Bheeshma Movie
-
డైరెక్టర్కే సినిమా చూపించారు
-
‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా..
సాక్షి, హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ చిత్రం పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఆయన నుంచి రూ. 66 వేలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నాడు. తాను ఆ ప్యానల్లో కీలక సభ్యుడిని అని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్లో నామినేట్ చేయడానికి ఒకో కేటగిరికి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. దీనికి వెంకీ అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నేరగాడు అందులో డబ్బు డిపాజిట్ చేయమన్నాడు. సైబర్ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కొత్త కథ చెప్పాడు. ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పాడు. వాటిని సరిచెయ్యడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ సదరు చిత్ర నిర్మాత నామినేషన్ పర్వం వద్దన్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశారు. ఆపై పూర్వాపరాలు పరిశీలించిన ఆయన జరిగిన మోసం తెలుసుకున్నారు. దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చరణ్ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్ 'భీష్మ' డైరెక్టర్కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్ నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్! -
బాలీవుడ్ భీష్మ
టాలీవుడ్లో హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్ 100, ఓ బేబీ, రాక్షసుడు’ వంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘భీష్మ’ చేరింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరెక్కించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీ రీమేక్లో రణ్వీర్ సింగ్ నటించనున్నారని టాక్. -
చరణ్ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తయినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో మిగతా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటి వరకూ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మాత్రం ప్రకటించలేదు. జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినా ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు చరణ్ మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి: పవన్ చిత్రంలో మెగాపవర్ స్టార్?) ఇటీవల హీరో నితిన్తో ‘భీష్మ’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములకు చరణ్ చాన్స్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో పాటు హీరో నితిన్కు కూడా మంచి కమర్షియల్ హిట్ అందించింది. దీంతో ఈ డైరెక్టర్కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుములకు స్టార్ డైరెక్టర్గా ఎదగడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) -
బాలీవుడ్ భీష్మ
‘భీష్మ: ది బ్యాచిలర్’ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్లోనూ రీమేక్ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్లో రణ్బీర్ కపూర్ యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్ ‘భీష్మ’ కన్ ఫర్మ్ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. -
నితిన్ పెళ్లి వాయిదా..!
‘భీష్మ’ విజయంతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్ హీరో నితిన్. అంతేకాకుండా తాను ప్రేమించిన యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా ఆనందంగా ఉన్నాడు. అయితే నితిన్ ఆనందంపై కరోనా కన్నెర్ర జేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ముందుఅనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే దుబాయ్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లోనే నితిన్ వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ దీనిపై నితిన్ , షాలినీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయదలేదు. -
నా సినిమా విజయం కంటే ఎక్కువ సంతోషపడ్డా
‘‘ఈ వేడుకకు అతిథిలా రాలేదు. నితిన్ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి తన ఫ్రెండ్లా వచ్చాను. నా సినిమా సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నితిన్ సక్సెస్ను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ను వైజాగ్లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో రెండో సినిమా కూడా హిట్ కొట్టడం కష్టమంటారు. వెంకీ పాసయ్యాడు. రష్మిక నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి. తనతో కలసి త్వరలోనే యాక్ట్ చేయాలనుంది. మణిశర్మగారి అబ్బాయి సాగర్ మహతి మంచి సాంగ్స్ ఇచ్చారు. నితిన్ నేను ఈ మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలనుకుంటున్నాను. సింగిల్ అని చెప్పి రిలీజ్ కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అందర్నీ మోసం చేశాడు’’అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ నిర్మాణసంస్థతో ‘అ ఆ’ చేశాను. పెద్ద హిట్ అయింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. దీనికి కారణమైనన దర్శక–నిర్మాతలకు «థ్యాంక్స్. రష్మికతో నటన, డ్యాన్సులు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ – ‘‘భీష్మ’ మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నితిన్గారు, వెంకీ గారు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నితిన్గారికి, నిర్మాత వంశీగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. -
విశాఖలో ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్
-
నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చింది
‘‘భీష్మ’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా టీమ్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఇది. నేను బాగా నటించాను.. నవ్వించానని అంటుంటే సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టానంతే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు’’ అని నితిన్ అన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విజయోత్సవంలో నితిన్ మాట్లాడుతూ –‘‘భీష్మ’ హిట్తో చాలామందికి వెంకీ జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది.. అందుకే ఎమోషన్ అవుతున్నా. ఈ సినిమాలో రష్మికతో కంటే సంపత్ రాజ్తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా కుదిరిందని అంటున్నారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. ‘అ ఆ’తో నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది.. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘భీష్మ’ చిత్రం పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్లే ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ‘ఛలో’తో హిట్ కొట్టిన వెంకీ ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు.. ఇక హ్యాట్రిక్కు రెడీ అవుతున్నాడు. నితిన్తో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో హిట్ కొట్టాలనుకున్నాం. కానీ, కుదరలేదు. హీరోలతో పోటీ పడుతూ రష్మిక డ్యాన్స్ చేస్తోంది. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’ సినిమాలు నిరూపించాయి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన చినబాబు, వంశీ, నితిన్గార్లకు థ్యాంక్స్. నా సాంకేతిక నిపుణులంతా బాగా సహకారం అందించడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తీశాను. ‘దిల్’ సినిమా నుంచి నితిన్ను అభిమానిస్తూ వస్తున్నా. కలిసి పని చేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా’’ అన్నారు. ‘‘భీష్మ’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి రుణపడి ఉంటాను. భీష్మ పాత్రలో నితిన్ను చూసి అభిమానిని అయిపోయాను’’ అన్నారు రష్మికా మందన్నా. ఈ విజయోత్సవంలో సూర్యదేవర నాగవంశీ, కెమెరామేన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, నటులు ‘శుభలేఖ’ సుధాకర్, సంపత్ రాజ్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత హిట్: నితిన్ భావోద్వేగం
యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం 'భీష్మ' బాక్సాఫీస్లో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం అసలు సిసలైన కామెడీతో థియేటర్లో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతోంది. సితార ఎంటర్టైర్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మంగళవారం హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. వివరాల్లోకి వెళితే.... నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే 'భీష్మ'కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్ చేస్తుంది, చక్కగా నటిస్తుంది. నితిన్తో మేం 'శ్రీనివాస కల్యాణం'తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే హిట్ చేస్తారని ప్రతిరోజూ పండగే, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఇప్పుడు భీష్మ నిరూపించాయి. ఈ సినిమాను యూత్ బాగా ఆదరిస్తున్నారు" అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ ‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. కన్నీళ్లు కనబడకూడదనే అద్దాలు పెట్టుకున్నా. ఇక రష్మికతో కంటే సంపత్ రాజ్తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. (భీష్మ మూవీ రివ్యూ) దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ 'దిల్' సినిమా నుంచి నేను నితిన్ను అభిమానిస్తూ వస్తున్నా. ఆయనను అభిమానించేవాడిగానే ఈ సినిమా తీశాను. కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా. నా ఊహకు భిన్నంగా కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక ఈ సినిమా చేసింది. తను స్నేహానికి విలువ ఇచ్చిందన్నారు. హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ ‘ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. 'భీష్మ' పాత్రలో నితిన్ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డానని పేర్కొన్నారు. గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘నేను రాసిన వాటే బ్యూటీ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసిందన్నారు. ఇది 'హాసమ్' సక్సెస్ అని మరో గేయ రచయిత శ్రీమణి అన్నారు. ఈ బ్యానర్ తో 'జులాయి' సినిమా నుంచి అనుబంధం ఉందన్నారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ ‘మా తండ్రులు గర్వపడేలా 'భీష్మ'ను వెంకీ రూపొందించారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, "నాకు 'తియ్యరా బండి' అనే డైలాగ్ చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. ఈ సినిమాలో దానికి భిన్నమైన క్యారెక్టర్ ఇవ్వగా దానికి ప్రశంసలు రావడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.(హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటా: రష్మిక) -
పవన్తో 'భీష్మ' యూనిట్
సాక్షి, హైదరాబాద్: నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ' విజయం సాధించడంతో నితిన్తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పవన్ కల్యాణ్ని కలిసారు. ఈ సందర్భంగా పవన్ చిత్ర బృందాన్ని, నితిన్ను అభినందించారు. ‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్ను పవర్ స్టార్ ప్రశంసించారు. ఈ విషయంపై నితిన్ తన ట్విటర్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేస్తూ.. 'వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సర్’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’ ఇక దర్శకుడు వెంకీ కుడుముల కూడా తన ట్విటర్ ఖాతాలో.. ‘భీష్మ సినిమా తీసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. ఈ క్షణం నాకైతే జీవితాంతం గుర్తిండిపోతుంది’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా.. భీష్మ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతూ.. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా దూసుకుపోతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ‘భీష్మ’ మూవీ రివ్యూ POWERSTAR congratulating BHEESHMA team for its success!! Priceless moment..love you forever sirr 😍😍😍🤗🤗🤗@VenkyKudumula @vamsi84 @SitharaEnts pic.twitter.com/y38ZKF66zr — nithiin (@actor_nithiin) February 24, 2020 -
‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’
నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్ టాక్ రావడంతో నితిన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. (చదవండి : ‘భీష్మ’ మూవీ రివ్యూ) ఇక ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా భీష్మ టీమ్కు అభినందనలు తెలిపారు. భీష్మ హిట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్కు పుల్ జోష్ ఇచ్చిందన్నారు. ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్. ‘భీప్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో మంచి పని జరిగింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది’ అని బన్నీ ట్వీట్ చేశారు. మంచి హిట్ సాధించినందుకుగాను దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మీక,నిర్మాత సూర్యదేవర నాగవంశికి అభినందనలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా గత శుక్రవారం విడుదలైంది. Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma . — Allu Arjun (@alluarjun) February 24, 2020 -
మేకింగ్ ఆఫ్ భీష్మ
-
‘భీష్మ’ మూవీ రివ్యూ
-
‘భీష్మ’ మూవీ రివ్యూ
టైటిల్: భీష్మ టైటిల్: రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నటీనటులు: నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, జిష్సేన్ గుప్త, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: వెంకీ కుడుముల సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ నిడివి: 150.45 నిమిషాలు ‘అఆ’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చల్మోహన్రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్కు నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందా? రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్, ట్రైలర్ రేంజ్లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: తాను ఐఏఎస్ అని భీష్మ (నితిన్) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ అని కాదు.. ఐయామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాపౌట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ (నరేశ్) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్ (జిషుసేన్ గుప్తా), పరిమళ్ (వెన్నెల కిశోర్), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు: ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్లర్గా కనిపించిన నితిన్, సెకండాఫ్లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్ షేడ్స్ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్తో కలిసి రష్మిక డ్యాన్స్లతో అదరగొట్టింది. అనంత్ నాగ్ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్ సూపర్బ్గా ఉంటుంది. విలన్గా కనిపించిన జిషుసేన్ గుప్త క్లాస్ విలన్గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. విశ్లేషణ: ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్, అనంత్ నాగ్, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్ డైలాగ్లు వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన పాటలు ఎంతటి హిట్ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సింగర్స్, లిరక్ రైటర్స్ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ చిత్రం. ప్లస్ పాయింట్స్: నితిన్ నటన రష్మిక గ్లామర్ అండ్ క్యూట్నెస్ కామెడీ మైనస్ పాయింట్స్: విలనిజం ఆకట్టుకోకపోవడం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కావడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
ప్రతి సినిమా పరీక్షే
