NGK Movie
-
‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’
చెన్నై : ఈ కాలంలో మాటకు విలువేలేదని చెప్పవచ్చు. అంతా కృత్రిమం, అవకాశవాదమే. ఈ రోజు సరే అన్న వారు రేపు సారీ అంటున్నారు. సినిమా వాళ్లు ఇందుకు అతీతం కాదు. నటి సాయిపల్లవి ఈ కోవకు చెందినదేనా అనే అనుమానాన్ని ఒక యువ దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు. సాయిపల్లవిని కోలీవుడ్కు తీసుకురావడానికి ముందు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కూడా సాయిపల్లవిని తన చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారనే టాక్ అప్పట్లో ప్రచారం అయ్యింది. కాగా ఎట్టకేలకు దర్శకుడు విజయ్ ఆమెను దయా చిత్రంతో కోలీవుడ్కు తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరచింది. అంతే కాదు ఆ తరువాత ధనుష్తో రొమాన్స్ చేసిన మారి–2, సూర్య సరసన నటించిన ఎన్జీకే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి, దీంతో అక్కడ సాయిపల్లవి దుకాణం బంద్ అన్నంతగా మారింది. దీంతో తెలుగు, మాతృభాష మలయాళంలోనే దృష్టి పెట్టింది. అలాంటి ఈ అమ్మడు రామకృష్ణన్ అనే యువ దర్శకుడి చిత్రంలో నటించడానికి సాయిపల్లవి మాట ఇచ్చిందట. దర్శకుడు చేరన్ శిష్యుడైన రామకృష్ణన్ సహాయ దర్శకుడిగా ఉన్న సమయంలోనే హీరోగా అవకాశం రావడంతో కుంకుమపూవే కొంజుం పురావే చిత్రంలో నటించాడు. అలా కొన్నిచిత్రాల్లో నటించిన ఇతను ఇటీవల అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. అయితే తాజాగా దర్శకుడిగా చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరించినట్లు చెప్పుచొచ్చాడు. దీని గురించి రామకృష్ణన్ తెలుపుతూ.. సాయిపల్లవిని కలిసి కథ వినిపించినట్లూ, కథ విన్న ఆమె ఎన్నాళ్ల నుంచి ఈ కథను తయారు చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిందని చెప్పారు. కథ నచ్చిందని, తాను ఈ చిత్రంలో కచ్చితంగా నటిస్తానని చెప్పిందని అన్నారు. ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థనే తనును నటి సాయిపల్లవికి కథ చెప్పమని పంపించిందని దర్శకుడు తెలిపాడు. అయితే కథ బాగుంది, నటిస్తానని చెప్పిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ కారణంగా తమ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేదని చెప్పారు. కాగా ఒకవేళ తన కథ సాయిపల్లవికి నచ్చలేదా నిజంగానే బిజీ కారణంగా కాల్షీట్స్ ఇవ్వలేకపోతోందా అన్న సందేహం తనకు కలుగుతోందని దర్శకుడు రామకృష్ణన్ అంటున్నాడు. దీనికి సాయిపల్లవే బదులు చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడికి కోలీవుడ్ అచ్చిరాలేదు. పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడిని నమ్మి మరోసారి కోలీవుడ్కు వచ్చే సాహసం చేస్తుందా తన మాట నిలబెట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి. -
రీల్ ఎన్జీకే రియల్ అవుతాడా?
తమిళనాడు, పెరంబూరు: రీల్ ఎన్జీకే రియల్ ఎన్జీకే అవుతాడా? పుట్టుకతోనే ఎవరూ వృత్తితో రారు. పరిస్థితులు, ఆలోచనలు, అవకాశాలు, అభిరుచులు ,అన్నింటికీ మించి అదృష్టం ఒక్కో మనిషిని ఒక్కో మార్గంలో నడిపిస్తాయి. ఇదంతా నటుడు సూర్య ప్రస్తుత పరిస్థితి గురించే. సీనియర్ నటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య, రెండవ కొడుకు కార్తీ. ఇద్దరూ తండ్రి అడుగు జాడల్లోనే నటులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్ గత 40 ఏళ్లుగా తన పేరుతో ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు చేయూత నిచ్చే విధంగా వారి చదువుకు ఆర్ధిక సాయం అందిస్తూ వస్తున్నారు. కాగా సమీపకాలంలో ఆయన బాధ్యతలను కొడుకు సూర్య తీసుకుని అగరం పౌండేషన్ ద్వారా విద్యాదానంతో పాటు వ్యవసాయ రైతులను ఆదుకునే విధంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు తమ్ముడు కార్తీ అండదండలు ఉంటుంన్నాయి. ఎలాంటి స్వలాపేక్షా లేకుండా శివకుమార్ కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మంచి ప్రశంసలు లబిస్తున్నాయి. ఇంత వరకరూ బాగానే ఉంది. నటన, చిత్ర నిర్మాణం, విద్య, వ్యవసాయదారులకు సేయూత వంటి కార్యక్రమాలతో తన పని తాను చేసుకుపోతున్న నటుడు సూర్య ఇటీవల తన పౌండేషన్ ద్వారా నిర్వహించిన విద్యార్ధులకు ఆర్థిక సాయం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలు పరుస్తున్న నూతన విద్యా విధానం విద్యార్దులకు మేలు చేసే విధంగా లేదనీ, ఐదవ తరగతి నుంచే ఎంట్రెన్స్ పరిక్షలు విధానంతో విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందనీ,ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూత పడే పరిస్థితి నెలకొంటుందనీ కాస్త ఆవేశంగానే మాట్లాడారు. రాజకీయ నాయకులు విమర్శనల దాడి కొందరు రాజకీయ నాయకులు సూర్య వ్యాఖ్యలపై విమర్శల దాడికి దిగారు. ముఖ్యంగా బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ నాయకులు సూర్యకు విద్య గురించి ఏం తెలుసని విమర్శిస్తున్నాడు? అంటూ ద్వజమెత్తారు. అయితే కాంగ్రేస్, మక్కళ్ నీది మయ్యం పార్టీ,నామ్ తమిళర్ వంటి రాజకీయ పార్టీలు సూర్యకు అండగా నిలిచారు. దీంతో సూర్యకు రాజకీయ రంగు పులిమేస్తున్నారా? అన్నంతగా పిరిస్థితులు కనిపిస్తున్నారు. కారణం కొందరు సినీ ప్రముఖులతో పాటు అనేక మంది అభిమానులు సూర్యకు మద్దతుగా నిలిచారు. ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సూర్య వ్యాఖ్యలను స్వాగతించడంతో పాటు ఆయన్ని విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులే కాకుండా, ఎప్పుడూ వాదులాడుకునే విజయ్,అజిత్ అభిమానులు ఒకటై సూర్యకు పూర్తిగా సపోర్టు చేస్తుండటం విశేషం. నటుడు సూర్య విద్యారంగంలో నిపుణులతో అగరం పౌండేషన్ను నడుపుతున్నారనీ, విద్యార్దులకు చేయూత నిస్తున్న ఆయనకు విద్యా గురించి తెలియదనడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానం గురించి ఎవరైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాటిని పరిగణలోకి తీసుకుని చర్చించాలి గానీ, ఎదురు దాడి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనవసరంగా రాదాంతం చేస్తూ కొందరు రాజకీయ నాయకులు ఎలాంటి ఆలోచనా లేని నటుడు సూర్యను రాజకీయాల్లోకి బలవంతంగా వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారా? అనే మాటా వినిపిస్తోంది. విశ్వరూపం చిత్రం విషయంతో ఆ చిత్ర దర్శక,నిర్మాత, నటుడు కమలహసన్ను వేదింపులకు గురి చేయడం కారణంగానే ఆయన్ని రాజకీయ పార్టీను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారనే భావన వ్యక్తం అవుతోంది. కాగా నటుడు సూర్య ఇటీవల నటించిన ఎన్జీకే చిత్రంలో నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ సామాజిక సేవలు చేసుకునే సూర్యను కొందరు రాజకీయ నాయకుల చర్యలు రాజకీయాల్లోకి వచ్చేలా చేయడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రినే అయ్యి పోతాడు. అది రీల్ జీవితం అయితే ప్రస్తుతం సూర్య రియల్ జీవితంలోనూ రాజకీయనాయకులు బలవంతంగా రాజకీయాల్లోకి నెట్టే చర్యలకు పాల్పడుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఇంతటితో ఆగిపోతుందా?లేక చిలువలు పలువలతో జటిలంగా మారుతుందా? చూద్దాం. ఎందుకంటే ఏ అర్హత అవసరం లేనిది రాజకీయరంగం. ఎవరైనా తమ అదృష్టాన్ని పరిక్షించుకోవచ్చు. కాగా ప్రస్తుతానికి మాత్రం నటుడు సూర్యకు రాజకీయ రంగప్రవేశ ఆలోచన లేదన్నది ఆయన అనుచరుల మాట. -
అందుకే.. జీవితంలో అసలు పెళ్లే చేసుకోను!
తమిళసినిమా: విజయాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కొందరికి నేమ్,ఫేమ్ ఉన్నా విజయాలు దగ్గరికి రావడానికి దోబూచులాడుతుంటాయి. అందుకే పెద్దలు అంటుంటారు ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని. ఇదుగో నటి సాయిపల్లవిది కోలీవుడ్లో ఇందే పరిస్థితి. మాలీవుడ్లో మలర్ చిత్రంతో వికసించిన కథానాయకి ఈ అమ్మడు. ఆ చిత్రంలో టీచర్గా అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడికి మాతృభాషతో పాటు దక్షిణాదిలోనే క్రేజ్ వచ్చేసింది. అంతేకాదు టాలీవుడ్లో అవకాశాలు తలుపు తట్టేశాయి. అలా అక్కడ సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. అదే విధంగా ఎంసీఏ చిత్రం హిట్ అయ్యింది. దీంతో అక్కడ సాయిపల్లవి పేరు మారు మోగింది. అంతే అ తరువాత సాయిపల్లవికి సక్సెస్ ముఖం చాటేసింది. ఇక కోలీవుడ్లో నటించిన మూడు చిత్రాలు ఈ అమ్మడి కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దయ, మారి–2, ఎన్జీకే ఈ మూడు చిత్రాల్లో ధనుష్తో జత కట్టిన మారి–2 చిత్రం కాస్త మెరుగు. అందులో రౌడీ బేబీ పాట సాయిపల్లవిని చాలా పాపులర్ చేసిందనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీకి ఏ భాషలోనూ కొత్త అవకాశాలు కనుచూపు దూరంలో కనిపించడం లేదు. ఇంతకు ముందు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా అవకాశాలు లేకుంటే వైద్యం వృత్తి చేసుకుంటానని చెప్పిన సాయిపల్లవి తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. హీరోయిన్ అన్న వారెవరికైనా ఎదురైయ్యే ప్రశ్న ఎవరినైనా ప్రేమించారా?పెళ్లి ఎప్పుడు? అన్నవే. అయితే నటి సాయిపల్లవికి మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నే ఎదురవుతోందట. అందుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తాను అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. కారణం ఏమిటంటే తాను పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకోవడం కుదరదని పేర్కొంది. అందుకే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చింది. సాయిపల్లవి చెప్పిన కారణం నమ్మశక్యంగా ఉందా? ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటిగా మాలీవుడ్, టాలీవుడ్లలో సక్సెస్లు చూసిన ఈ అమ్మడికి కోలీవుడ్లో మాత్రం అది ఇంకా అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క అవకాశం కూడా చేతిలో లేదాయే. ఎన్జీకే చిత్రంలో ఈమెతో పాటు నటించిన నటి రకుల్ప్రీత్సింగ్ మాత్రం విజయ్తో రొమాన్స్ చేసే క్రేజీ ఆఫర్ను దక్కించుకుందనే ప్రచారం హోరెత్తుతోంది.ఇందుకు కారణం రకుల్ప్రీత్సింగ్ గ్లామర్ను నమ్ముకుంది. సాయిపల్లవి నటనను నమ్ముకోవడమేననుకోవాలి. -
రకుల్కు లక్కీచాన్స్?
