Indian Super League
-
ఎవరిదో కిరీటం?
కోల్కతా: 13 జట్లు... 162 మ్యాచ్లు... 210 రోజులు... 465 గోల్స్తో సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్, బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) మధ్య నేడు ఫైనల్ జరగనుంది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకున్న మోహన్ బగాన్ జట్టు... సొంతగడ్డపై జరగనున్న తుదిపోరులో గెలిచి రెండోసారి చాంపియన్గా నిలవాలని భావిస్తుంటే... ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫైనల్కు చేరిన బెంగళూరు ఎఫ్సీ కూడా రెండోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. 2022–23 సీజన్లో చాంపియన్గా నిలిచిన మోహన్ బగాన్ జట్టు... 2023–24 సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజా సీజన్ లీగ్ దశలో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన మోహన్ బగాన్... ఇప్పటికే లీగ్ షీల్డ్ విన్నర్గా నిలిచింది. 2024–25 లీగ్ దశలో 24 మ్యాచ్లాడిన మోహన్ బగాన్ జట్టు 17 విజయాలు, 2 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 56 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘టేబుల్ టాపర్’గా నిలిచింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని 26 మ్యాచ్ల్లో మోహన్ బగాన్ 50 గోల్స్ చేసింది. అంటే సరాసరిగా ఈ సీజన్లో మ్యాచ్కు రెండు గోల్స్ చొప్పున కొట్టింది. ఇక బెంగళూరు జట్టు గ్రూప్ దశలో 24 మ్యాచ్ల్లో 11 విజయాలు, 8 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 38 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని బెంగళూరు 27 మ్యాచ్ల్లో 48 గోల్స్ చేసింది. సమఉజ్జీల సమరం... దూకుడుకు మారుపేరైన ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే కాగా... ఈ సీజన్లో మోహన్ బగాన్ ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బగాన్ జట్టు ప్రత్యర్థులకు 18 గోల్స్ మాత్రమే ఇచ్చుకోగా... బెంగళూరు జట్టు 33 గోల్స్ సమరి్పంచుకుంది. ఈ గణాంకాలు చాలు మోహన్ బగాన్ జట్టుపై గోల్ కొట్టడం ఎంత కష్టమో చెప్పేందుకు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐఎస్ఎల్ ఫైనల్కు చేరిన బెంగళూరు జట్టు... 2018–19 సీజన్లో చాంపియన్గా అవతరించింది. 2017–18, 2022–23 సీజన్లలో రన్నరప్తో సరిపెట్టుకుంది. 2022–23 సీజన్లో మోహన్ బగాన్, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ నిర్ణీత సమయంలో 2–2 గోల్స్తో ‘డ్రా’ కాగా... షూటౌట్లో మోహన్ బగాన్ జట్టు 4–3 గోల్స్ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునేందుకు బెంగళూరుకు చక్కటి అవకాశం ఉంది. భారత స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సుభాశీష్ బోస్ కెప్టెన్సీలో మోహన్ బగాన్ బరిలోకి దిగుతోంది. ‘ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సీజన్ చాలా బాగా సాగింది. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని భావిస్తున్నాం. కోల్కతా నగరం మాకు రెండో ఇల్లు లాంటింది. జట్టు ప్రదర్శన బాగుంది. సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. వారి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని మోహన్ బగాన్ సారథి సుభాశీష్ బోస్ అన్నాడు. ఆడిన ఎనిమిది సీజన్లలో బెంగళూరు జట్టు నాలుగోసారి ఫైనల్కు చేరగా... ఐఎస్ఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. మోహన్ బగాన్ తరఫున అల్బెర్టో రోడ్రిగ్స్, లిస్టన్ కొలాకో, అనిరుధ్ థాపా, సుభాశీష్ కీలకం కానుండగా... బెంగళూరు జట్టు గోల్కీపర్ గుర్ప్రీత్సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, అల్బెర్టో నొగురె, ఎడ్గర్ మెండెజ్పై భారీ ఆశలు పెట్టుకుంది. -
గోవా ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 12వ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో గోవా జట్టు 2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. గోవా జట్టు తరఫున ఇకెర్ గుర్రొటెనె (46వ నిమిషంలో), మొహమ్మద్ యాసిర్ (73వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. హోయ్్చలో గోవా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై 6 షాట్లు ఆడగా... కేరళ బ్లాస్టర్స్ ఒక్కటేసారి గోల్ పోస్ట్పైకి గురిచూసినా అది లక్ష్యాన్ని చేరలేదు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడిన గోవా జట్టు 12 విజయాలు, 3 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 42 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ 21 మ్యాచ్ల్లో 7 విజయాలు, 11 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు సాధించి 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు 3–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ తరఫున దిమిత్రోస్ (15వ నిమిషంలో), మహేశ్ సింగ్ (47వ నిమిషంలో), లాల్చుంగుంగా (54వ నిమిషంలో) తలా ఒక గోల్ కొట్టారు. పంజాబ్ తరఫున ఇజెక్వెల్ విడాల్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ జట్టు 24 పాయింట్లతో పట్టిక తొమ్మిదో స్థానంలో ఉండగా... పంజాబ్ అన్నే పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహన్ బగాన్తో ఒడిషా ఫుట్బాల్ క్లబ్ తలపడుతుంది. -
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
గోవా ఘన విజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్గా మ్యాచ్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. జంషెడ్పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్పూర్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
గోవా ఘనవిజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. లీగ్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. శనివారం జరగనున్న మ్యాచ్ల్లో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్పూర్ ఎఫ్సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
మోహన్ బగాన్ ‘టాప్’ షో
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తాజా సీజన్లో 11 మ్యాచ్లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్, గోవా ఫుట్బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్తో ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
మోహన్ బగాన్ గెలుపు
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్పూర్ ఎఫ్సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 8 మ్యాచ్లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్లో ఓడింది. 2 మ్యాచ్ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు. -
జంషెడ్పూర్కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్పూర్కు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ ఆడనుంది. -
పంజాబ్ ఎఫ్సీ బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్ కావడం విశేషం. పంజాబ్ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్సెన్ పెనాల్టీ కిక్ను గోల్గా మలిచాడు.ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్ గోల్తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్ మిర్జాక్ గోల్తో పంజాబ్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్లో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టు తలపడుతుంది. -
చెన్నైయిన్ ఎఫ్సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా ఎఫ్సీ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. చెన్నైయిన్ తరఫున ఫారుఖ్ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్... డేనియల్ (69వ ని.లో) ఒక గోల్ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీ 1–0 గోల్తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును ఓడించింది. -
కష్టాలన్నీ తీరినట్టే.. బెంగళూరుతో తొలి మ్యాచ్.. ఈసారైనా!
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్కు ఐఎస్ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్ను తప్పించేందుకు రంగం సిద్ధం!ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్ఎల్లో ఆరో సీజన్కు ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్తో భర్తీ చేశాడు.తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్గా నిలిచింది.తర్వాతి ఏడాదీ రన్నరప్గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్లో నెగ్గి, 16 మ్యాచ్లలో ఓడి, 5 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది. అన్నీ సమస్యలే... బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.ఐఎస్ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది. కొత్త యాజమాన్యంతో... సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్లైన్గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్లను మినహాయించి ఇతర మ్యాచ్ల షెడ్యూల్ను ఐఎస్ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్లో ఒక టీమ్ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్మెంట్ అండతో హెచ్ఎఫ్సీ 2024–25 సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.హైదరాబాద్ ఎఫ్సీ జట్టు వివరాలు అర్ష్దీప్ సింగ్ సైనీ, లాల్బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్లన్చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్సవ్మా చాక్చువాక్, లాల్చన్హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్లాల్రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్కర్, జోసెఫ్ సన్నీ. కోచ్: తంగ్బోయ్ సింగ్తో. నేటి నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ 11వ సీజన్కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ కూడా చక్కటి ఫామ్తో సవాల్ విసురుతోంది.నేడు జరిగే మొదటి మ్యాచ్లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
విజయంతో ముగించిన హైదరాబాద్ ఎఫ్సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ దశను హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో కేరళ బ్లాస్టర్స్ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్తో బొర్జా హెరెరా హైదరాబాద్ను గెలిపించాడు. లీగ్ దశలో ఆడిన 20 మ్యాచ్లలో 13 గెలిచి 4 మ్యాచ్లు ఓడిన హైదరాబాద్ మరో 3 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్సీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 4న కోల్కతాలో మోహన్బగాన్, ఒడిషా ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో హైదరాబాద్ రెండో సెమీఫైనల్ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న హైదరాబాద్లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్ (రెండో అంచె) మ్యాచ్ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్సీతో శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్సీ జట్టుకు మూడో పరాజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఒడిశా ఎఫ్సీ 3–1 గోల్స్తో హైదరాబాద్ను బోల్తా కొట్టించింది. ఒడిశా తరఫున ఇసాక్ (33వ ని.లో), డీగో మౌరిసియో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ ప్లేయర్ నిమ్ డోర్జీ తమాంగ్ 72వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. హైదరాబాద్ నుంచి ఏకైక గోల్ను నిమ్ డోర్జీ (45వ ని.లో) సాధించాడు. 17 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 11 విజయాలు, 3 ‘డ్రా’లు, 3 ఓటములతో 36 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. చదవండి: Hyderabad E-Prix 2023 : రేసింగ్ @ హైదరాబాద్ Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ -
ISL 2022: హైదరాబాద్ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్పూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 1–0 గోల్తో జంషెడ్పూర్ ఎఫ్సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఐఎస్ఎల్లో హైదరాబాద్ ఎఫ్సీకి తొలి విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్సీ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జోరు ముందు నార్త్ఈస్ట్ జట్టు తేలిపోయింది. మ్యాచ్ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్ గోల్ చేయడంతో 1–0తో హైదరాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్పోస్ట్పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. హలిచరన్ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ను 3–3తో డ్రా చేసుకున్న హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఈ మ్యాచ్లో మరింత మెరుగైంది. -
‘గాడియమ్’తో చేతులు కలిపిన ఐఎస్ఎల్ విన్నర్ హైదరాబాద్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్ఎఫ్సీ ఒప్పందం చేసుకుంది. కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్బాల్ అకాడమీ’ని హెచ్ఎఫ్సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు. హెచ్ఎఫ్సీ టీమ్కు చెందిన కోచ్లు, ఇతర సాంకేతిక నిపుణులు దీనికి సహకరిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన కుర్రాళ్లకు మున్ముందు హెచ్ఎఫ్సీ తరఫున యూత్, లీగ్ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కూడా లభిస్తుంది. శిక్షణతో పాటు హెచ్ఎఫ్సీ ఆధ్వర్యంలో ఆటకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేని, ‘గాడియమ్’ డైరెక్టర్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్స్ షబ్బీర్ అలీ, విక్టర్ అమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
IPL 2022: ఇంటికి వస్తోంది.. ట్రోఫీ.. కంగ్రాట్స్: సన్రైజర్స్
ISL -IPL- Hyderabad: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) విజేతగా నిలిచింది. ఎనిమిదో సీజన్ చాంపియన్గా నిలిచింది. గోవాలో మార్చి 20న జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ‘షూటౌట్’ నిర్వహించగా కేరళను నిలువరించి విజయం సాధించింది. కాగా ఐఎస్ఎల్ ట్రోఫీని హైదరాబాద్ గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయంపై స్పందించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ ఐఎస్ఎల్ విజేతకు తమదైన శైలిలో విషెస్ తెలిపింది. మ్యాచ్కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఇంటికి వస్తోంది ట్రోఫీ.. కంగ్రాట్స్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందించింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు కేన్ మామ కూడా కప్ తీసుకువస్తాడు చూడండి అంటూ ఎస్ఆర్హెచ్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా సన్రైజర్స్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాత్రం ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈసారైనా సత్తా చాటి తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు Intiki vastondi. 🏆🧡💛 Congratulations, @HydFCOfficial 👏#ISLFinal pic.twitter.com/NyuH6z5z0t — SunRisers Hyderabad (@SunRisers) March 20, 2022 Thag Life, #Pushpa style. 😎🔥#TATAIPL #OrangeArmy #ReadyToRise@alluarjun @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/x8lAXZPrzB — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022 -
ISL: నరాలు తెగే ఉత్కంఠ.. ఎట్టకేలకు తొలి టైటిల్ గెలిచిన హైదరాబాద్
Indian Super League- Hyderabad FC Won Maiden Trophy- ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్లు కొట్టిన మూడు షాట్స్ను నిలువరించి తమ జట్టును విజేతగా నిలిపాడు. చాంపియన్ హైదరాబాద్ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్మనీగా లభించాయి. అంతకుముందు ఆట 68వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు రాహుల్ గోల్ అందించి 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే 88వ నిమిషంలో సాహిల్ గోల్తో హైదరాబాద్ 1–1తో సమం చేసింది. కేరళ జట్టు మూడోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది. మరోవైపు హైదరాబాద్ జట్టు మూడో ప్రయత్నం లో చాంపియన్గా నిలువడం విశేషం. 2019లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలువగా.. 2020– 2021 సీజన్లో ఐదో స్థానాన్ని పొందింది. ‘షూటౌట్’ సాగిందిలా... కేరళ బ్లాస్టర్స్- స్కోరు - హైదరాబాద్ లెస్కోవిచ్ - 01 -జావో విక్టర్ నిషూ కుమార్- 01 - సివెరియో ఆయుష్- 12 - కమారా జీక్సన్ సింగ్ - 13 - హాలీచరణ్ నోట్: ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్ను తీసుకోలేదు చదవండి: IND VS SL Pink Ball Test: పింక్బాల్ టెస్ట్పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు First Appearance in the Final ✅ First #HeroISL trophy ✅ A memorable night for @2014_manel & @HydFCOfficial as they end their campaign in style! 🏆🤩#HFCKBFC #HeroISLFinal #FinalForTheFans #HeroISL #LetsFootball pic.twitter.com/zauxXrqGga — Indian Super League (@IndSuperLeague) March 20, 2022 -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్గా మారిందని విశ్లేషించారు. లీగ్లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్కే వాస్తే’గా టీమ్లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్కీపర్గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
ISL 2021-2022: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గురువారం హైదరాబాద్ ఎఫ్సీ, చెన్నైయిన్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్ మొహమ్మద్ సాజిద్ ధోత్ గోల్ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్ ఫార్వర్డ్ ఆటగాడు జేవియర్ సివేరియో (45వ ని.) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చదవండి: అదే తీరు.. ఈసారి పంత్తో పెట్టుకున్నాడు -
హైదరాబాద్ ఎఫ్సీ భారీ విజయం; చెస్లో అదరగొట్టిన ఇమ్రోజ్, సరయు!
Indian Super League: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగంగా గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 5–1తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుపై నెగ్గింది. హైదరాబాద్ తరఫున సానా (12వ ని.లో), అనికేత్ (90వ ని.లో), సివెరియో (90వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఒగ్బెచె (27వ, 78వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చాంప్స్ ఇమ్రోజ్, సరయు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ చాంపియన్షిప్లో బాలుర విభాగంలో మొహమ్మద్ బాషిఖ్ ఇమ్రోజ్ (నల్లగొండ–6.5 పాయింట్లు), బాలికల విభాగంలో వేల్పుల సరయు (వరంగల్–5.5 పాయింట్లు) చాంపియన్స్గా నిలిచారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన శిబి శ్రీనివాస్ ఐన్స్టీన్ రెడ్డి (బద్రుకా కాలేజీ) 6 పాయింట్లతో తొలి రన్నరప్గా, సూరపనేని చిద్విలాస్ సాయి (హైదరాబాద్) రెండో రన్నరప్గా నిలిచారు. కర్రి శరత్చంద్ర (రంగారెడ్డి) నాలుగో స్థానాన్ని పొందాడు. టాప్–4లో నిలిచిన ఈ నలుగురూ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో సరయు, గంటా కీర్తి (మేడ్చల్), లేళ్లపల్లి దుర్గా కార్తీక, ఎ.సాయి మహతి (రంగారెడ్డి) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ నలుగురు కూడా జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. విజేతలకు టీఎస్సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విజేతగా నిలిపాడు. -
హైదరాబాద్ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’
వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్తో ఆదివారం జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. 16 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 23 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ క్లబ్ 2–1తో జంషెడ్పూర్ క్లబ్ను ఓడించి ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఈస్ట్ బెంగాల్ తరఫున స్టీన్మన్ (6వ ని.లో), పిలింగ్టన్ (68వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జంషెడ్పూర్ జట్టుకు హార్ట్లే (83వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరిగే మ్యాచ్లో ముంబై సిటీతో గోవా క్లబ్ ఆడుతుంది. -
ఒడిశా గెలిచిందోచ్...
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఇప్పటిదాకా బోణీ చేయని ఏకైక జట్టుగా ఉన్న ఒడిశా ఎఫ్సీ ఆ ముద్రను తాజా విజయంతో తొలగించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో ఒడిశా జట్టు 4–2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీపై విజయం సాధించింది. ఒడిశా స్ట్రయికర్ డీగో మౌరిసియో చెలరేగాడు. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒడిశా జట్టులో స్టీవెన్ టేలర్ (42వ ని.) మౌరిసియో (50వ, 60వ ని.) గోల్స్ సాధించారు. కాగా అంతకుముందే ప్రత్యర్థి ఆటగాడు జీక్సన్ సింగ్ (22వ ని.) సెల్ఫ్గోల్ చేయడంతో ఒడిశా స్కోరు 4కు చేరింది. కేరళ జట్టులో జోర్డాన్ ముర్రే (7వ ని.), గ్యారీ హూపర్ (79వ ని.) చెరో గోల్ చేశారు. 9 మ్యాచ్లాడిన ఒడిశా ఆరు పోటీల్లో ఓడిపోగా రెండు మ్యాచ్ల్ని డ్రా చేసుకుంది. శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్ ఎఫ్సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ తలపడుతుంది. -
హైదరాబాద్ ఎఫ్సీ మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను జావో విక్టర్ గోల్గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్ను డ్రా చేసుకుంది. లీగ్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన హైదరాబాద్ ఎఫ్సీ ఒక మ్యాచ్లో గెలుపొంది, 3 మ్యాచ్ల్లో డ్రా నమోదు చేసింది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం
వాస్కో (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్తో శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ జట్టు ఖాతా తెరిచింది. 90వ నిమిషంలో రోచర్జెలా చేసిన గోల్తో నార్త్ ఈస్ట్ విజయం ఖాయమైంది. నేడు జరిగే మ్యాచ్ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్ తలపడతాయి. -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
ఫ్రాంచైజీ ఫీజును తగ్గించండి
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ను కరోనా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లీగ్లోని ప్రతి జట్టు కూడా సీజన్కు రూ.30 కోట్ల మేర నష్టపోతున్న వేళ... కరోనా రూపంలో వారిపై మరింత ఆర్థిక భారం పడనుంది. దాంతో దీని నుంచి కాస్తలో కాస్త తప్పించుకోవడానికి లీగ్లో ఆడే అన్ని జట్లు కూడా ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ఈ ఏడాదికిగాను జట్లు చెల్లించే ఫ్రాంచైజీ ఫీజును తగ్గించాలంటూ లీగ్ నిర్వాహకులను, ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)ను అభ్యర్థించాయి. ప్రస్తుతం ప్రతి జట్టు కూడా సీజన్కు రూ. 13 నుంచి 16 కోట్లను ఫ్రాంచైజీ రుసుముగా చెల్లిస్తున్నట్లు సమాచారం. 2014లో ఎనిమిది జట్లతో ఘనంగా ఆరంభమైన ఐఎస్ఎల్... ప్రస్తుతం పది జట్లకు చేరింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఐపీఎల్ తర్వాతి స్థానంలో నిలిచినా... తాము ఇప్పటి వరకు లాభాలను కళ్ల చూడలేదని జట్ల యాజమానులు చెబుతున్నారు. కరోనా దెబ్బతో తమకు స్పాన్సర్లు కూడా దూరమయ్యే అవకాశం ఉందని ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఫీజుపై లీగ్ నిర్వాహకులు ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్పై వేటు
న్యూఢిల్లీ: కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019–20 ఐఎస్ఎల్ సీజన్లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెదర్లాండ్స్కు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్ఎల్లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునైటెడ్(2018–19)కు హెడ్ కోచ్గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
90 లక్షలు!
