తూ.. ప్రేరేపించింది యూఎస్ నేతృత్వంలోని నాటో అంటూ నిందించింది చైనా. ఐతే ఇప్పుడూ చైనా తన యూరోపియన్లతో ఉన్న సంబంధాలను తిరిగే పెంపొందించే క్రమంలో అనుహ్యంగా రష్యాకి వ్యతిరేకంగా యూటర్న్ తీసుకుంది. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా యూరోపియన్, పాశ్చాత్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా జర్మనీలు మార్పు, అస్తిరత దృష్ట్యా సహకరించుకోవాల్సిన అవసరాన్ని గురించి జిన్పింగ్ నొక్కి చెప్పారు. అంతేగాక చైనా, జర్మనీలు ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రధాన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం అని జిన్పింగ్ అన్నారు. అంతేగాదు జీ7 దేశాలనికి చెందిన నాయకుడు స్కోల్జ్ చైనా కంపెనీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు తేలడంతో, భద్రత దృష్ట్యా ఆయనకు స్వదేశంలో గణనీయమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. స్కోల్జ్ బీజింగ్తో ఒక ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఈ మేరకు స్కోల్జ్ చైనాలోని ప్రవాసులు జర్మనీ బయోఎన్టెక్కి సంబంధించిన కోవిడ్ -19 వ్యాక్సిన్ను ఉపయోగించడానికి అనుమతించడమే కాకుండా చైనా పౌరులకు ఉచితంగా అందుబాటులో ఉంచేలా బీజింగ్ను ఒత్తిడి చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్!) -
జర్మనీలో అంగ రంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం
-
జర్మనీలో అంగ రంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం
జర్మనీలోని మ్యూనిచ్ నగరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మ్యూనిచ్ నగరానికి చెందిన స్థానిక శివాలయం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలు నవంబర్ 3న ఉదయం 7 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై మధ్యాహ్నం కల్యాణోత్సవం వరకు నిర్వహించారు. అర్చన, తోమాల సేవ అనంతరం అర్చకులు కన్నుల పండుగగా జరిపించిన కల్యాణోత్సవంలో మ్యూనిచ్ నగర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జర్మనీ, ఆస్ట్రియాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి టీటీడీ తరఫున ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్, ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ శ్రీనివాస రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, టీటీడీ ఏఈఓ వెంకట్లు అతిధులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని శివాలయం తరపున జరిపించేందుకు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ మూర్తి, ముక్తేశ్వరం నుంచి కామేశ్వర శాస్త్రిలు తరలి వచ్చారు. మ్యూనిచ్ శివాలయం కార్య నిర్వాహక కమిటీ సోమయాజులు శర్మ , ధృవ్ కాశ్వాల,ఆదూరి రాజశేఖర్, అనిల్ గారు, పవన్, రవి కుమార్ వర్మ, సుజాత, సాయి తేజస్లు పాల్గొన్నారు. -
రూ.900 కోట్ల పెయింటింగ్పై పొటాటో సాస్ పోసి నిరసన.. అందుకేనటా!
