Allergy
-
డ్రెస్సుల వల్ల అలర్జీ!
చలిని తట్టుకోవడానికి ఈ సీజన్లో చేసే కొన్నిపనులు మేనిచర్మాన్ని దెబ్బతీసేలలలా ఉంటాయి. దురద, పొడిబారడం తోపాటు రకరకాల చర్మ సమస్యలు(Allergy) కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి...ఫ్యాషన్ డ్రెస్సులుఈ సీజన్లో చలి నుంచి రక్షణగా స్వెటర్లు, మందపాటి క్లాత్స్, షాలువా.. వంటివి ధరిస్తూ ఉంటాం. ఎక్కువ గంటలు లేదా రాత్రి మొత్తం ఇలాంటి డ్రెస్సుల్లో ఉంటే చర్మం దురద పెడుతుంది. అందుకని, పలచటి కాటన్ డ్రెస్ వేసుకోవాలి. కొన్ని డ్రెస్సులు(dresses) వార్డ్ రోబ్లలో నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఈ సీజన్కి అవి సరైన ఎంపిక అని, వాటిని శుభ్రం చేయకుండా అలాగే వేసుకుంటే బాక్టీరియా చర్మానికి హాని చేస్తుంది. అందుకని, వార్డ్రోబ్ నుంచి తీశాక వెంటనే వేసుకోకుండా వాటిని ఆరుబయట గాలికి, కొద్దిపాటి ఎండకు వేసి తర్వాత ధరించాలి. కనీసం కొద్దిసేపు గాలికి ఆరవేయాలి.బిగుతుగా, మేని మొత్తం కవర్ చేసే దుస్తుల వల్ల బ్యాక్ యాక్నె పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఎక్కువ గంటలు, బిగుతుగా ఉండే డ్రెస్సుల్లో ఉండకూడదు. షూ(Shoe) వంటివి వేసుకున్నప్పుడు వాటిలో చెమ్మ ఏర్పడుతుంది. డ్రయ్యర్తో షూ లోపల మొత్తం చెమ్మ లేకుండా చేసి, తర్వాత వాడుకోవాలి.స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ఈ కాలం చర్మం చాలా పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు స్క్రబ్, పీల్ చేయడం.. వంటి బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించకూడదు. వైటెనింగ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మ రంధ్రాల్లోని సహజ తైలాలు పోయి, చర్మం నిస్తేజంగా మారుతుంది. చర్మం మృదువుగా ఉండటానికి రకరకాల బాడీ లోషన్స్కి బదులు క్రీమ్స్ వాడుకోవడం మేలు.వేడికి హీటర్చలి ఎక్కువ కాబట్టి టెంపరేచర్ కోసం రూమ్ హీటర్స్ వాడుతుంటారు. రాత్రి వేళ మొత్తం ఈ హీటర్స్లో ఉండటం వల్ల చర్మం డీ హైడ్రేట్ అయి త్వరగా పొడిబారుతుంది.నూనె శాతం అధికంగా ఉండే అవకాడో, నట్స్.. వంటి విటమిన్ ఇ, ఎ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది. (చదవండి: మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!) -
పరదా చాటున అలర్జీ మాటేస్తది!
తలుపులకూ, కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెయిన్స్) అందాన్నీ, ప్రైవసీని ఇస్తాయి. కొన్ని స్టార్ హోటల్స్లో మంచి రాజసపు లుక్ కోసం వెరైటీగా కర్టెన్లు అమరుస్తారు. ఇటీవల ఇండ్లలోనూ ఈ తరహాలోనే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చుకోవడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి పై సజ్జబల్లల మీద / అటక మీద పాత సామాన్ల వంటివి సర్దిపెట్టినప్పుడు అవి బయటకు కనపడకుండా పరదాలు అడ్డుగా అమర్చి ఉంచడమూ మామూలే. అయితే వాటిని నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల వాటి వెనక అలర్జీకి కారణమయ్యే డస్ట్మైట్స్ చేరి అలర్జీ కలిగించవచ్చు. అది ఎన్ని రకాలుగా కలుగుతోందో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.సాధారణంగా కర్టెన్లతో వచ్చే అలర్జీలు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల... అత్యంత చురుకుగా పనిచేసే ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల అలర్జీలు వస్తాయి. అది ఈ కింది విధాలుగా జరుగుతుంది. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో చేరే అలర్జెన్లూ, డస్ట్మైట్స్ : కరై్టన్లు ఇళ్లలోకి దుమ్మూ, ధూళి రాకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలో దుమ్ము ధూళిలో ఉండే డస్ట్మైట్స్... తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల్లోకీ చేరతాయి. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ఒక రకమైన ప్రోటీన్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి... అది వారిలో అలర్జీ కలిగిస్తుంది. కొన్నిసార్లు అలర్జీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. కేవలం డస్ట్మైట్స్ మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో దాగి ఉంటాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, భయం కలిగించేలా కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. కొందరిలో ఈ డస్ట్మైట్స్, అలర్జెన్లు తీవ్రమైన ఆస్తమాను కలిగించి, ఊపిరాడకుండా చేస్తూ తీవ్రంగా బాధిస్తాయి. మౌల్డ్స్ లాంటి ఫంగస్ చేరడం : కర్టెన్లలో మౌల్డ్స్ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి ఒకరకంగా బూజు లాంటివి. గాలిలో తేమ ఉండేచోట్ల, వెలుతురు తక్కువగా ప్రసరించే చోట్లలో ఈ మౌల్డ్స్, ఇతర ఫంగస్లు పెరుగుతాయి. అన్ని చోట్లలాగే కర్టెన్లలో చేరినప్పుడు అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. సూక్ష్మజీవుల ఆవాసంగా : అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కర్టెన్లలో చేరి అవి కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ∙దుమ్ము కణాలు : అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో : మొదట్లో ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్లాస్టిక్తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్ప్రూఫ్ మెటీరియల్తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ప్లాస్టిక్కర్టెన్లు ఫ్యాబ్రిక్లతో చేసిన పరదాల్లో అటు ఇటు ఒంగకుండా (ఫ్లెక్సిబుల్గా లేకుండా) ఉంటాయి. అందుకే అవి బట్టలాగే ఎటు పడితే అటు కాస్తంత వంగేందుకు వీలుగా వాటిల్లో ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇదే పదార్థాన్ని వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.ప్లాస్టిక్కరై్టన్లతో ఎంతో హాని... ఈ ప్లాస్టిక్వంటి కర్టెన్లలోని హానికర / విష పదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన కూడా ప్రతికూలంగా పనిచేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థనూ దెబ్బతీస్తాయి. ఇక గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్వంటి పదార్థాలతో తయారైన కర్టెన్ల కారణంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలో ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) వచ్చే అవకాశాలు ఎక్కువని ‘మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మోతాదుల్లో స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స అందిస్తారు. ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే కర్టెన్స్ను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్లు అవుతుంది.అలర్జీల నివారణకు...∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు వస్త్రంతోతయారైన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెన్స్) వాడటమే మంచిది షవర్ కర్టెన్లు కోసం ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిది ∙అయితే... బాత్రూమ్ల్లో వాడటం వల్ల అవి తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే హానికరం కాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మంచిది ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్మెటీరియల్తో చేసినవైనా బాగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్తో తయారైన కర్టెన్స్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్మెటీరియల్తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం చాలా అవసరం. ఇలా ΄్లాస్టిక్తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపో అలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో! -
ఇదేమీ అలెర్జీ రా బాబు..! స్నానం చేసిందా ఇక అంతే..!