దుబాయ్: ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన టైటిల్పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం మార్చి 8న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ను భారత్లో ఏకంగా 90.2 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా... భారత్ లో ఈ మ్యాచ్ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు వారి లెక్కల్లో తేలింది. ఈ టోర్నీ మొత్తాన్ని చూసేందుకు భారత అభిమానులు 540 కోట్ల నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు తెలిపింది. దీన్ని ఒక్కో అభిమాని... ఒక్కో మ్యాచ్ను వీక్షించిన సమయం ఆధారంగా లెక్కించినట్లు ఐసీసీ పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. మహిళల క్రికెట్కు సంబంధించి ఇదే మొదటిది కావడం విశేషం. ఈ మాధ్యమం ద్వారా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 మధ్య ఈ టోర్నీకి సంబంధించిన 110 కోట్ల వీడియోలు అభిమానులు చూశారు. ఐఎస్ఎల్కు పెరిగిన వీక్షకులు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తన వీక్షకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. తాజా ఐఎస్ఎల్ (2019–20) సీజన్ను వీక్షించిన ప్రేక్షకుల సంఖ్యను గత సీజన్తో పోలిస్తే 51 శాతం పెంచుకుందని టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 16.8 కోట్ల మంది తాజా సీజన్ను వీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా ఈ సీజన్ను 11 చానళ్ల ద్వారా 7 భాషల్లో దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది. దీంతో పాటు హాట్స్టార్, జియో టీవీ డిజిటల్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అట్లెటికో డి కోల్కతా రికార్డు స్థాయిలో మూడోసారి ఐఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్సీను కోల్కతా ఓడించింది. -
ఐఎస్ఎల్-ప్రీమియర్ లీగ్ల మధ్య కొత్త ఒప్పందం
ముంబై : ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్లో భాగంగా శుక్రవారం ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీ, ప్రీమియర్ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్బాల్ అభివృద్ధితోపాటు, కోచింగ్ సౌకర్యాలు, యువతలో ఫుట్బాల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్తో ఐఎస్ఎల్ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్లో ఫుట్బాల్ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిచర్డ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్లో ఫుట్బాల్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్ఎల్ భాగస్వామ్యంతో ఫుట్బాట్ కోచింగ్, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్బాల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్లో ఫుట్బాల్ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. -
హైదరాబాద్ ఎఫ్సీ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు
సాక్షి, హైదరాబాద్: తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ సీజన్లో వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు వేసింది. సీజన్లోని తదుపరి మ్యాచ్లకు ఆయనతో కలిసి పనిచేయడం లేదంటూ శనివారం ఒక ప్రకటన చేసింది. యాజమాన్యం, కోచ్ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హైదరాబాద్ కోచ్గా ఫిల్ అందించిన సేవలకు క్లబ్ తరఫున నుంచి అతడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఫిల్ జట్టును నడిపిన తీరు అభినందనీయం. అతని భవిష్యత్తు గొప్పగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ హైదరాబాద్ జట్టు సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆ ప్రకటనలో తెలిపారు. పుణే స్థానంలో ఐఎస్ఎల్ ఆరో సీజన్లో ఘనంగా అరంగేట్రం చేసిన హైదరాబాద్... ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం ఒక మ్యాచ్లో గెలిచి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకోగా... మిగిలిన 9 మ్యాచ్ల్లోనూ ఓడి టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
హైదరాబాద్ తొమ్మిదో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ పరాజయాలకు ఇప్పట్లో పుల్స్టాప్ పడేలా లేదు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 1–3 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్సీ చేతిలో ఓడింది. దీంతో సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. చెన్నై ఆటగాడు వాల్స్కీస్ (43వ, 65వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రాఫెల్ (40వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మార్సెలినో (87వ నిమిషంలో) చేశాడు. 12 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఐదు పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో ఒడిశా ఎఫ్సీ తలపడుతుంది. -
నార్త్ఈస్ట్పై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ గోవా 2–0తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీపై గెలుపొందింది. ఫలితంగా సీజన్లో ఏడో గెలుపును నమోదు చేసిన గోవా 24 పాయింట్లతో ‘టాప్’ స్థానంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో జాకీ చంద్ సింగ్ కొట్టిన పాస్ను అడ్డుకోబోయిన నార్త్ఈస్ట్ ప్లేయర్ కొమోస్కీ నేరుగా తమ గోల్పోస్టులోకే బంతిని పంపి సెల్ఫ్ గోల్తో ప్రత్యర్థి ఖాతాను తెరిచాడు. 82వ నిమిషంలో పెనాలీ్టని గోల్గా మలిచిన ఫెరాన్ కొరొమినాస్ గోవాకు 2–0తో విజయాన్ని ఖాయం చేశాడు. 80వ నిమిషంలో ప్రత్యరి్థని దురుసుగా అడ్డుకున్న నార్త్ఈస్ట్ ప్లేయర్ డేవిడ్ రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాడు. నేటి మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీతో జంషెడ్పూర్ ఎఫ్సీ తలపడుతుంది. -
బెంగళూరును గెలిపించిన సునీల్ చెత్రి
బెంగళూరు: ఎఫ్సీ గోవాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్ సాధించాడు. నేటి మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో అట్లెటికో డి కోల్కతా తలపడుతుంది. -
హైదరాబాద్ ఖాతాలో ఏడో పరాజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు ఓటములను ఖాతాలో వేసుకున్న హైదరాబాద్... ఆదివారం జరిగిన మ్యాచ్లో 1–2 గోల్స్ తేడాతో ముంబై చేతిలో ఓడింది. దీంతో టోరీ్నలో ఏడో పరాభవాన్ని మూట గట్టుకుంది. ముంబై ఆటగాడు సౌగౌ (6వ, 78వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధిం చాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్ను బోబో (81వ నిమిషంలో) చేశాడు. నాలుగు రోజుల విరామం తర్వాత జనవరి 3వ తేదీన బెంగళూరు ఎఫ్సీతో ఎఫ్సీ గోవా తలపడుతుంది. -
బెంగళూరుపై కోల్కతా గెలుపు
కోల్కతా: క్రిస్మస్ పర్వదినాన అట్లెటికో డి కోల్కతా జట్టు సంబరాల్లో మునిగి తేలింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో అట్లెటికో తొలిసారి బెంగళూరు ఎఫ్సీపై విజయం సాధించింది. ఐఎస్ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో రెండుసార్లు మాజీ చాంపియన్ అయిన అట్లెటికో జట్టు 1–0తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీపై గెలుపొందింది. మ్యాచ్ మొత్తం మీద అన్ని విభాగాల్లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు జట్టే ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. మ్యాచ్ 47వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ చేసిన గోల్తో అట్లెటికో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్లెటికో (18 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. -
గోల్కీపర్ నిర్లక్ష్యం...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆటగాళ్ల శ్రమను జట్టు గోల్ కీపర్ కమల్జీత్ సింగ్ వృథా చేశాడు. సొంత మైదానంలో గెలవాల్సిన చోట తన నిర్లక్ష్యంతో హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకునేలా చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్–6 ఫుట్బాల్ టోర్నీలో భాగంగా శనివారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్లెటికో డి కోల్కతాతో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 90వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడి నుంచి బంతి అందుకున్న కమల్జీత్... అవసరం లేకపోయినా బంతిని గాల్లోకి తన్నాడు. అయితే ఆ బంతి గతి తప్పి నేరుగా హైదరాబాద్ ‘డి’ బాక్స్ ముందే కాచుకొని ఉన్న ప్రత్యర్థి కోల్కతా ప్లేయర్ హెర్నాండెజ్ దగ్గరికి వెళ్లడం... అతను హెడర్తో కృష్ణ రాయ్కు పాస్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కృష్ణ ఎటువంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపి స్కోరును 2–2తో సమం చేశాడు. దీంతో మైదానంలోని హైదరాబాద్ అభిమానులు షాక్కు గురయ్యారు. మైదానంతా ఒక్కసారిగా మూగబోయింది. కమల్జీత్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జట్టు డిఫెండర్, భారత జట్టు సభ్యుడైన ఆదిల్ ఖాన్ ఆగ్రహంతో గోల్కీపర్ మీదకు దూసుకెళ్లగా... అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు అతనిని నిలువరించారు. అంతకుముందు 15వ నిమిషంలో కృష్ణ రాయ్ గోల్తో కోల్కతా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో బోబో గోల్తో హైదరాబాద్ స్కోరును సమం చేసింది. అనంతరం 85వ నిమిషంలో బోబో మళ్లీ గోల్ చేయడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివరి క్షణాల్లో గోల్కీపర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ గోల్ను సమరి్పంచుకుంది. -
గోవా చేతిలో కోల్కతాకు చుక్కెదురు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రస్తుత సీజన్లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 1–2తో ఎఫ్సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్... 66వ నిమిషంలో ఫెరాన్ కొరొమినాస్ ఒక్కో గోల్ చేశారు. 64వ నిమిషంలో కోల్కతాకు జాబీ జస్టిన్ ఏకైక గోల్ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది. -
నార్త్ఈస్ట్ యునైటెడ్ తొలి ఓటమి
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీకి తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 0–3 గోల్స్ తేడాతో అట్లెటికో డి కోల్కతా చేతిలో పరాజయం పాలైంది. రాయ్ కృష్ణ (35వ, 90+4వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డేవిడ్ విలియమ్స్ (11వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆట ఆరంభంలో నార్త్ఈస్ట్ ప్రధాన ఆటగాడు అసమో జ్యాన్ గాయం కారణంగా మైదానాన్ని వీడటం ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపింది. నేటి మ్యాచ్లో గోవా ఎఫ్సీతో హైదరాబాద్ ఎఫ్సీ తలపడుతుంది. -
ఒడిశాపై బెంగళూరు గెలుపు
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6లో బెంగళూరు ఎఫ్సీ తన జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 1–0తో ఒడిశా ఎఫ్సీపై విజయం సాధించింది. సీజన్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు కూడా దూకుడైన ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చాయి. అటాక్, కౌంటర్ అటాక్లతో ప్రత్యర్థి ‘డి’ బాక్సుల్లోకి చొచ్చు కొని వెళ్లాయి. అయితే గోల్ కీపర్లు అడ్డుగోడగా నిలవడంతో గోల్ చేయడంలో ఇరు జట్లు సఫలం కాలేదు. ఆట 37వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్ను గోల్గా మలిచిన జునాన్ బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో అర్ధభాగంలో గోల్ కోసం ఒడిశా చేసిన ప్రయత్నాలను బెంగళూరు గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెంగళూరు విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో కేరళ తలపడుతుంది. -
కేరళ బ్లాస్టర్స్ శుభారంభం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో కేరళ 2–1తో అట్లెటికో డి కోల్కతాపై గెలిచింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్ ఒగ్బెచ్ రెండు గోల్స్ సాధించగా... కోల్కతా తరఫున కార్ల్ మెక్హ్యూ గోల్ చేశాడు. ఆట 6వ నిమిషంలో కార్ల్ మెక్హ్యూ గోల్ చేసి కోల్కతాకు ఆధిక్యాన్నిచ్చాడు. అయితే 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను గోల్గా మలిచిన ఒగ్బెచె స్కోర్ను సమం చేశాడు. మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్ చేసిన ఒగ్బెచె కేరళకు 2–1తో ఆధిక్యాన్నిచ్చాడు. చివరిదాకా కేరళ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో మూడు పాయింట్లు వేసుకుంది. మ్యాచ్కు ముందు ప్రారంత్సవంలో బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరుతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు ఆడుతుంది. -
చార్మినార్ ... కోహినూర్
హైదరాబాద్: ఈ సీజన్ నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కాలిడనున్న ‘హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)’... శనివారం తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. నగరానికి తలమానికమైన చార్మినార్ నేపథ్యంగా, విఖ్యాత కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఈ లోగో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హైదరాబాద్ ఫుట్బాల్ ఖ్యాతిని పునరుద్ధరించడం’ అని శీర్షిక ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ... ‘ఫుట్బాల్లో హైదరాబాద్కు 1910 నుంచి మంచి గుర్తింపు ఉంది. 1920–1950 మధ్య అయితే భారత్ ఫుట్బాల్ను శాసించింది’ అని అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ విశేష ఆదరణ చూరగొంటుందని మాకు నమ్మకం ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం’ అని మరో సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. హైదరాబాద్ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్ చేశామని, హెచ్ఎఫ్సీతో ఈ ప్రాంతంలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎల్ ఆరో సీజన్ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతా (ఏటీకే)తో కోల్కతాలో తలపడతుంది -
ఐఎస్ఎల్ చాంప్ చెన్నైయిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్లో రెండోసారి టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3–2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్ను గెలిపించారు. డిఫెండర్ మెల్సన్ అల్వెస్ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. ఆట ఆరంభంలోనే భారత స్టార్ సునీల్ చెత్రి (9వ ని.) గోల్ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్ 90+2) చివరి నిమిషాల్లో గోల్ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్లో నాలుగు హెడర్ ద్వారానే వచ్చాయి. చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు. -
ఆటలకు అండగా నిలుస్తాం!
►కేరళ బ్లాస్టర్స్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ ►హైదరాబాద్ ఫుట్బాల్ అకాడమీతో ఒప్పందం హైదరాబాద్: క్రీడలను అభిమానించేవారి సహకారం లేకుండా ఏ క్రీడలు కూడా అభివృద్ధి చెందలేవని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ జట్టు కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. ఇదే కారణంతో గత కొంత కాలంగా తాము అన్ని రకాల క్రీడలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిభ గల చిన్నారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఏ)తో బ్లాస్టర్స్ జత కట్టింది. దీని ద్వారా హెచ్ఎఫ్ఏలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ట్రైనీలకు బ్లాస్టర్స్ యాజమాన్యం సాంకేతిక సహకారం అందిస్తుంది. ‘ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి ఆటగాళ్లు త్వరలో మా జట్టుతో పాటు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నాం. కేరళ టీమ్ కోచ్లు కూడా ఈ అకాడమీలో అవసరమైన ట్రైనింగ్ అందిస్తారు. గతంలో భారత ఫుట్బాల్లో అనేక మంది దిగ్గజాలు హైదరాబాద్కు చెందినవారే. నాటి వైభవం తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం’ అని ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్లో ఫుట్బాల్ ఆటకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తమ అకాడమీ కృషి చేస్తోందని హెచ్ఎఫ్ఏ ఫౌండర్ మొహమ్మద్ ఆతిఫ్ హైదర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఏ ప్రతినిధులు తేజో అనంత్ దాసరి, పవన్ కుమార్ దువ్వా, కోచ్ తంగ్బోయ్, బ్లాస్టర్స్ ఆటగాళ్లు రినో, ప్రశాంత్లతో పాటు చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు. -
‘బకాయిలు చెల్లించడం లేదు’
న్యూఢిల్లీ: తనకు రావాల్సిన బకాయిలపై న్యాయపోరాటానికి దిగేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాడు మార్సెలో పెరీరా సిద్ధమవుతున్నాడు. ఐఎస్ఎల్ మూడో సీజన్లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఈ ఆటగాడికి ఢిల్లీ ఫ్రాంచైజీ 2500 డాలర్లను చెల్లించాల్సి ఉంది. లీగ్ సందర్భంగా పెరీరా చేసే ఒక్కో గోల్కు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేందుకు ఢిల్లీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. తను మొత్తం పది గోల్స్ చేయడంతో పాటు గోల్డెన్ బూట్ గెలుచుకున్నందుకు 15వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంది. -
ఐఎస్ఎల్, ఐ–లీగ్ విలీనమైతే మంచిదే
భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్), దేశవాళీ ఫుట్బాల్ ‘ఐ–లీగ్’లను విలీనం చేసే ప్రతిపాదనకు భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి మద్దతిచ్చాడు. ఇదే జరిగితే జాతీయ జట్టుకు మరిన్ని ‘ఫిఫా’ స్నేహపూర్వక మ్యాచ్లు ఆడే అవకాశం దక్కుతుందని, ర్యాంకింగ్ కూడా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 జట్లతో కూడిన లీగ్ను ఆడిస్తే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు చోటు దక్కినట్టవుతుందన్నాడు. పది జట్లతో కూడిన ఐ–లీగ్ 2017 సీజన్ జనవరి 7న మొదలుకానుంది. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జట్ల కెప్టెన్లతో కలసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈసారి ఐ–లీగ్లో కొత్తగా చెన్నై సిటీ ఎఫ్సీ, మినర్వా పంజాబ్ జట్లకు చోటు కల్పించారు. మరోవైపు ఐఎస్ఎల్, ఐ–లీగ్ల విలీనంపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ‘జట్లు ఎక్కువగా ఉంటే లీగ్కు మంచిది. 20 టీమ్స్ ఉంటే మరీ మంచిది. మధ్యప్రదేశ్, లక్షద్వీప్ నుంచి కూడా టీమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. గుజరాత్లో ఓ పిల్లాడు ఫుట్బాల్లో స్టార్ కావాలనుకుంటే అందుకు తగిన పరిస్థితులను మనం కల్పించాలి. ఎందుకు మనకు కేరళ, బెంగాల్, నార్త్ ఈస్ట్ నుంచే ఆటగాళ్లు వస్తుంటారు? మధ్యప్రదేశ్ నుంచి ఎందుకు సూపర్స్టార్లు లేరు? అక్కడ కూడా కచ్చితంగా టాలెంట్ ఉంటుంది. అందుకే అన్ని చోట్ల నుంచి జట్లు ఉండాలని కోరుకుంటున్నాను. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఐఎస్ఎల్, ఐ–లీగ్లు విలీనమైతే సంతోషిస్తా. ఆటగాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ అది వాళ్ల చేతుల్లో లేదు’ అని చెత్రి అన్నాడు. తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఆటగాళ్లు విదేశీ క్లబ్బులకు ఆడడంలో తప్పేమీ లేదని అన్నాడు. భారత జట్టు ముందుగా ఆసియాలో టాప్–10లో నిలవాలని, ఆ తర్వాతే 2022 ప్రపంచకప్కు అర్హత సాధించడంపై ఆలోచించాలని సూచించాడు. -
కోల్కతాకే కిరీటం
రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ కైవసం ∙రూ. 8 కోట్ల ప్రైజ్మనీ సొంతం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆదివారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నువ్వా.. నేనా అనే రీతిలో జరిగిన ఫైనల్లో అట్లెటికో డి కోల్కతా రెండోసారి విజేతగా నిలిచింది. సొంతగడ్డపై తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీపై కోల్కతా 4–3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా నెగ్గింది. లీగ్ తొలి సీజన్ ఫైనల్లోనూ కోల్కతా జట్టు కేరళపైనే నెగ్గింది. అలాగే ఈ సీజన్లో సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన కేరళకు ఇదే తొలి పరాజయం. చాంపియన్గా నిలిచిన కోల్కతాకు రూ.8 కోట్లు దక్కగా.. రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు అందించారు. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు్ల 1–1తో సమంగా నిలిచాయి. కేరళ బ్లాస్టర్స్ నుంచి మొహమ్మద్ రఫీఖ్ (37), కోల్కతా నుంచి సెరెనో (44) గోల్స్ చేశారు. దీంతో ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించినా గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో మొదట కేరళ నుంచి ఆంటోనియో జర్మన్, బెల్ఫోర్ట్, రఫీఖ్ గోల్స్ సాధించగా డోయో, హెంగ్బర్ట్ విఫలమయ్యారు. ఇక కోల్కతా నుంచి డౌటీ, బోర్జా, లారా, జ్యువెల్ రాజా విజయవంతం కాగా హ్యూమే ఒక్కడు విఫలమయ్యాడు. అంతకుముందు మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీ ఆటతో తమ ఉద్దేశాన్ని చాటుకున్నాయి. తొలి భాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి. రెండో అర్ధభాగంలో రెండు జట్లు ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. ఫలితం కోసం మరో అరగంట అదనపు సమయం కేటాయించారు. గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు వెళ్లింది. -
ముంబైపై కోల్కతా పైచేయి
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ సెమీఫైనల్ అంచె తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా పైచేయి సాధించింది. ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్ తొలి అర్ధభాగంలోనే రావడం విశేషం. కోల్కతా తరఫున రాల్టె (3వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎడ్వర్డ్ హుమే (39వ, 45వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ముంబై జట్టుకు కోస్టా (10వ ని.లో), వియెరా (19వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. 13న ముంబై జట్టుతోనే జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కోల్కతా ‘డ్రా’ చేసుకుంటే ఫైనల్కు చేరుకుంటుంది. ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్తో ఢిల్లీ డైనమోస్ తలపడుతుంది. -
కేరళను సెమీస్కు చేర్చిన వినీత్
కీలకమ్యాచ్లో నార్త్ ఈస్ట్పై విజయం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ లీగ్ దశ ముగిసింది. కీలక మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుపై కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ 1-0తో నార్త్ ఈస్ట్ జట్టును ఓడించింది. ఆట 66వ నిమిషంలో వినీత్ చేసిన గోల్తో కేరళ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బ్లాస్టర్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ ఓటమిపాలై నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఈ విజయంతో కేరళ బ్లాస్టర్స్ మొత్తం 22 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్కతా సెమీస్కు చేరాయి. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సెమీఫైనల్స్లో ఢిల్లీ డైనమోస్తో కేరళ బ్లాస్టర్స్; కోల్కతాతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడతాయి. -
కోల్కతా, పుణే మ్యాచ్ డ్రా
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికో డి కోల్కతా, పుణే ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారుు. ప్రస్తుతం కోల్కతా 20 పారుుంట్లతో మూడో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. -
నార్త్ ఈస్ట్ సెమీస్ ఆశలు సజీవం
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఢిల్లీ డైనమోస్ జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ జట్టు 18 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ తరఫున సిత్యాసెన్ సింగ్ (60వ ని.లో), కోఫీ ఎన్డ్రి (71వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీ జట్టుకు పెరీరా (90వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. గురువారం జరిగే మ్యాచ్లో ఎఫ్సీ గోవాతో చెన్నైరుున్ ఎఫ్సీ తలపడుతుంది. -
కేరళ, కోల్కతా మ్యాచ్ డ్రా
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా అట్లెటికో డి కోల్కతా, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. కేరళ తరఫున వినీత్ (8వ ని.లో), కోల్కతా తరఫున పియర్సన్ (18వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
కేరళ రికార్డు విజయం
కొచ్చి: సొంత గడ్డపై కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శుక్రవారం ఎఫ్సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్లో 2-1తో ఘనవిజయం సాధించింది. స్థానిక నెహ్రూ స్టేడియంలో ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇది ఐఎస్ఎల్ రికార్డు. కేరళ తరఫున నజోన్ (7వ నిమిషంలో), హ్యూజెస్ (57) గోల్స్ చేశారు. రోడ్రిగెజ్ (90) పుణేకు ఏకైక గోల్ను అందించాడు. -
ఆరు మ్యాచ్ల తర్వాత...