నటి రకుల్ ప్రీత్ సింగ్ కోసం లక్కీచాన్స్ ఎదురుచూస్తోందా? ఇందుకు అవుననే టాక్ కోలీవుడ్లో వైరల్ అవుతోంది. నిజానికి ఈ బ్యూటీ మార్కెట్ చాలా డౌన్లో ఉందన్నది వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్తీతో రొమాన్స్ చేసిన దేవ్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సూర్య సరసన నటించిన ఎన్జీకే చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం శివకార్తికేయన్కు జంటగా నటిస్తున్న చిత్రం ఒక్కటే సెట్స్ మీద ఉంది. అయినా రకుల్ ప్రీత్ సింగ్ను అదృష్టం విడనాడలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఈ అమ్మడికి ఇళయదళపతి విజయ్తో జతకట్టే అవకాశం ఎదురు చూస్తుందన్నదే. సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత విజయ్ తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తోంది. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్ మహిళా ఫుట్బాల్ క్రీడా శిక్షకుడిగా నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. కాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. కాగా విజయ్ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించేదెవరన్న విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. శంకర్, ఏఆర్.మురుగదాస్, వినోద్, పేరరసు, మోహన్రాజా ఇలా చాలా మంది దర్శకులు విజయ్ కోసం కథలను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన ఇంతకు ముందు మానగరం వంటి సక్సెస్ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విజయ్ హీరోగా చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని విజయ్ కుటుంబ బంధువైన బ్రిట్టో నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ నిర్మాత ఇంతకు ముందు విజయ్కాంత్, విజయ్ కలిసి నటించిన సెంథూరపాండి, విజయ్ హీరోగా రసిగన్ వంటి చిత్రాలను నిర్మించారు. తాజాగా విజయ్తో నిర్మించనున్న ఈ చిత్రంలో కన్నడ నటి, తెలుగులో క్రేజీ నాయకిగా వెలిగిపోతున్న రష్మిక నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. కానీ ఇప్పుడురకుల్ప్రీత్సింగ్ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అవకాశం కనుక రకుల్ను వరిస్తే తను నిజంగా లక్కీనే. చూద్దాం మరి కొద్ది రోజుల్లో విజయ్ 64వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. -
‘ఎన్జీకే’ రిజల్ట్పై సూర్య స్పందన
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఎన్జీకే. పొలిటికల్ సెటైర్గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్సాన్స్ రాలేదు. కథా కథనాలు ఆకట్టుకునేలా లేకపోవటంతో.. ఎన్జీకే, సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫలితంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సూర్య, తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఎన్జీకే విషయంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నా. మా ప్రయత్నాన్ని, నటీనటుల కష్టాన్ని విశ్లేషించి, ప్రశంసించిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్జీకే తెరకెక్కించేందకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు సూర్య. I humbly accept all the love,views and opinions about NGK with utmost humility and thank the masterminds ;) who decoded and appreciated the different attempt, and the actors performances!! Thanks to the entire cast & crew for making this happen #NGK @selvaraghavan @prabhu_sr — Suriya Sivakumar (@Suriya_offl) 7 June 2019 -
‘పాకెట్ మనీ కోసమే సినిమాలు చేశా’
తాను నటినెందుకయ్యానో తెలుసా? అని అంటున్నారు నటి రకుల్ప్రీత్సింగ్. కథానాయకిగా రాణిస్తున్న ప్రతి నటి తానెందుకు నటినయ్యాను? ఎలా అయ్యాను? వంటి విషయాల గురించి ఏదో కారణం ఉందని చెబుతుంటారు. మనం వింటుంటాం. మరి రకుల్ప్రీత్సింగ్ ఏం చెబుతున్నారో చూసేస్తే పోలా. ఈ అమ్మడికి కోలీవుడ్లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం అనే ఒక్క విజయం మినహా సరైన మరో సక్సెస్ లేదన్నది నిజం. అయితే టాలీవుడ్లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్ప్రీత్సింగ్ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్లో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్ప్రీత్సింగ్ తాను ఎన్జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు. ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ చిత్రాలకు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు. ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్ప్రీత్సింగ్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్లో ఈ అమ్మడికి రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్తో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఒక్కటే ఉంది. అదేవిధంగా తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, హిందీలో మర్జావాన్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
థ్రిల్ అయ్యారు
సూర్య హీరోగా, సాయిపల్లవి, రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్లుగా శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్జీకే’(నంద గోపాల కృష్ణ). డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కె.కె. రాధామోహన్ తెలుగులో మే 31న విడుదలచేశారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా శ్రీ రాఘవ మాట్లాడుతూ– ‘‘వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ఫస్ట్ హాఫ్లో హీరో, సెకండ్ హాఫ్లో విలన్గా సూర్య పాత్రని వైవిధ్యంగా చూపించాం. అదే ‘ఎన్జీకే’ చూసిన ఆడియన్స్ని థ్రిల్ అయ్యేలా చేసింది. సూర్యతో డిఫరెంట్ క్యారక్టర్ చేయించారని అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఎన్జీకే’ సాధించిన విజయం అటు సూర్యకి, ఇటు దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఫస్టాఫ్లో హీరో.. సెకండాఫ్లో విలన్
'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన శ్రీ రాఘవ దర్శకత్వంలో వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ 'ఎన్ జీ కే'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు. మే 31న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సూర్య ఫస్టాఫ్లో హీరో, సెకండాఫ్లో విలన్గా క్యారెక్టరైజేషన్ను డిఫరెంట్గా చేశాము. అదే ‘ఎన్జీకే’ చూసిన ఆడియెన్స్ను థ్రిల్ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్కు ట్రెమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది. సూర్య తో డిఫరెంట్ క్యారక్టర్ చేయించారని అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 'ఎన్జీకే' సాధించిన విజయం అటు సూర్యకి దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు. -
తిరుత్తణిలో ఎన్జీకే సందడి
తిరుత్తణి: నటుడు సూర్య నటించిన ఎన్జీకే చిత్రం శుక్రవారం విడుదలైన సందర్భంగా తిరుత్తణిలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దీంతో సినిమా థియేటర్ల ముందు కోలాహలం చోటుచేసుకుంది. ఉదయం ఏడు గంటలకే వందలాది మంది అభిమానులు సినిమా థియేటర్ వద్దకు చేరుకుని కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. ఉత్సాహంగా మొదటి షో చూసి సంబరాలు జరుపుకున్నారు. తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు ఎల్టీ.రాజ్కుమార్ అధ్యక్షతన రూ. ఏడు లక్షల వ్యయంతో 215 అడుగుల పొడవైన సూర్య కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో తిరుత్తణిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
లీడర్
-
సారీ చెప్పిన సాయి పల్లవి
కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ రోజు ఎన్జీకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సూర్యతో పాటు సాయి పల్లవి కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో మాట్లాడాలని భావించారు. కాసేపట్లో మీతో ఆస్క్ సాయి పల్లవి(#AskSaiPallavi) ట్యాగ్ అభిమానుల ప్రశ్నలను ట్వీట్ చేయాలంటూ కోరారు. చాలా కాలం తరువాత సాయి పల్లవి సోషల్ మీడియాలో చాట్ చేయటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తమ ప్రశ్నలను ట్వీట్ చేశారు. అయితే సాయి పల్లవి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీంతో చాలా సమయం వెయిట్ చేసిన కొందరు అభిమానులు నువ్వు చీట్ చేశావు. మా ప్రశ్నలకు రిప్లై ఇవ్వలేదు అంటూ కామెంట్ చేశారు. దీంతో సాయి పల్లవి అభిమానులకు సారీ చెప్పారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలపై ఆలస్యంగా స్పందించిన ఆమె ‘నేను సమధానం చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు’ అంటూ క్షమాపణలు కోరారు. తరువాత కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చారు. Thank you all for the unconditional love ❤️ I’m sorry that I cudn reply to all the tweets( I really wish I could but I’m so bad at this 🙈)I hope u enjoy watching NGK at theatres Tomo ♥️ Until next time ,sending u lots n lots of love 😘 — Sai Pallavi (@Sai_Pallavi92) 30 May 2019 -
‘ఎన్జీకే’ రిలీజ్కు ముందు ఫ్యాన్స్కు షాక్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకే శుక్రవారం విడుదలైంది. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న సూర్య ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అభిమానులు కూడా ఈ మూవీ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుత్తణిలో ఏర్పాటు చేసిన 215 అడుగుల భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఈ కటౌట్ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రిలీజ్ సందర్భంగా అభిమానుల ఏర్పాట్లలో ఉండగా గురువారం కటౌట్ తొలగించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటించారు. -
‘ఎన్జీకే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
మా అందరికీ ఇది స్పెషల్ మూవీ
‘‘అందరికీ సూర్య గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంతకంటే గొప్ప మనసున్న మనిషి. సూర్య ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. ఆయనకు సెల్యూట్’’ అన్నారు శ్రీరాఘవ. సూర్య, సాయిపల్లవి, రకుల్ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్జీకే’ (నంద గోపాలకృష్ణ). తెలుగు, తమిళ భాషల్లో రేపు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో కేకే రాధామోహన్ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఒక వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడు అన్నదే సినిమా కథ. మా అందరికీ స్పెషల్ మూవీ. నా గత చిత్రం (‘గ్యాంగ్’) విడుదలై ఏడాదిన్నర అయింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణతో తెలుగు ఇండస్ట్రీని నా సొంత ఇంటిలా భావిస్తాను. ‘ఎన్జీకే’ ప్రేక్షకులకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఇంతకుముందు హిట్ సాధించిన సూర్య సినిమాలకు ‘ఎన్జీకే’ చిత్రం దీటుగా ఉంటుందని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్.ఆర్. ప్రభుకి థ్యాంక్స్’’ అన్నారు రాధామోహన్. ‘‘సూర్య అద్భుతంగా నటించారు. సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ మంచి నటీమణులు. యువన్తో సహా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శ్రీరాఘవ. ‘‘సూర్య తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ సినిమా మంచి హిట్ కావాలి. రాధామోహన్గారికి పెద్ద సెక్సెస్గా నిలవాలి’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘యూనిట్కి ఆల్ ది బెస్ట్. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత భోగవల్లి బాపినీడు. ‘‘తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎలా వెయిట్ చేస్తున్నారో.. సూర్యగారి సినిమా అంటే అంతే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా సూపర్హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. ‘‘హైదరాబాద్కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. సూర్యగారు, రాఘవగారు.. ఇలా టీమ్ అందరూ నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు’’ అన్నారు సాయిపల్లవి. ‘‘సూర్యగారు అమేజింగ్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు రకుల్ప్రీత్ సింగ్. కెమెరామేన్ శివకుమార్ విజయన్ మాట్లాడారు. -
రికార్డ్ బ్రేక్: 215 అడుగుల సూర్య కటౌట్
అభిమానానికి హద్దు ఉండదేమో. తమ ఆరాధ్య నటుడు సినిమా రిలీజ్ అంటే ఇక ఫ్యాన్స్కు పండుగే. పూల దండలు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో సూర్య అభిమానుల కూడా తమ అభిమానంతో ఏకంగా రికార్డునే బ్రేక్ చేశారు.. సూర్య నటించిన ‘ఎన్జీకే’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 215 అడుగుల ఎత్తైన కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ను తిరుత్తణిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్ను చూసేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా కటౌట్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కాగా ఇప్పటివరకూ హీరో అజిత్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు నమోదు అయింది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా 215 అడుగుల పొడవైన కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు ఈ కటౌట్ నిర్మాణంలో పాల్గొన్నారు. 35 రోజుల పాటు శ్రమించి తిరుత్తణి- చెన్నై బైపాస్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు. -
‘అవును.. 2 కోట్ల యాడ్కు నో చెప్పా’
‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి పల్లవి తరువాత సౌత్లో బిజీ హీరోయిన్గా మారిపోయారు. మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూర్య సరసన హీరోయిన్గా నటించిన ‘ఎన్జీకే’ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సాయి పల్లవి ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్లో నటించేందుకు నో చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. 2 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. ఈ బ్యూటీ నో చెప్పారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా ఆ వార్తలపై సాయి పల్లవి స్పందించారు. పింక్విల్లా కథనం మేరకు ‘ఇది భారతీయుల రంగు. మనం విదేశీయుల దగ్గరికి వెళ్లి మీరెందుకు తెల్లగా ఉన్నారని అడగం. అది వారి రంగు.. ఇది మన రంగు. ఆఫ్రికన్స్కు కూడా వారి రంగు వారికుంది. వారంతా అందంగానే ఉన్నారు. ఆ యాడ్ చేయటం ద్వారా వచ్చే డబ్బు నేనేం చేసుకుంటాను. ఇంటికెళ్లి మూడు చపాతిలు తిని, కారులో షికారు చేస్తాను. అంతకంటే నాకు పెద్దగా అవసరాలు లేవు. నేను నా చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితే చాలు’ అని సాయి పల్లవి వెల్లడించినట్టుగా పింక్విల్లా పేర్కోంది. -
నేను యాక్టర్ని.. క్రియేటర్ని కాదు
‘‘నేను శ్రీ రాఘవ అభిమానిని. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కల. ఆ అవకాశం కోసం 19ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ‘ఎన్.జీ.కే’ రూపంలో ఆ అవకాశం దొరికింది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన చేసి, చూపించిన దాంట్లో మనం ఒక్క శాతం చేసినా చాలు’’ అన్నారు హీరో సూర్య. ‘గజిని, యముడు, సింగం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్.జీ.కే’ (నంద గోపాల కృష్ణ). ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల ఫేమ్ శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్సింగ్, సాయి పల్లవి కథానాయికలు. ఎస్.ఆర్. ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడదల కానుంది. తెలుగులో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సూర్య పంచుకున్న విశేషాలు... ►శ్రీ రాఘవ వినిపించిన నాలుగు కథల్లో ‘ఎన్.జీ.కే’ బాగా నచ్చింది. అందుకే ఈ కథతో ముందుకెళ్లాం. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఏ ఒక్క రాష్ట్రానికీ సంబంధించినది కాదు. ఏ రాష్ట్రంలోని రాజకీయాలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. కానీ, మా సినిమాలో యూనివర్శల్ కాన్సెప్ట్ ఉంటుంది. మంచి డైలాగులు, ఎమోషన్స్, స్క్రీన్ప్లే ఉంటుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ చాలా బాగుంటుంది. మా కథకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ►వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఓట్లు వేయడానికి మాత్రం ముందుంటారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రశ్నించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. చదువుకున్నవారు, మేథావులే ఇలా ఆలోచిస్తే ఎలా? వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక సామాన్య యువకుడు రాజకీయ వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? లోపాల్ని ఎలా సరిదిద్దాడు? అన్నదే ‘ఎన్.జీ.కే’ కథ. రియాలిటీకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. ►రాఘవ ఓ కథని రెడీ చేయటానికి ఏడాది నుంచి ఏడాదిన్నర తీసుకుంటాడు. తనకెవరూ సపోర్టర్స్ లేరు. కథ, స్క్రీన్ప్లే, డైలాగులు... ఇలా అన్నీ ఒక్కడే రాసుకుంటాడు. అందుకే అంత టైమ్ తీసుకుంటాడు. ‘ఎన్.జీ.కే’ కేవలం శ్రీరాఘవ ఫిల్మ్. తన సినిమాల్లో పాటలు కూడా రెగ్యులర్గా ఉండవు. తనతో పని చేయడం ప్రతిరోజూ ఓ కొత్త అనుభూతి. దర్శకుడు బాలాసార్ స్కూల్ నుంచి నేను వచ్చాను. దర్శకత్వంలో బాలా, శ్రీరాఘవ ఎవరి శైలి వారిదే. శ్రీరాఘవతో పనిచేస్తున్నప్పుడు బాలా సార్తో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ బాగా నటించారు. ►శ్రీరాఘవ ఒక్కోసారి ఏడెనిమిది టేక్లు తీస్తారు. ఆ రోజు సన్నివేశం సరిగ్గా రాలేదంటే మరుసటి రోజు కూడా అదే సీన్ చేయిస్తారు. అందుకే ఆయన టేక్ ఓకే అంటే అదే పెద్ద రిలీఫ్గా భావించేవాణ్ణి. ప్రతి రోజూ కొత్త డైరెక్టర్లా చేస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎటువంటి రాజకీయ రిఫరెన్సులు తీసుకోలేదు. చాలా పరిశోధించారు. కెమెరాముందు నేను మిమిక్రీ చేయడం లేదు. అందుకే శ్రీరాఘవ చేసి చూపించే ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని నటించేవాణ్ణి. మా ‘ఎన్.జీ.కే’ సినిమాని చూడకుండా నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్న రాధామోహన్ సార్కి థ్యాంక్స్. ►ఒక్కసారి కథ విన్నాక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తా. ఎందుకంటే నేను యాక్టర్ని.. క్రియేటర్ని కాదు. నాకు నచ్చినట్టు కథ, డైలాగులు రాసుకోలేను. అమితాబ్ సార్ సినిమాల్లో కామెడీ ఉంటుంది. నటనకూ ప్రాధాన్యత ఉంటుంది. నా సినిమాల్లో ఈ రెంటికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటా. ►తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ, కుదరడం లేదు. త్రివిక్రమ్గారితో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు దర్శకురాలు సుద కొంగరతో (‘గురు’ ఫేమ్) సినిమా చేయడం మంచి అనుభూతి. ‘‘మా బ్యానర్లో ఇంతవరకు డబ్బింగ్ మూవీ రిలీజ్ చేయలేదు. కానీ, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని ‘ఎన్.జీ.కే’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సూర్య, సాయిపల్లవి, రకుల్ జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. ఇలా బెస్ట్ ఆర్టిస్ట్లు, బెస్ట్ టెక్నీషియన్స్తో రూపొందిన సినిమా ఇది. రాజకీయ నేపథ్యంలో మా బ్యానర్లో ‘అధినేత’ సినిమా వచ్చింది. అలాగే వేరే బేనర్లలో ‘లీడర్, భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పొలిటికల్ సబ్జెక్ట్ అనేది యూనివర్శల్ కాబట్టి తప్పకుండా ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సూర్య ‘గజిని, యముడు, సింగం’ సినిమాల్లా ‘ఎన్.జీ.కే’ కూడా పెద్ద హిట్ అవుతుంది. – నిర్మాత రాధామోహన్ ప్రజల నమ్మకాన్ని జగనన్న నిలబెట్టుకుంటారు జగనన్నతో (వైఎస్ జగన్ మోహన్రెడ్డి) నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబంలోని అనిల్ రెడ్డి నా క్లాస్మేట్. సునీల్ రెడ్డి కూడా తెలుసు. అనిల్తో ఉన్న స్నేహం కారణంగా రాజకీయాలకు అతీతంగా వైఎస్ కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్గారు సాధించిన విజయం ఎంతో అద్భుతమైంది. వైఎస్సార్ (వైఎస్ రాజశేఖర రెడ్డి)గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఏపీ పాలిటిక్స్ గురించి తెలుసు. ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించాక ఆయన తనయుడు జగనన్న చేస్తున్న రాజకీయ పోరాటం గురించి అవగాహన ఉంది. పది సంవత్సరాల నుంచి ప్రజల మధ్యే ఉంటూ ఎంతో కష్టపడ్డారాయన. అన్ని రోజులు పాదయాత్ర చేయడం గ్రేట్. పైగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఇంకా గ్రేట్. అందుకే ప్రజలు కూడా భారీ విజయాన్ని అందించి, హిమాలయ పర్వతాలంత బాధ్యతను పెట్టారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ, వాటిని నెరవేర్చుతారు. తక్కువ వయస్సు ఉండి ముఖ్యమంత్రి అయిన వారిలో జగన్ అన్న రెండో వార వడం నిజంగా గ్రేట్. కచ్చితంగా ఆయన సీఎంగా సక్సెస్ అవుతారు. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. మళ్లీ మళ్లీ ఎన్నో సంవత్సరాలు జగన్ అన్న సక్సెస్ అవుతారు’’ అన్నారు. ‘‘ఇక ‘యాత్ర 2’ సినిమాలో జగనన్న పాత్ర నేను చేయనున్నాననే వార్తలను నేను కూడా విన్నాను. ‘యాత్ర’కి మంచి టీమ్ కుదిరింది. ‘యాత్ర 2’ సినిమా గురించి ఇంతవరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. కథ ఆకట్టుకునే విధంగా ఉంటే కచ్చితంగా చేస్తాను.. అందులో డౌట్ లేదు’’ అని స్పష్టం చేశారు సూర్య. -
జగన్ అన్నకు కంగ్రాట్స్ : సూర్య
ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో నటిస్తూ సూపర్ స్టార్గా దూసుకుపోతున్న సూర్య నటించిన తాజా చిత్రం ఎన్జీకే(నందగోపాల కృష్ణ). నేటి సాయంత్రం(మే 28) హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్న వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ను తాను జగనన్న అని పిలుస్తానంటూ, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ది సాధిస్తాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం మనం చూస్తున్నామని, ఇది చాలా మంచి పరిణామని.. వైఎస్ జగన్, కేటీఆర్, బెంగళూరులో పోటీ చేసిన తేజస్వినీ సూర్యలను ప్రస్తావించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రాబోతోన్న ఎన్జీకే చిత్రంలో రకుల్ప్రీత్సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అది నిజం కావాలి
‘‘నేను షూటింగ్ లొకేషన్కి వెళ్లే రోజు ఓ కొత్త ఎగై్జట్మెంట్ ఉండాలి. రెగ్యులర్గా కాకుండా నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే ఫీల్ కలగాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను’’ అని రకుల్ప్రీత్ సింగ్ అన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయిపల్లవి, రకుల్ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్జీకే’ (నందగోపాలకృష్ణ). ఎస్ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కేకే రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్ప్రీత్ సింగ్ చెప్పిన విశేషాలు. ► పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. వానతి అనే ఇండిపెండెంట్, పవర్ ఉమెన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. సూర్య మంచి కో–స్టార్. మంచి ప్రతిభాశాలి. సాయిపల్లవి టాలెంటెడ్ యాక్టర్. హీరో క్యారెక్టర్ పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది కథలో కీలకం. ► చాలా సినిమాలు చేసిన తర్వాత సెట్లో ఓ ధోరణికి అలవాటు పడిపోతాం. కానీ సెల్వసార్ సెట్లో అలా ఉండదు. ఒకవేళ మనం ఏదైనా హోమ్వర్క్ చేసి ఓ మైండ్ సెట్తో సెట్లోకి వెళితే అంతా క్యాన్సిల్. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోమ్వర్క్ అంతా సెల్వసార్ చేసేస్తారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ పట్ల ఆయన ఫుల్ క్లారిటీగా ఉంటారు. మల్టీఫుల్ థింగ్స్ని బ్రెయిన్లో పెట్టుకుని యాక్ట్ చేయాలి. సెల్వసార్తో వర్క్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. యాక్ట ర్గా మరింత ఇంప్రూవ్ కావొచ్చు. ► ప్రస్తుతం ఇండియాలో అందరూ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్బీఏ, ఇంజినీరింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు మనకు. పాలిటిక్స్లో జాయిన్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైన విధానం అంటూ ఏం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది? అనే విష యాలను నేటి యువత ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. కామన్పీపుల్, చదువుకున్నవారు రాజకీయాలను ఎంచుకోవడం మంచిదే. చదువుకున్నవారి సంఖ్య పెరిగితే దేశంలోని సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది ► ఈ ఏడాదిలో నావి దాదాపు అరడజను సినిమాలు రీలీజ్ అవుతాయి. వీటి షూటింగ్కి ఎక్కువ టైమ్ పట్టింది. ‘దే దే ప్యార్ దే’ సినిమాకు దాదాపు ఏడు నెలల సమయం పట్టింది. అంత టైమ్ తీసుకున్నాం కాబట్టే ఆ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. బాలీవుడ్లో రకుల్కు మంచి భవిష్యత్ ఉందని అజయ్ దేవగణ్ అన్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తమిళంలో 3 సినిమాలు చేశాను. ► సినిమా అంతా ఒక హీరోయిన్ ఉంటేనే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కాదు. ‘రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, దే దే ప్యార్ దే’ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ► బయోపిక్ చాన్స్ వస్తే నేను తప్పకుండా చేస్తాను. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించాలనుకున్నాను. కాస్టింగ్ అయిపోయింది. కొత్త కాన్సెప్ట్ ఉన్న వెబ్ సీరిస్లో నటించడానికి రెడీ. ► ప్రస్తుతం నాగార్జునగారి ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నాను. హిందీలో చేసిన ‘మర్జవాన్’ సినిమా అక్టోబర్లో విడుదల కానుంది. -
రైనా ప్రశ్నకు సూర్య రిప్లై
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఎన్జీకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ట్వీటర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు సూర్య. అయితే అనూహ్యం భారత క్రికెటర్ సురేష్ రైనా, సూర్యని ట్విటర్ ద్వారా ఓ ప్రశ్నించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు అంటూ ప్రశ్నించాడు రైనా. అయితే ఈ ట్వీట్ స్పందించిన సూర్య ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘మీరు, ధోని అంటే ఇష్టం. మంచి గాయకుడు సురేష్ రైనా.. గొప్ప చిత్రకారుడిగా ధోని అంటే ఇష్టం.ఎప్పటికీ సీఎస్కే ఫ్యాన్’ అంటూ రిప్లై ఇచ్చాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Obviously it’s you and @msdhoni @ImRaina for the singing skills and @msdhoni for his drawing skill 😜 #CSK fan forever!! https://t.co/jnMv5KwjUR — Suriya Sivakumar (@Suriya_offl) 20 May 2019 -
గోపాలకృష్ణ రైట్స్ రాధాకి
నంద గోపాలకృష్ణ 31న రాబోతున్నాడు. తీసుకొస్తున్నది ఎవరో తెలుసా? కేకే రాధామోహన్. నంద గోపాలకృష్ణ అంటే హీరో సూర్య పేరు. ‘7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఎన్.జి.కె’. అంటే నంద గోపాలకృష్ణ అని అర్థం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ సొంతం చేసుకున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాతలు:ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు. -
చిన్నోడైనా వాడినే పెళ్లి చేసుకుంటా!