స్నానం చేస్తే.. నరకయాతన అనుభవించే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా!. అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందా? అని అనిపిస్తుంది.కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాటికి సరైన చికిత్స విధానం, తగ్గించే మందులు లేకపోవడంతో వాళ్లు చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి భాదనే చవిచూస్తోంది యూకేకి చెందిన ఓ మహిళ. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్లోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మహిళ తీవ్రమైన నీటి అలెర్జీతో బాధపడుతోంది. అందువల్ల ఆమె స్నానం చేయలేని స్థితిని ఎదుర్కొంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండటం అనేది కుదరని పని. తప్పక స్నానం చేసినా.. వెనుటవెంటనే టవల్తో తుడిచేసుకోవాల్సిందే. ఒక చుక్క నీరు కూడా శరీరంపై ఉండటానికి వీల్లేదు. ఇది ఎంత దారుణమైన బాధంటే..ఆయా వ్యక్తులు పొరపాటున కూడా నీటిని తాకలేరు, కనీసం వారి స్వేద జలం కూడా వారికి ఇబ్బందే. ఆమె శరీరం పొరపాటున తడికి గురయ్యిన లేదా నీళ్లను తాకినప్పుడు వెంటనే దద్దుర్లు, దురద రావడం జరుగుతుంది. ఎంతలా అంటే అదేపనిగా దురద వస్తూ ఉండటంతో గోకకుండా ఉండలేనంత విధంగా ఒకటే దురదగా ఉంటుందని వేదనగా చెబుతోందామె. తనకు ఈ పరిస్థితి సుమారు 12 ఏళ్ల వయసు నుంచి మొదలయ్యిందని, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక భరించేలేక డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు కూడా ఈ అలెర్జీకి చికిత్స లేనందున వీలైయినంతగా స్నానం చేయకపోవడం లేదా స్నానం చేయడానికి దూరంగా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించినట్లు తెలిపింది. అయితే ఇలా స్నానం చేయకుండా తడిగుడ్డతో లేదా వైప్స్తో తుడుచుకోవడం ఎంత నరకమో తెలుసా? అంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. తాను ఇలా స్నానం చేయకుండ ఉండలేను స్నానం చేస్తే తట్టుకోలేను అంటూ బాధగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనలాంటి వాళ్లు ఎవరైన ఉన్నారా? అని సోషల్ మీడియా ద్వారా సర్చ్ చేసి మరీ తెలుసుకున్నానని, తామంత ఒక కమ్యూనిటిగా ఉండి, తమ సమస్యలను ఒకరికొకరం షేర్ చేసుకుంటామని చెప్పింది. నిజానికి ఇదొక అరుదైన సమస్య. వైద్య చరిత్రలో నీటికి సంబంధించిన అలెర్జీలు 37 రకాలు ఉన్నాయని, ఇప్పటివరకు వాటికి సరైన చికిత్స విధానం లేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: చేప చర్మం కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్, అల్సర్లకు కూడా!) -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్లాండ్లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
మాకొద్దు బాబోయ్.. మాంసం చూస్తే వణికిపోతున్న అమెరికన్లు.. ఆ పురుగు వల్లనే ఇదంతా!
మాంసం చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొంత మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదని అంటారు. అయితే కొందరు అమెరికన్లకు మాత్రం మాంసం చూస్తేనే ఒళ్లంతా అలర్జీ వచ్చేసి వాంతులతో వస్తున్నాయట. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి ఇది ఆల్ఫా – గాల్ సిండ్రోం అని కనుగొన్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోందంటే.. ఆల్ఫా గాల్ అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తులను ఆహారంగా ఇస్తే అలర్జీకి గురవుతారు. ఇది లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2010 తర్వాతి నుంచి అమెరికాలో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో 100,000 మందికి ఉండగా.. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్యను మరింత పెరిగి దాదాపు 450,000 మంది ఈ సిండ్రోం బారిన పడినట్లు పేర్కొన్నారు. 2011 లో పరిశోధకులు మొదటగా లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ క్లినిక్ ప్రకారం, ఇటువంటి కేసులు సాధారణంగా దక్షిణ, తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. లాంగ్ ఐలాండ్లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఎరిన్ మెక్గింటీ దీని గురించి మాట్లాడుతూ, గత దశాబ్దంలో ఆమె సిండ్రోమ్తో సుమారు 900 మందిని చూసిందని చెప్పుకొచ్చారు. ఇది వేగంగా వ్యప్తి చెందుతుందని ఆమె చెప్పారు. జింకల ద్వారా ఈ కీటకం నగరాల సరిహద్దుల్లోకి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఈ అలర్జీ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చదవండి నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ అలర్జీ మెడిసిన్ వాడితే ప్రమాదమా..?
-
మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమైన ప్రపంచ అలర్జీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం డీజీపీ కార్యాలయంలో ప్రముఖ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలో ‘పావురాల రెక్కలు – పావురాల విసర్జన– ఎలర్జీ నిర్ధారణ– పరీక్షలు’ క్యాంపెయిన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పావురాలతో ప్రబలే అలర్జీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలర్జీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని అశ్వినీ అలర్జీ సెంటర్లో పావురాల వల్ల కలిగే ప్రాణాంతకరమైన వ్యాధి ‘హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్’ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెయ్యి మందికి ఉచితంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్లైటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. -
అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..
Winter Season: Tips To Handle Asthma Allergy Doctors Suggestions: ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరని అనుకుంటారు కొందరు. కానీ ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ. సౌకర్యం కోసం శ్వాస వ్యవస్థను అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అనీ... కింది భాగాన్ని లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అని చెబుతుంటారు గానీ... ఈ రెండూ ఒకటే. డూప్లె(క్స్) భవనంలోని పై భాగం అప్పర్ ఎయిర్ వే అయితే... కింది భాగం లోయర్ ఎయిర్ వే... ఈ రెండూ కలిసిన ఒకే ఇల్లు లాంటివివి. అలర్జీ వల్ల పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’. అదే కింది భాగం అయితే అది ఆస్తమా. గమనించి చూస్తే 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, ఆస్తమా ఈ రెండూ ఉంటాయి. ఈ సీజన్లో వీటి బెడద మరింత ఎక్కువ. అందుకే చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. అలర్జీలు అలర్జీ అంటే ఏదైనా మనకు సరిపడని పదార్థం మనలోకి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ!. అదెంత ఎక్కువగానంటే... మన ఆరోగ్యాన్నే దెబ్బతీసేంత తీవ్రంగా! అప్పుడు మన దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. అలా అలర్జీని కలిగించే పదార్థాల్ని ‘అలర్జెన్’ అంటారు. అలర్జీలు వేటివేటితో... నిర్వహణ ఎలా? సాధారణంగా పిల్లల్లో / పెద్దల్లో చాలా మందికి చాలా రకాల అంశాలు సరిపడవు. ఆహారాలు : చాక్లెట్స్, గోధుమలతో వండిన ఆహారాలు, కొందరికి గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, పాలతో చేసిన పదార్థాల వంటి వాటితో రావచ్చు. పాలు తాగే పసిపాపల్లో సైతం బాటిల్ ఫుడ్, పోతపాలు, టిన్డ్ ఫుడ్ వంటివాటితో అలర్జీలు రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : పిల్లలకు సరిపడని వాటిని... వారినుంచి దూరంగా ఉంచడమే దీనికి తొలి చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు/ వాతావరణం : పొగ, దుమ్ము ధూళి, పుప్పొడి, దోమల మందు వంటివి. నిర్వహణ (మేనేజ్మెంట్) : పైన పేర్కొన్నవి కమ్ముకుని ఉండే చోట్ల నుంచి దూరంగా ఉండాలి. మందులు / ఇతరాలు : కొందరు పిల్లలకు పెన్సిలిన్, యాస్పిరిన్ వంటివి సరిపడకపోవచ్చు. మరికొందరికి కాస్మటిక్స్ పడకపోవచ్చు. సోయా అలర్జీ, మోల్డ్ అలర్జీ, సన్ అలర్జీ, కొందరికి రబ్బర్ వస్తులతో కలిగే లేటెక్స్ అలర్జీ... ఇలా ఎన్నెన్నో కారణాలతో... రకాల అలర్జీలు వచ్చే అవకాశముంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు అలర్జీ కలిగించే అంశం ఏదైనా దాన్ని నుంచి దూరంగా ఉండటమే దాని నివారణకూ, నిర్వహణకు మేలైన మార్గమని గుర్తుంచుకోవాలి. ఆస్తమా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు... దాని నిర్వహణ అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాలా రావచ్చు. అలాగే తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు సరిపడని ఆహారానికి/వాతావరణానికి/పరిసరాలకు దూరంగా ఉండటం వ్యాయామం : తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కొందరిలో ఆస్తమా రావచ్చు. మనం గాలిని పీల్చగానే ముక్కులోకి ప్రవేశించిన బయటి చలి గాలిని కాస్తంత వెచ్చబరచడం, తేమ ఉండేలా చేయడం వంటి పనులను ముక్కు చేస్తుంది. వ్యాయామ సమయంలో సాధారణ సమయంలో కంటే పెద్దమొత్తంలో గాలిని పీల్చుకుంటుంటాం. దాంతో బయటి గాలి తాలూకు టెంపరేచర్, తేమల తేడాలను తట్టుకోలేని శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి. వ్యాయామం కారణంగా ఎక్కువ మోతాదులో గాలి అవసరమవుతుంది. కానీ ముడుచుకుపోయిన శ్వాసనాళాల నుంచి అవసరమైన మేరకు గాలి అందదు. దాంతో ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ వస్తుంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా మొదలవుతుంది. బయటి గాలిలో, ముక్కు నుంచి దేహంలోకి లోపలికి ప్రవేశించాక ఉన్నగాలిలో తేడాలు ఎక్కువైతే ఇది వస్తుంది కాబట్టి దేహం కూడా దీన్ని తట్టుకునేలా నేరుగా వ్యాయామం మొదలుపెట్టకుండా... కనీసం 5 – 10 నిమిషాల పాటు వార్మ్ అప్ వ్యాయామాలు చేయాలి. వార్మ్ అప్ వ్యాయామాలు ఎంతసేపు చేస్తే... ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వచ్చే అవకాశాలు అంతగా తగ్గుతాయి. ఒకవేళ అప్పటికీ వస్తూనే ఉంటే వ్యాయామం తాత్కాలికంగా ఆపేసి, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. జీఈఆర్డీ సమస్యతో అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో ఆహారం తీసుకున్న తర్వాత వారి కడుపులో జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం కడుపులోంచి గొంతులోకి వెనక్కు వెళ్లినప్పుడు (రిఫ్లక్స్) గొంతు, పొట్టపైభాగంలో మంట, నొప్పి వస్తాయి.కొందరిలో తిన్నది గొంతులోకి వస్తున్నట్లుగా అనిపిస్తు్తంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. పులితేన్పుల రూపంలో యాసిడ్ గొంతులోకి రాగానే గొంతు మండడం, కడుపు ఉబ్బరం చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. జీఈఆర్డీ సమస్య ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కడుపు బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, నిద్రలో సమస్య ఎక్కువై, మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేవారిలో ఇలాంటి ఆస్తమా ఎక్కువ. అందుకే తక్కువ మోతాదుల్లో తింటూ కడుపును తేలిగ్గా ఉంచుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ వీలైనంత ముందుగా భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత) పడుకోకుండా / నిద్రకు ఉపక్రమించకుండా కాసేపు అటు ఇటు నడిచాకే పక్క మీదికి చేరాలి. ఇతర కారణాలతో... పొగాకు పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగుల (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి వాటి వాసన సరిపడకపోవడం వంటి అంశాలతోనూ ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్ప్లేస్ ఆస్తమా’ అంటారు. కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : తమకు సరిపడని వాటి నుంచి దూరంగా ఉండటమే ఈ సమస్యల నివారణకు మార్గం. అలాగే వర్క్ప్లేస్ ఆస్తమా ఉన్నవారు... వీలైతే తమ వృత్తిని మార్చుకోవడమే మేలు. ఇక మందులతో ఆస్తమా వచ్చేవారు... ఏవి తమకు సరిపడటం లేదో గుర్తించి, ఆ విషయాన్ని డాక్టర్కు తెలిపి, మందులను మార్పించుకోవాలి. -డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ చదవండి: Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్ అస్సలు వదలరు! -
గర్భిణులూ.. తీపి పదార్థాలు తగ్గించండి, లేకపోతే కష్టం!
చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా ఉండి బాగా తీపి పదార్థాలను గర్భవతిగా ఉన్నప్పుడు తినకపోవడమే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీలో అలా అపరిమితంగా తీపి పదార్థాలు తినేవాళ్లకు పుట్టిన చిన్నారులకు అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 9000 మంది గర్భిణులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయాల్లో అపరిమితంగా తీపి తినేవారి పిల్లల్లో దుమ్ముకూ, ఇంట్లోని పెంపుడు జంతువుల వెంట్రుకలకూ తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశాలుంటాయని వెల్లడించారు. కాబోయే తల్లులు ఎంత తక్కువగా స్వీట్లు తింటే పిల్లల్లో ఈ అలర్జీలు అంత తగ్గుతాయని సూచిస్తున్నారు. అయితే ఈ అలర్జీలు.. తీపిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కృత్రిమ స్వీటనర్లతోనే అనీ, పండ్లూ, కూరగాయల్లో లభ్యమయ్యే నేచురల్ షుగర్స్తో ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఈ విషయాలన్నీ ‘యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్’ అనే వైద్యనిపుణుల సంచికలో ప్రచురితమయ్యాయి. చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్పిక్ వాడుతున్నారా? రెండుసార్లు అబార్షన్.. ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగెటివ్...పరిష్కారం ఏంటి! -
తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అన్ని రకాల అలర్జీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జెరాత్ పాథ్ ల్యాబ్స్, అలర్జీ టెస్టింగ్ సెంటర్ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 80 నుంచి 130 అలర్జీలకు సంబంధించిన పరీక్షలను 50 శాతానికి పైగా రాయితీతో చేయనున్నట్లు పేర్కొంది. జూలై 2, 3, 4, 5వ తేదీల్లో ఈ కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. అలర్జీ పరీక్షలతో పాటు థైరాయిడ్, కిడ్నీ, లివర్, కీళ్లు, లిపిడ్, ఎలక్ట్రోలైట్స్ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది. -
ఫైజర్ టీకాతో అలర్జీ
అలాస్కా/వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్–19ను నిరోధించే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్లో కూడా ఫైజర్ వ్యాక్సిన్తో అలర్జీకి సంబంధించిన రెండు కేసులు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని అలాస్కాలోనూ టీకా డోసు తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనారోగ్యానికి గురి కావడంపై ఆందోళన నెలకొంది. అమెరికాలో అలర్జీ లక్షణాలు కనిపించిన ఆరోగ్య కార్యకర్తలకు గతం లో ఎప్పుడూ అలర్జీ రాలేదు. ఫైజర్ టీకా డోసు తీసుకున్న వెంటనే వారిలో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇ బ్బందులు, కళ్ల కింద వాపు, తలనొప్పి, గొం తు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికన్లలో ఫైజర్ వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని భరోసా ఇచ్చింది. నేడు పైన్స్కు.. వచ్చేవారంలో బైడెన్కు వ్యాక్సిన్పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేడు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వచ్చే వారంలో బైడెన్ కూడా టీకా తీసుకుంటారని ఆరోగ్య శాఖ అధికారు లు వెల్లడించారు. అందరి ఎదుట వ్యాక్సిన్ తీసుకుంటానని బైడెన్ చెప్పిన సంగతి తెలిసిందే. -
అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు
లండన్: కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్– బయోఎన్టెక్ వ్యాక్సిన్ తీసుకున్న నేషనల్ హెల్త్ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సర్వసాధారణమే. ఎందుౖనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని చెప్పాము. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది’’ అని అధికారులు చెప్పారు. -
ఇదో చిత్రమైన అలర్జీ
మీకు తెలుసా? కొందరిలో కొన్ని పదార్థాలతో వచ్చే అలర్జీలు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇందుకు ఓ ఉదాహరణ అరటి, కీవీ పండ్ల వల్ల వచ్చే అలర్జీ. మనకు చిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. సాధారణంగా కొందరిలో రబ్బర్ ఉత్పాదనలనుంచి అలర్జీ వస్తుంటుంది. ఉదాహరణకు చేతికి వేసుకునే రబ్బర్ గ్లౌవ్స్, షూస్, మాస్కులు, స్లిప్పర్ల వంటి ఎన్నెన్నో వస్తువులతో ఈ తరహా అలర్జీ కనిపిస్తుంది. దీని కారణంగా చర్మం ఎర్రబారడం, మేనిపై చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ రావడం మొదలుకొని, అవి చాలా తీవ్రంగానూ చర్మంపై పగుళ్ల రూపంలో కనిపించేలా ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. మరికొందరిలో రబ్బర్తో వచ్చే అలర్జీ రియాక్షన్ కనిపించగానే చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం జరుగుతుంది. ఈ రియాక్షన్ను అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్’ లేదా ‘బ్లాక్ రబ్బర్ ఫీట్’ అని అంటుంటారు. ఇలా రబ్బర్తో అలర్జీ ఉన్న కొంతమందిలో కాస్తంత అరుదుగానైనా అరటి, కీవీ పండ్ల వల్ల కూడా అలర్జీ కనిపించవచ్చు. అరటి, కివీ పండ్ల చెట్లు కూడా ఇంచుమించుగా రబ్బర్ మొక్క కుటుంబానికి చాలా దగ్గరి జాతివి కావడమే ఇందుకు కారణం. ఇలా అటు రబ్బర్కూ... ఇటు ఈ అరటి, కీవీ పండ్లకూ అలర్జీ కలిగి ఉండటాన్ని ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. కేవలం ఆ కుటుంబానికి చెందిన పండ్లకు మాత్రమే కాకుండా... మరికొందరికి అవకాడో, చెస్ట్నట్, పీచ్, టొమాటో, ఆలూ, బెల్పెప్పర్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలతో కూడా అలర్జీ వస్తుంటుంది. వీటిల్లో లాటెక్స్ పాళ్లు లేనప్పటికీ కనిపించే ఈ రుగ్మతను కూడా ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అనే వ్యవహరిస్తారు. ఆయా పదార్థాలు వారికి సరిపడకపోవడమే ఇందుకు కారణం. -
వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు
మా పాప వయసు 12 ఏళ్లు. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు... అదేపనిగా తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతూ ఉంటుంది. స్కూల్కు కూడా పోవడం లేదు. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? అలర్జీ గురించి మనం సాధారణంగా రోజూ వింటూ ఉంటాం. అలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. వర్షాకాలం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే అది పలు రకాల వ్యాధులతో బాధపెట్టవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలంలో అలర్జీ సమస్య చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. తుమ్ములూ, దగ్గులు మాత్రమే కాదు... ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ జలుబు, దగ్గు రావడం సహజంగా వైరల్ జ్వరాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులను ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మన ఆధునిక జీవితం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలూ, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం కూడా ఈ అలర్జీకి ఒక పెద్ద కారణం. అలర్జీతో ఇబ్బందులు పడేవారి బాధ వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ అలర్జీతో బాధపడుతుంటారు. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. అలర్జీతో బాధపడేవారిలో వారు ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఒక రకమైన యాంటీబాడీస్తో ఈ అలర్జెన్స్ కలవడం వల్ల హిస్టమిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీని కారణంగానే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి తాలూకు తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్రతో పాటు గాలి, నీరు, ఆహారంలో మార్పులు, కాలుష్యాల వల్ల రక్తంలో జరిగే మార్పులతో ఈ లక్షణాలు బయటపడతాయి. అం్ట కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఈ అలర్జీకి కారణమవుతాయన్నమాట. కారణాలు : ►దుమ్ము, ►పుప్పొడి రేణువులు ►పెంపుడు జంతువుల వెంట్రుకలు ►ఘాటైన వాసనలు ►చల్లటిగాలి ►శీతలపానియాలు ఐస్క్రీమ్లు ►మస్కిటో రిపల్లెంట్స్ వాతావరణంలో మార్పులు లక్షణాలు : ►తుమ్ములు ►ఆయాసం ►శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు / ఉబ్బసం ►వాంతులు ►ముక్కుకారడం ►ఒంటిపై దద్దుర్లు ►కళ్లు దురదలు పెట్టడం. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఇజినోఫిల్ కౌంట్, ఐజీ–ఈ యాంటీబాడీస్, ఎక్స్రే, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్, సీటీ స్కాన్, అలర్జిక్ ప్రొఫైల్... మొదలైనవి. చికిత్స : హోమియోలో అలర్జీ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ►ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పుట్టినరోజు నాడే ప్రాణం తీసిన వెన్న
లండన్: ఒవెన్ కారీ అనే యువకుడు తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కోసం లండన్ థేమ్స్ నది ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకల నిమిత్తం నది పక్కనే ఉన్న బైరన్ చైన్ అనే రెస్టారెంట్కు వెళ్లాడు. కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భోజనం ఆర్డర్ చేశాడు. అయితే ఒవెన్కు డెయిరీ ఎలర్జీ(పాల సంబంధిత ఉత్పత్తులు పడకపోవడం) ఉంది. చికెన్ బ్రెస్ట్ ఆర్డర్ చేసిన ఒవెన్ ఎందుకైనా మంచిదని తనకున్న డెయిరీ ఎలర్జీ గురించి హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆహారం రావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేశాడు. ఆహారం స్వీకరించిన కాసేటికే ఒవెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ముందు అతని పెదవులు ఒంకర్లు పోవడం.. కడుపులో మంట.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఒవెన్ మరణించాడు. ఈ సంఘటన 2017లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఒవెన్ మృతికి గల కారణం మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో సౌత్వార్స్ కరోనర్స్ కోర్టు తాజాగా ఒవెన్ మృతికి గల కారణాల్ని వెల్లడించింది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ వల్లే ఒవెన్ మరణించినట్లు కోర్టు ప్రకటించింది. పుట్టిన రోజునాడు ఒవెన్, బైరన్ చైన్ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు డెయిరీ ఎలర్జీ ఉందని ఒవెన్ హోటల్ సిబ్బందికి తెలిపాడు. కానీ వారు ఆ విషయాన్ని మర్చిపోయి.. ఒవెన్ ఆర్డర్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్ను వెన్నతో కలిపి ఉడికించారు. సదరు పదార్థంలో వెన్న ఉందనే విషయాన్ని తెలిపారు కానీ.. దాన్ని చాలా సూక్ష్మంగా ముద్రించడంతో ఆ విషయం ఒవెన్ దృష్టికి రాలేదు. దాంతో అతడు ఆ ఆహారాన్ని స్వీకరించడం.. మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒవెన్ మరణం అతడి కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చినప్పటికి.. ఓ కొత్త చట్టం రావడానికి మాత్రం దోహదపడింది. ఒవెన్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక మీదట రెస్టారెంట్లలో ప్రతి ఆహారం మీద ఎలర్జీ లేబుల్స్ను ఉంచాలని ఆదేశించింది. ప్రతి వంటకం మీద.. దానిలో వాడిన పదార్థాల వివవరాలతో పాటు కలిగే ఎలర్జీల గురించి ఖచ్చితంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తీసుకునే ఈ చిన్న చిన్న చర్యల వల్ల నిండు ప్రాణాన్ని కాపాడగల్గుతామని కోర్టు స్పష్టం చేసింది. -
హెయిర్–డై వాడుతున్నారా?
నా వయసు 34 ఏళ్లు. నా జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతోంది. అయితే ఇప్పటివరకు నేను జుట్టుకు రంగు వేయలేదు. ఇకపై హెయిర్–డై వాడదామని అనుకుంటున్నాను. దాని విషయంలో నా ఎంపిక ఎలా ఉండాలి? హెయిర్–డైతో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దయచేసి నాకు హెయిర్–డై వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా చెప్పండి. చాలామంది హెయిర్–డై లను చాలారకాల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. హెయిర్–డై విషయంలో మీ ఎంపిక అన్నది అసలు మీరు హెయిర్ డైని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంటే... కొందరు జుట్టు తెల్లబడ్డందున దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటారు. అయితే మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. ఉదాహరణకు కొందరు జుట్టు చివర్లు ఎర్రగా మార్చుకునేందుకు, మరికొందరు కొన్ని పాయలు ఎట్రాక్టివ్గా కనిపించేందుకు రకరకాల షేడ్స్లో హెయిర్–డైని వాడుతుంటారు. మీరు ఏ ప్రయోజనం కోసం హెయిర్–డై వాడుతున్నప్పటికీ మీ బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడం మంచిది. హెయిర్ డైతో వచ్చే సాధారణ ప్రమాదాలివే... ►హెయిర్ డైలో ఉండే రసాయనాలలో కొన్ని కెమికల్స్ మీకు, మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దాని వల్ల కొందరిలో అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం మీద వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగితే వీలైనంత త్వరగా హాస్పిటల్కు వెళ్లి డాక్టర్/డర్మటాలజిస్ట్ను సంప్రదించండి ►కొన్ని సందర్భాల్లో హెయిర్డైలో ఉండే రసాయనాలు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం వంటి ఇబ్బందులు కలగజేస్తాయి. ఇవి కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆస్తమాకూ దారితీయవచ్చు. చాలాసార్లు సురక్షితంగా వాడిన రసాయానాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా మీకు ప్రమాదకరంగా, అలర్జిక్గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి ►అయితే మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఒకవేళ నిర్దిష్టంగా ఆ బ్రాండ్ హెయిర్–డైతో మీకు ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే దానికి దూరంగా ఉండటం మేలు. హెయిర్–డై వేసుకునే పద్ధతి ఇలా... ►ఒక గిన్నెలో మీరు వేసుకోబోయే హెయిర్–డైని కలుపుకుని సిద్ధం చేసుకోండి. దాన్ని మీకు అనువైన బ్రష్తో హెయిర్ డైలో ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఆ రసాయనాలు ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెయిర్–డై వేసుకునే సమయంలో కంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ►హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. ఒక రసాయన చర్య జరిపి జుట్టును నల్లబారుస్తాయి. ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది ►కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ, కాలీ మెహందీలోనూ పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. బ్లాక్ హెన్నా కూడా అంత సురక్షితం కాదు. వీటిలో ఉండే రసాయనాల వల్లనే రియాక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకింత సురక్షితమైన మెడికేటెడ్ హెయిర్ డైస్ దొరుకుతున్నాయి. మీ డెర్మటాలజిస్ట్ను సంప్రదించి వాటిని మీరు సురక్షితంగా వాడుకోవచ్చు ►కొంతమంది హెయిర్ డై ప్యాక్మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ►మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? అయితే మొదటిసారి మీరే ఇంటి దగ్గర వేసుకోకండి. ఒకటి రెండుసార్లు మంచి పార్లర్లో ప్రొఫెషనల్స్ సహాయంతో రంగు వేసుకోండి. వారెలా వేస్తున్నారో గమనించి, ఆ తర్వాత మీరు ఆ టెక్నిక్స్ను అనుసరించండి ►తొలిసారి రంగు వేసుకునే వారు నేరుగా దాన్ని తలకు పట్టించుకోవడానికి బదులు ముందుగా చెవి వెనక ఉండే ఒక పాయకు రంగు వేసి, కాసేపు ఉంచి, దాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత 48 గంటల పాటు పరిశీలించి చూసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించపోతే... ఇక ఆ రంగును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఒకవేళ ఏదైనా సైడ్ఎఫెక్ట్ కనిపిస్తే ఆ బ్రాండ్ను వదిలేసి, మరో బ్రాండ్ ఎంచుకోండి ►మీకు సురక్షితమని తేలిన బ్రాండ్నే ఎప్పుడూ కొనసాగించండి. కొత్త బ్రాండ్ వాడదలచుకున్నప్పుడు మళ్లీ చెవి వెనక ఉన్న వెంట్రుకలలో ఒక పాయకు రంగు వేసి మళ్లీ మరో 48 గంటలు వేచిచూసి, సురక్షితమని తేలాకే బ్రాండ్ మార్చండి ►మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాల చర్మంపైన ముందుగా పెట్రోలియం జెల్లీని పూయండి ►రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్ను చుట్టండి ►రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్ను ఉపయోగించండి. అంతే తప్ప ఒక్కచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ►రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ►వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ►మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి ►రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ►రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ►హెయిర్డై కేవలం తలకు మాత్రమే వాడండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్డై వాడకూడదు ►మీరు కొన్ని బ్రాండ్లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ►ఒకవేళ మహిళలు గర్భం ధరించి ఉంటే... తాము గర్భవతిగా ఉన్న సమయంలో హెయిర్డై ఉపయోగించకపోవడమే మంచిది ►హెయిర్డై వల్ల యౌవనంగా కనిపిస్తాం. అలా కనిపించడం మనందరం కోరుకునేదే. అయితే ఆ చర్య వల్ల మనకు హాని జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. రంగు వేసుకునే సమయంలో మీ గోళ్లు జాగ్రత్త... జుట్టుకు రంగు వేసుకునే సమయంలో మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోతే... హెయిర్ డై గోళ్లకు అంటుకునే ప్రమాదం ఉంది. అది ఏ మాత్రం గోరుకు అంటుకున్నా పర్మనెంట్గా ఉండిపోతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోరు పెరుగుతున్న కొద్దీ, పెరిగిన గోరును మనం కట్ చేసుకున్న కొద్దీ మూడు నెలల్లో గోరు రంగు పూర్తిగా తొలగిపోతుంది. మన గోరూ, జుట్టూ ఈ రెండూ కూడా కెరొటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ ఉంటుంది. కింది నుంచి పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్రెష్ గోరుగానీ, జుట్టుగానీ తెల్లగా వస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