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆరు మ్యాచ్ల తర్వాత నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. పుణే సిటీ ఎఫ్సీ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జట్టు 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 81వ నిమిషంలో కోఫీ క్రిస్టియన్ ఎండ్రీ గోల్ చేసి నార్త్ ఈస్ట్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీతో చెన్నైరుున్ జట్టు తలపడుతుంది. -
ఢిల్లీకి పుణే షాక్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఢిల్లీ డైనమోస్ జట్టుకు శుక్రవారం ఊహించని పరాజయం ఎదురైంది. పుణే ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ 3-4 గోల్స్ తేడాతో ఓడిపోరుుంది. ఈ లీగ్లో ఢిల్లీకిది కేవలం రెండో ఓటమి కావడం గమనార్హం. పుణే తరఫున అనిబల్ రోడ్రిగెజ్ రెండు గోల్స్ చేయగా.. సిస్సోకో, లెన్నీ రోడ్రిగెజ్ ఒక్కో గోల్ సాధించారు. ఢిల్లీ జట్టుకు కీన్ లూరుుస్, ఎంజువాలా ఒక్కో గోల్ చేశారు. పుణే ప్లేయర్ ఎడువార్డో పెరీరా సెల్ఫ్ గోల్తో ఢిల్లీ ఖాతాలో మూడో గోల్ చేరింది. -
కోల్కతా 1, నార్త్ ఈస్ట్ 1
కోల్కతా: నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసిన అట్లెటికో డి కోల్కతా డ్రాతో గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ ఐదో నిమిషంలోనే నార్త్ఈస్ట్ కు వెలెజ్ గోల్ అందించాడు. ఆ తర్వాత దాదాపు మ్యాచ్ చివరి వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈ జట్టుకు ఇయాన్ హ్యుమే షాకిచ్చాడు. ఇంజ్యూరీ (90+) టైమ్లో అత్యంత సమీపం నుంచి బంతిని గోల్పోస్టులోకి పంపి సొంత గడ్డపై అభిమానులను మురిపించాడు. -
గోవా, ముంబై మ్యాచ్ డ్రా
ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గోవా ఎఫ్సీ, ముంబై సిటీ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఈ ఫలితంతో ముంబై 16 పారుుంట్లతో రెండో స్థానంలో, గోవా 11 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉన్నారుు. గురువారం జరిగే మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతాతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తలపడుతుంది. -
ఢిల్లీ, కోల్కతా మ్యాచ్ డ్రా
ఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’గా ముగిసింది. కోల్కతా తరఫున హ్యూమ్ (17వ ని.లో), గ్రాండీ (71వ ని.లో)... ఢిల్లీ తరఫున మిలన్ సింగ్ (63వ ని.లో), మలూడా (74వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్
ఫటోర్డా (గోవా): సొంతగడ్డపై గోవా జట్టు సత్తా చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో గోవా జట్టు 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ప్రథమార్థం ముగిసేసరికి రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఆట 50వ నిమిషంలో సితెసిన్ సింగ్ గోల్తో నార్త్ ఈస్ట్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. 62వ నిమిషంలో రాబిన్ సింగ్ గోల్తో గోవా జట్టు స్కోరును 1-1తో సమం చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న తరుణంలో 90వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్ చేసి గోవా జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 10 మ్యాచ్లు పూర్తి చేసుకున్న గోవా పది పారుుంట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
ముంబైకి షాకిచ్చిన పుణే
ముంబై: ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్సీకి... ఎఫ్సీ పుణే సిటీ షాకిచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ పుణే 1-0తో నెగ్గింది. 89వ నిమిషంలో యుగెనెసన్ లింగ్డో చేసిన గోల్తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ చివరి వరకు కూడా ముంబై సిటీ ఆధిక్యం కనబరిచినా గోల్స్ చేయడంలో విఫలమైంది. అరుుతే పుణే మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. లెప్ట్ వింగ్ నుంచి నారాయణ్ దాస్ ఇచ్చిన క్రాస్ను లింగ్డో ఎలాంటి పొరపాటుకు తావీయకుండా నెట్లోకి పంపడంతో పుణేకు అద్భుత విజయం దక్కింది. -
ఢిల్లీకి భారీ విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ డైనమోస్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైయిన్ ఎఫ్సీతో బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 4-1 గోల్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీ తరఫున గాడ్జె (15వ ని.లో), లూయిస్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కెప్టెన్ ఫ్లోరెంట్ మలూడా (25వ, 85వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చెన్నైయిన్ జట్టుకు మెండీ (37వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ 16 పారుయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగే మ్యాచ్లో ముంబైతో పుణే తలపడుతుంది. -
పుణే నాకౌట్ ఆశలు సజీవం
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో పుణే ఎఫ్సీ జట్టు సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. తద్వారా నాకౌట్ దశకు చేరుకునే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. అట్లెటికో డి కోల్కతా జట్టుతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పుణే జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. పుణే తరఫున ఎడువార్డో పెరీరా (41వ నిమిషంలో), అనిబాల్ రోడ్రిగెజ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఇయాన్ హ్యుమె (69వ నిమిషంలో) కోల్కతా జట్టుకు ఏకై క గోల్ను అందించాడు. ఈ గెలుపుతో పుణే పారుుంట్ల పట్టికలో తొమ్మిది పారుుంట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్తో గోవా జట్టు తలపడుతుంది. -
అగ్రస్థానంలో ఢిల్లీ డైనమోస్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పారుుంట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు అగ్రస్థానానికి చేరింది. శుక్రవారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 2-0తో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నుంచి లూరుుస్ (56వ నిమిషంలో), పెరీరా (60) గోల్స్ చేశారు. ప్రథమార్ధంలో ఇరు జట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గోల్స్ నమోదు కాలేదు. అరుుతే ద్వితీయార్ధం మాత్రం స్థానిక అభిమానుల మద్దతుతో ఢిల్లీ చెలరేగింది. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. -
గోవాను గెలిపించిన లూయిజ్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలిసారిగా పుణే సిటీపై ఎఫ్సీ గోవా జట్టు విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ను ఎఫ్సీ గోవా 1-0తో గెలుచుకుంది. మ్యా చ్లో నమోదైన ఏకైక గోల్ను ఫ్రీకిక్ ద్వారా రాఫెల్ లూరుుజ్ (32వ నిమిషంలో) సాధించాడు. పుణే సిటీ ద్వితీయార్ధంలో తమ దాడులను ఉధృతం చేసినా ఫలితం లేకుండా పోరుుంది. -
ముంబైని ఆదుకున్న కోస్టా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ముంబై ఎఫ్సీ సిటీ జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసింది. చెన్నైరుున్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ను ముంబై జట్టు 1-1తో సమంగా ముగించింది. ఆట 51వ నిమిషంలో లాల్పెకులా గోల్తో చెన్నైరుున్ జట్టు 1-0తో ముందంజ వేసింది. ముంబై జట్టు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇక చెన్నైరుున్ జట్టుదే విజయం అనుకుంటున్న తరుణంలో.. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ముంబై ఆటగాడు లియో కోస్టా అద్భుత గోల్ చేసి స్కో రును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్లో పుణేతో గోవా జట్టు తలపడుతుంది. -
చెన్నైయిన్, కేరళ మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శనివారం చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. లీగ్లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై, 7 మ్యాచ్లు ఆడిన కేరళ తొమ్మిదేసి పారుుంట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారుు. -
కోల్కతాకు మరో గెలుపు
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్కతా మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 39వ నిమిషంలో అల్ఫారో చేసిన గోల్తో నార్త్ ఈస్ట్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే రెండో అర్ధభాగంలో కోల్కతా ఆటగాళ్లు సమన్వయంతో ఆడారు. 63వ నిమిషంలో పోస్టిగా గోల్తో కోల్కతా స్కోరును 1-1తో సమం చేసింది. 82వ నిమిషంలో బెలెన్కోసో గోల్తో కోల్కతా 2-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో కోల్కతా 12 పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగే మ్యాచ్లో చెన్నైరుున్తో కేరళ బ్లాస్టర్స్ తలపడుతుంది. -
ఐఎస్ఎల్తో భారత్లో ఫుట్బాల్ అభివృద్ధి
ప్రాన్స్ దిగ్గజం హెన్రీ అభిప్రాయం ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ వల్ల భారతదేశంలో ఫుట్బాల్ అభివృద్ధి చెందుతుందని ప్రాన్స్ దిగ్గజం థియరీ హెన్రీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెల్జియం జట్టుకు సహాయక కోచ్గా పని చేస్తున్న ఆయన రెండు రోజులుగాభారత్లో పర్యటిస్తున్నారు. ‘లీగ్లో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి ఆడటం వల్ల భారత్లోని యువ క్రీడాకారులు చాలా మెరుగుపడతారు. దీని ఫలితం మున్ముందు మరింత కనిపిస్తుంది’ అని హెన్రీ చెప్పారు. కోల్కతా కోచ్ సస్పెన్షన్ న్యూఢిల్లీ: పదే పదే రిఫరీల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు అట్లెటికో డి కోల్కతా జట్టు కోచ్ జోస్ మోలినాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. -
అగ్రస్థానానికి ముంబై ఎఫ్సీ
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ముంబై ఎఫ్సీ జట్టు 1-0తో అట్లెటికో డి కోల్కతా జట్టుపై విజయం సాధించింది. ముంబై తరఫున ఫోర్లాన్ (79వ ని.)గోల్ చేశాడు. ఈ విజయంతో ముంబై ఎఫ్సీ పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
కేరళ బ్లాస్టర్స్ గెలుపు
ఇండియన్ సూపర్ లీగ్ ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్లో గత మూడు మ్యాచ్లలో ఓటమి ఎరుగని కేరళ బ్లాస్టర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో కేరళ 2-1 గోల్స్ తేడాతో ఎఫ్సీ గోవాపై విజయం సాధించింది. కేరళ తరఫున 46వ నిమిషంలో మొహమ్మద్ రఫీ, 84వ నిమిషంలో కెర్వెన్స బెల్ఫోర్ట్ గోల్స్ సాధించాడు. గోవా జట్టు ఆటగాళ్లలో 24వ నిమిషంలో జూలియో సీజర్ ఏకై క గోల్ నమోదు చేశాడు. ఈ విజయంతో కేరళకు 3 పారుుంట్లు దక్కారుు. తాజా ఫలితం తర్వాత పారుుంట్ల పట్టికలో కేరళ ఐదో స్థానానికి చేరగా, గోవా ఆఖరి స్థానంలో ఉంది. -
ఢిల్లీపై కోల్కతా విజయం
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా రెండో స్థానానికి ఎగబాకింది. శనివారం ఢిల్లీ డైనమోస్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 1-0తో గెలిచింది. ఇయాన్ హ్యుమే 78వ నిమిషంలో స్పాట్ కిక్ ద్వారా జట్టుకు ఏకైక గోల్ను అందించాడు. -
గోవాకు తొలి గెలుపు
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఎఫ్సీ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా తొలి మూడు మ్యాచ్ల్లో ఓడి, నాలుగో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న గోవా ఐదో మ్యాచ్లో విజయాల బోణీ చేసింది. ముంబై సిటీ ఎఫ్సీ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో గోవా 1-0తో నెగ్గింది. 41వ నిమిషంలో ఫెలిస్బినో గోల్తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ముంబై స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా సఫలం కాలేకపోరుుంది. -
ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా నార్త్ ఈస్ట్ యునెటైడ్, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట 38వ నిమిషంలో లూరుుస్ గోల్తో ఢిల్లీ డైనమోస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 51వ నిమిషంలో అల్ఫారో గోల్తో నార్త్ ఈస్ట్ స్కోరును సమం చేసింది. ఈ లీగ్లో నార్త్ ఈస్ట్ జట్టుకిది తొలి ‘డ్రా’కాగా... ఢిల్లీకి వరుసగా రెండోది. ఆదివారం జరిగే మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతాతో ఎఫ్సీ గోవా తలపడుతుంది. -
అట్లెటికో డి కోల్కతా బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్కతా జట్టు విజయాల బోణీ చేసింది. కేరళ బ్లాస్టర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో అట్లెటికో జట్టు 1-0తో నెగ్గింది. 53వ నిమిషంలో జావీ లారా ఏకై క గోల్ చేసి అట్లెటికో జట్టును గెలిపించాడు. చెన్నైరుున్తో జరిగిన తొలి మ్యాచ్ను అట్లెటికో 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. -
వైభవంగా ఐఎస్ఎల్ ప్రారంభం
గువాహటి: బాలీవుడ్ నటుల హుషారెత్తించే నృత్య ప్రదర్శనలతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం సాయంత్రం లీగ్ ప్రారంభ వేడుకలు జరిగారుు. అర్ధగంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధావన్ 500 మంది నృత్యకారులతో కలిసి తమ డ్యాన్సను ప్రదర్శించారు. ముందుగా ధూమ్ సినిమా నేపథ్య గీతం వినిపిస్తుండగా నార్త్ఈస్ట్ యునెటైడ్ జట్టు సహ యజమాని, నటుడు జాన్ అబ్రహాం బైక్పై స్టేడియంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్సతో ఆకట్టుకోగా మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనిలతో పాటు ఏనుగు ఆకారంలోని ఆటోలో వచ్చిన సచిన్ నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. అలాగే జాన్ అబ్రహాం ఐఎస్ఎల్ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. అనంతరం అలియా భట్, వరుణ్ ధావన్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయక ఖోల్ తాల్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతదేశ పటం ఆకారంలో నిలబడిన కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. ప్రత్యేక అతిథిగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫుట్బాల్ను తెచ్చి అందించగా... పోటీలు ప్రారంభమవుతున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు. ఆ వెంటనే భారీ ఎత్తున స్టేడియం బాణసంచా వెలుగులతో నిండిపోరుుంది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ వీవీఐపీ స్టాండ్సలో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు. నార్త్ ఈస్ట్ శుభారంభం ఐఎస్ఎల్ తొలి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జట్టు శుభారంభం చేసింది. సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 1-0తో కేరళ బ్లాస్టర్స్పై గెలిచింది. యూసా 55వ నిమిషంలో చేసిన గోల్తో ఆతిథ్య జట్టు గెలిచి మూడు పారుుంట్లు సాధించింది. -
షారుక్ ఫుట్బాల్ జట్టు!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లోనూ ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్లో కోల్కతా నైట్రెడర్స్ యజమాని అయిన షారుక్ ఫుట్బాల్లోనూ కోల్కతాకు చెందిన ప్రాంచైజీనే కోరుకుంటున్నారు. ప్రస్తుతం 8 జట్లతో ఉన్న ఐఎస్ఎల్ వచ్చే ఏడాది 10 జట్లకు విస్తరించనుంది. -
చెన్నైయిన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎలానో అరెస్ట్
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ విజేత చెన్నైయిన్ కెప్టెన్ ఎలానో బ్లూమర్ను ఆదివారం అర్ధరాత్రి గోవా పోలీసులు అరెస్టు చేశారు. మ్యాచ్ అనంతరం జరుపుకొనే వేడుకల్లో గోవా ఫ్రాంచైజ్ సహ యజమాని దత్తరాజ్ సల్గవోన్సర్పై ఎలానో భౌతిక దాడికి పాల్పడ్డాడు. సల్గవోన్సర్ ఫిర్యాదు మేరకు ఎలానోను అరెస్టు చేసినట్లు మార్గావ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీఎల్ పాటిల్ తెలిపారు. -
చాంపియన్ చెన్నైయిన్
ఊహకందని మలుపులతో సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్కు అద్వితీయ ముగింపు లభించింది. గతేడాది సెమీస్లోనే నిష్ర్కమించిన చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఈసారి ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా అవతరించింది. లీగ్ దశలో టాపర్గా నిలిచిన గోవా ఎఫ్సీతో జరిగిన టైటిల్ పోరులో చెన్నైయిన్ చివరి నిమిషాల్లో అద్భుతం చేసి ఔరా అనిపించింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నైయిన్ జట్టు నిర్ణాయక గోల్ సాధించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివరి నిమిషాల్లో తడబడిన గోవా తుదకు తగిన మూల్యం చెల్లించి రన్నరప్తో సరిపెట్టుకుంది. * ఐఎస్ఎల్ ట్రోఫీ హస్తగతం * ఫైనల్లో గోవాపై 3-2తో విజయం * రూ. 8 కోట్ల ప్రైజ్మనీ సొంతం ఫటోర్డా (గోవా): పరిస్థితులు ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చెన్నైయిన్ జట్టు రుచి చూసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో చాంపియన్గా ఆవిర్భవించింది. గోవా ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 90వ నిమిషం వరకు 1-2తో వెనుకబడిన చెన్నైయిన్ జట్టుకు గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని ‘సెల్ఫ్ గోల్’తో ఊపిరి పోయగా... ఇంజ్యూరీ టైమ్లో (90+2వ నిమిషంలో) మెండోజా గోల్ సాధించి చెన్నైయిన్ జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా లేకపోతే దాని మూల్యం ఏస్థాయిలో ఉంటుందో గోవా జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది. మ్యాచ్ అంటే ఇదీ.. అనే తరహాలో సాగిన అంతిమ సమరంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా విజయంతో గోవాలో ఎప్పుడు ఆడినా తమదే గెలుపనే సెంటిమెంట్ను చెన్నైయిన్ మరోసారి నిజం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని సహ యజమానులుగా ఉన్న చెన్నైయిన్ జట్టుకు విజేత హోదాలో ట్రోఫీతోపాటు రూ. 8 కోట్ల నజరానా అందగా... రన్నరప్ గోవాకు రూ. 4 కోట్లు లభించాయి. సెమీస్లో ఓడిన కోల్కతా, ఢిల్లీ డైనమోస్ జట్లకు రూ. కోటీ 50 లక్షల చొప్పున ప్రైజ్మనీ ఇచ్చారు. మ్యాచ్ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు గోవా సహ యజమాని, క్రికెటర్ కోహ్లి తన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మతో హాజరయ్యారు. ఆద్యంతం హోరాహోరీ... భారీగా తరలివచ్చిన సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన గోవా ఆరంభం నుంచి తమ బలాన్నే నమ్ముకుంటూ దూకుడు కనబరిచింది. వేగంగా పాస్లు ఇచ్చుకుంటూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆరో నిమిషంలో ప్రత్యర్థి తలతో ఢీకొన్న గోవా స్ట్రయికర్ డుడు గాయపడడంతో మైదానం వీడాడు. తొలి 25 నిమిషాలు ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. 33వ నిమిషంలో గోవాకు ఫ్రీకిక్ చాన్స్ లభించింది. అయితే లియో మౌరా సంధించిన షాట్ గోల్ పోస్ట్ కుడివైపునుంచి బయటికి వెళ్లింది. ఐదు నిమిషాల వ్యవధిలో గోవాకు కొయెల్హో హెడర్ గోల్ ప్రయత్నం చేసినా తృటిలో తప్పింది. దీంతో తొలి అర్ధభాగం గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధంలో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. 53వ నిమిషంలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ మెండోజాను ఇన్సైడ్ బాక్స్లో ప్రణయ్ కిందపడేయడంతో పెనాల్టీ అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పెలిస్సారి జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా స్కోరును 1-1తో సమం చేసింది. రోమియో అందించిన క్రాస్ను సబ్స్టిట్యూట్గా వచ్చిన హవోకిప్ మెరుపు వేగంతో గోల్పోస్టులోకి పంపి సంతోషం నింపాడు. కానీ 59వ నిమిషంలో తమకు లభించిన రెండో పెనాల్టీని చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేపోయింది. మెండోజా షాట్ను గోవా కీపర్ లక్ష్మీకాంత్ సులువుగా అడ్డుకున్నాడు. 87వ నిమిషంలో గోవాకు లభించిన ఫ్రీకిక్ను జోఫ్రే గోల్తో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఆనందాన్ని స్వయం తప్పిదంతో గోవా కోల్పోయింది. 90వ నిమిషంలో బంతిని ఆపే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరిన కీపర్ లక్ష్మీకాంత్ చేతిని తాకుతూ గోల్ కావడంతో స్కో రు తిరిగి సమమైంది. అయితే అదనపు సమయం (90+2వ నిమిషం)లో మెండోజా సూపర్ గోల్తో చెన్నైయిన్ విజేతగా నిలిచింది. చెన్నైయిన్ జట్టుకు బ్రూనో పెలిస్సారి (54వ నిమిషంలో), మెండోజా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని 90వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. గోవా తరఫున హవోకిప్ (58వ నిమిషంలో), జోఫ్రే (87వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. -
ఐఎస్ఎల్-2 విజేత చెన్నైయిన్
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ లో చెన్నైయిన్ ఎఫ్సీ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎఫ్సీ గోవాపై 3-2తో గెలిచి చెన్నైయిన్ జట్టు కప్ కైవసం చేసుకుంది. ఐఎస్ఎల్లో కొత్త చాంపియన్ గా అవతరించింది. కొంపముంచిన సెల్ఫ్ గోల్: గోవా ఓటమిలో స్వయంకృతమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జట్టు గోల్ కీపర్ చేసిన తప్పిదంతో గోవా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సెల్ఫ్ గోల్ గోవా కొంప ముంచింది. గోల్ కీపర్ కట్టిమణి సెల్ప్ గోల్ కొట్టడంతో గోవా కు టైటిల్ కు దూరమైంది. చెన్నైయిన్ తరపున మెండోజా, బ్రునో పెలిసారి గోల్స్ చేశారు. -
కొత్త చాంపియన్ ఎవరో?
