Surgery
-
177- 95 కిలోలకు!.. బరువు తగ్గడమే శాపమైంది.. చివరికి పాపం ఆమె..!
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది. కానీ వర్కౌట్లు, డైట్లతో కష్టపడటం కంటే సులువుగా, త్వరితగతిన తగ్గిపోవడమే నచ్చుతోంది చాలామందికి. అందుకే వారంతా సర్జరీల బాట పడతున్నారు. అయితే ఆధుని వైద్య విధానం ఎంతలా అభివృద్ది చెంది..నిమిషాల్లో శరీరం స్లిమ్గా అయిపోయే కొంగొత్త వైద్య విధానాలు వచ్చినప్పటికీ.. అవన్నీ ప్రమాదకరమే అని నిపుణుల పదే పదే హెచ్చరిస్తూన్నారు. కానీ నాజుగ్గా అయిపోవాలన్న ఇంటెన్షన్తో వాటన్నింటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అనవసరం అన్నట్లుగా..బరువు తగ్గే సర్జరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. పాపం అలానే చేసి ఓ మహిళ భారీ మూల్యమే చెల్లించుకుంది. తిరిగి మాములు మనిషి కావడానికి ఎంత నరకయాతన అనుభవించిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఏం జరిగిందంటే..యూకేకికి చెందిన 42 ఏళ్ల డేనియల్ పీబుల్స్ అనే మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో 2023లో గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంది. అయితే ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థలు అందుకోసం ఏడేళ్లు నిరీక్షించాలని చెప్పాయి. బాబోయే అన్నేళ్లు వెయిట్ చేయడం ఏంటని.. టర్కీ వెళ్లి మరీ బరువు తగ్గించుకునే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకుంది. నిజానికి ఆమె 177 కిలోల ఊబకాయం సమస్యతో బాధపడుతుంది. ఆమె తన బిడ్డకు పుట్టబోయే చిన్నారితో హాయిగా గడపాలంటే ఇంత భారీ కాయం పనికిరాదని భావించి ఈ శస్త్రచికిత్సకు రెడీ అయ్యింది. అనుకున్నట్లుగా ఈ సర్జరీతో ఆమె ఏకంగా 95 కిలోల బరువు గణనీయంగా తగ్గిపోయింది. డేనియల్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. సదరు టర్కీ ఆస్పత్రి యజమాన్యాన్ని కూడా ప్రశంసలతో ముచ్చెత్తింది. అంతా బాగానే ఉందనుకునేలోపే..రోజులు గడుస్తున్న కొద్దీ డేనియల్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమైంది. అది చివరకి బెడ్మీద నుంచి కాలు దించడానికే భయపడేంత పరిస్థితికి చేరుకుంది. అలా ఒకరోజు మెడ నుంచి కింద శరీరం అంతా చచ్చుబడిపోయి పక్షవాతం బారినపడింది. ఇక ఆమె తిరిగి నడవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. బరువు తగ్గానన్నా.. ఆనందం ఆవిరైపోయి..బతుకే భారంగా మారిందనే.. బాధతో విలవిలలాడింది. అసలు తనకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని వైద్యులను ప్రశ్నించగా..ఈ బరువు తగ్గే సర్జరీ కారణంగా నరాల పనితీరుకి సంబంధించిన విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నరాల పనితీరు మెరుగవ్వడం అనేది అంత ఈజీ కాదు..అందువల్ల మళ్లీ తాను యథావిధిగా నడవడం అనేది సాధ్యమా..? అనేది చెప్పడం కష్టమని అన్నారు వైద్యులు. దాంతో ముందు తాను ఈ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్పా..కుంగిపోకూడదని ఫిక్స్ అయ్యింది. ముందుగా నిపుణులైన వైద్యుల సమక్షంలో ఇంటెన్సివ్ చికిత్స తీసుకుంది. చివరకు ఆమె నరాల పనితీరు మెరుగై తిరిగి నడవగలిగేలా కింద ఉన్న ప్రతి అవయవంలో స్పర్శను తిరిగి పొందింది. చూస్తుండగానే..కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడింది. బరువు తగ్గాలనుకుంటే..అందుకు ఇంత మనోబాధను చెల్లించుకుంటానని కలలో కూడా ఊహించలేదని వాపోయింది డేనియల్.ఈ సర్జరీలు ఇంత ప్రమాదకరమా?గ్యాస్ట్రిక్ స్లీవ్ శస్త్రచికిత్స: దీనిని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స (బారియాట్రిక్ సర్జరీ). ఈ శస్త్రచికిత్సలో కడుపును చిన్న అరటిపండు ఆకారంలోకి కుదించి.. ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఆయా వ్యక్తులు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో అప్పుడు పోషకాహార లోపం ఎదురవుతుంది. ఇది కాస్తా.. శరీరానికి తగినంతగా విటమిన్లు తీసుకోకపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా నరాల పనితీరుకు అవసరమై బీ విటమిన్ లోపం ఏర్పడి పలు ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.అక్కడైతే ఖర్చు తక్కువ.. విదేశాల్లో తక్కువ ధరలో ఊబకాయం శస్త్రచికిత్స చేయించుకోవచ్చని..చాలామంది అక్కడకు వెళ్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాల్లో ఇంకా చౌక. అంతేగాదు అక్కడ బ్రిటన్ వాసులు కూడా ఈ సర్జరీ చేయించుకుని పలు అనారోగ్య సమస్యల బారిన పడటం లేదా మరణించడం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఈ శస్త్ర చికిత్స కోసమే సుమారు 5 వేల మందికి పైగా వ్యక్తులు విదేశాలకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయ్. తస్మాత్ జాగ్రత్త..!. ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు తగ్గి..ఆరోగ్యంగా ఉందాం..!.(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
హ్యాపీ డేస్ నటుడికి సర్జరీ.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ప్రాక్టీస్!
టాలీవుడ్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగులో బిగ్బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ఆదర్శ్ బాలకృష్ణ అభిమానులను మెప్పించారు. గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.అయితే తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మొదటి రోజు చిన్నచిన్న కసరత్తులు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని పోస్ట్ చేశారు. అయితే ఇంతకీ ఆదర్శ్ బాలకృష్ణకు అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలున్నాయా? అనే వివరాలపై క్లారిటీ లేదు.సినీ కెరీర్ విషయానికొస్తే హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టాలీవుడ్ పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. గత రెండేళ్లలో రంగమార్తాండ, శాకుంతలం, మిక్సప్ సినిమాలలో అభిమానులను అలరించారు. -
అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్తో పిలవడానికి రీజన్..?) -
ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. సైరా భానును పెళ్లాడిన ఆయన గతేడాది తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు 29 సంవత్సరాల వివాహబంధం తర్వాత డివోర్స్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తాము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో దయచేసి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వీరిపై కొన్ని ఊహగానాలు రావడంతో సైరా బాను తన భర్త రెహమాన్ చాలా మంచివాడంటూ ఓ నోట్ను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రూమర్స్కు చెక్ పడింది.అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సైరా భాను తరఫున ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనలో.. 'కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కఠినమైన సమయంలో త్వరగా కోలుకోవడంపైనే ఆమె దృష్టి ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగొస్తా.' అని రాసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు లాస్ ఏంజిల్స్లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 'అంటూ నోట్ విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vandana Shah (@advocate.vandana) -
దేశంలో ఏటా.. లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు
సాక్షి, అమరావతి: దేశంలో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేయించుకున్న బాధితులు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (ఎస్ఎస్ఐ) బారినపడుతున్నారు. వీరిలో 54 శాతానికి పైగా ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల బాధితులు ఉంటున్నారు. ఈ అంశం ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో ఎస్ఎస్ రేటు 5.2 శాతంగా ఉంది. అధిక ఆదాయ దేశాల కంటే ఇంది చాలా ఎక్కువ అని తెలి పింది. ఢిల్లీ ఎయిమ్స్, మణిపాల్లోని కస్తూర్బా, ముంబైలోని టాటామెమోరియల్ ఆస్పత్రుల్లో 3,090 మంది రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది. 161 మంది రోగుల్లో శస్త్ర చికిత్సల అనంతరం ఎస్ఎస్ఐ అభివృద్ధి చెందినట్టు గుర్తించింది. ముఖ్యంగా రెండు గంటల కంటే ఎక్కువ సమయం నిర్వహించే సర్జరీలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతున్నట్టు కనుగొన్నారు. పెరుగుతున్న వ్యయప్రయాసలురోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతోనే ఎస్ఎస్ఐ సమస్య తీవ్రతరంగా ఉంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్ర చికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా రోగులు కోలుకునే సమయంతో పాటు, చికిత్సకు అయ్యే ఖర్చులు వంటి వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో, శస్త్రచికిత్స చేయించుకునే రోగుల్లో 11శాతం మంది ఇన్ఫెక్షన్కు గురవుతున్నట్టు డబ్ల్యూహెచ్వో సైతం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థో, గైనిక్, ఇతర సర్జరీల అనంతరం రోగులు ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న ఘటనలు ఉంటున్నాయి. లాప్రో, రోబోటిక్ సర్జరీలతో తక్కువ ఇన్ఫెక్షన్లు ఆస్పత్రుల్లో సరైన స్టెరిలైజేషన్ లేకపోవడం, రోగుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండటం శస్త్ర చికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం. శస్త్ర చికిత్సలకు ముందే సమగ్రంగా ప్రీ–ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ చేపట్టాలి. గుండె వాల్వ్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీల్లో శరీరంలో స్టీల్ మెటల్స్ అమరుస్తుంటారు. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సర్జరీల్లో ఒక శాతం ఇన్ఫెక్షన్ రేటు ఉన్నా ప్రమాదమే. ప్రస్తుతం ల్యాప్రోస్కొపీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక సర్జరీలు పద్ధతులు అందుబాటులో ఉంటు న్నాయి. ఈ విధానాల్లో శస్త్ర చికిత్సల్లో కచి్చతత్వంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకడానికి అవకాశం చాలా తక్కువ. సంప్రదాయ సర్జరీల్లో పెద్ద కోతలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. ప్రస్తుతం వైద్యుల సంప్రదింపులు లేకుండానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ప్రజలు యాంటిబయోటిక్స్ వాడేస్తున్నారు. ఇది మంచిది కాదు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, రొబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ -
నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్ర చికిత్స..
మోకాలి ఎముకల తాలూకు మృదులాస్థి (కార్టిలేజ్) అరిగాక... మోకాలి కదలికల్లో ఒకదానితో మరొకటి ఒరుసుకుంటే తీవ్రమైన నొప్పి రావడం... ఈ అరుగుదల తీవ్రత నాలుగో దశకు చేరాక మోకాలి మార్పిడి (నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరం ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో చేసే నీ రీప్లేస్మెంట్ చికిత్సల స్థానంలో ఇప్పుడు రోబో సహాయంతో శస్త్రచికిత్స (రోబోటిక్ సర్జరీ) వంటి అధునాతన పద్ధతులు అమల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్(Robots ) నీ రీప్లేస్మెంట్ సర్జరీ(knee Replacement Surgery)తో ఉండే సౌలభ్యాలూ, అనుకూలత గురించి తెలుసుకుందాం. మోకాలి ఎముకల అరుగుదల అనేక విధాలుగా జరుగుతుంది. ఈ అరుగుదలను ఆర్థరైటిస్గా పేర్కొంటారు. ఇందులో దశలు ఉంటాయి. ఒకదశ దాటాక (నాలుగో దశ) ఇక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్లనే నొప్పి తగ్గుతుంది. గతంలోనూ... ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అనేక శస్త్రచికిత్స పద్ధతుల్లో వచ్చినట్టే మోకాలి మార్పిడి చికిత్సల్లో సైతం రోబోటిక్ సర్జరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అందునా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తూ... అత్యంత సునిశితంగా (ప్రెసిషన్తో) శస్త్రచికిత్స చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక రోబోల సహాయాన్ని వైద్యులు తీసుకుంటున్నారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ అధునాతన పద్ధతిలో జరిగే శస్త్రచికిత్సతో ప్రయోజనాలేమిటో చూద్దాం. కృత్రిమ పరికరాలు చాలాకాలం పాటు మన్నడం : లోపల అమర్చాల్సిన పరికరాలను చాలా సునిశితత్వంతో అత్యంత ఖచ్చితమైన స్థానాల్లో అమర్చడం వల్ల అవి త్వరగా రాసుకుపోవడం, ఒరుసుకు΄ోవడం జరగవు. దాంతో చాలాకాలం పాటు మన్నికతో ఉంటాయి. తక్కువ నొప్పి: రోబోటిక్ శస్త్రచికిత్సలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ దుష్ప్రభావాలు: చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స జరిగిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వంటి దుష్ప్రభావాలు రావడం చాలా తక్కువ. టైలర్ సర్జికల్ అప్రోచ్ : అందరి దేహ భాగాలూ, వాటితో పనిచేసే తీరుతెన్నులు ఒకేలా ఉండవు. దాంతో బాధితుల మోకాలి చుట్టూ ఉండే టెండన్లు, లిగమెంట్లు సరిగ్గా అమరి΄ోయేలా వారి అవసరాలకు తగ్గట్లుగా కృత్రిమ ఉపకరణాల రూపకల్పన, లోపల వాటి అమరిక అత్యంత ఖచ్చితత్వంతో జరగడంతో గతంలోని వారి వ్యక్తిగత అవయవం లాగానే మోకాలి భాగాలు అమరిపోతాయి. ఇంకా చెప్పాలంటే సంప్రదాయ చికిత్సలో శస్త్రచికిత్స చేసి లోపలి భాగాలను చూసేవరకు కండరాల పరిస్థితి అంతగా తెలియదు. అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణులు తమ అంచనా ప్రకారం శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే రోబోటిక్ సర్జరీలో కండరాల తీరుతెన్నులు శస్త్రచికిత్స ముందే స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఖచ్చితమైన శస్త్రచికిత్సకు అవకాశం దొరుకుతుంది. దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలు ముందుకూ వెనక్కు కదలడం (ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్) వంటి కదలికలు చాలా బాగుంటాయి. అందునా మోకాలి దగ్గర వంగడం అనేది సంప్రదాయ చికిత్స కంటే మరింత ఎక్కువగా ఉంటుంది. బాగుంటుంది. మోకాలు ఒంచేటప్పుడు సైతం నొప్పి చాలా తక్కువ. వేగంగా కోలుకోవడం రోబోటిక్ శస్త్రచికిత్స అత్యంత సునిశితత్వంతో జరగడంతో గాయం చాలా త్వరగా తగ్గుతుంది. ఇక దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా చాలా తక్కువగా ఉండటం ఫలితంగా చాలా వేగంగా కోలుకుని, చాలా త్వరగా ఇంటికెళతారు. మరింత ఎక్కువ సునిశితత్వం ఇలాంటి అత్యాధునిక రోబోల సహాయంతో చేసే శస్త్రచికిత్సలో సర్జన్ల ముందర బాధితుల తాలూకు మోకాలి 3–డి ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. సంప్రదాయ చికిత్సల్లో ఇది అంత పూర్తిగా, స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఫలితంగా కృత్రిమ మోకాలి ఎముకల భాగాల్ని అమర్చేటప్పుడు మునుపు ఉన్నట్లే సరిగ్గా అమరిపోయేలా అమర్చడానికి వీలవుతుంది. ఎవరికి ఈ శస్త్రచికిత్సలుగతంలో శస్త్ర చికిత్స చేయించుకుని విఫలమైనవాళ్లు (వీళ్లలో మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండటం, కాలు కదిలిస్తున్నప్పుడు నొప్పి ఉండటం వంటి లక్షణాలుంటాయి), అరుగుదల చాలా ఎక్కువగా (సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్) ఉన్నవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతుండేవారికి, అలాగే ఇక నొప్పి నివారణ మందులూ, ఇతర చికిత్సలు పనిచేయని వారికి ఈ రోబోటిక్ శస్త్రచికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. (చదవండి: ఆ టైమ్లోనూ ఐరన్ యువతిలా...) -
నాజూకు నడుము కోసం మరీ ఇలానా..!
వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో. ఇటీవల కాలంలో అందం పిచ్చి మాములుగా లేదు. అందుకోసం ప్రాణాలే సంకటంలో పడేసే పనులు చూస్తే ఏం మనుషుల్రా బాబు అనిపిస్తుంది. అచ్చం అలాంటి భయానకమైన పనే చేసేంది ఓ ట్రాన్స్ విమెన్. ఆమె చేసిన పని తెలిస్తే.. అందం కోసం మరీ ఇంతకు తెగించాలా అని చిరాకుపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..అమెరికాకు చెందిన 27 ఏళ్ల ట్రాన్స్ మహిళ(Trans Woman) ఎమిలీ జేమ్స్(Emily James) నడుము నాజూగ్గా ఉండాలని పక్కటెముకలు(Ribs) తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఏకంగా రూ. 1 లక్షలు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించుకుంది. దీని కారణంగా వర్ణనాతీతమైన బాధను కూడా అనుభవించింది. ఇలా ఎముకలు తొలగించుకోవడం వల్ల విపరీతమైన వాపు వచ్చి కార్సెట్(బెల్ట్)ను ధరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అంతేగాదు తనకు ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సుల బృందానికి ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపింది. అలాగే తొలగించిన పక్కటెముకలను వైద్యులు తనకే ఇచ్చేసినట్లు పేర్కొంది. పైగా వాటిని కిరీటం(crown) కింద ఎవరైన తయారు చేస్తే బాగుండనని అంటోంది. అంతేగాదు దాన్ని తన ప్రాణ స్నేహితుడికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పింది. తాను బార్బెక్యూలా అందంగా కనిపించాలని గత మూడు రోజుల క్రితం రెండు వైపులా పక్కటెముకలు తొలగించుకున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు అందం కోసం మరి ఇలానా అంటూ తిట్టిపోయగా, మరికొందరూ ఆ ఎముకలను ఏం చేస్తావంటూ వెటకారంగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.గతంలో ఇలానే అందం కోసం చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీల కారణంగా చాలామంది మోడల్స్, స్టార్లు అనారోగ్యం పాలవ్వడం లేదా వికటించి బాధలు పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయినా ఈ గ్లామర్ పిచ్చి జనాలకు తగ్గడం లేదు ఎందుకనో..?. నిజానికి ఆరోగ్యానికి మించిన అందం ఇంకేమైనా ఉందా..! అని ఆలోచించండి ప్లీజ్..!.(చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన
టెల్అవీవ్:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(75) మూత్రనాళ ఇన్ఫెక్షన్కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్గ్రౌండ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.ఈ అండర్గ్రౌండ్ చికిత్సా కేంద్రం మిసైల్ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి యారివ్లెవిన్ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి.. మస్క్ కీలక ట్వీట్ -
అమెరికాలో శివరాజ్కుమార్.. క్యాన్సర్కు శస్త్రచికిత్స పూర్తి
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూత్రాశయ క్యాన్సర్కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.ప్రస్తుతం శివరాజ్కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్కుమార్కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤ Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024 It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times. Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024 -
తెగిన చేతిని అతికించిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్కుమార్ను హైదరాబాద్కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది. అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్ను ఐస్ప్యాక్లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు. పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు. -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
కన్నడ నటుడు దర్శన్కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
మూర్ఛకు శాశ్వత పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: వైద్య రంగాన్ని కలవరపెడుతున్న మూర్ఛ (ఎపిలెప్సీ) రోగానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ మూర్ఛరోగ నిపుణుడు, క్లీవ్ల్యాండ్ ఎపిలెప్సీ సెంటర్ న్యూరో డైరెక్టర్ డాక్టర్ ఇమద్ ఎం నజ్మ్ చెప్పారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు విశాఖ వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కొన్ని దేశాల్లో మూర్ఛ రోగానికి శస్త్రచికిత్సలు చేసినా.. ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోతున్నామన్నారు. నాడీ సంబంధిత వ్యాధులు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనకబడే ఉన్నామన్నారు. ఎపిలెప్సీపై పరిశోధనలు వేగవంతమవుతున్నాయని తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. ప్రతి ఆరుగురిలో ఒకరికి నరాల సమస్యప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండటం కలవరపెట్టే అంశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మూర్ఛతో జీవిస్తున్నారు. 10 లక్షల మంది మెసియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. మెదడులో వైకల్యాలు అని పిలిచే మూర్ఛ రోగం వైద్య రంగంలో క్లిష్టంగా మారుతోంది.మెదడు అధ్యయనం అంటే.. అది మూర్ఛ కావచ్చు, అల్జీమర్స్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. నాడీ సంబంధిత వ్యాధులు ఇటీవల ఎక్కువయ్యాయి. వయసుతో పాటు ఈ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 15 మందికి మూర్ఛ రోగం ప్రమాదకరంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం.శస్త్ర చికిత్సల్లో మూడొంతులు విఫలం మూర్ఛకు శస్త్రచికిత్స అంటూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. అంటే మెదడులోని టెంపోరల్ లోబ్కు సంబంధించిన భాగాన్ని తొలగించడం మూర్ఛకు ఉన్న ఏకైక శస్త్రచికిత్స. ఇది అంత విజయవంతం కాదు. ఇప్పటివరకు చేసిన ఈ తరహా చికిత్సల్లో మూడొంతులు విఫలమవుతున్నాయి. మందుల ద్వారా కూడా అంత ఫలితాలు రావడం లేదు. మూర్ఛ రోగం వచ్చిన ప్రతి 100 మందిలో 90 శాతం రోగులు మందులు వాడుతున్నారు. వీరిలో కేవలం 44 శాతం మందికే ఫలితాలు దక్కుతున్నాయి.అమెరికా పరిశోధనలు సఫలీకృతంఅమెరికాలో ఎపిలెప్సీపై 2007 నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. 2007లో లేజర్ థెరపీకి అనుమతి లభించింది. 2013లో న్యూరో స్టిమ్యులేషన్, 2018లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్), 2019లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అ్రల్టాసౌండ్ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు చేసేందుకు అనుమతి లభించింది. ఇది విజయవంతమయ్యే దిశగానే పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. నాడీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, రోగ నిర్ధారణ చేయడంఅనేది వైద్య ప్రపంచానికి పెద్ద సవాల్గా మారింది. హృద్రోగాల్ని ఎలాగైతే ముందుగానే పసిగట్టే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో.. అదేవిధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2050 నాటికి న్యూరో సంబంధిత వ్యాధులకు సంబంధించి సంపూర్ణ చికిత్స వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. -
ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి రిమోట్ సర్జరీ!
వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు. ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్లో ఈ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో హాంకాంగ్లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు. (చదవండి: -
ఏకంగా 6110! కడుపా? రాళ్ల గుట్టా? డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం
రాజస్థాన్లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. -
యూట్యూబ్లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్లో ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
ముక్కలైన చేయికి పునర్జన్మ
శివమొగ్గ: రెండు ముక్కలైన చెయ్యికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు మళ్లీ ఒక్కటి చేశారు. ఈ అరుదైన సంఘటన శివమొగ్గ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది. ఓ సామిల్లో పనిచేసే కారి్మకుడు (35) చేయి రంపంలోకి చిక్కి రెండు ముక్కలైంది. వెంటనే అక్కడున్నారు విడిపోయిన చేతిని ఐస్బాక్స్లో పెట్టుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసిన తెగిన చేతిని ఎముకలు, మాంసంతో పాటు కలిపారు. తరువాత వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించి బాగు కావడంతో డిశ్చార్జి చేశారు. అతని చెయ్యి త్వరలోనే మామూలుగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చేతన్, ఎముకల వైద్యుడు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ వాదిరాజు కులకరి్ణ, మూకర్ణప్ప, సంతో‹Ù, అర్జున్ ఈ శస్త్రచికిత్స చేశారు. -
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
గర్భశయాన్ని తొలగించారు.. తల్లిని కాలేను.. హీరోయిన్ ఎమోషనల్!
నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్గా ఫాలో అయ్యే నెటిజన్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్కి కేరాఫ్గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి.. హిందీ బిగ్బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బిగ్బాస్ హౌస్లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్లతో హల్చల్ చేసింది. (చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. (చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది. -
ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!
ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గ రేంజ్లో ఘరానా దోపిడీలు, హైటెక్ మోసాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో మరింత ఘోరం. మనుషులకు తెలియకుండా అవయవాలు దోచేసుకుని వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిన ఉదంతాలు కోకొల్లలు. వైద్యో నారాయణ హరిః అన్న వాక్యం వెలవెలబోయేలా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి దిగ్బ్రాతికర ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..సంజ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్కి ఆ రోజు రాత్రితో తాను అతడుగా ఉండటం ఆఖరు అని ఊహించలేదు. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారి జీవితాన్ని శాపంగా మారుస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిద్ర పోయేంతరకు మగవాడిగా ఉన్నవాడు కాస్త మేలుకునేటప్పటికీ 'ఆమె'గా మారిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన బేగ్రాజ్పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజాహిద్ గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ అనే వ్యక్తి చేతిలో వేధింపులకు గురవ్వుతున్నట్లు తెలిపారు. తనతో కలిసి జీవించాలని ఉందంటూ ఓం ప్రకాష్ మజిహిద్ తనతు చెప్పేవాడని మజిహిద్ పేర్కొన్నాడు. అయితే దీన్ని తన సమాజం, కుటుంబం అంగీకరించిందని ముజాహిద్ వ్యతిరేకించడంతో బెదిరింపులకు దిగేవాడని వాపోయాడు. అస్సలు తాను ఆస్పత్రికి రాలేదనని ఓం ప్రకాశ్నే ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చాడు. పడుకుని లేచి చూచేటప్పటికీ లింగ మార్పిడి శస్త్ర జరిగిపోయిందని భోరును విలపిస్తున్నాడు ముజాహిద్. ఓం ప్రకాష్ వైద్యలతో కుమ్మకై తనకు ఈ ఆపరేషన్ చేయించినట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ తన వద్దకు వచ్చి మగవాడిని కాస్త స్త్రీగా మార్చాను. "ఇక నువ్వు నాతోనే జీవించాలి లేదంటే నీ తండ్రిని చంపి మీకున్న భూమిని కూడా లాక్కుని లక్నో పారిపోతానని బెదిరించాడని". ముజాహిద్ కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేగాదు ఆస్పత్రి రికార్డులో సైతం అతడికి ఏదో వైద్య సమస్యతో అక్కడకు వచ్చినట్లు ఉండటం గమనార్హం. ఈ మేరకు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముజఫర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఓం ప్రకాష్ని అరెస్టు చేయడమే గాక ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా క్షణ్ణంగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనపై బీకేయూ కార్యకర్తల రైతు నాయకుడు శ్యామ్పాల్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఆస్పత్రిలో బాధితుల సమ్మతి లేకుండానే అవయవాల మార్పిడి, లింగ మార్పిడి వంటి రాకెట్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధకరమని, వెంటనే అందుకు గల బాధ్యుల తోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఆందోళనకారులు నిరసనలను విరమింప చేయడమే కాకుండా ఈ ఘటపై సత్వరమై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: బీచ్లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
విజయవంతంగా యువకుడి గుండె మార్పిడి
తిరుపతి తుడా: స్థానిక టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో శుక్రవారం ఓ యువకుడికి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఐదు గంటలు శ్రమించి వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు... కాకినాడకు చెందిన ఓ యువకుడు(24) గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ రెండు నెలలుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. అతనికి గుండె మార్పిడి అనివార్యమని గుర్తించారు. ఈ మేరకు నెల రోజుల కిందట ఆ యువకుడి వివరాలను అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేశారు. గుండె అందుబాటులోకి వచ్చే వరకు ఆ యువకుడిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.ఈ మేరకు అవయవదాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. దీంతో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు విశాఖ వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను సేకరించి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా 19 నిమిషాల్లో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు చేర్చారు. వెంటనే 2.15 గంటలకు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి, సాయంత్రం 7.15 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్యులను పలువురు అభినందించారు. 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు గుండె మార్పిడి ఆపరేషన్లలో తిరుపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మహా నగరాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్న గుండె మార్పిడి శస్త్రచికిత్సలను టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోనూ విజయవంతంగా చేపడుతున్నారు. ఈ ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే 2,560 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేశారు. అదేవిధంగా శుక్రవారంతో 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. -
టీమిండియా స్టార్ ప్లేయర్కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం
కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఠాకూర్కు శస్త్ర చికిత్స నిర్వహించారు.అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను ఠాకూర్ షేర్ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్గా ఠాకూర్ ఇచ్చాడు. కాగా ఠాకూర్ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్కు ఠాకూర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ సమీరా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాలకు సినిమాలకు గుడ్బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. అయితే ప్రస్తుతం సమీరా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటోంది. అయితే నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. కొందరు ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహాలిచ్చాలంటూ వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.సమీరా మాట్లాడుతూ..'నా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను' అని చెప్పింది. -
బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే సర్జరీ చేయించుకుంది. తన గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఇది జరిగి 10 రోజులు అవుతుండగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. తాజాగా రాఖీ వైద్య పరిస్థితిని తెలుపుతూ ఆమె మాజీ భర్త రితేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆమె మళ్లీ మనలో ఒకరిగా తిరగనుంది. తను నడవగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. బాధలో ఉంటే నవ్వులాటగా ఉందా?ఈ వీడియోలో రాఖీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రాఖీ సర్జరీ చేయించుకోబోతుందన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడారు. తనను దూషించారు. అలాంటివారిపై రితేశ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఒకరు బాధలో ఉంటే చూసి నవ్వడానికి మనసెలా వస్తుందో.. ఈ సమయంలో కూడా తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీరసలు మనుషులు కాదుఅవతలివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఎగతాళి చేస్తున్నవాళ్లు అసలు మనుషులే కాదు అని ఆగ్రహించాడు. రాఖీ పొట్టలో నుంచి తీసిన గడ్డను సైతం చూపిస్తూ.. ఇది ఎంత పెద్ద కణతో చూశారా? రాఖీకి మేమంతా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అయితే రాఖీ రెండో మాజీ భర్త మాత్రం ఇదంతా డ్రామానే అని కొట్టిపారేశాడు. లీక్డ్ వీడియోల కేసులో నుంచి తప్పించుకోవడానికే ఆపరేషన్ అని డ్రామా ఆడుతోందని విమర్శించాడు. View this post on Instagram A post shared by Ritesh Kumar (@riteshsinghofficialbb15) చదవండి: సన్ ఫ్లవర్లా స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే? -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్లోని బ్రెయిన్బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్లో ఉదయపూర్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
నిరుపేద కుటుంబంలో వెలుగులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్లో వెంటిలేటర్పై హైదరాబాద్ తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు. చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్క ట్వీట్తో స్పందించిన ప్రభుత్వం దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి. వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడిలా ఆదుకున్నారు రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి మా పిల్లల చదువులకు అండగా నిలిచారు ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి -
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్లోని పలువురు ఉద్యోగులు తాము కేట్ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చిన తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్కు ఫోన్చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
Hyderabad: కిడ్నీలో 418 రాళ్లు!
లక్డీకాపూల్: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్యూ వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల మహేష్ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్యూ వైద్య నిపుణులు సూచించారు. -
'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా శాంతి తన మదర్కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది. -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్లు, టెస్ట్లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్నాథ్ చెప్పుకొచ్చారు. -
ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు!
ఊపిరితిత్తుల్లో బొద్దింక! అదెలా సాధ్యం అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం వైద్యులే ఆ బొద్దింకను గుర్తించి కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కేరళకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మాములుగానే తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ సమస్య ఉన్నటుండి ఒకరోజు మరింత దారుణంగా ఉంది. ఇక అతడు తాళ్లలేక ఆస్పత్రిని ఆశ్రయించాడు. శ్వాసకోశ సమస్యలున్న ఆ వ్యక్తి ఆస్పత్రి చేరేటప్పటికీ పరిస్థితి మరింత దిగజారి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడమే చాల కష్టతరమయ్యింది. ఎందువల్ల ఇలా జరిగింది? అని పల్మనాలజీ వైద్య బృందం అతడికి పలు వైద్య పరీక్షలు చేశారు. చివరికి స్కానింగ్లో సుమారు 4 సెంటిమీటర్ల బొద్దింక ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల అతడి శ్వాసకోశ సమస్యలు మరింత జఠిలంగా మారాయని తెలుసుకున్నారు. ఇక వెంటనే వైద్యులు దాదాపు ఎనిమిది గంటలు శ్రమించి అతడికి సర్జరీ చేసి ఊపరితిత్తుల్లో ఉన్న బొద్దింకను తొలగించారు. అయితే ఇలా బొద్దింక వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. మరీ అతని ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా చేరిందని వైద్యులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆ రోగికి ఉన్న శ్వాసకోస సమస్యలు కారణంగా మెడలో శ్వాసనాళం అమర్చి దాని గుండా ఆక్సిజన్ని తీసుకునే ఏర్పాటు చేశారు వైద్యులు. అయితే అతడు రాత్రి పడుకునేటప్పుడూ ఆ ట్యూబ్ని మూసేయడం మరిచిపోవడంతో బొద్దింక లోపలకి ప్రవేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు డాక్టర్లు. (చదవండి: సారా టెండూల్కర్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు ఇవే!) -
షమీకి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ఎడమ కాలి మడమకు లండన్లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్కు పూర్తిగా అతను దూరమయ్యాడు. జూన్లో జరిగే టి20 ప్రపంచకప్ కల్లా అతను కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. 33 ఏళ్ల పేసర్ చివరిసారిగా గత ఏడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ‘ఆపరేషన్ సక్సెస్ అయింది. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరగా కోలుకొని నడవాలనుంది’ అని షమీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. షమీ వేగంగా కోలుకోవాలని ఎప్పట్లాగే కెరీర్ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లో ఆకాంక్షించారు. -
ఐపీఎల్ నుంచి షమీ అవుట్
భారత పేస్ బౌలర్ షమీ ఎడమ కాలి మడమ గాయం కారణంగా ఐపీఎల్–2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో లండన్లో ఈ గాయానికి చికిత్స తీసుకునే క్రమంలో మడమకు అతను ప్రత్యేక ఇంజక్షన్లు తీసుకున్నాడు. అయితే అవి ప్రభావం చూపించకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. త్వరలోనే అతను మళ్లీ లండన్కు వెళతాడు. వన్డే వరల్డ్ కప్లో 24 వికెట్లతో భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన షమీ ఆ తర్వాత మరే మ్యాచ్లోనూ బరిలోకి దిగలేదు. -
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్టాప్లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
కర్నూలు పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్ హెచ్వోడీ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి ఆదివారం వివరించారు. ♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి. వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్ హార్ట్ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం. ♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్ ఫెయిల్యూర్తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్ కవాటం చెడిపోయింది. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్లు గుర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్ ఆపరేషన్ చేయాలి. మైట్రల్ కవాటాన్ని ప్లాస్టిక్ కవాటంగా మార్చడమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్ చేయడం వంటి ప్రక్రియను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్ టెన్షన్ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది. ♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్ బాల్ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. -
AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. -
ఇదేం పిచ్చి! పెదవులు పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి..! అన్న సామెతో ఊరికే రాలేదేమో. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతలా అంటే? వారితో ఉండే కుటుంబ సభ్యులకు సైతం ఛీ అనిపించేలా జుగుప్సకరంగా ఉంటారు. పోనీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నచ్చచెప్పి మారుద్దామన్నా వినరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా మొండిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే బల్గేరియన్ మహిళ. తాను ప్రత్యేకంగా ఉండాలనకోవడం ఓకే. కానీ మరింత విలక్షణంగా ఉండాలనుకోవడం భరించలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలానే తన పెదాలే అందరికంటే పెద్దగా ఉండాలని ఏం చేసిందో వింట్ షాకవ్వుతారు. అసలేం జరిగిందంటే..బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇవనోవా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. ఎంతలా అంటే తనను తాను పూర్తిగా మార్చుకునేంత. అంటే పూర్తిగా ఆమె ఆహార్యం సైతం మారిపోవాలనుకుంటుంది. అందుకోసం సర్జరీలు కూడా చేసుకుని మార్చేసుకుంటుంది. ఏమోందో ఏమోగానీ! ఆమె పెదాలు పెద్దగా ఉండాలనుకుంది. అదికూడా ప్రంపంచంలో అందరికంటే తన పెదాలే పెద్దగా ఉండాలనేది ఆమె కోరిక. అలా ఉంటేనే తాను అందంగా ఉంటానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకోసం 2018 నుంచి పలు క్లినిక్లను సంప్రదించి వాటిలో ది బెస్ట్ కాస్మెటిక్ క్లినిక్ని ఎంచుకుని మరీ సర్జరీ చేయించుకుంది. ఈ ప్రక్రియను ఆమె 22 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది. 2019 నాటికి పెదవులకు సంబంధించి సుమారు 15 ఇంజెక్షన్లు తీసుకుంది. అలా ఇప్పటి వరకు దాదాపు 26కు పైగా లిప్ ఇంజెక్షన్లు తీసుకోవడం గమనార్హం. ఈ బ్యూటీ సర్జరీ కోసం ఆమె సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. అంతేగాదు ఈ పెద్ద పెదాలతో చాలా సంతోషంగా ఉన్నానని, పైగా ఇప్పుడు తాను చాలా అందంగా కనిపిస్తున్నాని చెబుతుండటం విశేషం. ఇప్పుడామె ఆమె అతి పెద్ద బుగ్గలు ఉండాలనుకుంటోందట. ఆ పనిలోనే ఉన్నానని కూడా చెబుతోంది. తాను ఏ సెలబ్రెటీలా ఉండకూడదని కోరుకుంటుందట. ఎప్పటికీ తాను చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తానని అంటోంది. ఆమె ఇలా అందం కోసం తన శరీరంలో చాలా భాగాలకు ఇలానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కూడా. ఇవేం వింత కోరికలో గానీ శరీరం మొత్తం సర్జరీలతో కుళ్లబొడిపుంచుకుంటోంది. పైగా లక్షలు లక్షలు ఖర్చుపెట్టేస్తోంది. అయితే ఇదంతా ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం ఉండదట. ఇలా అందం కోసం చేస్తున్న ప్రక్రియలన్నీ ప్రాణాంతకంగా మారుతాయమోనని ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారని సమాచారం. కానీ ఇవనోవా మాత్రం ముఖ సౌందర్యం కోసం ఇలాంటి ప్రక్రియలు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి బ్యూటీ సర్జరీలు చేయించుకుంటానని అంటోంది. పైగా సోషల్ మీడియాలో తానే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు కలిగి ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. View this post on Instagram A post shared by Andrea Ivanova (@andrea88476) (చదవండి: గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!) -
సర్జరీ చేస్తున్న టైంలో పేషెంట్పై డాక్టర్ దాడి! వీడియో వైరల్
ఓ వైద్యుడు విచక్షణ మరిచి సర్జరీ చేసే సమయంలో పేషెంట్పై దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. అతను అలా దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని సదరు ఆస్పత్రి బాధితుడికి నష్ట పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..2019లో జరిగిన ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు చైనా పేర్కొంది. దీనిపై ఇప్పుడు చైనా అధికారులు కూలంకషంగా ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఆక్టోజెనేరియన్ అనే 82 ఏళ్ల మహిళ కంటి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తుండగా, ఆమె అసహనంతో కదలిపోవడం ప్రారంభించింది. ఐతే రోగికి స్థానికి మాండలిక భాష మాత్రేమ తెలుసు. పాపం వైద్యుడికి ఆ భాషలో అంత ప్రావిణ్యం లేదు. అందువల్లో ఇరువరి మధ్య కమ్యూనికేషన్ కాస్త ఇబ్బందిగా మారింది. ఓ పక్క సర్జరీ టైంలో పేషెంట్ కనుబొమ్మలు కదిలించడం వంటివి చేశాడు. వైద్యుడు చెబుతున్నవేమి రోగికి అర్థంగాక అదేపనిగా కదలడంతో అసహనం చెందిన వైద్యుడు కొట్టడం జరిగింది. దీంతో ఆమె ఎడమ కన్ను పైభాగంలో గాయలయ్యాయి. అందుకు సదరు ఆస్పత్రి దాదాపు 500 యువాన్లు(రూ. 60, వేలకు పైనే) వరకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సదరు వైద్యుడిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా ఆ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో చైనా అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితురాలి కొడుకు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ..ఆ డాక్టర్ దూకుడు ప్రవర్తన కారణంగా ఎడమ కన్ను పైభాగంలో కూడా గాయలయ్యాయిని, ఐతే ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు ఆస్పత్రి సీఈవో, ఆ వైద్యుడిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో అలాంటి అనుచిత ప్రవర్తన తగదని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చైనా అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
కేసీఆర్ కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్
-
కేసీఆర్ ఆరోగ్యంపై ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కేటీఆర్కు ఫోన్ చేసి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ సమీపంలోని ఫామ్హౌస్లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్లో కాలుజారి పడిపోయారు. ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం.. యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్ -
నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్బీర్కు లిప్స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు. -
మార్క్ జుకర్బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
‘లేజర్’తో యాంజియోప్లాస్టీ..!
కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడ్డప్పుడు బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ వంటి అనేక ప్రక్రియలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఇటీవల అనేకమంది గుండెజబ్బుల బాధితులను రక్షిస్తున్న సంగతులూ తెలిసినవే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియను లేజర్ సహాయంతో మరింత సురక్షితంగా చేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని తేలింది. గుండెజబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకూ, పురోగతికీ ప్రతీక అయిన ఈ సరికొత్త ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి తెలుసుకునే ముందు కరోనరీ యాంజియోప్లాస్టి అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులున్నప్పుడు, శస్త్రచికిత్స చేయకుండానే... చేతి లేదా కాలి దగ్గరున్న రక్తనాళం నుంచి చిన్న పైపుల్ని పంపి గుండె రక్తనాళాల వరకు చేరతారు. ఇక్కడ అడ్డంకులను తొలగించడం, నాళం సన్నబడ్డ లేదా అడ్డంకి ఉన్న చోట బెలూన్ను ఉబ్బించి, నాళాన్ని వెడల్పు చేసి, స్టెంట్ వేసి, రక్తం సాఫీగా ప్రవహింపజేసే ప్రక్రియనే ‘కరోనరీ యాంజియోప్లాస్టీ’ అంటారు. ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారంటే... రక్తనాళాల్లో అడ్డంకులు/బ్లాకులనేవి అక్కడ కొవ్వు పేరుకుపోవడంవల్ల ఏర్పడతాయి. యాంజియోప్లాస్టీలో... ముందుగా బ్లాక్ ఉన్న రక్తనాళంలోకి ఓ పైప్ను ప్రవేశపెడతారు. దీన్ని ‘గైడింగ్ క్యాథేటర్’ అంటారు. ఆ పైపులోంచి వెంట్రుక అంత సన్నటి తీగను... అడ్డంకిని సైతం దాటేలా... రక్తనాళం చివరివరకు పంపిస్తారు. ఈ సన్నటి తీగనే ‘గైడ్ వైర్’ అంటారు. ఒకసారి గైడ్ వైర్ అడ్డంకిని దాటి చివరి వరకు వెళ్లాక, గైడ్ వైర్ మీది నుంచి ఒక బెలూన్ని బ్లాక్ వరకు పంపిస్తారు. బ్లాక్ను దాటి వెళ్ళగానే, ఆ బెలూన్ని పెద్దగా ఉబ్బేలా చేస్తారు. ఒకసారి బెలూన్ సహాయంతో, రక్తనాళాన్ని తగినంతగా వెడల్పు చేశాక... ఆ బెలూన్ని వెనక్కి తీసుకువచ్చి, దాని స్థానంలో ఒక స్టెంట్ని ప్రవేశపెడతారు. స్టెంట్ అనేది లోహంతో తయారైన స్థూపాకారపు వల (జాలీ) వంటి పరికరం. ఇలా ఈ స్టెంట్ను... వేరొక బెలూన్ సహాయంతో బ్లాక్ ఉన్నచోట అమరుస్తారు. అలా అమర్చిన స్టెంట్ ని వేరొక బెలూన్తో బాగా ఎక్కువ ఒత్తిడితో రక్తనాళం గోడకు పూర్తిగా అనుకునేలా చూస్తారు. దీంతో యాంజియోప్లాస్టీ పూర్తవుతుంది. యాంజియోప్లాస్టీలో వచ్చే ఇబ్బందులు కొన్నిసార్లు యాంజియోప్లాస్టీని నిర్వహించే సమయంలో గైడ్ వైర్ బ్లాక్ను దాటి ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఒక్కో సారి... దాటి వెళ్ళినప్పటికీ, దానిమీది నుంచి బెలూన్ వెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల... బెలూన్తో ఉబ్బించే ప్రక్రియ చేసినప్పటికీ... ఆ బ్లాక్ తొలగకపోవచ్చు. ఇంకొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో రక్తం గడ్డకట్టడం వల్ల బెలూనింగ్ చేసినప్పుడు... ఆ రక్తం గడ్డలు నాళంలోనే మరోచోటికి వెళ్లి, రక్త ప్రవాహానికి అవరోధంగా మారవచ్చు. ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి ఇప్పుడు లేజర్ ప్రక్రియని వాడుతున్నారు. అసలు లేజర్ అంటే ఏమిటి? ‘లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’ అన్న పదాల సంక్షిప్త రూపమే ‘లేజర్’. దీని సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పవచ్చు. మామూలుగా కాంతి కిరణాలు నిర్దిష్టమైన వేవ్లెంగ్త్తో ప్రసరిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన ఏకరీతితో మరింత శక్తిమంతంగా ప్రసరింపజేసినప్పుడు వెలువడే కిరణాన్ని ‘లేజర్’ అనవచ్చు. శక్తిమంతమైన ఈ కాంతికిరణాల్ని (లేజర్లను) అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వైద్య చికిత్సల్లోనూ అనేక రకాలైన లేజర్లు వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేక లేజర్లలో గుండె కోసం వాడే వాటిని ‘ఎగ్జిమర్ లేజర్’ అంటారు. లేజర్తో అడ్డంకుల తొలగింపు ఎలాగంటే...? లేజర్ కిరణాలు మన కణజాలాలని తాకినప్పుడు మూడు రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. అవి... ఫొటో కెమికల్, ఫొటో థర్మల్, ఫొటో కైనెటిక్ ఎఫెక్ట్స్. ఈ ప్రభావాల సహాయంతో అక్కడ పేరుకున్న వ్యర్థ కణజాలాన్ని (దాదాపుగా) ఆవిరైపోయేలా చేయవచ్చు. రక్త నాళంలోని అడ్డంకులనూ అదేవిధంగా ఆవిరైపోయేలా చేయడానికి లేజర్ సహాయం తీసుకుం టారు. ఏయే దశల్లో లేజర్ను ఎలా ఉపయోగిస్తారంటే... గైడ్ వైర్ మీదనుంచి బెలూన్ వెళ్లలేకపోయిన సందర్భాల్లో లేదా బెలూన్ ద్వారా బ్లాక్ను మార్చలేకపోయినప్పుడు. ∙రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన బ్లాక్స్ ఉన్నప్పుడు, అవి మరోచోటికి చేరి మళ్లీ రక్తప్రవాహానికి అవరోధంగా మారకుండా చూడటానికి. గుండె రక్తనాళాల్లో సంపూర్ణంగా, చాలాకాలం నుంచి ఉండిపోయిన మొండి బ్లాక్లను తొలగించడానికి. ∙కాల్షియం అధికంగా ఉన్న గుండె రక్తనాళాల్లో బ్లాక్ని తొలగించడానికి. ఒకసారి వేసిన స్టెంట్లో మరోసారి అడ్డంకి బ్లాక్ ఏర్పడినప్పుడు రక్తనాళం మొదట్లో ఉన్న అడ్డంకులు, లేదా మరీ పొడవుగా ఉన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు. ఇది యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయమా? సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో లేజర్ యాంజియోప్లాస్టీ అన్నది... సంప్రదాయ యాంజియోప్లాస్టీ కన్నా తక్కువ ఖర్చుతో రక్తనాళంలోని అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. లేజర్ని యాంజియోప్లాస్టిలో ఒక అనుబంధ విధానంగా వాడుకోవచ్చుగానీ లేజర్ అనేదే ఆంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు. బాధితులందరికీ ఈ లేజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. లేజర్కు అయ్యే ఖర్చు ఎక్కువే కాబట్టి... కేసు తీవ్రతను బట్టి ఎవరికి అవసరం అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ణయించే అంశమిది. కేవలం చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది అవసరం పడవచ్చు. --డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?) -
జీజీహెచ్లో ‘వోకల్ పెరాలసిస్’కు అరుదైన శస్త్రచికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వోకల్ కార్డు (స్వరతంత్రి) కుడి వైపు పెరాలసిస్(పక్షవాతం)కు గురై సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగికి ఈఎన్టీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి మరలా మాట్లాడేలా చేయగలిగారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స గురించి ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి శుక్రవారం మీడియాకు వివరించారు. ఒంగోలుకు చెందిన డ్రైవర్ అప్పయ్య స్వర సమస్యతో చికిత్స కోసం తమ విభాగానికి రాగా, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వోకల్కార్డు కుడివైపు పెరాలసిస్ వచ్చినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నెల 17న వీడియో ఎండోస్కోపీ ద్వారా స్వరాన్ని విశ్లేషిస్తూ థైరోప్లాస్టీ–1 అనే అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి మామూలుగా మాట్లాడగలుగుతున్నారని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో ఈఎన్టీ వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రత్నబాబు, శ్రీనివాస్, ఆదిత్య, స్పందన, వర్థిని, పీటర్లతో పాటు పీజీ విద్యార్థులు, స్పీచ్ థెరపిస్ట్ జి గాయత్రి, మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ లవకుమార్ పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అభినందించారు. -
విజయవంతంగా గుండెమార్పిడి
సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 22 ఏళ్ల యువకుడికి తిరుచ్చికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గుండెను అవయవ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చారు. విజయవంతం కావడంతో ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. సోమవారం చైన్నె గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోవిని బాల సుబ్రమణియన్ వివరాలను మీడియాకు వివరించారు. చైన్నెకు చెందిన యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ద్వారా అతడిని చికిత్స నిమిత్తం మే నెలలో గ్లెనెగల్స్కు తరలించారు. ఆర్గాన్ రిజిస్టర్డ్ జాబితా మేరకు తిరుచ్చిలో బ్రెయిన్ డెడ్కు గురైన 30 ఏళ్ల వ్యక్తి గుండెను ఈ యువకుడికి దానం చేశారు. గత నెల 13వ తేదీ ఐదు గంటల పాటుగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. తనకు పునర్జన్మ దక్కడంతో వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. -
పుత్తూరు వైద్యానికి రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఫిదా!
