Tharun Bhascker Dhaassyam
-
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్లోనే విజయ్కి ఒక చక్కటి కథను తరుణ్భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్గా విజయ్ ఈ ప్రాజెక్ట్పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
ఎస్పీ చరణ్తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!
గతంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్తో పాటు సినిమా యూనిట్కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని.. నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు.. ఎస్పీ చరణ్ సార్కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ సమస్య వచ్చింది. ఏదేమైనా మాకు ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం చేసే చిన్న సినిమాలు మీరు కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. అలా చేయాలనే కోరిక కూడా లేదు. కానీ మా వరకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ఏఐ వచ్చినా కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. మేం చేసినా.. చేయకపోయినా మార్పు అయితే జరుగుతది. మా మధ్య కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ సమస్య ముగిసిపోయింది' అని అన్నారు. అసలేం జరిగిందంటే.. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. -
రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) ఏం జరిగింది? గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు. రూ.కోటి డిమాండ్ ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
‘కీడా కోలా’ మూవీ రివ్యూ
టైటిల్: కీడా కోలా నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు నిర్మాతలు: కె.వివేక్ సుదాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గబాటి దర్శకత్వం: తరుణ్ భాస్కర్ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్ ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ విడుదల తేది: నవంబర్ 3, 2023 కథేంటంటే.. వాస్తు(చైతన్య రావు)కి నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పెరెంట్స్ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్)ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో కీడాకోలా(శీతల పానీయం)బాటిల్లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తాడు. మరోవైపు వీధి రౌడీ జీవన్(జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానంతో.. ఎలాగైన కార్పోరేటర్ కావాలనుకుంటారు. 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్)తో తన కోరిక ఏంటో చెబుతాడు.దాని కోసం రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని భావించి.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? ఈ రెండు గ్యాంగులతో ఆ కంపెనీ యజమాని(రవీంద్ర విజయ్) కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? చివరకు చేసిందేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్లో ‘కీడా కోలా’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తరుణ్ భాస్కర్ గత సినిమాలు(పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది) చూస్తే.. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి పాత్రల్ని, కొన్ని సన్నివేశాలను నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్ని పక్కకి పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇదొక రోటీన్ క్రైమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టిన మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్గా అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు కానీ..నవ్వించే సీన్లకు కొదవ ఉండదు. వాస్తు, లంచం పాత్రలని పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే జీవన్ గ్యాంగ్ని పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగుల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీని మొదట్లోనే ఇచ్చాడు. ఆ ఏరియా కార్పోరేటర్ జీవన్ పోస్టర్ని డిజైన్ చేసిన సీన్తో నవ్వులు ప్రారంభం అవుతాయి. నాయుడి పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్ అంటూ నాయుడు పాత్ర పండించే కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కకి పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్ని ముగించేశాడు. ఇక సెకండాఫ్లో కథనం ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయితే పార్ట్ పార్టులుగా వచ్చే సీన్లు నవ్విస్తాయి. కీడా కోలా యాడ్లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ లాగినట్లు అనిపిస్తుంది. రెండు గ్యాంగ్ల మధ్య వచ్చే ‘ సరెండర్ ’ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. షూటర్స్ లోపాలు, బొమ్మతో నాయుడు ప్రేమాయణం.. ఇవన్నీ ఆకట్టుకున్నా.. చెప్పుకోదగ్గ కథ లేదనే వెలితిమాత్రం ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తరుణ్ భాస్కర్లో మంచి నటుడు ఉన్నాడు. గతంలో పలు చిత్రాల్లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇందులో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. నాయుడు పాత్రలో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పైకి నవ్విస్తూనే..అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చే పాత్ర తనది. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకి రాగ్ మయూర్ న్యాయం చేశాడు. ‘మ్యాడ్’ఫేమ్ విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మానందం పాత్ర వీల్ ఛైర్కే పరిమితం అయినా.. సందర్భానుసారం నవ్విస్తుంది. జీవన్ కుమార్, రవీంద్ర విజయ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక తరుణ్ గత సినిమాల మాదిరే కీడా కోలా కూడా సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది. ఏజే అరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు కథలో భాగంగా అలా వచ్చిపోతాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి.. సెన్సార్ వాళ్లకు పని తగ్గించాడు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా నిడివి(రెండు గంటలు)తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘కీడా కోలా’ ప్రీ రిలీజ్ వేడుకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్
పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7 — Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023 -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
ఆ సినిమా ఫ్లాప్, అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది: శర్వానంద్
ప్రముఖ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా అక్కినేని అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు శర్వానంద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా ఆడుతుందనుకున్నాం. అది ఫ్లాప్ అయినప్పుడు షాక్లోకి వెళ్లిపోయాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్లో నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని మరీ కో అంటే కోటి సినిమా తీశాం. ఆ సినిమాకు నేనే నిర్మాతను. డబ్బులు పోయాయి. రిలేషన్స్ దూరమయ్యాయి. తట్టుకోలేకపోయాను. ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాలపాటు ఒక్క షర్ట్ కూడా కొనలేదు. రన్రాజా రన్ సినిమా హిట్టయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామా? అని డౌట్లో ఉన్నాను. ఎక్స్ప్రెస్ రాజా హిట్టయినప్పుడు కూడా పార్టీకి పిలిచారు. కానీ నేను సోమవారం దాకా నమ్మనని చెప్పాను. అలా సినిమాల సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చాడు శర్వానంద్. చదవండి: బిగ్బాస్కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డు చెప్పారు ఒకే ఒక జీవితం చూసి నాగార్జున భావోద్వేగం -
రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి సాంగ్ వచ్చేసింది..