గోవాతో చెన్నైయిన్ ‘ఢీ’ నేడు ఐఎస్ఎల్-2 ఫైనల్ రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం ఫటోర్డా: దాదాపు 80 రోజులుగా సాగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ ముగింపు దశకు చేరింది. ఎఫ్సీ గోవా, చెన్నైయిన్ ఎఫ్సీ జట్ల మధ్య నేడు (ఆదివారం) టైటిల్ పోరు జరుగుతుంది. ఈ రెండు జట్లు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. దీంతో ఏ జట్టు గెలిచినా ఐఎస్ఎల్లో కొత్త చాంపియన్ అవతరించినట్టే. డిఫెండింగ్ చాంప్గా బరిలోకి దిగిన అట్లెటికో డి కోల్కతా సెమీస్ వరకు చేరినా సగటు గోల్స్ తేడాతో చెన్నైయిన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక సుదీర్ఘంగా సాగిన ఈ లీగ్లో ఇప్పటిదాకా 77 రోజుల్లో 60 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 181 గోల్స్ నమోదు కావడం విశేషం. రెండు సీజన్లలో కలిపి గోవా, చెన్నైయిన్ మధ్య నాలుగు మ్యాచ్లు జరగ్గా రెండు జట్లూ 2-2తో సమఉజ్జీగా ఉన్నాయి. ఈ సీజన్లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్లో గోవా గెలవగా... గోవాలో జరిగిన మ్యాచ్లో చెన్నైయిన్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈసారైనా తమ సొంత వేదికపై కీలక పోరులో నెగ్గి టైటిల్ సాధించాలనే కసితో గోవా ఉంది. అలాగే క్రితం సారి జోరునే చూపి ఆధిక్యం ప్రదర్శించాలని చెన్నైయిన్ భావిస్తోంది. బలాబలాల పరంగా గమనిస్తే ఈ రెండూ సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. గోవా దూకుడును నమ్ముకుంటే చెన్నైయిన్ ఉత్తమ డిఫెన్స్ను కలిగి ఉంది. బ్రెజిల్ దిగ్గజం జికో శిక్షణలో రాటు దేలిన గోవా ప్రారంభం నుంచే ఊహించని రీతిలో ఆడి తుది పోరుకు చేరుకుంది. రాఫెల్ కొయెల్హో ఫిట్గా ఉండడం వీరికి అదనపు బలం. ఇక రినాల్డో ఇప్పటికే ఏడు గోల్స్తో అదరగొట్టడంతో పాటు నాలుగు గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. అయితే అతను వంద శాతం ఫిట్గా లేకపోయినా ఫైనల్లో కొద్దిసేపైనా ఆడతాడని కోచ్ చెబుతున్నారు. మిడ్ఫీల్డ్లో లియో మౌరా బంతిని తన అదుపులో ఉంచుకోవడంతో పాటు సహచరులకు చక్కటి పాస్లు అందిస్తూ ఉపయోగపడుతున్నాడు. ప్రారంభంలో అంతగా ఆకట్టుకోని చెన్నైయిన్ ఎఫ్సీ లీగ్ జరుగుతున్న కొద్దీ అనూహ్యంగా పుంజుకుంది. అపౌలా ఈడెల్ రూపంలో వీరికి అత్యుత్తమ గోల్కీపర్ ఉన్నాడు. గోవాపై అతను ఆడిన మ్యాచ్ల్లో వారికి ఒక్క గోల్ కూడా చేసే అవకాశం ఇవ్వలేదు. వీరి డిఫెండర్లంతా పొడగరులే కావడం కూడా కలిసొచ్చింది. దీంతో ఈ సీజన్లో చెన్నైయిన్ ప్రత్యర్థులకు అతి తక్కువగా 17 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మెండోజా సూపర్ ఫామ్ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టనుంది. అయితే మిడ్ ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. స్టార్ స్ట్రయికర్ ఎలనో ఫామ్ కనబరచడం లేదు. కోచ్ మెటరాజ్జి తమ జట్టు కూర్పును ఎలా రూపొందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదిఏమైనా ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోటాపోటీగా సాగి అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ధోని, కోహ్లి రాక: నేటి ఫైనల్ను వీక్షించేందుకు సెలబ్రిటీలు గోవాకు రానున్నారు. వీరిలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీతో పాటు చెన్నైయిన్ సహ యజమాని, క్రికెటర్ ఎంఎస్ ధోని, గోవా సహ యజమాని, క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరై తమ జట్లకు మద్దతునివ్వనున్నారు. అలాగే బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ కూడా రానున్నారు. -
ఐఎస్ఎల్ ఫైనల్లో గోవా
రెండో అంచె సెమీస్లో ఢిల్లీపై 3-0తో విజయం ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో ఎఫ్సీ గోవా జట్టు ఫైనల్కు చేరింది. మంగళవారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన రెండో అంచె తొలి సెమీస్లో ఈ జట్టు 3-0తో ఘనవిజయం సాధించింది. తొలి అంచె సెమీస్లో 0-1తో ఓడిన గోవా... ఫైనల్కు చేరాలంటే ఈ మ్యాచ్లో కనీసం రెండు గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. సొంత మైదానంలో గోవా ఏమాత్రం అలక్ష్యం చూపకుండా ఆరంభం నుంచే తమ ఉద్దేశాన్ని చాటింది. ఫలితంగా ప్రథమార్ధం 11వ నిమిషంలోనే జోఫ్రే గోల్తో బోణీ చేసింది. ఆ తర్వాత 27వ నిమిషంలో రాఫెల్ కోల్హో తమ జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. అయితే ఒత్తిడిలో పడిన ఢిల్లీ ఆట గతి తప్పడంతో 84వ నిమిషంలో గోవాకు డూడూ మూడో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. నేడు (బుధవారం) జరిగే రెండో అంచె మరో సెమీస్లో కోల్కతా, చెన్నైయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి అంచెలో చెన్నైయిన్ 3-0తో కోల్కతాతో గెలిచి ఆధిక్యంలో ఉంది. -
ఐఎస్ఎల్లో గోవాకు అగ్రస్థానం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్ లీగ్ దశను ఎఫ్సీ గోవా జట్టు 25 పాయింట్లతో అగ్రస్థానంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్లో గోవా 3-2తో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీని ఓడించింది. గోవా తరఫున ఫెర్నాండెజ్ (68, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జోఫ్రే (90) గెలుపు గోల్ అందించాడు. అటు ఢిల్లీ తరఫున గ్రీనే (31), నబీ (40) గోల్స్ చేశారు. ఈనెల 11 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. -
ఢిల్లీ, కేరళ మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో గోల్ చేసిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్న ఢిల్లీ గురువారం కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్ను 3-3తో డ్రా చేసుకుంది. అయితే మ్యాచ్ చివరి వరకు ఆధిక్యంలో ఉన్న కేరళ చివర్లో తడబడి ఓటమితో సీజన్ను ముగించింది. ఢిల్లీ తరఫున డాస్ సాంటోస్ (7), నబీ (40), షెహనాజ్ (90) గోల్స్ చేయగా... కేరళకు దగ్నల్ (9), కోయింబ్రా (30), జర్మన్ (39) గోల్స్ అందించారు. -
వాలెన్సియా హ్యాట్రిక్
చెన్నై: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నైయిన్ ఎఫ్సీ జట్టు చక్కటి విజయాన్ని అందుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ రెండో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో వాలెన్సియా హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో 4-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీని కంగుతినిపించింది. ఈ సీజన్లో వాలెన్సియాకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. మూడో నిమిషంలోనే ధన గోల్ చేయగా వాలెన్సియా (16, 80, 81వ నిమిషాల్లో) వరుసగా మూడు గోల్స్ సాధించాడు. ఇంజ్యూరీ (90) సమయంలో కేరళకు జర్మన్ ఓదార్పు గోల్ అందించాడు. నేడు అట్లెటికో డి కోల్కతా, ఎఫ్సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. -
గోవా గోల్స్ వర్షం
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో ఎఫ్సీ గోవా జట్టు మరోసారి అదరగొట్టింది. మంగళవారం ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో గోల్స్ వర్షం కురిపించింది. ఫలితంగా 7-0తో ఘనవిజయం సాధించింది. పసలేని ప్రత్యర్థి ఆటతీరును ఉపయోగించుకున్న డూడూ (42, 64, 67వ ని.లో), హావోకిప్ (34, 52, 79వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్తో రెచ్చిపోయారు. మరో గోల్ను రినాల్డో చేశాడు. ఐఎస్ఎల్లో ఓ జట్టు ఇంత భారీ తేడాతో ఓడడం ఇదే తొలిసారి. అలాగే ఈ లీగ్లో ఇది వందో మ్యాచ్ కావడం విశేషం. బుధవారం జరిగే మ్యాచ్లో కోల్కతాతో చెన్నైయిన్ జట్టు ఆడుతుంది. -
కేరళ భారీ విజయం
గువాహటి: తొలి సీజన్లో రన్నరప్గా నిలిచినా... ఈసారి పేలవ ప్రదర్శనతో అట్టడుగున కొనసాగుతున్న కేరళ బ్లాస్టర్స్కి కీలక విజయం దక్కింది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ రెండో సీజన్లో భాగంగా ఆదివారం నార్త్ఈస్ట్ యునెటైడ్తో జరిగిన మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ 4-1తో విజయం సాధించింది. దగ్నల్ (1, 76వ నిమిషాల్లో), లోబో (21), గెర్మన్ (75) గోల్స్ చేశారు. ఇందులో ఆట ప్రారంభ సెకన్లలోనే దగ్నల్ చేసిన గోల్ ఐఎస్ఎల్లో అత్యంత వేగవంతమైన గోల్గా నిలిచింది. నార్త్ఈస్ట్కు వెలెజ్ ఏకైక గోల్ అందించాడు. -
కోల్కతా విజయం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కేరళ బ్లాస్టర్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 3-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 29వ నిమిషంలో మోహన్ చేసిన గోల్తో కోల్కతా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో జెర్మాన్ గోల్తో కేరళ బ్లాస్టర్స్ 1-1తో స్కోరును సమం చేసింది. 84వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి కోల్కతాకు 2-1తో ఆధిక్యాన్ని అందించగా... తర్వాతి నిమిషంలోనే జెర్మాన్ మరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న దశలో 90వ నిమిషంలో ఇజుమి గోల్ చేసి అట్లెటికో డి కోల్కతా జట్టుకు విజయాన్ని అందించాడు. -
ఐఎస్ఎల్: కేరళ బ్లాస్టర్స్ గెలుపు
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణే ఎఫ్సీతో బుధవారం జరిగిన మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ 2-0 గోల్స్ తేడాతో గెలి చింది. ఆట 45వ నిమిషంలో డాగ్నల్ చేసిన గోల్తో ఖాతా తెరిచిన కేరళ జట్టుకు 60వ నిమిషంలో వాట్ రెండో గోల్ను అందించాడు. ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్ ఆ తర్వాతి ఆరు మ్యాచ్ల్లో నాలుగింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం కేరళ జట్టు ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్లో చెన్నైయిన్ ఎఫ్సీతో గోవా ఎఫ్సీ జట్టు ఆడుతుంది. -
ఢిల్లీ, నార్త్ఈస్ట్ మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఆరంభం లో నార్త్ఈస్ట్ దూకుడు కనబరిచినా ఢిల్లీ డిఫెన్స్ చురుగ్గా కదిలింది. ప్రథమార్ధం 37వ నిమిషంలో రిచర్డ్ గ్యాడ్జె గోల్తో ఢిల్లీకి 1-0 ఆధిక్యం అందింది. అయితే 72వ నిమిషంలో నార్త్ఈస్ట్ ఆటగాడు సిమావో గోల్ చేయడంతో స్కోరు సమమైంది. మరోవైపు మ్యాచ్కు ముందు స్టేడియంలో ఫ్లడ్లైట్లు మొరాయించడంతో సగం లైట్ల వెలుతురులోనే 20 నిమిషాల ఆలస్యంగా మ్యాచ్ను ప్రారంభించారు. బుధవారం జరిగే మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్తో పుణే ఎఫ్సీ జట్టు తలపడుతుంది. -
కోల్కతాకు మళ్లీ షాక్
కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతాకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ 1-0తో కోల్కతాకు షాకిచ్చింది. 90వ నిమిషంలో సబ్స్టిట్యూట్ డాస్ సాంటోస్ గోల్ చేశాడు. నేడు జరిగే మ్యాచ్లో పుణేతో గోవా తలపడుతుంది. -
కేరళపై పుణే విజయం
ఐఎస్ఎల్-2 పుణే: స్ట్రయికర్ కలూ ఉచే రెండు గోల్స్తో రెచ్చిపోవడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్సీ పుణే సిటీ 3-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీని ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పుణే తరఫున మరో గోల్ సాన్లీ సాధించాడు. కేరళ నుంచి రెండు గోల్స్ రఫీ చేశాడు. ఆట ప్రారంభమైన నిమిషంలోనే రఫీ కేరళకు శుభారంభాన్ని అందించాడు. అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాని పుణే సిటీ తమ దాడులను కొనసాగించి 16వ నిమిషంలో ఉచే గోల్తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి. మొదట 23వ నిమిషంలో ఉచే తన రెండో గోల్తో పుణే ఆధిక్యాన్ని సాధించినా... రఫీ 30వ నిమిషంలో స్కోరును 2-2తో సమం చేశాడు. అయితే 72వ నిమిషంలో సాన్లీ హెడర్తో పుణే విజయాన్ని అందుకుంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబైతో నార్త్ఈస్ట్ తలపడుతుంది. -
ముంబైని గెలిపించిన చెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ముంబై ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై స్థానిక డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 2-0 గోల్స్ తేడాతో ఢిల్లీ డైనమోస్ జట్టును ఓడించింది. భారత కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్ చేసి ముంబై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆట 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన చెత్రి, 74వ నిమిషంలో రెండో గోల్ అందించాడు. నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ముంబై ఒక మ్యాచ్లో నెగ్గి, మరో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయింది. గురువారం జరిగే మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్తో గోవా ఎఫ్సీ తలపడుతుంది. -
చెన్నైయిన్ జట్టును గెలిపించిన వాలెన్సియా
ముంబై: స్ట్రయికర్ మెండోజా వాలెన్సియా అద్భుత ఆటతీరుతో చెన్నైయిన్ ఎఫ్సీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ సత్తా చూపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో శుక్రవారం ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో 2-0తో చెన్నైయిన్ నెగ్గింది. ఈ రెండు గోల్స్నూ వాలెన్సియా (60, 66వ నిమిషాల్లో) కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే సాధించాడు. గత మ్యాచ్లోనూ గోవాపై వాలెన్సియా హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభంలో ముంబై కాస్త పైచేయి సాధించి దాడులకు దిగింది. అయినా ప్రథమార్ధంలో ఇరు జట్ల ఆటగాళ్ల గోల్స్ ప్రయత్నాలు వమ్మయ్యాయి. 60వ నిమిషంలో ఎలనో షాట్ గోల్కీపర్కు తాకి వెనక్కి రాగా వాలెన్సియా అందుకుని గోల్ సాధించాడు. వెంటనే మరో ఆరు నిమిషాల్లో రెండో గోల్తో జట్టును గెలిపించాడు. -
కేరళపై కోల్కతా విజయం
కోల్కతా: సొంత గడ్డపై తొలి మ్యాచ్.. అందునా ఆడింది ఫుట్బాల్ దిగ్గజం పీలే సమక్షంలో.. ఇంకేముంది డిఫెండింగ్ చాంప్ అట్లెటికో డి కోల్కతా ఆటగాళ్లు దుమ్ము రేపే ఆటను ప్రదర్శించారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ల్) రెండో సీజన్లో భాగంగా మంగళవారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా 2-1తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీని ఓడించింది. గత సీజన్ ఫైనల్ అనంతరం ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. కోల్కతా తరఫున అరాటా ఇజుమి (6వ నిమిషంలో), జేవీ లారా (53) గోల్స్ సాధించారు. కేరళకు క్రిస్ డగ్నల్ (80) గోల్ అందించాడు. ఫుట్బాల్ దిగ్గజం పీలే ప్రత్యక్షంగా చూసిన ఈ మ్యాచ్కు 61 వేల మందికిపైగా అభిమానులు వచ్చారు. సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్గా భావించిన ఈ సమ ఉజ్జీల సమరంలో కోల్కతా ఏమాత్రం అలక్ష్యం చూపలేదు. ఫలితంగా ఆరో నిమిషంలోనే ఇయాన్ హ్యూమే బంతిని ఆధీనంలోకి తీసుకుని గోల్ కోసం ప్రయత్నించినా కీపర్ అడ్డుకున్నాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బయటకు రావడంతో వెంటనే అందుకున్న ఇజుమి శుభారంభం చేశాడు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో హ్యూమే మరోసారి అందించిన పాస్ను లారా గురి తప్పకుండా గోల్గా మలిచాడు. అయితే 80వ నిమిషంలో డగ్నల్ పోస్టుకు అతి సమీపం నుంచి కేరళకు గోల్ను అందించాడు. చివరి పది నిమిషాలు కేరళ పదే పదే కోల్కతా గోల్పోస్ట్పై దాడులు చేసి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది. అయితే కోల్కతా గోల్కీపర్ కలాటుయుడ్ అడ్డుగోడలా నిలబడి ఆతిథ్య జట్టును ఆదుకున్నాడు. నేడు పుణేలో జరిగే మ్యాచ్లో ఎఫ్సీ పుణే, ఢిల్లీ డైనమోస్ తలపడతాయి. రాత్రి 7.00 గంటలనుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబైపై పుణే సిటీ గెలుపు
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో సొంత గడ్డపై ఎఫ్సీ పుణే సిటీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో 3-1 తేడాతో ముంబై సిటీ ఎఫ్సీపై ఘనవిజయం సాధించింది. టంకే సాన్లీ (12, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్తో అదరగొట్టగా గురుంగ్ (68వ ని.) ఓ గోల్ చేశాడు. ముంబై తరఫున పికియాన్ ఏకైక గోల్ సాధించాడు. మంగళవారం జరిగే మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ ఆడుతుంది. -
అట్టహాసంగా ఐఎస్ఎల్ ప్రారంభం
-
కోల్కతా శుభారంభం
తొలి మ్యాచ్లో చెన్నైయిన్పై గెలుపు చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ను డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా ఘనంగా ఆరంభించింది. శనివారం జరిగిన ప్రారంభ మ్యాచ్లో 3-2 తేడాతో చెన్నైయిన్ ఎఫ్సీపై నెగ్గింది. పోస్టిగా (13, 70వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా వాల్డో (76) మరో గోల్ చేశాడు. అటు చెన్నైయిన్కు జేజే (31), ఎలనో (89) గోల్స్ అందించారు. ప్రారంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్కతాకు 13వ నిమిషంలోనే గోల్ దక్కింది. చెన్నై గోల్కీపర్ పొరపాటును సద్వినియోగం చేసుకున్న స్ట్రయికర్ హెల్దర్ పోస్టిగా బోణీ చేశాడు. దీంతో చెన్నై ఎదురుదాడికి దిగింది. 31వ నిమిషంలో భారత ఆటగాడు జేజే గోల్తో చెన్నైయిన్ స్కోరును సమం చేసింది. అయితే 70వ నిమిషంలోనూ పోస్టిగా మరో గోల్తో కోల్కతాకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. మరో ఆరు నిమిషాలకే వాల్డో చేసిన గోల్తో చెన్నై కోలుకోలేకపోయింది. చివర్లో ఎలెనో పెనాల్టీ కిక్తో కోల్కతా ఆధిక్యాన్ని తగ్గించగలిగినా ఫలితం లేకపోయింది. ఐఎస్ఎల్లో నేడు ఎఫ్సీ గోవా ఁ ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ వేదిక: గోవా సమయం: రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్-2లో -
ఆధునికత...సంప్రదాయం...