‘‘నా మొదటి సినిమా ‘ఛలో’ విడుదలయ్యాక, నేను రాసింది నాకే కాదు ఆడియన్స్ని కూడా నవ్విస్తుందనే నమ్మకం వచ్చింది. మొదటి సినిమాలానే రెండో సినిమాకి కూడా అదే భయం, నిజాయతీతో పని చేశాను. ప్రతి సినిమా పరీక్షలానే భావించి పని చేస్తాను’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘ఛలో’ సినిమా పూర్తయిన తర్వాత నితిన్గారితో సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్ చేద్దాం అని నితిన్గారు చెప్పారు. కొంచెం లేట్ అయినా అలానే చేశాం. బౌండ్ స్క్రిప్ట్ వల్ల చిత్రీకరణ సులువుగా జరిగిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు భీష్మలు ఉంటారు. ఒకరేమో అనంత్ నాగ్గారు. ఆయన ఒక లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మరోవైపు నితిన్ పేమించాలనుకున్నా ఎవ్వరూ పడరు. ఆయన పేరు (భీష్మ) వల్లే ఇలా జరుగుతుందని బాధపడుతుంటారు. ఈ ఇద్దరి భీష్మల మధ్య సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూడాలి. తదుపరి సినిమా ఇంకా నిర్ణయించుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లకు కమిట్మెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. -
‘భీష్మ’ సినిమాలో ట్విస్ట్ అదే : వెంకీ
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలివి... ► ‘ఛలో’ విడుదలయ్యాక నితిన్కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తవడానికి కాస్త సమయం పట్టడంతో టెన్షన్ పడ్డా. కానీ నితిన్ ‘బౌండెడ్ స్ర్కిప్ట్తోనే సెట్కి వెళదాం. కంగారు ఏమీ లేదు. నేను వెయిట్ చేస్తా’ అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నారు. స్ర్కిప్ట్ లాక్ అయ్యాక షూటింగ్కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ►ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్గా లవ్స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది. కథలో భాగంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను. మీమ్స్ చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నది ఇందులో ఆసక్తికరమైన పాయింట్. (చదవండి : నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్ వీడియో) ►భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్ నాగ్కి, నితిన్ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. ►రష్మిక తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. డెడికేషన్తో పని చేసే నటి ఆమె. తన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. నితిన్తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంత నాగ్ని సంప్రదించా. మొదట చేయనన్నారు. కథ పూర్తిగా విన్నాక అంగీకరించారు. సినిమాకు ఆయన పాత్ర చాలా కీలకం. ►మన దగ్గ ఉన్న అత్యుత్తమ రైటర్స్లో త్రివిక్రమ్ గారు ముందుంటారు. నేను ఆయనకు అభిమానిని. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నా డైలాగులు కూడా ఆయన డైలాగుల్లా అనిపించడానికి అదో కారణం. త్రివిక్రమ్గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ట్రైలర్లోనే కథ చెప్పేయాలని, అప్పుడే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారని, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్లో కథ చెప్పే ప్రయత్నం చేశా. ►చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. పేరెంట్స్ కోసం చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్ చేయడం కామన్. నాకది ఓ గుర్తింపులా అనిపిస్తుంది. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. -
‘భీష్మ’ మేకింగ్ : రష్మీక అల్లరే అల్లరి
నితిన్ హీరోగా రిలీజ్కు రెడీ అయిన సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచాయి. మంచి హైప్తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. (చదవండి : అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్) శుక్రవారం (ఫిబ్రవరి 21న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం గురువారం మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సెట్స్లో రష్మిక చేసే అల్లరి, నితిన్ కామెడీ పంచ్లతో మేకింగ్ వీడియో అదిరిపోయింది. సినిమాలో సెట్లో జరిగిన సందడి అంతా ఇందులో చూపించారు. (చదవండి : భీష్మ సినిమా పేరు మార్చాలి) ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్ వీడియోను క్రియేట్ చేశారు. షూటింగ్ టైంలో రష్మీక, డైరెక్టర్ వెంకీల మధ్య జరిగిన సరదా సన్నివేశాలను మేకింగ్ వీడియోలో చూపించారు. దర్శకుడి షర్ట్పై ‘హీ ఇజ్ ఏ వెరీ రోమాంటిక్ ఫెల్లో’ అని రష్మీక రాయడం బట్టి చూస్తే తెలుస్తుంది ఆమె భీష్మ సెట్లో ఎంత అల్లరి చేసిందో. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్కి బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే. -
భీష్మ సినిమా పేరు మార్చాలి
పంజగుట్ట: భీష్మ సినిమా పేరును, సినిమాలో హీరో పేరును మార్చాలని, లేనిపక్షంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ బెస్తగూండ్ల చైతన్య సమితి హెచ్చరించింది. మహాభారతానికి మూలం భీష్మ పితామహుడు, ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారని, సినిమాలో వెకిలిచేష్టలు, అసభ్యకరమైన సీన్లు ఉన్నాయని వెంటనే సినిమా పేరు, హీరో క్యారెక్టర్ పేరు మార్చకపోతే జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎమ్.శకర్, శివసేన ప్రతినిధి సుదర్శన్, బీజేపీ ప్రతినిధి మైలారం రాజులు మాట్లాడుతూ సినిమా టైటిల్ విషయమై తాము ఇప్పటికే ఫిలించాంబర్లో ఫిర్యాదు చేశామని, సినిమా నిర్మాత వద్దకు వెళ్లగా ఆయన తమకు సినిమా చూపించారని, అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, ఈవిషయాన్ని ఆయన దృష్టికి తేగా పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. సమావేశంలో చెంద్రశేఖర్ బెస్త, సురేష్, గణేష్, తారకప్రభు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న సమితి అధ్యక్షులు సత్యనారాయణ -
ఇక ఒకేసారి మూడు సినిమాలు చేయను
‘‘ఇష్క్’ (2012)కి ముందు నావి 12 సినిమాలు ఆడలేదు. ఇంటికెళ్లిపోతామా? అనే ఆలోచన రాబోతున్నప్పుడు ‘ఇష్క్’ సూపర్హిట్గా నిలిచింది. ఆడియన్స్ మళ్లీ చాన్స్ ఇచ్చారనిపించింది. ఈ మధ్య నావి మూడు సినిమాలు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) ఆడలేదు. జాగ్రత్తలు తీసుకుని ‘భీష్మ’ చిత్రం చేశాను. ఈ సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ‘మీమ్స్’ క్రియేటర్గా నటించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఒక లేయర్గా మాత్రమే సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రస్తావన ఉంటుంది. సినిమాలో వచ్చే ఓ పొలం ఫైట్ను ‘అతడు’ సినిమాలోని ఫైట్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశాం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత బాగా డ్యాన్స్లు చేసే అవకాశం ఈ చిత్రంలో లభించింది. త్రివిక్రమ్గారు సినిమా చూసి హిట్ అవుతుందని చెప్పారు. ► నేను ‘శ్రీనివాసకల్యాణం’ సినిమా చేస్తున్నప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ కథ చెప్పారు. నా గత మూడు సినిమాలు అంతగా ఆడలేదు కాబట్టి ‘భీష్మ’ స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిన తర్వాతే సెట్స్కు వెళ్దాం అని చెప్పాను. ఇందుకు కొంత సమయం పట్టింది. అలాగే ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో...), ‘చెక్’ (చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో...) సినిమాల స్క్రిప్ట్స్ని కూడా విని ఓకే చేశాను. షూట్ కూడా స్టార్ట్ చేశాం. ఆ తర్వాత హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్ (మేర్లపాకగాంధీ దర్శకత్వంలో..), ‘పవర్పేట’ (కృష్ణచైతన్య దర్శకత్వంలో) కథలను కూడా ఓకే చేశాను. గత ఏడాది నా సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ ఈ ఏడాది నావి కనీసం నాలుగు సినిమాలు విడుదలవుతాయి. అయితే జీవితంలో ఇకపై మూడు సినిమాలను ఒకేసారి చేయను. సరిగ్గా నిద్ర లేదు. విశ్రాంతి లేదు. నాకు ఒక్క రోజు గ్యాప్ వస్తే చాలు.. నా కాల్షీట్ కోసం ముగ్గురు డైరెక్టర్స్ కొట్టుకుంటారు (నవ్వుతూ). ఇప్పుడు ‘భీష్మ’ అయిపోయింది కాబట్టి రిలాక్స్గా అనిపిస్తోంది. ► జాతీయ అవార్డు సాధించిన హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్లో నటించడం రిస్క్తో కూడుకున్న పని. కానీ చాలెంజింగ్గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్ గ్రాఫ్ సరిగ్గా లేదని నాకూ అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాను. ► ఓ సినిమా బాగున్నప్పుడు అభినందనలు తీసుకున్న నేను, మరో సినిమా బాగోలేదన్నప్పుడు విమర్శలను కూడా