ఐదు వేరు వేరు కథలతో తెరకెక్కుతున్న చిత్రం `పంచతంత్ర కథలు`. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి... నా గుండెల సరాసరి.. కుర్సియేసి కూసొబెడతనే... నీ అయ్యా పట్వారి.. నీ చిచ్చా దార్కారి... ఏదైతే ఏందే మరి... నిన్నుఎత్తుకొనిబోతనే...' అంటూ ఆహ్లాదరకరంగా సాగుతోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్తో స్వరపరిచాడు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్లో చేర్చారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ నా ఫేవరేట్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని నా నమ్మకం. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్ప్రైజింగ్గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్గా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. చదవండి: భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన బుల్లితెర నటుడు -
అప్పట్లో జేబులో పది రూపాయలు కూడా ఉండేవి కాదు: స్టార్ డైరెక్టర్
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్గానే కాకుండా నటుడిగా, సింగర్గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్కి ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తనకు ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానన్నాడు. చదవండి: సింగర్ కేకే మృతికి చిరంజీవి, మహేశ్ బాబు నివాళి ‘మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లో లేరు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. ఏవో కథలు రాసుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో జేబులో పది రూపాయలు ఉండేవి కాదు. అయినా బుర్రలో 100 కోట్ల ఆలోచనలు ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్లే వాడిని. అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. అంతా కలిసి ఒక బ్యాచ్గా ఉంటూ సినిమాల గురించిన ఆలోచనలు చేస్తుండేవాళ్లం. అలా చివరికి ‘పెళ్లి చూపులు’ సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఇటు నాకు .. అటు విజయ్కి ఇద్దరి కెరియర్కు ఆ సినిమా చాలా హెల్ప్ అయింది’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి -
ట్రక్కు బ్రేకులు ఫెయిల్, అందరం చచ్చిపోతామన్న విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్గానే కాకుండా నటుడిగా, సింగర్గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు నాన్వెజ్ వండటం బాగా వచ్చని చెప్పాడు. తనకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదన్నాడు. విజయ్తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడని చెప్పుకొచ్చాడు. తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వచ్చాక విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్లాగా వాడతానన్నాడు. చదువులో తాను బ్యాక్ బెంచర్ అని, తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఒక బిల్డింగ్నే కట్టొచ్చని తెలిపాడు. సుమారు 23 సప్లీలు ఉండొచ్చన్నాడు. విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లానని, కాకపోతే ఓ కెమెరా పట్టుకుని దీపికా పదుకోణ్ను ఫాలో అవమని చెప్పారని, తానదే చేశానని పేర్కొన్నాడు. పెళ్లి చూపులు సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను పంచుకున్నాడు. 'ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని ఆన్సరివ్వడంతో ఒక్కసారిగా షాకయ్యా' అన్నాడు తరుణ్ భాస్కర్. చదవండి 👇 భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
కరోనా వచ్చింది ఫ్రెండ్స్.. సీరియస్గా తీసుకోండి : డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. -
ఎగిరెగిరి తన్నిన రష్మిక.. కోపం వస్తే ఇలా చేస్తుందా?