అట్టహాసంగా ఐఎస్ఎల్ ప్రారంభం చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. సంప్రదాయం... ఆధునికత మేళవింపుతో రూపొందించిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం ఆరు గంటలకు జవహర్లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు హిందీ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా... మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, యువ నటి ఆలియా భట్ తమ నృత్యాలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్, బాలీవుడ్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అమితాబ్ బచ్చన్లతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని హోదాలో సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. 79 రోజుల పాటు ఇక ఫుట్బాల్ ప్రేమికులకు పండగే. ముందుగా కేరళ సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. అనంతరం ఆలియా భట్ హిందీ ఫాస్ట్ బీట్ పాటలకు వేసిన స్టెప్పులతో ప్రేక్షకులు హుషారెత్తారు. ఆలియా అనంతరం మాజీ మిస్వరల్డ్ ఐశ్వర్యా రాయ్ తనదైన శైలిలో అలరించింది. మెడ్లీలో భాగంగా ముందుగా తమిళ రోబో పాటతో ఆరంభించి ధూమ్.. మచాలే, ధోలా రే ధోలా అంటూ స్టేడియంలో ఒక్కసారిగా జోష్ను నింపింది. ఆ తర్వాత వేదికపైకి కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని సచిన్ను ఆహ్వానించడంతో స్టేడియంలో ఒక్కసారిగా సా..చిన్, సా..చిన్ అంటూ నినాదాలు మార్మోగాయి. నీతా అంబానీ, ఐశ్వర్య, ఆలియా కూడా వేదికపైకి ఎక్కారు.ఓపెన్ టాప్ జీపులో ఫుట్బాల్ను తీసుకువచ్చిన రజనీకాంత్ వేదికపై ఉన్న నీతాకు అందించారు. దీంతో టోర్నీ ఆరంభమైనట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. చివరిగా స్టేడియంలోకి చెన్నై, కోల్కతా జట్లు వచ్చిన అనంతరం ఏఆర్ రెహమాన్ జాతీయగీతాలాపన చేశాడు. -
గెట్..సెట్.. కిక్
నేటి నుంచి ఐఎస్ఎల్ ఫుట్బాల్ టోర్నీ తొలి మ్యాచ్లో చెన్నైయిన్, కోల్కతా అమీతుమీ చెన్నై: గతేడాది విశేష ఆదరణ పొందిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా, చెన్నైయిన్ ఎఫ్సీల మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఆటగాళ్లతో పాటు చురుకైన దేశవాళీ కుర్రాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. టోర్నీ కోసం అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది టోర్నీ మధ్యలో అనూహ్యంగా వెనుకబడిన కొన్ని జట్లు ఈసారి టైటిల్ కోసం అనుభవజ్ఞులైన ఆటగాళ్లను రంగంలోకి దించుతున్నాయి. ఈసారి కూడా ఎనిమిది ప్రధాన నగరాలు మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఐఎస్ఎల్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్లతో పాటు ధోని, కోహ్లిలకు కూడా ఐఎస్ఎల్ జట్లలో భాగస్వామ్యం ఉండటంతో క్రికెట్ అభిమానులు కూడా దీనిపై దృష్టిపెడుతున్నారు. ఓవరాల్గా క్రికెట్ తర్వాత దేశంలో మరింత ఆదరణ పెంచుకునే దిశగా ఫుట్బాల్ అడుగులు వేస్తోంది. ఘనమైన ఏర్పాట్లు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పులతో పాటు లేజర్ షో, బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా ఈ వేడుకకు మరింత ఆకర్షణ తేనుంది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, అర్జున్ కపూర్లు తమ నృత్యాలతో అలరించేందుకు సిద్ధమవుతుండగా, మ్యూజిక్ డెరైక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతంతో ఓలలాడించనున్నాడు. కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్రాంచైజీల సంతోషం ఓవైపు భారత్లో క్రికెట్ సీజన్ మొదలవుతున్నా... ఫుట్బాల్కు ఆదరణ తగ్గకపోవడం ఫ్రాంచైజీలను సంతోషపరుస్తోంది. గతేడాది రూ. 55 కోట్లు మాత్రమే ఉన్న స్పాన్సర్షిప్ ఆదాయం ఈసారి గణనీయంగా రూ. 100 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. గతేడాది చాంపియన్: అట్లెటికో డి కోల్కతా గతేడాది రన్నరప్: కేరళ బ్లాస్టర్స్ 8: టోర్నీలో పాల్గొంటున్న జట్లు 49: టోర్నీ జరిగే రోజులు 61: మొత్తం మ్యాచ్ల సంఖ్య -
‘ఐఎస్ఎల్కు గంగూలీ దూరం కారు’
కోల్కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నూతన అధ్యక్షుడిగా నియమితులైనా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కి సౌరవ్ గంగూలీ దూరమయ్యే ప్రసక్తే లేదని అట్లెటికో డి కోల్కతా సహ యజమాని సంజీవ్ గోయెంకా తేల్చారు. ఈ ఫ్రాంచైజీలో గంగూలీ కూడా భాగస్వామి అనే విషయం తెలిసిందే. వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సీజన్లో దాదా పాత్ర ఉండదేమో అనే అనుమానాలను గోయెంకా తోసిపుచ్చారు. ‘గతేడాది కన్నా ఈసారి గంగూలీ ప్రాతినిథ్యం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? అట్లెటికో జట్టుకు ఆయన సేవలు ఎప్పటిలాగే అందుతాయి. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’ అని గోయెంకా అన్నారు. కోల్కతా మ్యాచ్కు పీలే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం పీలే అక్టోబర్ 12న భారత్కు రానున్నారు. మర్నాడు జరిగే అట్లెటికో డి కోల్కతా తొలి హోమ్ మ్యాచ్ను ఆయన ప్రత్యక్షంగా వీక్షిస్తారు.ఈమేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపారు. ‘కోల్కతా తొలి హోమ్ మ్యాచ్ కోసం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాల్ట్లేక్ స్టేడియంలో అభిమానులు, ఆటగాళ్లను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పీలే అన్నారు. 38 ఏళ్ల అనంతరం పీలే భారత్ వస్తుండటం విశేషం. -
వేన్ రూనీ కూడా వస్తున్నాడు: గంగూలీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ మ్యాచ్లను తిలకించేందుకు బ్రెజిల్ దిగ్గజం పీలేతోపాటు ఇంగ్లండ్ సూపర్ స్టార్ వేన్ రూనీ కూడా కోల్కతాకు వస్తున్నాడని అట్లెటికో డి కోల్కతా క్లబ్ సహ యజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐఎస్ఎల్ రెండో సీజన్ అక్టోబరు 3 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. -
ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్
అక్టోబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫ్రాంచైజీ ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సీ స్పానిష్ గోల్ కీపర్ టోనీ బోడ్లాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. టోనీ రియల్ బెటీస్ తరఫున 95 మ్యాచ్ లు ఆడాడని... అతని రాక టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. ఢిల్లీ డైనమోస్ తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టోనీ తెలిపాడు. ఈ సీజన్ లో తన టీమ్ టైటిట్ గెలిచేందుకు కృషి చేస్తానని అన్నాడు. -
ఈసారీ స్టార్లే
ఐఎస్ఎల్లో ఆరు జట్లకు కొత్త మార్క్యూ ప్లేయర్లు - ఢిల్లీతో చేరిన రాబర్టో కార్లోస్ ఇండియన్ సూపర్ లీగ్ తొలి సీజన్ సూపర్ హిట్ అవడంతో రెండో సీజన్పై అంచనాలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన సూపర్ స్టార్లను తీసుకురావడం 2014లో జరిగిన తొలి సీజన్ హిట్ కావడానికి తోడ్పడింది. ఈ ఏడాది కూడా ఐఎస్ఎల్లోని జట్లు మరికొంత మంది సూపర్స్టార్లను భారత్కు తీసుకురాబోతున్నాయి. జట్లన్నీ తమ మార్క్యూ ప్లేయర్లని ప్రకటించడానికి జూలై 31 అఖరి తేదీ కావడంతో వారి జాబితాను విడుదల చేశాయి. గతేడాది ఆడిన వారిలో చెన్నైయాన్, ముంబై జట్లు మినహా మిగతా జట్లన్నీ కొత్త ఆటగాళ్లను మార్క్యూ ప్లేయర్లుగా ప్రకటించాయి. ఈ సారి ఢిల్లీ డైనమోస్ జట్టు బ్రెజిల్ దిగ్గజం రాబర్టో కార్లోస్ను భారత్కు తీసుకురావడం విశేషం. కోల్కతా జట్టు చెల్సి దిగ్గజం దిదియర్ ద్రోగ్బా కోసం ప్రయత్నించినా చివరికి పోర్చుగల్ ఆటగాడు పొస్టిగా సరిపెట్టుకుంది. జట్లు, వారి మార్క్యూ ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాబర్టో కార్లోస్.. (ఢిల్లీ డైనమోస్) వయసు: 42, దేశం: బ్రెజిల్ ఆడే స్థానం: డిఫెండర్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): ఇంటర్ మిలాన్, రియల్ మాడ్రిడ్, ఫెనర్బాచే అంతర్జాతీయంగా అభిమానులు సంపాదించుకున్న దిగ్గజం. భారత్కు రావడం మన దేశ ఫుట్బాల్కు శుభపరిణామం. ఫ్రికిక్లకు పెట్టింది పేరు. మూడు ఫిఫా ప్రపంచకప్ల్లో ఆడాడు. 2002 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. రియల్ మాడ్రిడ్ తరఫున నెగ్గని కప్ లేదు. తొలిసారిగా ఐఎస్ఎల్లో ఆడబోతున్న కార్లోస్పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అయితే 42 ఏళ్ల కార్లోస్.. కోచింగ్కే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలనో బ్లూమర్ (చెన్నైయాన్ ఎఫ్సీ) వయసు: 34, దేశం: బ్రెజిల్ ఆడే స్థానం: మిడ్ ఫీల్డర్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): సాంటోస్, మాంచెస్టర్ సిటీ, గలటాసరి గతేడాది ఐఎస్ఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు. గాయం కారణంగా సీజన్ మొత్తం ఆడకపోయినా 11 మ్యాచ్ల్లో 8 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సాంటోస్ జట్టుతో ఒప్పందం ఉన్నా లోన్లో చెన్నైయాన్కు వచ్చాడు. బ్రెజిల్ తరఫున 50 మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది అభిమానులందరూ భారీ అంచనాలు పెట్టుకున్నది ఇతనిపైనే. నికోలస్ అనెల్కా (ముంబై సిటీ ఎఫ్సీ) వయసు: 36, దేశం: ఫ్రాన్స్ ఆడే స్థానం: ఫార్వర్డ్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): అర్సెనల్, లివర్పూల్, మాంచెస్టర్ సిటీ, చెల్సి తొలిసీజన్లోనే ముంబై జట్టుకు ఆడినా గాయం కారణంగా చాలా ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ సారి కోచింగ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. లీగ్లో అత్యంత క్రేజ్ ఉన్న ఆటగాడు. ప్రఖ్యాత ఇంగ్లిష్ ప్రిమీయర్ లీగ్లో టాప్ క్లబ్ల తరఫున ఆడాడు. అంతర్జాతీయ కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినా లీగ్ దశలో మాత్రం ప్రఖ్యాత క్లబ్కే ప్రాతినిథ్యం వహించాడు. అనెల్కా వంటి ఆటగాడు ఉంటే జట్టుకు అతడే సగం బలం. లూసియో.. (ఎఫ్సీ గోవా) వయసు: 37, దేశం: బ్రెజిల్ ఆడే స్థానం: డిఫెండర్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): బెయర్ లెవర్కుసెన్, బెయర్న్ మ్యునిచ్, ఇంటర్ మిలాన్ 2002 ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. వందుకు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. తొలిసారి ఇండియాలో ఆడబోతున్నాడు. బెయర్ లెవర్కుసెన్, బెయర్న్ మ్యునిచ్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంటర్ మిలాన్లో ఆడుతున్నప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గాడు. ‘ఆల్ టైమ్ గ్రేట్’ జికో కోచ్గా వ్యవహరిస్తుండడం, ఇప్పుడు లూసియో కూడా రావడంతో జట్టుపై అంచనాలు పెరిగాయి. అడ్రియన్ ముతు.. (పుణే ఎఫ్సీ) వయసు: 36, దేశం: రొమెనియా ఆడే స్థానం: ఫార్వర్డ్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): చెల్సి, జువెంటాస్, ఫియోరెంటినా కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. 2004లో చెల్సి తరఫున ఆడుతూ డ్రగ్ పరీక్షలో విఫలమవ డంతో ఏడు నెలలు ఫుట్బాల్ నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. తాగి అసభ్యంగా ప్రవర్తించడం, జాతీయ జట్టు మేనేజర్ ఫొటోను కమెడియన్లా మార్ఫ్ చేయడంతో జాతీయ జట్టు నుంచి 2013లో ఉద్వాసనకు గురయ్యాడు. ఐఎస్ఎల్లో ఇదే తొలి సీజన్. ప్రస్తుతానికైతే ఇంకా భారత్ వీసా రాలేదు. ఇండియన్ ఎంబసీకి వెళ్లినప్పుడు ముతు తాగి ఉన్నట్లు గుర్తించిన అధికారులు వీసా మంజూరు చేయలేదు. కార్లోస్ మార్చెనా లోపెజ్.. (కేరళ బ్లాస్టర్స్) వయసు: 36, దేశం: స్పెయిన్ ఆడే స్థానం: మిడ్ ఫీల్డర్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): సెవిల్లా, బెన్ఫికా, వాలెన్సియా, విల్లారియల్ స్పెయిన్ జట్టులో 2002 నుంచి రిటైరయ్యే వరకు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. 2010 ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. 2008 యూరోపియన్ చాంపియన్షిప్ కూడా నెగ్గాడు. భారత్కు తొలిసారి రాబోతున్నాడు. ఎక్కువగా మిడ్ ఫీల్డర్ స్థానంలో ఆడినా, డిఫెన్స్లో కూడా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సిమావో సబ్రోసా.. (నార్త్ఈస్ట్ యునెటైడ్) వయసు: 35, దేశం: పోర్చుగల్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): అథ్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, బెన్ఫికా పోర్చుగల్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 22 గోల్స్ సాధించాడు. రెండు ప్రపంచకప్లతో పాటు మూడు యూరోపియన్ కప్ల్లో ఆడాడు. తొలిసారిగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. అటాకింగ్ మిడ్ఫీల్డర్గా ఆడే సిమావో గోల్స్ చేయడంలో కూడా దిట్ట. హెల్డర్ పొస్టిగా..(అథ్లెటికో డి కోల్కతా) వయసు: 32, దేశం: పోర్చుగల్ ఆడే స్థానం: ఫార్వర్డ్ గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): పొర్టో, టొటెన్హమ్, వాలెన్సియా, డెపొర్టివో. తొలిసారి ఐఎస్ఎల్లో ఆడనున్నాడు. రెండు సార్లు ఫిఫా ప్రపంచకప్ల్లో ఆడాడు. పోర్చుగల్ తరఫున 71 మ్యాచ్లు ఆడి 27 గోల్స్ సాధించాడు. అలాగే 2004, 2008, 2012ల్లో యూరోపియన్ చాంపియన్షిప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది ఉన్న మార్క్యూ ఆటగాళ్లలో తక్కువ వయసు ఆటగాడు. గతేడాది చాంపియన్గా నిలిచిన కోల్కతా తరఫున ఆడతుండడంతో ఇతనిపై అంచనాలతో పాటు ఒత్తిడి గా ఉంది. -
ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..
ముంబై : ఇండియన్ సూపర్ లీగ్ - 2015 నిర్వహణ కోసం ఆయా ఫ్రాంచైజీలు భారీ ధరను చెల్లించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం కోటి రూపాయలకు పైగా ధర పలికారు. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీ జట్ల యజమానులు పాల్గొని తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారు. అత్యంత ఖరీదైన 10 మంది ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి... ఆటగాడు క్లబ్(జట్టు) ఫ్రాంచైజీ ధర సునీల్ చైత్రి ముంబై రూ.1.20 కోట్లు యూగెన్సన్ లింగ్డో పూణే రూ.1.05 కోట్లు రినో ఆంటో కోల్కతా రూ. 90 లక్షలు తోయ్ సింగ్ చెన్నై రూ. 86 లక్షలు అరాటా ఇజుమి కోల్కతా రూ. 68 లక్షలు కరణ్జీత్ సింగ్ చెన్నై రూ. 60 లక్షలు సేత్యసేన్ సింగ్ నార్త్ ఈస్ట్ రూ. 56 లక్షలు రాబిన్ సింగ్ ఢిల్లీ రూ. 51 లక్షలు జాకీచంద్ సింగ్ పూణె రూ. 45 లక్షలు అనాస్ ఎడతోడిక ఢిల్లీ రూ. 41 లక్షలు -
చెత్రి కనీస ధర రూ.80 లక్షలు
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్కు తొలిసారిగా నేడు (శుక్రవారం) ఆటగాళ్ల వేలం జరుగనుంది. భారత నంబర్వన్ ఫుట్బాలర్ సునీల్ చెత్రి ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఈ స్టార్ స్ట్రయికర్పైనే ఉంది. అందుకు తగ్గట్టుగానే అతడి కనీస ధర అత్యధికంగా రూ.80 లక్షలుగా ఉంది. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ రెండో సీజన్ జరుగుతుంది. చెత్రితో పాటు కరణ్జీత్ సింగ్ (రూ.60 లక్షలు), అనాస్ ఎడతోడ్కియా, అరాటా ఇజుమి, రాబిన్ సింగ్ (రూ. 40 లక్షలు), తోయి సింగ్ (రూ. 39 లక్షలు), లింగ్డో (రూ. 27.50 లక్షలు), జాకీచంద్ సింగ్, సత్యసేన్ సింగ్ (రూ. 20 లక్షలు), రినో ఆంటో (రూ.17.50 లక్షలు)లకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది. -
కోల్కతాకే పట్టం
గంగూలీ జట్టుకు ఐఎస్ఎల్ టైటిల్ ఫైనల్లో కేరళపై 1-0తో గెలుపు విజేతకు రూ. 8 కోట్ల ప్రైజ్మనీ ముంబై: రెండు నెలలకు పైగా సాగిన తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు అట్లెటికో డి కోల్కతా థ్రిల్లింగ్ ముగింపునిచ్చిది. శనివారం డీవై పాటిల్ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0తో నెగ్గి ప్రారంభ ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఎక్స్ట్రా (90+5) సమయంలో సబ్స్టిట్యూట్ స్ట్రయికర్ మొహమ్మద్ రఫీఖ్ సాధించిన హెడర్ గోల్తో కోల్కతా ఐఎస్ఎల్ విజేతగా ఆవిర్భవించింది. ఇది లీగ్లో రఫీఖ్కు తొలి గోల్. విజేతగా నిలిచిన కోల్కతాకు రూ.8 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్ కేరళ బ్లాస్టర్స్కు రూ. 4 కోట్ల చెక్ను అందించారు. అలాగే సెమీస్లో ఓడిన ఎఫ్సీ గోవా, చెన్నైయిన్ ఎఫ్సీకి తలా రూ. 1.5 కోట్లు దక్కాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. పటిష్ట కోల్కతా డిఫెన్స్ను ఛేదించేందుకు కేరళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిట్టచివర్లో పోడీ అందించిన క్రాస్ను రఫీఖ్ మెరుపువేగంతో హెడర్ ద్వారా గోల్ చేసి దాదా జట్టును ఆనందంలో నింపాడు. ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఎలనో(చెన్నైయిన్)కి ఇచ్చారు. -
సచిన్ xగంగూలీ
కోల్కతా, కేరళ మధ్య నేడు ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: దాదాపు పది వారాలుగా అనూహ్య ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చివరి అంకానికి చేరుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్కతా... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ నేడు (శనివారం) డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే లీగ్ దశలో దుమ్మురేపి నంబర్వన్గా నిలిచిన చెన్నైయిన్ ఎఫ్సీ, రెండో స్థానంలో నిలిచిన ఎఫ్సీ గోవా జట్లు సెమీస్లోనే వెనుదిరగ్గా... మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన కోల్కతా, కేరళ మాత్రం ఫైనల్స్కు చేరడం విశేషం. టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన కోల్కతా అంచనాలకు తగ్గట్టుగానే ఆరంభంలో ఎదురు లేకుండా సాగింది. అయితే మధ్యలో మాత్రం పేలవంగా ఆడి నిరాశపరిచింది. మరోవైపు అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఎఫ్సీ గోవాపై సెమీస్లో పెనాల్టీ షూటౌట్లో నెగ్గి పరువు కాపాడుకుంది. ఓవరాల్గా ఆడిన 14 మ్యాచ్ల్లో కోల్కతా నెగ్గింది కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే. అందుకే ప్రారంభ ఐఎస్ఎల్ ట్రోఫీని గెలుచుకోవాలంటే దాదా గ్యాంగ్ మరింత కష్టపడాల్సిందే. దీనికి తోడు తమ స్టార్ స్ట్రయికర్ ఫిక్రూ టెఫెరా గాయం కారణంగా దూరం కావడం అట్లెటికోకు గట్టి ఎదురు దెబ్బ. మిడ్ఫీల్డర్లు గార్సియా, బోర్జా, పోడని ఆటతీరుపైనే జట్టుకు విజయావకాశాలున్నాయి. ఇయాన్ హ్యుమేపై ఆశలు: ఇక తమ చివరి మ్యాచ్ల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించిన కేరళ జట్టు ప్రత్యర్థిపై కాస్త పైచేయిలోనే ఉంది. లీగ్ దశలో కోల్కతాపై ఓ డ్రా, ఓ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 15 మ్యాచ్ల్లో 5 గోల్స్ సాధించి ఊపుమీదున్న స్టార్ ఫార్వర్డ్ ఇయాన్ హ్యుమే జట్టుకు వెన్నెముకగా ఉంటున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ తమ జట్టును గట్టెక్కించిన అతను తుది పోరులో రెచ్చిపోతే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. సీనియర్ గోల్కీపర్ డేవిడ్ జేమ్స్, ఫార్వర్డ్స్ మైకేల్ చోప్రా, గోన్సాల్వెస్, మిడ్ఫీల్డర్లు పెన్ ఒర్జి, పియర్సన్ కీలకం కానున్నారు. నేటి ఫైనల్ సా.గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఆన్లైన్లోనూ అదుర్స్
న్యూఢిల్లీ: ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి అంచె సెమీస్ను ఆన్లైన్లో రికార్డు స్థాయిలో వీక్షించారు. చెన్నైయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ను స్టార్స్పోర్ట్స్.కామ్లో రికార్డు స్థాయిలో 11 లక్షల మంది మంది తిలకించారు. ఓవరాల్గా ఈ లీగ్ను 16 మిలియన్ల మంది ఆన్లైన్లో చూడడం జరిగింది. దీనికి అదనంగా అధికారిక ఐఎస్ఎల్ ఆన్లైన్ చానెల్లో 28 లక్షల 70 వేల మంది ఇప్పటిదాకా మ్యాచ్లను చూశారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఎంతటి ఆదరణ ఉందో తెలిసిపోతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఫైనల్లో కోల్కతా
‘షూటౌట్’ సెమీస్లో గోవాపై గెలుపు ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్కతా జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సహయజమానిగా ఉన్న గోవా ఎఫ్సీ జట్టుతో బుధవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో కోల్కతా ‘పెనాల్టీ షూటౌట్’లో 4-2 తేడాతో గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి అంచె సెమీఫైనల్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండో మ్యాచ్ కీలకమైంది. అయితే నిర్ణీత సమయం, ఆ తర్వాత అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ఈనెల 20న జరిగే ఫైనల్లో సచిన్ టెండూల్కర్కు చెందిన కేరళ బ్లాస్టర్స్ జట్టుతో కోల్కతా పోటీపడుతుంది. -
పైనల్లో కేరళ బ్లాస్టర్స్
రెండో అంచె సెమీస్లో 1-3తో ఓటమి మెరుగైన గోల్స్ సగటుతో ఫైనల్కు చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్టు ఫైనల్కు చేరింది. టోర్నీ ఆరంభంలో అంతగా రాణించని ఈ జట్టు చివరి దశలో మాత్రం మెరుపులు సృష్టించింది. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నైయిన్ ఎఫ్సీతో జరిగిన రెండో అంచె సెమీస్లో కేరళ 1-3తో ఓడింది. అయితే కొచ్చిలో జరిగిన తొలి అంచె సెమీస్లో కేరళ 3-0తో నెగ్గింది. ఈ మ్యాచ్లో చేసిన ఒక్క గోల్తో ఈ జట్టు మొత్తం గోల్స్ సంఖ్య నాలుగు అయింది. దీంతో ఒక్క గోల్ తేడాతో తుది పోరుకు అర్హత సాధించినట్టయ్యింది. చెన్నై తరఫున సిల్వెస్ట్రె (42వ నిమిషంలో), జెజె (90వ ని.)గోల్ చేయగా 76వ నిమిషంలో కేరళ ఆటగాడు సందేశ్ జింగాన్ సెల్ఫ్ గోల్తో ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చాడు. అయితే విజయానికి కావాల్సిన గోల్ను ఎక్స్ట్రా సమయంలో (117 ని.లో) పియర్సన్ సాధించి కేరళను సంబరాల్లో ముంచాడు. అంతకుముందు ఆద్యం తం మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. 28వ నిమిషంలోనే కేరళ నుంచి ఎంకాలిస్టర్ రెడ్ కార్డుకు గురయ్యాడు. నిర్ణీత సమయంలో చెన్నైయిన్ మూడు గోల్స్ చేయడంతో ఫలితం తేలేందుకు అదనపు సమయం ఆడాల్సి వచ్చింది. 104వ నిమిషంలో మెటరాజ్జి (చెన్నై) రెండో ఎల్లో కార్డ్కు గురవ్వడంతో మైదానం వీడాడు. ఇక మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా పియర్సన్ ఇన్సైడ్ బాక్సులోకి పరిగెత్తుకెళ్లి ఎడమకాలితో బంతిని నెట్లోకి పంపాడు. -
కోల్కతా, గోవా మ్యాచ్ డ్రా
ఐఎస్ఎల్ సెమీస్ కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి అంచె సెమీఫైనల్లో అట్లెటికో డి కోల్కతా, ఎఫ్సీ గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0-తో డ్రాగా ముగిసింది. సాల్ట్లేక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లుగోల్స్ నమోదు చేయడంలో విఫలమయ్యాయి. మ్యాచ్ మొత్తంలో గోవా జట్టుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 18వ నిమిషంలో రోమియో కొట్టిన షాట్ గోల్ పోస్ట్కు దూరంగా వెళ్లింది. కోల్కతా నుంచి గార్షియా, పోడి అద్భుతంగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఐఎస్ఎల్కు నేడు (సోమవారం) విశ్రాంతి దినం. -
తొలి సెమీస్లో కేరళ విజయం
3-0తో చెన్నైయిన్ చిత్తు కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ అదరగొట్టింది. టోర్నీలో టాప్ జట్టుగా కొనసాగుతున్న చెన్నైయిన్ ఎఫ్సీతో శనివారం జరిగిన మ్యాచ్లో కేరళ 3-0తో నెగ్గింది. ఇష్ఫాఖ్ అహ్మద్, హ్యుమే, సుశాంత్ గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 61 వేల మంది హాజరయ్యారు. లీగ్ మ్యాచ్ల్లో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను వణికించిన చెన్నైయిన్ జోరును కేరళ ప్రారంభం నుంచే పథకం ప్రకారం అడ్డుకోగలిగింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించి ప్రత్యర్థిని వణికించింది. 27వ నిమిషంలో విక్టర్ నుంచి అందుకున్న పాస్ను మిడ్ఫీల్డర్ ఇష్ఫాఖ్ అహ్మద్ కుడి కాలుతో నేర్పుగా గోల్పోస్టులోకి పంపాడు. ఆ తర్వాత 29వ నిమిషంలోనే ఇయాన్ హ్యుమే రెండో గోల్ అందించడంతో జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో చెన్నైయిన్ గోల్ అవకాశాలను కేరళ గోల్కీపర్ సందీప్ నంది సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ చివర్లో (90వ నిమిషంలో) ఇయాన్ హ్యుమే పాస్ను సబ్స్టిట్యూట్ సుశాంత్ ఇద్దరు డిఫెండర్లను దాటుకుంటూ సూపర్ గోల్ సాధించగా జట్టు విజయం ఖాయమైంది. కోల్కతాలో ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో గోవాతో కోల్కతా తలపడుతుంది. -
క్రికెటర్ల నాలుగు జట్లు సెమీస్కు
ఐఎస్ఎల్ ఫుట్బాల్ కోల్కతా: క్రికెటర్లు సహ యజమానులుగా ఉన్న నాలుగు జట్లు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో సెమీస్కు అర్హత సాధించాయి. బుధవారం ఎఫ్సీ గోవాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకున్న అట్లెటికో డి కోల్కతా పాయింట్ల పట్టికలో మూడో స్థానం (19 పాయింట్లు)లో నిలిచింది. కేరళతో కూడా 19 పాయింట్లతోనే ఉన్నా గోల్స్ తేడాలో వెనుకబడి నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. సెమీస్కు అర్హత సాధించాలంటే కనీసం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్లో కోల్కతా జట్టు సత్తా చాటింది. యువ భారతీ క్రీడాంగన్లో జరిగిన ఈ మ్యాచ్లో... ప్రథమార్ధంలో 0-1తో వెనుకబడ్డా రెండో అర్ధభాగంలో చెలరేగి ఆడింది. కోల్కతా తరఫున 68వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఫిక్రూ గోల్గా మల్చగా, ఎడ్గర్ మార్సెలినో (27వ ని.) గోవాకు గోల్ అందించాడు. నార్త్ఈస్ట్, ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 34వ నిమిషంలో కొకే (నార్త్ఈస్ట్) గోల్ చేయగా... 84వ నిమిషంలో సుశీల్ (ముంబై) గోల్ సాధించాడు. ఈ మ్యాచ్తో ఐఎస్ఎల్లో లీగ్ దశ ముగిసింది. ఇంటా, బయటా పద్ధతిలో జరగనున్న సెమీస్ మ్యాచ్ల్లో... శనివారం కేరళ, చెన్నైయిన్లు కొచ్చిలో తలపడుతాయి. ఆదివారం కోల్కతా, గోవాలు కోల్కతాలో ఎదురుపడతాయి. మంగళవారం చెన్నైలో జరిగే మ్యాచ్లో చెన్నైయిన్, కేరళ; బుధవారం గోవాలో జరిగే మ్యాచ్లో గోవా, కోల్కతా అమీతుమీ తేల్చుకుంటాయి. -
ఐఎస్ఎల్ సెమీస్లో కేరళ
పుణేపై 1-0తో గెలుపు కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్టు సెమీస్లోకి ప్రవేశించింది. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్సీ పుణే సిటీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కేరళ 1-0తో నెగ్గి నాకౌట్ దశకు చేరిన మూడో జట్టయ్యింది. 23వ నిమిషంలో ఇయాన్ హుమే సూపర్ ఫ్రీకిక్తో జట్టుకు గోల్ను అందించాడు. ఆతర్వాత బంతిపై పట్టు కోసం పుణే ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. చెన్నైయిన్, ఢిల్లీ గేమ్ డ్రా చెన్నై: ఐఎస్ఎల్లో తమ చివరి లీగ్ మ్యాచ్ను చెన్నైయిన్ ఎఫ్సీ, ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్లు 2-2తో డ్రా చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఢిల్లీ సెమీస్కు చేరేది. మరోవైపు ఈ ఫలితంతో నార్త్ఈస్ట్ జట్టు లీగ్ నుంచి బయటకు వెళ్లిన తొలి జట్టయ్యింది. మ్యాచ్ 16వ నిమిషంలోనే చెన్నైయిన్కి పెలిస్సారి గోల్ అందించాడు. 28వ నిమిషంలో జే జే ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ద్వితీయార్ధంలో ఢిల్లీ చెలరేగడంతో 53వ నిమిషంలో డెల్ పియరో, 88వ నిమిషంలో ముల్డర్ రూపంలో స్కోరును సమం చేసింది. -
ఐఎస్ఎల్ సెమీస్లో గోవా
చెన్నైయిన్పై 3-1తో విజయం చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్సీ గోవా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైయిన్ ఎఫ్సీతో జరిగిన లీగ్ మ్యాచ్లో 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది గోవాకు వరుసగా నాలుగో విజయం. ఇప్పటికే సెమీస్కు చేరిన చెన్నైయిన్పై గోవా ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించింది. 23వ నిమిషంలో రోమియో గోల్ చేయగా 41వ నిమిషంలో సాంటోస్ గోల్ చేశాడు. ద్వితీయార్ధం 62వ నిమిషంలో స్లెపికా గోల్తో గోవా 3-0 ఆధిక్యం సాధించగా... 90వ ని.లో మారిస్ చెన్నైకి గోల్ అందించాడు. -
ఐఎస్ఎల్లో ప్రేక్షకుల రికార్డు
ముంబై: ఈ ఏడాదే తొలిసారి జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పుట్బాల్ ప్రేక్షకుల హాజరు పరంగా కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతున్న ఈ టోర్నీ మ్యాచ్లను ఇప్పటివరకు చూసిన ప్రేక్షకుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆసియాలో ఏ దేశంలోని లీగ్ను కూడా ఇంతమంది ప్రేక్షకులు చూడలేదు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇంగ్లండ్), బుండస్ లిగా (జర్మనీ), లా లిగా (స్పెయిన్)ల తర్వాత అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్లు చూసిన లీగ్ ఐఎస్ఎల్. ఇటలీకి చెందిన ప్రఖ్యాత లీగ్ సెరీ ‘ఎ'ని కూడా భారత లీగ్ అధిగమించడం విశేషం. అలాగే భారత్లో ఈ లీగ్ను టీవీలో 36.4 కోట్ల మంది చూశారు. క్రికెట్ మినహా మరే క్రీడనూ దేశంలో ఈ స్థాయిలో చూడలేదు. -
ఢిల్లీ డైనమోస్ విజయం
గువాహటి: సొంత మైదానంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీకి పరాజయం ఎదురైంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా సోమవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ 2-1 తేడాతో యునెటైడ్పై నెగ్గింది. ఆరంభంలోనే రెండు గోల్స్తో విరుచుకుపడిన ఢిల్లీ ముందు నార్త్ఈస్ట్ నిలబడలేకపోయింది. 6వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్ చేయగా 14వ నిమిషంలో ముల్డర్ గోల్తో జట్టు ఆధిక్యం పెరిగింది. 80వ నిమిషంలో నార్త్ఈస్ట్ తరఫున టోంగా గోల్ చేసినా ఫలితం లేకపోయింది. -
ఐఎస్ఎల్: ఢిల్లీపై గోవా విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్సీ గోవా జట్టు సత్తా చూపించింది. గురువారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలోనే బెంజెలోన్ గోల్తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత 48వ నిమిషంలో బెంజెలోన్ రెండో గోల్ సాధించాడు. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీని సీనియర్ మిడ్ఫీల్డర్ రాబర్ట్ పైర్స్ గోల్గా మలిచి జట్టుకు 3-0 ఆధిక్యాన్ని అందించాడు. 60వ నిమిషంలో ఒజ్బే గోల్తో గోవా తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అయితే 73వ నిమిషంలో ఢిల్లీకి పెనాల్టీ కిక్ రూపంలో సాంటోస్ ఓ గోల్ అందించాడు. -
ఐఎస్ఎల్: రెండు మ్యాచ్లూ ‘డ్రా’లే
మార్గో: ఇండియన్ సూపర్ లీగ్లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గానే ముగిసాయి. ముంబయి-గోవా, కేరళ-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజయాలతో ఊపుమీదున్న ముంబయి సిటీ ఎఫ్సీ జట్టుకు... ఎఫ్సీ గోవా జట్టు ఈ మ్యాచ్లో బ్రేకులు వేసింది. గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్స్ చేసే అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. టోర్నీ ఆరంభం నుంచి సత్తా చాటలేకపోతున్న కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ మధ్య కొచ్చిలో జరిగిన మ్యాచ్ కూడా నిరాశజనకంగానే ముగిసింది. గోల్స్ సాధించడంలో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఐఎస్ఎల్లో సోమవారం మ్యాచ్లు లేవు. -
కేరళకు తొలి విజయం
ఎఫ్సీ పుణేపై 2-1తో గెలుపు పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. తమ గత మ్యాచ్లో పటిష్ట కోల్కతా జట్టును నిలువరించిన ఉత్సాహంలో ఉన్న కేరళ... గురువారం ఎఫ్సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్ను 2-1తో గెలుచుకుంది. కేరళ తరఫున సబీత్ (41వ నిమిషంలో), ఒర్జి (65వ ని.) గోల్స్ చేయగా పుణే నుంచి ట్రెజెగె ్వట్ (15వ ని.) ఏకైక గోల్ చేశాడు. శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. 15వ నిమిషంలో లెఫ్ట్ వింగ్ నుంచి జాప్ గోసెన్స్ సంధించిన బలమైన షాట్ను అందుకున్న డేవిడ్ ట్రెజెగ్వెట్ చక్కటి వ్యాలీతో పుణేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత జోరు పెంచిన కేరళ 41వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్ కిక్ను అందుకున్న స్టీఫెన్ పియర్సన్ హెడర్ గోల్కు యత్నించి విఫలం కాగా వెంటనే ఆ బంతిని అందుకున్న సీఎస్ సబీత్ పొరపాటు చేయకుండా కాలితో గోల్పోస్టులోకి పంపాడు. దీంతో స్కోరు సమమైంది. ద్వితీయార్ధంలోనూ బంతిపై పట్టు సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు జోరుగా తలపడ్డారు. సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన పెన్ ఒర్జి 65వ నిమిషంలో చేసిన గోల్తో కేరళ తొలి విజయాన్ని అందుకుంది.+ ఐఎస్ఎల్లో నేడు విశ్రాంతి దినం -
ఐఎస్ఎల్లో వివాదం