చెన్నై : సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వార్తే అవుతుంది. ఈ ఉత్తరాది భామ రకుల్ప్రీత్సింగ్ అందుకు అతీతం కాదు. కోలీవుడ్కు కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి మొదట్లో ఇక్కడ చుక్కెదురైంది. అయితే అనుకోకుండా టాలీవుడ్ రకుల్ను ఆదుకుంది. అక్కడ వరుసగా అవకాశాలు రావడం, అందులో కొన్ని చిత్రాలు సక్సెస్ అవుడంతో రకుల్ మంచి మార్కెట్నే అందుకుంది. అయితే ఈమె జోరు అక్కడా ఎక్కువ కాలం సాగలేదు. ఇటీవల కొన్ని బిగ్ ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఇక కోలీవుడ్లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం ఈ అమ్మడికి సక్సెస్ రుచి చూపించినా, ఆ తరువాత ఆ చిత్ర కథానాయకుడు కార్తీతోనే నటించిన దేవ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ప్రస్తుతం నటుడు సూర్యతో రొమాన్స్ చేసిన ఎన్జీకే చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 31న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కాకుండా శివకార్తికేయన్తో ఒక చిత్రంలో రకుల్ రొమాన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో రకుల్ప్రీత్సింగ్ మాట్లాడుతూ తాను మొదట్లో చాలా తప్పులు చేశానని చెప్పింది. అయితే అందుకు తానేమీ బాధ పడడంలేదని అంది. కారణం చేసిన తప్పులను పాఠంగా తీసుకుంటే జీవితంలో ఎదగగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విజయాల విలువ తెలియాలంటే అపజయాలను ఎదుర్కోవాలని అంది. నటి కావాలని ఎంతో మంది ఆశ పడుతుంటారని, అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని అంది. ఇకపోతే పెళ్లి గురించి అడుగుతున్నారని, ప్రేమలో పడడానికి తానూ ఎదురు చూస్తున్నానని చెప్పింది. నచ్చిన వాడు తారసపడితే వెంటనే ప్రేమించి పెళ్లాడేస్తానని తెలి పింది. కాబోయే జీవిత భాగస్వామి ఎలాంటి వాడై ఉండాలన్న ప్రశ్నకు, ప్రేమకు వయసుతో పని లేదని అతగాడు వయసులో చిన్నవాడా, పెద్దవాడా అన్నది చూడనని, నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా ఇదే రకుల్ప్రీత్సింగ్ ఇంతకు ముందు తనను పెళ్లాడే వాడు ఆరడుగుల అందగాడై ఉండాలని పేర్కొందన్నది గమనార్హం. ఇకపోతే ఈ జాణ ఆరడుగుల పొడుగైన ఒక టాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయన్నది గమనార్హం. -
సాయి పల్లవిని ఓదార్చిన సూర్య
ప్రేమం చిత్రంతో ప్రారంభమై మారి– 2లో రౌడీ బేబి పాట వరకు అదరగొట్టే డ్యాన్స్తో చురుకైన నటన ప్రదర్శించారు నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఎన్జీకే చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్నారు. చిత్రం ట్రైలర్ రిలీజ్కు వచ్చిన సాయిపల్లవి మాట్లాడుతూ తాను సూర్య అభిమానినన్నారు. చిత్రం షూటింగ్లో ఆయన కఠిన శ్రమను నేరుగా చూశానన్నారు. తాను చిత్రాల్లో నటించే సమయంలో ఇంట్లోనే హోం వర్కు చేసి సిద్ధంగా వెళతానన్నారు. ఎన్జీకే చిత్రానికి హోంవర్కు చేయకుండా రమ్మన్నారని, దీంతో చిత్రం షూటింగ్లో పది టేకులు, ఇరవై టేకులు, అంతకు పైగా టేకులు తీసుకున్నట్లు తెలిపారు. ఒక దశలో తాను నటించగలనా? అనే అనుమానం రావడంతో తన వల్ల చిత్రం షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు భావించానన్నారు. నటుడు సూర్య మాట్లాడుతూ సాయి పల్లవి చక్కని నటి అనడంలో సందేహం లేదని ప్రశంసించారు. కొన్నిసార్లు సీన్ ముగించుకుని వెళ్లే సాయి పల్లవి కన్నీరు పెట్టున్నారు. తన వల్లే ఇంతగా టేకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసి బాధపడ్డారని, దీంతో ఆమెను సముదాయించాల్సి వచ్చిందన్నారు. సీన్లో చక్కగా నటించిన తర్వాత డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత కూడా అంతటితో తృప్తి చెందని సాయి పల్లవి బాధగా ఉండడం నటనపై ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు. -
‘ఎన్.జి.కె’ ఆడియో రిలీజ్
-
విద్యార్థినిగా ఫీలయ్యా!
సినిమా: దర్శకుడు సెల్వరాఘవన్కు నటుడు సూర్య ఒక విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం ఎన్జీకే. నటి సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్వారియర్ ఫిలింస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్ నిర్మించారు. యువన్శంకర్రాజా సంగీతాన్ని అందించిన ఈ ఎన్జీకే చిత్రం మే 31న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్ధినిలా.. ఇందులో పాల్గొన్న నటి సాయిపల్లవి మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే ఒక పాఠశాల విద్యార్థినిలా ఫీలయ్యానని అన్నారు. తాను ఎప్పుడూ షూటింగ్కు వెళ్లే ముందు తనను తాను తయారు చేసుకుంటానన్నారు. అయితే ఈ చిత్రానికి అలాంటి అవసరం లేదని భావించానన్నారు. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనే ముందు పెద్దగా తెలుసుకునేదేముంటుందిలే అని అనుకున్నానని అయితే దర్శకుడు సెల్వరాఘవన్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఒక్కో నటి, నటుడులోని ప్రతిభను వెలికి తీయడంలో సెల్వరాఘవన్ దిట్ట అని అన్నారు. సూర్యతో నటించి ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం అంటే ఇష్టం కాగా చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ రాజకీయం రక్తం చిందని యుద్ధం, యుద్ధం రక్తం చిందే రాజకీయం అని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం ప్రతిరోజూ కొత్త చిత్రంలో నటించడానికి వెళుతున్నట్లు అనిపించిందన్నారు. నిన్న జరిగిన షూటింగ్కు ఇవాళ కొనసాగింపు ఉండదన్నారు. సమయం ముగిసినా ఆయన పని చేస్తూనే ఉంటానని అన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం, ఆయన రచన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో మనస్ఫూర్తిగా నటించానని సూర్య అన్నారు. యువన్శంకర్రాజా సంగీతం అంటేనే తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆయన సంగీతం కాలాన్ని జయిస్తుందని అన్నారు. నటి సాయిపల్లవి ప్రతి సన్నివేశం పూర్తి అయిన తరువాత బాగా నటించానా అని అడుగుతూ చాలా అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో నటించిన అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారని తెలిపారు. షూటింగ్లో జాప్యం జరిగినా చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభు చిత్రానికి ఏమేం కావాలో అన్నీ సరైన సమయానికి సమకూర్చారని సూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సెల్వరాఘవన్, సంగీతదర్శకుడు యువన్శంకర్రాజా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా నటుడు శివకుమార్ పాల్గొన్నారు. -
నా కల నెరవేరింది – సూర్య
‘‘నేనింతవరకు ఏ దర్శకుడినీ నాతో ఓ సినిమా చేయండి అని అడిగానో లేదో గుర్తు లేదు కానీ, శ్రీ రాఘవగారిని మాత్రం నాతో ఓ సినిమా చేయమని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కల నెరవేరింది’’ అన్నారు సూర్య. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎన్.జి.కె’. (నందగోపాలకృష్ణ). సూర్య, సాయిపల్లవి, రకుల్ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు కాగా, ‘7/జి బృందావన్ కాలని’ ఫేమ్ శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ఎస్.ఆర్. ప్రకాశ్, ఎస్.ఆర్. ప్రభు నిర్మాతలు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్రబృందంతోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్, 2డి ఎంటర్టై మెంట్స్ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ – ‘‘అందరూ ఇది పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ అనుకుంటున్నారు. ఇది మరో కోణంలో ఉండే సినిమా. 2000 సంవత్సరం తర్వాత దర్శకుడు శ్రీరాఘవ తన దృష్టిలో రాజకీయాలను చూసిన కోణంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజూ చాలా కొత్తగా అనిపించేది. ఈ సీన్ ఇలా తీస్తారేమో అనుకుంటే, ఆయన మరోలా తీసి మెప్పించేవారు. ఆయన మరో కథ ఆలోచిస్తే ఆ కథ నాకే చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను శ్రీరాఘవతో మరో సినిమా చేయాలని ఆశ పడుతున్నాను’’ అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్. ఈ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా అని నేను, నిర్మాతలు ప్రకాశ్, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తారని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్ప్రెషను కూడా చక్కగా ఇచ్చారు. సాయిపల్లవి, రకుల్ ప్రీత్సింగ్ చక్కగా నటించారు. యువ సంగీతం, శివకుమార్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్.. ఇలా ఓ వండర్ఫుల్ టీం కుదిరింది’’ అన్నారు. ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ– ‘‘ఎ .జి.కె’ విషయంలో చాలా ఎగ్జయిట్మెంట్తో ఉన్నాం. తొలిరోజు కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యామో.. ఇప్పుడూ అదే ఎగ్జయిట్మెంట్తో ఉన్నాం. మే 31న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన ఆలోచన గ్రౌండ్ లెవల్లో ఉంటే శ్రీరాఘవ ఆలోచన ఆకాశం రేంజ్లో ఉంటుంది. శ్రీరాఘవగారు ఇ స్టిట్యూట్లాంటి వ్యక్తి. నేను ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమీ లేదని ఆయనతో సినిమా చేసిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పటివరకు తెలిసింది అంతా వదిలేసి నటించాలని నేర్చుకున్నాను’’ అన్నారు సాయి పల్లవి. సంగీత దర్శకుడు యువ శంకర్రాజా మాట్లాడుతూ – ‘‘శ్రీరాఘవతో చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి బ్రేక్ చేస్తూ వచ్చాం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను’’ అన్నారు. -
ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నా : సూర్య
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్.జి.కె’ (నంద గోపాలకృష్ణ). ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది. యూనిట్తోపాటు హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్, 2డి టర్టైన్మెంట్స్ రాజా ఈ వేడుకలో పాల్గొన్నారు. నా కల నిజమైన భావన కలుగుతోంది ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - ‘ఎన్.జి.కె’ చిత్రాన్ని పొటిలికల్ డ్రామా, థ్రిల్లర్ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్ చేసిన డైరెక్టర్ శ్రీరాఘవగారి దృక్కోణంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని నాతో సినిమా చేస్తారా? అని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఆనందాన్ని కలిగించింది. అంతేకాదు నా కల నిజమైన భావనను కలిగిస్తోంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నాను. సూర్య అద్భుతమైన నటుడు దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ ‘నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్. స్క్రిప్ట్ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా? అని నేను, నిర్మాతలు ప్రకాశ్, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ను కూడా చక్కగా ఇచ్చారు. తను డైరెక్టర్స్ యాక్టర్. ఇక ప్రొడ్యూసర్స్ ప్రకాశ్, ప్రభు నుండి నిర్మాతలుగా ఎలాంటి సహకారం రావాలో.. ఆ సహకారం అందింది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించారు. యువన్ సంగీతం, శివకుమార్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ ఇలా ఓ వండర్ఫుల్ టీం కుదిరింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అన్నారు. ‘ఎన్.జి.కె.’ను మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ - ‘ఎన్.జి.కె’ విషయంలో చాలా ఎగ్జయిట్మెంట్తో ఉన్నాం. తొలిరోజు కథ ఎంత ఎక్సయిట్ అయ్యామో.. ఇప్పుడూ అదే ఎక్సయిట్మెంట్తో ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్ట్రయిక్ సహా పలు కారణాలతో బ్రేక్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తోంది. రకుల్, సాయిపల్లవి, యువన్ శంకర్ రాజా, శివకుమార్, ప్రవీణ్ ఇలా .. ఈ సినిమా విషయంలో టీం అందించిన సపోర్ట్ మరచిపోలేను. ఏం టైంలో అడిగినా కాదనకుండా సహకారం అందించారు. మంచి రిలీజ్ డేట్ కుదిరింది. యువన్, శ్రీరాఘవగారి కాంబినేషన్లో మూవీ అంటే సంగీతం ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ ఉంది. పాటలు అద్భుతంగా కుదిరాయి. రీరికార్డింగ్ జరుగుతోంది. మే 31న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. శ్రీరాఘవగారు ఇన్స్టిట్యూట్లాంటి వ్యక్తి సాయిపల్లవి మాట్లాడుతూ - ‘ఈ సినిమాలో పనిచేయడం స్కూల్కి వెళ్లినట్లుగా అనిపించింది. సాధారణంగా ఓ సీన్ను షూట్ చేస్తారనుకుంటే నేను ప్రిపేర్ అయి వెళతాను. కానీ ఎలాంటి ప్రిపేరేషన్ లేకుండా రమ్మన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు తొలి రెండు రోజుల్లోనే అర్థమైంది. సీన్ను మనం ఒకలా అనుకుని వెళితే శ్రీరాఘవగారు దాన్ని మరో లెవల్లో తెరకెక్కించేవారు. మన ఆలోచన గ్రౌండ్ లెవల్లో ఉంటే ఆయన ఆలోచన ఆకాశం రేంజ్లో ఉంటుంది. శ్రీరాఘవగారు ఇన్స్టిట్యూట్లాంటి వ్యక్తి. నేను ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమీ లేదని ఆయనతో సినిమా చేసిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పటివరకు తెలిసింది అంతా వదిలేసి నటించాలని నేర్చుకున్నాను. ఆయన్ని ఫాలో అయ్యాను. సూర్యగారికి నేను పెద్ద ఫ్యాన్ని. సెట్స్లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనలో సగం నేర్చుకుంటే చాలు. ఆయన మిలియన్స్లో ఒకరు. ఇక యువన్గారితో నేను చేస్తోన్న రెండో సినిమా. పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్తో సినిమా నెక్ట్స్ లెవల్కు తీసుకెళతారు’ అన్నారు. ప్రతి సినిమా ఓ ఎక్స్పెరిమెంట్లా చేశాం సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా మాట్లాడుతూ - ‘శ్రీరాఘవతో చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి బ్రేక్ చేస్తూ వచ్చాం. అలా మేం చేసిన ప్రతి సినిమానూ ఓ ఎక్స్పెరిమెంట్లా చేశాం. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను’ అన్నారు. -
అదరగొడుతున్న ‘ఎన్జీకే’ ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ (శ్రీ రాఘవ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్జీకే. నంద గోపాల కృష్ణ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో సూర్య యాక్టింగ్ హైలెట్గా నిలుస్తోంది. అంతేకాదు తెలుగులోనూ సూర్యనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. యువన్ శంకర్ రాజా నేపథ్యం సంగీతం కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇప్పటికే 4 మిలియన్ల(40 లక్షల)కు పైగా వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. -
సూర్యతో ఢీ అంటున్న ప్రభుదేవా
తమిళసినిమా: నటుడు సూర్యతో ఢీ కొట్టేందుకు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సిద్ధం అవుతున్నారు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎన్జీకే. రకుల్ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఆర్ఎస్ ప్రకాశ్, ఆర్ఎస్ ప్రభు నిర్మించారు.ఈ చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది.సెల్వరాఘవన్ దర్శకత్వంలో చిత్రం అంటేనే సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, దర్శకుడు విజయ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన దేవి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో టైటిల్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించింది.ఇదే కాంబినేషన్లో దేవి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సైతం మే 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ విధంగా సూర్య, ప్రభుదేవాలు ఒకే రోజున బరిలో దిగనున్నారన్నమాట. -
విజయ్ దేవరకొండ భయపడ్డాడా?