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్ నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే.. యోగా అయినా చేస్తుంది. ఖాళీగా ఉంటే రోజులో ఎక్కువ భాగం జిమ్లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అవి వైరల్ అవుతూంటాయి. తాజాగా ఆమె జిమ్ సెంటర్ వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రష్మిక తన ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే..మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్. ఈ వీడియోని రష్మిక ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్మిక వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్ కోసం అడుగుతాడా? టేక్ ఓకే’ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
తరుణ్ భాస్కర్ కొత్త సినిమా..స్పోర్ట్స్ డ్రామాలో
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో క్రీడా నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. సాయి సుశాంత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. రోహిత్ తంజావూర్ దర్శకత్వంలో ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ‘ఫీలర్ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో మూడో చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ రెడ్డి. -
నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి
హీరో నాగచైతన్య, దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కొద్దిసేపు పోలీస్ ఆఫీర్గా కనిపించారు నాగచైతన్య. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే వీరిద్దరి కాంబినేషన్లోనే హారర్ బ్యాక్డ్రాప్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇక నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్స్టోరీ’ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. చదవండి: బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య! నాకూ ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేదు -
లెక్చరర్ పాత్రలో వెంకటేశ్
‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని రూపొందించారు. మూడో సినిమాకే వెంకటేశ్ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గుర్రపు పందేల బ్యాక్డ్రాప్లో ఉంటుందనే విషయమూ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారన్నది తాజా సమాచారం. ఆయన లెక్చరర్గా కనిపించే పోర్షన్ మొత్తం వినోదాత్మకంగా ఉంటుందట. సురేశ్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప, ఎఫ్ 3’ సినిమాలు కమిట్ అయ్యున్నారు. ఇవి పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది వేసవిలో తరుణ్ భాస్కర్తో చేసే సినిమా ఆరంభం కానుందని టాక్. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధిన్ సిద్ధిఖీని నటింపజేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. -
క్రేజీ డైరెక్టర్
-
పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్
హైదరాబాద్ : దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై ఆన్లైన్లో ట్రోలింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు అసభ్య పదజాలం వాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తరుణ భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఆయన వివరించారు.(చదవండి : నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) ‘సాధారణంగా సినిమాలకు సంబంధించి చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రొజెక్టు అయింది. గత కొద్ది రోజులుగా కొందరకు నన్ను, నా టీమ్ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో నేను సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్కు పాల్పడుతున్న ఇద్దరి వివరాలు వారికి అందజేశాను. ఇందుకు సంబంధించి తొలుత మేము వారిని పిలిచి చాలా మార్యాదగా మాట్లాడాం. ట్రోలింగ్ అనేది ఇతరుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించాం. అలాగే వ్యక్తిగత దూషణ అనేది తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించాం. కానీ వారు దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాం. దీనిని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం.. మాపై తప్పుడు వ్యాఖ్యలు, పోస్ట్లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా, ఇటీవల మలయాళ చిత్రం కప్పేలా చూసిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తెలుగు సినిమాల్లో ఉండే అనవసరమైన కమర్షియల్ డ్రామా అందులో ఉండదని కూడా పేర్కొన్నారు. దీంతో ఓ హీరో అభిమానులు ఆయనకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. To whomsoever it may concern...@hydcitypolice pic.twitter.com/MX5GXfMVX0 — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) July 1, 2020 -
కొత్త యాంగిల్తో ముందుకొస్తున్న తరుణ్ భాస్కర్
‘నీకు మాత్రమే చెప్తా’ షోతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానంటున్నాడు తరుణ్ భాస్కర్. పీపీ ప్రొడక్షన్స్లో తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడిగా, నటుడిగా కనిపించిన ఆయన తాజాగా వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు. ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ ఈ నెల 14న ఓ టీవీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్ భాస్కర్, శరత్, నిర్మాతలు ప్రభాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నిర్మాత ప్రజా ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా వెనుక, ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ షోలో చూపించాం. ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్కు ధన్యవాదాలు. మార్చి 14 నుంచి ‘నీకు మాత్రమే చెప్తా’ మొదలుకానుంది. డైరెక్టర్ అవ్వకముందు తాను పడిన కష్టాలు ఈ ప్రోగ్రామ్లో ఎంటర్టైన్ విధానంలో చెప్పాం. దర్శకుడు శరత్ మాట్లాడుతూ... నిర్మాత శ్రీకాంత్ ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. అలా నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థ్యాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’నని పేర్కొన్నారు. (ప్రతి ఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఒక సీక్రెట్ ఉంటుంది) వాళ్ల మీద అభిప్రాయాలు మారాయి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బుల్లితెరపై ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుంచి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, ఈ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ ఈ కాన్సెప్ట్తో మా దగ్గరికి రావడం.. అది నాకు నచ్చడంతో ఈ షో వెంటనే ప్రారంభించాం. ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ దర్శకులతో పాటు రీసెంట్గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్లో పరిచయం చేయబోతున్నాము. నేను వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. ఇది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్కు చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది. అందులో మంచు లక్ష్మి ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సిరీస్తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. తను చాలా బాగా చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను’ అని తెలిపారు. -
టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్కు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ ఐమాక్స్ థియేటర్లోని కౌంటర్లో టికెట్లు అమ్మాడు. అయితే విజయ్ టికెట్లు అమ్ముతున్నట్లు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్ దగ్గర గుమిగూడారు. అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకుఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇందులో తరుణ్ భాస్కర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ను ఇలా భిన్నంగా కూడా చేయవచ్చని విజయ్ నిరూపించాడు. టికెట్లు కొన్నవారికి అద్భుత ఆఫర్లు కూడా ప్రకటించాడు. టికెట్లు దక్కించుకున్న ప్రేక్షకులకు ఉచిత పాప్కార్న్ అందించాడు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్తోనే సినిమాపై ఆసక్తిని పెంచేసిన చిత్రయూనిట్.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూత్కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సక్సెస్ జోరులోనే మరో సర్ప్రైజ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా తొలి లిరికల్ సాంగ్ను తాజాగా విడుదల చేసింది. ‘ఈ రోజు పొద్దున్నేపెద్ద పులి నన్నే ఎందుకో తరుముతోంది. అరె ఎందుకని తిరగి నేనడిగిగా.. పులి మూస్కోని పరిగెత్తమంది’అంటూ సాగే గీతాన్ని రాకేందు మౌళి రచించగా శివకుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సింగర్ రేవంత్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను ‘మీకు మాత్రమే చెప్తా’తో హీరోగా మార్చాడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్ను కూడా చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రిన్స్ మహేశ్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించి సినిమాపై హైప్ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
-
మీరు చూడబోయే వీడియో మీదే అయితే..?