తమ ఆటగాడిని కోల్కతా కోచ్ కొట్టాడంటూ గోవా కోచ్ ఫిర్యాదు మార్గావ్: సాఫీగా సాగిపోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో వివాదం చోటుచేసుకుంది. అట్లెటికో డి కోల్కతా కోచ్ ఆంటోనియో లోపెజ్ హబాస్ తమ ఆటగాడు రాబర్ట్ పైర్స్పై చేయిచేసుకున్నట్టు ఎఫ్సీ గోవా కోచ్ జికో నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రథమార్ధం ముగిశాక టన్నెల్ నుంచి డ్రెస్సింగ్ రూమ్కు వెళుతున్న సందర్భంగా తన ముఖంపై కోల్కతా కోచ్ గుద్దినట్టు పైర్స్ చెప్పాడని జికో తెలిపారు. ‘అట్లెటికో కోచ్ తనను కొట్టినట్టు పైర్స్ నాకు చెప్పాడు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఆ సమయంలో నేను లేను. కానీ పైర్స్ అబద్ధం చెప్పే వ్యక్తి కాదు’ అని గోవా కోచ్ జికో చెప్పారు. అయితే ఈ ఘటనపై ఇరు జట్లు ఐఎస్ఎల్కు ఫిర్యాదు చేశాయి. ఈ ఆరోపణలను రెగ్యులేటరీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఐఎస్ఎల్ అధికార ప్రతినిధి తెలిపారు. కోల్కతా విజయం: గురువారం జరిగిన మ్యాచ్లో మిడ్ ఫీల్డర్ గెవిన్ లోబో కీలక గోల్స్తో అట్లెటికో డి కోల్కతా 2-1తో ఎఫ్సీ గోవాను ఓడించింది. 21వ నిమిషంలోనే ఆండ్రీ సాంటోస్ గోల్తో గోవా ఆధిక్యంలోకి వెళ్లింది. 72వ నిమిషంలో లోబో గోల్తో కోల్కతా.. స్కోరును సమం చేయగలిగింది. 82వ నిమిషంలో లోబో ఎడమ కాలితో చేసిన రెండో గోల్తో మ్యాచ్ నెగ్గి తమ టాప్ స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆద్యంతం ఉద్రిక ్తతే..: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆరంభం నుంచి చివరి దాకా ఆటగాళ్లు ఒకరికొకరు శత్రువుల్లాగే తలపడ్డారు. 10వ నిమిషంలో ఫిక్రూ నుంచి బంతిని స్వాధీనం చేసుకునే క్రమంలో గోవా ఆటగాడు గ్రెగరీ కాస్త దుందుడుకుగా ప్రవర్తించి అతడిని నెట్టివేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగగా ఫిక్రూ తన తలతో గ్రెగరీ కంటిపై గుద్దడంతో రక్తం కారింది. ఇక ప్రథమార్ధం ముగిసిన అనంతరం కోల్కతా కోచ్ పైర్స్పై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ముగిశాక కూడా గోవా ఆటగాళ్లు వేగంగా టన్నెల్ వైపు పరిగెత్తుతూ కనిపించారు. కొందరు మైదానం ఆవల గొడవపడుతూ కనిపించారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఏడుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. కోల్కతా సహ యజమాని గంగూలీ ‘ఏం జరిగినా మ్యాచ్ గెలవడమే ముఖ్యం’ అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. -
మెండీ ‘మ్యాజిక్' గోల్
చెన్నై: ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత అరుదుగా కనిపించే కిక్.. సైక్లింగ్ కిక్. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగే ఆటగాడే ఈ షాట్ను అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తాడు. అయితే ఇలాంటి సన్నివేశమే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మంగళవారం నాటి మ్యాచ్లో ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో చెన్నైయిన్ ఎఫ్సీ స్ట్రయికర్ బెర్నార్డ్ మెండీ కీలక సమయంలో ఈ సూపర్ కిక్తో అదరగొట్టాడు. ఫలితంగా చెన్నైయిన్ 2-1తో నెగ్గింది. మెండీ విన్యాసాన్ని స్టేడియంలోనే ఉన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ , తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు కేరళ సహ యజమాని సచిన్ టెండూల్కర్ సైతం అబ్బురపడి చప్పట్లతో స్వాగతించారు. అటు చెన్నైయిన్కిది వరుసగా రెండో విజయం కాగా కేరళకు వరుసగా రెండో పరాజయం. చెన్నైయిన్ తరఫున ఎలనో (14వ నిమిషంలో), మెండీ (63వ ని.) గోల్స్ సాధించగా... కేరళ తరఫున హుమే (50వ ని.) ఏకైక గోల్ సాధించాడు. లీగ్లో ఈ జట్టుకిదే తొలి గోల్. మ్యాచ్ ప్రారంభంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని 14వ నిమిషంలో ఎలనో సులువుగా గోల్ చేసి చెన్నైయిన్కి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక ద్వితీయార్ధం 50వ నిమిషంలో గోల్ పోస్టుకు అతి సమీపంలోనే ఉన్న ఇయాన్ హుమే వేగంగా స్పందించి స్కోరును సమం చేశాడు. అయితే 63వ నిమిషంలో టోర్నీకే హైలైట్ అనదగ్గ సైక్లింగ్ కిక్తో బెర్నార్డ్ మెండీ కేరళ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఆధిపత్యం కొనసాగించిన చెన్నై విజయాన్ని అందుకుంది. -
కోల్కతాను నిలువరించిన ఢిల్లీ
ఐఎస్ఎల్లో నేడు విశ్రాంతి దినం కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఫేవరెట్గా పరిగణిస్తున్న అట్లెటికో డి కోల్కతా జట్టును ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ జట్టు నిలువరించింది. పటిష్టమైన ఫార్వర్డ్ లైన్, డిఫెన్సివ్ విభాగంతో ఉన్న కోల్కతాను తమ శక్తిమేరా అడ్డుకోవడంలో సఫలమైన ఢిల్లీ జట్టు మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకోగలిగింది. ఆదివారం సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా నుంచి జోఫ్రే గోంజలెజ్ (49వ నిమిషంలో), ఢిల్లీ తరఫున పావెల్ ఎలియాస్ (73వ నిమిషంలో) గోల్స్ చేశారు. ఆరంభం నుంచే ఇరు జట్ల ఆటగాళ్లు అటాకింగ్ గేమ్కు ప్రాధాన్యమిచ్చారు. 20వ నిమిషంలో కోల్కతాకు గోల్ చేసే అవకాశం వచ్చినా ఫిక్రూ విఫలమయ్యాడు. ద్వితీయార్ధం 49వ నిమిషంలో గోల్ పోస్టుకు ఎదురుగా ఫిక్రూ జెర్సీని పట్టుకుని ఆపినందుకు రేమేకర్స్ (ఢిల్లీ) ఎల్లో కార్డ్కు గురికావడంతో పాటు కోల్కతాకు పెనాల్టీ అవకాశం దక్కింది. దీన్ని మిడ్ ఫీల్డర్ జోఫ్రే సులువుగా గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. దాదాపుగా మ్యాచ్పై పట్టు సాధిస్తున్న కోల్కతాకు 73వ నిమిషంలో ఎలియాస్ షాకిచ్చాడు. డెల్ పియరో నుంచి అందుకున్న బంతిని అవుట్సైడ్ బాక్స్ నుంచి నేరుగా స్క్రీమర్ షాట్తో అదరగొట్టి లీగ్లో ఢిల్లీకి తొలి గోల్ను అందించాడు. 88వ నిమిషంలో కోల్కతా ఆటగాడు రాకేశ్ మసీ రెండో ఎల్లో కార్డ్ అందుకోవడంతో ఆ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఆతర్వాత అదనపు గోల్సేమీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోవాతో నార్త్ఈస్ట్ మ్యాచ్ డ్రా నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ, ఎఫ్సీ గోవా జట్ల మధ్య ఆదివారం జరిగిన మరో మ్యాచ్ కూడా 1-1తో డ్రా అయ్యింది. గువాహటిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 17వ నిమిషంలోనే గోవా జట్టు గ్రెగరీ చేసిన గోల్తో ఖాతా తెరిచింది. 34వ నిమిషంలో ఇన్సైడ్ బాక్స్లో గోవా ఆటగాడు దేబబ్రత.. నార్త్ఈస్ట్కు చెందిన రాబిన్ను వెనకవైపు నుంచి నెట్టివేయడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చారు. 37వ నిమిషంలో కోకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టోర్నీలో రెండో గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేశాడు. -
కోల్కతాకు రెండో విజయం
గువాహటి: అట్లెటికో డి కోల్కతా జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో దూసుకెళుతోంది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో 2-0తో నెగ్గింది. ఫిక్రూ, పోడి జట్టు తరఫున గోల్స్ సాధించారు. దీంతో వరుసగా రెండు విజయాలతో కోల్కతా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై కోల్కతా ఆటగాళ్లు దాడులకు దిగారు. ఫలితంగా తొమ్మిదో నిమిషంలోనే బొర్జా ఫెర్నాండెజ్ లాంగ్ సైడ్ నుంచి తన్నిన షాట్ నేరుగా గోల్ పోస్టులోకి వెళ్లగా కీపర్ జొర్వాస్ వేగంగా స్పందించి ఒడిసిపట్టుకున్నాడు. అయితే 15వ నిమిషంలోనే తామనుకున్నది సాధించారు. లూయిస్ గార్షియా అందించిన బంతిని ఫిక్రూ చాతితో నియంత్రించుకుని అద్భుతమైన వ్యాలీ షాట్తో జట్టుకు తొలి గోల్నందించాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా 90+2వ నిమిషంలో పోడి గోల్తో నార్త్ఈస్ట్ చిత్తయ్యింది. ఐఎస్ఎల్లో నేడు మ్యాచ్లు లేవు -
చెన్నైయిన్ శుభారంభం
ఫటోర్డా: దేశవాళీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న చెన్నైయిన్ ఎఫ్సీ జట్టు... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 2-1తో గోవా ఎఫ్సీపై విజయం సాధించింది. బల్వంత్ సింగ్ (32వ ని.), ఎలానో (42వ ని.)లో చెన్నైయిన్ జట్టుకు గోల్స్ అందించగా, ఆర్నోలిన్ గ్రెగొరి (65వ ని.) గోవా తరఫున ఏకైక గోల్ చేశాడు. ఈ టోర్నీలో గోల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా బల్వంత్ సింగ్ రికార్డులకెక్కాడు. ఆరంభంలో ఎక్కువ శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న గోవా ఆటగాళ్లు కీలక సమయంలో తడబడ్డారు. 21వ నిమిషం వరకు ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే బొజన్ జోర్డ్జిక్, ధ్యాన్చంద్ర సింగ్లు సమన్వయంతో కదులుతూ ఇచ్చిన పాస్ను బల్వంత్ అద్భుతమైన గోల్గా మలిచి చెన్నైయిన్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మరో 10 నిమిషాల తర్వాత బాక్స్ బయటి నుంచి ఎలానో కొట్టిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్ట్లోకి దూసుకెళ్లింది. కనీసం గోల్ కీపర్కు అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. రెండో అర్ధభాగంలో గోవా అటాకింగ్కు దిగినా చెన్నైయిన్ డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. అయితే 65వ నిమిషంలో రాబర్ట్ పియర్స్ అందించిన క్రాస్ పాస్ను గ్రెగొరి నేర్పుగా గోల్ పోస్ట్లోకి పంపి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. ఆ తర్వాత గోల్స్ కోసం గోవా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓటమి తప్పలేదు. చెన్నైయిన్కు 3 పాయింట్లు లభించాయి. -
కేరళ బ్లాస్టర్స్కు చుక్కెదురు
1-0తో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ గెలుపు గువాహటి: యువ ఆటగాళ్ల జోరు ముందు సీనియర్ ఆటగాళ్లు తేలిపోయారు. అనుభవజ్ఞులతో కూడిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను ఓటమితో ప్రారంభించింది. అటు మైదానంలో పాదరసంలా కదిలిన నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ 1-0తో నెగ్గి ఐఎస్ఎల్లో బోణీ చేసింది. సోమవారం ఇరు జట్ల మధ్య ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కేరళ అటాకింగ్ గేమ్కు ప్రాధాన్యమివ్వగా... చక్కటి డిఫెన్స్తో నార్త్ఈస్ట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నార్త్ఈస్ట్ గోల్కీపర్ అలెగ్జాండ్రోస్ జొర్వాస్ ప్రత్యర్థి ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలిచాడు. 33వ నిమిషంలో కేరళ గోల్కీపర్ డేవిడ్ జేమ్స్ సూపర్ డైవ్తో గోల్ ప్రయత్నాన్ని అడ్డుకున్నా ప్రథమార్ధం మరికొద్ది క్షణాల్లో (45వ నిమిషం) ముగుస్తుందనగా డేవడ్ గెయిటే ఇచ్చిన పాస్ను కోకే నేర్పుగా కుడి వైపునకు తన్ని గోల్గా మలిచాడు. ద్వితీయార్ధంలో కేరళ కాస్త జోరు పెంచి దాడులకు దిగినా ఫలితం లేకపోయింది. -
'భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుంది'
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) తో భారత ఫుట్బాల్ ముఖచిత్రం మారుతుందన్న ఆశాభావాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తం చేశాడు. ఆదివారం ప్రారంభమైన ఐఎస్ఎల్ కు అద్భుత స్పందన వచ్చిందని పేర్కొన్నాడు. 'ఇది కొత్త ఆరంభం. దీనికోసమే ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆరంభ మ్యాచ్ లో రెండు జట్లు గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. ప్రేక్షకుల స్పందన బాగుంది' అని సచిన్ అన్నాడు. తన టీమ్ కు మద్దతుగా సచిన్ ఇక్కడకు వచ్చాడు. సచిన్ సహ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు ఇంగ్లండ్ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ నాయకత్వం వహిస్తున్నాడు. పీవీపీ వెంచర్స్తో కలిసి సచిన్ ఈ జట్టు కొన్నాడు. -
'కిక్' మొదలైంది !
కోల్కతా: భారత ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆదివారం ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు వివేకానంద యువభారతి క్రిరంగన్ మైదానం (సాల్ట్లేక్ స్టేడియం)లో జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకాగా భారత క్రికెట్ ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఓవరాల్గా 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఆరంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్ను వీక్షించేందుకు 70 వేల మంది హాజరయ్యారు. జట్టు పరిచయ కార్యక్రమాల్లో భాగంగా స్టేడియం మధ్యలోకి వచ్చిన సచిన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ నిలబడి చప్పట్లతో స్వాగతించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, అమితాబ్ బచ్చన్తో పాటు ఆయా ఫ్రాంచైజీల యజమానులు సౌరవ్ గంగూలీ, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, జాన్ అబ్రహాం, పరిణీతి చోప్రా హాజరయ్యారు. అయితే ఏ లీగ్ అయినా ఆటగాళ్లే ప్రధాన ఆకర్షణగా నిలవాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం యజమానులకే స్టార్ హోదా ఉండడంతో అందరి దృష్టీ వీరిపైనే నెలకొంది. ఆటగాళ్లు నామమాత్రంగా మిగలాల్సి వచ్చింది. ఐఎస్ఎల్ ఆరంభ వేడుకలను ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ చైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. ఆమె వెంటే మైదానంలోకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఫుట్బాల్ ప్రపంచాన్ని జయించగలుగుతుంద’ని అన్నారు. అలాగే ఈ క్రీడను భారత్లోని మారుమూల ప్రాంతానికి సైతం తీసుకెళతామని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వేడుకల్లో భాగంగా 200 మంది బాలబాలికలు మెరిసే ఫుట్బాల్లను చేతపట్టుకుని ఐఎస్ఎల్ లోగోగా మారి అబ్బురపరిచారు. ఈ సమయంలో స్టేడియంలో బాణసంచా పెద్ద ఎత్తున కాల్చారు. భారత ఫుట్బాల్ స్వర్ణయుగంగా భావించే 1951-61 మధ్య కాలంలో ఆడిన ఆటగాళ్లను కీర్తిస్తూ థీమ్ సాంగ్ను ప్రదర్శించారు. అనంతరం ఆయా జట్ల సంప్రదాయక సంగీత కార్యక్రమాలు జరిగాయి. మొదట కోల్కతా జట్టు తరఫున మ్యూజీషియన్ బిక్రమ్ ఘోష్ స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చెన్నైయిన్ ఎఫ్సీ నుంచి డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి తన ప్రతిభతో సమ్మోహనపరిచాడు. కేరళ బ్లాస్టర్ నుంచి మళయాల సంగీతకారుడు రోనీ రాఫెల్.. పుణే ఎఫ్సీ నుంచి గణపతి ఉత్సవాల్లో ప్రముఖంగా కనిపించే ధోల్ తాషాను ప్రదర్శించారు. ఢిల్లీ డైనమోస్ తరఫున పంజాబీ ఢోల్ సంగీతాన్ని హనీఫ్ అస్లాం దఫ్రానీ వినిపించారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా రంగప్రవేశంతో ఉత్సవాలు జోరందుకున్నాయి. హిందీ పాటలకు తనదైన శైలిలో నృత్యం చేస్తూ ప్రేక్షకులను హుషారెత్తించింది. సంగీత ద్వయం సలీం-సులేమాన్ కూడా తనతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. వేడుకల తర్వాత ఐఎస్ఎల్ ఫ్రాంచైజీల పరిచయ కార్యక్రమం ప్రియాంక చోప్రా ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కో జట్టు సహ యజమాని, తమ కోచ్ లేదా కెప్టెన్లతో కలిసి వేదికపైకి వచ్చారు. చివర్లో నీతా అంబానీ బెంగాలీలో మాట్లాడుతూ ఇండియన్ సూపర్ లీగ్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. -
ఫుట్బాల్ లెజెండ్
ఇండియన్ సూపర్ లీగ్ (ఫుట్బాల్) సందడి మొదలైంది. బరిలో ఎనిమిది జట్లున్నా అందులో మన ‘హైదరాబాద్’ లేదు. ఒకప్పుడు భారత ఫుట్బాల్ను శాసించిన భాగ్యనగరం ఇప్పుడు జ్ఞాపకాలకే పరిమితమైంది. ఒలింపిక్స్లో పెద్దసంఖ్యలో పాల్గొనటంతో పాటు ఒక తరంలో దిగ్గజాల్లాంటి క్రీడాకారుల్ని అందించిన ఘనత నగరం సొంతం. అలాంటి అత్యుత్తవు ఆటగాళ్లలో ఒకరు.. హ్యాట్రిక్ గోల్స్తో భాగ్యనగరంలో ఫుట్బాల్ ఫీవర్ క్రియేట్ చేసిన షబ్బీర్ అలీ. హైదరాబాద్ ఫుట్బాల్ వేదికపై ఆటగాడిగా, కోచ్గా రెండు పాత్రలూ సమర్థంగా పోషించిన వన్ అండ్ ఓన్లీ ప్లేయుర్ అలీ. చార్మినార్ సమీపంలోని ‘దారుషిఫా’ ఫుట్బాల్ అభిమానుల అడ్డా. అక్కడి ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ అబ్బాసీ యూనియన్ మైదానంలో ‘ఫుట్బాల్’చుట్టూ పరుగెత్తని పిల్లలుండరు. అలాంటి చోట పుట్టి, పెరిగిన షబ్బీర్ అలీ.. సహజ ప్రతిభతో 1972లో తొలిసారి భారత యూత్ జట్టులో చోటు దక్కించుకున్నారు. రెండేళ్ల నిలకడైన ఆట తర్వాత 1974లో యూత్ జట్టుకు కెప్టెన్ అయ్యారు. అతని సారథ్యంలో బ్యాంకాక్లో జరిగిన ఆసియా యూత్ చాంపియన్షిప్లో జట్టు సంయుక్త విజేతగా నిలిచింది. ఇందులో 5 గోల్స్ చేసిన కెప్టెన్ టోర్నీలో టాప్స్కోరర్గా నిలిచారు. వెంటనే సీనియర్ టీమ్లో స్థానం దక్కించుకున్న అలీ 12 ఏళ్ల పాటు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగారు. 1981-84 మధ్యలో మూడేళ్ల పాటు భారత జట్టు కెప్టెన్గానూ ఉన్నారు. గోల్స్ వర్షం... 100 అంతర్జాతీయ మ్యాచ్ల కెరీర్లో 35 గోల్స్ చేసిన అలీ, ఇప్పటికీ భారత టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్నారు. 1976లో కౌలాలంపూర్లో జరిగిన మెర్డెకా కప్లో షబ్బీర్ అలీ తొలి 35 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశారు. భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్ల్లో హ్యట్రిక్ చేస్తే... వీరిలో వేగంగా గోల్స్ చేసిన రికార్డు అలీ సొంతం. సూపర్ లీగ్ కోచ్... ఆటగాడిగా రిటైర్ అయ్యాక 1985లో షబ్బీర్ అలీ శిక్షకుడిగా కొత్త అవతారం ఎత్తారు. 1991లో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జాతీయ లీగ్ విజేతగా నిలవడంలో ఆయనదే ప్రధాన పాత్ర. 1997-99 మధ్య గోవాలోని సాల్గావ్కర్ క్లబ్కు కోచ్గా సాధించిన విజయాలతో భారత్లోని టాప్ కోచ్లలో ఒకరిగా షబ్బీర్ అలీ పేరు మార్మోగింది. రెండేళ్ల వ్యవధిలో సాల్గావ్కర్ జట్టు గోవా ప్రొఫెషనల్ లీగ్, ఇండియన్ సూపర్ కప్, నేషనల్ లీగ్, రోవర్స్ కప్, డ్యురాండ్ కప్, సూపర్ కప్ టైటిల్స్ గెలుచుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. భారత జట్టుతోనూ... 1995లో చెన్నైలో జరిగిన శాఫ్ చాంపియన్షిప్లో భారత ఫుట్బాల్ జట్టుకు అలీ టెక్నికల్ డెరైక్టర్. ఆ ఈవెంట్లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఇక జాతీయ సీనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో కోచ్గా అలీది ప్రత్యేకమైన పాత్ర. ఆయన శిక్షణలో 11 ఏళ్ల విరామం తర్వాత బెంగాల్ జట్టు వరుసగా రెండుసార్లు సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. బెంగాల్ బంధు హైదరాబాద్లో ఫుట్బాల్ ప్రాభవం తగ్గిపోవడంతో ఫుట్బాల్కు ప్రాణమిచ్చే బెంగాల్తో ఆయనకు అనుబంధం పెనవేసుకుంది. 1994లో బెంగాల్ ప్రభుత్వం ఆయన్ను ఫిఫా ప్రపంచకప్కు పరిశీలకుడిగా పంపింది. ప్రభుత్వం తరఫున ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఇదే ఏడాది బెంగాల్ రాష్ట్ర రెండో అత్యుత్తమ ప్రభుత్వ పురస్కారమైన బంగ భూషణ్ అవార్డూ వరించింది. కేంద్ర ప్రభుత్వం 2011లో అలీని ధ్యాన్చంద్ అవార్డుతో సత్కరించింది. ‘పద్మశ్రీ’ వరించాలని ఆశ ‘ఫుట్బాల్పై ఉన్న ప్రేమ, పిచ్చి నన్నీ స్థాయికి చేర్చింది. ఇండియన్ సూపర్ లీగ్తో ఆటపై ఆసక్తి పెరుగుతుందని నా నమ్మకం. 2017లో భారత్లో జరిగే అండర్-17 ప్రపంచకప్ కొత్త శకానికి నాంది పలుకుతుంది. సిటీలో ఫుట్బాల్ గత వైభవాన్ని అందుకోవాలనేది నా కోరిక. పద్మశ్రీ పురస్కారం రాలేదన్న అసంతృప్తి వెంటాడుతోంది’. - షబ్బీర్ అలీ, ఫుట్బాల్ కోచ్ -
ఫుట్బాట్ క్రీడకు మంచి రోజులు: మమత
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)తో భారత్ లో ఫుట్బాట్ క్రీడకు మంచిరోజులు వస్తాయన్న ఆశాభావాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. ఐఎస్ఎల్ తో ప్రపంచపటంలోని అగ్రశేణి జట్ల సరసన భారత్ ఫుట్బాల్ జట్టు చోటు సంపాదిస్తుందన్న విశ్వాసం ఆమె ప్రకటించారు. ఐఎస్ఎల్ తో భారతదేశంలో ఫుట్బాల్ క్రీడకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుడడం వల్ల కచ్చితంగా మనకు మంచి జరుగుతుందన్నారు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు. -
ఎల్లో మే ఖేలో!