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాస్త వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. వరుస సూపర్ హిట్స్తో దూసుకెళ్తోన్న విజయ్ దేవరకొండ దక్షిణాదిలో పాగ వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని దక్షిణాది అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీని పోస్ట్పోన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే31 విడుదల చేయాలని తొలుత భావించినా.. అదే రోజున సూర్య నటించిన ఎన్జీకే చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగు, తమిళంలో మార్కెట్ ఉండటం, ఇప్పటికే ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ కావడంతో డియర్ కామ్రేడ్ను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డియర్ కామ్రేడ్.. టీజర్, సాంగ్తో మంచి బజ్ను క్రియేట్ చేసింది. -
సాయి పల్లవి కోరిక తీరేనా!
ప్రతి వ్యక్తికీ ఏదో ఒక ఆశ, కోరిక ఉంటుంది. నటి సాయిపల్లవికి ఒక కోరిక ఉందట. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించే నటి కాదీమె. ముఖ్యంగా కథ, తన పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తుంది. అలా మణిరత్నం అవకాశాన్నే నిరాకరించిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామన్నా సారీ అని చెప్పేసిందనే టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయంలో నిజనిజాలు పక్కన పెడితే సాయిపల్లవి మాత్రం సెలెక్టెడ్ చిత్రాలు చేస్తుందన్నది మాత్రం వాస్తవమేనని చెప్పక తప్పుదు. అయితే ఇటీవల సాయి పల్లవి మార్కెట్ కాస్త డల్ అయ్యిందన్నదీ నిజమే. కారణం సక్సెస్ శాతం తగ్గడమే. సాయిపల్లవికి అర్జెంట్గా ఒక సక్సెస్ చాలా అవసరం. అది సూర్యతో నటించిన ఎన్జీకే అందిస్తుందేమో చూడాలి. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 31న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను వైద్య విద్య చదివి నటినయ్యానని చెప్పింది. సినిమా రంగంలో నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. ఇక్కడ అవకాశాలు ఉన్నంత వరకూ నటిస్తానని, మార్కెట్ తగ్గితే వైద్య వృత్తి చేసుకుంటానని తెలిపింది. తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని, డాన్స్ నచ్చుతుందని చెప్పింది. తాను తనలానే ఉండడానికి ఇష్టపడతానని అని అంది. మార్పును కోరుకోనని, అందుకే ఒకే రకం ఆహారాన్ని తీసుకుంటానని పేర్కొంది. పరిచయం ఉన్న వారితో స్నేహంగా ఉంటానని చెప్పింది. అయితే సినిమా వృత్తిలో పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంది. అన్ని రకాల పాత్రలను చేయాలని ఆశ పడుతున్నానని, తాను ఇప్పటి వరకూ నటించిన ఒక్కో చిత్రం పలు విషయాలను నేర్పించాయని అంది. ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించగలనన్న నమ్మకం కలిగిందని చెప్పింది. కాగా అందరికీ ఒక మంచి సందేశానిచ్చే కథా చిత్రంలో నటించాలన్న ఆశ ఉందని నటి సాయిపల్లవి పేర్కొంది. -
మేకప్ వేసుకుంటే వేరేవారిలా కనిపిస్తున్నట్లు..
సినిమా: ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటిలో నటించను అంటోంది నటి సాయిపల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్తో నటిగా వికసించిన సాయిపల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోకి దిగుమతి అయ్యింది. ముఖ్యంగా టాలీవుడ్లో ఫిదా, ఎంసీఏ చిత్రాల విజయాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్లోనూ దయా, మారి–2 చిత్రాల్లో నటించినా ఎందుకనో తెలుగులో మాదిరి ఇక్కడ మార్కెట్ను పొందలేదు. అందుకు కారణం ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడం కావచ్చు. అయితే మారి–2 చిత్రంలో ధనుష్తో డాన్స్ చేసిన రౌడీ బేబీ పాట సూపర్ పాపులారిటీ పొందింది. అలా సాయిపల్లవి తన స్థానాన్ని పెంచుకుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం సూర్యతో రొమాన్స్ చేసిన ఎన్జీకే చిత్రం కోసం మాత్రం చాలా ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే ఆ చిత్రం మినహా సాయిపల్లవికి ఇక్కడ మరో అవకాశం లేదు. ఇకపోతే ఎన్జీకే చిత్ర సక్సెస్ కోసం అందులో నటించిన మరో హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ఈ అమ్మడికి ఈ చిత్ర విజయం చాలా అవసరం. ఈ బ్యూటీలిద్దరు ఆశలు పెట్టుకున్న ఎన్జీకే చిత్రం వచ్చే నెల 31వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి సాయిపల్లవి ఒక భేటీలో పేర్కొంటూ సినిమాల్లోనే నటిస్తారా.. వాణిజ్య ప్రకటనల్లో నటించరా? అన్న ప్రశ్నకు వాణిజ్య ప్రకటనలంటే అందాలకు మెరుగులు దిద్దే అలంకరణ సాధనాల ప్రకటనల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నటించనని చెప్పింది. అయినా అలంకరణ సామగ్రిని వాడితే అందం మెరుగవుతుందని తాను భావించనని అంది. మేకప్ వేసుకుంటే వేరేవారిలా కనిపిస్తున్నట్లు తనకు కావలసిన వారు చెప్పడంతో తాను మేకప్ లేకండానే నటిస్తున్నానని చెప్పింది. దర్శకులు అలానే కోరుకుంటున్నారని సాయిపల్లవి పేర్కొంది. -
‘ఎన్.జి.కె’ ఫస్ట్ సింగిల్ : వడ్డీలోడు వచ్చెనే..
‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో సింగం సూర్య. ప్రస్తుతం ఓ పొలిటికల్ జానర్లో తెరకెక్కుతున్న మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు. ‘వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...’అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు యువన్ శంకర్రాజా అందించిన సంగీతం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరాఘవ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. -
నో గ్యాప్
సినిమా సినిమాకు హీరో సూర్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘ఎన్జీకే’ (నందగోపాలకుమరన్) చిత్రం మే31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాప్పాన్’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు సూర్య. ‘కాప్పాన్’ చిత్రం ఆగస్టులో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయింది. ఆ నెక్ట్స్ ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో హీరోగా నటిస్తారు సూర్య. ఈ సినిమా పూజాకార్యక్రమం వచ్చే నెలలో జరగనుందని తెలిసింది. ఈ సినిమాకు నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘‘సూర్య నెక్ట్స్ చిత్రానికి ఆడియో వర్క్ చేస్తున్నాను. అతి త్వరలో చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున ఓ కొత్త విషయాన్ని తెలియజేస్తాను’’ అని పేర్కొన్నారు జీవీ ప్రకాష్. -
కామ్రేడ్ వెనక్కి తగ్గుతాడా..?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈసినిమా మే 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే తమిళ్లో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమాను మే 31న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో డియర్ కామ్రేడ్ టీం ఆలోచనలో పడింది. సూర్య సినిమా అంటే తమిళ్తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తారు. అదే రోజు తమ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట అందుకే వారం ఆలస్యంగా జూన్ 6న సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
యన్జీకే రెడీ అవుతున్నాడు
రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడానికి నంద గోపాల కుమారన్ (యన్జీకే) సిద్ధమయ్యాడు. మరి అతని ప్రయత్నాలు సఫలమయ్యాయో? లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యన్జీకే’ (తెలుగులో ‘నంద గోపాల కృష్ణ’). పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై యస్ఆర్ ప్రభు నిర్మించారు. సాయి పల్లవి, రకుల్ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సినిమాలో యువ రాజకీయనాయకుడిగా సూర్య ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రం టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ‘‘యన్జీకే’ డబ్బింగ్ పనులు మొదలెట్టాం. వచ్చే వారంలో విడుదల తేదీని తెలియజేస్తాం’’ అని యస్ఆర్ ప్రభు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాప్పాన్’ సినిమాలో నటిస్తున్నారు సూర్య. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఆ నెక్ట్స్ ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
రకుల్కు గట్టి షాక్!
అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా. ఏంటీ ఆ పాత మధుర గీతాల గురించి చెబుతున్నట్లు భావిస్తున్నారా? అంత సాహసం చేయడం లేదు గానీ, నటి రకుల్ ప్రీత్సింగ్కు ఇలాంటి షాకే కొట్టిందట. అదీ తనే కోరి తగిలించుకున్న షాక్. రకుల్ ప్రీత్సింగ్ స్టార్ హీరోయిన్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ అమ్మడు కార్తీతో రొమాన్స్ చేసిన దేవ్ చిత్రం తెరపైకి వచ్చింది. తదుపరి సూర్యకు జంటగా నటించిన ఎన్జీకే చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మరో అరడజను చిత్రాల్లో నటిస్తోందట. అయితే అంత మాత్రాన ఈ బ్యూటీకి షాక్ తగలకూడదనేం లేదు. అదే జరిగింది. ఆ విషయం గురించి రకుల్ప్రీత్సింగ్ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఆ మధ్య ఒకసారి నా స్నేహితులతో కలిసి లండన్ వెళ్లాను. అక్కడ ఒక స్టార్ హోటల్లో స్నేహితులందరికీ పార్టీ ఇచ్చాను. పార్టీ అంటే విందు మాత్రమే. మేము 10 మందే. బిల్ ఎంత అయి ఉంటుందని అనుకుంటున్నారు? అక్షరాలా రూ.10 లక్షలు. ఏంటీ షాక్ అయ్యారా? నేను అంతకంటే పెద్ద షాక్కు గురయ్యాను. ఏం చేస్తాను. మాట్లాడకుండా ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడ్డాను. అప్పుడు అనుకున్నాను. జీవితంలో మళ్లీ ఆ హోటల్కు వెళ్లకూడదని అని ఒట్టేసుకున్నాను. అలా ఫ్రెండ్స్కు ట్రీట్ ఇద్దామని అనుకుని తనే షాక్ తిందట రకుల్ ప్రీత్సింగ్. జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎవరికైనా తప్పవు మరి. -
గోపాలా పోరా నాన్నా...
యువత రాజకీయాల్లోకి వస్తే దేశప్రగతికి మంచిదని మేధావులు అంటుంటారు. కానీ రాజకీయాలు అంత ఈజీ కాదు. పక్కనున్నవాడు శత్రువో, మిత్రుడో ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలీదు. మరి.. ఇలాంటి రాజకీయాల్లోకి దిగిన నంద గోపాలకృష్ణ అనే యువకుడు రాజకీయ చదరంగాన్ని ఎలా ఆడాడు అనే నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ఎన్జీకే: నంద గోపాల కృష్ణ’. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రకుల్ప్రీత్సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా నటించారు. శ్రీ రాఘవ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. ‘నా పేరు నంద గోపాల కృష్ణ... ప్రజలు ఎన్జీకే అని పిలిస్తారు. నేర్చుకుంటా అయ్యగారు’ అని సూర్య చెప్పిన డైలాగ్స్తో పాటు... ‘‘గోపాలా పోరా నాన్నా.. నువ్వు దిగితే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది’’ అని సాయిపల్లవి చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుందని తెలుస్తోంది. -
‘నా పేరు నందగోపాలకృష్ణ. ఎన్జీకే అని పిలుస్తారు’
'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య, '7\జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్గా 'ఖాకి' వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్', 'రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'ఎన్జీకే' (నంద గోపాల కృష్ణ). ఈ చిత్ర టీజర్ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ‘నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్జికె అని పిలుస్తారు’ అని సూర్య చెప్పే డైలాగ్ తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపేలా ఉంది. సాయి పల్లవి చెప్పే ‘గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది’ అనే డైలాగ్తో ‘ఎన్జీకే’ హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా అలరించనుంది. సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. Here is #NGKTeluguTeaser This is for all of you who stood strong and waited long!! Thank you for all the love and support!!#NGK ఎన్ జికే ► https://t.co/cTHHKMskx6@selvaraghavan @thisisysr @Rakulpreet @Sai_Pallavi92 @prabhu_sr @DreamWarriorpic @RelianceEnt @SonyMusicSouth — Suriya Sivakumar (@Suriya_offl) February 14, 2019 -
‘ఎన్జీకే’ టీజర్ రెడీ అవుతోంది!