బెర్లిన్: పర్యావరణ కాలుష్యంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇద్దరు పర్యావరణ వేత్తలు సాహాసానికి పూనుకున్నారు. సుమారు రూ.900 కోట్లుకుపైగా విలువైన మోనెట్ పెయింటింగ్పై ఆలు, టమాటో సాస్ పోసి నిరసన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలను భూమి నుంచి తీసి వాడటానికి వ్యతిరేకంగా ఇలా చేసినట్లు చెప్పారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. ఈ వీడియోను లాస్ట్ జనరేషన్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్గా మారింది. లాస్ట్ జనరేషన్ గ్రూప్కు చెందిన ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు బార్బెరిని మ్యూజియంలో మోనెట్ లెస్ మెయూల్స్ పెయింటింగ్పై పొటాటో సాసు పోశారు. అనంతరం పెయింటింగ్ వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ‘మీరు సమస్య వినడానికి ఈ పెయింటింగ్పై పొటాటో సాసు వేయటం ఉపయోగపడుతుందా? మనం ఆహారం కోసం గొడవపడాల్సి వస్తే.. ఈ పెయింట్కు విలువే ఉండదు. ప్రజలు చనిపోతున్నారు. మనం పర్యావరణ విపత్తులో ఉన్నాం. పెయింటింగ్పై టమాటో సూప్ పోయటం వల్ల భయపడుతున్నారు. కానీ మేము ఎందుకు భయపడుతున్నామో మీకు తెలుసా? 2050 నాటికి మనకు తినడానికి తిండి దొరకదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకు భయపడుతున్నాం. మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే ఇదంతా ఆగిపోతుంది.’ అని పేర్కొన్నారు. ఈ స్టంట్లో నలుగురు పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. పెయింటింగ్ మొత్తం గ్లాస్తో ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బర్బెరిని మ్యూజియమ్ తెలిపింది. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు మ్యూజియం డైరెక్టర్ ఓర్ట్రూడ్ వెస్తేయిడర్ పేర్కొన్నారు. పర్యావరణ విపత్తుపై వారి ఆందోళనలను అర్థం చేసుకున్నామని, అయితే, వారి డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించిన విధానమే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు. We make this #Monet the stage and the public the audience. If it takes a painting – with #MashedPotatoes or #TomatoSoup thrown at it – to make society remember that the fossil fuel course is killing us all: Then we'll give you #MashedPotatoes on a painting! pic.twitter.com/HBeZL69QTZ — Letzte Generation (@AufstandLastGen) October 23, 2022 ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
ఏపీ: విదేశీ పెట్టుబడులతో పాటు లోకల్ బ్రాండింగ్ కోసం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ నేతృత్వంలో ఇవాళ(మంగళవారం) బిజినెస్ సమ్మిట్ మొదలైంది. ఈ సమ్మిట్లో నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు హాజరయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, చేనేత, టెక్స్ టైల్ తదితర రంగాల్లో అవకాశాల వివరణకు ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలవనుంది. ప్రముఖంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎగుమతి అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులైన బి.భాస్కర్, పి.హరీష్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో ప్రత్యేకార్షణగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఉద్యానవనం, ఆహారశుద్ధి, వ్యవసాయం, మత్స్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, పర్యాటక విభాగం అథారిటీ సీఈవో కె.కన్నబాబు, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు. సంబంధిత కథనం: 3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
Global Hunger Report 2022: ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి. నివేదిక ఏం చెప్పిందంటే... ► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది. ► జీహెచ్ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. ► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి. ► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది. ► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్లోనే ఉన్నారు. ► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి. ► భారత్లోని ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. విరుచుకుపడిన విపక్షాలు దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు. -
మ్యూనిచ్ నగరంలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు
మునిచ్ నగరంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంత పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోను బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగ నిర్వహించుకోవాలన్నారు. మునిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీ లోని ఇతర నగరాలకు కూడా స్ఫూర్తినిచ్చాయి. అనంతరం నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
భద్రతా మండలి: భారత్ ‘శాశ్వత సభ్యత్వం’పై బైడెన్ స్పందన
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్తో పాటు జర్మనీ, జపాన్లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ నేపథ్యంలో.. జర్మనీ, జపాన్, భారత్లను శాశ్వత సభ్య దేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారని, అదే సమయంలో.. ఇందుకోసం చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని వైట్హౌజ్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా మండలిలో ఈ మూడు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచనకు చారిత్రాత్మకంగా, మా మద్దతు ఉంటుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ అధికారి స్పందించారు. ఇక బుధవారం UN జనరల్ వద్ద జో బైడెన్ ప్రసంగించారు. ‘‘నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్తో సహా UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసేందుకు అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు ఇందులో ఉన్నాయి అని బైడెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉండి వీటో పవర్ను కలిగి ఉన్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ని నివారించేలా రష్యా ఎత్తుగడ -
మేం ఎంత మంది ఉన్నామో చూశారా..
