YSR raithu barosa
-
ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా నిలిచామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెట్టుబడి సాయంతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 64 లక్షల 37 వేల మంది ఖాతాలకు 1,294 కోట్ల రూపాయలు బదిలీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
Live: వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం
-
నేడు మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా
-
ఆర్బీకేలపై గలీజు రాతలు
-
రైతు భరోసా ఎగ్గొట్టారంటూ రామోజీ తప్పుడు రాతలు
-
రబీకి ముందే రైతుల ఖాతాల్లో డబ్బు జమ
-
దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు అండగా నిలుస్తున్నామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భూమి లేని పేదలకు అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారాయన. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడుత నిధుల జమ కార్యక్రమం జరిగింది. ‘‘దేవుడి దయతో ఇవాళ రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి.. వారితో పాటు దేవాదయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24 తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నాం. రెండో మంచి కార్యక్రమం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం రైతన్నల చేతులో పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమో. ఏ వ్యవసాయ భూమి లేని నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ప్రతీ వాళ్లకు నా అని సంభోదిస్తూ అందరికీ అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరణ్యభూములు సైతం సాగు చేసుకునే గిరిజనులకు తోడుగా ఉండే కార్యక్రమం ఇది’’ అని సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తోంది. 2023–24 సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది అని తెలియజేశారాయన. ఇప్పటివరకు.. 50 నెలల కాలంలో 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది(నేటి సాయంతో కలిపి). ఇక మొత్తంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేయగలిగామని అందించామని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో అర హెక్టారులోపు ఉన్న రైతులు దాదాపు 60 శాతం ఉన్నారు. ► ఒక హెక్టారు దాకా దీన్ని తీసుకుపోతే 60 శాతా కాస్తా 70 శాతం పైచిలుకు దాకా పోతోంది. ► రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. ఈ సొమ్ము 60 శాతం మంది రైతులు అందరికీ 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సాయంగా అందుతోంది. ► దీని వల్ల వాళ్లు బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం రాదు. కరెక్టుగా మేలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం. ► పంట వేసే టయానికి, కోసేటప్పుడు వాళ్ల చేతిలో డబ్బులు పడే సరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చింది. ► వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒక్క కార్యక్రమం ద్వారా రూ.13,500 అన్నది హెక్టారులోపు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ► ఇన్పుట్సబ్సిడీకి సంబంధించి మొన్న వర్షాల వల్ల గోదావరి, భారీ వరదలు వచ్చాయి. ► ఈ సీజన్ ముగిసేలోగానే 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఆగస్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్సబ్సిడీగా ఈరోజు రూ.11 కోట్లు వాళ్ల చేతిలో కరెక్టుగా సమయానికి పెట్టడం జరుగుతోంది. ► ఈ గొప్ప కార్యక్రమం ద్వారా రూ.1,977 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తూ రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. దాంతోపాటు ఇప్పటికే 38 కోట్లు ఫ్లడ్ రిలీఫ్లో భాగంగా వాళ్లందరికీ సాయం చేశాం. ► వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నాం. ► పంటలు వేసుకొనేందకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇప్పటికే సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. ► రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగాం అని గమనిస్తే.. ► కళ్ల ఎదుటనే కనిపించే కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పదలచుకున్నా. ► ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. ► గ్రామ స్థాయిలో సచివాలయం, పక్కనే 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. ► అక్కడే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తూ, చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ► బ్యాంకింగ్ సేవలు, కియోస్క్ అక్కడే ఉంది. కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే గొప్ప వ్యవస్థ. ► ఈక్రాప్ వ్యవస్థ అమలవుతోంది. ఏ పంట ఎవరు వేశారనే ఫిజికల్ డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తెస్తున్నాం. ► సోషల్ ఆడిట్లో డిస్ప్లే అవుతోంది. మంచి జరగకుంటే ఎలా కంప్లయింట్ చేయాలనేది అక్కడే రాసుంది. ► వెంటనే రీ వెరిఫై చేసి నష్టం జరగకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది. ► ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధర డిస్ప్లే చేసి తక్కువ ధరకు పడిపోతే ఆర్బీకేలు ఇంటర్ఫియర్ అయ్యి రైతుకు సాయంగా పంట కొనుగోలు చేస్తున్నారు. ► ధాన్యం కొనుగోలు అయితే ఎంఎస్పీ రాని పరిస్థితి నుంచి ఎంఎస్పీ ఇవ్వడమే కాకుండా, గన్నీ బ్యాగ్స్, లేబర్ ట్రాన్స్పోర్టు ఖర్చు ఎకరాకు రూ.10 వేల చొప్పున అదనంగా రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వస్తోంది. ► పంట నష్టపోయిన అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అడుగులు నాలుగేళ్లలో పడ్డాయి. ► ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్ నమోదవుతోంది. ► రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతోంది. ► రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ► మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్గ్రేడ్ చేయాలని డిపార్ట్మెంట్ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్గ్రేడ్ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నాం.. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ► రైతుకు సాగు ఒక్కటే కాకుండా అదనపు ఆదాయం రావాలంటే వ్యవసాయం ఒక్కటే కాకుండా గేదెలు, ఆవులు కూడా రైతులకు తోడుగా ఉండాలి. ► వాటిలోంచి వచ్చే ఆదాయం మెరుగ్గా ఉండాలని, సహకార రంగంలో గొప్ప మార్పు తెస్తూ అమూల్ను తీసుకొచ్చాం. ► ఏకంగా 8 సార్లు అమూల్ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. ► లీటరు గేదె పాలు రూ.22, ఆవు పాలు లీటరుకు రూ.11 పెరిగింది. కేవలం ఈ నాలుగు సంవత్సరాల మనందరి ప్రభుత్వంలో జరిగిన మార్పులకు తార్కాణం. ఈరోజు చేస్తున్నవి కూడా అందులో భాగంగా కొనసాగిస్తున్నాం. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేశారు సీఎం జగన్. -
రైతన్న కష్టాలు తీరేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
-
చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ లేవు: సీఎం వైఎస్ జగన్
-
పత్తికొండ సభకు తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
కరువుల్లేవ్.. వలసలు తగ్గాయ్: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మధ్య మీ బిడ్డకు, మీ అన్నకు మీరు తోడుగా ఉంటున్నందుకు ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈ రోజు రైతన్నల కోసం, పొలాల్లో శ్రమించే ఆ కష్ట జీవుల కోసం పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దాదాపుగా 52.30 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు ఈ రోజు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.3900 కోట్లు జమ చేయబోతున్నాం. వరుసగా ఐదో ఏడాది– తొలివిడత సాయం.. ఈ రోజు మేనిఫెస్టోలో రైతన్నలకిచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే ప్రభుత్వంగా వైఎస్ఆర్ రైతుభరోసా– పీఎం కిసాన్ ఐదో ఏడాది తొలివిడత సాయం ఇక్కడ నుంచే విడుదల చేస్తున్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, పెట్టుబడి కోసం రైతన్న అప్పులు పుట్టని పరిస్థితి ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. చెప్పిన దాని కన్నా మిన్నగా - రైతుభరోసా... రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టారు కూడా లేని రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతులు దాదాపు 50 శాతం ఉన్నారు. అటువంటి ప్రతి రైతుకు మంచి జరగాలన్న తపనతో ప్రతియేటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాలలో రైతలు చేతుల్లో రూ.50వేలు పెడతామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. ఈ రోజు మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా... ఈ రోజు రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లు అని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతులు ఇబ్బంది పడకూడదని ఐదేళ్లు ఇస్తామని చెప్పి.. రూ.50వేలు కాకుండా రూ.67,500 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినదానికన్నా మిన్నగా.. ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా ఇచ్చే దిశగా అడుగులు వేశాం. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పై చిలుకు మంది రైతులకు.. ప్రతి రైతుకు రూ.54వేలు వైఎస్ఆర్ రైతుభరోసాగా ఆ కుటుంబం చేతిలో పెట్టాం. ఈ దఫా ఇచ్చే రూ.7,500 కలుపుకుంటే ప్రతి రైతన్న కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.61,500 ఇచ్చినట్టవుతుంది. రైతు భరోసా కింది ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయాన్ని ఐదో ఏడాది తొలివిడతగా ఈ దఫా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాలా రూ.3923 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి రైతుకు రూ.5,500 రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన రూ.2వేలు త్వరలో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. వాళ్లు ఇచ్చేది కాస్తా ఆలస్యమైనా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. మీ బిడ్డ కచ్చితంగా మే నెలలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిపిస్తూ మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ చేస్తున్నాం. ఒక్క రైతు భరోసాతోనే రూ.31వేల కోట్లు సాయం.. ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి కేవలం రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే... రూ.31 వేల కోట్లు జమ చేశాం. ఈ రోజుమరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పును మీ బిడ్డ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ సీజన్లోనైనా పంట నష్టం జరిగితే... ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పెడితే ఆ రైతన్న తన కాళ్లమీద తాను నిలబడగలుగుతాడని చెప్పి... ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. రూ. 54 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ.. ఈ సారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా, రైతన్న ఇబ్బంది పడకూడదని ఈ సంవత్సరం మార్చి, ఏఫ్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.54 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా జమ చేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా 22.70 లక్షల మంది రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్లో రైతన్నలను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.1965 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం. సాగులో విప్లవాత్మక మార్పులు... మన ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు ఈ రంగంలో తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పది.. రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాలంలో ఇలాంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా? రైతు భరోసా కేంద్రాల ఊసే అప్పుడు లేదు. మన ప్రభుత్వంలో గ్రామస్ధాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, చేయిపట్టుకుని నడిపిస్తూ.. 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా,అండగా ఉంటూ వారితో పాటు కలిసి అడుగులు వేస్తున్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ వీటన్నింటినీ ఒక్కచోటుకి తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది. 2014–19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నుల మాత్రమే ఉంటే... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ప్రతిఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి గమనిస్తే.. చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నుల మాత్రమే ఉంటే...మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 332 లక్షల టన్నులకు పెరిగింది. తేడా గమనించండి. బాబు పాలనంతా కరువే.. గతంలో చంద్రబాబు హయాలంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే.. కరువు. బాబు హయాలంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలు కరవు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అప్పట్లో 1623 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరవు మండలాలుగానే ఉండేవి. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడిదయతో మంచి వానలు పడ్డాయి. కరువులు లేవు. వలసలు కూడా తగ్గాయి. నాటికీ – నేటికీ తేడా చూస్తే... దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగింది. గతంలో చంద్రబాబు పాలనలోని ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద రుణాల మీద 40.60 లక్షల మంది రైతన్నలకు కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందిస్తే.. మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీ కింద రూ.1835 కోట్లు ఇచ్చాం. 74 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద ఇవ్వకుండా పెట్టిన బకాయిలు సైతం మీ బిడ్డ హయాంలో చిరునవ్వుతో చెల్లించాం. గతంలో చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతులకు కేవలం ఐదేళ్లలో రూ.3411 కోట్లు పంటల బీమా కింద ఇస్తే... మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో మాత్రమే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో 44లక్షల మంది రైతన్నలకు రూ. 6685 కోట్లు బీమాగా చెల్లించాం. ఈ సంవత్సరం కూడా నిరుడు ఖరీప్కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా జూలై 8, (నాన్నగారి పుట్టిన రోజు) వైఎస్ఆర్ జయంతి రోజున జమ చేయనున్నాం. ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమయం కట్టాల్సిన అవసరం లేకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా, పూర్తిగా బీమా ప్రీమియం కూడా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే. మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇ–క్రాప్ బుకింగ్ జరుగుతుంది. రైతుల పేరులన్నీ సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో డిస్ప్లే చేస్తున్నారు. గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీ బిడ్డ హాయంలోనే జరుగుతున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో ఇ– క్రాప్ అనే మాటే లేదు. ఆర్బీకే అన్న మాటే లేదు. సోషల్ ఆడిట్ కింద మొత్తం జాబితా పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా గమనించండి. ధాన్యం సేకరణలో నాడు– నేడు మరోవైపు ధాన్యం సేకరణ మీద కూడా గతానికి ఇప్పటికి ఉన్న తేడా గమనించండి.గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో సేకరించిన మొత్తం ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే, మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సేకరించిన ధాన్యం మొత్తం 3.09 కోట్ల టన్నులు. ఇంకా రబీలో సేకరణ జరుగుతుంది. ఎన్నికల్లోగా మరో ఏడాది ధాన్యం సేకరణ మళ్లీ జరుగుతుంది. గతంతో పోలీస్తే.. అప్పుడు ఏటా సగటున 53 లక్షల టన్నుల సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఇవాళ సగటున ఏటా 75 లక్షల టన్నుల సేకరిస్తున్నాం. ధాన్యం సేకరణపై గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఇప్పటికే రూ.60వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేశాం. రబీ పూర్తి కాలేదు. ఐదేళ్లకు ఇంకా మరో ఏడాది పెండింగ్ ఉంది. అది కూడా కలుపుకుంటే కనీసం రూ.77వేల కోట్లు అవుతుంది. తేడా మీరే చూడండి. అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు విత్తనాలు దగ్గర నుంచి ఎరువులు వరకు నకిలీలు గుర్తించే విషయంలోనైనా, భూసార పరీక్షలు చేసే విషయంలోనూ, గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజవర్గస్ధాయిలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు కనిపిస్తున్నాయి. 2 జిల్లా స్ధాయి ల్యాబ్లు, మరో 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు కడుతున్నాం. మరో 11 జిల్లా స్ధాయి ల్యాబ్స్ నిర్మాణం మొదలయ్యింది. ఆర్బీకే స్ధాయిలో కూడా సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ దిశగా అడుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీకేలు గ్రామ స్ధాయిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే... మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. రైతన్నలకు పంట ఎంత ముఖ్యమో.. భూమిమీద సర్వహక్కులు కూడా వారికి అంతే ముఖ్యం.వందేళ్లక్రితం బ్రిటీష్ హయాంలో భూసర్వే జరిగితే... ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్ధాయిలో సరిహద్దు రాళ్లు లేవు. గ్రామస్ధాయిలో సబ్డివిజన్ అప్డేట్ కార్యక్రమం కూడా జరగలేదు. భూవివాదాలు గ్రామాల్లో మన కళ్లెదుటనే కనిపిస్తున్నా.. పరిష్కారం రాని పరిస్థితులలో రైతులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వంగా.. వీరికి మంచి జరగాలని మన ప్రభుత్వం హయాంలో వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులు నిర్ణయించి, సర్వేరాళ్లను పాతించి, రికార్డులన్నీ అప్డేట్ చేయించి, వివాదాలకు ఏమాత్రం తావులేకుండా రైతన్నల చేతిలో భూహక్కు పత్రాలను పెట్టే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు... గ్రామ సచివాలయాలన్నింటిలోనూ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ అక్కడే జరగాలన్న ఆలోచనతో.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వహక్కులు వారికి ఇప్పించాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూముల మీద, బ్రిటీష్ కాలం నుంచి పెండింగ్లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వ హయాలంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద సర్వహక్కులూ రైతులకు ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనది. 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ కోసం.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకూడదని, పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే. రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే.. రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫీడర్లను బలపరుస్తే తప్ప ఉచిత విద్యుత్ ఇవ్వలేమంటే మీ బిడ్డ హయాంలో ఆ ఖర్చు కూడా చేసి ఫీడర్లను బలపర్చే కార్యక్రమం చేశాం. ఆక్వా సాగుకు సాయంగా.... ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటివరకూ ఈ ఆక్వా రైతులకు మంచి చేస్తూ.. వాళ్లందరి తరపున నిలబడి వారికి రూ.2967 కోట్ల సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరించింది. దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కరవుసీమగా పేరున్న రాయలసీమ కూడా కళకళలాడుతుంది. రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఎప్పుడూ ఊహకందని విధంగా పెరిగాయి. రైతన్నలకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి, రైతన్న వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, వ్యవసాయం మీద వచ్చే ఆధాయానికి అదనంగా ఇంకా ఆధాయం రావాలని చెప్పి వారికి తోడుగా నిలబడుతూ.. అక్కచెల్లెమ్మలకు మరో నాలుగు రూపాయలు అదనంగా రావాలన్న తపనతో అమూల్ను తీసుకొచ్చి, రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన అమూల్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం. అమూల్– పాడి రంగంలో మార్పులు.. అమూల్ ఇక్కడకు వచ్చింది కాబట్టి.. అంతకముందు దోచుకుంటున్న హెరిటేజ్ వంటి పాలడెయిరీలన్నీ తలవంచి పాడిరైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్ వచ్చేనాటికి ఇప్పటికీ పాలధరల్లో తేడా చూస్తే... అమూల్ వచ్చిన తర్వాత నాలుగు సందర్భాలలో ధరలు పెంచుకుంటూ పోయింది. లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు ధర అమూల్ పెంచింది. దీంతో హెరిటేజ్ వంటి పాలడెయిరీలు కూడా రేటు పెంచకతప్పనిసరి పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. మీ బిడ్డ హయాంలో ఆర్బీకే స్ధాయిలోనే ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అన్నది పోస్టర్లు ద్వారా డిస్ప్లే చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్ధతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మార్కెట్లో పోటీ పెరిగి ఈ రోజు ప్రతీ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర ఆర్బీకే స్దాయిలోనే వచ్చేట్టు, దళారులు లేకుండా అమ్ముకునే కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతోంది. మూగజీవాల కోసమూ... పశునష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్ఫాం రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలుచేసి.. తద్వారా అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడ్డాం. వైఎస్ఆర్ పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు సైతం 340 ఆంబులెన్స్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో యానిమల్ డిసీజెస్ డయాగ్నొస్టిక్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. చంద్రబాబు పెట్టిన బకాయిలూ చెల్లించాం... చివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. అప్పట్లో చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ మన ప్రభుత్వమే చెల్లించింది. రూ.8845 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన విద్యుత్ బకాయిలునూ రైతన్నల కోసం మన ప్రభుత్వమే చెల్లించింది. ఫామ్ మెకనైజేషన్ అన్నది ఎప్పుడూ జరగని విధంగా చేస్తున్నాం. గతంలో ఎవరికిచ్చామో, ఎందుకిచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విధానం తీసుకొచ్చాం. ఫామ్ మెకనైజేషన్... ప్రతి ఆర్బీకే స్దాయిలో ఒక సీహెచ్సీ(కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ను) స్ధాపించాం. ప్రతి ఆర్బీకే స్దాయిలోనూ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫామ్ మెకనైజేషన్ కోసం రూ.1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికాలను ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఆర్బీకే స్ధాయిలో రైతులు ఒక గ్రూప్ కింద ఏర్పడి వారు కేవలం 10 శాతం చెల్లిస్తే.. 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరో 50 శాతం రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఆర్బీకే స్ధాయిలోనే దాదాపు రూ.15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న రైతులు ఆ వ్యవసాయ ఉపకరణాలను మిగిలిన రైతులకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి వారికి మేలు జరిగే విధంగా ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఇప్పుడు అర్ధవంతంగా సాగుతుంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్ధాయిలోనే డ్రోన్లు తీసుకువచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ మన రైతులే డ్రోన్లు ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా.. బాధ్యతతో, రైతుల మీద మమకారంతో చేసాం. నేరుగా రైతులకిస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతుకు మేలు జరిగేటట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా పేద కుటుంబాలన్నింటికీ వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తున్నాం. రైతుల కోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మనది అయితే.. మరోవంక రైతుకు శత్రువైన చంద్రబాబు నాయుడుని చూడండి. సాగు దండగన్న బాబు... వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమవుతాయని చెప్పాడు. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి, పొరపాటున ఓటు వేసిన రైతులను చంద్రబాబు నిలువుగా ముంచాడు. రాజమండ్రిలో డ్రామా షో... నిన్నకాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామ కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అందులో 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని .. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, శకపురుషుడని, ఆ మనిషి రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండ వేశారు. మహానాడులో సాక్షాత్తుగా జరుగుతున్న డ్రామా ఇది. ఆ మహానాడు డ్రామాకు మందు వీళ్లంతా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటంటే... తమ పార్టీ ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ముందే ప్రకటించారు. మేనిఫెస్టోను ఆకర్షణీయమైన అని సంబోంధించి ప్రకటించడం..నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యమనిపించింది. ఈ మాట వింటే కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకువస్తాయి. పూతన, మారీచుడు, రావణుడు కలిసి చంద్రబాబులా... పసిపిల్లవాడైన కృష్ణుడుని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెపుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగా మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకువచ్చింది. అందమైన మాయ లేడీ రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్ మార్చుకుని భవతీ భిక్షాందేహీ అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ ముగ్గురు ఆత్మలూ కలిసి, ఈ మూడు క్యారెక్టర్లూ కలిపి మన ఏపీలో ఒక మనిషిగా నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి జన్మించాడు. బాబు – విలువలు, విశ్వసనీయత లేని క్యారెక్టర్.. మేనిఫెస్టో పేరుతో ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు. వాగ్ధానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారి క్యారెక్టర్ ఏమిటంటే ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు, విశ్వసనీయత అçసలే లేవు. తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీరామారావునైనా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనుకాడడు. చంద్రబాబు పొలిటిలక్ ఫిలాసపీ ఏమిటంటే... ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. మేనిఫెస్టోను చూపిస్తూ.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెపుతూ.. దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతారు. అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందన్నది బాబుకు తెలుసా ? మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందో ఈ పెద్ద మనిషికి అవగాహన ఉందా ? మన మేనిఫెస్టో... ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర, పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారిæ గుండెచప్పుడుగా పుట్టింది. మన రైతులు, మన పేదలు, నా అక్కచెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాలు నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం, వారికి మంచి భవిష్యత్ చూపించడం కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. బాబు మేనిఫెస్టో – బిసిబెళ బాత్... చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు. వారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి.. ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజీపీ కాంగ్రెస్ రెండూ ఎదురెదురుగా తలపడి, రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక బిసిబెళ బాత్ వండేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అంతటితో సరిపోదు అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, చేయూత, రైతుభరోసా మన పథకాలన్నీ కలిపేసి ఇంకో పులిహోర వండేశాడు. వైయస్సార్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలూ కాపీ, బీజీపీ పథకాలూ కాపీ, కాంగ్రెస్ పథకాలూ కాపీ. చివరకు బాబు బ్రతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీలేదు. కేరెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంత కన్నా లేదు. పోటీ చేసేందుకు ఈపెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది కేండిడేట్లు కూడా లేని పార్టీ ఇది. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ... మైదానాల్లో మీటింగ్లుపెడితే జనం రారని, మనుషులు చనిపోయినా ఫర్వాలేదని ఇరుకైన సందులు, గొందులు వెదుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబు పార్టీ. జనంలో లేని బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే వీళ్ల పార్టీ ఫిలాసపీ. ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి – బాబు 1995లోనే సీఎం అయ్యి కూడా... సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఎన్నికలు మరలా వస్తుంటే... ఈ పెద్ద మనిషి ఏం అడుగుతాడంటే.. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా. మరో ఛాన్స్ ఇవ్వండి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోటిలోనుంచి మాటలు రావు. డీబీటీ రూపంలో మీ ఇంటికి ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇళ్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని, గ్రామానికి మంచి చేశానని, పిల్లలకు ఈ మంచి చేశానని కనీసం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకునే చరిత్రలేని వ్యక్తి చంద్రబాబు ఆయన పార్టీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు.. కానీ చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేని పరిపాలన ఆయన హయంలో సాగింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్ల ముందు నిలబడి మీ ఇంటికి ఈ మంచి చేశానని చెప్పలేని బాబు, సామాజిక వర్గాల ఎదురుగా నిలబడి మీకు ఈ మాట ఇచ్చి, నెరవేర్చా అని చెప్పలేని ఈ బాబు, ఏం చేశాడో తెలుసా ? నమ్మిన రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, యువతను, అవ్వాతాతలని అందరినీ హోల్సేల్గామోసం చేశాడు. అందరికీ అప్పులు పాలుజేసి, నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. చంద్రబాబు –మొదటి సంతకమే మోసం మామాలుగా ఎవరైననా ముఖ్యమంత్రి అయ్యి.. మొదటి సంతకం చేస్తే దానికి క్రెడిబులిడీ ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొదటి సంతకాలనే మోసం, వంచన, దగాగా మార్చి.. మరోసారి మళ్లీ కొత్త వాగ్ధానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలెట్టాడన్నది గమనించండి. మంచి చేయడం అన్నది చంద్రబాబు డిక్షనరీలో లేనేలేదు. ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయడం, ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి.. నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం, సత్తా ఈ మనిషి డిక్షనరీలోనే లేవు. చంద్రబాబు నాయుడు ఆయన గజదొంగల ముఠాలో వారికి తోడుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్లు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. వీరిది అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకంటే... దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకుని తినడానికి. పేదలకు– పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం... రాబోయే రోజుల్లో ఎన్నికల్లో యుద్ధం జరగబోతుంది. ఈ కురుక్షేత్రంలో.. యుద్దం జరగబోతున్నది వారు దోచుకోవాడనికి, పంచుకోవడానికి, తినడానికి మధ్య... మన ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకివెళ్లే కార్యక్రమం (డీబీటీ) మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారీ డీపీటీ కావాలో.. మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలో ఆలోచన చేయండి. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు పెత్తందారీ భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్దం జరుగుతుంది. రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదు... ఇక్కడ పేదవాడు మనవైపు ఉంటే.. అటువైపు ఉన్న పెత్తందార్లతో యుద్దం జరుగుతుంది. వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్దం జరుగుతుంది. ఒకవైపు మీ బిడ్డ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే మాట ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ నోట నుంచి వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలోని కేబినెట్లో ఈ రోజు 65 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కనిపిస్తారు. మీ బిడ్డ హయాంలో 5 గురు డిప్యూటీ సీఎంలు ఉంటే వారిలో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ సోదరులే కనిపిస్తారు. ఒకవైపు మీ బిడ్డ హయాంలో ప్రతి అడుగులోనూ నా అనే మాట వినిపిస్తుంది. చంద్రబాబు మాత్రం... కానీ అటువైపున మాత్రం ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న మాట వినిపిస్తుంది. బీసీల తోకలు కత్తరిస్తా అని అప్పట్లో వెటకారం చేసిన మాటలు వినిపిస్తాయి. చివరకి అక్కచెల్లెమ్మలను సైతం వదలకుండా... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా ? అని వెటకారం చేసిన మాటలుకనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు.... మీ బిడ్డ హయాంలో మనం చేసిన, కనిపిస్తున్న మంచికి మధ్య యుద్దం జరుగుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. వీరిది ఈ రోజు జగన్తో కాదు యుద్ధం, పేదలతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా నిలబడకపోవచ్చు. ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు. మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను మాత్రమే. నా ధైర్యం మీరే... నేను గర్వంగా చెప్తున్నాను. నా నమ్మకం మీరు. నా ధైర్యం మీరు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. వాళ్లు చెప్తున్న అబద్దాలను నమ్మకండి. వారు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ?లేదా ? అన్నదానిని మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు రాష్ట్రం పట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నలు ముఖాల్లో చిరునవ్వులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదీ చదవండి: 63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు -
రైతులతో ముచ్చటించిన సీఎం వైఎస్ జగన్
-
వాస్తవ దూరమైన కథనం.. అది ‘ఈనాడు’ ఆత్మఘోష
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంతో పగ్గాలు చేపట్టింది మొదలు సీఎం వైఎస్ జగన్ ప్రతీ అడుగు రైతు సంక్షేమం దిశగానే వేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్కు ముందుగానే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో పంట రుణాలు అందిస్తున్నారు. వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రైతులకు నేరుగా రూ.1.28 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్లకు పైగా బకాయిలను చెల్లించింది. ఇంతలా అన్నదాతలకు అండగా నిలుస్తుంటే కడుపు మంట తట్టుకోలేక ఈనాడు నిత్యం రోత రాతలు రాస్తూ ప్రభుత్వంపై అదే పనిగా బురద చల్లుతోంది. మూడేళ్లలో రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. మూడేళ్లలో ఇప్పటి వరకు రూ.23,875.29 కోట్లు అందించారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు బీమా పరిహారం ఇచ్చారు. రూ.లక్ష లోపు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్న్ ముగియకుండానే వడ్డీ రాయితీని అందిస్తున్నారు. ఇలా గత బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282.11కోట్లు చెల్లించారు. మూడేళ్లలో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మందికి రూ.1,612.80 కోట్ల పంట నష్టపరిహారాన్ని సీజన్ ముగియకుండానే అందించారు. ఆర్బీకేల ద్వారా 1.12 కోట్ల మందికి సేవలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా గత 27 నెలల్లో 1.12 కోట్ల మందికి సేవలందించారు. ఆర్బీకేల ద్వారా 34.65 లక్షల మంది రైతులకు రూ.564.50 కోట్ల విలువైన 19.22 లక్షల టన్నుల విత్తనాలు, 13.62 లక్షల మంది రైతులకు రూ.529.24 కోట్ల విలువైన 5.16 లక్షల టన్నుల ఎరువులు, 1.51 లక్షల మందికి రూ.14కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను పంపిణీ చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా కోసం జిల్లా, రాష్ట్ర, నియోజక వర్గ స్థాయిలో రూ.213 కోట్ల అంచనాతో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు తీసుకొచ్చారు. ఆర్బీకే స్థాయిలో రూ.587.64 కోట్లతో 6781, రూ.161.50 కోట్లతో 391 క్లస్టర్స్థాయిలో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జలకళ కింద రూ.5,715 కోట్లు వెచ్చిస్తూ రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా 2 లక్షల బోరు బావులు తవ్వుతున్నారు. ఉచిత విద్యుత్ కోసం మూడేళ్లలో రూ.25,561 కోట్లు ఖర్చు చేశారు. పంటవేసే సమయంలోనే కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా మూడేళ్లలో రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6,903 కోట్ల విలువైన ఇతర పంటలను కొనుగోలు చేశారు. ఇవేమీ ఈనాడుకు కనిపించలేదు. సింగిల్కాలం వార్త కూడా రాసిన పాపాన పోలేదు. అందులో వాస్తవాలు లేవు.. అన్నదాతలు ఆత్మఘోష కధనం వాస్తవ విరుద్ధంగా ఉంది. 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు పేర్కొనటంలో వాస్తవం లేదు. 2020తో పోలిస్తే 2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2022లో ఇప్పటి వరకు 74 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులు పలు కారణాలతో చనిపోతుంటారు. అది రైతుల ఆత్మహత్యల కిందకు రావు. ఏ కారణంతో చనిపోయినా వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం అందచేస్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ తప్పుల తడకలే.. అడుగడుగునా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు భజన పత్రిక ఈనాడు ‘అన్నదాతల ఆత్మఘోష’ అంటూ సోమవారం వాస్తవ దూరమైన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఏపీలో 2020లో 889 మంది, 2021లో 1,065 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 2020తో పోలిస్తే 2021లో 19.79 శాతం మేర ఆత్మహత్యలు పెరిగిపోయినట్లు అచ్చు వేసింది. వాస్తవానికి 2020లో 287 మంది, 2021లో 223 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు త్రిసభ్య కమిటీలు నిర్ధారించాయి. బాధిత కుటుంబాలకు రూ.7లక్షలు చొప్పున పరిహారం కూడా అందించారు. టీడీపీ హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్ప డితే అసలు వారు రైతులే కాదని, అవి ఆత్మహత్యలే కాదన్నట్లుగా రికార్డుల్లో కూడా నమోదు చేసేవారు కాదు. ఈ కారణంగా టీడీపీ హయాం లో ఐదేళ్లలో 1,004 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించగా, వారిలో పరిహారం ఇచ్చింది 531 మందికే. చంద్రబాబు ఎగ్గొట్టిన మిగతా 473 మంది బాధిత రైతు కుటుంబాలకు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున రూ.23.65కోట్ల పరిహారాన్ని అందించింది. రైతన్నలు ఏ కారణాలతో చనిపోయినా వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా త్రీమెన్ కమిటీ నిర్ధారణే కొలమానంగా ఆత్మహత్యకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు. మూడేళ్లలో 900 మంది మృత్యువాతపడగా, రూ.7 లక్షలు చొప్పున రూ.63 కోట్ల పరిహారాన్ని అందించారు. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు సాగు సంబంధిత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలు కావు కాబట్టి రైతుల ఆత్మహత్యల పరిధిలోకి రావన్న విషయాన్ని ఈనాడు విస్మరించడం విడ్డూరంగా ఉంది. -
‘మత్తు’కు ముకుతాడు.. ఏపీ సర్కార్ చర్యలతో అడ్డుకట్ట
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది. (ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు ఆపరేషన్ పరివర్తన్ ఇలా.. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. ► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు. ► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది. ► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు. ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ ► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది. ► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. ► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. ► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు ► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు. ► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు. ► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు. ► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు. ► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు. ► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి. దేశంలోనే తొలిసారి గంజాయి, ఇతర డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గిరిజనుల జీవితాల్లో వెలుగు గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రాగులు పంట వేశాను ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం. – పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి మా బిడ్డల భవిష్యత్ కోసమే మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం. – బేతాయమ్మ, రైతు, వాకపల్లి ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. – లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి ఈ–క్రాపింగ్ చేస్తున్నాం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్ -
సాగు.. బహు బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో గత మూడేళ్ల కంటే మిన్నగా దిగుబడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు. ఈ సీజన్కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది. మేలు చేస్తున్న వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ప్రారంభమైంది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా మినహా సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1 శాతం అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3 శాతం అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మొక్క నిలదొక్కుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరుకుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఈ సీజన్కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు ç3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.50 కోట్ల విలువైన పురుగుల మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. గతేడాది కంటే మిన్నగా సాగు ఇక సాగు నీటి విడుదల, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగు జోరు పెంచారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు కాగా, జూలై మూడో వారం ముగిసే నాటికి 26.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 25 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 8.30 లక్షల ఎకరాల్లో పత్తి, 5.6 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.32 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. ఈసారి అప్పు చేయాల్సిన అవసరం లేదు నాకు మూడెకరాల సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తున్నా. రైతు భరోసా కింద æరూ.7,500, పంట బీమా పరిహారంగా రూ.18 వేలు వచ్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో చిన్న ట్రాక్టరుకు రూ.70 వేలు సబ్సిడీ అందింది. ఈసారి సాగుకు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. మంచి వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేశాను. – సానబోయిన శ్యామసుందర్, కొత్తపేట, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నా నాకు 12 ఎకరాల పొలం ఉంది. ఎంటీయూ 1061 రకం వరి వేశాను. మాను దశలో ఉంది. పెట్టుబడి సాయం, పంటల బీమా చేతికొచ్చింది. పెట్టుబడికి ఇబ్బంది లేదు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నా. – జి.శ్రీనివాసరావు, ఎస్ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం జిల్లా సాగు ఊపందుకుంటోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. నెలాఖరుకు కనీసం 50 శాతం దాటే అవకాశాలున్నాయి. విత్తనాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రికార్డు స్థాయిలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ జోరుగా సాగుతోంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రైతు గుండెల్లో గుడి కట్టుకున్న సీఎం వైఎస్ జగన్
-
తొలకరికి ముందే రైతన్నకు ‘భరోసా’
కరువన్నదే కానరాలేదు.. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ప్రతి రిజర్వాయర్ సకాలంలో నిండి కళకళలాడింది. అనంతపురం లాంటి కరువు జిల్లాతో సహా అన్ని చోట్లా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు మూడేళ్లుగా అత్యధికంగా సాగు నీరిచ్చాం. నేల తల్లి, వ్యవసాయం, మన గ్రామం, మన సంస్కృతి, రైతు కూలీలు, రైతుల కష్టంపై అవగాహన, మమకారం ఉండాలి. కానీ గత పాలకులకు ఇవేవీ లేవు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్ మొదలు కాకముందే.. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే.. జూన్ కంటే ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచా, కర్మణా గట్టిగా నమ్మి మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. రైతుల స్థితిగతులను మార్చేలా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి క్రమం తప్పకుండా క్యాలెండర్ను అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ నేరుగా జమ చేశారు. పథకం కింద ఈ నెలాఖరున అందించే సాయంతో కలిపితే మొత్తం రూ.3,758 కోట్లు రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయంగా జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను రుచి చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా.. వైఎస్సార్ రైతు భరోసాను అర్హులైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ భూములు) సాగు చేస్తున్న రైతులందరికీ అమలు చేస్తున్నాం. వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది రైతు భరోసా సాయాన్ని ఇవాళ గణపవరం వేదికగా విడుదల చేస్తున్నాం. తొలి విడత కింద ఖరీఫ్ సీజన్ మొదలుకాక ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.13,500 ఏటా అందచేస్తున్నాం. రైతన్నలకు మూడేళ్లలో రూ.1,10,093 కోట్లు నాలుగో ఏడాది మొదటి విడత సాయంగా ఇవాళ రూ.5,500 గణపవరం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పీఎం కిసాన్ పథకంలో భాగంగా మరో రూ.2 వేలను నెలాఖరుకి కేంద్రం విడుదల చేస్తుంది. ఏటా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు సుమారు రూ.7 వేల కోట్లను ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే అందిస్తున్నాం. ప్రస్తుతం అందిస్తున్న సాయాన్ని కూడా కలిపితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వైఎస్సార్ రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లైంది. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో రైతులకు రూ.1,10,093 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. రికార్డు స్థాయిలో దిగుబడి గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా గత మూడేళ్లలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. వడ్డీలేని రుణాలకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.782 కోట్లు ఇవ్వగా ఇప్పుడు మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు అందచేశాం. పారదర్శకంగా ఈ–క్రాప్, పరిహారం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా పంట నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పారదర్శకంగా ఈ–క్రాప్ అమలు చేస్తున్నాం. ఉచిత పంటల బీమాతో ఆదుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ.. రైతులకు మేలు చేయాలనే మంచి మనసుతో ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా దురదృష్టవశాత్తూ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను గత పాలకుల్లా వదిలేయకుండా, సాకులు చెప్పకుండా... పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా, కౌలు రైతులకు సీసీఆర్టీ కార్డులున్నా బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నాం. ఇంత పారదర్శకంగా చేస్తుంటే చంద్రబాబు దత్త పుత్రుడైన ఓ పెద్ద మనిషి రైతు పరామర్శ యాత్రకు బయలుదేరారు. కానీ ఆ యాత్రలో పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి రూ.7 లక్షలు పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారు. మనసు లేని నాయకుడు.. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగన్న నాయకుడు, రైతుల గుండెలపై గురిపెట్టి బషీర్బాగ్లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబే. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో రుణమాఫీ చేస్తానని నమ్మించి ఐదేళ్లలో కేవలం రూ.15 వేలు కోట్లు మాత్రమే విదిల్చాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మి రైతులు మోసపోగా, తాకట్టుపెట్టిన వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నా మనసు కరగని నాయకుడు చంద్రబాబు. -
దుష్ట చతుష్టయం మొసలి కన్నీళ్లు
చెప్పిందే.. చేస్తా జగన్.. రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా, అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండడు. నిజాయితీ, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాడు రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దారుణంగా వంచించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే నోరెత్తని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుష్ట చతుష్టయం అంతా కలసి ఇవాళ రంధ్రాన్వేషణ చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టో హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును ప్రజల పక్షాన నిలబడి కనీసం ప్రశ్నించని, బాధ్యత లేకుండా తప్పించుకుని తిరిగిన ఆయన దత్తపుత్రుడిని ఏమనాలని నిలదీశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు పట్ల విపరీతమైన ప్రేమ చూపించి ఈ రోజు పరామర్శ యాత్రలంటూ పర్యటిస్తున్నారని విమర్శించారు. మొసలి కన్నీరు కారుస్తున్న వీరికసలు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ధ్వజమెత్తారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. టీడీపీ మేనిఫెస్టో చూపుతున్న సీఎం నాడు – నేడు.. ఎంత తేడా అంటే? చెప్పిన దానికంటే మిన్నగా.. అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని మూడేళ్లుగా అందిస్తున్నాం. 2014–19 మధ్య ఇలాంటి పథకం ఉందా? సొంత భూమి ఉన్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూముల సాగుదారులందరికీ వైఎస్సార్ రైతు భరోసా మాదిరిగా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? మేనిఫెస్టోలో రైతన్నకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ అంతకు మించి నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. అంటే ఐదేళ్లలో ప్రతి రైతు చేతిలో రూ.67,500 చొప్పున పెడుతున్నాం. మూడేళ్లలోనే అన్నదాతలకు వివిధ పథకాల ద్వారా రూ.1.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మాఫీ పేరుతో ముంచారు.. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని నమ్మించి ముష్టి వేసినట్లు కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్న గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించండి. ఈ మూడేళ్లలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.23,875 కోట్లు రైతు భరోసా ద్వారానే అందచేశాం. ఇంతగా సహాయపడే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? పారదర్శకంగా పరిహారం.. వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 65.65 లక్షల మంది రైతులకు మేం మూడేళ్లలో రూ.1,282 కోట్లు ఇస్తే.. ఐదేళ్లు పరిపాలన చేసిన ఓ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.782 కోట్లు. ఇప్పటి మాదిరిగా ఏ సీజ¯Œన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? పంట నష్టం జరిగితే అసలు పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి నుంచి.. సీజ¯Œన్ ముగిసేలోగా ఆర్బీకేల్లో జాబితాలు ప్రదర్శిస్తూ, ఇంకా ఎవరైనా మిస్ అయితే పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతూ ఇ–క్రాప్తో అనుసంధానించి పారదర్శకంగా చెల్లిస్తున్నాం. మూడేళ్లలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అందించిన సొమ్ముతో పాటు వచ్చే నెలలో అందించనున్న మొత్తాన్ని కూడా కలిపితే 31 లక్షల మంది రైతులకు దాదాపు రూ.5 వేల కోట్లు ఇన్సూరెన్స్గా రైతుల ఖాతాల్లో జమ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆర్బీకేల్లో అన్ని సేవలు.. విత్తనం నుంచి విక్రయాల వరకూ ప్రతి అడుగులోనూ రైతులకు సహాయపడుతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్నాం. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ చెల్లింపు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లాంటివి పారదర్శకంగా చేపట్టి అక్కడే జాబితా ప్రదర్శిస్తూ ఇస్తున్న వ్యవస్థ గతంలో ఉందా? విత్తనాలు మొదలుకుని పురుగు మందుల వరకూ నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్లు తీసుకొచ్చాం. గతంలో ఇలాంటివి ఉన్నాయా? గతంలో బ్యాంకు రుణాలు అందినప్పుడు బీమా సొమ్ము మినహాయించుకుని వారికి మాత్రమే వర్తింపజేసేవారు. మిగతా వారికి బీమా ఎలా కట్టాలో కూడా తెలియదు. రైతులు చెల్లించిన సందర్భాలు చాలా తక్కువ. ఇవాళ ప్రతి రైతు పేరుతో ఆర్బీకేలోనే ఇ–క్రాప్ బుకింగ్, ఇన్సూరెన్స్ నమోదు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు తావులేదు. నాకు ఓటు వేసినా, వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి రైతుకు మంచి జరుగుతోంది. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించని పంటలను కూడా రైతులు నష్టపోరాదని ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం గతంలో జరిగిందా? ఆక్వా రైతులకు రూ.2,403 కోట్ల సబ్సిడీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంటు సబ్సిడీ ఇస్తూ మూడేళ్లలో రూ.2,403 కోట్లు సబ్సిడీ కల్పించిన ఏకైక ప్రభుత్వం మనదే. కోవిడ్ సమయంలో నష్టపోకుండా వారికి తోడున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లోపు 87 శాతం మంది 70,518 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న 13 శాతం మంది అంటే ఐదు వేల మంది రైతులు 60 శాతం భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారు. ఆక్వాజోన్లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీ ఆక్వా సాగుదారుల్లో 5 ఎకరాలలోపు ఉన్న వారందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50 సబ్సిడీ కొనసాగుతుంది. మిగిలిన వారికి రూ.3.80 ఉంటుంది. ఈ మొత్తం కూడా సబ్సిడీ మొత్తమే. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈ రేటు ఇస్తున్నాం. అయితే పరిమితిని 10 ఎకరాల వరకు విస్తరింప చేయాలని ఎమ్మెల్యే వాసుబాబు కోరారు. ఆక్వాజో¯న్లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీని విస్తరిస్తాం. ఇది ప్రతి ఆక్వా రైతుకూ సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నా. పాడి రైతులను కాపాడి.. గతంలో పాడి రైతులు మోసాలకు గురై నష్టపోయారు. ఇవాళ అమూల్ను తీసుకొచ్చి లీటర్ పాల మీద పాడి రైతులకు రూ.5 నుంచి రూ.10 అదనంగా ఇస్తున్నాం. అమూల్ ఈ ధర ఇస్తోంది కాబట్టి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్తో సహా ప్రైవేట్ డెయిరీలన్నీ ఇదే మాదిరిగా చెల్లించక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రశ్నించని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి? 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ తరువాత టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే నైజం చంద్రబాబుది. చంద్రబాబు మేనిఫెస్టోతో పాటు లేఖలు కూడా రాశారు. ఇందులో చంద్రబాబు, దత్తపుత్రుడు సరిపోరన్నట్లుగా ప్రధాని ఫొటో కూడా పెట్టారు. ఆ మేనిఫెస్టోను బాబు అమలు చేయకుండా మోసగిస్తే కనీసం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి అడుగు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి? కొల్లేరు కోరికలు తీరుస్తూ... ఎమ్మెల్యే వాసు గణపవరాన్ని భీమవరంలో కలపాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో రీ సర్వే అడిగారు. ఈమేరకు ఆదేశాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో అమలవుతాయి. కొల్లేరు ప్రాంతంలో చెట్టున్నపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో తాగునీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కోసం కావాలన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తైంది. జూన్లో శంకుస్థాపన చేస్తా. ఉంగుటూరులో 6 సబ్స్టేషన్లు కావాలని అడిగారు. సర్వే చేయించి అవసరమైన చోట వచ్చేటట్లు చేస్తాం. ఏలూరు కాలువపై నారాయణపురం, ఉంగుటూరు, పూళ్ల, గుండుగొలను గ్రామాల్లో వంతెన నిర్మాణాలు అడిగారు. అవి కూడా చేస్తాం. నారాయణపురం, ఉండి రోడ్డులో వెంకయ్యవయ్యేరు కాలువపై కొత్త వంతెన అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. 48 పాత ఇందిరమ్మ కాలనీల్లో కనీస వసతులు కోసం విజ్ఞప్తి చేశారు. అవి కూడా చేపడతామని హామీ ఇస్తున్నా. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, మంత్రులు కాకాణి గోవర్దనరెడ్డి, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను రైతులు గమనించాలి: సీఎం జగన్