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తన సత్తా చాటుతున్న హీరో సూర్య. గతేడాది బాలీవుడ్ రీమేక్గా తెరకెక్కిన గ్యాంగ్ సినిమాతో పలకరించగా.. ఈ ఏడాది ‘ఎన్జీకే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా.. ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్జీకే’ టీజర్ను చిత్రయూనిట్ జాగ్రత్తగా దగ్గరుండి కట్ చేయిస్తుందని సమాచారం. ఈ టీజర్కు సంబంధించిన డబ్బింగ్ను సూర్య పూర్తి చేశారు. ప్రస్తుతం సూర్య డబ్బింగ్ చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్న ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రకుల్ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్లో రానుంది. -
ఆశలన్ని ఆ చిత్రంపైనే..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఫస్ట్ చిత్రం విజయం సాధిస్తే.. ఆ తరువాత ప్రయాణం కాస్తా సులువవుతుంది. ప్రేమమ్ చిత్రంతో మలయాళంలో మలర్గా మెరిసిన నటి సాయి పల్లవి. అక్కడ తొలి చిత్రం ఆమెకు బాగానే వర్కౌట్ అయ్యింది. అదే మ్యాజిక్ తెలుగులోనూ రిపీట్ అయ్యింది. తెలుగులో సాయిపల్లవి నటించిన ‘మిడిల్క్లాస్ అబ్బాయి’, ‘ఫిదా’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ కోలీవుడ్లో మాత్రం ఇంకా సక్సెస్ దక్కలేదు. ఇక్కడ తొలి చిత్రం ‘దయా’ సాయిపల్లవిని చాలా నిరాశ పరచింది. ఆ తరువాత ధనుష్తో జత కట్టిన ‘మారి–2’ ఓకే అనిపించుకుంది. ఇప్పటివరకూ కోలీవుడ్లో సాయిపల్లవికి మంచి హిట్ పడలేదు. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన ‘ఎన్జీకే’ చిత్రం మినహా మరో అవకాశం సాయి పల్లవి చేతిలో లేదు. దాంతో ప్రస్తుతం సాయి పల్లవి ఆశలన్నీ ‘ఎన్జీకే’ చిత్రంపైనే పెట్టుకుందట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. సమ్మర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మరో హీరోయిన్గా నటి రకుల్ప్రీత్సింగ్ కూడా నటించింది. ప్రస్తుతం సాయిపల్లవి మాతృభాషలో ఫాహత్ ఫాజిల్తో ఒక చిత్రం చేస్తోంది. -
చెన్నై టు ముంబై
ఒక సినిమా సెట్ నుంచి మరో సినిమా సెట్స్కు పరుగులు తీయడం హీరోయిన్స్ రొటీన్లో భాగం. ప్రస్తుతం రకుల్ ప్రీత్కు చెన్నై వీడ్కోలు చెప్పగానే ముంబై వెల్కమ్ చెప్పింది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యన్జీకే’. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు రకుల్. ‘‘జీనియస్ సెల్వరాఘవన్ సార్తో పని చేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీ అందరికీ సినిమా ఎప్పుడు చూపించాలా అని ఎదురు చూస్తున్నాను. హిందీ సినిమా ‘మర్జావా’ షూటింగ్కు కోసం ముంబై పిలిచింది’’ అని పేర్కొన్నారు రకుల్. చెన్నైకు టాటా చెప్పగానే ముంబై రకుల్కు వెల్కమ్ చెప్పిందన్నమాట. -
‘ఎన్జీకే’కు ప్యాకప్ చెప్పిన రకుల్!
తక్కువ కాలంలోనే టాప్స్టార్స్ అందరితో నటించింది రకుల్ప్రీత్. టాప్ హీరోయిన్ కొనసాగుతున్న సమయంలోనే.. సరైన సక్సెస్లేక వెనుకబడిపోయింది. ఈ మధ్య కాలంలో రకుల్కు చెప్పుకోదగ్గ విజయం రాలేదు. అయినా చేతినిండా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది రకుల్. రకుల్ ప్రస్తుతం కోలీవుడ్లో సూర్య సరసన ఎన్జీకే, కార్తీకి జోడిగా దేవ్ చిత్రంలో నటిస్తూ బిజీగాఉంది. బాలీవుడ్లో సిద్దార్థ్ మల్హోత్ర మర్జావాన్ మూవీ చేస్తోంది. ఈ మధ్య ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో శ్రీదేవి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం రకుల ఎన్జీకే షూటింగ్కు ప్యాకప్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ఎన్జీకేకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని, సెల్వరాఘవన్, సూర్యలతో పని చేయడం అద్భుతమైన ఫీలింగ్ను ఇచ్చిందని, వీరి వద్దనుంచి ఎంతో నేర్చుకున్నానని, ఎన్జీకే చిత్రం కోసం ఎదురుచూస్తానని, మళ్లీ మర్జావాన్ షూటింగ్కు వెళ్తున్నా’ అంటూ ట్వీట్ చేసింది. And it’s a wrap for #NGK ! What an amazing learning experience this has been with the genius @selvaraghavan sir and the most charismatic @Suriya_offl sir ! Can’t wait for #ngk madness to unfold ! @Sai_Pallavi92 @DreamWarriorpic 😀 back to #marjaavaan now 😀 pic.twitter.com/Hxb3j5RXt3 — Rakul Preet (@Rakulpreet) January 28, 2019 -
నాకంత డబ్బు లేదు!
నాకంత డబ్బు లేదు అంటోంది నటి రకుల్ ప్రీత్ సింగ్. కోలీవుడ్లో ఈ అమ్మడికి మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో కార్తీతో రొమాన్స్ చేస్తున్న దేవ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కార్తీతో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రెండవ చిత్రం. ఇంతకు ముందు ఈ జంట నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం మంచి విజయాన్ని సాధించి రకుల్ను నిలబెట్టింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ భేటీ చూద్దాం. కార్తీతో రెండవ సారి నటించడం గురించి? ధీరన్ అధికారం ఒండ్రు చిత్రానికి పూర్తి భిన్నంగా దేవ్ చిత్రం ఉంటుంది. ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. ఇందులో నేను మేఘ్న అనే ధైర్యమైన అమ్మాయిగా నటించాను. నా పేరును కూడా నేను ఎంచుకునే స్వతంత్ర భావాలు గలిగిన యువతి పాత్ర. అయితే నిజ జీవితంలో ఇందుకు నేను పూర్తి వ్యతిరేక స్వభావిని. దేవ్ చిత్రంలో కార్తీ ప్రయాణాన్ని ఇష్టపడే యువకుడిగానూ, నేను పనిని ఇష్టపడే అమ్మాయిగానూ నటించాం. అలాంటి విరుద్ధ భావాలు కలిగిన వారు ఎలా ఒకటయ్యారన్నదే చిత్ర కథ. సూర్యకు జంటగా ఎన్జీకే చిత్రంలో నటించిన అనుభవం? ఎన్జీకే చిత్రంలో నటించడం మంచి అనుభవం. నేను సూర్యకు వీరాభిమానిని. సూర్య, కార్తీల గురించి? సూర్య, కార్తీ ఇద్దరూ ప్రతిభావంతులైన నటులు. మంచి స్నేహశీలులు. వారిద్దరితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా లక్కీగా భావిస్తున్నాను. హిందీ చిత్రంలో నటిస్తున్న అనుభవం గురించి? తమిళ్, హిందీ అని విడదీసి మాట్లాడడం నాకు నచ్చదు. ప్రతిభను మాత్రమే చూడండి. శ్రీదేవి, టబు, మధుబాల, తాప్సీ ఇక్కడ నుంచి బాలీవుడ్కు వెళ్లి చాలా సాధించారు. సరే మీరు శ్రీదేవి బయోపిక్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోందే? నాకు బయెపిక్లలో నటించడం అంటే చాలా ఇష్టం. ఎవరి పాత్రలో నటించాలన్నా సిద్ధమే. సావిత్రి బయోపిక్ లాంటివి చాలా రావాలి. ఇకపోతే శ్రీదేవి బయోపిక్ గురించి ఇంకా నన్నెవరూ సంప్రదించలేదు. అలాంటి అవకాశం వస్తే నటించడానికి రెడీ. ఇటీవల ట్విట్టర్లో అభిమానిపై ఘాటుగా స్పందించడం గురించి? నేను కురుచ దుస్తులు ధరించడంతో జరిగిన గొడవ గురించి అడుగుతున్నారా? నిజం చెప్పాలంటే ఆ ఫొటోలు నా అనుమతి లేకుండా తీసినవి. ఆ ఫొటోలకు నేనెలా బాధ్యరాలినవుతాను. ఆ ఫొటోలకు చేసిన కామెంట్స్ నన్ను బాధించాయి. అందుకే ఆగ్రహించాను. కొందరు నోళ్లు మూయించడానికి నేనలా ప్రవర్తించాల్సి వచ్చింది. కామెంట్ చేసిన ఆ యువకుడికీ ఒక కుటుంబం ఉందనేది గ్రహించాలనే కాస్త ఘాటుగా మాట్లాడాను. ఇకపై అతను అలాంటి కామెంట్స్ చేయడని భావిస్తున్నాను. అంతే కాకుండా ఇలాంటి సమస్యలపై మహిళలు ధైర్యంగా బదులివ్వాలి. ఇతర వ్యాపారాలపై తీవ్రంగా దృష్టి పెడుతున్నారట? ఇక్కడో విషయాన్ని స్పష్టం చేయాలి. నేను హోటల్ వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. హైదరాబాద్, విశాఖపట్టణంలో జిమ్లను మాత్రం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకు వ్యాయామం చాలా అవసరం. చిత్ర నిర్మాణం గానీ, దర్శకత్వం ఆలోచన గానీ ఉన్నాయా? నాకు చిత్రాన్ని నిర్మించేంత డబ్బుగానీ, దర్శకత్వం వహించేంత సృజనాత్మకతగానీ లేవు. నేను కెమెరా ముందు నిలబడడానికి ఇష్టపడతాను. -
ఒక్క చిత్రంతోనే..
సినిమా: ఒక్క చిత్రంతోనే దేశ వ్యాప్తి చెందిన నటిని తాను అంటోంది నటి సాయిపల్లవి. నిజమే ప్రేమమ్ అనే ఒక్క మలయాళ చిత్రంతోనే ఈ తమిళ పొన్ను పాపులర్ అయ్యింది. ఆ చిత్రం తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ నటించే అవకాశాలను అందుకుంటోంది. ముఖ్యంగా కోలీవుడ్లో తొలి చిత్రం దయా కాస్త నిరాశ పరిచినా, ధనుష్తో రొమాన్స్ చేసిన మారి–2 కమర్షియల్గా ఓకే అనిపించుకోవడం సాయిపల్లవికి కాస్త ఊరటనిచ్చింది. ఇప్పుడు సూర్యతో జత కడుతున్న ఎన్జీకే చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ జాణ గురించి వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి బందాను తట్టుకోలేకపోతున్నామని, ఆమెను కలిసి కథ వినిపించడం కష్టతరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి స్పందించిన సాయిపల్లవి తాను ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయినని, సినీ వెలుగు అన్నది అనూహ్యంగా తనపై పడిందేనని చెప్పింది. ఒక్క చిత్రంతోనే నటిగా దేశ వ్యాప్తి చెందానని అంది. అయితే ఎప్పుడూ తాను బందా చూపలేదని చెప్పింది. అంతే కాదు గర్వం ప్రదర్శంచిందీ లేదని అంది. తాను బందా చూపితే రేపే మరో ప్రతిభావంతురాలైన నటి ఇతర నటీమణులను వెనక్కి నెట్టేస్తుందని పేర్కొంది. ఆ విషయం తెలిసిన నటిగా తానెప్పుడూ బందా చూపనని చెప్పింది. ఎవరైనా సరైన విధంగా తనను కలిసి మాట్లాడితే వారు చెప్పే కథలను విని తనకు నచ్చితే నటిస్తానని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ ఏదీ నిరంతరం కాదని అంది. ఈ రోజు సాధారణ యువతిగా ఉన్న వారు రేపు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని నటి సాయిపల్లవి పేర్కొంది. -
మనసు బంగారం
సూర్య లేటెస్ట్ సినిమా ‘యన్జీకే’ షూటింగ్ పూర్తయింది. కొన్ని నెలలుగా తనతో పాటు సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన టీమ్ అందర్నీ అభినందించాలని భావించారు సూర్య. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 120 మందికి గోల్డ్ కాయిన్స్ను బహుమతిగా అందించారు. దాంతో ‘మీ మనసు బంగారం’ అని సూర్యకు కితాబులు ఇస్తోంది కోలీవుడ్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి జంటగా యస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘యన్జీకే’ (నంద గోపాల కుమార్). పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. -
సహజీవనానికి వ్యతిరేకిని కాను : సాయి పల్లవి
పెళ్లి కాకుండా స్త్రీ పురుషులు సహజీవనం చేయడానికి తాను వ్యతిరేకిని కాదని నటి సాయిపల్లవి పేర్కొంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం మారి–2, తెలుగు చిత్రం పడి పడిలేచే మనసు ఇటీవల ఒకే రోజు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం సూర్యతో జత కట్టిన ఎన్జీకే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాయిపల్లవి మలయాళంలోనూ ఫాహత్ ఫాజిల్కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. అయితే చిత్రాలను ఆచితూచి అంగీకరిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రానాతో మరో చిత్రంలో నటిస్తోంది. ఇటీవల మారి–2 చిత్ర ప్రమోషన్ కోసం చెన్నైకి వచ్చిన సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్ టుగెదర్ సంబంధం సాగిస్తున్నారా? లాంటి ప్రశ్నలు చాలా మంది వేస్తున్నారని అంది. అయితే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు పుస్తకాలను, సినీరంగంలోకి వచ్చిన తరువాత నటనను ప్రేమిస్తున్నానని చెప్పింది. వ్యక్తిగతంగా తనకు లీవింగ్ టుగెదర్ సంబంధాలు అవసరం లేదని పేర్కొంది. అయితే ఇలా చెబుతున్నందున అలాంటి సంబంధానికి తాను వ్యతిరేకినని చెప్పడం కాదని అంది. లీవింగ్ టుగెదర్ సంబంధం అనేది వారివారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయం అని పేర్కొంది. తాను మాత్రం వివాహ జీవితాన్నే కోరుకుంటున్నానని సాయిపల్లవి స్పష్టం చేసింది. -
సూర్య చిత్ర టైటిల్ ఉయిర్కా?