సల్వార్ కట్టే చోట నల్లటి మచ్చ...
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి. – సుష్మా, హైదరాబాద్ మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... ∙నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి ∙నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీమ్ రాసుకోండి ∙బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్తో ఉండే దుస్తులు వాడండి ∙అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ బయటి జుట్టు చివర్లు చిట్లుతున్నాయి...! నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్ప్లేస్కు బైక్పై వెళ్తుంటాను. నా మీడియమ్ లెంత్ హెయిర్లోని హెల్మెట్కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్పోజ్ అవుతోంది. దాంతో ఆ భాగం జుట్టులోని చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. తగిన పరిష్కారం చెప్పండి. – కె. శివానీ, విశాఖపట్నం మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ∙టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి. ∙రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి ∙తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... ∙డైమిథికోన్ ∙ట్రైజిలోగ్జేన్ ∙విటమిన్ ఈ ఎసిటేట్ ∙అహోబా ఆయిల్ ∙ఆలివ్ ఆయిల్ ∙ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. కాలి వేళ్ల మధ్య ఎర్రబారుతోంది... నా వయసు 54 ఏళ్లు. గృహిణిని. మా ఇంట్లో మా ప్లేట్లు నేనే శుభ్రం చేస్తేగానీ లేదా మా బట్టలు నేనే ఉతుక్కుంటేగానీ నాకు సంతృప్తి ఉండదు. అందుకే ఆ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను. దాంతో తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – అనసూర్య, కోదాడ మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బు నీళ్లలో కాళ్లు తడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. అలర్జిక్ ర్యాష్ వచ్చిన చోట డార్క్ మార్క్స్... నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్క్స్ ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పారిజాత, ఒంగోలు మీరు ‘పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి. ∙ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి. ∙కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు రాయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ పీరియడ్స్ సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదెందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఎమ్. కవిత, విశాఖపట్నం రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శరీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్ను కలవండి. నా వయసు 33. నాకు డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ము అంటే సరిపడదు. దాంతో ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయాలనుకున్నా ఇది నాకు ప్రతిబంధకంగా ఉంటోంది. దయచేసి నేను వ్యాయామం చేయడానికి అవసరమైన సలహా ఇవ్వగలరు. – ఎమ్డీ గియాసుద్దిన్, కర్నూలు వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, అదే సమయంలో ఆ గాలికి తేమ సమకూరుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) వచ్చినప్పుడు అప్పటికి ఆపేసినా... వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. అసలు సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్ మంచిదేనా? నా వయసు 46. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ (ఈ–సిగరెట్)ను ప్రయత్నించమని స్నేహితులు చెబుతున్నారు. ఈ–సిగరెట్ వాడడం సురక్షితమేనా? – ఆర్. గౌతమ్, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్కూ, ఈ–సిగరెట్కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. ఈ–సిగరెట్లో సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ సురక్షితమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్లోని పొగలో మామూలు సిగరెట్తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్తో వచ్చే అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్తోనూ వస్తాయి. ఈ–సిగరెట్లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడమే మార్గం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
రుచిగా లేదనుకుంటే నష్టపోతాం
పాపం... దొండకాయను కాకి ముక్కుతో జత చేసేప్పుడు మనమిచ్చే ప్రాధాన్యం.. దాన్ని కూరగా పరిగణించినప్పుడు అంతగా ఇవ్వం. కానీ కాకి విషయంలో దాని అందం ఎంతో... తిండి విషయంలో దాంతో వచ్చే ఆరోగ్యమూ అంతే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతగా రుచించదంటూ దొండను ముట్టకపోతే మనమే అజ్ఞానకాకులం అవుతామంటున్నారు కాకలు దీరిన ఆహారనిపుణులు. దొండకాయతో మనకు సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. దొండకాయ ఒంట్లో విడుదలయ్యే చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ రోగులకు మంచిది. క్రమం తప్పకుండా దొండకాయ తినేవారిలో చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వుగా మారే ప్రీ–అడిపోసైట్స్ అనే కణాలను దొండకాయ సమర్థంగా నివారిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత (అనీమియా) తగ్గుతుంది. ఐరన్ లేమి వల్ల వచ్చే నిస్సత్తువ కూడా మాయమవుతుంది.దొండ వల్ల కేంద్ర నాడీమండలం బలం పుంజుకుంటుంది. మెదడుకూ మంచిది. ఇది మూర్ఛ (ఎపిలెప్సీ), అలై్జమర్స్ వంటి వాటిని చాలావరకు నివారిస్తుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే మణికట్టు నొప్పి కలిగించే జబ్బుకు దొండకాయ స్వాభావికమైన చికిత్సగా చాలామంది వైద్యులు పరిగణిస్తుంటారు. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండకాయ మూత్రపిండాల్లో రాళ్లను సమర్థంగా నివారిస్తుంది. దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండకాయలో సాపోనిన్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల అది ఎన్నో రకాల అలర్జీలను నివారిస్తుంది. దొండలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది. దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది. దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ చాలా మంచిది. హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా అది గుండెజబ్బులనూ అరికడుతుంది. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. -
ఉంగరం ఉన్న చోట్ల నల్లబడుతోంది.. ఏం చేయాలి?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – నవీన, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. ∙మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. ∙మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. ∙ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. ∙చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ను సంప్రదించండి. జుట్టు విపరీతంగా రాలుతోంది... పరిష్కారం చెప్పండి నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్గా ఉంటాను. హిమోగ్లోబిన్ కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. – సుష్మా, ఖమ్మం జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు ఈ కింది సూచనలు పాటించండి. 1) మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫెర్రస్ సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్–సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. 2) ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం డాక్టర్ సలహా మేరకు బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనో యాసిడ్లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. 3) మీ జీవనశైలి (లైఫ్స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి. 4) పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. నుదుటి చర్మం మందంగా మారుతోంది... ఎందుకు? నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – కె. కృష్ణమూర్తి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. ∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్ ∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి ∙యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ’ లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఉల్లి, టమాటాలతో అలర్జీ తుమ్ములు దూరం!