-
వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్@ఏలూరు జిల్లా (ఫోటోలు)
-
చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు (గణపవరం): చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ఇక ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమై ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు. ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, రాజకీయాల గురించి ఆలోచన చేయనని.. ప్రజలకు మంచి చేయాలన్నది తన తపన’’ అని సీఎం అన్నారు. ‘‘ఈ మధ్య రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు. ఇవాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అదే’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తుచేసుకోండి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు. ‘చంద్రబాబు 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. చెత్తబుట్టలో వేసిన చంద్రబాబుగారి నైజాన్ని చూడండి. ఇవాళ మన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికీ జగనన్న రాసిన లేఖను అందించి.. ఏం మేలు జరిగిందో చూపిస్తూ, గుర్తుచేస్తూ, మేనిఫెస్టోలో ఏం జరిగిందో టిక్కు పెట్టిస్తున్నారు. మన అందరి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. జగన్ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలు అయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో... అదే చేస్తాడు. దేవుడు ఆశీస్సులు కావాలి.. మీరు చల్లని దీవెనలు ఇవ్వాలని' సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ రైతు భరోసా.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
వైఎస్సార్ రైతు భరోసాకు సర్వం సిద్ధం
-
వైఎస్సార్ రైతు భరోసాకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. -
మే 16న గణపవరం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, గణపవరం (పశ్చిమగోదావరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 16వ తేదీన గణపవరం రానున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గణపవరం రానున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మంగళవారం తెలిపారు. సభాస్థలి, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాలని వారు పరిశీలిస్తారని చెప్పారు. చదవండి: (తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం) -
15న వైఎస్సార్ రైతుభరోసా నిధుల జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతోపాటు జాబితాలో చోటుదక్కని అర్హులెవరైనా ఉంటే వారి అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హతను నిర్ధారించుకున్న తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022–23లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించబోతున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులను గుర్తించాల్సి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన అర్హులైన కౌలు రైతులకు ప్రస్తుతం సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్టు) కార్డుల జారీచేస్తునారు. ఈ కార్డుల ఆధారంగా వారికి తొలివిడత సాయం అందించనున్నారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసాకి అర్హుల జాబితాలను నేటినుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్బీకేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
సాగుకు భరోసా
సాక్షి,కదిరి(సత్యసాయిజిల్లా): దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి రైతులంటే ఎంత ఇష్టమో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా అన్నదాతలంటే ప్రాణం. అందుకే వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఏటా రైతు కుటుంబానికి రూ.13,500 నగదు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మునుపే మే నెలలోనే వైఎస్సార్ రైతు భరోసా నగదు అర్హులైన రైతులందరి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారు చనిపోతే ఆ ఇంట్లోనే మరొకరికి.. రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ నగదు అదే ఇంట్లోనే మరొకరికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు కూడా ఈసారి రైతు భరోసాకు అర్హులయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా పొందడం ఎలా? భూమి ఉన్న ప్రతి రైతూ ఈ పథకానికి అర్హులే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే వారందరూ ఈ పథకానికి అర్హులే. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు పాసుపుస్తకం తీసుకొని సమీప రైతుభరోసా కేంద్రంలో సంప్రదిస్తే సరిపోతుంది. లేదంటే వలంటీర్ను గానీ, గ్రామ సచివాలయంలో గానీ, వ్యవసాయాధికారిని గానీ సంప్రదించవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం రూ.13,500ను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందులో రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం జమచేయగా, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 జమ చేస్తుంది. రైతులకు నిజంగా భరోసానే జగన్ ప్రభుత్వం రైతులకు ఏటా అందజేసే రైతు భరోసా నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకప్పుడు విత్తనాల కొనుగోలుకు చేతిలో డబ్బు లేక పొలాలు బీళ్లుగా వదిసే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా నగదు పెట్టుబడికి సాయంగా ఉంటోంది. – రైతు జగన్మోహన్రెడ్డి, ఓబుళరెడ్డిపల్లి, తలుపుల మండలం అర్హులెవ్వరూ నష్టపోరాదు వైఎస్సార్ రైతు భరోసాకు సంబంధించి అర్హులైన ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా రైతు భరోసా కేంద్రాల్లో సిద్దంగా ఉంది. రైతులు పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే అక్కడే చెబితే వెంటనే న్యాయం చేస్తాం. – జి.శివనారాయణ, జేడీఏ, శ్రీసత్యసాయి జిల్లా -
ఖరీఫ్కు ముందే భరోసా
మచిలీపట్నం: ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే రైతు భరోసా నగదు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులందరికీ డాక్టర్ వైఎస్సార్ భరోసా పథకం మంజూరు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2021–22లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3,26,326 మంది రైతులు ఈ పథకం కింద ప్రయో జనం పొందారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మే నెలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అర్హుల జాబితాల తయారీపై అధికారులు దృష్టి సారించారు. పథకం రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే, వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే, వారి కుటుంబంలో మరొకరు సాయం అందుకునేలా పేరు మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అర్హులందరికీ అందించేలా.. కౌలు రైతులకు కూడా భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి వారికి పథకం మంజూరు కోసం కౌలు గుర్తింపు కార్డులు అందజేసేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సహాయకులు, సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గ్రామాల్లోని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన అర్హుల జాబితాలాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. రైతులంతా జాబితాను పరిశీలించుకునేలా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సాగుకు భరోసా.. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. దీనిలో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపిక చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత సాయం రూ.7,500 నేరుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందుగానే భరోసా డబ్బులు అందించేలా జరుగుతున్న ఏర్పాట్లతో రైతుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టమొచ్చినా, ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమాతో రైతులు సాగుకు సై అంటున్నారు. గతంలో సంభవించిన తుపానులతో పంట నష్టపోయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1,52,368 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105.30 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. సున్నా వడ్డీ సైతం సకాలంలో జమ చేస్తుండటంతో రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పేర్లు లేని వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం లబ్ధిదారుల జాబితాలను జిల్లాలోని అన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. వాటిని రైతులు పరిశీలించుకోవాలి. జాబితాలో పేర్లు లేని వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం అందించేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – మనోహర్రావు, కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి -
'మే'లో తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈసారి మరింత మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. తొలి విడతలో రూ.7,500 సాయం అందిస్తుంది. రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలు సాయం అందిస్తుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ భూ సాగుదారులకు పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయమందించింది. ఇలా గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల సాయం అందించింది. ఈ పథకం కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు కేటాయించింది. గత మూడేళ్లలో లబ్ధి పొందని వారికీ అవకాశం గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాదీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన, అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్లోని ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‘ మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించి పోర్టల్లో వివరాలు నమోదుచేయించాలి. అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఐటీడీఏ పీవోల నుంచి సేకరిస్తున్నారు. వీరి జాబితాలను కూడా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హుల తొలగింపు, అర్హుల నమోదు ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ఏప్రిల్ 30వ తేదీలోగా అర్హులను ఖరారు చేసి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలుదారులకు ‘భరోసా’ కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి కచ్చితంగా సీసీఆర్సీ కలిగి ఉండాలని నిబంధన విధించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల జారీ కోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. వాస్తవ సాగుదారులు విధిగా వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు సీసీఆర్సీ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అర్హతనుబట్టి మే 1నుంచి సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. వీరు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్లో నమోదు చేయాలి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులను గుర్తిస్తారు. వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అందుతుంది. అర్హత పొందని వారికి అవకాశం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని ఈ ఏడాది మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాం. గతేడాది లబ్ధి పొందిన వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. అనర్హులను తొలగించడంతో పాటు గడిచిన మూడేళ్లలో అర్హత పొందని వారు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాం. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తాం. –హెచ్ అరుణ్కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతకు అండగా నిలిచే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత మూడేళ్లుగా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు)/చిత్తూరు జిల్లా: వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించింది. సాగుకు సరైన సమయంలో సాయం అందించాలని ఆర్బీకే సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించింది. రైతాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సర్కారు ఆశయాలను మతుకువారిపల్లె రైతు భరోసా కేంద్రం అందిపుచ్చుకుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విశేష సేవలందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచి ఐఎస్ఓ గుర్తింపు సాధించింది. చదవండి: ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ? మండలంలోని మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి విశిష్ట గుర్తింపు లభించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. అన్నదాతలకు అవసరమైన సలహాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందుల పంపిణీ, పండించిన పంటల మార్కెటింగ్, అత్యుత్తమ నాణ్యతా సౌకర్యాలు భవనం తదితరాలను ఐఎస్ఓ ప్రామాణికంగా తీసుకుంది. విశిష్ట పురస్కారం సాధించిన మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సేవలు.. సౌకర్యాలు మతుకువారిపల్లెలో 1,180 మంది రైతులు ఉన్నారు. సుమారు 715 హెక్టార్ల భూమి సాగులో ఉంది. గ్రామంలో అధికంగా మామిడి, మిరప, చెరుకు, వరి, టమాట పంటలను సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2020 మే 30వ తేదీన మతుకువారిపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించింది. దీని పరిధిలో మూడు పంచాయతీలను చేర్చింది. ఈ ఆర్బీకే భవనంలో డిజిటల్ లైబ్రరీ, వ్యవసాయ సంబంధిత పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచింది. దీనికితోడు ఆర్బీకేలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు రైతులకు చిత్తశుద్ధితో సేవలందించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను పొలాల సందర్శనకు తీసుకువచ్చి రైతులకు సలహాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పథకాలను పారదర్శంగా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుభరోసా సొమ్ము అన్నదాతలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించి ఏ సమయంలో ఏయే పంటలు సాగు చేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తగ్గిన వ్యయం.. పెరిగిన దిగుబడి మతుకువారిపల్లె రైతులు గతంలో ఎరువుల కోసం పీలేరు, సదుం, కల్లూరుకు వెళ్లేవారు. ఇందుకోసం అదనంగా ఒక్కో రైతుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యేది. అయితే రైతుభరోసా కేంద్రంలోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రావడంతో అదనపు వ్యయం తప్పింది. కియోస్క్ మిషన్ ద్వారా ఎరువులు, మందుల వివరాలతోపాటు మార్కెట్ ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఆర్బీకే సిబ్బంది పనితీరు కారణంగా గ్రామంలోని రైతులు మంచి ఫలితాలను సాధించారు. ఆధునిక పనిముట్ల వినియోగంతో అధిక దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయానికి అండగా నిలిచి, అన్నదాతల ఆరి్ధకాభివృద్ధికి సహకరిస్తూ, అత్యుత్తమ సేవలందిస్తున్న మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రాన్ని ఐఎస్ఓ ప్రశంసించింది. ఉత్తమ సరి్టఫికెట్ను ప్రదానం చేసింది. సిబ్బంది కృషిని అభినందించింది. సకాలంలో ఎరువులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మా పొలాలను సందర్శించి సలహాలు అందిస్తున్నారు. మా ఆర్బీకే ఇప్పుడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉంది. – సి.రాణి, రైతు, మతుకువారిపల్లె జగనన్నకు కృతజ్ఞతలు రైతుభరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్ని సేవలందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆర్బీకే సిబ్బంది మాకు ఎప్పడూ అందుబాటులో ఉంటారు. ఒక పర్యాయం రైతుభరోసా సొమ్ము రాకపోతే వెంటనే ఆధార్ అనుసంధానం చేయించి నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధునిక పనిముట్ల వినియోగంపై మాకు అవగాహన కల్పించారు. – పి.తాతప్ప, రైతు, బోడిరెడ్డిగారిపల్లె ఆనందంగా ఉంది మా రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ సరి్టఫికెట్ రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేశాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన బాటలో నడిచాం. అన్నదాత ఎప్పుడూ నష్టపోకూడదు అనే సంకల్పంతో విధులు నిర్వర్తించాం. ఆర్బీకే ద్వారా సకాలంలో సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మా కష్టానికి గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాం. –రోహిణి, వ్యవసాయ అసిస్టెంట్, మతుకువారిపల్లె ఆర్బీకే -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
వైఎస్సార్ ఆర్బీకేల సేవలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా నాణ్యమైన సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇదే తరహాలో తమ రాష్ట్రంలోనూ రైతులకు అందిస్తున్న సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తున్న దన్నారు. స్పెషల్ కమిషనర్ హనుమంత్ నాయకత్వంలోని తెలంగాణా వ్యవసాయ శాఖ అధికారుల బృందం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని శనివారం సందర్శించింది. సిబ్బందివివరాలు, రైతులకు అందే సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేలో ఉన్న పురుగుల మందుల నాణ్యతను స్వయంగా టెస్ట్ కిట్పై పరీక్షించి చూశారు. కియోస్క్ పనితీరు, ప్రయోజనాలపై ఆరా తీశారు. అదేసమయంలో ఆర్బీకేకు వచ్చిన రాజారావు అనే రైతు కియోస్క్ ద్వారా ఎరువులు బుక్ చేసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఆర్బీకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలో ఉన్న రైతు భరోసా తదితర మేగజైన్స్ను పరిశీలించారు. అనంతరం కంకిపాడు మార్కెట్ యార్డులోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ల్యాబ్ను సందర్శించారు. ఇక్కడ ఫిషరీస్ ల్యాబ్తో పాటు అత్యాధునిక పరికరాల పని తీరును పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. కాల్ సెంటర్లో నిర్వహిస్తోన్న ఆర్బీకే చానల్ ద్వారా ఉద్యాన శాస్త్రవేత్త రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించారు. వచ్చిన అధికారుల్లో ఒకరు బయటకు వెళ్లి ఓ రైతు మాదిరిగా కాల్ సెంటర్కు కాల్ చేసి తమకున్న సందే హాన్ని అడుగగా దానికి ఆ శాస్త్రవేత్త చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ విభాగాల పనితీరును రాష్ట్ర జేడీఏ శ్రీధర్ వారికి వివరించారు. తమ రాష్ట్రంలోనూ ఓ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఛానల్ ప్రారంభించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, కమిషనర్ హనుమంత్ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్–2 కె.విజయకుమార్, రైతు వేదిక ఏడీఏ అనిత, సీడ్స్, ఎరువుల జేడీఏ, డీడీఏలు పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవల్లో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారంలేని రీతిలో మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యమైన ఎరువులు, సబ్సిడీ, నాన్సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, దాణా, రొయ్యలు, చేపల మేత చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభిస్తోంది. రైతులు ఆర్బీకేల్లో తమకు అవసరమైన వాటిని బుక్ చేసుకునే ముందు సబ్సిడీని మినహాయించుకొని మిగతా మొత్తాన్ని సంబంధిత ఏజెన్సీలకు లేదా ఆర్బీకే ఖాతాలకు జమ చేసేవారు. ఈ రసీదును చూపిస్తే సిబ్బంది ఇండెంట్ పెట్టేవారు. ఈ ప్రక్రియతో సమయం వృధా అవుతోంది. సాంకేతిక సమస్యలూ వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు ఆర్బీకేల్లోనే నగదు చెల్లింపులకు అనుమతినిచ్చారు. ఈ సొమ్ము నాలుగైదు రోజులకోసారి ఆర్బీకే ఖాతాల నుంచి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు జమ చేసే వారు. నగదు చేతికొచ్చాక వీఏఏలు ఇండెంట్ పెట్టేవారు. తమ ఖాతాలకు జమ కాలేదన్న కారణంతో ఏజెన్సీలు సరుకు పంపడంలో జాప్యం జరిగేది. పైగా వసూలు చేసిన నగదును ఆర్బీకే సిబ్బంది రెండు మూడు రోజులు తమ వద్దే ఉంచుకోవడం, కొన్ని చోట్ల పక్కదారి పట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల జాప్యం, అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా పంపిణీ చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ముందుగా విత్తనాలకు ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీలో విత్తనాభివృద్ధి సంస్థదే కీలక పాత్ర. ఏటా రాష్ట్రంలో రూ.1,500 కోట్ల విత్తనాలు విక్రయిస్తున్నారు. దాంట్లో రూ.670 కోట్ల విలువైన సబ్సిడీ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుంది. సబ్సిడీ పోను రైతుల నుంచి రూ.400 కోట్లు వసూలు చేస్తుంది. రానున్న ఖరీఫ్ నుంచి సబ్సిడీతో పాటు కనీసం పది శాతం నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాలెట్స్ ద్వారా నేరుగా సంస్త ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ క్యూ ఆర్ కోడ్ ఇస్తారు. చెల్లింపులు బయటకు విన్పించేలా ఓ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ను అందిస్తారు. రైతులు వారికి అవసరమైన వాటిని బుక్ చేసుకొనే సమయంలో తగిన సొమ్మును స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లించాలి. వెంటనే వారికి విత్తనాలను అందిస్తారు. డిజిటల్ చెల్లింపులను దశలవారీగా ఎరువులు, పురుగుల మందులు, పశువుల దాణా, రొయ్యలు, చేపల మేతకు కూడా అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు రైతుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతున్నాం. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి డిజిటల్ చెల్లింపులతోనే ఆర్బీకేల ద్వారా జరిగే విత్తన విక్రయాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
మరింత మంది రైతులకు పెట్టుబడి సాయం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవుల గోపిరెడ్డికి రెండేళ్లపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయం జమయ్యింది. ఏడాది కాలంగా ఆ మొత్తం జమ కావడం లేదు. ఆరా తీస్తే ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కాలేదని చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎన్పీసీఐ పోర్టల్లో అప్లోడ్ చేయడం లేదు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన కోనేటి రెడ్డప్పకు కూడా గత రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం జమ కాలేదు. పరిశీలిస్తే ఆధార్ ఫెయిల్యూర్ అని వస్తోంది. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన యు.వరహాలమ్మకు ఈ ఏడాది మూడో విడత సాయం జమ కాలేదు. పరిశీలిస్తే బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదైనట్టు చూపిస్తోంది. ఇలా లక్షలాది మంది వివిధ కారణాలతో పీఎం కిసాన్ సాయానికి దూరమవుతున్నారు. కొంతమందికి ఏటా మూడు విడతల్లోనూ పెట్టుబడి సాయం జమ కావడం లేదు. మరికొంత మందికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జమవుతోంది. 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్ విడతకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. కేవలం పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతో పాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే, వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యలన్నిటినీ ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. పెండింగ్ దరఖాస్తుల డేటాను మండల వ్యవసాయాధికారులతో పాటు రైతు భరోసా కేంద్రాలకు కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడతారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్ పోర్టల్లో తగిన వివరాలను అప్లోడ్ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా ఎన్పీసీఐ పోర్టల్తో మ్యాపింగ్ చేయించేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేటగిరీల వారీగా పెండింగ్ ఇలా.. లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్దారు ఉండటం వంటి కారణాలతో 3,11,158 మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్ల్యాండ్ పోర్టల్ అనుసంధానం కాలేంటూ 5,32,145 మందికి, ఎన్పీసీఐ మ్యాపింగ్ సమస్యలతో 2.05 లక్షల మందికి, ఆదాయ పన్ను చెల్లింపుదారులంటూ 99,106 మందికి, ఆధార్ విఫలం, అప్డేట్ చేయటం వంటి కారణాలతో 97,215 మందికి, ఆర్టీజీఎస్/ఎన్ఐసీ సమస్యలతో 76,743 మందికి, చనిపోయిన కారణంతో 25,626 మందికి, అకౌంట్ బ్లాక్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదైన కేటగిరీలో 13 వేల మందికి, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలున్నాయనే కారణంతో 8166 మందికి, ఇతర కారణాలతో 7,645 మందికి పీఎం కిసాన్ సాయం అందడం లేదని గుర్తించారు. వీరిలో 10 నుంచి 20 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం జమవుతోంది. సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. ఈ నెల 24వ తేదీలోగా పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించి సాధ్యమైనంత ఎక్కువ మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
అన్నదాతల సేవలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్