నటుడు సూర్య తాజా చిత్రానికి ‘ఉయిర్కా’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టే నంటున్నారు. సూర్య, సాయిపల్లవి, రకుల్ప్రీత్సింగ్ హీరో హీరోయిన్లుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఎన్జీకే. ఈ చిత్రం దీపావళికి విడుదల కావలసి ఉంది. అయితే చిత్ర ని ర్మాణంలో జాప్యం కారణంగా అనుకున్న విధంగా ఎన్జీకే చిత్రం తెరపైకి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్ర విడుదలపై క్లారిటీ లేదు. కాగా సూర్య తాజాగా మరో చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కేవీ.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి సాయేషా సైగల్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిత్ర వర్గాలు సూర్య అభిమానులకు మీట్పవన్, కాప్పన్, ఉయిర్కా మూడు పేర్లు చెప్పి ఏది బాగుందో చెప్పాల్సిందిగా అడిగారు. దీంతో 50 శాతం ఓట్లు ఉయిర్కా టైటిల్కు పడ్డాయి. దీంతో చిత్ర యూనిట్ కూడా ఉయిర్కా టైటిల్నే ఖారారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర టైటిల్ను చిత్ర వర్గాలు నూతన సంవత్సం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన వెల్లడించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రకని ముఖ్య పాత్రలను పోషించడం విశేషం. హరీశ్జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా అయన్, మాట్రాన్ చిత్రాల తరువాత సూర్య, దర్శకుడు కేవీ.ఆనంద్ల కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. -
జనవరి 26న ‘ఎన్జీకే’ రిలీజ్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు రిలీజ్పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. -
ఎన్జీకే విడుదలెప్పుడు?
సినిమా: నటుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్జీకే. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి, రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ముందు ప్రకటించారు. అయితే చిత్ర నిర్మాణం ప్రణాళిక ప్రకారం పూర్తికాకపోవడంతో చిత్ర విడుదలలో జాప్యం జరిగిందని, అందుకు సూర్య అభిమానులకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు నిర్మాతల వర్గం ఆ మధ్య వెల్లడించింది. ఎన్జీకే చిత్ర చివరి షెడ్యూల్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుందని, 20 రోజుల పాటు చెన్నైలో జరగనుందని తాజాగా చిత్ర వర్గాలు తెలిపారు. దీంతో డిసెంబర్ రెండో వారం వరకూ షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు జరగాల్సి ఉండడంతో సంక్రాంతికి కూడా ఎన్జీకే తెరపైకి వచ్చే అవకాశం లేదు. అంతేకాదు రిపబ్లిక్డే సందర్భంగా కూడా చిత్రం విడదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి తొలివారం లేక రెండవ వారమే సూర్య చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వ్యవహారంలో నటుడు సూర్యకు దర్శకుడు సెల్వరాఘవన్కు మధ్య మనస్పర్థలు, అదే విధంగా నిర్మాతకు, దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తినట్లు కోలీవుడ్లో ప్రచారం వైరల్ అవుతోంది. నటుడు సూర్య ఎన్జీకే చిత్రం తరువాత దర్శకుడు కేవీ.ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎన్జీకే చిత్రం కంటే ముందు విడుదలైనా ఆశ్చర్య పడాల్సిన అవసరం ఉండదనే ప్రచారం జరుగుతోంది. -
పండగకి టైమ్ ఉంది
అభిమాన నటుడి సినిమా రిలీజ్ అంటే ఆ హీరో అభిమానులకు పండగే. కరెక్ట్గా పండగ సమయంలో రిలీజ్ ఫిక్స్ చేస్తే సంబరాలు డబుల్ అవుతాయి. కానీ ఈసారి సూర్య అభిమానులకు డబుల్ సంబరాలు మిస్. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్జీకే’ దీపావళికి రావాలి. కానీ ఈ సినిమా దీపావళి తర్వాత రిలీజ్ అవుతుందని చిత్రబృందం తెలిపింది. సూర్య హీరోగా దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్జీకే’(నంద గోపాల కుమారన్ అని అర్థం). యస్.ఆర్ ప్రభు, యస్. ఆర్ ప్రకాశ్బాబు నిర్మిస్తున్నారు. సూర్య ఇందులో ఎమ్మెల్యేగా కనిపించనున్నారని సమాచారం. తొలుత ఈ సినిమాను దీపావళి స్పెషల్గా రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే దర్శకుడు సెల్వ రాఘవన్ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్ డిలే అయింది. దాంతో దీపావళికి రావడం లేదని అనౌన్స్ చేశారు. ‘‘మా ప్రొడక్షన్ హౌస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్జీకే’. అద్భుతమైన ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మాకుంది. ప్రాజెక్ట్ బాగా రావడానికి మా టీమ్ రేయి, పగలు కష్టపడుతున్నాం. కరెక్ట్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఇంకా టైమ్ ఉందన్న మాట. -
బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా : రకుల్
సినిమా వాళ్లు ఇంటిదగ్గర ఉంటడం అరుదేనని చెప్పకతప్పదు. అదీ అగ్రహీరోయిన్లు అయితే ఒక్కోసారి రెండు మూడు నెలలపాటు ఇంటి ముఖం చూసే పరిస్థితి ఉండదు. నటి రకుల్ ప్రీత్ సింగ్కు ఇదే పరిస్థితి అట. ఈ అమ్మడికి టాలీవుడ్లో అవకాశాలు తగ్గుముఖం పట్టినా కోలీవుడ్లో సూర్యకు జంటగా ఎన్జీకే, కార్తీతో దేవ్, శివకార్తీకేయన్ సరసన ఒక చిత్రం అంటూ బిజీగా ఉంది. ఒక హింది చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ఇంటి ముఖం చూసి చాలా కాలం అయ్యిందని బెంగ పట్టుకుంది. మనసు అటు వైపు లాగుతోంది అంటోందీ బ్యూటీ. దీని గురించి రకుల్ ఏమంటుందో చూద్దాం. నాకు నటన అంటే చాలా ఆసక్తి. ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసి కొత్త చిత్రాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుముందు నటన నుంచి కాస్త విరామాన్ని కోరుకుంటున్నాను. అనంతరం మళ్లీ నూతనోత్సాహంతో నటించడానికి రెడీ అవుతాను. గత జూలై నెల పూర్తిగా లండన్లో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాను. ఆ తరువాత తమిళ చిత్రం కోసం ఉక్రెయిన్ వెళ్లాను. అక్కడు షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చాను. ఆ తరువాత చెన్నై పరసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్లో పాల్గొంటున్నాను. ఇలా బిజీగా నటిస్తుండడంతో ఇంటిపై బెంగ పట్టుకుంది. ఇంటి భోజనం తిని చాలా కాలం అయ్యింది. మానసికంగానూ కాస్త విశ్రాంతి అవసరం. అందుకే ప్రస్తుతం నటిస్తున్న చిత్ర షూటింగ్ ఒక షెడ్యూల్ను హైదరాబాద్లో పెట్టుకోమని ఆ చిత్ర దర్శక నిర్మాతలను అడుగుతున్నాను అని రకుల్ అంటోంది. తాను హైదరాబాద్లో సెటిల్ అయ్యినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెబుతోందన్నమాట. -
స్లిమ్ అవ్వడానికి పాట్లు
తమిళసినిమా: కొందరు భామలకు బొద్దుగా ఉండడమే ముద్దు. మరికొందరు అమ్మాయిలు మాత్రం సన్నగా నాజూగ్గా ఉండటానికి నానా పాట్లు పడుతుంటారు. అందుకోసం నోరు కూడా కుట్టేసుకుంటారు. నటి రకుల్ప్రీత్సింగ్ తిండి విషయం ఏమోగానీ, స్లిమ్గా ఉండటానికి మాత్రం చాలా పాట్లు పడుతోంది. కోలీవుడ్లో నిరాశకు గురై టాలీవుడ్కు వెళ్లి అక్కడ అందం, అదృష్టం అందలమెక్కించడంతో క్రేజీ హీరోయిన్గా టపటపా అరడజనుకు పైగా చిత్రాలు చేసేసింది. ఆ తరువాత అక్కడ కాస్త అవకాశాలు దోబూచుటాడడంతో మళ్లీ కోలీవుడ్ను ఆశ్రయించింది. ఈ సారి ఇక్కడ ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం రూపంలో సక్సెస్ వరించింది. ప్రస్తుతం కార్తీతో మరోసారి దేవ్ అనే చిత్రంలోనూ, సూర్యకు జంటగా ఎన్జీకే చిత్రంలోనూ నటిస్తోంది. అంతే కాదు శివకార్తీకేయన్తో ఒక చిత్రం చేసే అవకాశాన్ని దక్కించుకుంది. సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ చిత్ర రిజల్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న రకుల్ మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. నటన కంటే గ్లామర్నే ఎక్కువగా నమ్ముకున్న ఈ బ్యూటీ దాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు నానా పాట్లు పడుతోంది. హీరోహీరోయిన్లు బాడీని స్టిఫ్గా ఉంచుకోవడానికి ఎంచుకునే మార్గం కసరత్తులు. నటి రకుల్ కూడా అదే పనిలో ఉంది. ఈ భామ స్లిమ్గా తయారవ్వడానికి రోజు రెండు గంటల పాటు జిమ్లోనే ఉంటోందట. అంతే కాదు నన్ను చూడు నా అందం చూడు అన్న చందాన తన కసరత్తుల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఉచిత ప్రచారం పొందేస్తోంది. ఈ ట్రిక్స్ ఈ అమ్మడికి ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి -
నో క్లాష్!
దీపావళికి థియేటర్స్లోకి ‘ఎన్జీకే’ రావడం లేదా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎన్జీకే’ (నందగోపాలకుమారన్). తెలుగు వెర్షన్కి ‘నందగోపాలకృష్ణ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు టీమ్. ఇందులో సాయి పల్లవి, రకుల్ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ దర్శకుడు సెల్వరాఘవన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, ‘ఎన్జీకే’ దీపావళికి రిలీజ్ కావడం లేదని అంటున్నారు చెన్నై సినీ జనాలు. కానీ ఈ విషయంపై సెల్వరాఘవన్ స్పందించారు. ‘‘నేను బాగానే ఉన్నాను. మరో రెండు రోజుల్లో ‘ఎన్జీకే’ షూటింగ్ను స్టార్ట్ చేస్తాం. నా బాగు కోరిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. కానీ ‘ఎన్జీకే’ రిలీజ్ గురించి మాత్రం స్పందించలేదు. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కార్’ని దీపావళికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ‘ఎన్జీకే’ వాయిదా పడితే.. సూర్య, విజయ్ల సినిమాలకు క్లాష్ తప్పినట్లే. -
నంద గోపాలకృష్ణ
‘ఎన్జీకే’.. అంటే ఏంటి? అని ఇన్ని రోజులు ఆలోచించిన సినీ లవర్స్కు సూర్య అండ్ టీమ్ ఆన్సర్ చెప్పేశారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్జీకే’. సాయిపల్లవి, రకుల్ ప్రీత్సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. సోమవారం సూర్య బర్త్ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా సెకండ్ లుక్ను రిలీజ్ చేశారు. ఇక్కడ ఉన్న ఫొటో అదే. తమిళ పోస్టర్పై ‘ఎన్జీకే’ అంటే ‘నంద గోపాలన్ కుమారన్’ అని చెప్పారు టీమ్. మరి.. తెలుగు ‘ఎన్జీకే’ అంటే... ‘నంద గోపాలకృష్ణ’ అట. టైటిల్ క్యాప్షన్ను బట్టి నంద గోపాలకృష్ణ పాత్రలో సూర్య కనిపిస్తారని ఊహించవచ్చు. దాదాపు చిత్రీకరణ పూర్తి కావొచ్చిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
సూర్య కోసం ధనుష్
‘వై దిస్ కొలవెరి కొలవెరి ఢీ...’ సాంగ్తో సింగర్గా సూపర్ పాపులారిటీ సంపాదించారు హీరో ధనుష్. కొలవెరి పాటకు ముందే ‘పుదుకొటై్టలిరుందు శరవణన్, పుదుపేటై్ట’ సినిమాల్లో పాటలు పాడారు ధనుష్. ఈ రెండు సినిమాల్లో ఆయనే హీరో. తన సినిమాలకే కాకుండా కన్నడలో శివరాజ్కుమార్ ‘వజ్రకాయ’, సాయిధరమ్ తేజ్ ‘తిక్క’లో ఓ పాట పాడారు ధనుష్. ఇప్పుడు సూర్య కోసం ఓ పాట పాడనున్నారట ఆయన. సూర్య హీరోగా ధనుష్ సోదరుడు, ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్జీకే’. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ పాడనున్నారు ధనుష్. -
మరో క్రేజీ ప్రాజెక్ట్లో జగ్గుభాయ్
విలన్ గా టర్న్ అయిన తరువాత సీనియర్ నటుడు జగపతి బాబు ఫుల్ బిజీ అయ్యారు. నెగెటివ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దూసుకుపోతున్నారు. అడపాదడపా లీడ్ రోల్స్లోనూ సత్తా చాటుతున్నారు. అంతేకాదు పరభాషా ప్రేక్షకులను కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు జగ్గుభాయ్. ఇప్పటికే మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్, విజయ్ హీరోగా తెరకెక్కిన భైరవ, సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ సినిమాల్లో నటించిన జగపతి బాబు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పారు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. విభిన్న చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే జగ్గుభాయ్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జగపతిబాబు చేస్తోంది సపోర్టింగ్ రోలా..? లేక ప్రతినాయక పాత్రా.? అన్న సంగతి తెలియాల్సి ఉంది. -
రాజకీయ నాయకుడిగా సూర్య
కోలీవుడ్ స్టార్హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్జీకే. విలక్షణ చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సూర్య క్యూబా విప్లవకారుడు చేగువరాల కనిపించిన లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా ను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
దీపావళికి వస్తాం
పోలీస్ స్టేషన్కు వెళ్లారట హీరో సూర్య. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెళ్లారా? లేక ఆయనే కంప్లైంట్ చేయడానికి వెళ్లారా? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. దీపావళికి థియేటర్స్లో చూడాల్సిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్జీకే’. ఇందులో రకుల్ప్రీత్సింగ్, సాయిపల్లవి కథానాయికలు. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షూటింగ్లో పాల్గొనడానికే హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్ బుధవారం ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ‘‘లాంగ్ షెడ్యూల్ కోసం లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆన్ ఫర్ దీపావళి’’ అని పేర్కొన్నారు సెల్వ రాఘవన్. అంటే దీపావళికి ‘ఎన్జీకే’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమాకు యువన్ శంకర్రాజా బాణీలు అందిస్తు్తన్నారు. -
సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్ చేస్తున్నా
-
సూర్యతో మనస్పర్థలు ముగిసినట్లే...