తీసుకుంటాను. విమర్శలను విశ్లేషించుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుంటాను. కమర్షియల్, డిఫరెంట్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్దాం అనుకుంటున్నా. ► ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చాను. అప్పట్లో బుట్టో.... ఇప్పుడు ముషారఫ్ (‘దిల్’ సినిమాలోని డైలాగ్) అన్నట్లు నన్ను యంగ్ హీరో అంటుంటే హ్యాపీగానే ఉంది కానీ నేను ఇంకా యంగ్ ఏంటీ? జట్టు కూడా నెరిసింది. గెడ్డం కూడా తెల్లబడింది అని నా ఇన్నర్ఫీలింగ్ (నవ్వుతూ). పెళ్లి ముచ్చట్లు ► పెళ్లనేది జీవితంలో ఓ బిగ్ స్టెప్. మెంటల్గా రెడీ అవ్వాలి. అందుకే కాస్త సమయం పట్టినట్లుంది. ఈ ఏడాది ఏప్రిల్ 15న నిశ్చితార్థం జరుగుతుంది. దుబాయ్లో ఏప్రిల్ 16న వివాహం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏప్రిల్ 21న ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. షాలినీ (నితిన్ కాబోయే భార్య)కి నేను నటించిన ‘ఇష్క్, సై’ చిత్రాలంటే ఇష్టం ► నా పెళ్లి గురించి కొందరు హీరోలు సంతోషపడుతుంటే మరికొందరు బాధపడుతున్నారు. నాని ఏమో.. మా పెళ్లి బ్యాచ్లోకి రా అని పిలుస్తున్నాడు. రానా ఏమో ‘ఏంటీ బ్రో’ అంటున్నాడు. వరుణ్తేజ్.. ‘ఏంటీ నితిన్ ఇలా చేశావ్. నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారు’ అన్నాడు (నవ్వుతూ). -
మా బుట్టబొమ్మ..లా వాటే బ్యూటీ ఉంది
‘‘భీష్మ’ సినిమాని చూశాను.. చాలా చాలా బాగుంది. 21న అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘భీష్మ’లో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్. రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ ‘వాటే బ్యూటీ’. ఈ పాటను మా ‘బుట్టబొమ్మ’ పాటలా బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని తీసుకువస్తున్నారు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భీష్మ’ చూసి చాలా సంతోషపడ్డా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డ్యాన్సులు ఇరగదీశాడు. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ‘భీష్మ’ విజువల్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘భీష్మ’ కథకు సమయం పట్టింది. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచం’’ అన్నారు. ‘‘ఈరోజు టాలీవుడ్లో నేను ఉన్నానంటే ప్రధాన కారణం వెంకీ కుడుముల. ఆయనకు జీవితాంతం మంచి ఫ్రెండ్గా ఉంటాను. నితిన్ నా బెస్ట్ కో–స్టార్ కాదు.. బెస్ట్ ఫ్రెండ్’’ అన్నారు రష్మికా మందన్నా. నితిన్ మాట్లాడుతూ– ‘‘వెంకీ కుడుముల నాకు, ‘దిల్’ సినిమాకు పెద్ద అభిమాని. ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ‘దిల్’, ‘సై’ తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా అభిమానులందరూ ఎప్పుడూ ‘డ్యాన్స్.. డ్యాన్స్’ అని అడుగుతున్నారు.. ఈ సినిమాలో నా డ్యాన్స్ చూసి వారి ఆకలి తీరుతుందనుకుంటున్నా. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్లో రష్మిక డ్యాన్స్ చూసి షాకయ్యా.. చాలా బాగా చేసింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట ‘అఆ’ చేశా.. ఇప్పుడు ‘భీష్మ’ చేశాను.. మూడో సినిమా ‘రంగ్ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా జీవితంలో మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్గారు, త్రివిక్రమ్గారు పంచప్రాణాలు.. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నా భార్య ఆరో ప్రాణం కాబోతోంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
భీష్మ ఇన్ లవ్
-
‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’
‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మ రాజ్, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు’ అని తెగ ఫీలైపోతున్నాడు హీరో నితిన్. ఆయన హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది.‘దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’ అనే నితిన్ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడీ పంచ్లు, రష్మీకతో నితిల్ రోమాన్స్ తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు. (చదవండి : ‘సరాసరి గుండెల్లో దించావె..’) ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్గా బెంగాల్ నటుడు జిషు సేన్గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ను ముగించారు. -
మాటిస్తే నిలబెట్టుకుంటా
‘‘కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, నా మనసుకి నచ్చిన పాత్రలు, ఈ పాత్ర నేను చేస్తే కొత్తగా ఉంటుంది అనే సినిమాలనే ప్రస్తుతం ఎంపిక చేసుకుంటున్నాను. సినిమా చూడటానికి థియేటర్కి వచ్చే ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతికి లోనవ్వాలి. లేదా కడుపుబ్బా నవ్వుకోవాలి. ‘భీష్మ’ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మిక చెప్పిన విశేషాలు. ► ‘భీష్మ’లో చైత్ర అనే పాత్ర చేశాను. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటాను. ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేశాను. వినోదం పంచాను. ఇది చాలా సరదా సినిమా అయినప్పటికీ ఇందులో రైతుల సమస్యలను, ఆర్గానిక్ ఫార్మింగ్ విషయాలను చర్చించాం. ఈ విషయాన్ని వెంకీ చాలా సున్నితంగా డీల్ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో బాగా ఎంజాయ్ చేశాను. ► ‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల నెక్ట్స్ సినిమాలో నటిస్తాను అని అప్పుడే చెప్పాను. మాటిస్తే నిలబెట్టుకోవాలనుకునే మనస్తత్వం నాది. కొన్నిసార్లు డేట్స్ ఇబ్బంది అయినా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. వరుసగా సినిమాలు చేయడం వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. అలా ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటించే అవకాశం మిస్ అయింది. నాతో సినిమాలు చేసిన దర్శకులు మళ్లీ నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది. ► ‘అఆ’ సినిమాలో నితిన్, సమంత జంట నాకు చాలా ఇష్టం. నితిన్తో పని చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ తను చాలా కూల్గా కాలేజ్కి వెళ్లే అబ్బాయిలా ఉన్నారు. తనతో కలసి పని చేయడం చాలా సౌకర్యవంతంగా అనిపించింది. ► ఈ సినిమా టైటిల్లో బ్యాచ్లర్ ఉన్నా సినిమా రిలీజ్ అవ్వకముందే నితిన్ ఎంగేజ్ అయిపోయారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే నితిన్ లవ్స్టోరీ గురించి తెలిసింది. అప్పటివరకూ మాకు ఎవ్వరికీ చెప్పలేదు. నేను కన్నడంలో ‘పొగరు’ సినిమా చేస్తున్న సమయంలో «ధృవ సర్జాగారికి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నితిన్గారికి కూడా పెళ్లి అవుతోంది (నవ్వుతూ). ► నా ఫిట్నెస్ సీక్రెట్ అంటే.. జిమ్ చేస్తుంటాను. వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తుంటా. స్పోర్ట్స్ ఆడతాను. డైట్ మెయింటేన్ చేస్తుంటాను. షుగర్ ఉన్న పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేశాను. చాక్లెట్స్ వైపే చూడటం లేదు. ► పబ్లిక్లో కనిపించేవాళ్లు విమర్శలు ఎదుర్కోవడం కామన్. మన గురించి ఎప్పుడూ మంచే మాట్లాడాలని అనుకోలేం. అది కుదరదు కూడా. నా కెరీర్ తొలి రోజుల్లో చాలా సీరియస్గా తీసుకునేదాన్ని. ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం లేదు. ► ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ సార్ కాంబినేషన్ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ► మా నాన్నగారు బిజినెస్మేన్. నేను నటిని. దాంతో కాజ్యువల్గా ఐటీ రైడ్స్ చేశారు. మా ఇంట్లో ఏమీ దొరకలేదు. వెళ్లిపోయారు. ► కుక్క బిస్కెట్లు తింటోందని నా గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్æ చేస్తున్నారు. ఓ రోజు సరదాగా ట్రై చేద్దాం అని చిన్న ముక్క కొరికాను అంతే (నవ్వుతూ). దానికి నితిన్ ‘నేను కుక్క బిస్కెట్లు తింటాను’ అని చెప్పారు. ► వేలంటైన్స్ డే రోజు ఫుల్ బిజీ షెడ్యూల్. కానీ అనుకోకుండా అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఉదయ్యానే జిమ్ చేసి, మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమా చూడాలనుకున్నాను. సగంలోనే నిద్రపోయా. ఆ తర్వాత ఓ కథ న్యారేట్ చేయడానికి ఓ డైరెక్టర్ వచ్చారు. -