సాక్షి, అమరావతి: విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట కళకళలాడితే... దిగుబడి దిగులుండదు. దిగుబడి, ధరలూ బాగుంటే ఇక రైతన్నకు తిరుగుండదు.. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపో కుండా వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టి పాలు కాకుండా కాపాడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్పుట్స్ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం బారిన పడకుండా ధైర్యంగా సాగు పనులు చేపడుతున్నామని రైతన్నలు ఆనందంగా చెబుతున్నారు. నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షకు భరోసా కల్పిస్తున్నాయి. 70 కేంద్రాలు ఇప్పటికే సేవలందిస్తుండగా కొద్ది నెలల్లోనే మిగతావి కూడా ప్రారంభం కానున్నాయి. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ఇన్పుట్స్తో పాటు మార్కెట్లోకి వచ్చే ప్రతీ ఇన్పుట్ శాంపిల్ను ఇక్కడ పరీక్షించుకునే సదుపాయం ఉండటం వల్ల రైతుల్లో నమ్మకం పెరుగుతోంది. సొంతంగా తయారు చేసుకున్న విత్తనమైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ఈ ల్యాబ్కు వెళ్లి నాణ్యతను ఉచితంగా పరీక్షించుకోవచ్చు. విత్తనమే కాకుండా ఎరువులు, పురుగు మందుల నాణ్యతను కూడా పరీక్షించుకుని ధీమాగా సాగు పనులు చేపట్టవచ్చు. గతంలో 3 శాతం లోపే పరీక్ష.. రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్ల ఎరువులు మార్కెట్కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రంలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం మూడు చొప్పున మాత్రమే ప్రయోగశాలలున్నాయి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి లేదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా చితికిపోయే వారు. ఇప్పుడా దుస్థితి తొలగిపోయింది. నాసిరకం తయారీదారుల ప్రొసిక్యూషన్ నాసిరకం ఇన్పుట్స్ బారిన పడకుండా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 70 ల్యాబ్స్ ద్వారా 2021–22లో విత్తనాలు, ఎరువులు 10 వేల నమూనాల చొప్పున, పురుగు మందుల శాంపిళ్లు 5,500 పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 8,238 విత్తన, 6,490 ఎరువులు, 3,618 పురుగుల మందుల శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో 10–20 శాతం రైతులు తెచ్చిన శాంపిల్స్ కాగా మిగిలినవి డీలర్లు అందచేసిన నమూనాలు ఉన్నాయి. 112 విత్తన, 240 ఎరువులు, 41 పురుగుల మందుల నమూనాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి తయారీ కంపెనీలను చట్టపరంగా ప్రాసిక్యూట్ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఖరీఫ్ కల్లా మిగిలిన ల్యాబ్స్ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్తో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్స్ ఏర్పాటవుతున్నాయి. రూ.81 లక్షలతో నియోజకవర్గ స్థాయిలో 147 చోట్ల గ్రామీణ ప్రాంతంలో ల్యాబ్స్ సేవలందిస్తాయి. రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయి. వీటన్నిటి కోసం ప్రభుత్వం రూ.213.27 కోట్లు వ్యయం చేస్తోంది. ఇక సీడ్ జన్యు పరీక్ష కోసం డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మరో రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో ల్యాబ్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పిన 70 అగ్రీ ల్యాబ్స్ను రైతు దినోత్సవమైన డాక్టర్ వైఎస్సార్ జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. మిగిలిన వాటిలో 50 ల్యాబ్లను మార్చిలో, మిగతా ల్యాబ్లతో పాటు జిల్లా ల్యాబ్లు, కోడింగ్ సెంటర్లను ఖరీఫ్ సీజన్ కల్లా సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేగంగా పరీక్ష నివేదికలు.. నియోజకవర్గ స్థాయి ల్యాబ్లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే నెలకు 50 శాంపిల్స్ను విత్తనాలు, ఎరువులు ఏటా 88,200 చొప్పున నమూనాలు పరీక్షిస్తారు. ప్రతీ జిల్లా ల్యాబ్లో విత్తనాలు, ఎరువుల నమూనాలు 39 వేల చొప్పున, 2 వేల చొప్పున పురుగు మందుల శాంపిల్స్ను పరీక్షిస్తారు. ఆ విధంగా ఏటా 1,27,200 శాంపిళ్ల చొప్పున విత్తనాలు, ఎరువులతోపాటు 26 వేల పురుగు మందుల నమూనాలను పరీక్షించి నిర్ధారిస్తారు. విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజులలోపు పొందవచ్చు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును రెండు మూడు రోజుల్లోనే అందచేస్తారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. పురుగు మందులకు సంబంధించి రూ.3,500 చెల్లించాలి. విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. రైతులకు మాత్రం పూర్తి ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తుంది. ప్రతి ల్యాబ్లో ఆటోమెషన్ నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిక్గా సిస్టమ్లో నమోదవుతాయి. ఏ ల్యాబ్లో ఏ బ్యాచ్ శాంపిల్ను ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపు కెళ్లినప్పుడు బ్యాచ్ నెంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్స్కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తారు. నాలుగు కేటగీరిల్లో సేకరించిన నమూనాలను పరీక్షిస్తారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ల్యాబ్లో విధులు నిర్వహించే ఏవోలు, ఎఈవోలు, ఏడీలకు జాతీయ ఇన్స్టిట్యూట్ల ద్వారా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను సమీప ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ధైర్యంగా వాడా... గత సీజన్లో వాడగా మిగిలిన ఎరువుల నాణ్యతపై అనుమానం రావడంతో అగ్రీ ల్యాబ్లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని నిర్ధారణ కావడంతో ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా వాడా. రైతులకు చేరువలో ఇంత అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు. సీఎం సార్కు కృతజ్ఞతలు –తమ్మా వెంకటరెడ్డి, పామర్రు, కృష్ణా జిల్లా నమ్మకం పెరిగింది ఖరీఫ్లో ఎంటీయూ 1064 రకం సాగు చేసా. విత్తనాన్ని నర్సీపట్నం ల్యాబ్లో పరీక్షించి నాణ్యమైనదని నిర్థారించడంతో ధైర్యంగా సాగుచేయగలిగా. ఈ ల్యాబ్స్ వల్ల ఇన్పుట్స్ విషయంలో రైతులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వం మంచి పని చేసింది. –రెడ్డి రామరాజు, సుబ్బరాయుడుపాలెం, విశాఖ జిల్లా మొలకెత్తడమే అదృష్టంగా ఉండేది... ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాన్ని ఆత్మకూర్ ల్యాబ్లో పరీక్షించుకున్నా. నాణ్యత బాగుందని రిపోర్టు వచ్చింది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మార్కెట్లో కొన్న విత్తనం ఎలా ఉన్నా విత్తుకోవల్సిందే. అదృష్టం బాగుంటే మొలకెత్తుతాయి. లేకుంటే లేదు అన్నట్టుగా ఉండేది. ల్యాబ్లు ఏర్పాటు చేసిన తర్వాత పైసా ఖర్చు లేకుండా పరీక్షించుకునే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల రైతులకు మేలు జరుగుతోంది. –షేక్ ఖాదర్ బాషా, ఆత్మకూర్, నెల్లూరు జిల్లా ఎంతో ఉపయోగం.. మినుము విత్తనాన్ని (ఎన్ఆర్ఐ–బీ002) ఆళ్లగడ్డ ల్యాబ్లో పరీక్షించి చూసుకున్నా. బాగా మొలకెత్తుతుందని నిర్ధారణ కావడంతో విత్తుకున్నా. పంట బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ల్యాబ్లు రైతులకెంతో ఉపయోగం. –ఎన్ వెంకటేశ్వర్లు, రుద్రవరం, కర్నూలు జిల్లా జవాబుదారీతనం.. నాణ్యమైన ఇన్పుట్స్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ సేవలు 2021 ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీతనంతో పాటు రైతులకు నాణ్యమైన ఇన్పుట్స్ను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ నకిలీల మాటే ఉండదు.. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక మార్కెట్లో నకిలీలు, నాసిరకం అనే మాట వినపడదు. ఏ ఇన్పుట్ అయినా దర్జాగా వినియోగించుకునే దైర్యం వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వీటిని తీసుకొచ్చాం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ శాశ్వత వ్యవస్థ.. సీఎం సంకల్పం రైతులకు నాణ్యమైన ఇ¯న్పుట్స్ ఇవ్వడానికి శాశ్వతంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను తీసుకొచ్చాం. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ల్యాబ్స్తో పాటు నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేలో కూడా టెస్టింగ్ కిట్స్ పెట్టాం. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను టెస్టింగ్ చేయకుండా అమ్మకాలకు అనుమతించం. –కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ముందు జాగ్రత్తతో.. కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జువరం రైతు జన్ను నాగ ఫణీంద్ర ఐదెకరాల్లో కూరగాయలు పండిస్తుంటారు. విత్తనం మొలకెత్తి పూత, పిందె దశలు దాటి కాపుకొచ్చేదాకా దేవుడినే నమ్ముకునేవాడు. నాసిరకం విత్తనాల వల్ల ఒక్కోసారి మొలక కూడా వచ్చేవి కాదు. మొలకెత్తినా దిగుబడి చూశాక దిగాలు తప్పదు. ఆయనకు ఇప్పుడా అవస్థలు లేవు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ద్వారా విత్తనాల నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని నమ్మకంగా కూరగాయలు పండిస్తున్నాడు. ఆయన సొంతంగా తయారు చేసుకున్న కూరగాయ విత్తనాలను పామర్రులోని అగ్రి ల్యాబ్లో పరీక్షించగా బీర విత్తనాల్లో మొలక శాతం (జర్మినేషన్) ఏమాత్రం లేదని నిర్ధారణ కావడంతో వాటిని వదిలేసి నాణ్యమైన బీర రకాలను ఎంచుకున్నాడు. బెండ విత్తనంలో 88 శాతం మొలక సామర్థ్యం ఉన్నట్లు తేలడంతో ధీమాగా సాగు చేశాడు. మొలక శాతం లేని బీర విత్తనాలను సాగుచేసి ఉంటే రూ.15 వేల పెట్టుబడితో పాటు కనీసం 20–25 క్వింటాళ్ల దిగుబడి కోల్పోవడం ద్వారా రూ.30–40 వేల ఆదాయాన్ని నష్టపోయే వాడినని చెప్పారు. సీజన్లో విలువైన 20 రోజుల సమయాన్ని కోల్పోవాల్సి వచ్చేదని నాగఫణీంద్ర ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ల్యాబ్లో నాణ్యతను పరీక్షించుకోవడం వల్ల ముందు జాగ్రత్తతో విత్తనాన్ని మార్చుకుని పంట కాపాడుకోగలిగానని సంతృప్తిగా చెప్పాడు. -
Sankranti Festival: ఇంటింటా సంక్రాంతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలం తర్వాత సంక్రాంతి సంబరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురవడంతో సాగు చేసిన పంటలు గరిష్ట దిగుబడులు ఇవ్వడం.. వాటికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మద్దతు ధర దక్కడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాల ఫలాలు అందడంతో ప్రతి పేద ఇంటా సం‘క్రాంతి’ నెలకొంది. ఫిట్మెంట్.. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వం మంజూరు చేయడం, పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను 20 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ తెలుగింట ఏడాదిలో తొలి పండగ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. అన్ని వర్గాల ప్రజలూ బంధుమిత్రుల మధ్య, ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి కొత్త వస్త్రాలు, పిండి వంటల కోసం ముడి పదార్థాల కొనుగోళ్లతో షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకూ కిటకిటలాడటంతో వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో పొట్టేలు బండిపై చిన్నారి పల్లెలకు చేరుకున్న నగరవాసులు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారందరూ అయిన వారి మధ్య సంక్రాంతి పండగ చేసుకోవడం కోసం సొంతూళ్లకు చేరుకున్నారు. దాంతో పట్టణాలు, నగరాలు బోసిపోయాయి. సంక్రాంతి పండగకు రావాలంటూ ఆహ్వానాలు అందడంతో అల్లుళ్లు, ఆడపడుచులు పల్లెలకు చేరుకోవడంతో గ్రామ సీమల్లో సరి కొత్త సందడి నెలకొంది. ఘనంగా భోగి సంక్రాంతి పండగలో తొలి రోజు భోగిని శుక్రవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కోడి కూయగానే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల వద్ద చలి కాచుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కబుర్లు చెప్పుకున్నారు. సూర్యోదయానికి ముందే ఇళ్ల ముందు మహిళలు కళ్లాపు చల్లి, పోటీ పడుతూ ముత్యాల ముగ్గులు వేశారు. వాటికి రంగులు అద్ది.. ముగ్గు మధ్య గొబ్బెమ్మలు పెట్టి.. రకరకాల పూలతో అలంకరించారు. ముత్యాల రంగ వల్లుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ధనుర్మాసం కావడంతో హరిదాసులు హరినామ సంకీర్తనలను రాగయుక్తంగా పాడుతూ వీధుల్లో తిరుగుతుండటం కనువిందు చేసింది. పిల్లల తలపై రేగి పండ్లు పోసి పెద్దలు దీవించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధు మిత్రుల సందడి మధ్య మకర సంక్రాంతికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నవరత్నాలతో పేదల లోగిళ్లలో కొంగొత్త సంక్రాంతి కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతరంగా అర్హులైన వారందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఈ నెల 1న వృద్ధాప్య, వితంతు పెన్షన్ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచారు. ఏకంగా 61.16 లక్షల మందికి ఈ నెల పింఛన్లు అందజేశారు. ఇందులో కొత్తగా 1,41,562 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.45 వేల కోట్లు పింఛన్లుగా చెల్లించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూర్చారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేశారు. రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.16 లక్షల కోట్లను నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమ పథకాల ఫలాల ఎక్కడా ఆగకుండా లబ్ధిదారులకు అందడంతో పేదల లోగిళ్లలో సరి కొత్త సంక్రాంతి కనిపిస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలు రైతుల్లో ఆనందోత్సాహాలు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన ద్వారా రూ.13,500 వంతున పెట్టుబడి సాయం.. బ్యాంకుల నుంచి సర్కార్ విరివిగా రుణాలు అందించడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో అన్నదాతలకు కష్టాలు తప్పాయి. సకాలంలో వర్షాలు కురవడంతో కొంగొత్త ఆశలతో భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో మంచి దిగుబడులు వచ్చాయి. వాటికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు అధికంగా ప్రయోజనం చేకూరింది. పంటలను విక్రయించిన డబ్బులు చేతికి అందడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. రైతులు, రైతు కూలీలు.. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకుంటున్నారు. సంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, కర్జికాయలు, గారెలు, సున్నండలు, కాజాలు, పూతరేకులు వంటివి చేస్తుండటంతో ఇంటింటా ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం సంక్రాంతి పండగ రోజున శనివారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే సంక్రాంతిని మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజునే సూర్యడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు. అంటే సంక్రాంతి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అత్యంత శుభప్రదమైన సంక్రాంతి రోజున పెద్దలకు నూతన వస్త్రాలు పెట్టుకుని.. తర్పణాలు వదిలేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పింఛన్తో సంతోషం భర్త చనిపోయి బోలెడు దుఃఖంలో ఉన్న నాకు ప్రభుత్వం ఈ నెలలో కొత్తగా పింఛను మంజూరు చేసింది. పది రోజుల క్రితం వలంటీరు స్వయంగా ఇంటికి వచ్చి రూ.2,500 పింఛను డబ్బులు ఇచ్చి వెళ్లారు. పండ్లు, కూరగాయలు విక్రయించుకొని జీవించే మాకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సంక్రాంతి పండుగ రోజున ఆ పింఛను డబ్బులు కొత్త సంతోషాన్ని తెచ్చాయి. – కొలగాని పద్మ, వడ్లమూడి, చేబ్రోలు, గుంటూరు జిల్లా రంగవల్లుల మధ్య మహిళల కోలాహలం.. భోగి మంటల వద్ద చిన్నారుల కేరింతలు.. వంట గదిలో అమ్మలక్కల హడావుడి.. నగరం నుంచి వచ్చిన బంధువులతో పెద్దల కబుర్లు.. ఆట పాటలతో గంగిరెద్దులు, హరిదాసుల సందడి.. వెరసి గ్రామ సీమల్లో సందడే సందడి.. ఈ తరం పిల్లలు అబ్బుర పడే రీతిలో ఈ ఏడాది రాష్ట్రంలో ఊరూరా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. -
వరుసగా మూడో ఏడాది రైతన్నకు ‘భరోసా’
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి 50.58 లక్షల రైతుల కుటుంబాలకు రూ.1,036 కోట్లను ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తాజాగా జమ చేసిన నగదుతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్నదాతలకు రైతు భరోసా కింద రూ.19,813 కోట్లు ఇచ్చినట్లైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరోనా కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులెన్ని ఉన్నా ఇచ్చిన మాట మేరకు సంక్రాంతికి ముందు ఒక్కో రైతు ఖాతాకు రైతు భరోసా కింద రూ.2000 చొప్పున ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎక్కడా లేనివిధంగా.. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసా, విత్తనం నుంచి విక్రయాల వరకు సేవలందించేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధరలతో పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకం, రెండు లక్షల బోర్లు లక్ష్యంగా అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరు, మోటార్ అందించేందుకు వైఎస్సార్ జలకళ లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా గత రెండున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.86,313 కోట్లు వ్యయం చేసింది. చెప్పిన దానికన్నా మిన్నగా.. చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సాయం అందిస్తోంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అన్నదాతలకు సాయంగా అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 మేర రైతన్నలకు ప్రయోజనం చేకూరుస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ.17,500. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 అందచేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500 చొప్పున, రెండో విడతగా అక్టోబర్లో పంట కోతల వేళ రబీ అవసరాల కోసం రూ.4,000, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో మూడో విడతగా రూ.2,000 చొప్పున సాయం అందిస్తోంది. -
నేడు రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధుల జమ
-
AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికి రూ.5,863 కోట్లు జమ 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది. ఇప్పుడు మూడో విడతలో ఇలా.. ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్ఓఎఫ్ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్ఓఎఫ్ ఆర్–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. -
గిరిజన రైతుకు ‘హక్కు’తో పాటు ‘భరోసా’
సాక్షి, అమరావతి: అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపచేయడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు గత రెండున్నరేళ్ల కాలంలో మూడు పర్యాయాల్లో రూ.750 కోట్ల మేర నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్న సంగతి తెల్సిందే. సొంత భూమి కలిగిన ఆసామికే కాకుండా అటవీ హక్కుల పట్టా (ఆర్వోఎఫ్ఆర్)లను పొందిన వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి 2021 నవంబర్ వరకు రాష్ట్రంలో 2,34,827 మంది గిరిజనులకు 4,79,105 ఎకరాలను పట్టాలుగా అందించడం జరిగింది. వాటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో 1,32,084 మంది గిరిజనులకు 2,44,827 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందించడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. దీంతోపాటు సాగుకు సాయమందిస్తూ వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం వర్తింపజేసింది. సీఎం జగన్కు రుణపడి ఉంటాను ప్రభుత్వం నాకు రెండెకరాల భూమికి హక్కు పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఇచ్చింది. దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. భూమి పట్టా ఇవ్వడంతోపాటు ‘రైతు భరోసా’ అందిస్తున్న ప్రభుత్వం నా కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. – పలాసి మోహనరావు, కోడా పుట్టు గ్రామం, విశాఖ జిల్లా. భూమి పట్టా ఇచ్చి సాగుకు ఊతం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపజేశారు. గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన భూముల్లో సాగుకు ‘రైతు భరోసా’తో ఊతమివ్వడం జరుగుతోంది. దీని వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. – పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్లో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న 12వ వ్యవసాయ విజన్ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సును ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర రవాణా, ఓడ రేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పర్షోత్తమ్ రూపాలా ఆర్బీకే స్టాల్ను ఆసక్తిగా తిలకించి, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల తీరుతెన్నులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టినవే ఈ ఆర్బీకేలని, వీటిద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి సాగు ఉత్పాదకాలను రైతుల గడప వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు. నాణ్యతా పరీక్షల నిర్వహణ కోసం దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను ఏర్పాటు చేశామన్నారు. మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ స్థాయిలో గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. చదవండి: (బీచ్రోడ్లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది) పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్ సేవలందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి గ్రామ స్థాయిలోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కమిషనర్ చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న కేంద్రమంత్రులు ‘ఆర్బీకేల గురించి ఇప్పటికే మేం విన్నాం. గుడ్.. గుడ్. వెరీమచ్ ఇంప్రెస్డ్’ అంటూ కితాబిచ్చారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర
నిజమే!! భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలింది. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువొస్తుందని ‘ఈనాడు’కు కూడా తెలుసు. ఆ ధాన్యానికి మామూలు ధాన్యం కన్నా తక్కువ ధర వస్తుందనేది కూడా నిజమే కదా? ఒకవేళ దానిక్కూడా మామూలు ధరే వస్తే... సాధారణ రకం ధర పెంచమని అడగరా? ఇవన్నీ రామోజీ రావుకు తెలియనివా? తెలిసి కూడా ‘వరికి కన్నీటి తడి’ అంటూ అక్కసు వెళ్లగక్కటమెందుకు? ఎందుకంటే రైతన్నల విషయంలో ఈ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం ఊహించటం కూడా చేయని పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా చేసుకుపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ ‘కన్నీటి తడి’. ‘ఈనాడు’ రాతల్లో నిజానిజాలేంటో... రైతుల విషయంలో ప్రభుత్వ అడుగులు ఎలా ఉన్నాయో వివరించే కథనమిది.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐదేళ్లు రాష్ట్రాన్నేలింది రామోజీ మిత్రుడు చంద్రబాబే. మరి ఆ ఐదేళ్లలో ఒక్కసారైనా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొన్నారా? వరదలొచ్చి రైతులు గగ్గోలు పెట్టినా పట్టించుకున్నారా? విచిత్రమేంటంటే నాటి ప్రభుత్వమే కాదు. ‘ఈనాడు’ సైతం పట్టించుకుంటే ఒట్టు. బాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు ఏటా పెట్టిన ఖర్చు రూ.8వేల కోట్లు. ఇపుడది రెట్టింపు కన్నా అధికం. రూ.17వేల కోట్ల పైమాటే. ఈ రెండేళ్లలో ధాన్యానికి ఏకంగా రూ.35 వేల కోట్లు ఖర్చుచేశారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పలేదే? ఎందుకని? అంతేకాదు!! ఇతర పంటలకు మరో రూ.8,200 కోట్లు వెచ్చించగా... దాన్లో పత్తి పంట కోసమే రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందనేది కాదనలేని వాస్తవం. పంటల కొనుగోలుకు 6400 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి కారణంగా రూ.600 కోట్ల నష్టం వచ్చినా... రైతుకు నష్టం రాకూడదని తపన పడ్డ ప్రభుత్వం ‘ఈనాడు’కు కనపడదెందుకు? గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9000 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల్ని ఈ ప్రభుత్వం భరించటం నిజం కాదా? మిల్లర్ల ప్రమేయం ఎక్కడైనా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఎక్కడుందసలు? గతంలో రాజ్యమంతా దళారులదే కదా? వారి చెప్పుచేతల్లో రైతు మోసపోవటమే కదా? నకిలీ విత్తనాలు, ఎరువుల నుంచి మొదలెడితే... అప్పులిచ్చి వడ్డీ కింద పంటను జమ చేసుకోవటమనే దౌర్భాగ్య పరిస్థితులను ఏనాడైనా ప్రశ్నించారా? ఇప్పుడు మోసాలకు తావు లేకుండా ఆర్బీకేల ద్వారానే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ రైతుకూ దక్కని భరోసా 10,778 ఆర్బీకేలతో ఇక్కడ దక్కుతోంది. ముఖ్యమైన డీలర్లంతా అనుసంధానమై ఉన్నారు కనక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఆర్బీకేలతోనే అందుతున్నాయి. గ్రామ స్థాయిలో... విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ అమల్లోకి వచ్చినా మరి శవాలపై పేలాలేరుకునే రీతిలో ఈ రాతలెందుకు? దీనికి జవాబొక్కటే. అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాభిమానం పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూపించి విషం కక్కాలి. ఇదే రామోజీ అజెండా. అందులో భాగమే ఈ అబద్ధపురాతలు. 100 శాతం ఈ క్రాపింగ్.. ఇపుడు పంటలకు సంబంధించిన వివరాల్లో చిన్నచిన్న మోసాలక్కూడా ఎలాంటి తావూ లేదు. నూరు శాతం ఈ–క్రాపింగ్. అంటే ప్రతి ఎకరం పారదర్శకం. ఎక్కడ.. ఏ రైతు... ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడన్నది ఈ–క్రాపింగ్తో సుస్పష్టం. ప్రతి ఒక్క ఎకరా నమోదవుతున్నది కాబట్టి సున్నా వడ్డీ, పంటల బీమా, పంటల కొనుగోలు అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అదే గతంలో బీమా చేయించాలంటే... పంట రుణం తీసుకున్న వారికి మాత్రమే బ్యాంకులు బీమా చేసేవి. అది కూడా 95 శాతానికే బీమా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. పంట రుణాలతో సంబంధం లేకుండా అందరికీ నూరు శాతం ఉచితంగా బీమా లభ్యమవుతోంది. ఇక రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించటం నుంచి వ్యవసాయ విద్యతో పాటు తగిన సలహాలివ్వటం.. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల కోసం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటం కూడా ఆర్బీకేలతో సాధ్యమవుతోంది. అంటే.. ఆర్బీకేల సారథ్యంలో వరి ధాన్యం మాత్రమే కాక... అన్ని పంటల కొనుగోలుకూ పక్కా వ్యవస్థ రూపుదిద్దుకుంది. బలంగా వేళ్లూనుకుని ఎదుగుతోంది. మిల్లర్ల జోక్యం లేదు. రైతులతో వారికి సంబంధమే లేదు. ధాన్యాన్ని ఆర్బీకేల్లో కొనుగోలు చేశాకే మిల్లర్లు రంగంలోకి వస్తున్నారు. ఇక వైఎస్సార్ జలకళ పేరిట రైతులకు ఉచితంగా బోర్లు కూడా తవ్విస్తున్నదీ ప్రభుత్వమే. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ‘ఈనాడు’కు ఏనాడూ కనిపించవెందుకు? విద్యుత్ గురించి పట్టించుకున్నారా? విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోలు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలమైన విద్యుత్ సరఫరాపైనా ముఖ్యమంత్రి మొదట్లోనే దృష్టి సారించారు. చంద్రబాబు హయాంలో 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. ఎందుకంటే అప్పట్లో ఒకవేళ ఇవ్వాలనే ఆలోచన వచ్చినా... ఇచ్చే వ్యవస్థ లేదు. ఫీడర్లు మొత్తం దెబ్బతిని వ్యవస్థ కునారిల్లి ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యాల్లో భాగంగా రూ.1,750 కోట్ల వ్యయంతో ఫీడర్ల వ్యవస్థను చక్కదిద్దారు. దీంతో పగటిపూట రైతుకు నిరాటంకంగా 9 గంటల విద్యుత్ ఇవ్వటం సాధ్యమవుతోంది. అంతేకాదు. అప్పట్లో యూనిట్ రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేలా చంద్రబాబు పీపీఏలు చేసుకుని ప్రయివేటు కంపెనీలకు ముడుపుల కోసం దోచిపెడితే... పారదర్శకంగా యూనిట్ రూ.2.49కే ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచే కొనుగోలు చేస్తున్న చరిత నేటి ప్రభుత్వానిది. కాకపోతే దీన్లో కూడా ‘ఈనాడు’కు వ్యతిరేక కోణమే కనిపిస్తోందన్నది వేరే సంగతి. ఇదీ... ఈనాడు రాతల కథ ‘ఈనాడు’ రాతలెంత అబద్ధాలో చెప్పటానికిదో ఉదాహరణ. శనివారంనాటి ‘ఈనాడు’ కథనంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని టి.నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు రాశారు. నిజానికి ఆయన రైతే కాదు. ఆయన పుట్టా నాగప్రసాద్ దగ్గర పనిచేస్తున్నాడు. నాగప్రసాద్ చాన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్లో 23 ఎకరాల్లో వరి సాగు చేశారు. 15 రోజుల క్రితం కోతలు కోయించారు. అదే సమయంలో వర్షాలు రావటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆర్బీకేకు సమాచారమిస్తే వ్యవసాయాధికారులు వచ్చి పంటను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం రాసుకొని వెళ్లారు. ఆర్బీకే ద్వారా మంచి రేటుకు ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టుకున్నా. ఆర్బీకే సిబ్బంది వచ్చి చూసి తడిసిన ధాన్యాన్ని విడతల వారీగా సేకరిస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన గోతాముల్లో నింపి రావులపాలెం మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం ఒబ్బిడి చేసి సంచుల్లో ఎక్కిస్తుండగా ‘ఈనాడు’ వాళ్లు వచ్చి అక్కడ పనికోసం వచ్చిన టేకి నాగేశ్వరరావు(కూలీ)ను ఆరా తీసారు. వర్షం వల్ల తడిసి రంగు మారింది. ఈసారి మంచి రేటు రావడం కష్టమే అన్నాడు. అతను నిజంగా రైతా..ఆ పొలం అతనిదా..కాదా అని కనీసం తెలుసుకోకుండా తమకనుకూలంగా రాసుకొని వెళ్లిపోయారు. ఆ బురద ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. అసలు ఈనాడు వాళ్లు తనతో మాట్లాడనే లేదని రైతు నాగప్రసాద్ ‘సాక్షి’తో వాపోయాడు. ఇదీ కథ. ఇలాంటి వ్యవస్థ ఎన్నడూ లేదు: కన్నబాబు ఈ–క్రాపింగ్ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఎకరంలో రైతులు ఏ పంట వేశారో ప్రభుత్వానికి తెలుసు. దీనికి కేవైసీ కూడా అనుబంధమై ఉంది కనక డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకే వెళతాయి. ఇతర రాష్ట్రాల నుంచి మోసపూరితంగా తెచ్చి ఇక్కడ విక్రయించే పద్ధతికి అడ్డుకట్ట వేశాం. రీసైక్లింగ్ను నివారించాం. నేరుగా రైతు మాత్రమే లబ్ధి పొందాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశం. దానికి పక్కా వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ ఏడాది దురదృష్టవశాత్తూ తుపాన్ల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యం కొందరు రైతుల వద్ద ఉంది. దీన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవంక కోరుతూనే... ఇక్కడ కూడా కొనుగోలు మొదలుపెట్టాం. కేంద్రం ప్రకటించిన 23 పంటలే కాక.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అరటి, బత్తాయి వంటి మరో 7 పంటలకూ కనీస మద్దతు ధర కల్పించాం. పొగాకు కొనుగోళ్లలో కార్పొరేట్లు రైతులను దెబ్బతీస్తున్న పరిస్థితి చూసి గతేడాది ముఖ్యమంత్రి ఆదేశాలతో మేమే వేలంలో పాల్గొన్నాం. ఐటీసీ వంటి దిగ్గజాలతో పోటీపడి రూ.130 కోట్లు వెచ్చించి పొగాకు కొన్నాం. ఒక్కటి మాత్రం నిజం!!. రైతులను వారి మానానికి వారిని వదిలేయకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం. అందుకే పెసలు, సజ్జలు కూడా కొంటున్నాం. మూడు వారాల్లో ధర చెల్లిస్తున్నాం. వీటన్నిటినీ వదిలి ఒకటి రెండు చోట్ల ఉన్న పరిస్థితిని ‘ఈనాడు’ భూతద్దంలో చూపిస్తోంది. అది వారి కడుపు మంటకు నిదర్శనమని చెప్పాలి. -
రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఆగ్రోస్) బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగు మందులను సరఫరా చేస్తున్న ఏపీ ఆగ్రోస్ను వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామిగా చేయనున్నారు. ఏపీ ఆగ్రోస్ను బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. ట్రాక్టర్లు, రోటోవేటర్లకు డిమాండ్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.2,133.75 కోట్లతో 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ), నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక యంత్ర పరికరాలతో 175 హైటెక్ హబ్లు, వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి ఐదు చొప్పున కంబైన్డ్ హార్వెస్టర్స్తో 1,035 సీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీకేల స్థాయిలో ఐదుగురు కంటే ఎక్కువ మందితో ఏర్పాటైన ఎంపిక చేసిన రైతు సంఘాలకు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, కంబైన్డ్ హార్వెస్టర్స్ తదితర పరికరాలను రాయితీపై సమకూరుస్తున్నారు. ఇప్పటికే తొలివిడతలో రూ.98.08 కోట్లతో 2,520 ఆర్బీకేల్లో సీహెచ్సీలను ఏర్పాటు చేశారు. రైతులకు ఎక్కువగా అవసరమయ్యేది ట్రాక్టర్లు, రోటోవేటర్లే. దుక్కి నుంచి కోత వరకు ప్రతీ దశలోనూ వీటి అవసరం ఉంటుంది. వాటి సరఫరా విషయంలో కంపెనీల షరతులు సీహెచ్సీల ఏర్పాటులో ప్రతిబంధకంగా మారాయి. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన సబ్సిడీ మొత్తం చెల్లిస్తేనే ట్రాక్టర్లు, రోటోవేటర్లు సరఫరా చేస్తామంటూ మెలిక పెట్టడంతో సీహెచ్సీల ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంది. విడతల వారీగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ట్రాక్టర్లు, రోటోవేటర్లు లేకుండా మిగిలిన యంత్ర పరికరాలతో సీహెచ్సీలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చారు. లాభాపేక్ష లేకుండా సీహెచ్సీలకు.. డిమాండ్ ఎక్కువగా ఉన్న ట్రాక్టర్లు, రోటోవేటర్ల డీలర్ షిప్లను ఏపీ ఆగ్రోస్ ద్వారా ఆయా కంపెనీల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇన్స్టిట్యూషనల్ డీలర్షిప్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన 40 శాతం సబ్సిడీతో పాటు తమ వాటా 10 శాతం కలిపి రైతు కమిటీలు జమ చేస్తే మిగిలిన 50 శాతం మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా ఏపీ ఆగ్రోస్ జమ చేసి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో తాము పొందిన డీలర్షిప్ ద్వారా ట్రాక్టర్లు, రోటోవేటర్లను తీసుకొని రైతు కమిటీలకు అందజేస్తుంది. ఆ మేరకు ఆర్బీకేల్లో గ్రౌండింగ్ అయిన తర్వాత జిల్లా స్థాయిలో ఏర్పాటైన కమిటీ పరిశీలన అనంతరం ప్రభుత్వం నుంచి 40 శాతం సబ్సిడీ మొత్తం రైతు కమిటీలకు జమ అవుతుంది. బ్యాంకులందించే 50 శాతం రుణ మొత్తాన్ని రైతు కమిటీలు నేరుగా ఏపీ ఆగ్రోస్కు జమ చేస్తాయి. ప్రస్తుతం సీహెచ్సీల నుంచి అందిన డిమాండ్ మేరకు 6,800 ట్రాక్టర్లు, మరో 8 వేలకు పైగా రోటోవేటర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. లాభాపేక్ష లేకుండా ఏపీ ఆగ్రోస్ ద్వారా డీలర్ ధరకే వాటిని సీహెచ్సీలకు సమకూర్చడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఏపీ ఆగ్రోస్ బలోపేతం ఏపీ ఆగ్రోస్ను మూసివేస్తున్నారంటూ కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏ ఒక్క కార్పొరేషన్ను మూసివేసే ప్రసక్తే లేదు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామిగా చేయడం ద్వారా ఏపీ ఆగ్రోస్ను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీహెచ్సీల ద్వారా ట్రాక్టర్లు, రోటోవేటర్లు సరఫరా కోసం ఇనిస్టిట్యూషనల్ డీలర్షిప్ తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖమంత్రి చాలాకంపెనీలు ముందుకొస్తున్నాయి.. సీహెచ్సీల్లో రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, రోటోవేటర్ల సరఫరా కోసం డిమాండ్ ఉన్న కంపెనీల డీలర్షిప్ తీసుకునేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశాం. డీలర్షిప్ ఇచ్చేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. వారి నుంచి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో కొనుగోలు చేసి సీహెచ్సీలకు అందజేసేందుకు త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తాం. – సంగంరెడ్డి కృష్ణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ఆగ్రోస్ -
ఇప్పుడిది రైతాంధ్ర
ఐఏఎస్ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవి. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇలాగే కష్టపడి చదివితే కచ్చితంగా ఐఏఎస్ల స్థానాల్లో కూర్చుంటారు. మీకు ఏం కావాలన్నా తగిన సహకారం అందిస్తాం. గిరిజన, వెనకబడిన ప్రాంతాల నుంచి కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదివే పరిస్థితి వస్తుంది. – విద్యార్థులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపే గొప్ప వ్యవస్థను నెలకొల్పి స్పష్టమైన మార్పు తెచ్చామన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి బృందాలు ఏపీకి వస్తున్నాయని, ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న గొప్ప మార్పు అని గుర్తు చేశారు. కరోనా సవాల్ విసిరినా రైతుల కోసం అడుగులు ముందుకేస్తూ అండగా నిలిచామన్నారు. వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానని, రైతుల కళ్లలో దీపావళి కాంతులు ముందుగానే చూడాలని ఆకాంక్షిస్తూ మూడు పథకాల నిధులను ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు రూ.2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టైంది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ... రైతన్నల కళ్లల్లో ముందే దీపావళి వెలుగులు ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపు 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం అక్టోబరులో ఇవ్వాల్సిన డబ్బులను జమ చేస్తున్నాం. రైతు భరోసా కింద గత ఆగస్టులో విడుదల చేసిన డబ్బులతో కలిపి ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో రూ.2,052 కోట్లు ఇస్తున్నాం. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు రైతులకు సైతం రైతు భరోసా.. ఈ రెండున్నరేళ్లలో ఒక్క రైతు భరోసా పథకానికే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమిని సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ... వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు రూ.112.70 కోట్లను సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. ఇ–క్రాప్ డేటా ఆధారంగా రూ.లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఇందులో గత సర్కారు సున్నా వడ్డీ కింద ఎగ్గొట్టిన బకాయిలు రూ.1,180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద ఈరోజు 1,720 రైతు గ్రూపులకు అంటే ఒక్కో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీనిద్వారా రైతులు నిర్దేశించిన సరసమైన అద్దెకే యంత్రసేవలు వారికి అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా ఐదు చొప్పున 1,035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్టాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్సీలను) అందుబాటులోకి తెస్తున్నాం. 29 నెలల్లో గణనీయమైన మార్పులు.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తెచ్చామన్నది ఈ సందర్భంగా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 29 నెలల్లో రైతుల కోసం ఎన్నెన్నో.. 9,160 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం. త్వరలో మిగిలిన ఆర్బీకేల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. ► కరోనా సవాల్ విసిరినప్పటికీ మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది. కరువుసీమలో సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రైతన్నలు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ► రైతులు నష్టపోకూడదని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తెచ్చాం. మద్దతు ధర రాక పొగాకు రైతులు ఇబ్బంది పడుతుంటే కొనుగోళ్లలో జోక్యం చేసుకుని బాసటగా నిల్చాం. ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) అందుబాటులోకి తెచ్చాం. కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కనీస మద్దతు బాటు ధరలు కల్పించాం. ► రైతు భరోసా కేంద్రాలను వన్ స్టాప్ సెంటర్లుగా (అన్ని అవసరాలు తీర్చే) తీర్చిదిద్దాం. ► వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు ద్వారా రైతులకు అన్ని విధాలుగా సలహాలు, సూచనలు ఇచ్చి.. ప్రతి అడుగులో తోడుగా నిలుస్తున్నాం. ► ఇ– క్రాపింగ్ ద్వారా పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు లాంటివి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ► కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థలో ఏఎంసీలను కూడా ఆధునికీకరిస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ► రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3,716 కోట్లు అందించగలిగాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ► రైతులకు పాల వెల్లువ, వైఎస్సార్ జలకళ.. ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ద్వారా తోడుగా నిలిచాం. జేఎఫ్ కెన్నడీ ఏమన్నారంటే.. ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా రైతు తాను పంట పండించడానికి కావాల్సిన అన్నింటినీ ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్గా కొనుగోలు చేస్తాడు. తాను కష్టపడి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్సేల్గా అమ్ముకునే పరిస్ధితి నెలకొందని అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అప్పట్లోనే చెప్పారు. మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితిని మనం మారుస్తున్నాం. పొలం వద్దకే ఆర్బీకే సిబ్బంది గిరిజన రైతునైన నాకు మీరు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ రైతు భరోసా మూడు దఫాలు అందింది. చాలా అనందంగా ఉన్నాం సార్. వైఎస్సార్ తరువాత ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మీ ప్రభుత్వంలో ఇచ్చారు. పోడు వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం. గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటారు. ఆర్బీకే సిబ్బంది నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు. –ఎం.విశ్వేశ్వర రావు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం, విశాఖపట్టణం జిల్లా ఇప్పుడు అన్నీ గ్రామంలోనే మీరు రైతాంగానికి వెన్నెముకలా నిలిచారు. వ్యవసాయ అధికారులు మా దగ్గరకు వచ్చి పంటల గురించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్ రైతులు ఆనందంగా ఉన్నారు. కరెంట్ బిల్లులు కట్టలేని సమయంలో వైఎస్సార్, మీరు చేసిన సాయం మరువలేం. ఇప్పుడు అన్నీ మా గ్రామంలోనే అందుతున్నాయి. –కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా మా కళ్లలో ఆనందం రైతు భరోసా ద్వారా మీరు అన్నదాతల కళ్లలో ఆనందం నింపారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్లి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. –శ్రీదేవమ్మ, లక్ష్మీదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా రైతులపై ప్రేమ మరోసారి చాటారు... సీఎం సార్.. మీరు చెప్పారంటే చేస్తారంతే అని రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి దీపావళి కంటే ముందే రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, యంత్ర సేవా పథకం సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఈరోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్ కూడా అధికారులను పిలిచి అభినందించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి ఆర్బీకే మోడల్ను తాము కూడా అనుసరిస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్పుట్స్ ఇవ్వటానికే పరిమితం కాకుండా ఆర్బీకేలను విజ్ఞాన కేంద్రంగా, సేవా నిలయాలుగా మార్చడం గొప్ప విషయం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు. కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?. రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?. దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. చదవండి: (రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింది. అక్టోబర్ నెల రైతుకు చాలా కీలకం. అందుకే మూడు విడతలుగా విభజించాము. రైతులకు మేలు చేయడం కోసం రూ.12,500 నుంచి 13,500 చేశారు. కౌలు రైతులకు కూడా ఈ భరోసా అందిస్తున్నాం. చెప్పిన మాట చెప్పినట్లుగా విడుదల చేస్తున్న ప్రభుత్వం మాది. ఇంత సంక్షోభంలోనూ అమలు చేయడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. -
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల
-
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు చెల్లించాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. (చదవండి: మాది రైతు పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్) ముఖ్యమంత్రి ఏమన్నారంటే... ‘‘ వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం... ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటిన నుంచి సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1674 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 మంది బ్యాంకింగ్ కరస్పాండెట్లను కూడా పెట్టాం. మిగిలిన చోట్లా కూడా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంటరుణాలు అందుకునేందుకు బ్యాకింగ్ కరస్పాండెంట్ల సేవలు మీకు బాగా ఉపయోగపడతాయి. వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీతోపాటు వైయస్సార్ యంత్రసేవా పథకం కింద 1720 గ్రూపులకు రూ. 25.55 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ♦రాష్ట్రవ్యాప్తంగా రూ.2134 కోట్లతో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లను పెడుతున్నాం ♦29 నెలల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం ♦దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం.. నీటితో పుష్కలంగా ఉంది ♦రైతుకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు ♦కరోనా సవాల్ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం ♦వ్యవస్థలను సరిదిద్దుతున్నాం ♦మార్కెటింగ్ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం ♦ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసుకు వచ్చాం ♦పొగాకుకు కూడా ధరల స్థిరీకరణను వర్తింప చేస్తాం ♦జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాం ♦విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా అన్నింట్లోనూ కూడా రైతులను చేయిపట్టుకుని ఆర్బీకేలు నడిపిస్తున్నాయి ♦ఇలాంటి గొప్ప మార్పులు తీసుకు వస్తున్నాం ♦వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేస్తాం ♦ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. నాలుగు అంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేశాం ♦సలహాలు, సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాం ♦ఇ- క్రాపింగ్ అన్నది.. ప్రతి రైతుకు, ప్రతి పంటకూ నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు, పంటరుణాలు, సున్నావడ్డీలు ఇవన్నీ కూడా పారదర్శకంగా అందిస్తున్నాం ♦ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పథకానికి ఇ- క్రాపింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నాం ♦యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦గ్రామ స్థాయిలో వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తున్నాం ♦ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకులను ఉంచాం ♦ప్రతి సేవను వారిద్వారా అందిస్తున్నాం ♦సహకార వ్యవస్థలో హెచ్ఆర్విధానాన్ని తీసుకు వస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నాం ♦సీఎం యాప్ద్వారా.. రైతులు ధరల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే.. వెంటనే వారిని ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం ♦ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే కనీస గిట్టుబాటు ధరలను వర్తింపు చేయడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఎంఎస్పీ వర్తింపు చేస్తున్నాం: ♦ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది ♦కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్లు మంజూరుచేస్తూ... వ్యవసాయ మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నాం ♦కల్తీ నివారణమీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు ♦కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నాం ♦ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా కల్తీలేని వాటిని అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం ♦పగటిపూటే రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశాం ♦ఇది కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది ♦నాణ్యమైన కరెంటు ఇచేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీడర్ల అభివృద్ది కోసం రూ.1700 కోట్ల రూపాయలు కూడామనం ఖర్చు చేశాం ♦29 నెలల కాలంలో వైయస్సార్ ఉచిత పంటల భీమా ద్వారా 31.7లక్షలమంది రైతులకు రూ. 3716 కోట్ల రూపాయలు అందించగలిగాం ♦ఇది కాక ధాన్యం సేకరణకోసం రూ.35వేల కోట్ల పైచిలుకు ఖర్చుచేశాం ♦మరో రూ.1800 కోట్ల రూపాయలతో పత్తిపంటను కూడా కొనుగోలు చేశాం ♦ఇతర పంటలకోసం రూ.6400 కోట్లకుపైగా ఖర్చు చేశాం ♦ధరలు పడిపోకూడదు.. రైతు నష్టపోకూడదని.. ఈ కార్యక్రమాలు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది ♦గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం ♦ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో అందించేలా చేస్తున్నాం ♦ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లో నే ఇచ్చే కొత్త ఒరవడిని తీసుకు వచ్చాం ♦ఏపీ అమూల్ పాలవెల్లువను తీసుకు రాగలిగాం ♦ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద రూ.1.5కే యూనిట్ అందిస్తున్నాం ♦రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు సబ్సిడీ రూపంలో ఆక్వారైతులకు ఇచ్చాం ♦రైతన్నల ఆత్మహత్యలు చూడ్డానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాలనుంచి బృందాలు వస్తున్నాయి ♦సకాలంలో మంచి వర్షాలు పడాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను -
రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ నగదు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) 50.37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది. (చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..) ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు 2019–20లో 45.23 లక్షల మంది కుటుంబాలకు రూ.6,162.45 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో 49.40 లక్షల మంది రైతులకు రూ. 6,750.67 కోట్లు అందజేసింది. అటవీభూమి సాగుచేస్తున్న వారితోపాటు కౌలుదారులు కలిపి తొలి ఏడాది 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది లబ్ధిపొందారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయమందించిన ప్రభుత్వం రెండోవిడతగా నేడు 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. భూమిలేని 1.50 లక్షల మందికి భరోసా ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడేళ్లుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. (చదవండి: దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు) పారదర్శకంగా అర్హుల ఎంపిక ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్ పోర్టల్లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు. 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీమేరకు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు బాసటగా ఉండటమేగాక ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు ముఖ్యమంత్రి వారిఖాతాల్లో జమచేస్తున్నారు. 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేసింది. ఖరీఫ్–2019 సీజన్లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ–2019–20 సీజన్లో 5.55 లక్షల మందికి రూ.92.38 కోట్లు చెల్లించింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి ఈ–క్రాప్లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించారు. ఈ సీజన్లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. యాంత్రీకరణకు చేయూత చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో 1,720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు (40 శాతం) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం (రూ.213 కోట్లు) రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం (1,067 కోట్లు) బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. తొలివిడతగా గ్రామస్థాయిలో 3,250 సీహెచ్సీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కాగా ఇప్పటికే 789 సీహెచ్సీలను రైతు దినోత్సవం రోజైన జూలై 8వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రూ.9.07 కోట్ల సబ్సిడీని జమచేశారు. తాజాగా రూ.69.87 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 1,720 యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 40 శాతం సబ్సిడీ మొత్తం రూ.25.55 కోట్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. -
ఆర్బీకేలకు జాతీయస్థాయి ప్రశంసలు
ఆర్బీకేల కోసం చాన్నాళ్లుగా వింటున్నాం. చాలా మంచి ఆలోచన. వీటిద్వారా సంక్షేమ పథకాల అమలుతోపాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు చాలా బాగుంది. వీటిని జాతీయస్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. –అమితాబ్కాంత్, సీఈవో, నీతి ఆయోగ్ వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ఆలోచన వినూత్నంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వీటిద్వారా రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న తీరు అద్భుతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు. – తోమియో షిచిరీ, భారత ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేల) జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల ఏర్పాటు, వాటి పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తో పాటు నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జాతీయస్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో తొలుత ఎఫ్ఏవోలోను, తర్వాత నీతి ఆయోగ్లోను ఆమె ఇచ్చిన ప్రజంటేషన్ పట్ల వారు అమితాసక్తిని ప్రదర్శించారు. ఆర్బీకేలు ఎప్పుడు ప్రారంభించారు. వాటిద్వారా ఏయే సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి.. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని చెప్పారు. ఇవి ఆయన మానస పుత్రికలని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. వాటిలో స్మార్ట్టీవీ, డిజిటల్ లైబ్రరీ, కియోస్క్, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్ కిట్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాం. అనుభవం, నైపుణ్యతగల 14 వేలమందికి పైగా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ద్వారా ఆర్బీకేలు కేంద్రంగా గ్రామస్థాయిలో విత్తు నుంచి విపణి వరకు రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్నాం. సీజన్కు ముందుగానే ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచుతున్నాం. కియోస్క్లో బుక్ చేసుకున్న గంటల్లోనే వాటిని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆర్బీకేలనే పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దాం. వీటికి అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. పంటల నమోదు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని ఆమె వివరించారు. సేంద్రియ పాలసీకి టెక్నికల్ పార్టనర్గా ఉంటాం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని పూనం మాలకొండయ్య చెప్పారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకొస్తున్నామని, ఇందుకోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఎఫ్ఏవో కంట్రీ డైరెక్టర్ షిచిరీ మాట్లాడుతూ తప్పకుండా సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. టెక్నికల్ పార్టనర్గా కూడా ఉంటామని తెలిపారు. ఆర్థికంగా కూడా చేయూత ఇస్తామన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, పనితీరు కోసం ఐక్యరాజ్యసమితికి కూడా నివేదిస్తామని చెప్పారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ మాట్లాడుతూ ఆర్బీకేల ప్రయోగం మంచిదేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై జాతీయస్థాయిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: ‘ప్రకృతి’ సాగుకు పట్టం
సాక్షి, అమరావతి : ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఆ విధానాన్ని మరింత ప్రోత్సహించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలకు అనుబంధంగా నేచురల్ ఫామింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లను (ఎన్ఎఫ్–సీహెచ్సీ) ఏర్పాటుచేస్తోంది. ఏపీ రైతు సాధికారత సంస్థ (ఏపీ ఆర్వైఎస్ఎస్)–ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫామింగ్ (ఏపీసీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 3,500 పంచాయతీల్లో ఇప్పటికే ప్రకృతి సాగు ఉద్యమంలా సాగుతోంది. విత్తు నుంచి కోత వరకు పాటించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకేలను ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. కూలీల కొరతకు చెక్ పెడుతూ.. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల పేరిట ఆర్బీకేలకు అనుబంధంగా సీహెచ్సీలను ఏర్పాటుచేస్తున్నట్లుగానే రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రకృతి వ్యవసాయ సీహెచ్సీలను ఏర్పాటుచేస్తోంది. ప్రకృతి సాగుచేసే రైతులతోనే.. ఇందులో భాగంగా.. తొలి విడతలో 2,996, రెండో విడతలో మరో 2,000 సీహెచ్సీలు ఏర్పాటుచేయబోతున్నారు. గ్రామాల్లో ప్రకృతిసాగు చేస్తూ 2–4 పాడి సంపద కల్గిన రైతు/రైతు సంఘాలను ఎంపికచేసి వారికి 40–50 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తారు. ఎంపిక చేసిన రైతు క్షేత్రంలో కనీసం నాలుగు పశువులను ఉంచేందుకు వీలుగా షెడ్లు నిర్మిస్తారు. ఇక్కడ ఏర్పాటుచేసే సీహెచ్సీల్లో కషాయాలు, ఘన, జీవామృతాలు తయారుచేసే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతారు. బహుముఖ వ్యూహంగా ప్రకృతి వ్యవసాయం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని బహుముఖ వ్యూహంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు ఆర్బీకేలకు అనుబంధంగా ఈ సీహెచ్సీలను ఏర్పాటుచేస్తున్నాం. ఎరువులు, పురుగులు, కలుపు మందుల వినియోగాన్ని క్రమేపి తగ్గిస్తూ దశల వారీగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఊళ్లో ప్రకృతి సాగుచేసే రైతుల ఆధ్వర్యంలోనే వీటిని ఏర్పాటుచేయబోతున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ మంత్రి ప్రతీ రైతూ ప్రకృతి సాగువైపు.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గడిచిన మూడేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించగలిగాం. ప్రతీ రైతును ప్రకృతి సాగువైపు మళ్లించాలన్న లక్ష్యంతోనే ఆర్బీకేలకు అనుబంధంగా ఈ సీహెచ్సీలను తీసుకొస్తున్నాం. త్వరలోనే విధి విధానాలను రూపొందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. – టి. విజయకుమార్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, రైతు సాధికార సంస్థ స్థానిక అవసరాలకనుగుణంగా యంత్ర పరికరాలు ► సీహెచ్సీల్లో కనీసం 200 లీటర్ల ఘన జీవామృతం తయారుచేసేందుకు వీలుగా కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు, నీమ్ పల్వరైజర్, ఎస్ఎస్ హెవీ డ్యూటీ మిక్సర్ గ్రైండర్ ఏర్పాటుచేస్తారు. ► బోర్వెల్స్ కింద వరి సాగుచేసే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే సీహెచ్సీల్లో బాటల విధానంలో విత్తేందుకు (లైన్ సోయింగ్) ఉపయోగించే ఎస్ఆర్ఐ మార్కర్స్, కలుపుతీతకు ఉపయోగించే డ్రాన్కోనో పరికరం, అన్నిరకాల స్ప్రేయర్లు, పవర్ వీడర్లను అందుబాటులో ఉంచుతారు. ► మెట్ట, వర్షాధార పంటలైన వరి, పత్తి, వేరుశనగ, శనగలు, కందులు వంటివి సాగుచేసే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే సీహెచ్సీల్లో విత్తనాలు వేసేందుకు డ్రాన్డ్రమ్ సీడర్స్, ఎస్ఆర్ఐ మార్కర్, హ్యాండ్పుష్ సీడర్, సీడ్ బ్లర్స్, కోనో వీడర్స్, డ్రై ల్యాండ్ వీడర్లను ఏర్పాటుచేస్తారు. ► ఎన్ఎఫ్ సీహెచ్సీల్లో పవర్ వీడర్, బ్రష్ కట్టర్స్, చెప్కట్టర్స్, క్నాప్సక్, బ్యాటరీ, సోలార్, పవర్ స్పేయర్లను ఉంచుతారు. -