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్కు కొంత కాలం క్రితం మనస్పర్థలు వచ్చాయి. ‘ధృవ నక్షత్రం’ ప్రాజెక్టు విషయంలో ఇద్దరి మధ్య తేడాలు రావటంతో సూర్య అర్ధాంతరంగా తప్పుకోవటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత గౌతమ్ మీనన్ అదే చిత్రాన్ని విక్రమ్తో తెరకెక్కించాడు. అప్పటి నుంచి సూర్య-గౌతమ్ మీనన్ గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఈ దశలో ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ఓ వీడియో బైట్లో గౌతమ్ స్పందిస్తూ...‘సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్ చేస్తున్నానని.. ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నానని, అన్నీ కుదరితే వచ్చే ఏడాది ఈ చిత్రం ఉంటుందని’ తెలిపారు. మరోవైపు సూర్య కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మనసు నొప్పించటంపై బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా రాశాడు. గతంలో వీరిద్దరి కాంబోలో కాఖా కాఖా(తెలుగులో ఘర్షణ), వారనమ్ ఆయిరామ్(సూర్య సన్నాఫ్ కృష్ణన్)లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం ఎలా ఉంటుందోనన్న టాక్ అప్పుడే మొదలైపోయింది. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ‘ఎన్జీకే’ చిత్రంలో నటిస్తుండగా, దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. BREAKING 📣 "#Suriya39" with the magical director @MenonGautham 😍 Madly Waiting 😭💝pic.twitter.com/0ORorNnS7D — Suriya Fans Trends ™ (@Suriya_Trends) June 11, 2018 -
ఆయనంటే చాలా ఇష్టం: సాయి పల్లవి
సాక్షి, చెన్నై : మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంతో సినీ పూతోటలో వికసించిన పువ్వు సాయిపల్లవి. అదే విధంగా తెలుగులో ఫిదా చిత్రంతో కథానాయకిగా పరిమళించిన ఈ చిన్నది తమిళంలో మాత్రం దియ చిత్రంతో అంతగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే నటిగా మాత్రం సాయిపల్లవి ఫెయిల్ కాలేదు. బహుశా తాజాగా సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్కు జంటగా మారి–2 చిత్రాలతో విజయాల ఖాతాను ప్రారంభిస్తుందేమో. అదే విధంగా తెలుగులోనూ నటిస్తున్న సాయిపల్లవిపై పుకార్లు ప్రారంభం నుంచే ప్రసారం అవడం మొదలెట్టాయి. మణిరత్నం అవకాశాన్ని కాలదన్నుకుందని, షూటింగ్లకు ఆలస్యంగా వస్తుందని, తాజాగా పారితోషికం కూడా పెంచేసిందనే వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయిపల్లవి ఏమంటుందో చూద్దాం సూర్యతో నటిస్తున్న అనుభవం గురించి? సూర్య అంటే నాకు చాలా ఇష్టం. పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుంచి ఆయన వీరాభిమానినని చాలా సార్లు చెప్పాను. ఎన్జీకే చిత్ర షూటింగ్లో తొలిసారిగా సూర్యను కలిసినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఆయన్ని చూస్తూ సంతోషంలో అలానే నిలబడిపోయాను. అది గమనించిన సూర్య నవ్వారు. సూర్య షూటింగ్ స్పాట్లో సర్వ సాధారణంగా ఉంటారు. కెమెరా ముందుకు వెళితే వేరే విధంగా మారిపోతారు. ఆ అంకిత భావాన్ని నేనాయన నుంచి నేర్చుకుంటున్నాను. చదువుకునే రోజుల్లో ఎక్కువ సార్లు చూసిన చిత్రం? కన్నత్తిల్ ముత్తమిట్టాళ్. ఆ చిత్రం చూసి అమ్మానాన్నలతో నన్నూ మీరు దత్తత తీసుకుని పెంచుకుంటున్నారా అని అడిగాను. అంతగా ఆ చిత్రం నా మనసుని కదిలించింది. అలాంటిది నేను నటించడం మొదలెట్టిన తరువాత అందరికీ అభిమానినైపోయాను. అన్నట్టు మీ చెల్లెలు కూడా నటిగా పరిచయం కాబోతోందటగా? లేదు. అది కేవలం వదంతి మాత్రమే. నా చెల్లెలు పూజా సినిమాకు వచ్చే అవకాశం లేదు. నటించాలన్న ఆలోచన తనకు లేదు. నిజంగా పూజకు నటించాలనే ఆసక్తి ఉంటే కచ్చితంగా నాతో పాటు మా కుటుంబం ప్రోత్సహిస్తాం. మొదట్లో మీరు మణిరత్నం చిత్రం, విక్రమ్, శింబు వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను చేజార్చుకున్నారనే ప్రచారం జరిగిందే? నా విషయంలో నేను చాలా తెలివిగానే ఉన్నాను. ఈ సినిమా, పేరు, అభిమానులు అన్నీ ఎప్పుడైనా లభిస్తాయి. మరి కొద్ది కాలం తరువాత కొత్తవాళ్లు రంగప్రవేశం చేసి నా స్థానాన్ని అందుకోనూవచ్చు. అయితే విద్య అలా కాదు. ఒక నటి అనే కంటే డాక్టరు అనిపించుకోవడంలోనే నాకు సంతోషం, తృప్తి. ఒకరిని ఆరోగ్యవంతుడిని చేయడంతో పాటు కాకుండా, రోగం రాకుండా నిరోధించాలన్నదే నా ఆశ. అందుకే జార్జియాకు వెళ్లి డాక్టర్ పట్టాపొంది వచ్చాను. ఆ తరువాత అవకాశాలు రావడంతో నటిస్తున్నాను. -
సూర్య సినిమాలో మోహన్లాల్!
-
సూర్య సినిమాలో మోహన్లాల్!
ప్రస్తుతం ఓ మల్టిస్టారర్ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఒక పెద్ద హీరో, మరో స్టార్ హీరో సినిమాలో నటించడమో, అతిథి పాత్రలో మెప్పించడమో ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో సినిమాకు ఒక కొత్తదనం వస్తోంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే సినిమా రేంజ్ పెరిగిపోతుంది. అదే.. వేరే ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ మరో ఇండస్ట్రీకి చెందిన స్టార్తో జతకడితే సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. మాలీవుడ్ స్టార్ కంప్లీట్ యాక్టర్ మోహన్లాల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను కె.వి. ఆనంద్ డైరెక్ట్ చేయనున్నారు. ఇదివరకే సూర్య ఆనంద్ కాంబినేషన్లో వీడొక్కడే, బ్రదర్స్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టాలని, ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా మోహన్లాల్ను ప్రత్యేక పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మోహన్లాల్ పాత్రే కీలకమని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ఎన్జీకే (NGK) మూవీలో నటిస్తున్నారు. -
ఎన్జీకే మొదలెట్టాడు
కోలీవుడ్లో దాదాపు 48రోజుల పాటు సాగిన థియేటర్స్ బంద్కి ఫుల్స్టాప్ పడటంతో సినిమాల సందడి డబుల్ ఫోర్స్తో స్టార్ట్ అయింది. మూవీ రిలీజ్లు, షూటింగ్లు, ఆడియో ఫంక్షన్లతో తమిళ ఇండస్ట్రీకి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్జీకే’ సినిమా శనివారం ప్రారంభమైంది. సాయి పల్లవి, రకుల్ప్రీత్ సింగ్ కథానాయికలు. ‘ఎన్జీకే’ షూటింగ్లో రకుల్ జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో సూర్య, రకుల్పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యువన్శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. రకుల్ ప్రీత్సింగ్ లవ్లో ఉన్నారని ఒప్పుకున్నారు. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? అనేగా మీ డౌట్. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమె లవ్లో పడింది పర్సన్తో కాదు. యాక్టింగ్ ప్రొఫెషన్తో అన్నమాట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంతగానో లవ్ చేస్తున్నానని చెప్పారు. అయితే.. ‘స్పైడర్’ సినిమా తర్వాత రకుల్ నటించనున్న తెలుగు చిత్రంపై క్లారిటీ లేదు. మూడు తమిళ్, ఒక హిందీ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారామె. -
సూపర్ ఫామ్
వన్.. టు.. త్రీ.. ఫోర్... అండ్ నాటౌట్. స్టిల్ కౌంటింగ్. ఇండస్ట్రీలో ఇలాగే అనుకుంటున్నారు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ సూపర్ ఫామ్ గురించి. ఎందుకంటే.. ఈ ఏడాది ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలేదు.. నలుగురు పెద్ద హీరోల సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారు రకుల్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రంలో రకుల్ ఒక కథానాయిక. కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమాలోనూ రకుల్ను కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో రకుల్ను కథానాయికగా ఎంపిక చేశారు చిత్రబృందం. కమెడియన్ నుంచి హీరోగా మారిన శివకార్తికేయన్ పెద్ద హీరో ఏంటి? అనుకోకండి. మెల్లిగా అతను ఫామ్లోకొస్తున్నాడు. పైగా ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి బడ్జెట్ ఎక్కువ. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదొక్కటి చాలు.. ఇది పెద్ద సినిమా అని చెప్పడానికి. ఆల్రెడీ బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక అని బీటౌన్ టాక్. సినిమాల పరంగా రకుల్ స్కోర్ తమిళ్లో 3, హిందీలో 1. ఇంకా ఈ ఏడాది తెలుగులోనే బోణీ చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఈ సూపర్ఫామ్ హ్యాపీనెస్లోనే అభిమానులకు దగ్గరయ్యేందుకు సొంత యాప్ను రిలీజ్ చేసి, కూల్గా దూసుకెళ్తున్నారు రకుల్. -
ఎన్జీకే అంటే?
... ప్రస్తుతం సూర్య కొత్త టైటిల్ చూసినవారందరికీ వచ్చిన డౌట్ ఇది. ఆ డౌట్ తీరాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే అంటోంది చిత్రబృందం. సూర్య హీరోగా రకుల్ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సోమవారం దర్శకుడు సెల్వ రాఘవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘ఎన్జీకే’ అనే టైటిల్ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. లుక్ సమ్థింగ్ డిఫరెంట్గా ఉంది కదూ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ఫ్రభు, ఎస్.ఆర్. ప్రకాష్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఫస్ట్ లుక్ : అచ్చం చెగువేరాలా ఉన్నాడే!
సాక్షి, సినిమా : కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఎన్జీకే అన్న టైటిల్ను ఫిక్స్ చేశారు. సూర్యకు ఇది 36వ చిత్రం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య చెగువేరా స్టైల్లో ఉన్న వేషాధారణ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో విప్లవ నేపథ్యం ఉన్న థీమ్ ఉండటం విశేషం. వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న సెల్వరాఘవన్.. సూర్యతో ప్రయోగం చేయబోతున్నాడని పోస్టర్తో అర్థమౌతోంది. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం.. పైగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఎన్జీకే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. Dear all! Need your love for #NGK Director @Selvaraghavan !! A very Happy birthday!!#NGKdiwali2018 #Suriya36@Sai_Pallavi92 @Rakulpreet @thisisysr @prabhu_sr @RelianceEnt @DreamWarriorPic pic.twitter.com/uVb42EJOgb — Suriya Sivakumar (@Suriya_offl) 5 March 2018