మాది తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు పట్టణం. నా పేరు వీ.బాబు. బాత్రూమ్లో జారిపడ్డాను. నా ఎడమ చేయి విరిగింది. పుత్తూరు కట్టు గురించి నాకు అవగాహన ఉంది. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చి కట్టు కట్టించుకున్నాను. మూడుకట్లు పూర్తయ్యాయి. నొప్పి లేదు. చేయి మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడి డాక్టర్ల నైపుణ్యం వెలకట్టలేనిది. నా పేరు కే.కన్నభిరామ్. మా ఊరు కాంచీపురం, తమిళనాడు రాష్ట్రం. మోటర్ సైకిల్పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను. నా కుడి కాలు తొడ ఎముక విరిగిపోయింది. మూడో కట్టు కట్టుకోవడానికి వచ్చాను. ఈ కట్టుతో నడవగలుగుతానని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి నొప్పి పూర్తిగా తగ్గింది. ఇక్కడ ఫీజు మేము ఇచ్చినంతే తీసుకుంటున్నారు. మానవుని శరీరం మొత్తం ఎముకల గూడు. ఏ అవయవానికి దెబ్బతగిలినా ఆ వ్యక్తి విలవిల్లాడాల్సిందే. అలాంటిది ఏకంగా ఎముకే విరిగిపోవడం, కీళ్లు తొలగిపోవడం లాంటివి జరిగితే ఆ వ్యక్తి బాధ వర్ణణాతీతం. ఇలా విరిగిన, తొలగిన ఎముకలను ఎలా అతికించాలి, ఎలా సరిచేయాలి, నడవలేని వ్యక్తిని ఎలా నడిపించాలి..? అన్న ప్రశ్నలకు సమాధానం ‘పుత్తూరు శల్యంవైద్యం’. నేడు ఆధునిక వైద్య విధానాలు వచ్చినా.. పుత్తూరు కట్టు ముందు అన్నీ తీసికట్టు. ఇది రాజులకు లభించిన వరప్రసాదం. పేద రోగులకు ఆరోగ్యప్రదాయం. వందేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న పుత్తూరు శల్యవైద్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, తిరుపతి: పుత్తూరు శల్యవైద్యం దైవానుగ్రహంగా ‘రాజు’లకు లభించిన వరప్రసాదం. ఇదే విషయాన్ని సూరపరాజు సుబ్బరాజు వంశస్థులు ఈ వైద్యం పుట్టుక గురించి చెబుతుంటారు. పుత్తూరు మండలం, రాచపాళెంలో 1922లో ఈ వైద్యం పురుడుపోసుకుంది. సూరపరాజు సుబ్బరాజు ఓ రోజు అడవిలో వేటకు వెళ్లి వేటాడిన మాంసపు ముక్కలను చెట్ల ఆకుల్లో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆకుల్లోని ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదే ఆకులతో ఎముకలు విరిగిన జంతువులకు కట్టుకట్టడం.. ఆ తర్వాత మనుషులకు కట్టుకట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పుత్తూరు శల్య వైద్యం అప్రహితంగా కొనసాగుతోంది. రాచపాళెం గ్రామం నుంచే నేటికీ ఇదే వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. శల్య వైద్య విధానం ఎక్స్రే తీయరు. మత్తు మందు ఇవ్వరు. చేతి మునివేళ్లతోనే ఎముక విరిగిందా లేదా గుర్తిస్తారు. తర్వాత తమ రెండు చేతులతో విరిగిన ఎముకలను సరిచేసి కట్ట్టుకడుతారు. ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆకు పసరుకు కాసింత గుడ్డ, రెండు కోడి గుడ్లు తెల్లసొన, రెండు వెదురు దబ్బలే ఈ వైద్యానికి పరికరాలు. ఎముక విరిగిన, తొలగిన భాగాన దూదిని ఉంచి ఆకు పసరు రాసి గుడ్డ చుడుతారు. ఎముక భాగం కదలకుండా వెదురు దబ్బలను పెట్టి కట్టుకడతారు. ఏడు రోజులకు ఒకసారి వంతున మూడు కట్లు కడతారు. అంతే గాయం నయమవుతుంది. ఇచ్చినంతే ఫీజు రాచపాళెంలోని ప్రధాన ఆస్పత్రిలో పది రూపాయల రశీదు తీసుకొని లోపలికి వెళితే పది నిమిషాల్లో కట్టు కట్టేస్తారు. తర్వాత రోగి తనకు తోచింది ఇస్తే డాక్టర్ ఫీజుగా తీసుకుంటారు. పూర్వీకుల వివరాలు పుత్తూరు శల్యవైద్య వ్యవస్థాపకులు సూరపరాజు సుబ్బరాజు. ఈయనకు నలుగురు తమ్ముళ్లు. వీరిలో ఎస్.మార్కొండేయరాజు, ఎస్.గంగరాజు ఇదే వృత్తిని కొనసాగించారు. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఎస్.చెంగల్రాజు, ఎస్.వెంగమరాజు వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, వారి కుమారులైన ఎస్.ప్రకాష్రాజు, కన్నయ్యరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. గంగరాజు కుమారుడైన ఎస్.కృష్ణమరాజు, మార్కొండేయరాజు కుమారులైన రామరాజు, సుబ్రమణ్యంరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. పాత తరంలోని ఎస్.కృష్ణమరాజు, ఎస్.ప్రకాష్రాజుతో పాటు సుబ్రమణ్యంరాజు కుమారుడు ఎస్.ప్రతాప్రాజు, కన్నయ్యరాజు కుమారుడు ఎస్.బాలసుబ్రమణ్యంరాజు ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రముఖులు ఫిదా! పుత్తూరు శల్యవైద్యం పొంది ఉపసమనం పొందిన వారిలో మాజీ రాష్ట్రపతులు వీవీ.గిరి, నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు టీ.అంజయ్య, నందమూరి తారక రామారావు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన వారు విజిటర్స్ బుక్లో తమ వివరాలను పొందుపరచడం విశేషం. పేదలకు పూర్తి ఉచితం మా పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్యమిది. మాది నాల్గోతరం. మా వైద్యంలో సక్సస్ రేటు 99.9 శాతంగా ఉంది. వందేళ్ల చరిత్రే ఇందుకు నిదర్శనం. పేదలతోపాటు పుత్తూరు వాసులకు పూర్తి ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలోనే 25 గదులను రోగులకు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రి సమీపంలోనే టీటీడీ వారిచే మరో 25 గదులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎస్.కృష్ణమరాజు, మేనేజింగ్ డైరెక్టర్, పుత్తూరు శల్యవైద్యశాల -
ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం ఆయన యూరప్ వెళ్లాడు. ఆ సర్జరీ సస్సెస్ఫుల్గా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూరప్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల వరకు ప్రభాస్ రెస్ట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఎండింగ్ తిగిరి ఇండియాకు రానున్నట్లు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్లో పాల్గొంటారట. అసలేం జరిగింది? బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్కు మోకాకి నొప్పి సమస్య వచ్చింది. ఆ మధ్య తాత్కాలిక చికిత్స తీసుకొని షూటింగ్లో పాల్గొన్నారు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ మోకాలి నొప్పితోనే పూర్తి చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రతరం కావడంతో సర్జరీ చెయించుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్యాప్లో ఆపరేషన్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది.అయితే అనూహ్యంగా వాయిదా పడింది. ఈ విషయం ప్రభాస్కి ముందే తెలియడంతో ప్రాజెక్ట్ కే(కల్కీ 2898 ఏడీ), మారుతి సినిమాల షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లాడు. శస్త్ర చికిత్స పూర్తి చేసుకొని 15 రోజుల్లో తిరిగి రావాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే వైద్యుల సలహా మేరకు దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండి రెస్ట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తిరిగి రాగానే ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలను కాపాడాలి
గన్నవరం రూరల్: ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్ గుణశీలన్ రాజన్ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు. వారియర్స్ ఆఫ్ది ఫేస్ అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు. ఏవోఎంఎస్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.మణికందన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కె.వై.గిరి, ఏవోఎంఎస్ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కిరణ్కుమార్, ఏవోఎంఎస్ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్ శివనాగేందర్రెడ్డి, డాక్టర్ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
విదేశాలకు ప్రభాస్.. సర్జరీ కోసమేనా!
ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన సలార్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. మరోవైపు ప్రాజెక్ట్ కే(కల్కీ 2898 ఏడీ) షూటింగ్ పనులు చకచకగా జరుగుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా సెట్పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్లో కూడా ప్రభాస్ పాల్గొన్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ మధ్యే ఓ భారీ ఫైట్ సీన్ షూటింగ్లో పాల్గొన్నారట. (చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..) లాంగ్ ట్రిప్ సలార్ వాయిదా పడడంతో ప్రభాస్ విదేశీ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. సలార్ వాయిదా విషయం ఈ రోజు అధికారికంగా ప్రకటించారు కానీ చిత్ర యూనిట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. ఈ విషయం ప్రభాస్కు కూడా తెలుసు. అందుకే ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాల షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లాడట. అందుకే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాడట. దాదాపు 15 రోజుల తర్వాత తిగిరి హైదరాబాద్కు వస్తాడట. ఈ లోపు ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాల్లో హీరో అవసరం లేని సన్నివేశాల షూటింగ్స్ జరుపుకుంటారట. ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి రాగానే ఆయనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ని ప్లాన్ చేస్తారట. సర్జరీ కోసమే! ప్రభాస్ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసు కానీ..ఏ దేశం వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు అనేది మాత్రం ఎవరూ రివీల్ చేయడం లేదు. కానీ సర్జరీ కోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో ప్రభాస్కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. సర్జరీ అనంతరం విదేశాల్లోనే రెండు వారాల పాటు ఉండి విశ్రాంతి తీసుకుంటారట. ఆ తర్వాత భారత్కి తిగిరి వచ్చి షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొంటారట. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?
కమెడియన్స్ తెర వెనుక పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కెమెరా ముందు నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్లు వేసి నవ్వించేవారి బాధలు అన్నీఇన్నీ కావు. అమ్మాయిలా చీర కట్టుకున్నందుకు వారిని సూటిపోటి మాటలతో వేధిస్తుంటారు. కొందరు మాత్రం తమలో ఉన్న ఆడతనాన్ని అర్థం చేసుకుని అచ్చమైన మహిళగా మారిపోతారు. ఆ జాబితాలోకే వస్తుంది ప్రియాంక సింగ్. మెడిసిన్లో సీటు వదిలేసి సాయితేజగా పరిచయమైన ఆమె తర్వాతి కాలంలో సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారిపోయింది. ఆ మధ్య బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే జబర్దస్త్లోని మరో లేడీ కంటెస్టెంట్ సాయిలేఖ కూడా ట్రాన్స్జెండర్గా మారిపోయిందంటూ చాలాకాలంగా ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఈ పుకారుపై సాయి స్పందించాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సాయి మాట్లాడుతూ.. 'నా అసలు పేరు వెంకటసాయిప్రసన్న కుమార్. ఇంటర్ అయిపోయాక మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది. ఓసారి ఈవెంట్కు వచ్చినప్పుడు హైపర్ ఆది అన్నవాళ్లు నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా.. సెలబ్రిటీ అయిపోతే నీతో కూడా ఫోటోలు దిగుతారు అని చెప్పాడు. నాన్న చాలా బాధపడ్డాడు అప్పుడు నేను హైదరాబాద్కు వచ్చి రెండు, మూడు ఎపిసోడ్లు చేసి తిరిగి కాలేజీకి వెళ్లిపోయాను. కానీ అక్కడున్నవాళ్లు అప్పుడే అయిపోయిందా? అని హేళన చేశారు. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. కష్టమైనా, ఏదైనా సరే అని కామెడీ షోలో రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొనసాగుతున్నాను. మొదట్లో మా నాన్న చాలా బాధపడ్డాడు. డాక్టర్ చదవాల్సినవాడు చీర కట్టుకుని మేకప్ వేసుకుని జబర్దస్త్లో చేస్తున్నాడు, మీకేం అనిపించట్లేదా? అని ఇరుగుపొరుగువారు మా నాన్నను సూటిపోటి మాటలనేవారు. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు తర్వాత అర్థమైంది. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయా? నేను సర్జరీ చేసుకున్నానా? అని అడుగుతున్నారు. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిలాగా ఉంటారు, లేదంటే ఉండరు అని కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చీర నేను కట్టుకుంటేనే అందంగా కనిపిస్తాను అనిపించేది. ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటినుంచే మొదలయ్యాయి. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం. నేను ఎలా ఉంటే వాళ్లకేంటి? సర్జరీ చేయించుకోవాలని కాదు. కానీ నాకు నచ్చినట్లు బతుకుతున్నాను. డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు నాకు వంశీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఓ రోజు నాకు రాత్రి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయాను. అప్పుడు వంశీయే ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. నేను బతుకుతానో, లేదో కష్టమని..ముందు సంతకం పెట్టాకే చికిత్స ప్రారంభిస్తామన్నాడు డాక్టర్. అతడు మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్లకు ఒకమాట చెప్పి సంతకం చేసి డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు. అతడి దగ్గర ఉన్న రూ.2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆరోజు ఆయన అలా సాయం చేయకపోయుంటే ఈరోజు సాయిలేఖ ఉండేదే కాదు. తనంటే నాకు నిజంగానే చాలా ఇష్టం' అని అని చెప్తూ ఎమోషనలయ్యాడు సాయి. చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) -
తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్!
మనిషి నిటారుగా నిలబడటానికి, కూర్చోడానికి, పరుగెత్తడానికి... ఒక్కమాటలో చెప్పాలంటే రోజులో చేయాల్సిన చాలా పనులకు తోడ్పడేది తుంటి ఎముక కీలు. తుంటి ఎముకలో సాకెట్ లాంటి గుండ్రటి ఖాళీ స్థలం ఉంటుంది. సరిగ్గా ఆ ఖాళీలో అమరిపోయేలా తొడ ఎముక చివరన బంతిలాంటి భాగం ఉండి, ఈ రెండింటి కలయితో కీలు (జాయింట్) ఏర్పడుతుంది. ఈ కీలు వల్లనే రోజువారీ చేసే అనేక పనులు సాధ్యమవుతాయి. ఇటీవల అనేక కారణాలతో... అంటే... వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్తో, తుంటి ఎముకలో అరుగుదల వల్ల, యాంకలైజింగ్ ఆర్థరైటిస్తో, మరీ ముఖ్యంగా ఇటీవల కరోనా తర్వాత పాతికేళ్ల లోపు యువతలో సైతం అవాస్క్యులార్ నెక్రోసిస్ కారణంగా తుంటి ఎముక అరగడం, విరగడం చాలా సాధరణమయ్యింది. ఇలాంటప్పుడు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయడం అవసరమవుతుంది. అయితే ఇదే శస్త్రచికిత్సను ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ పద్ధతిలో కాస్త వైవిధ్యంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ నితీశ్ భాన్. ఈ పద్ధతి అంటే ఏమిటో, దాని వల్ల ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే... ప్రశ్న : యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనాలేమిటి? నితీశ్ భాన్ : ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర, అసలు సంప్రదాయబద్ధంగా (కన్వెన్షనల్గా) చేసే ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలియాలి. అప్పుడు దానికీ దీనికీ తేడాలేమిటి అనేవి తెలుస్తాయి. నిజానికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని మూడు రకాలుగా చేస్తారు. అవి... మొదటిది పిరుదు వెనకభాగం నుంచీ, రెండోది కాస్త పక్కగా చేసేవి. వీటినే పోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్గా చెప్పవచ్చు. ఇందులో మూడోది... మనం యాంటీరియర్గా చెప్పే...కాలి ముందు వైపు నుంచి చేసే శస్త్రచికిత్స. సాధారణంగా ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో పిరుదు దగ్గర ఉండే మూడు కండరాల సముదాయంలో పెద్దదైన ‘గ్లుటియస్ మాక్సిమస్’ అనే పెద్ద కండరాన్నీ, మరికొన్ని కీలకమైన కండరాల్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇలా కండరాలను కట్ చేసి, తుంటి కీలు వరకు వెళ్లాక కీలు మార్పిడి ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కానీ... అతి పెద్దవీ, కీలకమైన కండరాలను కట్ చేయడం వల్ల గాయం తగ్గి, అంతా నయం కావడానికి కనీసం ఐదారు నెలలు పట్టవచ్చు. అయితే ‘యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో ఇలా కీలకమైన కండరాల కోత అవసరముండదు కాబట్టి ఇది తగ్గడానికి 12 రోజులు చాలు. ప్రశ్న : శస్త్రచికిత్స ఏదైనప్పటికీ... ఆర్నెల్ల తర్వాతైనా అంతా మునపటిలా ఉంటుందా? నితీశ్ భాన్ : అదే చెప్పబోతున్నా. గ్లుటియస్ మాక్సిమస్ లాంటి అతి పెద్ద కండరం కట్ చేయడం వల్ల ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ శస్త్రచికిత్స తర్వాత అనేక ప్రతిబంధకాలూ, ప్రతికూలతలు ఉంటాయి. మనం నిలబడటానికి, కూర్చోడానికి, కూర్చున్న తర్వాత లేవడానికి, కదలడానికి, నడవడానికి, పరుగెత్తడానికి... ఇలా చాలా కదలికలకు తోడ్పడే కండరం కావడంతో... హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత అనేక ఆంక్షల్ని పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకవైపు ఒరిగి పడుకున్నప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా తీసుకురాకూడదు. కూర్చున్నప్పుడు పాదాలు లోపలివైపునకు ఉండేలా కాళ్లు దగ్గరగా పెట్టుకోకూడదు. కూర్చుని ముందుకు వంగ కూడదు. కూర్చుని కాళ్లు ముడిచినప్పుడు 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీలు లోపలికి ముడవలేం. కూర్చుని ముందుకు వంగి సాక్స్ తొడగలేము, షూలేసులు కట్టుకోలేం. అంతెందుకు... సోఫాలో నిర్భయంగా, నిశ్చింతగా, సౌకర్యంగా కూర్చోడానికీ జాగ్రత్త ΄ాటించాలి. ఎందుకంటే ΄ోస్టీరియర్ పద్ధతిలో కీలు మార్పిడి తర్వాత... ప్రతి కదలికలోనూ కీలు తన స్థానం నుంచి తొలగి ΄ోయేందుకు (డిస్లొకేషన్కు) అవకాశం ఉంటుంది. ΄ోస్టీరియర్లో గాయం తగ్గేందుకు ఆర్నెల్లు పట్టడం, ప్రతి కదలికలోనూ జాగ్రత్త వహించాల్సిరావడం, డిస్లొకేషన్ రిస్క్ ఉండటంతో చికిత్స తర్వాతా నిశ్చింతగా ఉండటం సాధ్యం కాదు. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్పై ప్రభావం చూపుతుంది. ప్రశ్న : మరి యాంటీరియర్తో ప్రయోజనం ఏమిటి? నితీశ్ భాన్ : ఇంతకుమునుపు చెప్పుకున్న ప్రతి బంధకాలేమీ ఉండవు. ΄ాటించాల్సిన ఆంక్షలు ఒక్కటి కూడా ఉండవు. అంటే జీరో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎందుకంటే.... యాంటీరియర్ శస్త్రచికిత్సలో చిన్న గాటు తప్ప పెద్ద లేదా కీలకమైన కండరాలు వేటినీ కోయనక్కర్లేదు. దీంతో కండరాలు దెబ్బతినడం చాలా చాలా తక్కువ (లెస్ టీష్యూ డ్యామేజ్); కోలుకునే వేగమూ చాలా ఎక్కువ. అక్కడ కోత గాయం మానడానికి ఆర్నెల్లు పడితే, ఇక్కడ కేవలం 10, 12 రోజులు చాలు. నేను చేసిన కొన్ని శస్త్రచికిత్సల్లో రెండో రోజే పరుగెత్తడం, కొన్ని రోజుల వ్యవధిలోనే వాహనాలు నడపడం జరిగింది. వైద్య గణాంకాల ప్రకారం... యాంటీరియర్లో ఇలాంటి డిస్లొకేషన్కు అవకాశాలు కేవలం 1 శాతం లోపే. ఆస్ట్రేలియన్ జాయింట్ రిజిస్ట్రీ ప్రకారం ΄ోస్టీరియర్ పద్ధతిలో డిస్లొకేషన్ రిస్క్ 21.1 శాతం కాగా... యాంటీరియర్లో ఇది కేవలం ఒక శాతం కంటే కూడా తక్కువే. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలైతే, ఇప్పటివరకు నేను నిర్వహించిన దాదాపు 450 పైగా సర్జరీల్లో హిప్ డిస్లొకేషన్ అయిన కేసు, ఫెయిలైన కేసు ఒక్కటి కూడా లేనే లేదు. ప్రశ్న : మరి అందరూ యాంటీరియర్ పద్ధతిలోనే చేయవచ్చుగా? నితీశ్ భాన్ : ఇది సాంకేతికంగా, సునిశితత్వం çపరంగా చాలా ఎక్కువ నైపుణ్యాలు అవసరమైన శస్త్రచికిత్స. దీనికి చాలా నేర్పు కావాలి. సర్జరీ నిర్వహణను ఒక గ్రాఫ్లా గీస్తే సునిశితత్వం, నేర్పూ, నైపుణ్యాలూ ఇవన్నీ ఒక నిటారైన గీతలా ఉంటాయి. అంటే... యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో అంత సక్లిష్టత ఉంటుందన్నమాట. అందుకే దాదాపు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేసేవారిలో పన్నెండేళ్ల కిందట దేశంలో ఆరేడుగురి కంటే ఎక్కువ లేరు. ఇప్పటికీ నా అంచనా ప్రకారం మహా అయితే తొమ్మిది మది ఉండి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే సీనియర్. అంతెందుకు విదేశాల నుంచి కూడా వచ్చి... ముంబైలో కుదరక΄ోవడంతో... అక్కడున్నవారితో వాకబు చేసుకుని... అక్కడ్నుంచి ఇక్కడికి వస్తుంటారు. ప్రశ్న : ఈ యాంటీరియర్ హిప్ రీ–ప్లేస్మెంట్ సర్జీరీకి ఫీజులెలా ఉంటాయి? నితీశ్ భాన్ : హిప్ రీప్లేస్మెంట్లో ఏ రకమైనా ఒకేలాంటి ఫీజు ఉంటుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత రీప్లేస్మెంట్ కోసం ఉపయోగించే కృత్రిమ కీలు (ప్రోస్థటిక్ జాయింట్)కే వేర్వేరు ధరలుంటాయి. డాక్టర్ నితీశ్ భాన్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ నీ – హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ (చదవండి: శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?) -
యంగ్ హీరో శర్వానంద్కి సర్జరీ!?