భూమ్మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. వాటినెలా లెక్కేస్తాం? అని ఎదురు ప్రశ్నిస్తారు. మరి భూమ్మీద ఎన్ని చీమలున్నాయని అడిగితే మీ సమాధానం? మళ్లీ ఇంకో పిచ్చి ప్రశ్న అని తీసిపారేయవద్దు. ఎందుకంటే... జర్మనీలోని జులియస్ మాక్స్మిలియన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమల సంఖ్యను మాత్రమే కాదు.. వాటన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే ఎంత బరువు ఉంటాయో కూడా లెక్కలేసి తేల్చేశారు మరి!! కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. భూమ్మీద మొత్తం చీమల సంఖ్యపై ఇప్పటి వరకూ సరైన అంచనా ఏదీ లేకపోవడంతో జర్మనీ శాస్త్రవేత్తలు లెక్కలేసేందుకు నడుం బిగించారు. అంతేకాదు.. చీమల సంఖ్య అడవుల్లో ఎంత ఉంటుంది? ఎడారుల్లోనైతే ఎంత? తేమ ఉన్నచోట?... నగరాల్లో? ఇలా రకరకాల జీవావరణ వ్యవస్థల్లో చీమల ఉనికి ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు వీరు అందుబాటులో ఉన్న పరిశోధన వ్యాసాలన్నింటినీ జల్లెడ పట్టారు. ఈ అంశంపై ఇప్పటివరకూ ప్రచురితమైన సుమారు 489 అధ్యయనాల సారాంశాన్ని వడపోసి ‘‘ఈ భూమ్మీద మొత్తం 20 క్వాడ్రిలియన్ల చీమలున్నాయి’’ అని తేల్చారు! అంటే 20 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట(200 కోట్ల కోట్లు). దీన్నే మరోలా చెప్పాలంటే విశ్వం మొత్తమ్మీద ఉన్న నక్షత్రాలకు 2 వేల రెట్ల ఎక్కువ సంఖ్యలో చీమలున్నాయట! అక్కడ ఒక్క చీమా లేదు! ఎన్ని ఉన్నాయో తెలిసింది! బరువెంతో కూడా స్పష్టమైంది. మరి.. ఏ ప్రాంతంలో ఎక్కువ చీమలు ఉన్నాయి? ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఈ ప్రశ్నలకూ జర్మనీ శాస్త్రవేత్తలు సమాధానాలు కనుగొన్నారు లెండి. భూమధ్య రేఖకు 10 డిగ్రీలు పైన, కింద ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో చీమలు పుట్టలు పుట్టలుగా ఉంటే.. నగర ప్రాంతాల్లో అతితక్కువగా ఉన్నాయట. ధ్రువ ప్రాంతాల్లో ఒక్క చీమ కూడా లేదట. అధ్యయనం ఎందుకంటే.. చీమల లెక్కలేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు శ్రమ పడ్డారన్న సందేహం వచ్చిందా? అయితే ఇవి చేసే పనులు తెలిస్తే శాస్త్రవేత్తలు సరైన పనే చేశారని మీరే అంటారు. ఎందుకంటే.. ఒక్కో హెక్టారు నేల నుంచి చీమలు ఏటా 13 టన్నుల మట్టిని అటూఇటు మారుస్తుంటాయట! నేల లోపలి పోషకాలను పైపొరల్లోకి చేర్చడం ద్వారా పంట దిగుబడులను ప్రభావితం చేస్తూంటాయట!! అలాగే విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకు చేర్చడంలోనూ చీమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్యాట్రిక్ షూల్థెసిస్ వివరించారు. బరువు అతి భారీగానే.. గండుచీమ, నల్లచీమ, ఎర్ర చీమలన్నింటి సంఖ్యపై ఓ స్పష్టత సాధించిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఆ తరువాత వాటి మొత్తం బరువును అంచనా వేశారు. వేర్వేరు ప్రాంతాలు, జీవావరణ వ్యవస్థల్లోని చీమల రకాలను.. వాటి సగటు బరువులను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. వాటి మొత్తం బరువు కోటీ ఇరవై లక్షల టన్నులని తేలింది! భూమ్మీద ఉన్న అన్ని పక్షులు, మానవులను మినహాయించి మిగిలిన క్షీరదాల మొత్తం బరువు కంటే చీమల బరువే ఎక్కువ కావడం గమనార్హం. -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను జర్మనీలోని ఎయిర్పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది. Photo Courtesy: Mv Werften జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. Photo Courtesy: Mv Werften తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. Photo Courtesy: Mv Werften దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్టెన్ సంస్థ నిర్ణయించుకుంది. చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..! -
మాస్క్ ధరించండి! అన్నందుకు.. కాల్చి చంపేశాడు
జర్మన్: మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ క్యాషియర్ని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీ కరోనా దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అక్కడ ఉండే జర్మన్లందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మారియో ఎన్ అనే వ్యక్తి సిక్స్ ప్యాక్ బీర్ను కొనుగోలు చేసేందుకు ఒక స్టోర్కి వెళ్లాడు. అప్పుడు ముసుగు ధరించాడు. ఆ తర్వాత కొనుగోలు అయిపోయింది కదా అని మాస్క్ తీసేసి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. అక్కడ క్యాషియర్గా పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్ ధరించండి అని చెప్పాడు. అంతే కోపంతో అతని నుదిటి పై పాయింట్ బ్లాక్లో గన్పెట్టి పేల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జర్మనీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడు మారియో అక్రమంగా తుపాకి కలిగి ఉన్నందుకు జర్మన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతేగాదు హత్యానేరం రుజువుకావడంతో జర్మన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. (చదవండి: ఉక్రెయిన్దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?) -
పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు. -
హ్యామర్ హ్యాండ్స్..
బేస్బాల్ బ్యాట్.. క్రికెట్ బ్యాట్ లాగే చాలా బలంగా ఉంటుంది. గొడ్డలితో నరికితేగానీ ప్రాపర్గా విరగదు. అలాంటి బలమైన బ్యాట్స్ను తన చేతితో విరగ్గొట్టాడు మార్షల్ ఆర్టిస్ట్ మహమ్మద్ కహ్రిమనోవిక్. హ్యామర్ హ్యాండ్స్గా పేరుపొందిన జర్మనీకి చెందిన 63 ఏళ్ల మహమ్మద్.. ఒక నిమిషంలో 68 బ్యాట్స్ను విరగ్గొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఇటలీలోని మిలన్లో ఈ ఫీట్ సాధించాడు. కూరగాయలు కట్చేసినంత ఈజీగా అతను బ్యాట్స్ విరగ్గొడుతున్న వీడియోను గిన్నిస్ వరల్డ్రికార్డ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. వీడియోను చూసిన కొందరు అతనికి కుడోస్ చెబుతుంటే... ఆ వీడియో చూశాక తమ చెయ్యి నొప్పెట్టిందంటూ మరికొందరు చలోక్తులు విసురుతున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందికిపైగా పైలట్ల నిరసన!