Andhra Pradesh: ఆర్బీకేల్లో పాఠాలు
పొలంలో రైతుల కష్టాలేంటి? ఏయే తెగుళ్లను ఎలా గుర్తించాలి? వాటిని ఏ విధంగా అరికట్టాలి? ఏ పంటలకు ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తాయి? పురుగు మందుల పిచికారి ఏ విధంగా జరగాలి? అసలు తెగుళ్లు సోకకుండా ముందస్తు చర్యలు ఏమైనా ఉన్నాయా? ఇందుకు విత్తు దశ నుంచే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? పంట చేతికొచ్చే దశలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? మార్కెటింగ్లో ఎలాంటి ఇక్కట్లు ఉన్నాయి? కొత్త పంటల సాగుతో ఎక్కువ లాభాలు ఎలా పొందాలి? అధునాతన యంత్ర సామగ్రిని ఏ విధంగా సమకూర్చుకోవాలి.. ఎలా ఉపయోగించాలి? ఆక్వా, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో తీసుకోవా ల్సిన జాగ్రత్త లేంటి? వ్యాధుల బారిన పడకుండా పశు సంపదను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలన్నింటినీ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివితే సరిపోదు. వీటన్నింటినీ ప్రత్యక్షంగా గమ నించి తెలుసుకున్నప్పుడే ఆయా కోర్సుల్లో పరిపూర్ణ విజ్ఞానం విద్యార్థుల సొంతం అవుతుంది. అప్పుడే వారు జాతీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ దిశగా మన రాష్ట్ర విద్యార్థులను ఆర్బీకే వేదికగా సమా యత్తం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా (ఆర్బీకేలు) కేంద్రాలు యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు నేర్పే విద్యాలయాలుగా మారబోతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా క్రమం తప్పకుండా 3 నెలల పాటు ఆర్బీకేల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు వర్సిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. విత్తు నుంచి విపణి వరకు గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఆర్బీకేలు కేంద్రంగా ఏడాదిన్నరగా అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాలు ఇక్కడ అమలవుతున్న ఆర్బీకే వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతో పాటు ఎరువులను డోర్ డెలివరీ చేస్తున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) ద్వారా అద్దెకు సాగు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్, స్మార్ట్ గ్రంథాలయాలు, కియోస్క్ల ద్వారా అంతర్జాతీయంగా వస్తోన్న ఆధునిక పోకడలు, మెళకువలను మారు మూల ప్రాంతాల రైతులకు అందిస్తూ నాలెడ్జ్ హబ్లుగా తీర్చిదిద్దారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పంటల ఉత్పత్తులను కళ్లాల వద్దే అమ్ముకునే ఏర్పాటు చేశారు. యూనివర్సిటీల వీసీల నుంచి శాస్త్రవేత్తల వరకు, క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్ స్థాయి అధికారుల వరకు క్రమం తప్పకుండా ఆర్బీకేలను సందర్శిస్తూ.. పలు సేవలను రైతు లోగిళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు. విద్యాలయాలుగా ఆర్బీకేలు రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్ను దన్నుగా నిలుస్తోన్న ఆర్బీకేలను యూనివర్సిటీలకు అనుబంధంగా విద్యాలయాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ చివరి ఏడాదిలో బోధనాస్పత్రుల్లో తర్ఫీదునిస్తారు. సాంకేతిక విద్యనభ్యసించే వారికి అప్రంటీస్ ద్వారా ప్రాక్టికల్ మార్కుల్లో ప్రాధాన్యత ఇస్తారు. అదే రీతిలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో వివిధ కోర్సులు అభ్యసించే వారు ఆయా వర్సిటీల పరిధిలో జరిగే ప్రాక్టికల్స్కు మాత్రమే హాజరయ్యే వారు. ఇక నుంచి వీరు చివరి ఏడాది విధిగా మూడు నెలల పాటు ఆర్బీకేలు కేంద్రంగా ప్రాక్టికల్స్ నిర్వహించేలా విద్యా బోధనలో మార్పులు తీసుకొస్తున్నారు. క్షేత్ర స్థాయి అవగాహనే లక్ష్యం సాగు విధానాల్లో సంతరించుకున్న మార్పులు, ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు లక్ష్యాలు, వాటి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. కార్యక్రమాల అమలు తీరుతో పాటు రైతులు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? వంటి అంశాలపై క్షేత్ర స్థాయి పరిశీలన లక్ష్యంగా విద్యార్థుల ప్రాక్టికల్స్ జరగనున్నాయి. పొలంబడులు, పట్టు, తోట బడులు, పశు విజ్ఞాన, మత్స్య సాగుబడుల్లో రైతులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. సాగులో రైతులు పాటిస్తున్న ఉత్తమ యాజమాన్య, సేంద్రియ సాగు పద్ధతులను పరిశీలించడం, ఆక్వా కల్చర్ (మెరైన్, మంచి, ఉప్పునీటి)లో రైతులు పాటించే సాగు విధానాలు, పశు పోషణ, పాల సేకరణలో పాటించే పద్ధతులపై అవగాహన పెంచుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన ప్రాక్టికల్స్లో విద్యార్థులకు మార్కులు కేటాయించేలా విద్యా బోధనలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా బోధనలో మార్పులు విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చే వేళ పరిశోధనలు చేసే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆర్బీకేల్లో వారికి కనీసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు విద్యాబోధనలో మార్పులు తీసుకొస్తున్నాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రికలు వైఎస్సార్ ఆర్బీకేలు. దేశంలో మరెక్కడా లేని విధంగా వీటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందుతున్నాయి. అలాంటి కేంద్రాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మంచి ఆలోచన. తరగతి గదుల్లో నేర్చుకునే విషయాలకు ఎన్నో రెట్లు ఇక్కడ వారెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
ఆర్బీకే ‘కియోస్క్’లోనే అన్నీ
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేసేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను విజ్ఞాన భాండాగారాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చి దిద్దుతోంది. ఆర్బీకేల్లో ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన మ్యాగజైన్స్, పుస్తకాలతో లైబ్రరీలు, సాగు సూచనలపై వీడియో సందేశాలతో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయ ఉత్పాదకాలను బుక్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్న డిజిటల్ కియోస్క్(2.0)లను సమాచార క్షేత్రంగా రూపొందిస్తోంది. విత్తు నుంచి విపణి వరకు రైతులకు ఉపయోగపడే సమగ్ర సమాచారాన్ని ఈ కియోస్క్ల ద్వారా రైతులకు అందిస్తున్నారు. 9,484 ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్లు రైతుల చెంతకే సాగు ఉత్పాదకాలను అందించాలన్న సంకల్పంతో గ్రామసచివాల యాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,725 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 234 ఆర్బీకేలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగతావి గ్రామాల్లో రైతులకు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు 9,484 ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్లు ఏర్పాటు చేశారు. సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వివరాలను వీటిలో పొందుపర్చారు. రైతులు తమకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకొని ఆన్లైన్ చెల్లింపులు జరపగానే గంటల వ్యవధిలోనే డెలివరీ చేస్తున్నారు. గత ఏడాదిగా కియోస్క్లను సాగు ఉత్పాదకాల బుకింగ్ కోసమే వినియోగిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే సమగ్ర సమాచారాన్ని వీటి ద్వారా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో కియోస్క్లను మల్టీపర్పస్ ఇన్ఫర్మేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. కియోస్క్లలో ప్రదర్శించే సమాచారం.. కియోస్క్ల ద్వారా రోజూ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన సంక్షిప్త వార్తలు ప్రదర్శిస్తున్నారు. ఆర్బీకేల్లో అందుబాటులో ఉండే సాగు ఉత్పాదకాలు, సీహెచ్సీల్లో యంత్ర పరికరాల అద్దెల వివరాలు తెలుసుకోవచ్చు. పంటలవారీగా నాణ్యతా ప్రమాణాలను వెల్లడించడంతోపాటు ఆర్బీకేకు ఐదు కిలో మీటర్ల దూరంలోని సేకరణ కేంద్రాలు, తాజా కనీస మద్దతు ధరల వివరాలు చూడవచ్చు. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల తాజా ధరలు, ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతాల వారీగా గ్రాఫ్లతో ధరలు, దిగుబడి, వ్యాపార వివరాలను ప్రదర్శిస్తారు. సమీపంలోని ప్రయోగశాలలు, పరీక్షల వివరాలు తెలుసుకోవచ్చు. వాతావరణ తాజా సమాచారం, మండలాల వారీగా వాతావరణ వివరాలు, తేమ శాతం, గంటల వారీగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం వివరాలు ప్రదర్శిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అర్హతలు ఏమిటి? దరఖాస్తు విధానం వివరాలను కియోస్క్ ద్వారా అందిస్తారు. ఆర్బీకే చానల్ ద్వారా ఏ సమయంలో ఏ పంటకు చెందిన ప్రసారాలు ఉంటాయో కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా ‘వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సింగిల్ ప్లాట్ఫామ్ కిందకు తెచ్చి రైతులకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఆర్బీకేల్లో కియోస్క్లను బహుముఖ ప్రయోజనాలతో తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఉత్పత్తుల ధరలు ఏ మార్కెట్లో ఏ సమయంలో ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. రైతులకొచ్చే ప్రతీ సందేహాలకు కియోస్క్ల ద్వారా జవాబు దొరికేలా మల్టీపర్పస్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్గా తీర్చిదిద్దుతున్నాం’ – హెచ్.అరుణ్కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
వ్యవసాయ సేవల భరోసా
-
వ్యవసాయ రూపురేఖల్ని మారుస్తున్న ఆర్బీకేలు
-
రైతు సంక్షేమంలో ఆంధ్రా అద్భుతం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి చేపట్టిన చర్యలన్నింటినీ మనçస్ఫూర్తిగా సమర్థిస్తున్నా. ప్రత్యేకించి రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా వంటి పథకాలు అద్భుతం. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతుల్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాటన్నింటినీ ప్రశంసిస్తున్నా. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు రాకుండాపోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా.. ఆ పని ఏ ప్రభుత్వం చేసినా హర్షణీయమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.ఆ విధానాలన్నీ నచ్చాయి కనుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఏపీ వ్యవసాయమిషన్లో సభ్యుడిగా ఉన్నా.. ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ వ్యవసాయ మిషన్ సభ్యుడు డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ మాటలివి. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు – వ్యవసాయంపై వాటి ప్రభావం గురించి గుంటూరులో ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ గ్రామీణ జర్నలిస్టు సాయినాథ్ ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దుపై జరుగుతున్న పోరాటం మొదలు మీడియా తీరుతెన్నుల వరకు అనేక అంశాలపై ఆయన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. పార్లమెంటు సంపన్నుల పరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ అందరికీ రాలేదన్నారు. నోరూవాయ లేని సామాన్యుడికి గొంతుకగా ఉండాల్సిన మీడియా సైతం కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కిందని చెప్పారు. స్వాతంత్య్రం కోసం రక్తమాంసాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగధనులకు ఈవేళ దేశంలో నెలకొన్న పరిస్థితి క్షోభకలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రైతు కోసం ఏంచేసినా మంచిదే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఏర్పాటు హర్షణీయం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడా ఆ హామీని విస్మరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు వ్యయాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టింది. వాటిల్లో ఆర్బీకేలు ఒకటి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి. వ్యవసాయ మిషన్లో నేనూ సభ్యుడిగా ఉన్నా. రైతును క్షేమంగా ఉంచేందుకు ఏంచేసినా మంచిదే. ఆర్బీకేలు ఎలా పనిచేస్తున్నాయో నేను తెలుసుకుంటున్నా. వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. వ్యవసాయంపై ఏదైనా చట్టాన్ని తేవాలంటే దేశంలోని మూడింట రెండు వంతుల రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. అటువంటిదేమీ లేకుండానే కేంద్రం చట్టాలు తెచ్చింది. ఈ తీరును నిరసించాలి. ఆ చట్టాల్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అవి అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు రైతులు ప్రత్యేకించి కౌలురైతులు బాగా చితికిపోతారు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించమని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అది సంపన్న రైతుల పోరాటమా?.. మతిలేని మీడియా ప్రచారమది.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 8 నెలలుగా సాగుతున్న రైతు పోరాటంపై ఐఎంఎఫ్ డైరెక్టర్గా ఉన్న సూర్జత్ భల్లా వంటి అపర మేధావులు, కొన్ని మతిలేని మీడియా సంస్థలు పేలేవి అవాకులు చెవాకులు. అది సంపన్న రైతుల పోరాటమని, నాలాంటి వాళ్లు సంపన్న రైతుల సోషలిజం కోసం పోరాడుతున్నామంటూ వెటకారమాడుతున్నారు. వాళ్ల మాదిరిగా కార్పొరేట్ల సోషలిజం కోసం పోరాడలేం కదా.. అందుకే రైతులకు మద్దుతు ఇస్తున్నాం. ఒక్కసారి పంజాబో, హరియాణానో, ఉత్తరప్రదేశో వెళ్లి చూస్తే ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు సాదాసీదా రైతులు ఎంత కష్టపడుతున్నారో, తాము తినకపోయినా పర్లేదు, ఈ రూపాయి ఉంచండని ఎంతలా దాతృత్వం చూపిస్తున్నారో తెలుస్తుంది. రైతు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఒక్కరోజులో సంపాయించే వాళ్లకు ఢిల్లీ పోరాటం ఏమర్థమవుతుంది? ప్రజాస్వామ్య చరిత్రలో అదో మహత్తర పోరాటం. దాని విలువ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి దేవాలయమంటున్న పార్లమెంటులో సామాన్యులకు చోటులేకుండా పోతోంది. 2004లో 32 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులైతే 2019 నాటికి ఇది 88 శాతానికి చేరింది. సమాజంలో అత్యధికులుగా ఉన్న వర్గాలకు వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే భయం వేస్తోంది. పేద ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్నదే నా ఆవేదన. స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగశీలురు ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చిన ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నారు. స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ కొందరికే పరిమితమైంది. అయినప్పటికీ ఈ దేశ ప్రజలు చాలా శక్తిమంతులనే నా భావన. 1971లో దక్షిణ ముంబై నుంచి నావల్ టాటా అనే సంపన్నుడు పార్లమెంటుకు పోటీచేశారు. ఆయనకు ఎంత మెజారిటీ రావచ్చని పోల్ పండిట్లు లెక్కిస్తుంటే ఆ ప్రాంత ప్రజలు అనామకుడైన ఓ ట్రేడ్ యూనియన్ లీడర్ కైలాష్ నారాయణ్ను గెలిపించారు. అందువల్ల ఈ దేశ ప్రజలపై నాకు అపార విశ్వాసం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పక తమ ఆయుధాన్ని బయటకు తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. పెట్టుబడి సాయం అద్భుతం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం, ధరల స్థిరీకరణ నిధి, కనీస మద్దతు ధరలకు పంటల కొనుగోలు వంటివి ప్రాధాన్యత కలిగినవి. వాటికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. వీటితోపాటు చాలా సానుకూల నిర్ణయాలున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఏడాది కాలంగా అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోలేదు. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడాల్సి ఉంది. పథకాల వరకైతే అవి అద్భుతం. -
ఏపీ: అన్నదాతలకు అక్టోబర్లో సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఖరీఫ్–2019 సీజన్లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019–20 సీజన్లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అలాగే టీడీపీ హయాంలో 42.32 లక్షల మందికి బకాయిపడిన రూ.784.72 కోట్లను కూడా చెల్లించింది. ఇప్పుడు ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు వచ్చే అక్టోబర్లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్లో 86.17 లక్షల మంది రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. నిబంధనల ప్రకారం.. పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్లో నమోదు చేయించుకుని ఉండాలి. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం తెస్తున్నారు. అలాగే వారు సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్ఎస్వీపీఆర్ పోర్టల్లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్లోడ్ చేసేలా పర్యవేక్షించనున్నారు. సకాలంలో చెల్లించి రాయితీ పొందండి.. ఖరీఫ్–2020 సీజన్లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్ నెలాఖరులోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
'ఆర్బీకేలు' దేశానికే ఆదర్శం
(ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి, అమరావతి) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) వ్యవస్థ దేశానికే ఆదర్శమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఇంటి ముంగిటే అందించడం దేశంలోనే సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్బీకేలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల జీవనరేఖలతో పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తానీ విషయాన్ని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర వ్యవసాయ విధానానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నాబార్డ్ సంపూర్తిగా సహకరిస్తుందని, నిధులు సమకూర్చేందుకు వెనుకాడబోనని హామీ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్బీకేల పనితీరు బాగుంది ఆ మధ్య రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు నేనొక ఆర్బీకేను, రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్పీవోను) స్వయంగా పరిశీలించా. అక్కడి రైతులు చెప్పిన దాన్నిబట్టి ఆర్బీకేల ప్రయోగం చాలా సక్సెస్ అయినట్టే. ఇప్పటికే రైతులు ఈ కేంద్రాల నుంచి లక్షలాది ఆర్డర్లు పెడుతున్నారు. ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు తమ గ్రామానికి తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ఇలా జరగడమంటే రైతుకు చాలా వ్యయప్రయాసలు తప్పినట్టు. నాణ్యమైన ఉత్పాదకాలను 72 గంటల్లోగా రాబట్టడమే వ్యవసాయంలో కీలకం. అందుకే ఆర్బీకేల వ్యవస్థ ఆదర్శనీయం అంటున్నా. కాలాన్నిబట్టి రైతులు మారాలి మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులూ మారాల్సిన అవసరం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొద్దిమంది చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల మంది రైతుల్లో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరహా రైతులు నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక్క పంట వేస్తే సరిపోదు. ఉన్న భూమిని పలు రకాలుగా వినియోగించుకోవాలి. ఆ భూమిలోనే ఆహారధాన్యాలు, పండ్లతోట, కూరగాయలు సాగుచేస్తూ.. కోళ్లు, పశువుల పెంపకం చేపట్టాలి. అప్పుడే రైతు సుస్థిరత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక పంట పోయినా మరొకటి ఆదాయాన్నిస్తుంది. అందువల్ల పంటల సరళి, ఆలోచనా ధోరణి మారాలి. వ్యవసాయ శాఖ, యూనివర్శిటీల కృషి పెరగాలి.. రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలన్న దానిపై ప్రధాన బాధ్యత వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలది. ఈ విభాగాల్లో ఉండే వాళ్ల కృషి ప్రధానం. ప్రస్తుతం కావాల్సింది ఉత్పత్తి కాదు. రైతు సాధికారత. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. ఏంచేస్తే రైతు ఆదాయం పెరుగుతుందో, పండించిన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఎలాగో రైతులకు చెప్పాలి. కమతాలు చిన్నవైన ప్రస్తుత తరుణంలో ఉన్న భూమిపై అదనపు ఆదాయం ఎలా సాధించవచ్చో చూపాలి. మాగాణిలోను నూనెగింజలు సాగుచేయవచ్చు వ్యవసాయ రంగంలో ఇప్పుడు హరిత, నీలి, వైట్, రెడ్ విప్లవాలు నడుస్తున్నా.. కావాల్సింది మాత్రం బ్రౌన్ విప్లవమే. నూనెగింజల్ని పండించడమే బ్రౌన్ విప్లవం. సుమారు రూ.1.10 కోట్ల విలువైన వంటనూనెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ స్థాయిలో మన నూనెగింజల దిగుబడులు లేవు. రైతుకు అదనపు ఆదాయం రావాలంటే నూనెగింజల సాగు చేపట్టాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. నాబార్డ్ కూడా సహకారం అందిస్తుంది. ఏపీలో మాగాణి భూముల్లో కూడా నూనెగింజల్ని సాగు చేయవచ్చు. దీనిపై రైతులు దృష్టి సారించాలి. ఏయే రకాలు అనువైనవో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలదే భవిష్యత్.. సన్న, చిన్న, మధ్యతరహా రైతుల ప్రధాన సమస్య మార్కెటింగ్. వీళ్లకు బేరసారాలు చేసే శక్తి తక్కువ. అందువల్ల వీళ్లు సంఘటితం కావడం ఒక్కటే మార్గం. 10 మందికి తగ్గకుండా అన్నదాతలు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్పీవోను) ఏర్పాటు చేసుకుంటే నాబార్డ్ సహకరిస్తుంది. ఈ సంఘం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించవచ్చు. ప్రాథమికంగా శుద్ధిచేసి నాణ్యత పెంచవచ్చు. వినియోగదారులను ఆకర్షించేలా ప్యాకింగ్ వంటివి చేయవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సిన నైపుణ్య శిక్షణ కోసం సమీపంలోని నాబార్డ్ అధికారులను సంప్రదించవచ్చు. విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఉంది. రానున్న ఐదేళ్లలో కనీసం 4 వేల ఎఫ్పీవోలను ఏర్పాటు చేయాలన్నది నాబార్డ్ లక్ష్యం. నాబార్డ్ సంరక్షణ్ పథకం కింద సుమారు రూ.వెయ్యి కోట్లను ఎఫ్పీవోలకు రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతులు వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులను తీర్చిదిద్దుకోవాలన్నదే నా సలహా. వ్యవసాయ బిల్లులపై జరుగుతున్న ఆందోళనపై త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ ఉంది. ఆ బిల్లులను రద్దుచేసే అవకాశం ఉండకపోవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం. -
ఆయనకన్నా ఎక్కువ ధాన్యం సేకరించాం
-
‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ అమలులో ఏపీ నంబర్ వన్’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం అమల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలిచిందని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ వెల్లడించారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో అర్హత గల వారికి పెట్టుబడి సాయం అందేలా చేయడం, రికార్డు స్థాయిలో గ్రీవెన్స్ను పరిష్కరించడంతో పాటు.. క్షేత్ర స్థాయి పరిశీలన వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారంటూ నీతి ఆయోగ్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్గా ఏపీని ప్రకటించినట్టు చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద గడిచిన మూడేళ్లుగా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది పీఎం కిసాన్ పోర్టల్లో 58,11,593 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 49,82,634 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలన్నీ పాటిస్తూ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో 86 శాతం మందిని అర్హులుగా గుర్తించి సాయం అందించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. -
కౌలు రైతుల ఖాతాల్లో రూ.53.78 కోట్లు జమ
సాక్షి, అమరావతి: అర్హత పొందిన కౌలుదారులు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సోమవారం వైఎస్సార్ రైతుభరోసా కింద తొలి విడత పెట్టుబడి సాయం రూ.53.78 కోట్లు అందజేసింది. రాష్ట్రంలో గత నెల 12 నుంచి 30 వరకు రైతుభరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహించిన సీసీఆర్సీ (సాగు హక్కు పత్రాలు) మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 96,335 మంది సీసీఆర్సీలు పొందగా, వారిలో 70,098 మంది రైతు భరోసాకు అర్హత పొందారు. వీరితోపాటు దేవదాయ భూములు సాగు చేస్తున్న 1,616 మంది కూడా అర్హత సాధించారు. ఇలా మొత్తం 71,714 మందికి రూ.7,500 చొప్పున వారి ఖాతాల్లో రూ.53.78 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్కుమార్ తెలిపారు. -
వడివడిగా వ్యవసాయం
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగు వడివడిగా సాగుతోంది. సాగుకు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద తొలివిడత పెట్టుబడి సాయం అందించడం, ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడం, విస్తారంగా వానలు కురుస్తుండడంతో రైతులు ఉత్సాహంతో ఏరువాకకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 94.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 8.06 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా కృష్ణాలో 1,19,810 ఎకరాల్లో సాగవగా, అత్యల్పంగా తూర్పుగోదావరి జిల్లాలో 4,728 ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతున్నాయి. సాధారణానికి మించి వర్షపాతం.. సీజన్లో ఇప్పటి వరకు సగటున 140.8 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా, జూలై 11 నాటికే 157.9 ఎంఎం వర్షం కురిసింది. అంటే ఇప్పటికే 17.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పుడిప్పుడే .. గతేడాది పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అన్నదాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరి నారుమళ్లు పోయడం ఊపందుకుంది. ఈసారి మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలనే సాగు చేయాలని ఆర్బీకేల ద్వారా వ్యవసాయ శాఖ చేస్తోన్న విస్తృత ప్రచారం సత్ఫలితాలనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయాధికారులు సూచిస్తున్న రకాల సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. 2.83 లక్షల ఎకరాల్లో వరి సాగు వరిసాగు లక్ష్యం 39.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.83 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఆ తర్వాత వేరుశనగ సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటి వరకు 1.48 లక్షలు, ఇక పత్తి 14.81లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.84 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగిలిన ప్రధాన పంటల్లో చెరకు 50 వేలు, మొక్కజొన్న 37 వేలు, నువ్వులు 28వేలు, కందులు 13వేలు, ఉల్లి 11 వేలు,. రాగులు 10వేల ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తమ్మీద 28 వేల ఎకరాల్లో అపరాలు, 3.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలు, 1.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ సీడ్స్ సాగవగా, ఇతర పంటలు 2.62లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గడచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్ధేశించిన లక్ష్యానికి మించి సాగు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