యంగ్ హీరో శర్వానంద్ త్వరలో సర్జరీ చేసుకోనున్నాడట. ఈ విషయమై అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అభిమానులు కంగారు పడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అసలేం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? డిఫరెంట్ మూవీస్తో ఎంటర్టైన్ చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. 'రన్ రాజా రన్' నుంచి రూట్ మార్చి.. ఫన్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'బేబీ ఆన్ బోర్డ్' మూవీతో బిజీగా ఉన్న ఇతడు.. సర్జరీ కోసం అమెరికా వెళ్లాడనే విషయం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) గతంలో 'జాను' షూటింగ్ సందర్భంగా చాలా ఎత్తు నుంచి శర్వా పడిపోయాడని, చాలా గాయాలు అయ్యాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే గాయాలు మానిపోయినప్పటికీ.. నొప్పి మాత్రం అలానే ఉండిపోయిందట. ఇప్పుడు దాన్ని సర్జరీతో క్లియర్ చేసుకునేందుకే యూఎస్ వెళ్లాడని అంటున్నారు. ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీసే సినిమాలో నటిస్తాడు. అలానే చిరంజీవి కొత్త సినిమాలోనూ శర్వా.. కీలకపాత్ర చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మధ్యే రక్షితా అనే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!
ఈ రోజే నేషనల్ హ్యాండ్ సర్జరీ డే. పనిచేసే చోటే చేతులకు ఎదురయ్యే సమస్యలు నిర్లక్క్ష్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజుని ఏర్పాటు చేశారు. వర్క్ప్లేస్లో అదేపనిగా చేసే పనుల వల్ల చేతివేళ్లు, కండరాలకు ఎదురయ్యే అంతర్గత సమస్యల కారణంగా చేతులు నొప్పి పుట్టడం లేదా కదలించలేని స్థితికి వస్తుంది. చాలామంది అదే సర్దుకుంటుందని లక్క్ష్యపెట్టరు. దీంతో ఆ సమస్యలు తీవ్రమై సర్జరీ చేయించుకునే స్థితికి దారితీస్తుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? దీనికి నివారణ తదితరాల గురించే ఈ కథనం. కార్యాలయాల వద్ద చేసే పనిని బట్టి చేతులకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వుతాయి. కెమికల్స్కి సంబంధించిన వాటిలో పనిచేస్తే చేతులు చర్మానికి సంబంధించిన ఎలర్జీల బారినపడే అవకాశం ఉంటుంది. ఇక కంప్యూటర్ తదితర వాటి వద్ద పనిచేసే వాళ్ల అయితే ..అదే పనిగా టైప్ చేయడంతో పునరావృత ఒత్తిడితో కూడిన గాయాలు(ఆర్ఎస్ఐ) బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాయింట్ పెయిన్లు, లేదా వేళ్లు వద్ద కండరాలు దెబ్బతినడం లాంటివి. ఆ నొప్పి తీవ్రమైన ఛాతీ వరకు వ్యాపించటం జరుగుతుంది. చివరికి చేతిని పైకెత్తడం కాదుకదా! కనీసం కదపలేని స్థితికి వస్తారు. చాలమటుకు అందరూ వీటిని అలక్క్ష్యపెడతారు. పెద్ద సమస్యగా గుర్తించరు. పైగా తేలిగ్గా తీసుకుంటారు. అందుకోసమే ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ముఖ్యోద్దేశంతో ఈ నేషనల్ "హ్యాండ్ సర్జరీ డే" అనే దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దీన్ని ఆగస్టు 23న జరుపుకుంటారు. ఈ గాయాలను ఎలా గుర్తించాలి అదేపనిగా చేసే పనుల వల్ల చిటికెలు వద్ద కండరాలు రాపిడికి గురవ్వటం, లేదా జాయింట్లు తప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అవే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లేదా రేనాడ్స్ సిండ్రోమ్కి దారి తీస్తుంది. కటింగ్ పనులు చేసేవారికైతే తరచుగా లోతుగా అయ్యే గాయాలు మరింత తీవ్రమై రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. మనం కూర్చొనే తీరు, సమీపంలోని వస్తువులు, పరికరాల కారణంగా కూడా ఈ ఆర్ఎస్ఐ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పూణే రూబీ హాల్ క్లినిక్కి చెందిన ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కిరణ్ ఖరత్ తెలిపారు. పునరావుత ఒత్తడితో కూడిన గాయాలు(ఆర్ఎస్) లక్షణాలు.. చేతులు నొప్పి పుట్టడం లేదా ఒకవిధమైన జలధరింపుకు గురవ్వుతారు. కొందరిలో తిమ్మిర్లు వచ్చి అసౌకర్యంగా ఫీలవుతారు. మణికట్టు లేదా ముంజేయి నుంచి భుజం వరకు ఆ సమస్యలు పాకే అవకాశం ఉంది. దీన్ని ఆయా వ్యక్తుల శారరీకంగా చేసే శ్రమను పరిగణలోకి తీసుకుని నిర్థారిస్తారు. కొన్నిసార్లు నరాల్లో రక్తప్రసరణ సరిగా ఉందా లేదా అని నిర్వహించే పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ వంటి రోగ నిర్థారణ పరీక్షల సాయంతో వైద్యులు ఈ సమస్యలను గుర్తిస్తారు. చికిత్స: వర్క్ప్లేస్లో వాతావరణాన్ని ఒత్తిడి లేకుండా కూల్గా చేసేలా వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి. అదేసమయంలో ఏకథాటిగా చేసే పనికి కాస్త విరామం ఇవ్వడం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడికి గురికాకుండా మధ్య మధ్యలో తేలికపాటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆర్ఎస్ఐ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు లేదా సమస్య తీవ్రతను తగ్గించొచ్చు. ఈ ఆర్ఎస్ఐ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే కార్యాలయాల వద్ద ఉద్యోగులకు సౌకర్యావంతమైన రీతిలో ఫర్నేచర్, పరికరాలు, వంటివి ఉండాలే యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పని చేసే చోట ఎదురయ్యే అనుకోని ప్రమాదాలకు తక్కణ రక్షణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలి. వాటిన్నిటితో పాటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు దీని గురించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి. అందుకు తగ్గట్టు శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతో కూడిన పరికరాలు ఏర్పాటు, లేదా రక్షణ కోసం చేతి తొడుగులు వంటివి ఏర్పాటు చేయాలని డాక్టర్ ఖరత్ అన్నారు. (చదవండి: వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!) -
సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ని ఏలుతున్న స్టార్ హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక నటుడు. 67 ఏళ్ల వయసులో అదే జోష్లో దూసుకెళ్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ అందుకున్న మెగాస్టార్..ఆరు నెలల గ్యాప్లో ‘భోళా శంకర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. చిరంజీవి స్థాయిని దిగదార్చేలా మెహర్ రమేశ్ మేకింగ్ ఉందని మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. అదే సమయంలో రీమేక్ చిత్రాలకు వెళ్లొద్దని చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోకాలి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి.. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి) వారంలో హైదరాబాద్కు రాకా ప్రస్తుతం చిరంజీవి ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఆగస్ట్ 22 అంటే ఆయన బర్త్డే రోజు కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొంటారు. ఈ చిత్రానికి 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాల విశ్రాంతి చిరంజీవికి మోకాలి నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో సర్జరీ చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. భోళా శంకర్ ప్రమోషన్ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సర్జరీ చేయించుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టే ఆరు నెలల క్రితమే తన డేట్స్ని సర్దుబాటు చేసుకున్నారట. అయితే చిరుకి జరిగిన సర్జరీ చాలా చిన్నదని సమాచారం. నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. టెక్నాలజీని ఉపయోగించి నిమిషాల్లో ఈ సర్జరీ పూర్తి చేస్తారు. ప్రస్తుతం చిరంజీవి సాధారణంగాగే ఉన్నారట. రోజూలాగే నడవడం, తన పనులు తాను చేసుకోవడం చేస్తున్నారట. వారంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి మరో రెండు వారాల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తన షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో పాల్గొంటారట. రెమ్యునరేషన్పై ‘భోళా..’ ఎఫెక్ట్ దాదాపు తొమ్మిదేళ్లు నటనకు విరామం ఇచ్చిన చిరంజీవి ఖైదీ 150(2017) చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికో సినిమాను విడుదల చేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట చిరంజీవి. ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న చిరు.. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యకు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి రెమ్యునరేషన్ వివరాలు అయితే వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో తన పారితోషికాన్ని పెంచేశారట మెగాస్టార్. భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ.65 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ ఎఫెక్ట్ చిరంజీవి తదుపరి చిత్రంపై కచ్చితంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి చిత్రానికి రెమ్యునరేషన్ తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు!) -
Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి
మెగాస్టార్ మోకాలికి సర్జరీ మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ పూర్తయింది. గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్నారని తెలిసింది. వైద్య పరిభాషలో ఈ సర్జరీని ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ అంటారని తెలిపారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు!) ఏమిటీ నీ వాష్ (Knee Wash) ట్రీట్ మెంట్ ? నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పోర్టల్ ప్రకారం నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. అదే స్థానంలో రెండు ఎముకల మధ్య కొత్త ఫ్లూయిడ్ ను నింపుతారు. దీని వల్ల మోకాలి చిప్పకు నొప్పి ఉండదు. మోకాలి దగ్గర చాలా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ సర్జరీ పూర్తి చేస్తారు. దీని వల్ల కుట్లు వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎన్నాళ్లు విశ్రాంతి అవసరం ? నీ వాష్ ట్రీట్ మెంట్ తీసుకున్న వ్యక్తులు.. మళ్లీ మామూలుగా పనులు చేసుకోవాలంటే కనీసం 45 రోజుల విశ్రాంతి అవసరం. దీనికంటే త్వరగా కూడా కోలుకోవచ్చు. కానీ వైద్యులు సాధారణంగా 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. చిరంజీవి సంగతేంటీ ? ప్రస్తుతం చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండే చిరంజీవి వయస్సు 67 ఏళ్లు వచ్చినా.. ఇంకా చలాకీగానే కనిపిస్తారు. అయితే కొన్నాళ్లుగా మోకాలి నొప్పి పెరిగిపోవడంతో శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఢిల్లీలో ఎప్పటివరకు ? ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న చిరంజీవి.. మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. అంటే ఆగస్టు 22న తన పుట్టినరోజు కల్లా ఇంటికొచ్చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్లో మరో 5 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. చిరంజీవి సినిమాల సంగతేంటీ? ఈ మధ్య 'భోళా శంకర్'గా వచ్చిన చిరు.. తన బర్త్ డే నాడు కొత్త మూవీ ప్రారంభించబోతున్నారు. 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకుడు కాగా చిరు కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తుంది. మళయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమా రీమేక్ పట్ల కూడా చిరంజీవి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన చిరు.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నారు. ఈ మధ్య థియేటర్లలో విడుదలైన 'భోళా శంకర్' మాత్రం బోల్తా కొట్టేసింది. భారీ నష్టాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. త్వరలో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా 'బ్రో డాడీ' అనే మలయాళ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్బాబు) -
సర్జరీ చేయించుకోనున్న యంగ్ రెబల్ స్టార్.. కారణం అదే!
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ సలార్, కల్కి సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: జైలర్కు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!) త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్పై ఉన్న రెండు సినిమాల షూటింగ్ తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నందువల్లే మోకాలి సర్జరీకి కారణమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సలార్ సెప్టెంబరు 28వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత కల్కి -2898 ఏడీ 2024 సంక్రాంతికి రోజు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా సలార్, కల్కి చిత్రాల షూటింగ్ పూర్తి చేయనున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న ఓ చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. (ఇది చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్) -
మెగాస్టార్కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్?!
మెగాస్టార్ చిరంజీవి మరో ఆపరేషన్కు సిద్ధమవుతున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త గుప్పుమంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ ఆయన 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారట! హైదరాబాద్లో కాకపోతే ఢిల్లీ లేదా బెంగళూరులో ఈ ఆపరేషన్ జరగవచ్చన్నది సమాచారం. ఈ ఆపరేషన్ తర్వాత దాదాపు 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి! సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్నానే తదుపరి ప్రాజెక్ట్పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేశ్ వల్లే చిరంజీవికి ఇటువంటి ఫ్లాప్ వచ్చిందని ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే! బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఇకపోతే బింబిసార డైరెక్టర్ వశిష్టతో చిరు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఫైనలవుతుందో? ఏది చిరుకు విజయాన్ని బహుమతిగా ఇస్తుందో చూడాలి! చదవండి: భోళా ఎఫెక్ట్.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్ -
పింఛన్ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్ చేశారు
మల్కన్గిరి(భువనేశ్వర్): పింఛన్ ఇస్తామని ఓ యువకుడిని తీసుకెళ్లిన ఆశ వర్కర్.. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసిన వైనం మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితిలో వెలుగుచూసింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీ అంబగూడకు చెందిన గాంగదురువ(26) పుట్టుకతో మూగ. ఇంకా వివాహం కాలేదు. ఈ నెల 3న గ్రామానికి చెందిన ఆశా వర్కర్ గాంగదరువ ఇంటికి వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి మందులతో తిరిగి వచ్చిన కుమారుడిని తల్లి చూసి.. ఎందుకు మందులు వేసుకుంటున్నావని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పడంతో ఆమె గ్రామస్తులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను నిలదీసింది. తన బిడ్డకు పిల్లలు పుట్టకుండా చేసిన ఆశ వర్కర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై మల్కన్గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ నాందో వద్ద ప్రస్తావించగా.. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. ఆశ వర్కర్ తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే! -
ప్రభాస్ మోకాలికి సర్జరీ..?
ప్రభాస్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు...డాన్సులతో కూడా దుమ్మురేపుతాడు.కానీ అలా ప్రభాస్ దుమ్ములేపి చాలాకాలం అయ్యింది.దానికి కారణం కేవలం ప్రభాస్ ఎంచుకుంటున్న పాన్ ఇండియా సినిమాలే కాదు, ప్రభాస్ ని వదలకుండా వేధిస్తున్న మోకాలినొప్పి సమస్య కూడా. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. అందుకే ఈ మధ్య సినిమాల్లో ఎటూ డాన్సుల అవసరం లేదు కాబట్టి డాన్సులకు దూరంగా ఉంటున్నాడు. (చదవండి: ‘జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్తో ధనుష్ రచ్చ) అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్, 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కూడా పెద్దగా డాన్సులకు స్కోప్ లేదు...ఆ అవసరం కూడా లేదు. ఆ కథలు అలాంటివి. జస్ట్ ప్రభాస్ కటౌట్ నిలబడితే చాలు అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తాడు ప్రశాంత్ నీల్. ఇక కల్కి 2898 పూర్తిగా స్టోరీ డ్రివెన్ సినిమా. (చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..) మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అది పూర్తిగా కమర్షియల్ టచ్ ఉన్న సినిమా. ప్రభాస్ కామెడీ,ఫైట్స్ తో పాటు డాన్సులు కూడా ఉండాలి.ఉంటేనే మజా.ఆ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని అంటున్నారు. కనీసం రెండింటిలోనైనా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. చేయాలని ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అందుకే సలార్, కల్కి 2898 చిత్రాల షూటింగ్ పూర్తవగానే సర్జరీ చేయించుకుని రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటాడట రెబల్ స్టార్. ఇక ఆ తరువాత ఎప్పటిలానే దుమ్ము లేచిపోవడం ఖాయం. -
యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువతి పొట్టలో చుట్టుకుపోయి గొంతు వరకూ వ్యాప్తి చెందిన వెంట్రుకలను ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతి వెంట్రుకలు చుట్టుకుని మింగుతుండేది. కొంతకాలానికి అవి పొట్టలో చుట్టుకుపోయి క్రమేణా గొంతులోకి వ్యాప్తి చెందాయి. దీంతో ఏమీ తినలేని, తాగలేని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తొలుత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు పరీక్షించి ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆమెకు శుక్రవారం సర్జన్లు దుర్గారాణి, చందన ప్రియాంక, గాయత్రి, ప్రవీణ్కుమార్లతో పాటు, ఎనస్థీషియన్లు ఏవీరావు, కిరణ్ బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకల చుట్టను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.అప్పారావు మాట్లాడుతూ గొంతు వరకూ వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టతరంగా మారిందన్నారు. ఈ తరహా కేసులను ట్రైకోబెజార్గా పిలుస్తామని, ఇలాంటి వాటిని చూడటం చాలా అరుదని చెప్పారు. -
World’s fattest kids: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా..
ఏ వయసువారికైనా స్థూలకాయమనేది పెద్ద సమస్యే. చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడినవారు వయసు పెరిగేకొద్దీ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న వయసు కారణంగా వారు ఆహారం తినడాన్ని నియంత్రించుకోలేకపోతారు. ఫిజికల్ యాక్టివిటీకి కూడా దూరంగా ఉంటారు. ప్రపంచంలో ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు పెద్దయ్యాక ఊహకందనంతగా మారిపోయారు. మరి కొందరు మరింత బరువు పెరిగారు. 1 అరియా పెర్మానా ఇండోనేషియాకు చెందిన అరియా పెర్మానా కొన్నేళ్ల క్రితం 200 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడైన పిల్లాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు అరియా పెర్మానా ఊహించనంతగా మారిపోయాడు. కొన్నేళ్ల క్రితమే అరియా పెర్మానా 120 కిలోల బరువు తగ్గాడు. అరియా రోజంతా వీడియో గేమ్స్ ఆడుతూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇన్స్టెంట్ నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ తినేవాడు. అలాగే విపరీతంగా కూల్డ్రింక్స్ తాగేవాడు. దీంతో అరియా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే 2017 ఏప్రిల్లో అరియాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. ఇంత చిన్న వయసులో బేరియాట్రిక్ సర్జరీ జరిగిన బాలునిగా అరియా పేరొందాడు. 2 ఆండ్రస్ మెరెనో ఆండ్రస్ మెరెనో పుట్టుకతోనే 5.8 కిలోల బరువు కలిగివున్నాడు. మెక్సికోకు చెందిన ఆండ్రస్ 10 ఏళ్ల వయసుకే 118 కిలోల బరువు పెరిగాడు. 20 ఏళ్ల వయసులో ఆండ్రస్ పోలీసుశాఖలో చేరాడు. అయితే బరువు పెరిగిన కారణంగా కూర్చొనేందుకు కూడా ఇబ్బంది పడేవాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే అతని బరువు 444 కిలోలకు చేరుకుంది. 2015లో అతని ఉదరానికి బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో అతను స్వయంగా లేని నిలబడగలిగాడు. అయితే కొంతకాలం తరువాత ఒక క్రిస్మస్ రోజున 6 కూల్ డ్రింక్స్ తాగాడు. దీంతో ఆరోగ్యం విషమించింది. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. 3 కత్రీనా రైఫార్డ్ ఫ్లోరిడాకు చెందిన కత్రీనా రైఫార్డ్ ఒకప్పుడు ప్రపంచంలోనే స్థూలకాయురాలైన యువతిగా పేరొందింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు మిఠాయిలు, చాక్లెట్లలాంటి అధిక కేలరీలు కలిగిన పదార్థాలంటే ఇష్టమమని, వీటిని అధికంగా తినడం కారణంగానే బరువు పెరిగానని తెలిపారు. కత్రీనా 14 ఏళ్ల వయసుకే 203 కిలోల బరువు పెరిగింది. 21 ఏళ్ల వచ్చేనాటికి ఆమె 285 కిలోల బరువుకు చేరుకుంది. 2009లో ఆమెకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆమె బరువు 127 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల వయసుకు చేరుకున్న కత్రీనా రైఫార్డ్ కాస్త ఫిట్నెస్తో కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..! -
శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి
సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది. (ఇది చదవండి: ఆగస్ట్లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!) మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) View this post on Instagram A post shared by Priyanka Kamath (@kamath.priyanka) -
అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ..
ఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. నవ్వుతూ ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తన తండ్రి దేనికి తలవంచరని పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించకుండా ఉండేందుకే తన తండ్రిపై కేంద్ర ప్రభుత్వం అవినీతి కేసులను మోపిందని ఆరోపించారు. 'ఆయనకు భయం అంటే ఎంటో తెలియదు. దేనికీ భయపడరు. ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. చివరికి తప్పక విజయం సాధిస్తారు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. View this post on Instagram A post shared by Tejashwi Yadav (@tejashwipdyadav) పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల బెయిల్పై విడుదలయ్యారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. ఆయన కుమార్తె ఒక కిడ్నీని దానం చేయగా చికిత్స పూర్తి అయింది. గతేడాది డిసెంబరులో శస్ర్త చికిత్స అనంతరం దిల్లీకి తిరిగి వచ్చారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకొచ్చిన కారు.. -
65 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
హైదరాబాద్: నగర వైద్య చరిత్రలోనే తొలిసారిగా 65 ఏళ్ల మహిళకు వెన్నెముకలో స్టెంటింగ్ వేశారు. కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కృష్ణచైతన్య ఈ అరుదైన చికిత్స చేశారు. అచ్చం గుండెకు స్టెంట్ వేసినట్లే ఎముకకు సైతం మెటల్ స్టెంట్ వేయడం ద్వారా రోగికి ఊరట కల్పించారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ.. గత నెలలో ఓ మహిళ ఇంట్లో నేలపై పడిపోయింది. విపరీతంగా వెన్నునొప్పితో బాధ పడుతూ.. కనీసం నడిచే స్థితిలో లేకపోవడంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లగా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆమెకు గ్యాస్టైటిస్, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ గ్రాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సృజన్ వద్దకు వెళ్లగా.. ఆయన తన వద్దకు పంపడంతో వెన్నెముక విరిగిన విషయం గుర్తించానని డాక్టర్ కృష్ణచైతన్య చెప్పారు. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయడం ముప్పుతో కూడుకున్నదని, సెడేషన్ మాత్రం ఇచ్చి స్టెంటింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్లు, ఇతర చిన్నపాటి సమస్యలు ఉన్న పెద్ద వయసువారికి వెన్నెముకలోని ఎముకలు విరిగితే ఈ చికిత్స చాలా ఉపయోగకరమన్నారు. సాధారణంగా శస్త్ర చికిత్స చేసే 3– 4 గంటలు పట్టడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి శస్త్ర చికిత్సల్లో అయితే స్క్రూలు బిగిస్తామన్నారు, దాని వల్ల కోలుకోవడానికి కూడా చాలా నెలలు పడుతుందన్నారు. కానీ ఈ ప్రక్రియలో స్టెంట్ను కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ రంధ్రం ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. ఇది లోపలకు వెళ్లి ఎముక వద్ద విస్తరిస్తుందన్నారు. దానివల్ల ఎముక తన సాధారణస్థితికి వచ్చేస్తుందన్నారు. ఎలాంటి నొప్పి కూడా లేకపోవడంతో ఆపరేషన్ అయిన కొద్ది గంటలకే రోగి లేచి నడవగలిగారని వివరించారు. -
ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్!
ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. వైద్య శాస్త్రంలో కూడా మానవుడు చాలా పురోగతి సాధించాడు. ఈ క్రమంలో గతంలో సాధ్యం కానివాటిని కూడా సాధ్యపడేలా చేస్తున్నారు వైద్యులు. ఇటీవల కొందరు తమ రూపాన్ని మార్చుకోవడానికి తరచుగా ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ శస్త్రచికిత్సలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల, 20 ఏళ్ల మహిళ ముక్కుపై కుక్క కొరికింది. అందుకే ఆమె శస్త్రచికిత్స చేయించుకుంది, అయితే ఆపరేషన్ చేసిన ప్రదేశంలో వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి. అసలు అలా ఎందుకు జరిగిందంటే.. గత సెప్టెంబరులో ట్రినిటీ రౌల్స్ అనే యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లగా.. అక్కడ ఒక కుక్క దాడి చేసి ఆమె ముక్కును కొరికింది. ఈ ఘటనలో ట్రినిటి తన ముక్కు కొనను కోల్పోయింది. ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కుక్క దాడి కారణంగా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే ఆమె ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక సర్జరీలు చేశారు. కానీ స్కిన్ గ్రాఫ్ట్ అని పిలువబడే ఒక ఆపరేషన్ ఆమె ముఖంలో భారీ మార్పులకు దారితీసింది. ప్రస్తుతం ఇప్పుడేమో ఆమె కోలుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. ఆపరేషన్లో భాగంగా వైద్యులు ఆమె నుదిటిపై ఉన్న ప్రాంతం నుండి చర్మాన్ని తీసి ఆమె ముక్కుపైకి అమర్చారు. ఇది ఆమె ముఖంలో సాధారణ రూపాన్ని పునరుద్ధరించింది, కానీ కొన్ని రోజుల్లో, ఆమె సమస్య మరింత తీవ్రమైంది. దీని వల్ల ఆమె ముక్కుపై వెంట్రుకలు మొలవడం మొదలైంది. ప్రస్తుతం ఈ వెంట్రుకల తొలగింపుకు ట్రినిటీ చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన బాధను పంచుకుంది ట్రినిటి. నెటిజన్లు కూడా ట్రినిటి ఫోటోని చూసి ఆశ్చర్యపోతున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు. చదవండి: Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే -
వెన్నెముక సర్జరీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ
-
సైనస్ లక్షణాలు ఇవే .. సర్జరీ చేసినా తగ్గకపోతే ఏం చేయాలి
-
సింగర్లా కనిపించాలని సర్జరీ.. ఇప్పుడేమో సగం మొహానికి స్పర్శ లేదు, ముక్కు, మూతి చూస్తే..
అభిమానం వెర్రితలలు వేస్తే ‘ఫ్రాన్ మారియానో’లా ఉంటుంది. అతను అర్జంటీనా వాసి. స్పానిష్ (ప్యుర్టో రికా) గాయకుడు, పాటల రచయిత, నటుడు రికీ మార్టిన్ వీరాభిమాని! సాధారణంగా అయితే సెలబ్రిటీల అభిమానులు.. సెలబ్రిటీల అభినయ, ఆహార్య, వాచకాలను అనుకరిస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఫ్యాన్ ఫ్రాన్ మారియానో మాత్రం తన రూపు రేఖలనే మార్చేసుకున్నాడు కనుబొమలు సహా! అచ్చం రికీలాగే కనిపించాలనే కోరికతో ఏకంగా డజన్కి పైగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నాడు. తన కనుబొమలు కూడా రికీ మార్టిన్ కనుబొమలను పోలి ఉండాలని మోటార్ ఆయిల్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. ఈ ప్రకియంతా అతన్ని త్రీవమైన శారీరక, మానసిక వ్యధలోకి నెట్టింది. ఇప్పుడు అతను ఇటు తనలా కాకుండా అటు రికీ మార్టిన్లా కాకుండా తయారయ్యాడు. ఈ మధ్యే ఓ రియాలిటీ షో (అర్జంటీనా)లో తనలాంటి ఫ్యాన్స్కి తన అనుభవాన్ని చెబుతూ ఏ అభిమానీ తనలా మారొద్దని.. అభిమానాన్ని హద్దులు మీరనివ్వద్దని హెచ్చరించాడు. ‘నా ముక్కు, మూతి నావి కాకుండా పోయాయి. నా సగం మొహానికి స్పర్శే తెలియడం లేదు. మంచినీళ్లనూ గటగటా తాగలేని పరిస్థితి.. కర్చీప్ని నీళ్లలో ముంచి నోట్లో పిండుకోవాల్సి వస్తోంది’ అని వాపోతున్నాడు మారియానో. ఇతని గాథ విన్నవాళ్లంతా ‘ప్చ్ .. క్రేజీ ఫెలో.. ’ అంటూ జాలిపడుతున్నారు. చదవండి: ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ -
ముఖానికి గాయాలు అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
దేశంలోనే తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స!
ముంబై: ముంబై వైద్యులు తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స నిర్వహించారు. 2017లో మానసిక ఆరోగ్యచట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి డిప్రెషన్ సర్జరీ ఇదేకావడం విశేషం. ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా డిప్రెషన్తో బాధపడుతోంది. మహారాష్ట్ర మెంటల్ హెల్త్ బోర్డు అనుమతితో జస్లోక్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ పరేఖ్ దోషి నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించింది. దీనిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీ అని అంటారు. పార్కిన్సన్స్ దగ్గర్నుంచి నరాల వ్యవస్థలో లోపాల కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధులకి డీబీఎస్ శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తారు. -
పెళ్లి తర్వాత బాగా సన్నబడిన హన్సిక.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్
తమిళసినిమా: అందమైన నటీమణులకు బరువు అనేది పెద్ద భారం అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. నటి అనుష్క వంటి వారికి ఇది కష్ట సాధ్యంగానే మారిందని చెప్పక తప్పదు. అయితే మరో బ్యూటీ హన్సిక మాత్రం బరువు తగ్గడం అనేదాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్గా మారింది. ముంబయి భామ హన్సిక బాల నటిగా హిందీలో కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇక కోలీవుడ్లో ధనుష్ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. విజయ్కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాగా స్లిమ్గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: యాసలందు అన్ని యాసలూ లెస్స) -
పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలుపుతూ.. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఆమె న్యాయ సలహా కూడా తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం వైద్యులను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఎల్జిబిటిక్యూ వర్క్షాప్కు హాజరైన సుచేతన దీని గురించి మాట్లాడుతూ.. తనను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన సుచేతన, “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్మ్యాన్గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 41. ఫలితంగా నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే దీని కోసం పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది. ఈ వార్తలను వక్రీకరించవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి ఈ నిర్ణయానికి మద్దతిస్తాడని సుచేతన భావిస్తున్నట్లు చెప్పింది. చదవండి: రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి -
సుప్రీం కోర్టులో విజ్ఞప్తి తిరస్కరణ.. సెంథిల్కు శస్త్ర చికిత్స ఏర్పాట్లు
సాక్షి, చైన్నె : క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఎలాగైనా తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో గత వారం మంత్రి సెంథిల్బాలాజీని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మంత్రికి బుధవారం బైపాస్ సర్జరీ చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సెంథిల్ బాలాజీని విచారించలేని పరిస్థితిలో ఈడీ తలలు పట్టుకుంటోంది. చైన్నె జిల్లా కోర్టు 8 రోజుల కస్టడీకి అవకాశం కల్పించినా ఇంతవరకు సెంథిల్ బాలాజీని ఈడీ సమీపించలేని పరిస్థితి. హైకోర్టు ఆదేశాలు, ఆంక్షల నడుమ సెంథిల్ బాలాజీ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ను విచారించాలంటే ఆసుపత్రి వైద్యుల సలహాలు, సూచనలు అవసరం. సెంథిల్ బాలాజీ ఐసీయూలో ఉండడంతో ఇంతవరకు వైద్యుల నుంచి ఈడీకి అనుమతి దక్కలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించి, ఎలాగైనా సెంథిల్బాలాజీని తమ కస్టడీకి తీసుకుని విచారించాలన్న లక్ష్యంగా డెప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలోని ఈడీ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న సెంథిల్ను ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకొచ్చే దిశగా ఈడీ వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం. సెంథిల్ బాలాజీ సతీమణి విజ్ఞప్తి మేరకు ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని రద్దు చేయించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా అధికారులు సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టుతో పాటు, సుప్రీం కోర్టులో మరో బెంచ్లో విచారణలో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా తాము విచారించలేమని వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ నెల 21వ తేదీన పిటిషన్ను విచారిస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. అదే రోజున సెంథిల్ బాలాజీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్న ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశాలు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా, సెంథిల్ను తమ కస్టడీకి తీసుకునేందుకు ఈడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కావేరి ఆసుపత్రి పరిసర మార్గాలలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం గమనార్హం. -
సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!
ప్రముఖ టీవీ హోస్ట్, నటి అనూషా దండేకర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది నటుడు కరణ్ కుంద్రాతో బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ షోలకు హోస్ట్గా పనిచేస్తున్న అనుషా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) ఆమె తన అండాశయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్స్టాలో షేర్ చేసింది. అండాశయంలో ఉన్న గడ్డలు వైద్యులు విజయవంతంగా తొలగించారని వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పూర్తిగా కోలుకునేందుకు మరిన్నీ రోజులు పడుతుందని తెలిపింది. ఈ విషయాన్ని మహిళలు, యువతుల కోసం చెబుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇన్స్టాలో రాస్తూ.. 'నా అండాశయంలో గడ్డలు ఉండడంతో శస్త్రచికిత్స జరిగింది. కోలుకోవడం కాస్త టైం పడుతుంది. కానీ నేను నిజంగా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను ఈ విషయాన్ని అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటున్నా. మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే క్రమం తప్పకుండా ఏడాది ఒకసారైనా గైనకాలజిస్ట్ను కలవండి. నేను నా 17 ఏళ్ల వయసు నుంచి డాక్టర్ను కలుస్తున్నా. మీ ఆరోగ్యమే ముఖ్యమని తెలుసుకోండి. తనకు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు. నిజంగా నేను అదృష్టవంతురాలిని.' అంటూ పోస్ట్ చేసింది. ( ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. అనూషా దండేకర్ 2003లో 'ముంబయి మ్యాట్నీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'విరుద్ధ్', 'ఢిల్లీ బెల్లీ' వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా 'హౌస్ ఆఫ్ స్టైల్', 'లవ్ స్కూల్', 'తీన్ దివా' వంటి అనేక రియాల్టీ షోలకు కూడా హోస్ట్గా పనిచేసింది. ప్రస్తుతం 'బాప్ మనుస్'సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) -
అరుదైన ఘటన: మ్యూజియంలో ఆమె గుండె..16 ఏళ్ల తర్వాత ఆ మహిళే..
ఏదైన కారణం చేత మన శరీరంలో కొన్ని అవయవాలను తీసేస్తే గనుక మనం వాటిని చూసే అవకాశం ఉండదు. వైద్యులు కూడా శస్త్ర చికిత్స చేసే టైంలో తొలగించిన అవయవాన్ని మన కుటుంబ సభ్యులకు చూపిస్తారు. ఐతే మన శరీరం నుంచి వేరుచేసిన అవయవాలను చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఇక్కడొక మహిళకు మాత్రం తన గుండెను తాను చూసుకునే అరుదైన అవకాశం లభించింది. అది కూడా మ్యూజియంలో అంటే నమ్మశక్యంగా లేదు కదా!. అసలేం జరిగిందంటే..లండన్లోని హాంప్షైర్లోని రింగ్వుడ్కి చెందిన 38 ఏళ్ల జెన్నిఫర్ సుట్టన్ ప్రస్తుతం చాలా బిజీ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంది. ఆమె విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడూ కొండలపై నడవడానికి, కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు గ్రహించింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా నిర్బంధ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల శరీరంలో రక్తాన్ని పంపు చేసే గుండె సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఆమె త్వరితగతిన గుండె మార్పిడి చేయించుకోనట్లయితే చనిపోతుందని డాక్టరు చెబుతారు. సుట్టన్కు అప్పుడు 22 ఏళ్ల వయసు. ఓ పక్క వేగంగా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఆమెకు 2007లో తనకు సరిపోయే మరొకరి గుండె లభించినట్లు తెలిసింది. ఆ తర్వాత సుట్టన్కు చకచక గుండె మార్పిడి సర్జరీ జరిగిపోవండ వంటివి జరిగిపోయాయి. కానీ ఆమె ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యింది. ఎందుకంటే 13 ఏళ్ల వయసులో సుట్టన్ అదే ఆపరేషన్ కారణంగా అమ్మను కోల్పోయింది. ఐతే సట్టన్కి సర్జరీ అనంతరం స్ప్రుహలోకి రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ తదనంతరం తన గుండెను సుట్టన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్కి లండన్ హంటేరియన్లోని హోల్బోర్న్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతిచ్చింది. దీంతో సరిగ్గా ఆమె 16 సంవత్సరాల తర్వాత తన గుండెను చూసుకుంది. ఇది తన శరీరీంలో ఉండేది కదా అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని, ఇది తనకు అసాధ్యమైన గొప్ప బహుమతిగా అభివర్ణించుకుంది సుట్టన్. ఈ గుండె తనని 22 సంవత్సారాలు జీవించగలిగేలా చేసిందని అందుకు గర్వంగా ఉందని చెబుతోంది. దాత వల్లే కదా ఈ రోజు బతికబట్టగట్టిగలిగాను అందువల్ల అవయవ దానాన్ని పోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రణాళికలను వాయిదా వేసే అలవాటు ఉన్నవారిని ఈ రోజు నుంచే అలాంటి చర్యలను తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను బిజీ లైఫ్తో ఉన్నానని, తన హృదయాన్ని పదిలంగా ఉంచుకుని సాధ్యమైనంత ఎక్కువ కాలం బతికేలా ఆరోగ్యంగా ఉండేందకు యత్నిస్తానని ఆనందంగా చెబుతోంది సుట్టన్. (చదవండి: పనోడి సాయంతో పేషెంట్కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిదినాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం జూన్ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. -
కాలులేని భార్యను భుజంపై మోసుకొని..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో స్ట్రెచర్ అందుబాటులో లేక చికిత్స అనంతరం ఓ వృద్ధుడు తన భార్యను భుజాలపై మోసుకెళ్లిన ఘటన శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మాలోతు లక్ష్మికి నవంబర్లో కుడికాలి రక్తప్రసరణ ఆగిపోయింది. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మోకాలు కింద నుంచి కాలును తొలగించారు. రోగిని 15 రోజులకోసారి డ్రెస్సింగ్ కోసం తీసుకురావాలని సూచించారు. దీంతో లక్ష్మి ని ఆమె భర్త శుక్రవారం ఆస్పత్రికి తీసుకుచ్చాడు. అక్కడున్న సిబ్బంది ‘పెద్ద సార్ లేరు.. రేపు రావాలని చెప్పారు. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో మండుతున్న ఎండలోనే భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు. డ్రెస్సింగ్ అనంతరం సిబ్బంది రోగిని వీల్చైర్లో క్యాజువాలిటీ నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. కాలిపర్ (కాలుకు అమర్చే లోహ పరికరం) కోసం వెళ్లగా శనివారం అందుబాటులో ఉంటుందని, అప్పుడు రావాలని సిబ్బంది చెప్పారన్నారు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా భర్త తన భార్యను ఒక చెట్టు వద్దకు తీసుకెళ్లేందుకు భుజంపై ఎక్కించుకొని వెళ్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలతో ఆస్పత్రిని అభాసుపాలు చేయవద్దని కోరారు. -
తల్లడిల్లిన తల్లి గుండెకు ఊరట.. సీఎం జగన్ సత్వర స్పందన
ఆరిలోవ (విశాఖ తూర్పు): పసి వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడంతోపాటు తండ్రిని కోల్పోయి హృద్రోగం బారినపడ్డ ఓ బాలుడి వ్యథ తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరిలోవలోని శ్రీకాంత్నగర్కు చెందిన వానపల్లి పార్వతి కుమారుడు వానపల్లి చరణ్సాయి మణికంఠ(12)కు మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స అవసరమని, అందుకు రూ.8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు. అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంబోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పెదగదిలి కూడలి వద్ద ‘నా కుమారుడిని రక్షించండి జగనన్నా..’ అంటూ కేకలు వేసింది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ తన కారు ఆపి విషయం తెలుసుకుని చలించిపోయారు. తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఆదేశించారు. జేసీ విశ్వనాథన్, రూరల్ తహశీల్దారు పి.రమణయ్య సాయంత్రం బాలుడి ఇంటికి వెళ్లి తక్షణం సాయంగా రూ.లక్ష చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాలుడికి వైద్య సాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా తన కుమారుడిని కాపాడేందుకు వచ్చారని బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మంత్రి గుడివాడ అమర్నా«థ్కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. -
ఎత్తు పెరగాలని ఏకంగా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!
ఇటీవల వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనికి సాంకేతికత కూడా తోడవ్వడంతో పలు వ్యాధులను సులభంగా నయం చేయగల చికిత్స విధానాలు చాలామటుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనషుల్లో కొంత వికృతమైన ఆలోచనల తో వెర్రీ పనులు చేస్తున్నారునే చెప్పాలి. రూపు రేఖలు దగ్గర నుంచి ప్రతీది మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా కాస్మోటిక్ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో యువత ఆ సర్జరీలు ఎంత ఖరీదైనవైనా..లెక్క చేయకుండా చేయించుకోవడానికి రెడీ అయ్యిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎత్తు పెరిగేందుకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించుకున్నాడు. దీని వల్ల పల దుష్పరిణామాలు ఉన్నా కూడా చేయించుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎందుకోసం అంత రిస్క్తో కూడిన శస్త్ర చికిత్స చేయించుకుంటున్నోడో వింటే ఆశ్చర్య పోవడం ఖాయం. వివరాల్లోకెళ్తే...అమెరికాకు చెందిన 41 ఏళ్ల గిబ్సన్ తన ఎత్తు విషయమై చాలా బాధపడుతుండేవాడు. అతను ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఆ ఎత్తు కారణంగానే తనకు గర్లఫ్రెండ్స్ లేరని తెగ బాధపడుతుండేవాడు. అందుకోసం అని తన ఘూస్లో కొని రకాల వస్తువలు పెట్టుకుని హైట్గా కనిపించేందుకు తెగ ప్రయత్నించేవాడు. ఎత్తు పెరిగేలా మందులు వాడటం దగ్గర నుంచి యోగ వరకు అని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఐతే అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇక ఎత్తు పెరిగేలా కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాస్తవానికి గిబ్సన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శస్త్ర చికిత్స కోసం అని తనసంపాదనలో కొంత డబ్బును ఆదా చేయడమే గాక ఉబర్ డ్రైవర్ కూడా పార్ట్ టైం జాబ్ చేసి మరికొంత డబ్బును కూడబెట్టాడు. గిబ్సన్ తాను అనుకున్నట్లుగానే 2016లో మొదటి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడు అంగుళాలు పెరిగాడు. దీంతో అతని ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగాడు. అయినప్పటికి ఇంకా ఎక్కువ పెరగాలని రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. మొదటి శస్త్ర చికిత్స మాదిరిగా రెండో ఆపరేషన్ ప్రక్రియ అంత సజావుగా జరగలేదు. మరింత ఎత్తు పెరగడం కోసం వైద్యులు అతని ఎముకలు విరిచి దానిపై అయస్కాంత స్క్రూలు వంటి కొన్ని పరికరాలు అమర్చాల్సి రావడమే గాక విపరీతమైన బాధను కూడా అనుభవించాల్సి వచ్చింది. పైగా మొదటి ఆపరేషన్కి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టగా రెండోదానికి ఏకంగా రూ. 80 లక్షల దాక ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక పక్క విపరీతమైన బాధలు మరోవైపు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ బాధపడక పోగా తాను జూన్ నాటికి 5 అడుగులు పది అంగుళాలు పెరుగుతానని ఆనందంగా చెబుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కూడా గిబ్సన్ చాలా ఆనందంగా ఉన్నాడని, ప్రస్తుతం అతనికో గర్ల్ఫ్రెండ్ కూడా ఉందని చెబుతుండటం విశేషం. ఏదీఏమైనా ఈ ఎత్తు పెంచే శస్త్ర చికిత్స వల్ల భవిష్యత్తులో పలు దుష్పరిణామాలే గాక కొన్ని రకాల రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5! He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR — The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023 (చదవండి: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి.. భయంతో పరుగులు.. క్షణాల ముందు వీడియో..) -
తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేసుకున్న కాజోల్?
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అభినయం మాత్రమే కాదు, అందం కూడా ఉండాలి, ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. అందుకోసం తారలు పడే తిప్పలు చెప్పనలవి కాదు. కడుపు మాడ్చుకుంటూ డైటింగ్లు, చెమటలు వచ్చేలా జిమ్లో కసరత్తులు సరేసరి.. కొందరు ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఆ మధ్య సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో కాజోల్ స్పందించింది. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నన్ను చాలామాటలన్నారు. నల్లగా ఉంది, బండగా ఉంది. ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఉంటుందని విమర్శించారు. అవేమీ నేను పట్టించుకోలేదు. నా గురించి విమర్శించేవాళ్ల కంటే నేను స్మార్ట్, బెటర్ అనే అనుకున్నాను. నేను నాలా ఉండాలనే నిశ్చయించుకున్నాను. అందం కోసం, తెల్లగా మారడం కోసం ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు. కేవలం ఎండకు దూరంగా ఉన్నాను. గతంలో పదేళ్లు ఎండలోనే పనిచేయాల్సి రావడంతో స్కిన్ ట్యాన్ అయి నల్లగా అయ్యాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎండలోకి వెళ్లకపోవడంతో చర్మం ట్యాన్ అవడం లేదు. అందుకే తెల్లగా కనిపిస్తున్నాను. అంతే తప్ప తెల్లగా కనిపించేందుకు ఏ సర్జరీ చేయించుకోలేదు' అని చెప్పుకొచ్చింది కాజోల్. కాగా కాజోల్ 17 ఏళ్ల వయసులోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. 1992లో వచ్చిన బేఖుడి చిత్రంతో ఆమె వెండితెరపై అరంగేట్రం చేసింది. బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 'ద గుడ్ వైఫ్' వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. -
అరుదైన ట్యూమర్.. వైద్యులంతా చర్చించి.. ధైర్యం చేసి..