నితిన్ లవ్స్టోరీ తెలిసింది అప్పుడే: రష్మిక
యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ రష్మిక మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది" అని రష్మిక అన్నారు. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు? అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం. సినిమా చూశారా? లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా. 'భీష్మ'లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు? మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు. అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది? ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను. ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది? మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ 'భీష్మ'లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. 'భీష్మ' అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే 'భీష్మ' చాలా మంచి ఫిల్మ్. వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా? రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు. నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా? మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్. నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది? నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం. మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు? ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు. 'ఛలో' నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు? నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు. వాలంటైన్స్ డేని ఎలా గడిపారు? వాలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వాలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వాలంటైన్స్ డేని గడిపి ఉండరు. పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు? కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. 'భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు. చదవండి: చిన్నప్పటి నుంచి విజయ్ అంటే క్రష్ ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ -
చిన్నప్పటి నుంచి విజయ్ అంటే క్రష్: రష్మిక
హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్, సాండిల్వుడ్లో బిజీ హిరోయిన్గా మారారు. ఇటీవల సూపర్స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడంతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారారు. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలోనూ రష్మికా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తాజాగా హీరో నితిన్తో కలిసి నటించిన ‘భీష్మ’ విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. (ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు అభిమాలను ఆకట్టుకోగా.. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఈ అందాల భామ ‘భీష్మ’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక అసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మీకు ఎవరిపై క్రష్ ఉంది? భవిష్యత్తులో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. తనకు చిన్నతనం నుంచే ఇళయ దళపతి విజయ్పై క్రష్ ఉండేదని, భవిష్యత్తులో అతనితోనే నటించాలని ఉన్నట్లు తన మనసులో మాటను ఆమె వెల్లడించారు. గతంలో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమాలో రష్మిక హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. (‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’) చదవండి : నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్ -
ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్
-
ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్
ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకని నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన నితిన్ తన పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పాడు. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్ 16 నితిన్ వివాహం జరుగనుందని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు. Pelli panulu started.. Mussssikk startttts ❤️❤️❤️ Need ur blessings...🤗🤗 pic.twitter.com/bQ3zXUO7s6 — nithiin (@actor_nithiin) February 15, 2020 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరాసరి గుండెల్లో దించావే...
‘హై క్లాసు నుంచి లో క్లాసుదాకా..’, ‘వాటే..వాటే..వాటే బ్యూటీ’ పాటల తర్వాత ‘భీష్మ: సింగిల్ ఫరెవర్’ చిత్రం నుంచి ‘సరాసరి గుండెల్లో దించావే.. మరీ మరీ మైకంలో ముంచావే.. అయినా సరే ఈ బాధ బాగుందే’ అనే పాట లిరికల్ వీడియోను ఆదివారం విడు దల చేశారు. నితిన్, రష్మికా మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ‘సరాసరి..’ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరించారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ‘భీష్మ’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నితిన్ వివాహం ఏప్రిల్ 16న జరగనుంది. తన స్నేహితురాలు షాలినీతో నితిన్ ఏడడుగులు వేయబోతున్నారు. -
‘సరాసరి గుండెల్లో దించావె..’
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం హైలైట్గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్తో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన సింగిలే అన్న సాంగ్, వాటే బ్యూటీ సాంగ్స్ బాగానే రీచ్ కాగా తాజాగా విడుదలైన సరాసరి సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. ‘రాములో రాములో’ తో ఫుల్ ఫామ్లో ఉన్న అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ హీరో నితిన్ పెళ్లి వాయిదా..! ‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’ -
హీరో నితిన్ పెళ్లి వాయిదా..!
సాక్షి, హైదాబాద్ : టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ నితిన్ పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఇక నితిన్ పెళ్లి ఈ ఏడాది ఏప్రిల్ 15న జరుగుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే పుకార్లు టాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వరుస సినిమాల వల్ల నితిన్ ఏప్రిల్లో పెళ్లి చేసుకోలేకపోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు. -
‘భీష్మ’ సినిమా స్టిల్స్
-
వాటే బ్యూటీ
‘భీష్మ’ టీమ్కి బై బై చెప్పేశారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు నితిన్. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఆదివారం ఈ చిత్రంలోని ‘వాటే వాటే వాటే బ్యూటీ...’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ధనుంజయ్, అమల చేబోలు ఈ పాటను ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ‘భీష్మ’ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. -
‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’
‘భీష్మ’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. యంగ్ హీరో నితిన్, క్యూట్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్కు ప్యాకప్ చెప్పారు చిత్ర బృందం. ఈ సందర్భంగా సెట్లో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అనంతరం హీరో నితిన్ తన అధికారిక ట్విటర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘వెంకీ కుడుముల ఐ లవ్ యూ.. నీ గురించి మాటల్లో చెప్పలేను. భీష్మ వంటి సినిమాను నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రష్మిక నువ్వు నా ఫేవరేట్. నీతో మళ్లీ సినిమా చేసేందుకు ఎక్కువ వెయిట్ చేయలేను. ఈ చిత్రానికి కష్టపడిన, మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్, టీజర్లలో నితిన్-రష్మికల జోడీ చూడముచ్చటగా ఉందని, అదేవిధంగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్గా ఉందని నెటిజన్లు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 21 విడుదల కానున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్ మహేశ్బాబు చిత్రంలో విజయ్ దేవరకొండ? మే నెలలో హీరో నితిన్ వివాహం -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘వాటే బ్యూటీ’