కౌలురైతుకు సర్కారు భరోసా
సాక్షి, అమరావతి: భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కౌలుదారులకు పంటసాగు హక్కు పత్రాలను (సీసీఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వం జారీచేస్తోంది. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆర్బీకేల ద్వారా వీటిని అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 6,87,474 మంది కౌలుదారులకు సీసీఆర్సీలు జారీచేయగా, 2021–22 సీజన్కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 4,12,894 మందికి ఇచ్చారు. వీరిలో 3,60,635 మంది కొత్తవారు కాగా.. 52,259 మంది పాత కౌలుదారులకు రెన్యూవల్ చేశారు. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 1,11,212 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 1,05,515 మందికి జారీచేశారు. ఇక 2019లో అమలులోకి వచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం ఆధారంగా జారీ చేస్తున్న సీసీఆర్సీల ద్వారానే పంట రుణాలు, వడ్డీ, పెట్టుబడి రాయితీలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా కూడా కౌలురైతులకు వర్తింపజేయనున్నారు.తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునేందుకు కూడా ఈ సీసీఆర్సీలే ప్రామాణికం. ఇదిలా ఉంటే.. లేనిపోని అపోహలతో కౌలుదారులకు సీసీఆర్సీలు ఇచ్చే విషయంలో ముందుకురాని భూయజమానులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నేడు 71,768 మందికి వైఎస్సార్ రైతు భరోసా గతనెల 12 నుంచి 30 వరకు మేళాలు నిర్వహించారు. వీటిల్లో సీసీఆర్సీలు పొందిన వారిలో 96,335 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. వీరిలో 70,098 మందిని అర్హులుగా గుర్తించారు. అత్యధికంగా గుంటూరు 14,712 మంది, అత్యల్పంగా అనంతపురంలో 570 మంది అర్హత పొందారు. ఇక దేవదాయ భూములు సాగుచేస్తున్న వారిలో 2,103 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,670 మందిని అర్హులుగా లెక్క తేల్చారు. ఇలా తాజాగా అర్హత పొందిన 71,768 మందికి ఈనెల 12న రైతుభరోసా కింద తొలి విడతగా రూ.7,500లు జమ చేయనుంది. అలాగే, అటవీ భూములు సాగు చేస్తున్న 86,254 మంది సాగుదారులకు ఇప్పటికే మొదటి విడతగా రూ.7,500ల చొప్పున ప్రభుత్వం రైతుభరోసా సొమ్ము జమ చేసింది. భూయజమానులు సహకరించాలి అర్హులైన ప్రతీ కౌలుదారులని సీసీఆర్సీలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులున్నారని అంచనా. వారిలో గడిచిన రెండేళ్లలో 6.87 లక్షల మందికి ఇచ్చాం. ఈ ఏడాది వాటిని రెన్యువల్తో పాటు కొత్తగా 5లక్షల కార్డులివ్వాలన్నది లక్ష్యం. ఇప్పటికే రెన్యూవల్తో సహా 4.12లక్షల మందికి కార్డులిచ్చాం. అర్హులందరూ ఆర్బీకేల ద్వారా కార్డులు పొందాలి. ఇందుకు భూ యజమానులు సహకరించాలి. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
వ్యవసాయం పండుగే.. రైతు ముంగిటకే పథకాలు
ఆకివీడు: ‘పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడిపంటలకు లోటు లేదురా’ అన్న కవి మాటలను నిజం చేసేలా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగుతోంది. పల్లె ప్రగతికి పట్టం కడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలను అమలుచేస్తుండటంతో అన్నదాతలు ఆనందంగా జీవనం గడుపుతున్నారు. రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. సుమారు 80 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆరు వేల ఎకరాల్లో కూరగాయాల పంటలు పండిస్తున్నారు. పాడి రైతులకు అదనపు ఆదా యం లక్ష్యంగా అమూల్ పాల సేకరణ కేంద్రాలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద మహిళా రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. పశువుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రైతు ముంగిటకే పథకాలు ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నావడ్డీ రుణాలు అందిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ–క్రాపింగ్ విధానంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు పంటల బీమా వర్తింపజేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి మద్దతు ధరలు అందిస్తున్నారు. దళారుల బెడద లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకునేలా ఏర్పాట్లు చేశారు. కౌలువ్యవస్థను కూడా పటిష్ట పరిచేలా కౌలుచట్టంలో మార్పులు తీసుకువచ్చారు. భూమి యజమానికి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కౌలు వ్యవస్థ పటిష్టపడింది. మీసం మెలేస్తున్న రొయ్య రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు అభివృద్ధి చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. కోవిడ్ విపత్తులోనూ ధరలో లాబీయింగ్ను అరికట్టి మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు చేయించారు. ఆక్వా చెరువులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా, ఈ మార్కెట్ సదు పాయం, ఆక్వా ల్యాబ్ల ఏర్పాటు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులు అందించేలా చర్యలు తీసుకున్నా రు. ఆక్వాజోన్లతో త్వరితగతిన ఆక్వా అనుమతులు లభిస్తున్నాయి. చేపలు, రొయ్యలకు మార్కెట్ కల్పించేలా ఈ–వెహికల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈనెల 9 నుంచి చైతన్య యాత్రలు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రం విధివిధానాలు, పంటల బీమా, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతుల్లో అవగాహన పెంచేలా చైతన్య యాత్రలను నిర్వహించనున్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించేలా సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
కాడి, మేడి సిద్ధం.. ఖరీఫ్కు సన్నద్ధం
నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పలకరిస్తున్న వేళ.. పుడమితల్లి పులకిస్తుండగా.. కొండంత ఆశతో ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్నేందుకు కాడి, మేడి సిద్ధం చేసుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, ఎడ్లను అలంకరించి పొలం పనులకు శ్రీకారం చుట్టడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి తోడు వాతావరణం కాస్త అనుకూలంగా ఉండడంతో రెట్టించిన రైతులు ఉత్సాహంతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు ముందే వైఎస్సార్ రైతుభరోసా కింద అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతన్నల ముంగిటకు తీసుకెళ్లింది. గతం కంటే మిన్నగా పంటరుణాల మంజూరుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2019 ఖరీఫ్లో 90.38 లక్షల ఎకరాల్లోను, 2020లో 90.20 లక్షల ఎకరాల్లోను పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్లో 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో నారుమళ్లు పోసేందుకు పనులు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 7.40 లక్షలమందికి 4.21 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సబ్సిడీ, నాన్సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందుల్ని కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. సాగుకుముందే 4,78,829 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 5,09,762 క్వింటాళ్ల విత్తనాల కోసం 9,35,905 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 7,40,885 మందికి రూ.129.88 కోట్ల సబ్సిడీతో 4,21,245 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్బీకేల ద్వారా 4,44,960 మంది రైతులకు రూ.111.09 కోట్ల సబ్సిడీతో 3,19,960 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేశారు. ఖరీఫ్లో 2.37 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు 1,46,976 మందికి రూ.5.89 కోట్ల సబ్సిడీతో 62,184 క్వింటాళ్లు అందజేశారు. ఆర్బీకేల ద్వారానే నాన్సబ్సిడీ విత్తనాలు నాన్సబ్సిడీ విత్తనాలకు సంబంధించి తొలిసారిగా 45,412 ప్యాకెట్ల మిరప విత్తనం కోసం ఇండెంట్ పెట్టగా, ఇప్పటివరకు 23,047 ప్యాకెట్లు పంపిణీ చేశారు. మొక్కజొన్న, పత్తి, వరి విత్తనాలకు సంబంధించి 28,144 ప్యాకెట్ల విత్తనాల కోసం ఇండెంట్ పెట్టగా ఇప్పటివరకు 5,936 ప్యాకెట్ల విత్తనాలు సరఫరా చేశారు. మరోపక్క తొలిసారిగా ఆర్బీకే స్థాయిలో ఎరువులను కూడా నిల్వచేశారు. 88,930 టన్నుల ఎరువుల కోసం ఇండెంట్ పెట్టారు. 70,256 టన్నుల ఎరువుల్ని ఆర్బీకేల్లో నిల్వ చేయగా.. 16,477 మంది రైతులు 7,779 టన్నుల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆర్బీకేల్లో 62,477 టన్నుల ఎరువులున్నాయి. మరోవైపు తొలిసారిగా సర్టిఫై చేసిన 900 టన్నుల పురుగుమందులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్లో 8,604 పొలంబడులు నిర్వహిస్తుండగా, తొలిసారిగా రైతు భరోసా–యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ (ఆర్బీ–యూడీపీ) యాప్ ద్వారా ఈ–క్రాప్ బుకింగ్కు శ్రీకారం చుడుతున్నారు. పంటరుణాలు రూ.65,149 కోట్లు, టర్మ్ రుణాలు రూ.19,039 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. సన్న, చిన్నకారు రైతులకు ఆర్బీకేల వద్ద అద్దెకు సాగుయంత్రాలను సమకూర్చే లక్ష్యంతో తొలివిడతగా ఒక్కొక్కటి రూ.15 లక్షలతో 3,250 సీహెచ్సీలతో పాటు రూ.210 కోట్లతో నియోజకవర్గస్థాయిలో నిర్మించిన 162 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఖరీఫ్లో ఎన్నో ప్రయోగాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారి సర్టిఫై చేసిన సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. మిరప, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా ఆర్బీకేల్లో ఉంచడం వల్ల బ్లాక్మార్కెట్ను నిరోధించగలిగాం. ఇన్పుట్స్లో ఏ ఒక్కటి ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
YS Jagan: ఇది రైతు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి సర్కారులా రైతులకు మేలు చేయలేదని.. సీఎం వైఎస్ జగన్ సర్కారు రైతు ప్రభుత్వమని పలువురు వ్యక్తులు కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏళ్ల తరబడి పరిహారం అందేది కాదని.. కానీ, ఇప్పుడు సకాలంలో వస్తోందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని.. ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు రైతులకు గొప్ప మేలు చేస్తున్నాయని వారన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘వ్యవసాయ రంగం పురోగతి’ అంశంపై శుక్రవారం వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ వైస్ ఛాన్సలర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులకు ఎంతో మేలు సీఎం జగన్ రైతుల బాగోగులు తెలుసుకునేలా స్వయంగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటుచేశారు. ఆయన నిర్ణయాలు రైతులకు ఎంతగా మేలు చేస్తున్నాయి. గ్రామ వలంటీర్ల వ్యవస్థ రైతులకు ఎంతో మేలు చేస్తోంది. రైతులకు ఏ సమస్య వచ్చినా సర్కారు స్పందిస్తున్న తీరుతో ప్రభుత్వంపట్ల రైతుల్లో విశ్వాసం పెరుగుతోంది. – డాక్టర్ ఏ.పద్మరాజు, ఆచార్య ఎన్జి రంగా వర్శిటి మాజీ వైస్ ఛాన్సలర్ రైతులకు సీఎం ప్రాధాన్యత వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13, 500లను మూడు విడతలుగా రైతులకు ప్రభు త్వం అందిస్తోంది. రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జలకళ కింద రైతులకు ఉచితంగా రెండు లక్షల బోర్లు వేయిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమాలో రైతుల వాటా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. మత్స్యకార భరోసా, రూ.1,700 కోట్లతో పగటిపూట వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ వంటివి ఇవ్వటంతో పాటు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటుచేశారు. ఇవన్నీ వైఎస్ జగన్ రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. – గంగిరెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు సాగును పండుగలా మార్చారు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. అదే రీతిలో సీఎం జగన్ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడంవల్ల గత రెండేళ్లలో 2 లక్షల హెక్టార్ల భూమిని కొత్తగా సాగులోకి తెచ్చారు. వ్యవసాయానికి సంబంధించి మన రాష్ట్రంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. – డాక్టర్ చెంగారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త -
కౌలు రైతులకూ ‘భరోసా’
సాక్షి, అమరావతి: భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు (వాస్తవ సాగుదారులు) పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ)ను జారీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగించనుంది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద సీసీఆర్సీ మేళాలను నిర్వహిస్తోంది. పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 6,87,474 మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, 2021–22 వ్యవసాయ సీజన్కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి వాటిని జారీ చేయాలని నిర్ణయించింది. వీరందరికీ నిబంధనల ప్రకారం రైతు భరోసా, రాయితీపై విత్తనాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర వంటి ప్రయోజనాలను వర్తింపచేయనుంది. ప్రయోజనాలెన్నో.. రాష్ట్రంలో 76,21,118 మంది రైతులుండగా.. వారిలో 16,00,483 మంది కౌలుదారులు ఉన్నారు. సాగు భూమిలో 70 శాతానికి పైగా వీరు కౌలుకు చేస్తుంటారని అంచనా. గతంలో వీరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా ఉండేవి. ఆగస్టు 2019లో అమల్లోకి వచ్చిన పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టం కౌలు రైతులకు రక్షణగా నిలిచింది. ఈ చట్టం కింద 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు హక్కు పత్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు రాయితీపై పొందడంతోపాటు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలతోపాటు అన్నివర్గాల కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, ఉచిత పంటల బీమా వంటి అన్ని పథకాల లబ్ధిని పొందే వెసులుబాటు కల్పించింది. భూ యజమానుల అంగీకారంతో ఇప్పటివరకు సీసీఆర్సీలు పొందిన కౌలు రైతులు తమ పత్రాలను రెన్యువల్ చేసుకోవడంతో పాటు మరో 5 లక్షల మందికి కొత్తగా సీసీఆర్సీలు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం మేళాలు నిర్వహిస్తోంది. మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసి.. వాటిని వైఎస్సార్ రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేయించడం ద్వారా వారికి ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందించాలని సంకల్పించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి భరోసా లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఈ నెల 30వ తేదీ వరకు సీసీఆర్సీలు జారీ చేస్తారు. భూ యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు సీసీఆర్సీ పత్రాలపై సంతకం చేసే విషయంలో భూ యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 11 నెలల కాలంలో పండించిన పంటపై తప్ప.. భూమిపై కౌలుదారులకు ఎలాంటి హక్కులు ఉండవు. దీనివల్ల భూ యజమానులు కౌలు రైతులకు రాయితీపై విత్తనాలు, వైఎస్సార్ రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర రావడానికి సహకరించిన వారవుతారు. సాగుదారులకు సీసీఆర్సీలు జారీ విషయంలో భూ యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
గోదాముల టెండర్లకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ గోదాములు, డ్రైయింగ్ యార్డుల నిర్మాణానికి ఉద్దేశించిన టెండర్లకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మొదటి దశ పనులకు టెండర్లు ఆహ్వానించగా, తాజాగా రెండో దశ పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.420.30 కోట్ల అంచనా వ్యయంతో 500 టన్నులు, 1,000 టన్నుల సామర్థ్యం కలిగిన 1,255 గోదాములు, డ్రైయింగ్ యార్డులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చే సమయానికి వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో ప్యాకేజీ–1 కింద రూ.28.5 కోట్ల అంచనా వ్యయంతో 92 పనులకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–3 కింద రూ.69.3 కోట్ల అంచనా వ్యయంతో 219 పనులకు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణకు ఈ నెల 29ని గడువుగా నిర్ధారించారు. ఈ గడువులోగా వచ్చిన వాటిని టెక్నికల్ కమిటీకి పంపి.. జూన్ మొదటి వారంలోగా అనుమతులిచ్చి పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేస్తారు. ప్యాకేజీ–2, 4లకు ఈ నెల 25న టెండర్లు.. ఇక ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ప్యాకేజీ–2 కింద రూ.139.5 కోట్ల అంచనా వ్యయంతో 430 పనులకు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–4 కింద రూ.183 కోట్ల అంచనా వ్యయంతో 514 పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.100 కోట్లు దాటడంతో ప్రభుత్వాదేశాల మేరకు టెండర్ ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీకి పంపారు. మే 17 వరకు వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ కొన్ని సూచనలు, సలహాలతో టెండర్లు పిలిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గోదాముల చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 25న టెండర్లు పిలిచేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశ టెండర్ ప్రక్రియను జూన్ 20కల్లా పూర్తి చేసి..ఆ వెంటనే వారం రోజుల్లో పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏదేమైనా వచ్చే ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి గోదాములను సిద్ధం చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. -
వేరుశనగ విత్తన పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తన పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డి.శేఖర్బాబు పర్యవేక్షణలో సోమవారం ఆయా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో 40 శాతం సబ్సిడీకి విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తొలిరోజు 868 మంది రైతులకు 611 క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. రాష్ట్రంలో వేరుశనగ ఖరీఫ్లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతోంది. వేరుశనగ విత్తనం కోసం గతంలో ప్రైవేటు కంపెనీలపై ఆధారపడేవారు. దీంతో సాగువేళ నాణ్యతాపరమైన సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ దుస్థితికి చెక్ పెడుతూ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద చరిత్రలో తొలిసారిగా సొంతంగా రైతులే వేరుశనగ విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహమందించింది. గత రబీ సీజన్లో 39 వేల ఎకరాల్లో రైతులను ప్రోత్సహించడం ద్వారా 4,48,185 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేశారు. వీటిలో అనంతపురం జిల్లాకు 2,90,035, చిత్తూరు జిల్లాకు 76,000, కర్నూలు జిల్లాకు 47,000, వైఎస్సార్ జిల్లాకు 34,000, శ్రీకాకుళం జిల్లాకు 300, విజయనగరం జిల్లాకు 650, విశాఖ జిల్లాకు 200 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 1,65,659 మంది రైతులు 1,07,704 క్వింటాళ్ల విత్తనం కోసం ఆర్బీకేల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం అనంతపురం జిల్లాల్లో 503 మంది రైతులకు 446.4 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 281 మంది రైతులకు 89.7 క్వింటాళ్లు, కర్నూలు జిల్లాలో 84 మంది రైతులకు 75 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. సొంతూరులో విత్తనం దొరకడం ఆనందంగా ఉంది.. నాకున్న ఆరెకరాల్లో ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగు చేస్తా. గతంలో విత్తనాల కోసం మద్దికెర, పత్తికొండ వెళ్లాల్సి వచ్చేది. నాణ్యమైన విత్తనం దొరక్క చాలా ఇబ్బందులు పడేవాళ్లం. తొలిసారి మా గ్రామంలోనే నాణ్యమైన విత్తనం లభించింది. – ఎం.వెంకట్రామప్ప, ఎం.అగ్రహారం, మద్దికెర మండలం, కర్నూలు జిల్లా -
Andhra Pradesh: వ్యవ'సాయమే' లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ముందస్తు వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేయించింది. అధికారం చేపట్టిన నాటినుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలోనూ రైతుల కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి అండగా నిలిచారు. మళ్లీ కోవిడ్ ఉధృతి పెరిగినప్పటికీ ఆ ప్రభావం వ్యవసాయ రంగంపైన, రైతులపైన పడకుండా రానున్న ఖరీఫ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో.. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2021–22) సంబంధించి వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,44,927 కోట్లుగా అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఇందులో పంట రుణాలు రూ.1,13,122 కోట్లు కాగా.. వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.31,805 కోట్లుగా ఉన్నాయి. 92.45 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు కొరత రాకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తోంది. మరోవైపు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్లో అంచనాలను మించి 92.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనా వేసింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు సైతం ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామాల్లోనే సరి్టఫైడ్ నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, ఎరువులతో పాటు రైతులకు ఏది కావాలన్నా ప్రభుత్వమే సమకూరుస్తుడంతో ఈ ఖరీఫ్లో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు. సాగుకు అండగా పెట్టుబడి సాయం వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. దీంతో ఖరీఫ్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా అందించిన రైతు భరోసా సాయంతో కలిపి ఇప్పటివరకు రైతులకు రూ.17,029 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. సబ్సిడీపై విత్తనాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రానున్న ఖరీఫ్కు సంబంధించి ఇప్పటికే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. వివిధ రకాల పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.174.02 కోట్లను సబ్సిడీగా భరించనుంది. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకునేందుకు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. గత ఖరీఫ్ నుంచి రైతులకు ఏం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ అసిస్టెంట్లు, ఉద్యాన అసిస్టెంట్లు, సెరి కల్చర్ అసిస్టెంట్లు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొరత లేకుండా ఎరువులు ఈ ఖరీఫ్లో అన్నిరకాల ఎరువులు కలిపి 20.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. నాలుగంచెల్లో ఎరువులను నిల్వ ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు, మండల కేంద్రాలు, సబ్ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎరువులను నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టారు. జూన్ తొలి వారం నుంచి రైతులందరికీ ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ముందస్తుగా టెస్ట్ చేసి సర్టిఫైడ్ క్వాలిటీ పురుగు మందులను కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉన్న ఊరిలోనే రైతులకు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. అలాగే రైతులకు అవసరమైన పంట రుణాలను కూడా బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ–పంట పోర్టల్లో నమోదైన రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలను అందజేస్తాయి, -
పంపిణీకి సర్టిఫైడ్ విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ – 2021 సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాన్ని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీఎల్) వ్యవసాయ శాఖతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి వేరుశనగ, 30వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను పంపిణీ చేయబోతున్నారు. సీజన్ ఏదైనా సరే స్థానిక లభ్యతను బట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తుంటారు. సకాలంలో సబ్సిడీ విత్తనం దొరక్క దళారీలు, ప్రైవేటు ఏజెన్సీల ఉచ్చులో పడి రైతులు ఏటా వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపోయేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా సకాలంలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాన్ని అందించడమే కాకుండా ప్రైవేటు ఏజెన్సీలపై నిఘా ఉంచడంతో ‘నాసి రకం’ అనే మాట విన్పించలేదు. ఖరీఫ్ సీజన్లో 92.45 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 41.20 లక్షల ఎకరాల్లో వరి, 18.02 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 7.60 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. సీజన్ కోసం 7,91,439 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, లక్ష్యానికి మించి 7,98,125 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన 85 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట (జనుము, పిల్లిపెసర, జీలుగు) విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు ఆర్బీకేల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విత్తనోత్పత్తి, పంపిణీలో మరిన్ని సంస్కరణలు 2021–22 వ్యవసాయ సీజన్ నుంచి విత్తన పంపిణీలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీజన్ ప్రారంభం కాకుండానే కావాల్సిన విత్తనాన్ని సేకరించి ప్రాసెస్ చేసి, పరీక్షించి సర్టిఫై చేసి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏటా 10 వేల వరకు శాంపిల్స్ పరీక్షించే వారు. కానీ ఈ ఏడాది ర్యాండమ్గా 20 వేల నుంచి 25 వేల శాంపిల్స్ను విజయవాడ, కర్నూలులోని సంస్థకు చెందిన ల్యాబ్స్లో పరీక్షించి సర్టిఫై చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తన సేకరణ, ప్రాసెస్, పంపిణీ కోసం గతేడాది రూ.573 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది. సబ్సిడీ కింద గతేడాది రూ.236 కోట్లు భరించగా, ఈ ఏడాది రూ.350 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. తొలిసారి సొంతంగా వేరుశనగ విత్తనం చరిత్రలో తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద క్వింటాల్కు రూ.6,500 చొప్పున చెల్లించి 25 వేల మంది రైతుల నుంచి 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సేకరించారు. 40 శాతం సబ్సిడీపై ఈ నెల 17వ తేదీ నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 73,449 మంది రైతులు ఆర్బీకేల్లో విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వరిలో కొత్త వంగడాలు వరి విషయానికి వస్తే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఎంటీయూ 7029, 1121, 1064, 1061, బీపీటీ 5204, ఆర్జీఎల్ 2537 రకం విత్తనాలను విత్తనోత్పత్తి ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. అపరాలు 22,743 క్వింటాళ్లు, తృణ ధాన్యాలు 3,310 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం కొత్తగా అభివృద్ధి చేసిన ఎంటీయూ 1224, ఎంటీయూ 1210, రాగి వేగావతి, కదిలి లేపాక్షి (వేరుశనగ) రకాలకు చెందిన ఫౌండేషన్ సీడ్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎకరాకు రూ.60 వేల ఆదాయం విత్తనోత్పత్తి కోసం 18 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం సాగు చేశా. 255 క్వింటాళ్ల విత్తనాన్ని ఏపీ సీడ్స్కు అందించా. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ.60 వేల ఆదాయం వచ్చింది. బోనస్గా క్వింటాల్కు రూ.50 వరకు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – వాళ్లి సత్యం, కొండకరకం, విజయనగరం జిల్లా గ్రామమంతా వేరుశనగ విత్తనోత్పత్తి వేరుశనగ విత్తనోత్పత్తి కోసం 20 ఎకరాల్లో కే–6 రకం సాగు చేశా. ఏపీ సీడ్స్కు 280 క్వింటాళ్ల విత్తనాన్ని అందించా. ఎకరాకు 80 వేల ఆదాయం వచ్చింది. మా గ్రామంలో అందరూ విత్తనోత్పత్తి చేస్తారు. ఈ ఏడాది అందరం వేరుశనగ విత్తనాన్ని సాగు చేశాం. – ఎన్.