సాక్షి, గుంటూరు మెడికల్: మెడికల్ జర్నల్స్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైన అత్యంత అరుదైన ట్యూమర్ను గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు గుర్తించారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ను జనరల్ సర్జరీ రెండో యూనిట్ వైద్యులు విజయవంతంగా చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆస్పత్రిలో బుధవారం మీడియాకు ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన నేలటూరి శామ్సన్జాన్సునీల్ మంచంపై నుంచి లేవలేని విధంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతడిని విజయవాడ జీజీహెచ్కు తీసుకెళ్లారు. వైద్యులు తక్షణమే అతడికి రక్తం ఎక్కించి ఆరోగ్యం కొంచెం మెరుగుపడ్డాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపు కింది భాగంలో జిస్ట్ అనే కణితి ఉన్నట్లు నిర్థారించారు. సర్జరీ కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదించినా లాభంలేక గుంటూరు జీజీహెచ్కు మార్చి 14న రోగిని తీసుకొచ్చారు. రిపోర్టులు పరిశీలించి.. చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర అత్యంత అరుదైన జిస్ట్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ కిరణ్కుమార్ చెప్పారు. చిన్నపేగు మొదటి భాగంలో గ్యాస్ట్రో ఇంటస్టీనల్ స్ట్రోమల్ ట్యూమర్(జిస్ట్) ఇప్పటివరకు మెడికల్ జర్నల్స్లో రెండు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. చదవండి: సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఈ సమస్యకు ఏ విధంగా ఆపరేషన్ చేయాలనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదని, రెండో యూనిట్ జనరల్ సర్జరీ వైద్యులంతా దీని గురించి చర్చించి ధైర్యంగా మార్చి 25న ఆపరేషన్ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకూ తీసుకునే ఈ సర్జరీని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు చలం, నాగసంతోష్, వంశీధర్, అనూష, వేణుగోపాల్, కోటి, మత్తు వైద్యులు మహేష్బాబు, ఆనందబాబు, అలేఖ్య, కీర్తి, రాఘవ, కవిత పాల్గొన్నట్టు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. -
భారత్కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్కు తిరిగివచ్చే ముందు అమృత్పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్గా ఉన్న అమృత్పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి
కర్నూలు(హాస్పిటల్): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని బయట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ వెంటనే కార్డియోథొరాసిక్ హెచ్వోడి డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డికి ఫోన్ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎక్స్రే, సీటీస్కాన్ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు. -
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్కు చెందిన శివరాజ్సింగ్ కుమారుడు మునీందర్సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్తేజ్కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
వైరల్ వీడియో: వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్పైనే తాళి కట్టాడు
-
వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్పైనే తాళి కట్టాడు
సాక్షి, మంచిర్యాల: అమ్మాయిది నిరుపేద కుటుంబం. అందుకే పెళ్లి అయినా ఘనంగా చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. ఆ పెళ్లి కొడుకు వధువు కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రి బెడ్పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లంబాడిపల్లికి చెందిన శైలజకు.. భూపాలపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే.. బుధవారం రాత్రి వధువుకు కడపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే.. ఖర్చు చేసి చుట్టాలందరినీ పిలిపించి.. వివాహ వేడుకను వాయిదా వేయడానికి పెళ్లి కొడుక్కి మనస్సు రాలేదు. అందుకే.. పెద్దలను ఒప్పించాడు. ఆపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడితే.. వాళ్లూ సంతోషంగా అంగీకరించారు. వాళ్ల సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ జంట. -
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 21న) ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు. ప్రభుని పరీక్షించిన వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రభు ఆర్యోగం ప్రస్తుతం నిలకడగా ఉందని, లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా తమిళ నటుడైన ప్రభు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడు. తెలుగులో ఆయన చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రభాస్కు డార్లింగ్ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర తెలుగు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రభు దళపతి విజయ్ వారసుడు చిత్రంలో కనింపించారు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చదవండి: హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా.. కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి -
కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
అందం, అభినయంతో కట్టిపడేసిన స్టార్ హీరోయిన్లలో కాజోల్ ఒకరు. మూడు దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె అందంపై కొంతమంది నెటిన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె పాత ఫోటోలను.. లేటెస్ట్ ఫోటోలను పోలుస్తూ స్కి న్ వైటెనింగ్ సర్జరీ చేయించుందని కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్లపై కాజోల్ ఫన్నీగా స్పందించారు. ‘మీరు ఎలా తెల్లగా అయ్యారు? అని నన్ను అడిగే వాళ్లకు ఇదే నా సమాధానం’అంటూ ముఖం మొత్తం ముసుగు వేసుకున్న ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ట్రోలింగ్ కంటే ముందే గతంలో కాజోల్ తను తెల్లగా అవ్వడం కోసం ఎలాంటి సర్జరీలు చేసుకోలేదని చెప్పింది. సినిమా షూటింగ్స్ కోసమని గతంలో ఎండలో ఎక్కువ సమయం గడిపానని.. అందుకే కాస్త నల్ల బడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎండలోకి వెళ్లడం లేదని, అందుకే గతంలో కంటే తెల్లగా కనిపిస్తున్నాను.. అంతేకాని సర్జరీల వల్ల తాను రంగు మారలేదని కాజోల్ అన్నారు. -
AP: గుండె మార్పిడితో బాలుడికి పునర్జన్మ
తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు నిరుపేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. రాష్ట్రంలో ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను తొలిసారిగా చేపట్టిన రికార్డును ఇక్కడి వైద్యులు సొంతం చేసుకున్నారు. 48 ఏళ్ల మహిళ గుండెను 15 సంవత్సరాల బాలుడికి అమర్చి శభాష్ అనిపించారు. టీటీడీ పరిధిలోని వైద్యుల కృషిని యావత్ ప్రజానీకం శభాష్ అంటూ కొనియాడుతోంది. గతంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా 40 ఏళ్లు పైబడిన ముగ్గురికి గుండె మార్పిడి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో చేపట్టిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చరిత్ర సృష్టించింది. బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి.. అన్నమయ్య జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం.విశ్వేశ్వరకు జనవరి 20న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. విశాఖపట్నంకు చెందిన 48 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గుండెను గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి తీసుకువచ్చి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో బాలుడికి అమర్చారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డితో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను చేపట్టింది. 21 రోజులపాటు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఆ బాలుడికి చికిత్సను అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. ఆదుకున్న ఆరోగ్యశ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన నరసయ్య, రాధ దంపతులు సాధారణ రైతు కూలీ కుటుంబానికి చెందిన వారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి సంతానమైన విశ్వేశ్వర గుండె పూర్తిగా క్షీణించి అనారోగ్యానికి గురి కావడంతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకువచ్చారు. గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించిన వైద్యులు గుండెమార్పిడి అనివార్యమని తేల్చారు. విశాఖకు చెందిన సన్యాసమ్మ గుండెను బాలుడికి అమర్చి పునర్జన్మను ఇచ్చారు. రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం రూ.10 లక్షలను విడుదల చేసింది. గుండె మార్పిడి అనంతరం బాలుడిని పలకరించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ బాలుడు గోవింద నామస్మరణ చేస్తూ పులకించిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
దారుణం: శస్త్ర చికిత్స చేసినట్లు చేసి..అవయవాలు దొంగలించారు
శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది. తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్ బహుదూర్ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
బాలిక కడుపులో కిలో వెంట్రుకలు
గుడివాడటౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు కిలో వెంట్రుకలను తొలగించారు. ఈ శస్త్రచికిత్స వివరాలను డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన బాలిక (12) దీర్ఘకాలంగా కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఆమెను గుడివాడలోని శ్రీరామా నర్సింగ్హోంలో చేర్పించారు. వైద్యులు ఎండోస్కొపి, స్కానింగ్ల ద్వారా కడుపులో నల్లని గడ్డ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి దాన్ని వెలికితీశారు. దాన్ని వెంట్రుకల గడ్డగా గుర్తించారు. దీన్ని వైద్య విధానంలో ట్రైకోబీజోఆర్ అంటారని, చిన్న వయసు నుంచి కొందరికి వెంట్రుకలు తినే అలవాటు ఉంటుందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. కొద్ది మొత్తంలో ఐతే బయటకు వస్తాయని, ఈ బాలిక ఎక్కువగా వెంట్రుకలు తినడానికి అలవాటుపడిందని, ఇవి కడుపులో పేరుకుపోయి జీర్ణకోశంలో పెద్ద గడ్డలా కట్టేశాయన్నారు. సుమారు కిలో బరువున్న వెంట్రుకలు జీర్ణాశయాన్ని నింపివేయడంతో తిన్న అన్నం ఇమడక బయటకు రావడం, మిగిలిన కొద్ది ఆహారం జీర్ణంగాక శక్తి కోల్పోవడం జరుగుతోందని చెప్పారు. దీంతో బాలిక అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. రక్తహీనత కలిగినవారు ఈ విధమైన తిండికి అలవాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. -
చేయని ఆపరేషన్కు కుట్లు తీయాలన్న వైద్యులు..షాకైన పేషెంట్
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు.. ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు అదే విధంగా బడంగ్పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు. అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది. (చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం ) -
Medak: నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు
సాక్షి, మెదక్: ఓ వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేశాడు. అప్పటి నుంచి నరకయాతన అనుభవించిన సదరు వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ముల్లును తొలగించాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన సాయిలు నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లును మింగేశాడు. దీంతో అప్పటి నుండి ఇబ్బంది పడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందాడు. 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో అతను మెదక్లోని సాయిచంద్ర నర్సింగ్హాం ఆస్పత్రిలో చూపించుకోగా సదరు వైద్యుడు సురేశ్ శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును బయటకు తీశాడు. వైద్యవృత్తిలో ఇది చాలా అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు. -
చిన్నారికి తక్షణమే సర్జరీ!...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
నాలుగు నెలల శిశువుకి గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స వెంటనే చేయాలి. ఐతే అందుకు దాతల నుంచి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ససేమిరా అంటు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్లోని నాలుగు నెలల చిన్నారికి గుండెకి సంబంధించి లైఫ్ సేవింగ్ సర్జరీ వెంటనే చేయాల్సి ఉంది. ఐతే సర్జరీ కోసం దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆ రక్తం ఉపయోగిస్తే ఏమవుతుందో అని ఆందోళనతో హైకోర్టుని ఆశ్రయించారు. వారికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సేకరించి రక్తం తమ బిడ్డకు ఎక్కించడంపై విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...తమ బిడ్డకు తీవ్రమైన పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ ఉందని, శస్త్ర చికిత్స వెంటనే చేయాల్సి ఉందని చెప్పారు. ఐతే అందుకు ఉపయోగించే రక్తం పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న కలుషిత రక్తం కాకుండా మరేదైనా ఐతే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ఐతే న్యూజిల్యాండ్ బ్లడ్ సర్వీస్.. దాతాలు వ్యాక్సిన్ తీసుకునే దానినిబట్టి వారి నుంచి సేకరించిన రక్తాన్ని వేరుచేయడం జరగదని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తాన్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం ఉందనే దానిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఈ క్రమంలో ఆక్లాండ్ టె వాటు ఓరా ఆస్పత్రి డైరెక్టర్ వైద్యుడు మైక్ షెపర్డ్ మాట్లాడుతూ..".అనారోగ్యంతో ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు వారి సంరక్షణ కోసం తీసుకునే నిర్ణయం విషయంలో ఎంత ఆందోళన చెందుతారో అర్థం చేసుకున్నాం. శిశువు ఆరోగ్యం దృష్ట్యా పిల్లల సంరక్షణ చట్టం కింద సదరు చిన్నారిని తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పించి కోర్టు కస్టడీకి తీసుకోవాలి. అలాగే దానం చేసిన రక్తాన్ని ఉపయోగించేలా శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశాం. చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు." ఈ మేరకు హైకోర్టులో విచారణకు ఇరు పార్టీలు బుధవారం కోర్టులో హాజరయ్యారు. ఐతే కోర్టు వద్ద సుమారు వంద మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక మద్దతుదారుల బృందం పెద్ద ఎత్తున గుమిగూడి ఉండటం గమనార్హం. న్యూజిల్యాండ్ ధర్మాసం ఏం చెబుతుందా అని అందరూ ఒకటే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. (చదవండి: జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..) -
ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్లోని ఎప్పమ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది. ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్ అయ్యింది. ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు. ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. (చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష) -
అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్ ట్రీట్మెంట్ (ఎగ్జిట్) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు. పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. (చదవండి: టెన్త్లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?) -
సమంత లాగే కాజల్ కూడా ఆ పార్టుకి సర్జరీ చేయించుకుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా విడుదలైన యాడ్షూట్లో సామ్ లుక్ కాస్త డిఫరెంట్గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్లు...
ఇంతవరకు పలు రకాల వైరల్ వీడియోలు చూశాం. క్లినికల్ ఆపరేషన్కి సంబంధించిన వీడియోలు అరుదు. అందునా కంటికి సంబంధించిన సర్జరీ వీడియోలు చూసి ఉండం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. అమెరికాలో ఒక వృద్ధురాలికి కాంటాక్ట్ లెన్స్ ధరించే అలవాటు ఉంది. వాస్తవానికి ఇలాంటి కాంటాక్ట్లెన్స్ ధరిస్తే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా తీసేసి పడుకోవాలి. ఐతే ఆమె అలా చేయడం మరిచిపోయి ప్రతి రోజు మరో కొత్త లెన్స్ని వాడటం మొదలు పెట్టింది. ఇలా సుమారు ఒక నెల వరకు ఇలానే చేసింది. ఆ తర్వాత కన్ను నుంచి నీరు రావడం, ఇబ్బందిగా ఉండటంతో ఆ వృద్ధురాలు డాక్టర్ వద్దకు వచ్చింది. దీంతో వైద్యులు ఆమె కంటికి ఒక చిన్న సర్జరీ చేసి సుమారు 23 కాంటాక్ట్ లెన్స్లను తొలగించారు. ఈ మేరకు డాక్టర్ కటెరినా కుర్తీవా మాట్లాడుతూ...ఇలా కాంటాక్ట్ లెన్స్లు తీయడం మరిచిపోయి మళ్లీ కొత్తది పెట్టడం అనేది చాలా అరుదైన ఘటన అని అన్నారు. కాంటాక్ట్ లెన్స్ని వేరుచేయడానికి చాలా సూక్ష్మమైన పరికరాన్ని వినియోగించాల్సి వచ్చిందన్నారు. ఆ కాంటక్ట్ లెన్స్లన్నీ కంటిలో ఒక నెల వరకు ఉండటంతో ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయని చెప్పారు. ఇలా ఆమె వరుసగా 23 రోజులు చేసిందని అన్నారు. సర్జరీ తర్వా లెక్కిస్తే...కరెక్ట్గా 23 కాంటాక్ట్ లెన్స్లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు సదరు వైద్యురాలు ఆ సర్జరీకి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Ophthalmologist | Dr. Katerina Kurteeva M.D. | Newport Beach (@california_eye_associates) (చదవండి: బీటెక్ చదివితే జాబే చేయాలా.. ‘బీటెక్ చాయ్వాలి’ వెరీ స్పెషల్ అంటున్న నెటిజన్లు!) -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్కు రేడియేషన్తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఆసియా కప్లో హాంగ్కాంగ్తో మ్యాచ్ సందర్భంగా జడ్డూ కుడి మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జడేజా గాయాన్ని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స అనివార్యమని సూచించారు. ఈ నేపథ్యంలో జడ్డూకు నిన్న సర్జజీ జరిగింది. శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్లు జడేజానే స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు చాలామంది మద్దతుగా నిలిచారని.. బీసీసీఐ, సహచరులు, సపోర్ట్ స్టాఫ్, ఫిజయోలు, డాక్టర్లు మరి ముఖ్యంగా అభిమానులు నా వెన్నంటే నిలిచారని జడ్డూ తెలిపాడు. త్వరలోనే కోలుకునే ప్రక్రియ మొదలుపెడతానని, సాధ్యమైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అంటూ సర్జరీ తర్వాతి ఫోటోను షేర్ చేస్తూ కామెంట్స్ జోడించాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) కాగా, గత కొంతకాలంగా జడేజా గాయాలతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాతి నుంచి జడ్డూ ఆడిన ప్రతి సిరీస్లోనూ ఏదో ఒక గాయం బారిన పడుతూ వస్తున్నాడు. గాయం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా అర్ధంతరంగా వైదొలిగాడు. తాజాగా ఆసియా కప్లో కీలక దశ మ్యాచ్లకు ముందు గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టీమిండియాపై భారీగా చూపింది. సరైన బౌలింగ్ ఆల్రౌండర్ లేక టీమిండియా ఆసియా కప్ బరిలో నుంచి దాదాపుగా వైదొలిగింది. పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్లో కాని, తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కాని జడేజా ఉండి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని భారత అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు గ్రూప్ దశలో పాక్తో జరిగిన మ్యాచ్లో ఆతర్వాత హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో జడ్డూ అన్ని విభాగాల్లో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. గాయంతో జడేజా జట్టు నుంచి వైదొలగడంతో సూపర్-4 దశలో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో జడ్డూ టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికైనా కోలుకుని జట్టులో చేరాలని టీమిండియా అభిమానాలు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ఆసియాకప్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
వేలిముద్రలు మార్చి.. కువైట్కు తిప్పి పంపి! ఇంతకూ ఆ దేశానికే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: వేలిముద్రలు పడకుండా చోరీలు చేసే కిలాడీల కథలు లేదా నకిలీ వేలిముద్రలతో నేరాలకు పాల్పడే కేటుగాళ్ల ఉదంతాల గురించి మీరు ఇప్పటివరకు విని ఉంటారు. కానీ ఏకంగా శస్త్రచికిత్సల ద్వారా వేలిముద్రలను మార్చి కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వలస కార్మికులను అక్రమంగా తిరిగి ఆ దేశం పంపుతున్న ఓ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు తొలిసారి రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కె. మురళీధర్తో కలసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీసుల అదుపులో నిందితులు వేలిముద్రల సర్జరీ గురించి తెలుసుకొని.. సీపీ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండగారి నాగమునేశ్వర్రెడ్డి తిరుపతిలోని చంద్రగిరిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్లో రేడియాలజిస్ట్. అతనికి ఓ రోజు కువైట్లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తాను వీసా గడువు ముగిశాక కువైట్లో అక్రమంగా ఉండటంతో ఆ దేశ అధికారులు తిప్పి పంపారని... దీంతో శ్రీలంక వెళ్లి అక్కడ మ్యూటిలేటెడ్ ఫింగర్ప్రింట్స్ సర్జరీ చేయించుకొని మళ్లీ కువైట్కు వెళ్లినట్లు వివరించాడు. ఈ శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రలు తాత్కాలికంగా కొత్త రూపంలోకి మారతాయని పేర్కొన్నాడు. ఈ సర్జరీ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయిన మునేశ్వర్... కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వారికి ఈ సర్జరీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్లాన్ను తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేస్తున్న వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకట్ రమణకు తెలపగా అతను అంగీకరించాడు. తొలుత రాజస్తాన్కు... మునేశ్వర్రెడ్డికి కువైట్లోని తన స్నేహితుడి ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్తాన్లోని ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారికి మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్ సర్జరీ చేసేందుకు మునేశ్వర్, వెంకట రమణ రాజస్తాన్కు వెళ్లారు. ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున వసూలు చేసి శస్త్రచికిత్స చేశారు. అక్కడి పరిచయాలతో కేరళలోని మరో వ్యక్తి మునేశ్వర్ను సంప్రదించాడు. ఈ ఏడాది మేలో మునేశ్వర్, వెంకటరమణ కేరళకు వెళ్లి ఆరుగురికి ఈ సర్జరీ చేసి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బోవిళ్ల శివశంకర్రెడ్డి, పాత అట్లూరి గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డిలతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. కువైటే ఎందుకంటే? కువైట్ ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత అందుబాటులో లేదు. కేవలం వేలిముద్రల స్కానింగ్ మాత్రమే ఉంది. దీన్ని నేరస్తులు ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతోపాటు ఒక కువైటీ దినార్ భారతీయ కరెన్సీలో రూ. 258.15గా ఉండటం మరో కారణం. ఎలా చేస్తారంటే? చేతివేళ్ల మొనలపై చర్మం పొరను కత్తిరించి కణజాలంలో కొంత భాగాన్ని తీసేస్తారు. సర్జరీ కిట్ను ఉపయోగించి కుట్లు వేస్తారు. ఒకట్రెండు నెలల్లో గాయం మానాక వేలిముద్రల నమూనాలలో స్వల్ప మార్పులు వస్తాయి. ఈ కొత్త ఫింగర్ ప్రింట్లు ఏడాదిపాటు ఉంటాయి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేస్తాయి. దీంతో ఈలోగా కొత్తగా ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఇతరత్రా గుర్తింపు కార్డులను కేటుగాళ్లు పొందుతున్నారు. వాటితో కొత్త అభ్యర్థి లాగా కువైట్కు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్లో స్కానర్లో వేలిముద్రలను నమోదు చేసుకుంటున్నప్పుడు మ్యూటిలేటెడ్ ఫింగర్ప్రింట్స్ కావడంతో కొత్త ప్రవాసుడు అనుకొని వీసా స్టాంపింగ్ వేస్తున్నారు. ఒకవేళ కువైట్లో పట్టుబడితే.. ఒకసారి బహిష్కరణకు గురైతే పాస్పోర్టు రద్దవుతుంది. అందుకే నేరస్తులు మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్లతో కొత్త పాస్పోర్టు, వీసాలను పొందుతున్నారు. ఒకవేళ అక్కడి పోలీసులకు చిక్కినా.. అక్రమ పాస్పోర్టు కలిగి ఉన్నందుకు 2–7 రోజుల జైలుశిక్ష అనంతరం స్వదేశానికి డిపోర్ట్ అవుతున్నారు. ఆపై మళ్లీ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్తో మళ్లీ కువైట్కు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసంపై కువైట్ ఎంబసీని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖ రాస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్లో సర్జరీ కోసం వచ్చి... ఇప్పటివరకు ఈ ముఠా 11 మంది కువైట్ బహిష్కృతులకు ఈ సర్జరీలు నిర్వహించిందని.. వారిలో కొందరు నకిలీ పాస్పోర్టు, వీసాలతో మళ్లీ కువైట్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కువైట్ నుంచి బహిష్కరణకు గురైన పలువురు హైదరాబాదీలకు ఈ ముఠా సభ్యులు పరిచయమయ్యారు. దీంతో వారికి ఈ సర్జరీ చేసేందుకు కడప నుంచి ఈ ముఠా సభ్యులు గత నెల 29న అన్నోజిగూడకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న మల్కజ్గిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు... నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో 9 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, సర్జికల్ గ్లౌవ్స్, అయింట్మెంట్, యాంటీ బయోటిక్ మాత్రలు, హైడ్రోక్లోరైడ్ జెల్, ఇంజెక్షన్లు, సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇతరత్రా సర్జరీ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
నటి రాఖీ సావంత్కు శస్త్రచికిత్స.. 4గంటలపాటు సర్జరీ
బాలీవుడ్లో ఐటం సాంగ్స్తో పేరు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్. బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయిన రాఖీ బిగ్బాస్ షో నుంచి బయటకు వచ్చాక తరుచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్తో బ్రేకప్, అంతలోనే బిజినెస్మెన్తో లవ్, ఎంగేజ్మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ నటి. తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమాయణం సాగిస్తూ ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరుగుగుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రాఖీ సావంత్కు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవలె మేజర్ సర్జరీ చేయించుకున్న రాఖీ తన పరిస్థితిని అభిమానులతో షేర్ చేసుకుంది. గర్భాశయంలో కణతి వల్ల తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ జుహులో సుమారు 4గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ తర్వాత చాలా బలహీనంగా అనిపించింది అంటూ రాఖీ తెలిపింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫ్యాన్స్ సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
‘సినిమా సర్జరీ’ వైద్యులకు చిరు అభినందన
గాంధీఆస్పత్రి: ‘సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు’శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పందించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఆ సర్జరీపై ఆయన ఆరా తీశారు. యాదాద్రి జిల్లాకు చెందిన మహిళారోగి(60) మెదడులోంచి కణితిని తొలగించేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు గురువారం అవేక్ క్రేనియాటోమి సర్జరీ చేశారు. ఈ సర్జరీ చేస్తున్నప్పుడు నిరంతరాయంగా ఆమెను స్పృహలో ఉంచేందుకు ‘నీకు ఏ హీరో అంటే ఇష్టం’అని వైద్యులు అడగగా నాగార్జున, చిరంజీవి అంటే ఇష్టమని చెప్పింది. చిరంజీవి నటించిన సినిమాల్లో ఏది ఇష్టమని అడిగితే ‘అడవిదొంగ’ఇష్టమని చెప్పడంతో ఆ సినిమాను ఆమెకు కంప్యూటర్ ట్యాబ్లో చూపిస్తూ వైద్యులు సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ‘సాక్షి’లో వచ్చిన ఈ కథనాన్ని చదివి అబ్బురపడిన చిరంజీవి తన పీఆర్వో ఆనంద్ను శుక్రవారం గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, సర్జరీ చేసిన వైద్యులు, సర్జరీ జరిగిన మహిళను ఆనంద్ కలిశారు. తాను చిరంజీవి వీరాభిమానినని, ఆయన నటించిన అన్ని సినిమాలు చూస్తానని, ‘అడవిదొంగ’సినిమాలో చిరంజీవికి మాటలు రావని ఆమె చెప్పిన మాటలను పీఆర్వో వీడియో రికార్డింగ్ చేసి చిరంజీవికి వినిపించారు. ఆమె అభిమానానికి ఫిదా అయిన చిరంజీవి సర్జరీ చేసిన వైద్యులను అభినందించారు. మహిళారోగిని పరామర్శించేందుకు చిరంజీవి రెండురోజుల్లో గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తారని పీఆర్వో సూపరింటెండెంట్కు చెప్పారు. సర్జరీ చేసిన వైద్యులకు సన్మానం అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తన చాంబర్లో శుక్రవారం పుప్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్, వైద్యులు ప్రతాప్కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ హెచ్వోడీలు సుబోధ్కుమార్, వినయ్శేఖర్ తదతరులు పాల్గొన్నారు. -
‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రోగికి సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. స్పృహలో ఉన్న రోగి మెదడులోని కణితి(ట్యూమర్)నితొలగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ రకమైన సర్జరీని వైద్యపరిభాషలో అవేక్ క్రేనియటోమీ అంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, న్యూరోసర్జరీ హెచ్వోడీ డాక్టర్ ప్రకాశరావు, అనస్తీషియా వైద్యురాలు ప్రొఫెసర్ శ్రీదేవి తెలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు(60) అస్వస్థతతో ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో ప్రమాదకరమైన రీతిలో కణితి(ట్యూమర్) పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణ సర్జరీ చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదమని భావించి న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు సంయుక్తంగా అవేక్ క్రేనియటోమీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం సంబంధిత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సుమారు గంట సమయం వెచ్చించి ఆమెలో నమ్మకం కల్పించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లోని టేబుల్పైకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చారు. మెదడు పైభాగాన్ని తెరిచి సర్జరీ చేస్తున్న సమయంలో ఫిట్స్, పెరాలసిస్తోపాటు పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో స్పృహలో ఉన్న ఆమెతో నిరంతరాయంగా మాట్లాడుతూ యాక్టివ్గా ఉంచారు. తనకు చిరంజీవి, నాగార్జున అంటే అభిమానమని, చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పడంతో కంప్యూటర్ ట్యాబ్లో ఆ సినిమాను చూపించారు. ఆమె సినిమా చూస్తుండగా వైద్యులు సుమారు రెండు గంటలు తీవ్రంగా శ్రమించి మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్యూమర్ను తొలగించారు. వైద్యుల హర్షం తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన అవేక్ క్రేనియటోమీ సర్జరీ విజయవంతం కావడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన న్యూరోసర్జరీ, అనస్తీషియా వైద్యులు ప్రకాశరావు, ప్రతాప్కుమార్, నాగరాజు, శ్రీదేవి, సారయ్య, ప్రతీక్ష, అబ్బయ్య, పీజీలు కిరణ్, గిరీశ్, యామిని, స్ఫూర్తి, నర్సింగ్ సిబ్బంది రాయమ్మ, సవిన, రజిని, సుమ, వార్డ్బాయ్ నవీన్, వెంకన్నను వైద్యమంత్రి హరీశ్రావు, డీఎంఈ రమేశ్రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు శోభన్బాబు, నర్సింహనేత, టీజీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్షకార్యదర్శులు రాజేశ్వరరావు, భూపేందర్ రాథోడ్ తదితరులు అభినందించారు. -
ఆసుపత్రిలో దారుణం.. అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడంతో..