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సింగిల్ యాంథమ్ సాంగ్లు కేక పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అస్త్రాన్ని చిత్ర బృందం వదిలింది. ‘వాటే బ్యూటీ’ అంటూ సాగే మాస్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది. పూర్తి సాంగ్ను ఆదివారం సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోలో నితిన్, రష్మికలు తమ అదిరేటి స్టెప్పులతో మైమరిపించారు. ముఖ్యంగా రష్మిక ఈ వీడియోలో క్యూట్గా, ఫుల్ గ్లామర్తో కనిపిస్తుండటంతో యూత్కు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘వాట్ ఏ బూటీ’ సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుని యూట్యూబ్లో తెగ ట్రెండ్ అవుతోంది. కాగా, మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాట హార్ట్ బీట్స్ పెంచేస్తుందని.. కొరియోగ్రఫీ గత్తర లేపుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా నితిన్-రష్మికల జోడి సూపర్బ్గా ఉందని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్లో ఉందని పేర్కొంటున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్రిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: ఆవగింజంత అదృష్టం.. దబ్బకాయంత దురదృష్టం నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్ -
ఇంటివాడు కాబోతున్న నితిన్.. పెళ్లి ఎప్పుడంటే
జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు హీరో నితిన్. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్లో నితిన్ ఒక్కరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవ్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నితిన్ పెళ్లి విషయం గురించి మాట్లాడలేదు. తాజాగా నితిన్ త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్కు పెళ్లి ఫిక్స్ అయినట్లు.. ఏప్రిల్ 16న శాలిని అనే అమ్మాయితో నితిన్ ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్. అయితే నితిన్ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహన్ని చేసుకొనున్నారు. యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారట. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. పెళ్లి పనులన్నీ యువ నిర్మాత, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటుందట. కాగా నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. దుబాయ్లోని ప్యాలసో వెర్సేస్ హోటల్లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్లో సన్నిహితులకు గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం. నితిన్ ప్రస్తుతం చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆవగింజంత అదృష్టం.. దబ్బకాయంత దురదృష్టం
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. ‘మీ తర్వాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు? సార్’ అనే డైలాగ్తో టీజర్ విడుదలైంది. ‘నాకు క్వాలిఫికేషన్స్ కన్నా... క్వాలిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్’, ‘స్పీడ్గా వెళ్లే స్కూటర్కు మేక్ గుచ్చుకున్నట్లు నువ్వు నాకుగుచ్చుకున్నావేంట్రా’, ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయంత ఉందండి’.. వంటి టీజర్లోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘‘వినోదం ప్రధానంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైన్ మూవీ ఇది. ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం’’ అన్నారు వెంకీ కుడుముల. నరేష్, సంపత్, రఘుబాబు, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. -
నితిన్ ఈజ్ బ్యాక్ అనేలా భీష్మ టీజర్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భీష్మ’ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్లో నితిన్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్తో యూత్ ఫుల్ మూవీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది. వెటకారమైన పంచ్లతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం కామెడీగా సాగింది. చదవండి: వివాదాల 'దర్బార్' చదవండి: టీజర్ గురించి నితిన్ ఏమన్నాడంటే? 'నీ పేరేంటని నితిన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ అడిగితే.. భీష్మ అంటాడు. అప్పుడు ఆయన భీష్మ కాదు భీష్మ సర్ అనాలి అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది. ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక దగ్గర మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని తిరుగుతుంటాడు. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయ అంత ఉందండి' అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కామెడీగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించాయి. -
టీజర్ గురించి నితిన్ ఏమన్నాడంటే?
యంగ్ హీరో నితిన్, క్యూట్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ ఆంథమ్ సాంగ్లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా ‘భీష్మ’ అభిమానులకు చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్డేట్తో ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఈ చిత్ర టీజర్ను జనవరి 12న(ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ‘ఏ ఫన్ టీజర్ ఆన్ యువర్ వే’ అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. రొమాంటిక్ ఎంటర్టైన్గా తెరకుక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టు మూవీ ప్రమోషన్లో భాగంగా నితిన్, రష్మికలతో డిఫరెంట్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పాటలు మినహా మిగతా షూటింగ్ దాదాపు పూర్తయింది. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. BHEESHMA TEASER wil b out on jan 12th at 10a.m 🤗 a FUN teaser on ur wayy!! #bheeshmateaseron12th @VenkyKudumula @iamRashmika @SitharaEnts @vamsi84 pic.twitter.com/drgY7CKxfm — nithiin (@actor_nithiin) January 10, 2020 -
నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్
నితిన్, రష్మికల డ్యాన్స్పై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు. ‘స్వీట్, నితిన్, రష్మికలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘భీష్మ’ టీంకు ఆల్ ది బెస్ట్. లవ్ యూ గాయ్స్’ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు. ఇంతకీ సంగతేంటంటే.. రీసెంట్గా బాలీవుడ్ను షేక్ చేసిన వార్ సినిమాలోని 'గుంగ్రూ' పాటకు నితిన్, రష్మికలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ పర్ఫార్మెన్స్ హృతిక్ రోషన్కు అంకితమంటూ రష్మిక పేర్కొన్నారు. ఈ వీడియోను వీక్షించిన అనంతరం హృతిక్ పై విధంగా కామెంట్ చేశారు. ఇక నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. పాటలు మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. పాటల షూటింగ్ కోసం ‘భీష్మ’ రోమ్ నగరానికి వెళ్లింది. ఇక్కడ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటలను చిత్రీకరించబోతున్నారు. ప్రమోషన్స్లో భాగంగా షూటింగ్ గ్యాప్లో నితిన్, రష్మికలతో డిఫరెంట్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys :) https://t.co/twzubWSuWQ — Hrithik Roshan (@iHrithik) December 28, 2019 కాగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ సినీ ప్రేమికులను తెగ ఆకట్టుకుంటోంది. ‘హై క్లాస్ నుంచి లోక్లాస్ దాకా నా క్రష్ లులే.. వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలేదు’అంటూ సాగే ‘భీష్మ’ఫస్ట్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో తెగ ట్రెంట్ అవుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు 1.5 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇక శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. చదవండి: తమన్నా వచ్చేది ‘మైండ్ బ్లాక్’లో కాదు నితిన్, రష్మికల డ్యాన్స్.. అతడికి అంకితం -
వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే!
ప్రేయసి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు హీరో నితిన్ . మాటల్లో లాభం లేదని పాటలో తన భావాన్ని బయటపెట్టారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.. నిర్మాణ కార్యక్రమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను ‘సింగిల్ యాంథమ్’గా ‘భీష్మ’ చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ‘భీష్మ’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. -
క్రష్లు వందల్లో ఉన్నా ఒక్కళ్లూ సెట్టవ్వలే
కుర్రహీరో నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ పేరుతో విడుదలైన టీజర్ యూత్ను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. తాజాగా ‘భీష్మ’ నుంచి తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది. 'సింగిల్స్ యాంథమ్' పేరుతో రిలీజైన ఈ గీతానికి అభిమానుల నుంచి ముఖ్యంగా సింగిల్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో హీరో సింగిల్ అని చెప్తూనే ‘రెడీ టు మింగిల్’ అని సిగ్నల్స్ ఇస్తున్నాడు. జంటల్ని చూస్తే జెలసీ అని చెప్తూనే తనూ అమ్మాయిల వెనక పడుతున్నాడు. ఇక ఈ సాంగ్ సింగిల్స్కు తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమణి రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు. (భీష్మ: ఫస్ట్ గ్లింప్స్) ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. భీష్మ ప్రచార చిత్రాలకు ప్రేక్షకాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే విడుదలైన చిత్రంలోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. 'భీష్మ' కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతీ అబ్బాయి నితిన్ పాత్రకు, ప్రతీ యువతి రష్మిక పాత్రకు కనెక్ట్ అవుతారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది’ అని తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల కానుంది. చదవండి: ట్రెండింగ్లో ‘భీష్మ’ -
నితిన్, రష్మికల డ్యాన్స్.. అతడికి అంకితం
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ముద్దుగుమ్మ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా పాటల షూటింగ్ కోసం రోమ్ వెళ్లిన భీష్మ టీం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు. ఇక రోమ్లో సందడి చేస్తున్న భీష్మ టీం వరుస అప్డేట్స్తో సినీ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. తొలి సాంగ్ ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన వీడియో హల్చల్ చేస్తుండగానే మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్కు అంకితమిస్తూ అతడు నటించిన 'వార్' చిత్రంలోని 'గుంగ్రూ' అనే పాటకు నితిన్, రష్మికలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోను రష్మిక తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, ఫస్ట గ్లింప్స్తో ‘భీష్మ’ పై హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. లవ్ అండ్ రొమాంటిక్ జానర్లో తెరకెక్కడం, రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నితిన్ యాటిట్యూడ్ సినిమాకు మరింత బలం చేకూరనుంది. ఇక వార్ చిత్రంలోని ‘గంగ్రూ’సాంగ్ ఏ రేంజ్లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జిత్ సింగ్, శిల్పారావు పాడిన ఈ పాటకు యూట్యూబ్లో 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 2019లో మోస్ట్ పాపులర్ సాంగ్గా నిలిచింది. Love to you @iHrithik sir,, From #Bheeshma team from Positano✨💕 Ps. Sorry for the no sync in music. 😋@actor_nithiin @VenkyKudumula pic.twitter.com/yn3DSGdPZN — Rashmika Mandanna (@iamRashmika) December 26, 2019 MERRY CHRISTMAS 🎄 #Bheeshma1stSingleOnDec27th pic.twitter.com/gUHiA6CLVR — nithiin (@actor_nithiin) December 25, 2019 -
అది నా ఫెవరెట్ సాంగ్.. కానీ.., : రష్మిక
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా క్రిస్మస్ను పురస్కరించుకొని తన అభిమానులకు ‘భీష్’మ అప్టేడ్ ఇచ్చాడు హీరో నితిన్. ఈ సినిమాలోని మొదటి పాటను డిసెంబర్ 27న విడుదలవుతుందని చెప్పాడు. ఈ మేరకు హీరోయిన్ రష్మికతో కలిసి ఓ వీడియో తీసి ట్విట్ చేశారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు.. తమ గీతం అని చెప్పాడు. అది తన ఫెవరెట్ సాంగ్ అని రష్మిక చెప్పింది. ఆ పాటలో తనను ఎందుకు పెట్టుకోలేదని డైరెక్టర్ వెంకీ, నితిన్తో గొడవ దిగింది కూడా. మరి రష్మిక ఫెవరెట్ సాంగ్ వినాలంటే ఇంకో రెండు రోజులు(డిసెంబర్ 27)వరకు ఆగాల్సిందే. MERRY CHRISTMAS 🎄 #Bheeshma1stSingleOnDec27th pic.twitter.com/gUHiA6CLVR — nithiin (@actor_nithiin) December 25, 2019 రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్ చేయలేం
కనుల ముందు కనిపిస్తున్న ప్రేమ చెంతకు చేరడం లేదని తెగ ఫీలైపోతున్నారు నితిన్. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పటికే ఓ పాటను అక్కడ చిత్రీకరించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. ఈ టీజర్లో ‘నా లవ్ కూడా విజయ్ మాల్యాలాంటిది రా... కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’ అని నితిన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. కథనం వినోదాత్మకంగా సాగుతుంది. యువతీ, యువకులకు రష్మిక, నితిన్ క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. -
ఫోర్ మిలియన్ వ్యూస్.. థ్యాంక్స్ చెప్పిన నితిన్
ఇప్పుడు ఎక్కడా విన్నా, చూసినా యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించే చర్చ జరుగుతోంది. ‘ఛలో’ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కుర్రకారును పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్డే సందర్బంగా ‘భీష్మ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ పేరిట టీజర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో ఉండటంతో పాటు ఇప్పటికే నాలుగు మిలియన్ వ్యూస్ను రాబట్టడం విశేషం. నితిన్ యాటిట్యూడ్కు తోడు రష్మికా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యూత్ ముఖ్యంగా లవర్స్కు తెగ కనెక్ట్ చేసేలా చేశాయి. ఇక ‘భీష్మ’పస్ట్ గ్లింప్స్ వస్తున్న ఆధరణతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ట్విటర్ వేదికగా కృతఙ్ఞతలు తెలిపాడు. కాగా, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘మా గురుజీ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీష్మ’మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రేక్షకులనుంచి అనూహ్య రీతిలో భారీ స్పందన లభించింది. నితిన్, రష్మికా జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతకుమందు దీపావళి కానుకగా విడుదలైన చిత్ర పోస్టర్స్కు కూడా విశేష స్పందన వచ్చింది. భీష్మ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతీ యువకుడు నితిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశాం. అలాగే రష్మిక క్యారెక్టర్కు ప్రతీ యువతి కనెక్ట్ అవ్వడం ఖాంయం. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్గా సాగడంతో పాటు వినోదాత్మకంగా ఉంటుంది’అని దర్శకుడు తెలిపాడు. ఇక నరేశ్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పిబ్రవరి 21 న విడుదల కానుంది. #BheeshmaFirstGlimpse trending #1 on @youtubeindia with 4 Million realtime views & counting!! 🤩🤩❤ ICYMI ▶ https://t.co/7417agJht0#Bheeshma @actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @SVR4446 @adityamusic pic.twitter.com/ZFBlibvKkn — Sithara Entertainments (@SitharaEnts) November 9, 2019 -
‘ట్రెండ్’సెట్ చేస్తున్న నితిన్, రష్మికా
‘నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా’అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్నే అక్షరాల ఫాలో అవుతున్నాడు పవన్ వీరాభిమాని యంగ్ హీరో నితిన్. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వెండితెర ‘భీష్మ’గా నితిన్ రాబోతున్న విషయం తెలిసిందే. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఇచ్చిన సడెన్ సరైప్రైజ్ నుంచి ప్రేక్షకులు తేరుకోకముందే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బర్త్డే రోజు ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ పేరిట చిన్న టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 31 సెకన్ల పాటు సాగే ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో ఉన్న ‘భీష్మ’ఫస్ట్ గ్లింప్స్, ఇప్పటికే మూడు మిలియన్ వ్యూస్ను రాబట్టడం విశేషం. రష్మికా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో పాటు నడుము సీన్, నితిన్ యాటిట్యూడ్ యూత్కు భాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. ఇక ‘బీష్మ’ వచ్చే ఏడాది పిబ్రవరిలో రిలీజ్ కానుండటంతో 2019లో నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాదని తేలిపోయింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
హల్చల్ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్ గ్లింప్స్