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ లుప్థాన్సాకు ఉద్యోగుల సమ్మె మరింత ఉధృతం కానుంది. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం కంటే అధికంగా వేతన చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ జర్మనీకి చెందిన జర్మన్ ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ వెరీనిగుంగ్ కాక్పిట్ (వీసీ)గురువారం రాత్రి నుంచి సమ్మెకు పిలుపు నిచ్చింది.ప్రస్తుతం సమ్మె కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది పైలట్లు విధులకు గైర్హాజరైటన్లు తెలుస్తోంది. పైలట్ల సమ్మె పిలుపుతో ప్రపంచ వ్యాప్తంగా లుప్థాన్సాకు చెందిన 800 విమానాల రాకపోకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని రోజుల్లో జర్మనీకి చెందిన పలు రాష్ట్రాల్లో సమ్మర్ సెలవులు ముగియనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న జర్మన్ దేశస్తులకు ఉద్యోగుల సమ్మె మరింత ఆందోళన కలిగిస్తుండగా...ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా లక్షా 30వేల మంది ప్రయాణికులపై పడింది. లుప్థాన్సా విమానాల సర్వీసులు రద్దుకావడంతో జర్మనీ ముఖ్య నగరాలైన ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్లలో సైతం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికుల్లో గందరగోళం మొదలైంది. ప్రయాణాన్ని రీహెడ్యూల్ చేయడం, లేదంటే ట్రైన్ జర్నీ చేసేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పైలట్ల డిమాండ్ ఇదే గత ఆగస్ట్ నెల నుంచి జీత భత్యాల పెంపు విషయంలో జర్మన్ పైలట్ల యూనియన్ వెరీనిగుంగ్ కాక్పిట్ (వీసీ) లుప్థాన్సాతో చర్చలు జరుపుతుంది. 2023లో ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం నుంచి పైలెట్లు గట్టెక్కాలంటే 5వేల కంటే ఎక్కువ మందికి 5.5శాతం వేతన పెంపును వీసీ డిమాండ్ చేసింది. అయితే సీనియర్ పైలట్లకు 5శాతం, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 18శాతం పెంచుతామని లుప్థాన్సా యాజమాన్యం ముందుకొచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పైలట్లు సమ్ముకు దిగిన విషయం తెలిసిందే. చదవండి👉 800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
పాస్పోర్టు వినియోగించినంత మాత్రాన జర్మనీ పౌరుడు కాలేడు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణానికి పాత పాస్పోర్టు ఉపయోగించినంత మాత్రాన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తమ దేశ పౌరుడు కాలేరని లిఖితపూర్వకంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని ఆయన తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు నివేదించారు. చెన్నమనేని నిబంధనలకు అనుగుణంగా 2009లో భారత పౌరసత్వం పొందారని, రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓటమి కావడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. చెన్నమనేని రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేములవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నమనేని తరఫున వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. భారత పౌరసత్వం ఇచ్చిన 30 రోజుల్లో అతని పౌరసత్వంపై అభ్యంతరాలు తెలిపాలని నిబంధన ఉందన్నారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత(120 రోజుల) ప్రత్యర్థి అభ్యంతరం తెలుపడం.. హోంశాఖ దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. భారత పౌరసత్వం తీసుకున్న నాటికి రమేశ్ రాజకీయాల్లో లేరని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి(ఆగస్టు 24) వాయిదా వేసింది. -
కోడి కూస్తోందని కేసు పెట్టారు
ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ ‘పక్కింటివాళ్ల కోడి వేధిస్తోంది, భరించలేకుండా ఉన్నాం బాబోయ్’ అంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా. కోడిపుంజు తెగ కూస్తూ తమను ఇబ్బందిపెడుతోందని కోర్టుకు విన్నవించుకున్నారు. కోడన్నాక కూయకుండా ఉంటుందా? ఆ మాత్రానికే కేసు పెట్టాలా అతిగాకపోతేను. అంటే.. అది కూస్తుంది పది ఇరవైసార్లు కాదు.. రోజుకు 200 సార్లట. అదికూడా 80 డెసిబెల్స్ రేంజులో. అంటే రద్దీగా ఉన్న ఓ వీధిలో వచ్చే శబ్దం అంత అన్నమాట. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ కూతల మోత... సాయంత్రం ఇతర కోళ్లతోపాటు గూట్లోకి చేరేంతవరకూ ఉంటోంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోలను భరించలేక వారు కోడిపై కేసు పెట్టారు. ‘వాళ్లు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే నాన్స్టాప్ చప్పుడు. చివరకు గార్డెన్కూ వెళ్లలేకపోతున్నాం. అదో, మేమో తేల్చుకోవాల్సిందే’ అని అంటున్నారు. పొద్దున లేస్తే కోడిచేసే చప్పుడును రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతేకాదు.. దాని దెబ్బకు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఆయన తీర్పుమీదే ఈ కోడి భవిష్యత్ ఆధారపడి ఉందన్నమాట. -
జర్మనీ అమ్మాయి.. వైజాగ్ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో
సాక్షి, విశాఖపట్నం: ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి బేధాలేవీ ఉండవు అంటారు. ఖండాంతరాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా అనిపించొచ్చు.. కానీ అప్పుడప్పుడు రియల్ లైఫ్లోనూ ఇలా జరుగుతుంటాయి. తాజాగా ఓ జంట ప్రేమ ఖండాంతరాలు దాటింది. విశాఖ అబ్బాయి..జర్మనీ అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే..మూడు దేశాల సంబంధంతో ఓ జంట ఒక్కటయ్యింది. వివరాల్లోకి వెళ్తే..విశాఖలోని కళాసాగర్ అధినేత వానపల్లి శ్రీమన్నారాయణ కుమారుడు దైవిక శశాంక్, జర్మనీకి చెందిన లిండా ముల్లర్ ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పడం..వాళ్లు అంగీకరించడంతో ఇటీవల వీరి వివాహం అమెరికా (అమ్మాయి, అబ్బాయి అక్కడ పనిచేస్తున్నారు)లో అంగరంగ వైభవంగా..హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. అబ్బాయిది (విశాఖ),అమ్మాయిది(జర్మనీ), పెళ్లయ్యింది అమెరికాలో.. ఫలితంగా ఈ వివాహ బంధం మూడు దేశాలతో ముడిపడినట్టయ్యింది. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?