లింగోజిగూడ(హైదరాబాద్): భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్లో గురువారం జరిగింది. వైద్యులు అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన శ్రీపియల్ వెంకటేశ్వరరావు కుటుంబంతో సహా హయత్నగర్ సుబ్రహ్మణ్యనగర్లో నివాసం ఉంటూ కార్పెంటర్గా పని చేస్తున్నాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా ఇతని కుమారుడు మణిచంద్ర (28) కూడా తండ్రితో పాటు కార్పెంటర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆడుతుండగా కుడి చెయ్యి నొప్పి వచ్చింది. పలు ఆసుపత్రుల్లో చూపించినా నొప్పి తక్కువగా కాలేదు. పలువురి సూచన మేరకు ఎల్బీనగర్లోని శ్రీకార ఆసుపత్రిలో చూపించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం శస్త్ర చికిత్స చేయడానికి మణిచంద్రను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు కొద్ది సేపటి తర్వాత అతను మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. అనస్తీషియా (మత్తుమందు) అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మణిచంద్ర చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను శాంతిపజేశారు. మృతి చెందిన మణిచంద్ర కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఆసుపత్రి యజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. -
ఆమెలా ఉంటేనే గుర్తింపా?.. ఈమెకిది పునర్జన్మే!
అందంగా ముస్తాబు కావాలని, స్టయిల్గా ఉండాలనే తాపత్రయం ఎవరికి ఉండదు!. అయితే.. ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు కొందరు.. రెట్టింపు చేయాలన్న ఆరాటంతో నానా ప్రయత్నాలు చేసేవాళ్లు మరికొందరు. కానీ, ఇక్కడ ఓ యువతి అలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. 12 ఏళ్లుగా.. ఏకంగా 40 కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఒళ్లు హునం అయినా భరించింది. మన కరెన్సీలో నాలుగున్నర కోట్లు రూపాయల పైనే ఖర్చు చేసింది. చివరికి.. తత్వం బోధపడి తన రూపం తిరిగి కావాలంటూ మళ్లీ సర్జరీలు చేయించుకుంటోంది. అమెరికన్ సోషల్ ఫిగర్, సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్లా మారాలని ఓ యువతి కలలు కనింది. కానీ, అదంతా పైపై మెరుగులే అని గుర్తించేందుకు పదేళ్లు పైనే పట్టింది. ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్. ఇటలీ టాప్ కంపెనీ వర్సేస్లో మోడల్గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. మంచి చదువుతో పాటు వృత్తిలోనూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ఉమెన్గా రాణించాలనుకుంది. కానీ, కిమ్ కర్దాషియన్లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయ్యింది. ఆనందమే.. పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్లా బాడీ షేప్స్ రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్ కర్దాషియన్లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) కానీ.. కిమ్ కర్దాషియన్(ఎడమ), జెన్నిఫర్ పాంపలోనా(కుడి) అంతా ఆమెకు అనుకూలంగా సాగితే ఎలా?. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. సహజత్వం కోల్పోయింది ఆమె శరీరం. తన శరీరం తన అదుపు తప్పిందని గుర్తించింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా.. ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మళ్లీ ఖర్చు చేసి.. ఇస్తాంబుల్లో ఓ ఫిజీషియన్ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె. జెన్నిఫర్ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చిందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్కు సలహా ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్.. ఎబోట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్’ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్. అంతేకాదు.. డీట్రాన్సిషన్ సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా. -
'ప్రేమ' ఎంత పని చేసింది...ప్రియురాలి కోసం అతడుగా ఆమె...
ప్రేమ రెండక్షరాల పదమే అయిన ప్రేమికుల చేత ఎంతటి పనైనా చేస్తుంది. దీనిక ఆడా లేదా మగ అతీతం కాదు. తమకు నచ్చిన వారికోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అచ్చం అలానే ఒక లెస్బియన్ జంట ఎంతటి సాహాసానికి ఒడిగట్టారో వింటే షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే... యూపీకి చెందిన ఇద్దరూ లెస్బియన్లు ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. తాము ఇక ఒక్కటవ్వాలని నిర్ణయించుకంటారు. అందుకోసం తమ పెద్దవాళ్లను ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ వారు అంగీకరించకపోవడంతో ఏం చేయాలో పాలోపోలేదు. ఇక చివరికి లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకై ప్రయాగ్రాజ్లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్లోని వైద్యుల బృందాన్ని సంప్రదించారు కూడా. సదరు మహిళకు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తామని వైద్యులు చెప్పారు. ఐతే ఆమె అతడుగా మారడానికి సుమారు ఒకటిన్నర సంవత్సారాలు పడుతుందని తెలిపారు. లింగ మార్పిడి తర్వాత ఆమె గర్భందాల్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇలాంటి అపరేషన్ని నిర్వహించడం ఇదో తొలిసారని, దాదాపు 18 నెలల వ్యవధి పడుతుందని చెప్పారు. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
చిట్టి గుండెకు గట్టి అండ
లక్డీకాపూల్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఇక నుంచి నవజాత శిశువులకు సైతం హృద్రోగ శస్త్రచికిత్సలు చేయనుంది. పుట్టుకతో ఏర్పడే గుండె సమస్యలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్, సువెన్ ఫార్మాసూటికల్స్ సహకారంతో రూ. 5 కోట్లతో నిమ్స్లో నూతనంగా నవజాత హృదయ సంబంధ శస్త్రచికిత్సల విభాగం (పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్) ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఈ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. 50 పడకలు.. ఆధునిక సదుపాయాలు 50 పడకలతో కూడిన పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ విభాగంలో 6 పడకల అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) కూడా ఉంది. నవజాత శిశువుల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్–1 ఎయిర్ కండిషన్డ్ ఐసొలేషన్ వార్డును సైతం నిమ్స్ సమకూర్చుకుంది. అతిసూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉండటం ఈ వార్డు ప్రత్యేకత. అంతేకాకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పీడియాట్రిక్, నియోనాటల్ సామర్థ్యాలను కూడా నిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో శరీరంలో చోటుచేసుకొనే మార్పులను పసిగట్టి వైద్యులను ముందే హెచ్చరించే అధునాతన కార్డియాక్ అవుట్పుట్ మానిటర్ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రాన్ని సమకూర్చారు. రూ.40 లక్షలతో హార్ట్ లంగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫస్ట్.. నిమ్స్ తరహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్సలు చేయడానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ ఎం. అమరేష్రావు, నిమ్స్ సీటీ సర్జన్ (చదవండి: -
వికటించిన సర్జరీ.. మృత్యువుతో పోరాడి ఓడిన మోడల్
బ్రెసిలియ: విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో. ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న టైంలో.. ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం.. రెండు నెలలు కోమాలో ఉన్న ఆ మాజీ సుందరి(27) కన్నుమూసింది. మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రెజిల్ మాజీ సుందరి గ్లెసీ కొర్రెయియా మోడల్, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్ బ్రెజిల్ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రాణిస్తోంది ఆమె. అయితే.. గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్ క్లినిక్లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. -
శ్రీలంక బాలికకు అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చెన్నై: శ్రీలంకకు చెందిన 12 ఏళ్ల బాలికకు చెన్నై క్రోమ్ పేటలోని మల్టీ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ రేలా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. బుధవారం ఈ చికిత్స గురించి ఆర్టోపెడిక్స్ హెడ్ పార్థసారథి శ్రీనివాసన్ మీడియాకు వివరించారు. శ్రీలంకకు చెందిన సాన్వి(12) మూడేళ్లుగా విపరీతమైన వెన్ను నొప్పితో బాధ పడుతూ వచ్చింది. దీంతో చెన్నై రేలాకు తీసుకొచ్చారు. స్కోలియోసిస్ బారిన ఆ బాలిక పడ్డట్లు గుర్తించారు. ఈ కారణంగా వెన్నెముక 140 డిగ్రీల వంపుతో ఎస్ ఆకారానికి చేరింది. ఆమె బరువు 30 కేజీలు మాత్రమే ఉండటం రక్తం పరిమాణం 2.5 లీటర్లు ఉండడంతో నిపుణులతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఎస్ ఆకారం నుంచి వెన్నెముక నిటారుగా యథాస్థితికి చేర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో బాలిక ఇకపై ఎత్తు పెరగడమే కాకుండా, తల భాగాన్ని పైకి కిందికి కదిలించే అవకాశం లభించిందన్నారు. చదవండి: సిద్ధూ హత్య కేసు: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు -
బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద
ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలివి.. రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు. 50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ స్రవంతి బృందం, విమ్స్ ఆర్ఎంవో డాక్టర్ విజయకుమార్ పాల్గొన్నారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!
నారీ కాంట్రాక్టర్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు. కాలంలో కొంచెం వెనక్కి వెళితే మాత్రం నారీ కాంట్రాక్టర్ పేరు సుపరిచితమే. 1950-60ల మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్గా గుర్తింపు పొందాడు. అంతేకాదు నారీ కాంట్రాక్టర్ టీమిండియాకు కెప్టెన్గానూ పని చేయడం విశేషం. ఇదంతా సరే.. ఇప్పుడెందుకు ఈ క్రికెటర్ ప్రస్తావన అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. బౌన్సర్ దాటికి నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడంతో క్రికెట్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత అతని తలలో ఒక మెటల్ ప్లేట్ అమర్చారు. ఇదంతా 1962 నాటి మాట.. కట్చేస్తే 60 ఏళ్ల తర్వాత వైద్యులు నారీ కాంట్రాక్టర్ తలలో నుంచి మెటల్ ప్లేట్ను విజయవంతగా తొలగించారు. ప్రస్తుతం నారీ కాంట్రాక్టర్ వయసు 80 ఏళ్లు. మెటల్ ప్లేట్ తొలగింపు తర్వాత ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు నారీ కాంట్రాక్టర్ కుమారుడు హెషెడర్ పేర్కొన్నాడు. అసలేం జరిగింది..? 1962లో టీమిండియా వెస్టిండీస్లో పర్యటించింది. ఆ పర్యటనే నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కెరీర్కు ముగింపు పలుకుంతుందని బహుశా ఊహించి ఉండడు. విండీస్తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బౌలర్ వేసిన బౌన్సర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే నారీ కాంట్రాక్టర్ కుప్పకూలాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ చండీ ఆధ్వర్యంలో నారీ కాంట్రాక్టర్ తలకు తగిలిన దెబ్బను పరిశీలించి మెటల్ ప్లేట్ను అమర్చారు. అప్పటినుంచి బాగానే ఉన్నప్పటికి ఇటీవలే స్కానింగ్ చేయగా.. మెటల్ ప్లేట్ వల్ల చర్మం ఉడిపోతూ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ నిర్వహించి తలలోని మెటల్ ప్లేట్ను తొలగించారు. కాగా నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడానికి ముందే ఔటయ్యే అవకాశం వచ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్ విండీస్ ఫీల్డర్ జారవిడవడంతో.. బౌన్సర్ ఆడి శాశ్వతంగా క్రికెట్కు దూరమయ్యాడు నారీ కాంట్రాక్టర్. టీమిండియా తరపున 1955-62 మధ్య కాలంలో 31 టెస్టుల్లో 1611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1955-62 మధ్య కొంతకాలం టీమిండియా కెప్టెన్గానూ పని చేశాడు. చదవండి: Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్చేస్తే మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే -
సీఎం కేసీఆర్ పంటికి శస్త్రచికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పంటికి సోమవారం శస్త్రచికిత్స జరిగింది. కొద్దిరోజులుగా తీవ్ర పంటినొప్పితో సతమతమవుతున్న కేసీఆర్ పరీక్షల నిమిత్తం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యుడికి సంబంధించిన ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్కు శస్త్రచికిత్స చేసి ఓ పంటిని తొలగించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్స నిమిత్తం అనస్తీషియా సైతం ఇవ్వడంతో కేసీఆర్ రోజంతా విశ్రాంతిలోనే గడిపారు. మరో రెండ్రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. తుగ్లక్రోడ్డులోని కేసీఆర్ నివాసానికి పలువురు ఎంపీలు మధ్యాహ్నం వెళ్లినప్పటికీ ఆయన విశ్రాంతిలో ఉండటంతో కలవలేక కేవలం భోజనం చేసి వెళ్లిపోయారు. బాబూ జగ్జీవన్ రామ్కు సీఎం కేసీఆర్ నివాళి సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగుబలహీన వర్గాల నేత, డా.బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్మరించుకున్నారు. ఏప్రిల్ 5న ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ బాబూ జగ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన నేత బాబూ జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. -
ప్రభాస్కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్,అసలేమైందంటే..
Prabhas Undergoes Minor Surgery: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసుపత్రిలో చేరాడు. షూటింగ్లో గాయపడటంతో సర్జరీ కోసం ఆయన స్పెయిన్ వెళ్లారు. రీసెంట్గా రాధేశ్యామ్తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల కొందట ప్రభాస్ సలార్ షూటింగ్లో గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయన సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడే బార్సిలోనాలో ఆయనకు చిన్న శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తుంది. చికిత్స అనంతరం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక ప్రభాస్ సర్జరీ గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు డైరెక్టర్ మారుతీతో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. -
డాక్టర్లు సూచించారని స్విమ్ చేశాడు... అదే అతనికి మృత్యువైంది
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్లో పడి నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రెజిమెంటల్బజార్కు చెందిన శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయిసూర్యతేజ 2019లో ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చదువు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం సివిల్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ నెల 7న ఆస్ట్రేలియా బ్రిస్బన్ లోని తాను నివాసం ఉంటున్న గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. డాక్టర్ సూచనలతో.. 2020లో సాయి సూర్యతేజ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి కాలు ప్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. వచ్చే నెలలో మరో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తన అపార్ట్మెంట్ కింద ఉన్న పూల్కు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా.. వచ్చే నెలలో సాయి సూర్యకు శస్త్ర చికిత్స జరుగనుండటంతో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఏప్రిల్ 2న ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంతలో కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో వారు బోరున విలపిస్తున్నారు. మృతుడి స్నేహితు లు సాయి మృతదేహాన్ని నగరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో మృతదేహం నగరానికి చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు. (చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ) -
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ఆపరేషన్
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారట. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చిందట. ఈ విషయం తెలిస్తే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడే అవకాశం ఉందని, రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ.. ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. కానీ ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్ కారణంగానే ‘రాధేశ్యామ్’ప్రమోషన్స్లో ఆయన పాల్గొనలేకపోయాడట. మూవీ విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. -
అవకాశాల కోసం 15ఏళ్లకే ఆ సర్జరీ చేయించుకున్నా : నటి
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ బిగ్బాస్లో పొల్గొని మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం కాంట్రవర్సీ క్వీన్గానే గుర్తింపు పొందిన రాఖీ బిగ్బాస్ అనంతరం మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ ప్రయాణం అంత సులవైంది కాదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో పాట్లు పడ్డాను. 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నాను. అది నన్ను ఎంతో భయపెట్టింది. బాలీవుడ్లో చోటు సంపాదించాలని కలలు కన్నాను. ఆ సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు సైతం సర్జరీలు చేయించుకుంటున్నారు. బాలీవుడ్లో అవకాశాలు రావాలంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని చెప్పారు. ఈ సమయంలో నేను సరైన రీతిలో లేను. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అని రాఖీ చెప్పుకొచ్చింది. కాగా రాఖీ బ్రెస్ట్ ఇంప్లాంట్తో పాటు లైపో సక్షన్ వంటి ప్రయత్నాలు చేసి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. -
మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్ఫ్లైస్ తొలగింపు!
న్యూఢిల్లీ: ప్రకృతి అంటే ఇష్టపడిని వారు ఉండరు. అందుకోసం చాలామంది అడువులకు లేదా పచ్చదనంతో కూడిని మంచి అందమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. మరి కొద్దిమంది ఏ మాత్రం అవకాశం దొరకిన ప్రపంచంలో మంచి అభయ అరణ్యాలను సందర్శించటం వంటివి చేస్తుంటారు. అయితే అడువుల్లో తిరిగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కు గురవడమే కాక ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుందంటున్నారు వైద్యులు. జౌను ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించిన ఒక మహళకి మియాసిస్ అనే ఒక రకమైన టిష్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమెకు సోమవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. మియాసిస్(బోట్ ఫ్లై) అనేది మానవ కణజాలంలో ఫ్లై లార్వా (మాగ్గోట్)కి సంబంధించిన ఇన్ఫెక్షన్. అయితే ఆమె ఆమెరికాలో ఉండగానే తనకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని చ్పెపారు. కానీ అక్కడి అమెరికన్ వైద్యులను సంప్రదించినప్పడూ ఆ రోగ లక్షణానికి సంబంధించిన ఉపశమన మందులు ఇచ్చి పంపించేశారని ఆమె తెలిపారు.అయితే ఆమెకు మళ్లీ నాలుగు వారాల నుంచి శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనిపించడం, కనురెప్పలో వాపు, కళ్లు ఎరుపెక్కడం వంటి ఫిర్యాదులతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆ అమెరికన్ మహిళ ఒక ప్రయాణికురాలు. కాబట్టి ఆమె ప్రయాణ చరిత్ర గురించి ఆరా తీయగా.... ఆమె ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించి వచ్చినట్లు చెప్పారు. దీంతో మియాసిస్(బోట్ ఫ్లై) కి సంబంధించిన కేసుల గురించి వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఇన్ఫక్షన్స్కి గల కారణాలను నిర్ధారణ చేశారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలోని మూడు ప్రత్యక్ష బొట్ ఫ్లైస్ను తొలగించారు. ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి బోట్ ఫ్లైని తొలగించారు. అంతేకాదు ఎలాంటి అనస్థీషియా లేకుండా అన్ని అస్ప్టిక్ జాగ్రత్తలతో 10-15 నిమిషాల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. మియాసిస్(బొట్ ఫ్లైస్) అనే ఇన్ఫక్షన్ ఉష్ణమండల ప్రాంతాలలో నివశించే వారికి వస్తుంది. ఇది ఒక రకమైన పరాన్నజీవి అడవులలో చెట్లను ఆశ్రయించి ఉంటుంది. ఇది మానవుని శరీరంలో సున్నితమైన పొరల్లోకి చొచ్చుకుపోయి మానవ కణజాల వ్యవస్థలను నాశనం చేసి ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో, ఇటువంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడినప్పుడు లేదా అడువుల్లోనూ, దట్టమైన చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సంచరించినప్పుడూ ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: చెత్త యవ్వారం: కంటెయినర్ల నిండా టన్నుల్లో! యూకేకు షాకిచ్చిన లంక) -
కుక్క వింత గర్భం!... ఆశ్చర్యపోయిన వైద్యులు..
Owner Felt The Dog Had Become Pregnant: చాలా రకాల సంఘటనలు గురించి విన్నప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనకు ఆనందాన్ని ఇస్తే మరికొన్ని మాత్రం మనకు భయాన్ని కలుగజేస్తాయి కూడా. అచ్చం అలాంటి సంఘటనే యూకేలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ కొన్ని రోజులుగా వాంతులు చేసుకుంటూ నీరసంగా ఉంది. పైగా ఆ కుక్క పొట్ట ఉబ్బి ఉంది. దీంతో నీల్ కుక్క కడుపుతో ఉందనుకుని ఆనందంగా బ్లైత్మ్యాన్ పార్ట్నర్స్ వెటర్నరీ ప్రాక్టీస్ క్లినిక్కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు ఆ కుక్కని పరీక్షించి ఎక్క్రే తీశారు. అంతే వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వైద్యులు అసలు విషయం నీల్కి వివరించారు. కుక్క కడుపులో చాలా గోల్ఫ్ బంతులు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుక్కకి వైద్యులు సర్జరీ చేసి ఏకంగా 25 గోల్ఫ్ బంతులను కడుపులోంచి తీశారు. ఇన్ని గోల్ఫ్ బంతులు కుక్క కడుపులోకి ఎలా ఉంచాయో తెలియదని టేలర్ చెప్పాడు. అయితే కొద్ది రోజుల క్రితం నీల్ టేలర్.. ఆల్ఫీ(కుక్క)తో కలిసి గోల్ఫ్ కోర్టుకు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్ఫీ పరిస్థితి విషమించడం ప్రారంభించిందని అన్నాడు. పైగా ఆకస్మాత్తుగా ఆల్ఫీకి వాంతులు అవ్వడం, నీరసంగా మారిపోవడం జరిగిందని వాపోయాడు. కానీ ఆల్ఫీ ఇన్ని బంతులు మింగినట్లు తాను గమనించలేదని చెప్పుకొచ్చాడు. అయితే నీల్కి ఆ ఆసుపత్రి సర్జరీ కోసం సుమారు రూ. 2 లక్షల 37 వేల బిల్లు వేశారు. నీల్ మాత్రం తన కుక్క ప్రాణాలతో సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు. (చదవండి: మోడల్గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్తో యాషెస్ టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్షేక్, ఐస్క్రీమ్లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్మూనీ యాషెస్లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
ఆపరేషన్ తారుమారు.. మాకే ఎందుకు కడుపు‘కోత’?