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కుర్రకారును పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్డే సందర్బంగా ‘భీష్మ’చిత్ర యూనిట్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పేరుతో చిన్న టీజర్ రిలీజ్ అయింది. హీరోహీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఫస్ట్ గింప్ల్లో చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ‘నా లవ్ కూడా విజయమాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’అంటూ నితిన్ రష్మిక గురించి పరోక్షంగా చెప్పే డైలాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కల్యాణ్ ఖుషీ సక్సెస్ ఫార్ములాను నితిన్ మరోసారి ఉపయోగించుకోనున్నాడు. ఖుషీ నడుము సీన్ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ ఇప్పటికే ఆ ఫార్ములాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’సినిమాలో వినియోగించుకున్నాడు. ఇక మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేసి అభిమానుల మనసులను దోచే ప్రయత్నం చేసింది ‘భీష్మ’ . ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ యూత్ను తెగ ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ‘అఆ’ తర్వాత ఈ యంగ్ హీరో నితిన్కు సరైన విజయాలు లేవు. 'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్ తీసిన సినిమాలు కమర్షియల్గా హిట్ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెండితెర నయా ‘భీష్మ’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్ గ్లింప్స్
-
పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్
అభిమానులకు హీరో నితిన్ సడన్ సర్ప్రైజ్ చేశాడు. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. అయితే దీపావళి కానుకగా అభిమానులకు నితిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మాస్, క్లాస్, లవ్, రొమాన్స్ షేడ్స్ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అఆ తర్వాత భీష్మతో నితిన్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. ‘అఆ’ తర్వాత ఈ యంగ్ హీరో నితిన్కు సరైన విజయాలు లేవు. 'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్ తీసిన సినిమాలు కమర్షియల్గా హిట్ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చిన్న విరామం తర్వాత నితిన్ వరుసగా సినిమాలతో దూకుడు పెంచాడు. ‘భీష్మ’ షూటింగ్ జరుగుతుండగానే 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా షూటింగ్ విజయదశమి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో కీర్తి సురేష్ నితిన్ సరసన ఆడిపాడనుంది.ఇక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటితో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్. భవ్య క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వారియర్ కథానాయిక. అంతేకాకుండా తమిళంలో ధనుష్ నటించిన 'వాడ చెన్నై' సినిమాని పవర్ పేట పేరిట మరో సినిమాని చేయనున్నట్లు సమాచారం. Here we go! First look of BHEESHMA!! Wishin u all a very HAPPY DIWALI!! #Bheeshma @VenkyKudumula @iamRashmika @vamsi84 @SitharaEnts pic.twitter.com/GxVfsRzUps — nithiin (@actor_nithiin) October 27, 2019 -
రాజమండ్రికి భీష్మ
దీపావళికి ఓ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు వెండితెర నయా ‘భీష్మ’. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిసింది. అలాగే ఈ దీపావళికి సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
లేడీ విలన్?
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్తో అలరించిన హెబ్బా పటేల్ తనలోని నెగటివ్ షేడ్ చూపించబోతున్నారని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్ అని టాక్. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. -
విలన్గా హాట్ బ్యూటీ!
అలా ఎలా సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడి పోతావు చిన్నవాడ సినిమాలతో సక్సెస్లు వచ్చినా.. తరువాత హెబ్బా కెరీర్ ఇబ్బందుల్లో పడింది. వరుసగా నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్ సినిమాలో బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో హెబ్బాకు అవకాశలు కరువయ్యాయి. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాటో హాట్ ఫోటోషూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు హెబ్బా. తాజాగా ఈ భామ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హెబ్బా నెగెటివ్ రోల్లో కనిపించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావటంతో తనకు మరోసారి బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో హెబ్బా ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఎక్కడుందో నా లవర్?
భీష్మ.. ఓ బ్యాచిలర్. గాళ్ఫ్రెండ్ కోసం తెగ వెతుకుతున్నాడు. ఇంతకీ తనకు గాళ్ఫ్రెండ్ దొరికిందా? ఆ విషయం క్రిస్మస్కు తెలుస్తుంది. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా కథానాయిక. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘చేతిలో ఫ్లవర్.. ఎవరవుతారో నా లవర్. క్రిస్మస్ తాత సాంటా క్లాజే నాకు గాళ్ ఫ్రెండ్ని గిఫ్ట్ ఇస్తాడనుకుంటున్నాను. ‘భీష్మ’ మీ అందర్నీ క్రిస్మస్కు ఎంటర్టైన్ చేస్తాడు’’ అని నితిన్ ట్వీట్ చేశారు. -
తొలి అడుగు పూర్తి
వెండితెర ‘భీష్మ’ తొలి అడుగు విజయవంతంగా ముగిసింది. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు సాగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాని తెలిసింది. అలాగే ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ఆగస్టు 16న ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
భీష్మ.. నితిన్ లుక్ ఇదే!
వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఛలో సినిమాతో వెండితెరకు పరిచయం అయిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించిన నితిన్ భీష్మ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో నితిన్ లుక్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా డీసెంట్ లుక్లో దర్శనమిస్తున్నాడు నితిన్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాతో నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్దేతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు అంగీకరించారు. -
నితిన్, రష్మిక మందన్న ‘భీష్మ’ ఆరంభం
-
‘భీష్మ’ మొదలైంది!
నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’. ఈ మూవీ బుధవారం(12-6-19) ఉదయం 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. డిసెంబర్ నెలలో చిత్రాన్ని విడుదల చేసే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతీ అబ్బాయి నితిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేశాం. ప్రతీ యువతి కూడా రష్మిక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్తో సాగుతుంది అని తెలిపారు’. -
నితిన్.. పది నెలల తరువాత!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ ఎంత ప్రయత్నించినా సరైన గాడిలో పడటం లేదు. హిట్ కోసం విక్రమార్కుడిలా వరుస ప్రయత్నాలు చేసిన నితిన్ ఇష్క్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫ్లాప్లు పలకరించాయి. దీంతో ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు 10 నెలల విరామం తరువాత తిరిగి కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన నితిన్, బుధవారం నుంచి ఆ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్ను ఫైనల్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్కు మంచి రెస్పాన్స్ రావటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జూన్లో షురూ
బ్యాచిలర్ లైఫే సో బెటర్ అంటున్నారు హీరో నితిన్. మరి.. ఆయన అలా ఎందుకు అంటున్నారో వెండితెరపై చూడాల్సిందే. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. రష్మిక మండన్నా హీరోయిన్గా నటించనున్నారు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘ఛలో’ సినిమాతోనే రష్మికా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. ‘భీష్మ’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారంలో స్టార్ట్ కానుందని తెలిసింది. పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారట. నటీనటుల ఎంపికలో స్పెషల్ కేర్ తీసుకున్నారట నితిన్ అండ్ టీమ్. ఈ సినిమా కాకుండా... చంద్రశేఖర్ యేలేటి, కృష్ణచైతన్య దర్శకత్వాల్లోనూ సినిమాలు చేయనున్నారు నితిన్. ఇలా వరుస సినిమా కమిట్మెంట్స్తో నితిన్ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
వరుస ఫ్లాప్లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్, లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో నితిన్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్తలపై దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చారు. భీష్మలో ఒకే హీరోయిన్ఉంటుందని ఆ పాత్ర రష్మికను ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. Rashmika Mandanna is the only female lead in Nithin starrer #Bheeshma produced under Sithara entertainments ! Cast and crew details vl announce soon 😊🙏🏻@actor_nithiin @iamRashmika @vamsi84 @SitharaEnts — Venky Kudumula (@VenkyKudumula) 16 April 2019