ఫుట్బాల్ అభిమానులకు సచిన్ పిలుపు ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు తన ఫుట్బాల్ జట్టు ప్రచార కార్యక్రమంలో బిజీగా మారాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్లో కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని అయిన సచిన్... తమ జట్టుకు మద్దతివ్వాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు. బ్లాస్టర్స్ జెర్సీ రంగు పసుపును హైలైట్ చేసే విధంగా ‘ఎల్లో మే ఖేలో’ అంటూ టెండూల్కర్ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నాడు. దీని ప్రకారం జట్టు అభిమానులు పసుపు రంగు దుస్తులు ధరించి ఆ ఫోటో (లేదా సెల్ఫీ)ను బ్లాస్టర్స్ అధికారిక సైట్లో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఎల్లో మన కలర్. ఈ రంగులో ఉన్న ఫోటోలు పంపి కేరళ బ్లాస్టర్స్ జట్టుకు మద్దతు పలకండి’ అంటూ సచిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కొరియన్లకూ మాస్టరే ఆదర్శం... మరోవైపు ఇంచియాన్ ఆసియా క్రీడల్లో క్రికెట్లో పతకం గెలుచుకోవాలని ఆశిస్తున్న దక్షిణ కొరియా మహిళల జట్టు కూడా సచిన్నే ఆదర్శంగా తీసుకుంది. కొరియా జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ జాతీయుడు నాసిర్ ఖాన్ ఇప్పుడు ఆ జట్టులో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అతను సచిన్ టెండూల్కర్ ఆడిన వీడియోలను వారికి చూపిస్తున్నాడు. అది చూసి ఉన్జున్ లీ అనే 21 ఏళ్ల క్రికెటర్ ఏకంగా సచిన్నే అనుకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. సచిన్ తరహాలో బ్యాక్ లిఫ్ట్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తోంది! -
ఐఎస్ఎల్ బరిలో కోహ్లి
గోవా సహ యజమానిగా ప్రవేశం ముంబై: భారత క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయి బ్యాట్స్మన్గా గుర్తింపు తెచ్చుకుంటున్న విరాట్ కోహ్లి ఇప్పుడు మరో విషయంలోనూ మాస్టర్నే అనుసరించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్లో కోహ్లి ఎఫ్సీ గోవా జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. గోవా టీమ్ యాజమాన్యం మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ టీమ్కు అంబాసిడర్గా కూడా కోహ్లి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఐఎస్ఎల్లో కొచ్చి టీమ్కు సచిన్ సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఎల్లో మటెరాజి!
చెన్నై తరఫున ఆడే అవకాశం న్యూఢిల్లీ : ఇటలీ మాజీ ఫుట్బాల్ ఆటగాడు మార్కో మటెరాజి ఇప్పుడు భారత అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ (ఐఎస్ఎల్)లో అతను చెన్నై టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. ఆ జట్టుకు తనే మేనేజర్గానూ వ్యవహరించే అవకాశం ఉంది. చెన్నై జట్టు ప్రతినిధులు ఇటీవలే రోమ్కు వెళ్లి మటెరాజితో చర్చించారు. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా చెన్నై ఆఫర్ను ఈ మాజీ స్టార్ ఆటగాడు అంగీకరించినట్లు సమాచారం. గత మే నెలలో అతను ఇంటర్ మిలాన్ క్లబ్ ప్రతినిధిగా భారత్కు వచ్చినప్పుడు బెంగళూరు సన్గ్రూప్ ప్రతినిధులు అతనితో చర్చించారు. అయితే ఇప్పుడు ఐఎస్ఎల్ బరినుంచి సన్ తప్పుకోవడంతో చెన్నై జట్టు అతనిపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మటెరాజిని 2006 ప్రపంచకప్లో జినెదిన్ జిదాన్ (ఫ్రాన్స్) తలతో కుమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. -
ఉభయతారకం
క్రీడారంగంతో బాలీవుడ్ అనుబంధం అనేక విధాలుగా లాభదాయకమని ఇండియన్ సూపర్లీగ్ (ఐఎస్ఎల్) లోని ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్లో వాటాదారుడైన రణ్బీర్ కపూర్ పేర్కొన్నాడు. ఐఎస్ఎల్లో రణ్బీర్ కపూర్తోపాటు జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్లు సహయజమానులు కాగా వరుణ్ధావన్ గోవా టీం రాయబారి. ‘ఇది అత్యంత గొప్ప విషయం. దేశంలో ప్రతి క్రీడను ప్రోత్సహించాల్సిందే. క్రికెట్కే తొలి ప్రాధాన్యం. అయితే దానర్థం కబడ్డీ, ఫుట్బాల్ వంటి ఆటలను వదిలేస్తామని కాదు. అంతేకాకుండా కబడ్డీ క్రీడాకారుడిగానో లేదా ఫుట్బాల్ క్రీడాకారుడిగానో యువతకు అవకాశమిచ్చినవాళ్లమవుతాం. ప్రతి ఒక్కరినీ క్రికెట్ ఆటగాడిగానే మలచాల్సిన పనిలేదు. ’అని ఇటీవల తన ఫుట్బాల్ క్లబ్ను ప్రారంభించిన రణ్బీర్ చెప్పాడు. అభిషేక్ నేతృత్వంలోని ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైసీ ఆదివారం రాత్రి జరిగిన ఆటలో విజయం సాధించింది. ఇక జాన్ అబ్రహం... నార్త్ఈస్ట్ యునెటైడ్ ఫుట్బాల్ క్లబ్ సహయజమాని. వరుణ్ధావన్ గోవా ఫుట్బాల్ క్లబ్కు రాయబారిగా వ్యవహరిస్తున్నాడు. ‘ఇండియన్ సూపర్లీగ్లో ప్రమేయం కలిగిన ప్రతి ఒక్కరూ దానిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. ఇందువల్ల మనదేశం తరఫున కూడా మంచి ఫుట్బాల్ టీం తయారవుతుంది’అని అన్నాడు. మంచి లీగ్ను తయారుచేసే దిశగా అడుగులు వేయాలన్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే వరల్డ్ కప్లో పాల్గొనేందుకు మన దేశానికి కూడా ఫుట్బాల్ టీం ఉందన్నాడు. -
ఐఎస్ఎల్ లోగో ఆవిష్కరణ
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ అధికారిక లోగో ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు ఐఎంజీ-రిలయన్స్ చైర్పర్సన్ నీతా అంబానీ లాంఛనంగా లోగోను ఆవిష్కరించారు. తరగతి గదుల్లో నేర్చుకోని ఎన్నో పాఠాలను తనకు ఆట నేర్పిందని కేరళ బ్లాస్టర్ ఎఫ్సీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ అన్నాడు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, హీరో మోటార్కార్ప్ సీఎండీ పవన్ ముంజల్, స్టార్ ఇండియా గ్రూప్ సీఓఓ సంజయ్ గుప్తాతో పాటు ఆయా జట్ల ప్రతినిధులు అభిషేక్ బచ్చన్ (చెన్నై), రణబీర్ కపూర్ (ముంబై), జాన్ అబ్రహం (నార్త్ ఈస్ట్), వరుణ్ ధావన్ (గోవా), ఉత్సవ్ పరేక్ (కోల్కతా), సమీర్ మన్చందా (ఢిల్లీ), కపిల్ వధావన్ (పుణే) పాల్గొన్నారు. అక్టోబర్లో ఈ లీగ్ ప్రారంభం కానుంది. -
ఐఎస్ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్కు ఆరంభానికి ముందే షాక్ తగిలింది. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ సన్ గ్రూప్.. లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను అటు ఆ సంస్థగానీ, ఇటు ఐఎస్ఎల్ నిర్వాహకులు గానీ ప్రకటించకపోయినా.. జె.ఎస్.డబ్ల్యు అనే సంస్థతో సన్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఐఎంజీ-రిలయన్స్ వ్యతిరేకించింది. దీంతో తాము లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సన్ గ్రూప్ తెలిపింది. అయితే డ్రాఫ్ట్లో బెంగళూరు జట్టు ఎంపిక చేసుకున్న 14 మంది ఆటగాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే జట్టుకు వారు ప్రాతినిధ్యం వహిస్తారని లీగ్ నిర్వాహకులు హామీ ఇచ్చారు. మాంచెస్టర్లో ఆవిష్కరణ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ ఆవిష్కరణ ఇంగ్లండ్లో జరగనుంది. సెప్టెంబర్ 6న అంతర్జాతీయ ఫుట్బాల్ ప్రముఖుల సమక్షంలో మాంచెస్టర్లో వైభవంగా జరిగే కార్యక్రమంలో ఐఎస్ఎల్ను ఆవిష్కరించనున్నారు. 2017లో భారత్ ఆతిథ్యమివ్వనున్న అండర్-17 ప్రపంచకప్ను కూడా అదే వేదికపై ఆవిష్కరిస్తారు. -
ఐఎస్ఎల్ డ్రాఫ్ట్లో 49 మంది విదేశీ ఆటగాళ్లు
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నిర్వాహకులు అంతర్జాతీయ ఆటగాళ్ల డ్రాఫ్ట్కు 49 మందితో జాబితా విడుదల చేశారు. స్పెయిన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, పోర్చుగల్, కొలంబియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, కెనడా, సెర్బియాలకు చెందిన ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వచ్చే వారం జరిగే డ్రాఫ్ట్లో సొంతం చేసుకుంటాయి. మొత్తంగా 56 మంది విదేశీ ఆటగాళ్లుండగా ఏడుగురితో ఇప్పటికే నాలుగు క్లబ్లు నేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. -
2 రోజులు.. రూ. 24 కోట్లు
ఐఎస్ఎల్లో పూర్తయిన దేశవాళీ ఆటగాళ్ల ఎంపిక అత్యధికంగా ఖర్చు చేసిన కోల్కతా ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆడే దేశవాళీ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు రూ.24 కోట్లు ఖర్చు చేశాయి. రిలయన్స్, ఐఎంజీ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో మొదలయ్యే ఈ టోర్నీ కోసం రెండు రోజుల పాటు ముంబైలో నిర్వహించిన డ్రాఫ్ట్ పద్ధతి ద్వారా ఫ్రాంచైజీలు 84 మంది ఫుట్బాలర్లను ఎంపిక చేసుకున్నాయి. 8ఫ్రాంచైజీల్లో అట్లెటికో డి కోల్కతా అత్యధికంగా రూ. 3.91 కోట్లతో ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ముంబై రూ. 3.76, కేరళ బ్లాస్టర్స్ రూ. 3.31, పుణె రూ. 3.19, బెంగళూరు రూ. 3.04, ఢిల్లీ డైనమోస్ రూ. 2.81 కోట్లను ఆటగాళ్ల కోసం వెచ్చించాయి. గోవా, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఫుట్బాల్ క్లబ్ ఫ్రాంచైజీలు కలిపి రూ. 3.98 కోట్లతో ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. సీనియర్ల కోసం పోటాపోటీ అనుభవం ఉన్న భారత ఆటగాళ్లు సందీప్ నంది, లారెన్స్, ఎన్.పి. ప్రదీప్, స్టీవెన్ డయాస్లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. భారత మాజీ గోల్ కీపర్ సందీప్ నందిని కేరళ బ్లాస్టర్స్ దక్కించుకుంది. మిడ్ ఫీల్డర్లు లారెన్స్, డయాస్, ప్రదీప్లతో వరుసగా అట్లెటికో డి కోల్కతా, ఢిల్లీ డైనమోస్, బెంగళూరు ఫ్రాంచైజీలు ఒప్పందాలు చేసుకున్నాయి. గోవా, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఫుట్బాల్ క్లబ్లు తాము ఇది వరకే ఒప్పందం చేసుకున్న ప్లేయర్లను డ్రాఫ్ట్ ద్వారా సొంతం చేసుకున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ డ్రాఫ్ట్ ద్వారా మొత్తం 84 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 30 మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, నాలుగు ఐ లీగ్ క్లబ్కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఐఎస్ఎల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానాల్ని భర్తీ చేసేందుకు అదనంగా ఏడుగురిని నిర్వాహకులు సెంట్రల్ రిజర్వ్ పూల్లో ఉంచారు. ఇక వచ్చే నెల్లో విదేశీ ఆటగాళ్ల ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి డిసెంబర్ 7 మధ్య టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయి. షెడ్యూల్ను త్వరలోనే ఐఎస్ఎల్ నిర్వాహకులు ఖరారు చేయనున్నారు. -
గరిష్టంగా రూ. కోటి
ఐఎస్ఎల్లో స్టార్ ఆటగాడికి దక్కేది ఇంతే తొలి రోజు 42 మందిని తీసుకున్న ఫ్రాంచైజీలు నేడూ కొనసాగనున్న ఆటగాళ్ల ఎంపిక ముంబై: రిలయన్స్, ఐఎంజీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో భారత్లో స్టార్ అనుకున్న ఆటగాడికి గరిష్టంగా కోటి రూపాయలు దక్కనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో దేశవాళీ ఆటగాళ్లకు కనిష్టంగా ఒక సీజన్కు రూ. 15 లక్షలు చెల్లించనున్నారు. ఈ టోర్నీలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు వేలం పాట లేకపోవడంతో వారికి ఇంతకుమించి దక్కే అవకాశం లేదు. ఐఎస్ఎల్ ద్వారా ఆటగాళ్లకు కనకవర్షం కురుస్తుందని ఆశించామని.. అయితే తక్కువ మొత్తంలోనే వారికి డబ్బు వస్తోందని భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైఛుంగ్ భూటియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘లీగ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టాలి. కానీ ఐఎస్ఎల్ ద్వారా ఆటగాళ్లకు తక్కువ మొత్తంలోనే డబ్బులు ముట్టబోతున్నాయి. ఇది నన్ను చాలా అసంతృప్తికి గురి చేస్తోంది. వేలం ఉండి ఉంటే ఆటగాళ్లకు మరిన్ని డబ్బులు దక్కేవేమో’ అని భూటియా అన్నాడు. డ్రాఫ్ట్ ద్వారా..: ముంబైలోని ఓ హోటల్లో మొదలైన రెండు రోజుల ఐఎస్ఎల్ దేశవాళీ ఆటగాళ్ల ఎంపికలో తొలి రోజు ఫ్రాంచైజీలు 42 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. భారత ఫుట్బాల్ జట్టు గోల్కీపర్ సుబ్రతా పాల్, మిడ్ఫీల్డర్ సయ్యద్ రహీమ్ ముంబై ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లతో ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెండర్లు నిర్మల్ ఛత్రి, గౌరమంగి సింగ్లను కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. తొలి రోజు మొత్తం 42 మంది దేశవాళీ ప్లేయర్లు ఏడు డ్రాఫ్ట్ల్లో ఉండగా.. అందులో 32 మంది గత మూడేళ్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లలో జువెల్ రాజా (గోవా), జోమింగ్లియానా రాల్టే (నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్.సి), ధర్మరాజ్ రావణన్(పుణె), లెన్నీ ఫెర్నాండెజ్ (పుణె), లెన్నీ రోడ్రిగ్వెజ్ (పుణె), ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ (ఢిల్లీ), మెహతాబ్ హుస్సేన్ (కేరళ) ఉన్నారు. ఇక గోవా, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఫుట్బాల్ క్లబ్లు ఇదివరకే కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. మిగిలిన 42 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు నేడు ఎంపిక చేసుకోనున్నాయి. మొత్తం 14 డ్రాఫ్ట్ల్లోని 84 మంది ఆటగాళ్లలో 27 మంది ఫార్వర్డ్లు, వింగర్లు, 21 మంది మిడ్ఫీల్డర్లు, 26 మంది డిఫెండర్లు, 10 మంది గోల్ కీపర్లు ఉన్నారు. ఆగస్టులో విదేశీ ఆటగాళ్ల ఎంపిక: విదేశీ ప్లేయర్ల ఎంపిక వచ్చే నెల్లో జరగనుంది. దక్షిణ అమెరికా, యూరోప్లకు చెందిన 49 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు డ్రాఫ్ట్ ద్వారా ఎంపిక చేసుకుంటాయి. -
మాస్టర్ జట్టు ‘బ్లాస్టర్స్’
ఆవిష్కరించిన కేరళ సీఏం తిరువనంతపురం: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు పేరును కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ (కేబీఎఫ్సీ)గా సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ జట్టు పేరును ఆవిష్కరించారు. ‘మా జట్టుకు కేరళ బ్లాస్టర్స్గా పేరు పెట్టాం. ఎందుకంటే నేను క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్గా అందరికీ పరిచయం. క్రికెట్ ఆడుతూ పెరిగినప్పటికీ అన్ని ఆటలను ఆస్వాదించాను. జాతీయ జట్టులో ఉన్నప్పుడు, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్లో కూడా ఫుట్బాల్ ఆడడం భాగమైపోయింది. ఒకప్పుడు చాలా మంది కేరళ ఆటగాళ్లు భారత ఫుట్బాల్ టీమ్లో ఉండేవారు. ఐఎస్ఎల్ ద్వారా దేశ ఫుట్బాల్ ముఖచిత్రాన్ని మార్చే ప్రయతం చేస్తాం’ అని సచిన్ చెప్పాడు. మరోవైపు ఫుట్బాల్పై సచిన్ చూపిస్తున్న ఆసక్తిని సీఎం చాందీ అభినందించారు. అలాగే వచ్చే జనవరిలో ఇక్కడ జరిగే జాతీయ క్రీడలకు సచిన్ను అంబాసిడర్గా వ్యవహరించాలని ఆయన కోరగా అందుకు మాస్టర్ సమ్మతించాడు. లక్షా 25 వేల మంది స్కూల్ చిన్నారులను తమ క్లబ్ తరఫున శిక్షణ ఇస్తామని సచిన్ చెప్పినట్టు తెలిపారు. -
అట్లెటికో డి కోల్కతా
ఐఎస్ఎల్లో గంగూలీ జట్టు పేరు ప్రకటన ఆవిష్కరించిన ‘మాడ్రిడ్’ యజమాని కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కోల్కతా ఫ్రాంచైజీ పేరు ఖరారైంది. ‘అట్లెటికో డి కోల్కతా’గా నామకరణం చేసిన ఈ ఫ్రాంచైజీ పేరును బుధవారం జట్టు సహ యజమాని, అట్లెటికో డి మాడ్రిడ్ యజమాని అయిన మిగెల్ ఏంజెల్ గిల్ మారిన్ ఆవిష్కరించారు. ఫ్రాంచైజీ సహ యజమానులైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, సంజీవ్ గోయెంకా, హర్షవర్ధన్ నియోటియా, ఉత్సవ్ పరేఖ్లు హాజరయ్యారు. భారత్లో ఎనిమిది నగరాల ఫ్రాంచైజీలతో ఏర్పాటైన ఐఎస్ఎల్లో మొట్ట మొదటిగా కోల్కతా తమ పేరును ప్రకటించినట్లయింది. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్ ద్వారా దేశంలో ఫుట్బాల్ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, లీగ్తోపాటు అకాడమీలనూ ఏర్పాటు చేసి నైపుణ్యాన్ని వెలికి తీస్తామని తెలిపాడు. లీగ్ ప్రారంభానికి ముందు కోల్కతాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సిందిగా అట్లెటికో డి మాడ్రిడ్ జట్టును కోరతామన్నాడు. భారత్లో క్రికెట్కున్న ఆదరణ కొనసాగుతూనే ఫుట్బాల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. -
ఎప్పటికీ క్రీడాకారుడినే: సచిన్ టెండూల్కర్
ముంబై: నా హృదయంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఎప్పటికి తాను క్రీడాకారుడిగానే ఉంటానని సచిన్ స్పష్టం చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ లో కోచి ఫుట్ బాల్ జట్టును పీవీపీ వెంచర్స్ అధినేత ప్రసాద్ పొట్లూరితో కలిసి సచిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. యువకులను ప్రోత్సాహం అందించి.. అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడానికి ఇండియన్ సూపర్ లీగ్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని సచిన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ క్రీడను అభివృద్ది చేసేందుకు తాము ఆశించిన లక్ష్యాలను కోచి క్లబ్ ద్వారా చేరుకుంటామనే విశ్వాసాని సచిన్ వ్యక్తం చేశారు. షేన్ వార్న్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవన్ జట్టు, మెరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆడేందుకు సచిన్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. మెరీలేబోన్ క్రికెట్ క్లబ్ కు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్ జూలై 5 తేదిన లార్డ్స్ మైదానంలో జరుగనుంది. ఎంసీసీ లో సచిన్, షేన్ వార్న్ గౌరవ సభ్యులుగా ఉన్నారు. -
ఐపీఎల్తో పోల్చలేం
ఐఎస్ఎల్పై గంగూలీ వ్యాఖ్య కోల్కతా: త్వరలోనే ఆరంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను.... ఇప్పటికే విజయవంతమైన ఐపీఎల్తో పోల్చలేమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. ఓ విధంగా ఫుట్బాల్లో ఇలాంటి లీగ్ను నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని అని అంగీకరించాడు. అయినా భవిష్యత్లో ఆట అభివృద్ధి చెందడమే కాకుండా లాభాలు కూడా దక్కించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఐఎస్ఎల్ను క్రికెట్తో పోల్చకూడదు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాం. మేం పెట్టిన డబ్బు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. క్రికెట్లాగే ఫుట్బాల్కు కూడా కార్పొరేట్ల నుంచి మద్దతు కావాలి’ అని గంగూలీ కోరాడు.