హిట్లర్ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్ లైన్స్ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించిన వాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్ అయి, బ్రిటిష్వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్ వేసుకుని హిట్లర్ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చు కోవడం’ అనే డీల్ కోసం వెళ్లాడు. హిట్లర్ కూడా బ్రిటన్ పై పోరాడు తున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్కు, హిట్లర్ సైన్యం నేతాజీకి హెల్ప్ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్ లాజిక్తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు అనుకుని వెళ్లాడు. హిట్లర్ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్ లోపల ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్ అంటే లీడర్ అని. నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్.. నేతాజీ వెనక్కు వెళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్!’’ అన్నాడు. హిట్లర్ నవ్వాడు. ‘‘హిట్లర్నని నువ్వెలా చెప్పగలవ్?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. హిట్లర్కి చాలామంది డూప్లు ఉండేవాళ్లు. డూప్లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్ హింద్’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. నిజమైనా.. కాకున్నా.. .. బోస్ దూకుడు అలాంటిదే. బోస్ ఆత్మస్థర్యం అలాంటిదే. దేశంలోని బ్రిటిష్ వాళ్లనే అతడు లెక్క చెయ్యలేదు. నచ్చనప్పుడు గాంధీజీ మాట కూడా వినలేదు. యూరప్ అంతా తిరిగినవాడికి జర్మనీ ఏంటి? జర్మనీలోని హిట్లర్ ఏంటి? ‘‘హిట్లర్కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అని బోస్ హిట్లర్తో అని ఉండేందుకైతే అవకాశం లేకపోలేదు. బోస్పై ప్రామాణికమైన పుస్తకాలు అనేకం వచ్చాయి. వాటిల్లో ‘నేతాజీ ఇన్ యూరప్’ పుస్తకం ఒకటి. అందులో ఈ సందర్భం (బోస్ భుజాలపై హిట్లర్ చెయ్యేసిన సందర్భం) గురించి లేదు. అలాగే బోస్ పై వచ్చిన మరికొన్ని పాపులర్ పుస్తకాలు.. ది స్ప్రింగింగ్ టైగర్, ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్ అప్, ది ఇండియన్ పిలిగ్రిమ్, బోసే స్వయంగా రాసిన ‘లెటర్స్ టు ఎమిలీ షెంకెల్’, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇన్కన్వీయంట్ నేషనలిస్ట్, హిస్ మెజెస్టీస్ అపోనెంట్.. వీటిల్లో ఎక్కడా ఆ ఘటనపై చిన్న ప్రస్తావన కూడా లేదు. చరిత్రలో కొన్ని మిస్ అవుతాయి. చరిత్ర రచనలో అవి ఊహా వాస్తవాలుగా ప్రత్యక్షం అవుతాయి. ఇదీ అలాంటిదే అయినా కావచ్చు. (చదవండి: స్ఫూర్తి యోధులు లాల్ బాల్ పాల్... సమర యోధులు రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య)