-
ప్రతి ఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఒక సీక్రెట్ ఉంటుంది
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్ఫోన్లో కనీసం ఒక్క రహస్యమైనా నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి రహస్యం దాచుకున్న ఓ స్మార్ట్ ఫోన్ మాయం అయితే.., అందులో ఉన్న సీక్రెట్ బయటకు వచ్చేస్తే.. అప్పుడు ఏం జరుతుంది? మన దేశంలో ప్రతి ఒక్కరు సుమారుగా 6 గంటల పాటు స్మార్ట్ఫోన్లో వీడియోలు చూస్తారట. వాటిల్లో మన వీడియో ఉంటే? ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమాయే ‘ మీకు మాత్రమే చెప్తా’. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. సూపర్స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా బుధవారం ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ విడుదలైంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్తో ఈ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రకారం.. పెళ్లికి ఒక్క రోజు ముందే హీరోకి సంబంధించిన ఓ సీక్రేట్ వీడియో లీకైపోతుంది. దీంతో హీరో అండ్ గ్యాంగ్ కంగారు పడిపోతుంది. వీడియో వల్ల పెళ్లి ఆగిపోతే ఎలా? తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే ఎంటి పరిస్థితి. పుట్టబోయే కొడుకు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందని అని హీరో టెన్షన్ పడతాడు. అసలు లీకైన వీడియో ఎంటి.. హీరో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు అని తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే. తరుణ్ భాస్కర్ నటన సహజంగా ఉంది. అతను చెప్తే డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. విజయ్ దేవరకొండని అక్కడక్కడ అనుకరిస్తున్నాడేమో అనిపిస్తోంది. ట్రైలర్లో చూపించిన ఫన్ వర్కవుట్ అయితే.. నిర్మాతగా విజయ్కు తొలి విజయం దక్కినట్టే. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్కు షమ్మిర్ సుల్తాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. -
విజయవాడలో 'మీకు మాత్రమే చెప్తా' చిత్ర యూనిట్ సందడి
-
‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్
-
ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్
పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడిని వెండితెరపై హీరోగా పరిచయం చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్దమయ్యాడు. తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ టీజర్ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం.. ఫస్ట్ లుక్తోనే ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. ప్రతీ ఫోన్లో సీక్రెట్స్ ఉంటాయి అని తెలిపేట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. 'సిగరెట్,మందు తాగడం, అబద్దాలు చెప్పడం ఆరోగ్యానికి హానికరం అంటూ ముగిసిన ఈ టీజర్లో తరుణ్ భాస్కర్ హైలెట్గా నిలిచాడు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. -
మీకు మాత్రమే చెప్తా.. ఫస్ట్ లుక్
దర్శకులు హీరోలు కావడం కామన్ గానే చూస్తున్నాం. కానీ తన దర్శకత్వంతోఫేమ్ అయిన హీరో నిర్మించిన సినిమాలో అదే దర్శకుడు హీరోగా నటించడం మాత్రం చాలా రేర్. అలాంటి రేర్ ఇన్సిడెంట్ కు తెరలేపాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోను చేశాడు. మరి విజయ్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ గురించి అడిగితే విజయ్ దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్నాడు. వీళ్లు టైటిల్ రివీల్ చేసిన విధానం చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. కథ కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు. తరుణ్ భాస్కర్ తో పాటు అనసూయ భరద్వాజ్ మరో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం విశేషం. మొత్తంగా దర్శకులు హీరోలు, హీరోలు దర్శకులు అవుతోన్న తరుణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ‘మీకు మాత్రమే చెప్తా’లో తరుణ్ భాస్కర్ అబినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే..పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. -
‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్ దేవరకొండ
కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు టాలీవుడ్ సెన్సేషన్ అండ్ క్రేజీ హీరో విజయ దేవరకొండ నిర్మాతగా మారారు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యంగ్ టాలెంట్కు ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేశాడు. తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ తన సొంత బ్యానర్లో సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు టైటిల్ కూడా ప్రకటించారు. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. అ టైటిల్ పేరు ‘ మీకు మాత్రమే చెప్తా’. అందరికి తెలిసిన పేరు అయినా వినడానికి వెరైటీగా, కొత్తగా ఉంది కదా. టైటిల్ను కూడా వెరైటీగా ఓ వీడియోద్వారా ప్రకటించాడు విజయ్. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి అంటాడు. సినిమా పేరు ఏంటని అడగ్గా..‘మీకు మాత్రమే చెబుతాను' అని విజయ్ దేవరకొండ అన్నాడు. నాకే చెప్పు.. మరెవరికీ చెప్పను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. కాదురా సినిమా టైటిల్ అదే.. ‘మీకు మాత్రమే చెబుతాను'. ఆ సినిమాలో హీరో కూడా నువ్వే అంటూ తరుణ్కు ఝలక్ ఇచ్చాడు. -
శర్వానంద్ కొత్త సినిమా మొదలైంది!