మీకు దుమ్ము వల్ల అలర్జీయా? దుప్పట్లు దుపలగానే తుమ్ములు మొదలవుతాయా? మీరు ఓ చిన్న చిట్కా పాటించండి. ఇకపై గోధుమలు, అరటిపండ్లు, ఉల్లి, బార్లీ, చికోరీ, టమాటా, చిలగడదుంప వంటివి కాస్త ఎక్కువగా తినండి. అలర్జీలు దూరమవుతాయంటున్నారు జపాన్లోని పరిశోధకులు. కొన్ని ఎలుకలపై పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వారు తొలుత ఎలుకలకు డస్ట్మైట్స్తో అలర్జీ కలిగించారు. ఇక వాటికి ‘ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్’ ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తూ వచ్చారు. తీరా పరిశీలిస్తే... మామూలు ఆహారంపై ఉన్న ఎలుకలతో పోలిస్తే ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే ఆహారం తిన్నవి చాలా ఆరోగ్యంగా ఉండి, అలర్జీలను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అందుకే అలర్జీలను అరికట్టడానికి ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే గోధుమ, అరటి, ఉల్లి, వెల్లుల్లి వంటివి మంచివంటున్నారు పరిశోధకులు. మీరూ కాస్త ట్రై చేస్తారా? -
ఎక్కువగా వాడితే వేపేస్తుంది
పరిపరిశోధన చిన్నప్పటినుంచి మనం చదువుకున్న దాని ప్రకారం వేపతో మనకెంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వేప మేలే కాదు, కీడు కూడా చేస్తుంది. ముఖ్యంగా వేపనూనెను చంటిపిల్లలకు ఉపయోగిస్తే వారిలో రియేస్ సిండ్రోమ్ తలెత్తి అది వారి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందట. అలాగే అలెర్జీ తీవ్రస్థాయిలో ఉంటే చాలామంది వేపాకును నూరి అదేపనిగా పట్టిస్తారు. దానివల్ల మరింత తీవ్రరూపం దాల్చి సమస్య జటిలం అవుతుందంటున్నారు పరిశోధకులు. చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు. కాని ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తేనే మంచి ఫలితం వస్తుంది. లేదంటే కడుపు గడబిడతో అల్లకల్లోలం అవుతుంది. బ్లడ్సుగర్తో బాధపడేవారికి, అలాగే శరీరావయవాలను మార్పిడి చేయించుకునేవారికి వేపనూనెను ఇస్తుంటారు వైద్యులు. అలా చేయడం చాలా అపాయకరమని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కాబట్టి వేపాకే కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే ప్రాణాలను వేపేస్తుంది మరి! -
అలర్జిక్ రైనైటిస్... వాతావరణంతో పెద్ద రణం!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. చాలాకాలంగా దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది, వెంటనే తుమ్ములు వస్తున్నాయి. కాస్త చల్లగా ఉన్నప్పుడు ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ముక్కు బిగుసుకుపోతోంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – సంజీవ్, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు అలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి అంశాలు ఈ సమస్యను మరింత దుర్భరం చేస్తాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మనకు సరిపడని పదార్థాలు ఒంట్లోకి ప్రవేశంచగానే ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
వేసవి వ్యాధులు... హోమియో పరిష్కారాలు
హోమియో కౌన్సెలింగ్ నా పేరు అనిల్కుమార్. వయసు 35 ఏళ్లు. మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాను. ఎండలో కొంతసేపు తిరిగిన వెంటనే నోరు తడి ఆరిపోతోంది. చెమటలు పడుతున్నాయి. తల తిరిగినట్లు అవుతోంది. దీనికి ముందుజాగ్రత్తలు చెప్పండి. అలాగే హోమియోలో వేసవి సమస్యలకు ఏవైనా పరిష్కారాలు ఉంటే సూచించండి. – సురేందర్రావు, వరంగల్ వేడికి నీరు ఎలా ఆవిరవుతుందో, వాతావరణంలో ఎండ వల్ల వేడిమి పెరిగేకొద్దీ మన శరీరంలోని నీరు కూడా అలాగే ఆవిరి అవుతుంది. ఎండాకాలంలో పెద్దవారు, చిన్నపిల్లలు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతారు. మనం చెమట రూపంలో ఆవిరయ్యే నీటితో పాటు, సోడియమ్, పొటాషియమ్ మొదలైన లవణాలు కూడా నష్టపోతుంటాం. మిగతా కాలాల్లో కంటే వేసవిలో చెమట రూపంలో రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీటిని కోల్పోతుంటాం. ఎండలో తిరిగితే ఎండ దెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండదెబ్బ అనేది హఠాత్తుగా జరగదు. ఆరోగ్యం మీద ఎండ ప్రభావం దశలవారీగా ప్రభావం చూపుతూ, చివరికి ఎండ దెబ్బకు దారితీస్తుంది. ఆ దశలు ... 1) అలసట; 2) హీట్ ఎగ్జాషన్; 3) హీట్ స్ట్రోక్. వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలిన వృద్ధులు, మహిళలు, చిన్నారు, విద్యార్థులు హోమియో మందులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... వడదెబ్బ, చికెన్పాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీ, చెమటకురుపులు, తలనొప్పి, ఆకలి మందగించడం, టైఫాయిడ్, నీళ్ల విరేచనాలు, మూత్ర సంబంధ వ్యాధులు, కలరా మొదలైనవి. కారణాలు: ∙కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ∙ఎండల్లో ఎక్కువగా తిరగడం ∙మద్యం సేవించడం ∙బయట కొన్న పదార్థాలు తినడం ∙తీవ్ర ఒత్తిడికి లోనుకావడం లక్షణాలు: ∙నీరసం, తల తిరగడం ∙సొమ్మసిల్లి పడిపోవడం ∙ఒంటినొప్పులు, తలనొప్పి ∙హైఫీవర్, వాంతులు ∙మూత్రం గాఢమైన పసుపురంగులో ఉండి మంటగా రావడం. చికిత్స: వడదెబ్బతో పాటు ఎండాకాలంలో వచే ఇతర వ్యాధులకు హోమియోలో అద్భుతమైన మందులు ఉన్నాయి. వేసవిలో వచ్చే వ్యాధులకు నేట్రమ్మ్యూర్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బ్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రత, లక్షణాలతో పాటు ఇతర వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల పర్యవేక్షణలోమందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ తిరగబెట్టే అవకాశాలు తక్కువే..! క్యాన్సర్ కౌన్సెలింగ్ క్యాన్సర్ ఉన్న శరీర భాగాన్ని తొలగించివేసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? నా భార్య (36 ఏళ్లు)కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ ఉన్న ఎడమ రొమ్మును తొలగించి వేస్తారని, అయినప్పటికీ మళ్లీ శరీరంలోని మరో చోట క్యాన్సర్ వస్తుందేమోనని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోవడం లేదు. బ్రెస్ట్క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా ఆ రొమ్మును తీసివేయాల్సిందేనా? దీనివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుందా? హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుందా? వేరే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా తెలపండి. – మనోజ్కుమార్, హైదరాబాద్ శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించివేసిన తర్వాత మళ్లీ క్యాన్సర్ రాదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్ కణాలు సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల రేడియేషన్తో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా చేయడం ద్వారా ఆ ప్రదేశంలో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చినట్టు గుర్తించారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం మాత్రం ఇక దాదాపుగా ఉండదు. రెండు అండావయాలను తొలగించి వేసిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ మరణాలు 80 శాతం తగ్గిపోయినట్టు, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తెలిసింది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్మును తొలగించివేయడంపైన చాలా అపోహలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. క్యాన్సర్ సోకినప్పుడు పూర్తి రొమ్మును తొలగిఒచడం చాలా అరుదుగా జరుగుతుంది. రోగ నిర్ధారణ పరీక్షలపై ఆధారపడి క్యాన్సర్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగిస్తాం. దాని వల్ల రూపం చెడకుండా, గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో శరీరంలోని మరో చోటి నుంచి కొంత భాగాన్ని తెచ్చి పార్షియల్ ఫిల్లింగ్ ద్వారా భర్తీ చేస్తాం. తర్వాత సాధారణ రూపంలో పోలిస్తే రొమ్ములో పెద్దగా తేడా కనిపించదు. మొత్తంగా రొమ్మును తీసివేయడం వల్ల మహిళ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె మానసిక కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావచ్చు. కానీ రొమ్మును తొలగించడం శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలను ఏమీ ప్రభావితం చేయదు. ఇది సాధారణ వైవాహిక జీవితంపై ప్రభావం కూడా చూపదు. మంచి సర్జికల్ ఆంకాలజిస్టులను కలవండి. ఆ నిపుణులు సహాయపడగలరు. మేము స్టేజ్ 1, స్టేజ్2, కొన్నిసార్లు స్టేజ్3 స్థాయిలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు కూడా చికిత్స చేస్తున్నాం. మీ భార్య భయపడుతున్న పరిణామాలు ఏమీ ఎదురవ్వలేదు. అందువల్ల ఆందోళన పడవద్దని చెప్పండి. ఆమె భయపడుతున్నట్లు ఏమీ జరగదు. డాక్టర్ కె. శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ తగిన జాగ్రత్తలతో... ఫిస్టులా తగ్గుతుంది ఫిస్టులా కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గత మూడు నెలలుగా మలద్వారం చుట్టూ విపరీతమైన నొప్పి వస్తోంది. కుర్చీ మీద కూర్చోలేకపోతున్నాను. మలద్వారం వద్ద బుడిపె ఏర్పడి అందులోంచి చీము స్రవిస్తోంది. అప్పుడప్పుడూ జ్వరం కూడా వస్తోంది. దీనికి చికిత్స మార్గాలు చెప్పండి. – సందీప్కుమార్, నిర్మల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే దీర్ఘకాలికంగా మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా దీని లక్షణాల్లో భాగంగా మలద్వారం సమీపంలో ఒక చిన్న బుడిపె ఏర్పడుతుంద. ఆ బుడిపె మధ్య భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం నుంచి తరచు చీము, రక్తం వస్తుంటాయి. దీన్ని ఫిస్టులా అంటారు. కొన్నిసార్లు ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం పూడుకుపోయి లోపల చీము, రక్తం నిల్వ ఉండిపోయి... నొప్పి వస్తుంటుంది. ఈ టైంలో జ్వరం కూడా రావచ్చు. చికిత్స: ఫిస్టులా అన్నది సాధారణంగా మందులతో నయం చేయలేని వ్యాధి. దీన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అయితే కొన్ని జాగ్రత్తలతో దీన్ని రాకుండా నివారించవచ్చు. నివారణ: n మలబద్దకం లేకుండా చూసుకోవాలి n ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి n ఇలా చేయడం ద్వారా మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. తద్వారా పరిస్థితి ఫిస్టులా వరకు వెళ్లకుండా జాగ్రత్త వహించవచ్చు n పరిశుభ్రమైన లో దుస్తులు (అండర్వేర్)లు మాత్రమే ధరించాలి n డ్రైవింగ్ ఎక్కువగా చేసేవారు లేదా ఆ వృత్తిలో ఉన్నవారు మలద్వార ప్రాంతాన్ని ఎప్పుడూ బట్టలతో కప్పివేసి ఉంచేలా కాకుండా... అక్కడ గాలి తగులుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి n గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, ఎండలో శ్రమించేవారు చెమట రూపంలో నీటిని ఎక్కువగా కోల్పోతుంటారు. ఈ కారణంగా కూడా మలబద్దకం రావచ్చు. ఇలాంటివాళ్లు తగినంత మంచినీటిని తాగుతూ ఉండటం ద్వారా మలబద్దకం సమస్యను నివారించుకోవచ్చు. మలబద్దకమే ఫిస్టులా సమస్యకు ప్రధానమైన మూలకారణం అయినందువల్ల... ముందుగా మలబద్దకాన్ని నివారించుకుంటే ఫిస్టులాను నివారించినట్లే అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. డా‘‘ఎమ్.ఏ.సలీమ్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జరీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
అలర్జీలకు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు ఇటీవల వరుసగా తుమ్ములు రావడం, ఆ తర్వాత కాసేపు ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే అలర్జీ అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవి, నరసన్నపేట అలర్జీ అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎన్నో అంశాలు మనకు అలర్జీ కలిగించవచ్చు. ఉదాహరణకు పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని ఆహారాలు (పాలు, గుడ్లు, చేపలు వంటివి), కొన్ని రకాల మందులు (యాంటీబయాటిక్స్, బీపీ పందులు మొ.) రబ్బరు లేదా ఇతర సరిపడని పదార్థాలను తాకడం, జంతుస్పర్శ, వాతావరణ మార్పులు మొదలైన అంశాల వల్ల మన శరీరం అసాధారణంగా స్పందిస్తుంది. ఇలా మన శరీరం ప్రదర్శించే అసాధారణ ప్రతిచర్యనే అలర్జీ అంటారు. ఇలా మన శరీరం అతిగా స్పందించడాన్ని ‘హైపర్ సెన్సిటివిటీ’ అని కూడా అంటారు. మనకు అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. వాటిని వల్ల మన శరీరంలో కలిగే ప్రతిక్రియను ‘అలర్జిక్ రియాక్షన్’ అంటారు. కారణాలు: అలర్జీకి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన అంశాలు, వాతావరణంలో మార్పుల వల్ల అలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంది. రకాలు: అలర్జీ వ్యక్తమయ్యే తీరును బట్టి దాన్ని అనేక రకాలుగా వర్గీకరించి, దానికి అనుగుణంగా పేరుపెడతారు. ఉదాహరణకు మీకు ఉన్న సమస్యలో కనిపించినట్లుగా వరసగా తుమ్ములు రావడం, ముక్కు కారడాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా పేర్కొంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఈ ‘అలర్జిక్ రైనైటిస్’ మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు ముక్కుదిబ్బడ, శ్వాస ఆడకపోవడం, కళ్లెపడటం, ముఖం వాపునకు గురికావడం, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. అటుపై ఈ వ్యాధి గాలిగొట్టాల్లోకి చేరి, ఊపిరితిత్తులకు సోకడం వల్ల దగ్గు ప్రారంభమై, కళ్లెతో కూడిన దగ్గుగా మారుతుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. ఈ పరిస్థితికి ఆయాసం, పిల్లికూతలు తోడైతే దాన్ని ‘అలర్జిక్ ఆస్తమా’ అంటారు. స్కిన్ అలర్జీ: అలర్జీ అనేది చర్మం ద్వారా కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆహారాలు, సరిపడని వస్తువులు తగిలితే చర్మం కూడా ప్రభావితమవుతుంది. అలాంటప్పుడు చర్మంపై దురద, దద్దుర్లు, చర్మం ఎర్రబారడం జరుగుతాయి. ఇది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. చాలా సందర్భాల్లో సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. జీర్ణకోశం అలర్జీ: కొన్ని రకాల ఆహారపదార్థాలు ఒంటికి సరిపడకపోవడంతో జీర్ణకోశ అలర్జీలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో నీరసం, వికారం, మలబద్దకం వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్ష, ఎక్స్-రే, సీటీస్కాన్, పీఎఫ్టీ... వంటి పరీక్షలు అవసరం. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అలర్జిక్ వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. హోమియో వైద్య విధానంలో అలర్జ్జీలకు నమ్మకమైన చికిత్స ఉంది. కాబట్టి మీరు నిపుణులైన హోమియో వైద్యులను కలిసి, చికిత్స తీసుకోండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ పెద్ద పేగు క్యాన్సర్ వంశపారంపర్యమా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? , - పార్వతి, నిజామాబాద్ పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా క్యాన్సర్ను మొదటే గుర్తించవచ్చు. నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందా? - పద్మనాభరావు, విజయవాడ మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను కలవండి. కళ్లు తిరిగి పడిపోయాడు.. సమస్య ఏమిటి? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - భవాని, కోదాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పవచ్చు. చాలా మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపించే సమస్యే ఇది. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడతాయి. మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఏదీ ఒకసారి దగ్గండి