విష్ణువర్ధన్రెడ్డి, పులేటిపల్లి, అనంతపురం జిల్లా సర్టిఫై చేసిన విత్తనాలు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సౌజన్యంతో ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. మే 17 నుంచి వేరుశనగ, మే 30 నుంచి మిగిలిన విత్తనాలు పంపిణీ ప్రారంభిస్తాం. – డి.శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా 'వైఎస్సాఆర్ రైతు భరోసా' తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రైతులు ఇబ్బంది పడకూడదని.. ‘ఈరోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 52.38 లక్షల రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా రైతుల ఖాతాల్లో నేరుగా రూ.3,928 కోట్లు జమ చేస్తున్నాం. ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది’. ‘కోవిడ్తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, రైతుల కష్టాలు ప్రభుత్వ కష్టాల కంటే ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదని అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ వైఎస్సార్ రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.3,928 కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం’. 23 నెలలు. రూ.89 వేల కోట్లు.. ‘ఈ 23 నెలల పాలన చూస్తే, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు.. వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా మీ బిడ్డ, నేరుగా బటన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా సామాజిక తనిఖీలు చేసి, ఏ ఒక్క అర్హుడు మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించాం. ప్రతి పేదవాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం’. రైతు భరోసా. రూ.17,029 కోట్లు.. ‘ఒక్క రైతులను గమనిస్తే, ఇవాళ అర కోటికి పైగా రైతులకు రూ.3,298 కోట్లు వారి ఖాతాల్లోకి వరసగా మూడో ఏడాది తొలి విడతగా వేస్తున్నాము. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద అక్షరాలా రూ,17,029 కోట్లు ఇచ్చామని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను’. రైతన్నలకు మొత్తం రూ.68 వేల కోట్లు.. ‘ఇక ఈ 23 నెలల్లో రైతన్నలకు వివిధ పథకాల కింద నేరుగా అక్షరాలా అందించిన సహాయం రూ.68 వేల కోట్లకు పైగానే ఉందని గర్వంగా చెబుతున్నాను’. ఏయే వాటికి ఎంతెంత?.. ‘రైతు భరోసా కింద 52.38 లక్షల రైతులకు మొత్తం రూ.17,029 కోట్లు ఈ 23 నెలల కాలంలో ఇవ్వగలిగాం. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలు కూడా కలుపుకుంటే అక్షరాలా 67.50 లక్షల రైతులకు రూ.1,261 కోట్లు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా 15.67 లక్షల రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇవ్వగలిగాం’. ‘ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ 23 నెలల్లో అక్షరాలా రూ.1038 కోట్లు ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలకు కోసం అక్షరాలా రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం’. ‘ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద ఈ 23 నెలల కాలంలో అక్షరాలా రూ.17,430 కోట్లు ఖర్చు చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను. పగలే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేశాం’. ‘గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు మీ బిడ్డ తీర్చాడు. విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు వెచ్చించామని గర్వంగా చెబుతున్నాను’. ‘శనగ రైతులకు బోనస్ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1224 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నాను. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50 కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1560 ఖర్చు చేశామని తెలియజేస్తున్నాను’. ఇంత కన్నా ఏం రుజువు కావాలి? ‘ఆ విధంగా ఈ 23 నెలలో రాష్ట్రంలో రైతన్నల కోసం అక్షరాలా రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?’. ప్రతి రైతుకూ పథకంలో మేలు.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ఆర్ఓఎఫ్ఆర్) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నాం’. ‘రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులకు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి మాత్రమే ఉంది. అదే ఒక హెక్టారు (2.5 ఎకరాల) వరకు భూమి ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం, ఆ రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను’. చెప్పిన దాని కంటే ఎక్కువ.. ‘మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలు చూసి, చెప్పిన దాని కన్నా ఒక ఏడాది ముందుగానే, ఇస్తామన్న దాని కన్నా మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 13 వేల 500 చొప్పున, అయిదేళ్లలో మొత్తం 67 వేల 500 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా రైతన్నలకు రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను’. ఈ నెలలోనే మరో రూ.2 వేల కోట్లు.. ‘ఖరీఫ్ సాగు ఇప్పుడు మొదలవుతోంది. పెట్టుబడి కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఇవాళ మొదటి విడత పెట్టుబడి సాయం చేస్తున్నాం. అదే విధంగా వైయస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈనెల 25న దాదాపు 38 లక్షల రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు అందించబోతున్నామని చిరునవ్వుతో చెబుతున్నాను’. వారిని ఆదుకోవడమే లక్ష్యంగా.. ‘దాదాపు 5 కోట్లు జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు కానీ.. మరీ ముఖ్యంగా ఉన్న పేద వర్గాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ 23 నెలల పరిపాలన సాగిందని ప్రతి రైతుకు చెబుతున్నాను’. మాట నిలబెట్టుకున్నాను.. ‘ఎన్నికల సమయంలో మామూలుగా పార్టీలు 600 పేజీల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మనమంతా చూశాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించి, దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావిస్తామని చెప్పి, తూచ తప్పకుండా ఈ 23 నెలల కాలంలో మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా అమలు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను’. కోవిడ్తో యుద్ధం.. ‘ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఒకవైపు కోవిడ్తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్ను సమూలంగా తీసేయాలి అంటే, వాక్యినేషన్ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసు’. వ్యాక్సిన్లు–వాస్తవ పరిస్థితి.. ‘దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్లు ఇవ్వాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్లు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగాం’. ‘ఇక రాష్ట్రంలో ఫ్రంట్లైన్ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్ల చొప్పున 4 కోట్లు డోస్లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సీన్లు కావాల్సి ఉండగా, అక్షరాలా మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి’. అందుకు కారణం? ‘దేశంలో ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అనంటే, దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మాత్రమే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ నెలకు కోటి, సీరమ్ సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి’. ‘కాబట్టి కోవిడ్తో సహజీవనం తప్పని పరిస్థితి. ఒకవైపు కోవిడ్తో యుద్ధం చేస్తూ, మరోవైపు దాంతో సహజీవనం తప్పదు. మనకున్న పరిస్థితిలో మనం వేస్తున్న అడుగులు అందరూ గమనించాలి’. అవి జీవితంలో భాగం కావాలి.. ‘కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూ పోయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, రైతులు తమ పని చేసుకుపోవాలి’. చివరగా.. ‘ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, రైతులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో నాలుగు అడుగులు ముందుకు వేసి, ఇవాళ రైతు భరోసా వరసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాము. దీంతో రైతన్నలకు మంచి జరగాలని ఆశిస్తూ, దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’.. అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపారు: కురసాల కన్నబాబు ‘ కొన్ని విన్నప్పుడు అవి సాధ్యమవుతాయా? అనిపిస్తుంది. కానీ సీఎం వైస్ జగన్, అలా సాధ్యం చేసి చూపారు. గత ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు. కానీ మీరు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. ఎవరైనా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ పోతున్నారు. సొంతంగా సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన, ఆలయాల భూములను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతులు ఇంకా రాష్ట్రంలో భూములు సాగు చేస్తున్న యానాం రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఆదుకుంటూ చరిత్ర సృష్టించారు. ఈ స్థాయిలో రైతులకు మీరు అండగా నిలుస్తున్నందుకు మీకు రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’. ఎంపీ బాలశౌరి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డితో పాటు, పలువురు అధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చదవండి: ఏపీ: పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల ఏపీ: రూ.1,200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలలు -
కష్టకాలంలో రైతుకు ఆర్థిక భరోసా.. నేడే పెట్టుబడి సాయం
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కావడానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద గురువారం తొలి విడత సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది 79,472 కుటుంబాలకు అదనంగా ప్రయోజనం ఈ ఏడాది అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,52,263 మంది ఉండగా (యానాం రైతులతో కలిపి), భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చెందిన 865 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 79,472 రైతు కుటుంబాలు అదనంగా లబ్ధి పొందనున్నాయి. ఈ ఏడాది 32,083 మంది కౌలుదారులు కొత్తగా లబ్ధి పొందనున్నారు. 50,52,263 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద తొలి విడతగా రూ.2 వేల చొప్పున కేంద్రం రూ.1010.45 కోట్లు సర్దుబాటు చేస్తుండగా, రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.2,778.74 కోట్లు సాయమందిస్తోంది. ఇక భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారుల కుటుంబాలకు రూ.7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొలి విడతగా రూ.139.69 కోట్లు సర్దుబాటు చేస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది కౌలుదారులతో సహా అర్హత పొందిన 52,38,517 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ కింద రూ.1010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి వైఎస్సార్ రైతు భరోసా–పీఏం కిసాన్ కింద తొలివిడతగా రూ.3928.88 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత రెండేళ్లలో రూ.13,101 కోట్లు సాయం అందించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,071.80 కోట్లు అందించనుంది. మొత్తంగా మూడేళ్లలో అన్నదాతలకు రూ.20,172.8 కోట్ల లబ్ధి చేకూరుతోంది. మూడు విడతల్లో సాయం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7,500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. -
రైతుకు రొక్కం.. సాగుకు ఊతం
కరోనా ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లో తొలివిడత నగదును జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాలు రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. ఆపద వేళ ప్రభుత్వం అండగా నిలవడం రైతుల్లో ఆనందం నింపింది. సాక్షి, అమరావతి బ్యూరో: రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం’ అమలు చేస్తోంది. ఖరీఫ్లో పంట పెట్టుబడుల కోసం ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తోంది. ఈ నెల 13వ తేదీన మొదటి విడత సొమ్ము రూ.7500 చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. 2019–20 సంవత్సరం నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు. మొదటి విడత మేలో రూ.7500, రెండో విడత అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత ఏడాది మూడు విడతల్లో 4,77,830 మంది రైతుల ఖాతాల్లో రూ.645.07 కోట్ల నగదు జమ చేశారు. లబ్ధిదారుల్లో 13,545 మంది ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులు ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 6030 మంది రైతులకు అదనంగా లబ్ధి కలుగుతోంది. ఈ ఏడాది మొత్తం 4,63,745 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. వారిలో 1604 ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులు ఉన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా... సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పేర్ల నమోదు ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టింది. రైతుల ముంగిటకే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. పంట బీమా, పంట నష్ట పరిహారం, పంటల నమోదు వంటి ప్రక్రియ సాగుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వరి ధాన్యం, మొక్క జొన్న, జొన్న వంటి పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోంది. వచ్చే ఖరీఫ్కు సంబంధించి పచ్చిరొట్ట ఎరువులు, పత్తి, మిరప విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆనందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. గత ఏడాది వరి సాగులో మంచి దిగుబడులు వచ్చాయి. మద్దతు ధరకే ధాన్యం విక్రయించా. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో సైతం రైతు భరోసా మొదటి విడత సొమ్మును జమచేయాలని నిర్ణయించడంతో ఆనందంగా ఉంది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. సొమ్ము ఖరీఫ్లో పత్తి, వరి సాగుకు అక్కరకొస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – సంగటి చెన్నారెడ్డి, లక్ష్మీపురం, కారంపూడి మండలం, గుంటూరు జిల్లా అర్హుల జాబితాలు సిద్ధం ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం కింద మొదటి విడత నగదు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అర్హులైన రైతుల పేర్లతో జాబితాలు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలు వ్యవసాయశాఖ సహాయకులు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అర్హుల పేర్లు జాబితాల్లో లేకపోతే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదులను పరిష్కరించి అర్హులందరికీ లబ్ధిచేకూరుస్తాం. – విజయభారతి, వ్యవసాయసంయుక్త సంచాలకులు -
17 నుంచి రైతులకు విత్తనాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఈ నెల 17వ తేదీ నుంచి రైతులకు సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ పనులు, సరుకుల రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నందున పూర్తి జాగ్రత్తలతో చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్కు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, రైతులకు ఇచ్చే విత్తనంతో పాటు ప్రతి ఒక్కటీ నాణ్యతగా ఉండాలని, ఇది మనం వారికి ఇచ్చిన హామీ అని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పథకం కింద జూన్ చివరిలోగా ప్రతి జిల్లాల్లో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలు ఇవీ.. చెక్ చేయండి... గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేలను ఓన్ చేసుకుని రైతులకు సేవలందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, స్టాక్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వ్యవసాయ సలహా కమిటీలు... ప్రతి జిల్లాలో నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. వ్యవసాయ సలహా కమిటీలు వెంటనే అన్ని చోట్ల ఏర్పాటు కావాలి. పంటల ప్లానింగ్ మొదలు ప్రతి అడుగులో ఈ కమిటీలు రైతులతో కలిసి పని చేయాలి. అవసరమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆ కమిటీలు చూపాలి. రూ.1.13 లక్షల కోట్ల పంట రుణాలు టార్గెట్. అది సాధించాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ప్రతి జిల్లాలో కోటి పనిదినాలు కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఇప్పటి వరకు 4.57 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1న ప్రారంభం కావాలి. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. మిగిలినవి కోర్టు వివాదాల్లో ఉన్నందున ప్రత్యామ్నాయ నివేదికలను పీఎంఏవైకి పంపించాం. వాటికి సంబంధించి వచ్చే నెలలోగా అనుమతి వచ్చే వీలుంది. ఇళ్ల నిర్మాణాల సన్నాహక పనులను ఈనెల 25వ తేదీలోగా కలెక్టర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (ఎకానమీ బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాలు, వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8,679 లేఅవుట్లలో నీటి సదుపాయాన్ని డిస్కమ్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుని ఈనెల 31లోగా పూర్తి చేయాలి. ఎక్కడైనా నోడల్ అధికారుల నియామకం జరగకపోతే ఈనెల 15లోగా పూర్తి చేయాలి. నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరిగేందుకు తగినంత ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ఇళ్ల స్థలాలు.. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,19,053 అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 98,834 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. 10,752 మందికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 1,520 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. ఇక మిగిలిన 1,06,781 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి. వేగంగా భవన నిర్మాణాలు.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్సార్ గ్రామీణ, పట్టణ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలను, నాడు–నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను, ఆధునీకరణ పనులను పూర్తి చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెలలో అందించే సాయం ► మే 13న వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు రూ.7,500 చొప్పున ఖాతాల్లో జమ. ఖరీఫ్లో సాగు పెట్టుబడి కింద సాయం. ► మే 25న ఖరీఫ్–2020కి సంబంధించిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు చెల్లింపు. ► మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం (చేపలవేట నిషేధ సాయం) ఆ ఏడు.. చాలా ముఖ్యం స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే మనం ఆ సమయం నిర్దేశించుకుని ఏం ప్రయోజనం? గత ఏడాది జూన్ 9 నుంచి ఈనెల 10వ తేదీ వరకు స్పందనలో 2,25,43,894 ఫిర్యాదులు, అర్జీలు రాగా 85 శాతం సకాలంలో పరిష్కరించగలిగాం. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు. శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీటితో పాటు ఇంటి స్థలం.. ఈ ఏడు మనకు చాలా ముఖ్యం. -
ఏపీ: ఎరువుకు రాదు కరువు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సాగువేళ రైతు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెలలో వైఎస్సార్ రైతుభరోసా మొదటి విడత సొమ్ము, వైఎస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము దాదాపు రూ.6,230 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్లో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈనెల 13న వైఎస్సార్ రైతుభరోసా కింద 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,230 కోట్లను ప్రభుత్వం జమచేయనుంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా – 2020 ఖరీఫ్కు సంబంధించి 38 లక్షల మంది రైతులకు ఈనెల 25న సుమారు రూ.2 వేల కోట్లు సొమ్ము ఇవ్వనుంది. సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు సబ్సిడీ విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్ సాగులో ఎంతో కీలకమైన ఎరువులకు కొరత లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. గతంలో సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా.. అదును దాటకముందు ఎరువులు అందుతాయో లేదో అనే ఆందోళనతో అన్నదాతలు కొట్టుమిట్టాడేవారు. కానీ ప్రస్తుతం సీజన్కు ముందే స్థానికంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కావాల్సిన ఎరువులను క్షేత్రస్థాయిలో నిల్వ చేస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 20.20 లక్షల టన్నుల కేటాయింపు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 92.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 21.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం 20.20 లక్షల ఎంటీలు కేటాయించింది. వీటిని నెలవారీ డిమాండ్కు అనుగుణంగా ఆయా కంపెనీల ద్వారా కేటాయించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 1.50 లక్షల టన్నుల ఎరువుల కొనుగోలుకు.. ఎరువుల పంపిణీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ మార్క్ఫెడ్కు రూ.75 కోట్లు విడుదల చేసింది. ముందస్తుగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను నాలుగంచెల çపద్ధతిలో క్షేత్రస్థాయిలో నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయిలో ఒక్కో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వద్ద కనీసం 5 టన్నులు నిల్వచేస్తారు. ఇందుకోసం ఏపీ మార్క్ఫెడ్ వద్ద 40 వేల టన్నులు సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్లు)/జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల్లో కనీసం 40 వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేయనున్నారు. ఇక సబ్ డివిజన్ స్థాయిలో ఆర్బీకే హబ్లలో 20 వేల టన్నులు నిల్వచేస్తారు. జిల్లాస్థాయి మార్క్ఫెడ్ గొడౌన్లలో 50 వేల టన్నులు, రిటైలర్, హోల్సేల్ డీలర్ల వద్ద 5 లక్షల టన్నులు, కంపెనీ గోదాముల్లో 1.50 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్బీకేల వద్ద గ్రామస్థాయిలో ఖరీఫ్ కోసం కనీసం 2 లక్షల టన్నులు (యూరయా 85 వేల టన్నులు, డీఏపీ 28 వేల టన్నులు, ఎంవోపీ 9 వేల టన్నులు, కాంప్లెక్స్ 78 వేల టన్నులు) ఉంచాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్లకు నిర్దేశించారు. అవసరమైనచోట ఆర్బీకేల ద్వారా ఎక్కువ పరిమాణంలో రైతులకు ఎరువులను అందించేందుకు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో గోడౌన్లలో ముందస్తుగా నిల్వచేసే ఎరువుల నమూనాలను ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని జేడీలకు ఆదేశాలిచ్చారు. చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా చరిత్రలో తొలిసారి ఖరీఫ్ సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువులను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నాం. మార్కెట్ ధరల కంటే తక్కువకే లభ్యం కానున్నాయి. బహిరంగ మార్కెట్లో కృత్రిమ ఎరువుల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి అందనుంది. యానాంకు చెందిన 865 మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములున్నాయి. ఒక్కొక్కరికీ రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.7,500 జమ చేయనున్నారు. మొదటి విడతగా మే 13న ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు రూ.5,500 వేల చొప్పున ఆ రైతులకూ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందంగా ఉంది నాకు యానాంలో ఐదెకరాలుంది. ఆంధ్రా పరిధిలో రెండెకరాలుంది. వైఎస్సార్ రైతు భరోసాకు గతంలో దరఖాస్తు చేశా. ఆధార్ కార్డు యానాం అడ్రస్తో ఉండడంతో నాన్ రెసిడెంట్ అంటూ రైతు భరోసా వర్తింప చేయలేదు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా వర్తింప చేయాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. – కోన సత్తియ్య, రైతు, యానాం సీఎం కీలక నిర్ణయంతో.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు ఏపీలో పలుచోట్ల భూములున్నాయి. స్థానికంగా నివసించని కారణంగా వారికి వైఎస్సార్ రైతు భరోసా వర్తించదు. అయినప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చెందిన 865 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ చదవండి: ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి -
మే 13న తొలివిడత రైతు భరోసా
సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్ సాగు నిమిత్తం వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. గతేడాది లబ్ధిపొందిన వారితో పాటు గత రెండేళ్లుగా లబ్ధిపొందని అర్హుల కోసం ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుకు గడువిచ్చింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రైతులకు పీఎం కిసాన్ సాయం రూ.6వేలతో పాటు రైతుభరోసా కింద రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500లు చొప్పున పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో అందిస్తోంది. వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానుల ఖాతాల్లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500లు, రెండో విడతగా అక్టోబర్లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేల చొప్పున జమచేస్తున్నారు. ఎలాంటి భూమి లేని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతు కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న రైతు కుటుంబాలకు ఈ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2019–20లో 46,69,375 మంది రైతు కుటుంబాలకు రూ.6,173కోట్లు.. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు సాయం అందించారు. అలాగే, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారు తొలి ఏడాదిలో 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఏటేటా పెరుగుతున్న ‘భరోసా’ తొలి ఏడాది పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2,525 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.3,648 కోట్లు సాయం అందించింది. గతేడాది కేంద్రం రూ.2,966 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,962 కోట్లు అందించింది. ఇక ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అర్హత పొందిన 54 లక్షల మంది లబ్ధిదారులకు 3 విడతల్లో రూ.7,290 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద రూ.3,060 కోట్లు, రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4,230 కోట్లు అందించనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అర్హత పొందిన రైతు కుటుంబాల్లో 51లక్షల మంది భూ యజమానులు కాగా, 3లక్షల మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారున్నారు. ఖరీఫ్ తొలి విడత సాయం మే 13న.. ఈ ఏడాది ఖరీఫ్ తొలి విడత సాయాన్ని మే 13న అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గత నెల 22 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆర్బీకే స్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఇందులో అర్హులై ఉండి గతంలో లబ్ధిపొందని వారిని గ్రీవెన్స్ పోర్టల్లో పొందుపర్చారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అనుసంధానం కాని ఖాతాలు కలిగిన రైతులను సంబంధిత బ్యాంకుల ద్వారా అనుసంధానించేందుకు అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు ఎవరైనా ఉంటే వారి కోసం ఏప్రిల్ 30 వరకు గడువునిచ్చారు. తుది జాబితాను మే 10న వెల్లడిస్తారు. అర్హులు సద్వినియోగం చేసుకోండి వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటివరకు అర్హత పొందని అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 30లోగా ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు అర్హత పొందిన వారి జాబితాలను ప్రదర్శిస్తున్నారు. వారిలో అనర్హులను గుర్తించి తెలియజేస్తే వారికి లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకుంటాం. – హెచ్ అరుణ్కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