ఇటీవల రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను డ్రీమ్వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా బుధవారం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాను 2020 వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. -
‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’
పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ తరువాత ఈ నగరానికి ఏమైంది? సినిమాతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది జూన్లో రిలీజ్ అయిన ఈ సినిమా తరువాత తరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టలేదు. ఈ గ్యాప్లో విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా నటించేందుకు రెడీ అయ్యాడు. తాను హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగానే దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు తరుణ్. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. ‘తదుపరి ప్రకటన త్వరలో.. నెర్వస్గా ఉంది అలాగే ఎగ్జైటింగ్గానూ ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. View this post on Instagram Next announcement, coming soon ! Super nervous and excited. 🤞 A post shared by Tharun Bhascker (@tharunbhascker) on Aug 21, 2019 at 12:57pm PDT -
‘ఫలక్నుమా దాస్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఫలక్నుమా దాస్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, తరుణ్ భాస్కర్ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : విశ్వక్ సేన్ నిర్మాత : కరాటే రాజు వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్నుమా దాస్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం చేసిన అతి కూడా తోడైంది. ఏకంగా ఈ చిత్రాన్ని తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన శివ చిత్రంతో పోల్చారు. మరి చిత్ర యూనిట్ హీరో కం దర్శకుడు చేసిన హడావిడి వారు చెప్పినట్టుగా ఈ చిత్రం నిజంగానే మరో శివ అనిపించుకుందా? దర్శకుడిగా మారిన హీరోని విజయం వరించిందా? ఓ సారి చూద్దాం. కథ : ఫలక్నుమా లోని దాస్ (విశ్వక్ సేన్) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. దాస్ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్ను హత్య చేస్తారు. శంకర్ హత్యతో గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి ఒక బిజినెస్ చేద్దామని ఫలక్నుమా ఏరియాలో మటన్ షాప్ ప్రారంభిస్తారు. అప్పటికే మటన్ బిజినెస్ లో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ బిజినెస్ స్టార్ చేశాక వారి బిజినెస్ స్లో అవుతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తుంది. చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ. నటీనటులు : తెలంగాణ యాసతో పక్కా హైదరాబాది కుర్రాడిలా దాస్ పాత్రలో విశ్వక్ సేన్ పర్వాలేదనిపించాడు. ఆ పాత్రకు తగ్గట్టు భాషను యాసను బాడీ లాంగ్వేజ్ ను మెయింటైన్ చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్లో మాత్రం తేలిపోయాడు. భావోద్వేగాలను సరిగా పండించలేకపోయాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఏ ఒక్కరూ మెప్పించలేకపోయారు. లుక్స్ పరంగా నటన పరంగా ప్రేక్షకులను అలరించలేక పోయారు. దర్శకుడి నుంచి నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ మంచి పాత్రలో కనిపించాడు. ఓ దర్శకుడు నటుడిగా మారితే ఎంతగా మెప్పించగలరో చూపించాడు. సైదులు పాత్రలో తరుణ్ జీవించాడనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండు పాత్ర గురించి, ఉత్తేజ్ ఈ పాత్రను తన అనుభవంతో అవలీలగా చేసేసాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ రీమేక్ రైట్స్ను కొనుక్కొని మరీ దర్శకుడు అవతారం ఎత్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విశ్వక్. అయితే ఇదేమీ కొత్త కథ కాదు. బస్తి గొడవలు గ్యాంగ్ వార్స్ అల్లరి చిల్లరిగా తిరిగే హీరో, హీరో చుట్టూ నలుగురు స్నేహితులు ఈ కాన్సెప్ట్ తో మనం ఎన్నో సినిమాలు చూసేసి ఉన్నాం. తెలుగు ప్రేక్షకులకు ఇది రొటీన్ కథ లాగే అనిపిస్తుంది. దర్శకుడిగా విశ్వక్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఒరిజినల్ కథకు మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తెరపై చూపించలేకపోయాడు. తెరపై ఎంతసేపు గొడవలు పడటం, బూతులు తిట్టుకోవడం, తాగడం, తిరగడం ఇవే కనబడుతూ ఉంటాయి. కథానాయికల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఏ ఒక్కరూ కనిపించలేదు.. నటించలేదు. ప్రతీ సన్నివేశంలో దర్శకుడి అనుభవలేమి కనబడుతుంది. అనవసరమైన సన్నివేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో సాగదీస్తూ తీసిన సన్నివేశాలు ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తాయి. నటుడిగా పరవాలేదనిపించిన విశ్వక్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు. కేవలం బోల్డ్ డైలాగ్స్ను నమ్ముకొని సినిమా చేశారన్న భావన కలుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివతో పోల్చారు గాని.. ప్రేక్షకుడికి ఏ స్థాయిలోనూ అలాంటి ఫీలింగ్ కలగదు. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఆ వర్గం ప్రేక్షకుల్ని కొంతమేరకు ఆకట్టుకోవచ్చు. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే కొన్ని సన్నివేశాల్లో అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరామెన్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్ తో పాటు ఇక్కడి బస్తీల పరిస్థితులను అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బాగానే బంధించాడు. ఎడిటర్ ఇంకా కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ బలాలు బలహీనతలు చెప్పుకోకుండా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ జాబితాను మనం తీస్తే అన్ని బలహీనతలే కనిపిస్తాయి. -బండ కళ్యాణ్, ఇంటర్ నెట్ డెస్క్. -
మే 31న `ఫలక్నుమా దాస్`
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం `ఫలక్నుమా దాస్`. వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీడియా 9 మనోజ్కుమార్ కో ప్రొడ్యూసర్. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 31న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ `సినిమా ను ఇటీవల 100 మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం` అన్నారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ `నేను ఇందులో నటించా. మొదట్లో విశ్వక్ మీద నమ్మకం లేదు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అప్పుడు విశ్వాక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమా కి రీమేక్ అని తెలిసిందే`అన్నారు. -
దర్శకుడిగా మారనున్న కమెడియన్..!
ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్లో మరో నటుడు చేరబోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
పెళ్లిచూపులు దర్శకుడితో మహేష్..!
యంగ్ జనరేషన్ దర్శకులతో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్స్తో పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పిన మహేష్, మరో యంగ్ డైరెక్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరగుతోంది. పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. త్వరలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యువ దర్శకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ పాయింట్ వినిపించాడట. ఈ పాయింట్ పట్ల సుముఖంగా ఉన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్తో రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మహేష్, తరుణ్ భాస్కర్ నుంచి ఎలాంటి ప్రకటనా రావటం లేదు. ప్రస్తుతం తన 25 సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్గా అలరించనుంది. -
ఆ సినిమాలో రొమాంటిక్ పాత్ర కాదట!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తనకు మొదటి బ్లాక్ బస్టర్హిట్ను ఇచ్చిన ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ను హీరోగా పరిచయం చేయబోతోన్న సంగతి తెలిసిందే. నాలుగు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో ఓ పాత్రలో తరుణ్ భాస్కర్ను మరో పాత్రకు అనసూయను తీసుకున్నారు. ఈ చిత్రంలో అనసూయ రొమాంటిక్ పాత్రలో నటించనున్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ.. తన పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై అనసూయను మీడియా ప్రశ్నించగా.. ఆ చిత్రంలో తనది రొమాంటిక్ పాత్ర కాదని, ఓ ముఖ్య మైన పాత్రను పోషిస్తున్నాని, ఆ క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లిన తరువాత మిగతా వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. అనసూయ ప్రస్తుతం ‘కథనం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దంగాఉంది. -
‘రౌడీ’ బ్యానర్లో హీరోగా తరుణ్..!
టాలీవుడ్ ప్రేక్షకులను రౌడీగా అలరిస్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో సంచలనం సృష్టించిన విజయ్, రౌడీస్ అని ప్రేమగా పిలుస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన నోటా సినిమాతో నిర్మాతగా మారిన విజయ్, నిర్మాతగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు తన తదుపరి చిత్రంతో ఓ దర్శకుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు విజయ్. ఇటీవల తన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ హిల్ ను ప్రకటించిన విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నం నోటా నిర్మాతలతో భాగస్వామిగా చేరాడు. రెండో ప్రయత్నంగా తనకు పెళ్లిచూపులు సినిమాతో హీరోగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
‘మిత్రోం’ ఇది తగునా..?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కామెడీతో ఆకట్టుకున్న పెళ్లిచూపులు తరుణ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే కాదు. దర్శకుడిగా రచయితగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిపెట్టింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో మిత్రోం పేరుతో రీమేక్ చేశారు. సెప్టెంబర్లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. నేటివిటీ పరంగా మార్పులు చేసిన ట్రైలర్లో ప్రతీ సీన్ ఒరిజినల్ వర్షన్లో కనిపించిందే. అయితే టైటిల్ లో మాత్రం ఎక్కడా తరుణ్ భాస్కర్ ప్రస్తావన్ లేదు. కథా కథనాలు పెళ్లి చూపులు నుంచే తీసుకున్నారు కాబట్టి తప్పుకుండా తరుణ్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్గా కథా కథనాలు తయారు చేసిన తరుణ్భాస్కర్కు క్రెడిట్ ఇవ్వకపోగా రచయితగా శరిబ్ హష్మీ పేరు వేశారు. దీంతో హిందీలో రీమేక్ చేసిన దర్శక నిర్మాతలు క్రెడిట్ ఇవ్వకపోవటం అన్యాయం అన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై మిత్రోం చిత్ర దర్శకుడు నితిన్ కక్కర్, నిర్మాత విక్రమ్ మల్హోత్ర ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఈ 'నలుగురు'
శ్రీనగర్కాలనీ: ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. సినిమా ఇలా కూడా తీయొచ్చని నిరూపించింది. నలుగురు స్నేహితుల జర్నీని చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు తరుణ్భాస్కర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురిలో... ముగ్గురు పక్కా హైదరాబాదీలు. ఇక్కడే పుట్టి పెరిగారు. మరొకరు గుంటూరు అబ్బాయ్. వీరిలో ఇద్దరు జాబ్ వదిలేసి, మరో ఇద్దరు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ నలుగురిని ‘సాక్షి’ పలకరించగా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విశేషాలివీ... బిర్యానీ ఇష్టం... నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. నా అసలు పేరు దినేష్నాయుడు. స్క్రీన్ నేమ్ విశ్వక్సేన్ నాయుడు. ముచ్చటగా మూడో పేరు ఈ చ్రితంలో వివేక్. జర్నలిజం డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశాను. ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నగర సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన ఉంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నటుడు కావాలని ఉండేది. నటన, డ్యాన్స్ మీద ఆసక్తితో డ్యాన్స్ స్కూల్ నడిపాను. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ అయ్యాను. నటన మీద పట్టు వచ్చాక ‘వెళ్లిపోయాకే’ అనే చిత్రంలో హీరోగా చేశాను. అనంతరం ఓ మళయాల చిత్రం హక్కులు కొని నా స్వీయ దర్శకత్వంలో సినిమా తీద్దామనుకునే సమయంలో తరుణ్భాస్కర్ నుంచి పిలుపొచ్చింది. ఆడిషన్కు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. చిత్రంలో లీడ్ రోల్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొత్త సినిమా అవకాశాలు వస్తున్నాయి. (విశ్వక్సేన్ నాయుడు– చిత్రంలో వివేక్) డైరెక్షన్ టు యాక్షన్ మాది గుంటూరు. నగరంలోని మాసబ్ట్యాంక్లో ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. ఫ్రెండ్ ద్వారా దర్శకుడు తరుణ్భాస్కర్ని కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. చిత్రంలో ఓ పాత్ర కోసం మేము ఆడిషన్ నిర్వహించాం. అయితే ఎవరూ సెట్ కాకపోవడంతో, నా బిహేవియర్ చూసి తరుణ్భాస్కర్ ఆడిషన్ ఇవ్వమన్నారు. నాకు నటించడం చేతకాదని చెప్పాను. అయినా ఆడిషన్ ఇవ్వమన్నారు. రూమ్లో ప్రిపేర్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను. తరుణ్భాస్కర్కి నచ్చడంతో చిత్రంలో ఉపేంద్ర పాత్ర ఇచ్చారు. చిత్రంలో ఉప్పు పాత్రకు మంచి స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. స్పైసీ ఫుడ్ ఇష్టం. నాకు రాయడం చాలా ఇష్టం. మంచి రచయితగా, నటుడిగా ఇండస్ట్రీలో ఉండాలన్నదే నా ఆశయం. (వెంకటేష్ కుకుమాను – చిత్రంలో ఉపేంద్ర) ఐ లైక్ లాంగ్డ్రైవ్... నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే ఇంటర్ వరకు చదివాను. తర్వాత యూఎస్లో ఎకనామిక్స్లో డిగ్రీ చేశాను. నగరానికి తిరిగొచ్చి, ఒక నెల రీసెర్చ్ అనలిస్ట్గా జాబ్ చేశాను. ఫ్రెండ్ ద్వారా దర్శకుడు తరుణ్భాస్కర్ని కలిశాను. పెళ్లిచూపుల తర్వాత మరో సినిమా తీసేందుకు వాళ్లు అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆడిషన్కి వెళ్లి సెలెక్ట్ అయ్యాను. సినిమాలో మంచి పాత్ర చేసినందుకు, ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో లాంగ్డ్రైవ్స్కి వెళ్తుంటాను. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. (సాయి సుశాంత్రెడ్డి – చిత్రంలో కార్తీక్) నాంపల్లి నా అడ్డా... నాంపల్లి నా అడ్డా... విజ్ఞాన్ కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. ఆ తర్వాత డెల్ కంపెనీలో రీసెర్చ్ అనలిస్ట్గా జాబ్ చేశాను. కానీ నాకు జాబ్ సెట్ అవ్వదని అనిపించింది. థియేటర్కి వెళ్లాను. అక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. థియేటర్ ఆర్టిస్ట్గా చేస్తూనే.. ఐదు షార్ట్ఫిలిమ్స్ కూడా చేశాను. సోషల్ మీడియాలో నా నటన చూసి ‘జగన్నాటకం’ అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాను. ఆడిషన్స్కు వెళ్లి తరుణ్భాస్కర్ చిత్రానికి ఎంపికయ్యాను. డిఫరెంట్ పాత్రలు చేయాలన్నదే నా ఆశ. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. (అభినవ్ గోమటం – చిత్రంలో కౌషిక్) -
రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరాణి ‘సంజు’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట. సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. -
‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
టైటిల్ : ఈ నగరానికి ఏమైంది? జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : డి. సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్. కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్ రేంజ్లో సినిమా కూడా సక్సస్ అయ్యిందా..? కథ; ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. (సాక్షి రివ్యూస్) ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్ ఫిలింస్ తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్కి ఓనర్ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు.(సాక్షి రివ్యూస్) చిన్న చిన్న పంచ్ డైలాగ్స్తో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో సుశాంత్, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. విశ్లేషణ ; పెళ్లిచూపులు లాంటి క్లాస్ సినిమా తరువాత పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించిన ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. `జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే` లాంటి డైలాగ్స్ మనసును తాకుతాయి. (సాక్షి రివ్యూస్) ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్గా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్ ప్రేమకథ, బ్రేకప్ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్ తో వేగంగా కథ నడిచినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. వివేక్ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; అక్కడక్కడా నెమ్మదించిన కథనం లవ్ స్టోరి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
రానాతో తరుణ్ భాస్కర్ మూవీ?