సాక్షి, వీణవంక(కరీంనగర్): తమ కుటుంబంలోకి కవల పిల్లలు రాబోతున్నారని తెలిసి, ఇంటిల్లిపాది ఆనందపడ్డారు.. కుటుంబసభ్యులు ఆ గర్భిణికి పౌష్టికాహారం అందిస్తూ కంటికిరెప్పలా చూసుకున్నారు.. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల తర్వాత జరగాల్సిన ఆపరేషన్ 7వ నెలలో జరగడంతో పాప మృతిచెందింది.. బాబు అతి తక్కువ బరువుతో పుట్టి, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు.. దీంతో బాధిత కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు కడుపుకోత మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారిని ‘సాక్షి’ పలకరించగా కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాలిలా ఉన్నాయి.. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి–మాలతిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. మాలతి గర్భం దాల్చడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. తర్వాత స్కానింగ్లో కవల పిల్ల లు అని వైద్యులు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమెకు ఆహారం మొదలు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మాలతికి 7వ నెలలో జూన్ 16న కడుపునొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు 21 వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. చదవండి: టీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారు: ఈటల రాజేందర్ అదేరోజు మరో గర్భిణికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంతో మాలతి పొట్ట కోశారు. బాధితురాలు తాను ఆపరేషన్ కోసం రాలేదని మొత్తుకుంది. దీంతో అలర్ట్ అయిన వైద్యులు కేస్షీట్లు పరిశీలించారు. వేరొకరికి చేయాల్సిన ఆపరేషన్ ఈమెకు చేశామని తెలుసుకొని వెంటనే కుట్లు వేసి, తమ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు జూన్ 25న డీఎంహెచ్వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో అదే నెల 26న ఆపరేషన్ చేయగా పాప మృతిచెందింది. బాబు కేవలం 1,300 గ్రాముల బరువుతో పుట్టాడు. కలెక్టర్కు ఫిర్యాదుతో విచారణ మాలతికి ఆపరేషన్ తారుమారు ఘటనపై వైద్యాధికారులు స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే తగిన న్యాయం జరగకపోవడంతో బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కానీ విచారణ చేపడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాలతి భర్త నరోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పుడు బాబుకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ వైద్యాధికారులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి అనారోగ్య సమస్యలు కవలల్లో ఒకరు మృతి చెందగా బాబు పుట్టినప్పటి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాలతి కుటుంబానికి కడుపుకోత మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో మహిళకు జరగకూడదు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పుట్టిన బాబు ఆరోగ్యంగా లేడు. అధికారులు నీలోఫర్లో చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు చూపించలేదు. మాతా శిశు కేంద్రంలో మంగళవారం విచారణ జరిపారని తెలిసింది. మాకు సమాచారం లేదు. నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. – మాలతి, బాధితురాలు -
కుక్క కడుపులో కోవిడ్ మాస్క్.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలోని వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లో వైద్యులు బుధవారం అరుదైన ఆపరేషన్ చేసి కుక్క చిన్న ప్రేవుల్లో ఇరుకున్న మాస్క్ను తొలగించారు. తిరుపతి చింతలచేను ప్రాంతంలో 6 నెలల వయసున్న మగకుక్క 4 రోజుల నుంచి వాంతి చేసుకుంటూ అనారోగ్యంతో ఉండడంతో వీసీసీకి తీసుకొచ్చారు. చదవండి: Vijayawada: శిశువు మృతిపై బంధువుల ఆందోళన ఎక్స్రే తీసిన అనంతరం డాక్టర్ భారతి, డాక్టర్ రఘునాథ్, డాక్టర్ ఎన్,ధనలక్ష్మి శస్త్రచికిత్స చేసి మాస్కును తొలగించారు. ప్రజలు వినియోగించిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్లే మూగజీవాలు ఇలాంటి సమస్యల్లో చిక్కుకుంటున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. -
సిబ్బంది నిర్వాకం.. చెకప్కు వస్తే పొట్టకోసి ఓ బిడ్డను చంపేశారు.. మరో బిడ్డేమో...
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడాది జూన్ 21న ఒకరికి చేయాల్సిన శస్త్రచికిత్స మరొకరికి చేసిన ఘటనకు సంబంధించి మంగళవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులు విచారణ జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణి కేస్షీట్ ఆధారంగా సాధారణ చికిత్స కోసం వచ్చిన వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన 7 నెలల గర్భిణి మాలతి పొట్ట కోసిన విషయం విధితమే. బాధితురాలి కడుపులో కవలలు ఉండగా, ఒక శిశువు బాగాలేదని తెలిసి వైద్యం కోసం వచ్చింది. సర్వీస్ స్టిచెస్ వేస్తే ఇబ్బంది ఉండదని చెప్పిన వైద్యులు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డెలివరీకి వచ్చిన గర్భిణికి సంబంధించిన కేస్షీట్ ఆధారంగా మాలతికి సర్జరీ చేసేందుకు పొట్ట కోశారు. అప్పటికే మాలతి అరుస్తూ తాను డెలివరీ కోసం రాలేదని, సర్వీస్ స్టిచెస్ కోసం వచ్చానని చెప్పడంతో తప్పును తెలుసుకొని, తిరిగి కుట్లు వేశారు. దీంతో మాలతి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయడంతోపాటు పోలీసులను ఆశ్రయించారు.కలెక్టర్ ఆదేశాలతో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల స్థానిక వైద్యులచే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు బాధ్యురాలిగా స్టాఫ్నర్సు మాధవిని తేల్చి, సస్పెండ్ చేశారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాబును కోల్పోయామని మరో బాబు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండటం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను వదిలి నర్సుపై చేపట్టిన చర్యలపట్ల సంతృప్తి చెందని బాధితురాలి బంధువులు వైద్యారోగ్యశాఖ కమిషనర్ను, హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చదవండి: కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి వారి ఫిర్యాదుతో జిల్లా ఆస్పత్రికి చేరుకున్న కమిషనర్ కార్యాలయ అధికారులు జరిగిన ఘటనపై డాక్టర్లు, నర్సులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అయితే అసలు దోషులకు శిక్షపడేలా చూడాలని మాలతి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
మహేశ్బాబుకి సర్జరీ.. రెండు నెలల పాటు విశ్రాంతి!
సూపర్ స్టార్ మహేశ్బాబుకు సర్జరీ జరిగింది. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు ఇటీవల స్పెయిన్కి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు మహేశ్బాబు షూటింగ్కి దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్కు బ్రేక్ పడనుంది. ఆ కారణంగానే సినిమా విడుదల తేదిని కూడా వాయిదా వేశారు. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. కాగా, మహేశ్బాబుకి గతంలో కూడా మోకాలి నొప్పితో గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్కి వెళ్లారు. అప్పుడు సర్జరీ చేయించుకోకపోవడం వల్లే ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకే ఆయన స్పెయిన్ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. ఇక మహేశ్ సర్జరీ చేయించుకున్నారనే వార్త విన్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. -
బంగారు నెక్లెస్ని మింగిన ఆవు.. యజమానికి తెలియడంతో..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు చాలా మందికే ఉంటుంది. కొందరు కుక్కలను, పిల్లులను, మరి కొందరు ఆవులను కూడా పెంచుకుంటారు. కాకపోతే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఓ కుటుంబం కాస్త ఏమరుపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు గొలుసు మింగేసింది. దాన్ని ఆవు కడుపులోంచి బయటకు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిర్సీ తాలూకాలోని హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే ఇంట్లో ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి ముందురోజు గోవు పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆవు, దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. భారతదేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవులను పూల దండలతో అలంకరించడం మామూలే. హెడ్జ్ కుటుంబం సభ్యులు మాత్రం పూల దండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడకి అలంకరించారు. వాటికి పూజ చేసిన అనంతరం పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత పూలు , ఆ బంగారు గొలుసు మాయమయ్యాయి. కుటుంబీకులు ఆ గొలుసు కోసం గోశాల మొత్తం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబసభ్యులకు భావించారు. అవు పేడ వేస్తే.. దానితో పాటు నెక్లెస్ కూడా వస్తుందిలే అని అనుకున్నారు. అలా ఓ నెల రోజుల పాటు.. దాని పేడను రోజూ చెక్ చేస్తూ వచ్చారు కానీ.. ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆ ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నెక్లెస్ను తీయడం కోసం దానికి సర్జరీ చేయించి గొలుసుని బయటకు తీశారు. కాకపోతే 20 గ్రామలు ఉండాల్సి గొలుసు కాస్త 18 గ్రాములే బయటకు వచ్చింది. నెక్లెస్లోని ఒక చిన్న భాగం మాత్రం మిస్ అయినా.. చివరకి ఆ గొలుసు ఆవు కడుపులోంచి తీసినందుకు ఆ ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగున్నట్లు ఆ హెడ్జ్ కుటుంబం తెలిపింది. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిని షేక్ అబ్దుల్ రహీం లక్డీకపూల్లో మిరాకిల్ గ్లాస్ ట్రేడర్ పేరు షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్ కొడుకు షేక్ జునేద్ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్ అబ్దుల్ రహీమ్.. జునేద్ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్కు పరీక్షలు నిర్వహించి క్లినిక్లోకి తీసుకువెళ్లి షేక్ అబ్దుల్ రహీమ్ను అడగకుండానే మైనర్ సర్జరీ చేసి కురుపును తొలగించాడు. సర్జరీ విషయం తెలిసిన జునైద్ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్ జునేద్కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్ జునేద్కు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. కురుపు వద్ద మైనర్ సర్జరి చేసే సమయంలో సూది జునైద్ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్ సజ్జాద్ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్ జునైద్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్ అబ్దుల్ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్ జునైద్ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్ టూంబ్స్ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
‘దేవుడా.. ఏంటీ నాకీ శిక్ష ? నా కాళ్లపై నేను నిలబడలేనా?’
నా పేరు నగేశ్. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో మా ఊరు ఉంది. పేరుకు శివమొగ్గ అని జిల్లా పేరు చెప్పాను. కానీ నాకంటూ సొంత ఇళ్లు , సొంత కుటుంబం, సొంత ఊరంటూ లేదు. నాకు ఐదేళ్ల వయస్సుప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఫుట్పాత్లే నా ఇళ్లుగా మారాయి. ఒక్క పూట తిండి దొరక్క కన్నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు లేక దారి తెన్ను లేకుండా గడిచిపోతున్న నా జీవితానికి సుమనహళ్లి ట్రస్టు రూపంలో ఓ భరోసా దొరికింది. ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి లేని నన్ను ఓ అనాథ ఆశ్రమంలో చేర్చింది. అక్కడే నా అంటూ లేని నా వాలాంటి వాళ్లతో ఓ కుటుంబం ఏర్పడింది. పెద్దయ్యాక ఏదైనా పని చేసి కడుపు నిండా ఇష్టమైన తిండి తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, గౌరవంగా జీవించాలని అనుకునే వాడిని టీనేజీలో ఉన్నప్పుడే నా కాలి చర్మం మీద చిన్న కురుపులు వచ్చాయి. మూడు పూటల తిండి దొరకడమే అదృష్టమనుకునే ఆ సమయంలో కాలిపై వచ్చిన చిన్న కురుపులను పట్టించుకోలేదు. చూస్తుండగానే అది అలా పెరిగి పెద్దదయ్యింది. 2018 వచ్చే సరికి నడవడం కష్టం అనిపించే స్థాయికి నా కాళ్లు వాచిపోయాయి. ట్రస్టు సభ్యుల సహాకారం మరికొందరు మనసున్న మనుషుల సాయంతో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ నన్ను పరిశీలించిన డాక్టర్లు నాకు వచ్చిన ఆరోగ్య సమస్యని లింఫెడెమా ఎలిఫెన్షియాసిస్గా తేల్చారు. ఈ సమస్య కారణంగా అడుగు తీసి అడుగు వేయడం భారంగా ఉండేది. చూడటానికి నా కాళ్లు ఎంతో వికారంగా కనిపించేవి. ఒక వయస్సు వచ్చాక పని చేసుకుని గౌరవంగా బతుకుదామని ఎవరి దగ్గరికి వెళ్లినా నా కాళ్లను చూసి పని ఇచ్చే వారు కాదు. ఇదే సమయంలో నా పాదాల నుంచి పై వరకు కాళ్లంతా బాగా వాచి పోయాయి. మంచానికే పరిమితమయ్యే దుస్థితిలోకి జారిపోయాను. నా సమస్యను గమనించిన డాక్టర్లు ఓ పరిష్కారం చెప్పారు. కాళ్లు సాధారణ స్థితికి రావాలంటే మూడు సార్లు ఆపరేషన్ చేయడంతో పాటు మెడిసిన్స్ వాడాలన్నారు. దీని కోసం రూ. 30,00,000 (ముప్పై లక్షలు) ఖర్చు వస్తుందన్నారు. భోజనం చేయడమే గగనం అనిపించే నాకు అంత డబ్బు సమకూర్చుకోవడం కలలో కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ తల్లిదండ్రులు లేని స్థితి నుంచి ఈ రోజు వరకు బతికి ఉన్నానంటే.. దానికి కారణం ఈ సమాజం నాపై చూపించిన ప్రేమ, కరుణ. ట్రస్టు , అనాథ శరణాలయం రూపాల్లో ఆ దైవం నాకు ఏదో రకంగా సాయం అందిస్తూనే ఉన్నాడు. అందుకే మరోసారి నా ఆపరేషన్కి అవసరం అయ్యే డబ్బులను సాయంగా అందివ్వమని కెట్టో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసుకుని బాగైన తర్వాత ఏదైనా పని చేసుకుని గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
Mahesh Babu: సూపర్స్టార్ మహేశ్బాబుకి సర్జరీ.. షూటింగ్కు బ్రేక్
Super Star Mahesh Babu Undergo Surgery In Usa: సూపర్స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో శస్త్రచికిత్స కోసం మహేశ్ యూఎస్కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్కు బ్రేక్ పడనుంది. రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా పడనున్నట్లు సమాచారం. మరోవైపు ట్విట్టర్లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. I wish u to have Speed Recovery Annayya 🥺#GetWellSoonMaheshBabu#SarkaruVaariPaata pic.twitter.com/4hHZTuA2ps — Maheshwar Thota 🔔 (@ThotaMaheshwar) December 1, 2021 Cinema late ina parley Anna, Ne health jagratha @urstrulyMahesh Annayya ❤️👍 మీకు ఏం కాదు అన్న మీ మంచితనం మీమల్ని ఎప్పుడు కాపాడుతుంది 💯🙏 Love you Anna 💗#GetWellSoonMaheshAnna #MaheshBabu #GetWellSoonMaheshBabu pic.twitter.com/n1TSyiOPhB — Bharath Dhfm 🔥🦁😎 (@Bharath19774940) December 1, 2021 Get well soon Superstar @urstrulyMahesh !! Have a speedy recovery! #GetWellSoonMaheshBabu pic.twitter.com/zEMBpLOcf3 — Tata Madhulika (@Madhutata24) December 1, 2021 #GetWellSoonMaheshAnna #GetWellSoonMaheshBabu #SarkaruVaariPaata — Ur'sTruelyPrinceAbhi (@Abhisvee) December 2, 2021 -
నిమ్స్లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్ సిటీ సర్జన్ డాక్టర్ ఎం.అమరేష్ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్కు కూడా ఆక్సిజన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్11న నిమ్స్లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిమ్స్ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తాడ్బన్కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుండగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. జీవన్దాన్ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్దాన్ కో–ఆర్డినేటర్ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్ నుంచి పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్ నిమ్స్ మిలీనియం బ్లాక్కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్లో ఉన్నట్లు డాక్టర్ అమరేష్రావు తెలిపారు. -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
డయాప్రెమాటిక్ హెర్నియా.. హైరిస్క్ సర్జరీ సక్సెస్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అరుదుగా వచ్చే డయాప్రెమాటిక్ హెర్నియాకు విజయవాడ జీజీహెచ్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కార్పొరేట్, ప్రైవేటు వైద్యులు సైతం హైరిస్క్ అని చెప్పిన అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను నైపుణ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం సుసాధ్యం చేసి చూపించారు. విజయవాడ జీజీహెచ్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్కుమార్, సర్జరీలో పాల్గొన్న వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను తెలియజేశారు. అత్యంత అరుదు.. ప్రతి ఒక్కరికీ పొట్టకి, ఊపిరితిత్తులకు మధ్య కండరం గోడలా ఉంటుంది. ఆ కండరానికి చిల్లు పడటాన్ని డయాప్రెమాటిక్ హెర్నియా అంటారు. గోడలా ఉన్న కండరానికి ఎడమ వైపున చిల్లు పడటం సహజం, కుడివైపున చిల్లుపడటం అత్యంత అరుదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన వి.జోగిరాజు (48) ఈ రకమైన సమస్యతో బాధ పడుతున్నాడు. ఇతడికి కుడివైపున చిల్లు పడటంతో ఊపిరితిత్తుల్లోకి లివర్, పేగులు చొచ్చుకుని వెళ్లాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఛాలెంజ్గా తీసుకుని.. పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగిన జోగిరాజు అక్కడి వైద్యులు హై రిస్క్ కేసు అని చెప్పడంతో చివరగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ప్రభుత్వ వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు వెళ్లిన లివర్, చిన్న పేగులను సాధారణ స్థితికి తీసుకొచ్చి, కండరానికి మెస్ వేసి రిపేరు చేసినట్లు సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కందుల అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ అనస్థీషియన్ డాక్టర్ గీతాపద్మజ తదితరులు పాల్గొన్నారు. దేవుళ్లలా కాపాడారు.. వారికి నేను పాదాభివందనం చేస్తున్నా. అనేక ఆస్పత్రులు తిరిగాను. హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రులకూ వెళ్లాను. అక్కడ ఆపరేషన్కు రూ.5 లక్షలు అవుతాయని, అయినా హై రిస్క్ అని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన నన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు దేవుళ్లలాగా కాపాడారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవలు చూశాక ప్రభుత్వాస్పత్రిలో సరిగా చూడరనే భావన తప్పని తెలిసింది. – జోగిరాజు, సర్జరీ చేయించుకున్న వ్యక్తి -
ఊపిరితిత్తుల సమస్య.. చండీగఢ్ టూ చెన్నై
సాక్షి, చెన్నై(తమిళనాడు) : ఊపిరితిత్తుల వ్యాధితో అక్క చనిపోయింది, చెల్లెలూ కన్నుమూసింది. అదేరకమైన వ్యాధితో మరణం తప్పదని భయపడిన ఒక యువకుడు చండీగఢ్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు అంపశయ్యకు చేరుకున్న అతడు అరుదైన శస్త్రచికిత్సతో కోలుకున్నాడు. రోగికి శస్త్రచికిత్స చేసిన ఫోర్టీస్మలర్ (వడపళని) వైద్యులు డాక్టర్ గోవిని బాలసుబ్రమణియన్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.. ‘‘ చండీఘడ్కు చెందిన 34 ఏళ్ల కేవల్సింగ్ ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై సుమారు రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా 24 గంటలూ ఆక్సిజన్ సహాయంతోనే జీవిస్తున్నారు. ఈక్రమంలో 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తి 44 కిలోల బరువుకు క్షీణించిపోయాడు. తన సోదరీమణులిద్దరూ ఇదేరకమైన రుగ్మతతో మరణించడంతో భీతిల్లిన అతడు ఆరునెలల క్రితం మా ఆసుపత్రికి వచ్చాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ధారించుకున్నాం. అయితే కరోనా రోజుల్లో అవయవదానం చేసేవారు దొరకడం కష్టమైంది. అదృష్టవశాత్తు మదురైకి చెందిన వ్యక్తి నుంచి సేకరించాం. సుమారు ఏడు గంటలపాటూ శస్త్రచికిత్స చేసి రెండు ఊపిరితిత్తులు కేవల్సింగ్కు అమర్చిన తరువాత కోలుకుంటున్నాడు..’’ అని తెలిపారు. కాగా సాధారణంగా కాలుష్యం, వంశపారంపర్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయని.. కానీ.. ఈ కేసులో వంశపారం పర్యమే కారణమని వివరించారు. ఆయనతోపాటు ఆసుపత్రి జోనల్ డైరక్టర్ డాక్టర్ సంజయ్ పాండే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం.. -
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తన చేతికి సర్జరీ చేయించుకోవడంతో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని చిరంజీవి తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన అభిమానులతో చిరు ఆదివారం భేటీ అయ్యారు. కరోనా బారిన పడి ప్రజలు ఆక్సిజన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. దీంతో చిరు స్పందిస్తూ.. తన కుడి చేతి మణికట్టుకి చిన్న శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించడంతో వాళ్లు మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందన్నారని చెప్పారు. అందుకోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సి అవసరం లేదని 15 రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. చేతికి జరిగిన సర్జరీ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని చిరు తన అభిమానులకు తెలిపారు. చదవండి: Bigg Boss 5 Telugu: బొమ్మతో ఎలిమినేషన్, భయంతో ఏడుపందుకున్న షణ్ను -
ప్రాణదాతలకు గుర్తింపు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎంత వీలయితే అంత వేగంగా ఆస్పత్రిలో చేర్చితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అయితే మనకెందుకులే అనే ధోరణి, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయేమో అనే భయాలతో పౌరులు చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. దీన్ని నివారించి, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా సాధారణ ప్రజల్లో స్ఫూర్తిని కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాణ దాతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో (గోల్డెన్ అవర్–గంటలోగా) ఆస్పత్రికి చేర్చినా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి రూ. 5,000లు నగదుతో పాటు జాతీయ స్థాయి ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాధారణ ప్రజలపై కేసులు, వేధింపులు ఉండకుండా ఈ పథకాన్ని రూపొందించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పథకం అమలు ఇలా.. ► ప్రాణాంతక రోడ్డు ప్రమాదంలో మెదడు గాయాలు, వెన్నుపూస గాయాలకు సంబంధించిన బాధితులను లేదా శస్త్ర చికిత్స, చికిత్స కోసం కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి కలిగిన క్షతగాత్రులను గంటలోగా ఆస్పత్రికి చేర్చిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి మొదటగా రూ. 5 వేల నగదుతోపాటు ప్రశంసా పత్రం అందిస్తారు. ► పలు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడిన ఒక్కో వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు గుడ్ సమారిటన్గా గుర్తించి అవార్డులను ఇస్తారు. ► మొత్తం ఏడాదిలో గుడ్ సమారిటన్ల నుంచి జాతీయ స్థాయిలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున నగదు అవార్డును కేంద్రం ఇవ్వనుంది. ► ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలైనంత త్వరగా రాష్ట్రాలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను పంపిస్తే ముందస్తుగా ఐదు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. -
కేకేఆర్ బౌలర్కు గాయం.. సర్జరీ సక్సెస్
Kuldeep Yadav Undergoes Successful Knee Surgery: కోల్కత నైట్రైడర్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మోకాలి గాయానికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. సర్జరీ అనంతరం ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను కుల్దీప్ తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. సర్జరీ సక్సెస్ అయినట్లు పేర్కొన్నాడు. కష్ట సమయంలో అండగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెడతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. Surgery was a success and the road to recovery has just begun. Thank you so much to everyone for your amazing support. The focus is now to complete my rehab well and be back on the pitch doing what I love as soon as possible. ♥️🙏🏻 pic.twitter.com/364k9WWDb3 — Kuldeep yadav (@imkuldeep18) September 29, 2021 కాగా, ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సెప్టెంబర్ 26)తో మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కుల్దీప్ గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం సెప్టెంబర్ 27న తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. దీంతో అతను జట్టును వదిలి భారత్కు తిరుగు పయనమయ్యాడు. ముంబైలోని ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో అతని కాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే, కుల్దీప్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్తో పాటు త్వరలో ప్రారంభంకానున్న దేశవాళీ సీజన్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన కుల్దీప్.. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. చదవండి: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ కెప్టెన్ -
లండన్లో హీరో సిద్ధార్థ్కు సర్జరీ!
Hero Siddharth Got Surgery In London: హీరో సిద్ధార్థ్కు లండన్లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్బస్టర్ హిట్ను అందించిన సిద్ధార్థ్కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్ అనూ ఇమ్మాన్యయేల్తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్ వెళ్లిన సిద్ధార్థ్కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్తో పాటు శర్వానంద్ కూడా హీరో నటిస్తున్నాడు.