పెళ్లి చూపులు సక్సెస్తో తరుణ్ భాస్కర్ డైరెక్టర్గా సక్సెస్ సాధించారు. సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. తన రెండో సినిమాను కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది? అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. జూన్ 29న రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, రానా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో.. చిత్రబృందం సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. తరుణ్ భాస్కర్ తరువాతి మూవీ కూడా ఇదే బ్యానర్లో ఉండబోతోందని, ఆ సినిమాలో రానా హీరోగా నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఒకే రోజు 7 సినిమాలు
ఈ నెలాఖరున వెండితెర మీద సినిమా పండుగ కనిపించనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు జూన్ 29న రిలీజ్కు రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోలు బరిలో లేకపోవటంతో చిన్న సినిమాలు వరుస రిలీజ్లకు క్యూ కడుతున్నాయి. అయితే ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. 29న రిలీజ్ అవుతున్న సినిమాలో కాస్త హైప్ ఉన్న ఒకే ఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది..?’ పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా యూత్ను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. జబర్దస్త్ ఫేం షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన శంభో శంకర కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నందు హీరోగా తెరకెక్కిన కన్నుల్లో నీ రూపమే, గ్రాఫిక్స్ ప్రధానంగా రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన సంజీవని, రవిచావలి డైరెక్ట్ చేసిన సూపర్ స్కెచ్, మోహన్ లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా యుద్ధభూమి జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. -
‘సిస్టర్.. ఎంకరేజ్ న్యూ టాలెంట్.. ప్లీజ్’
తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయిన ఈ నగరానికి ఏమైంది..? అనే పదాన్నే సినిమా టైటిల్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ మరోసారి విభిన్న కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన నటీనటులు విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్లతో పాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. -
‘ఈ నగరానికి ఏమైంది?’
-
నీ గ్యాంగ్తో రా.. చూస్కుందాం!
సాక్షి, హైదరాబాద్ ; పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ రెండో చిత్రం ఓ కొలిక్కి వచ్చేసింది. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ ఎట్టకేలకు షూటింగ్ను పూర్తి చేసేసుకుంది. నీ గ్యాంగ్తో రా థియేటర్కి .. చూస్కుందాం అన్న ఫన్నీ కాప్షన్తో మేకర్లు ఓ పోస్టర్ను వదిలారు. కెమెరా, క్లాప్ తదితర సామాన్లతో నడుస్తూ వెళ్తున్న నలుగురు యువకులతో ఆ పోస్టర్ ఉంది. ఆ యువకుల జీవితంలో జరిగే విషయాలు.. లక్ష్యాలు... తదితర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. దాదాపు కొత్తవారితోనే ఈ చిత్రం రూపొందింది. ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్కు అద్భుతమైన స్పందన వచ్చిందన్న నిర్మాతలు.. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు దగ్గుబాటి హీరో రానా కూడా తన ట్వీటర్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. The next from SureshProductions #EeNagaranikiEmaindhi directed by #TharunBhascker pic.twitter.com/Ftd0MWBKo3 — Rana Daggubati (@RanaDaggubati) 26 April 2018 -
'పెళ్లిచూపుల'కు సూపర్ వసూళ్లు!
చెన్నై: అందమైన కథ. వినూత్న కథనం. చిన్న బడ్జెట్. పెద్ద విజయం. తాజాగా విడుదలై విజయాన్ని సాధించిన 'పెళ్లిచూపులు' సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ నాలుగు మాటలు సరిపోతాయేమో! తెలుగునాట చక్కని ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమా అమెరికాలోనూ కలెక్షన్లపరంగా గొప్ప మైలారాయిని దాటింది. అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా (రూ. 6.78 కోట్ల) వసూళ్లను రాబట్టింది. పెట్టుబడిపరంగా చూసుకుంటే నిర్మాతకు ఇది పెద్దమొత్తంలో లాభమని చెప్పొచ్చు. 'శనివారం నాటికి 'పెళ్లిచూపులు' మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరింది. అమెరికాలో శనివారం 4.40 గంటల నాటికి 10,11,146 డాలర్ల (రూ. 6.78 కోట్ల)ను వసూలు చేసింది. ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. సూపర్బ్' అంటూ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా అమెరికా హక్కులను రెండు లక్షల డాలర్లకు అమ్మినట్టు తెలుస్తోంది. పెట్టుబడిపరంగా చూసుకుంటే అమెరికాలో ఈ సినిమా అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుందని, నిర్మాతకు గణనీయమైన లాభాలు సాధించిపెట్టిందని మరో ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ తెలిపారు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'పెళ్లిచూపులు'లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో నటించారు.