దగ్గు... అనారోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. అన్ని దగ్గులూ ఒకటి కాదు. అది కనిపించే వేళలను బట్టి, అది వచ్చే వయసును బట్టి... దాని తీరును బట్టి సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి దగ్గుకూ ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ కథనం చదివితే అది అర్థమవుతుంది. ఏదీ ఒకసారి దగ్గండి.. ప్లీజ్ దగ్గు... మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ. దగ్గు ఒక వ్యాధి కాదు. అది ఒక లక్షణం మాత్రమే. ఎన్నో రుగ్మతలకు సూచిక. దగ్గు వస్తున్న వారు తమ అసలు సమస్య గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. దగ్గు అంటే...? మనం నిత్యం శ్వాస తీసుకుంటూ ఉంటాం. గాలిని మామూలుగా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని సాఫీగా వదిలేస్తాం. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని ఆ గ్లాటిస్ నుంచి తీవ్ర ఒత్తిడితో బలంగా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు వదిలేసినప్పుడు అది దగ్గు రూపంలో వస్తుంది. అలా గాలిని తెరలు తెరలుగా బలంగా బయటకు వదలడాన్ని దగ్గు అంటారు. దగ్గులో రకాలు... దగ్గుకు అనేక కారణాలుంటాయి. మనకు దగ్గు వచ్చే వేళను బట్టి, తెమడలోని రంగును బట్టి దగ్గులో అనేక రకాలుగా విభజించవచ్చు. అలా వ్యాధిని కూడా కొంతవరకు ముందే అనుమానించి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. సాధరణ పరిభాషలో దగ్గును రెండు రకాలుగా పేర్కొంటారు. దగ్గినప్పుడు తెమడ పడటం, సాధారణ ఉమ్మి కంటే చిక్కగా ఉండే స్రావాలు పడితే దాన్ని తడి దగ్గు అని, అలాంటివేవీ పడకుండా ఉండే దగ్గును పొడి దగ్గు అని అంటారు. తడి దగ్గు: సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి చోట ఉపరితలాన్ని తడిగా ఉంచేందుకు ఉత్పత్తి అయ్యే స్రావాలు బయటకు రావు. అవి రక్తనాళాల నుంచి గుండెకు చేరి అక్కడి నుంచి శరీరంలోకి ఇంకిపోతాయి (మెటబొలైజ్ అవుతాయి). అయితే ఏదైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి పెరిగి అది దగ్గుతో పాటు బయటకు వస్తే... దాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. తడి దగ్గు వస్తుంటే అది శ్వాసనాళాలో సమస్య (ఎయిర్వేస్ ప్రాబ్లమ్) అంటే ఆస్తమా, సీవోపీడీ, బ్రాంకైటిస్ కావచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ (నిమోనియా, టీబీ కావచ్చు పొడి దగ్గు: దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. ఇది వస్తుంటే సమస్య ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్డీ) కావచ్చు. ⇔సాధారణంగా ఒక రోగికి వచ్చేది ఏ రకమైన దగ్గు అన్నదాని ఆధారంగానే తొలిదశలో వ్యాధి ఏమిటో అనుమానించడం జరుగుతుంటుంది. నీరు చేరడం (ప్లూరల్). ⇔ దగ్గు వచ్చే వ్యవధి (డ్యూరేషన్)ను బట్టి సమస్యలను మూడు రకాలుగా చెప్పవచ్చు. రెండు వారాల లోపు మాత్రమే ఉంటే అక్యూట్ అని, 2 - 8 వారాల పాటు ఉంటే సబ్-అక్యూట్ అని, అంతకంటే దీర్ఘకాలం ఉంటే దాన్ని క్రానిక్ అని పేర్కొంటారు. రాత్రీ - పగలూ తేడా... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కూడా వ్యాధిని అనుమానించవచ్చు. సాధారణంగా అలర్జీ వచ్చే దగ్గు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. నివారణ ఇలా... ⇔ మన పరిసరాలను, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ⇔ పొగతాగే దురలవాటును మానేయడం ⇔ పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండటం ⇔ పడక గదులను దుమ్మూ ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, తేమ లేకుండా చూసుకోవడం. ⇔ పుస్తకాల అరలను మూసి ఉంచడం ⇔ వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే అగర్బత్తీలు, సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. వయసును బట్టీ వర్గీకరణ... ⇔ దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని ఊహిస్తారు. ⇔ పిల్లల్లో (ఇన్ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్లనేమో అని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్ టాయ్స్లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు (ఊల్), పెంపుడు జంతువుల మృదువైన వెంట్రుకలు దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ⇔ పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే సాధారణ పరిభాషలో ‘కోరింత దగ్గు’ అంటారు. ఇదేగాక మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లా దగ్గురావచ్చు. ⇔ పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని సైనోసిస్ అంటారు. ఈ లక్షణం కనిపిస్తే దాన్ని తప్పక గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స చేయాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీకి సంబంధించిన ప్రధాన వ్యాధి ఆస్తమాకు ప్రధాన లక్షణమైన పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదట కనిపించే లక్షణం దగ్గే. దగ్గు వస్తూ ఉంటే ఏం చేయాలి? ⇔ రోగి ఆరోగ్య చరిత్ర (హిస్టరీ)ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. రోగికి ఆ లక్షణం ఎందుకు కనిపిస్తుందో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. ⇔ అది తడి దగ్గో, పొడి దగ్గో చూసి అందుకు కారణాలను అనుమానించాలి. జ్వరం కూడా ఉందా అన్న అంశాన్ని పరిశీలించాలి. ⇔ ఎక్స్-రే సహాయంతో ఊపిరితిత్తులు రెండూ స్పష్టం (క్లియర్)గా ఉన్నాయా లేదా చూడాలి. (టీబీ, నిమోనియా, క్యాన్సర్లు వంటి వ్యాధులను దాదాపు 99 శాతం ఎక్స్-రేతో తెలుసుకోవచ్చు). సీటీ స్కాన్ (ఛాతి) కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతుంది. ఒకవేళ దగ్గు - బాక్టీరియా (టీబీ) వల్ల అయితే అందుకోసం కళ్లె పరీక్ష చేసి నిర్ధారణ చేయవచ్చు. దగ్గు వచ్చే రోగులకు రొటీన్గా చేసే రక్తపరీక్ష, షుగర్, ఈసీజీ, టూ డీ ఎకో పరీక్షలు కూడా చేస్తారు. పీఎఫ్టీ, తెమడ పరీక్ష వంటివి కూడా చేస్తారు. పెద్దల్లో కనిపించే దగ్గు.. ⇔ అలర్జీతో : పెద్దల్లో కనిపించే తగ్గు ప్రధానంగా అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ⇔ పొగతాగడం వల్ల : స్మోకర్స్లో పొగాకు వినియోగం వల్ల అనేక రసాయనాలు ఊపిరితిత్తులోకి వెళ్తాయి. దీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగు తెమడ కూడా పడుతుంది. ⇔ ఇన్ఫెక్షన్లతో : పెద్దల్లో కనిపించే దగ్గు ప్రధానంగా టీబీ వల్ల రావచ్చు. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మందిలో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా కారణాలతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి కనిపిస్తుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు కనిపిస్తుంటుంది. కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బరువు, ఆకలి తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు తప్పక టీబీ వ్యాధిని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి ఇంకేదైనా ఇతర ఇన్ఫెక్షన్ కారణమయ్యిందా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఇతరత్రా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. పెద్దల్లో కంటే పిల్లల్లో ఎందుకు ఎక్కువ...? పెద్దల్లో కంటే పిల్లల్లో దగ్గు ఎక్కువగా కనిపించడం సహజమే. పెద్దల్లోలా పిల్లలు తమలో ఉత్పత్తి అయ్యే తెమడను బయటకు లాగివేయలేరు. అందుకే అది వాళ్ల కడుపులోకి వెళ్తుంది. దాంతో వాంతి అయి అది బయటకు వచ్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది పిల్లలకు వాంతులు అవుతున్నాయేమో అని అనుమానిస్తారు. కాని వాళ్ల ఊపిరితిత్తుల్లో ఊరే స్రావాలే దీనికి కారణం. ⇔ నిమోనియా : దీంతో వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. జ్వరం ఉంటుంది. కొందరిలో ఆయాసం కూడా రావచ్చు. ⇔ కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే ఏసీ ఇన్హిబిటార్స్ అనే మందులు (ఉదాహరణకు కార్డేజ్, ఇనామ్, ఇనేస్ వంటివి) వాడుతుంటే కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందుల వాడకాన్ని ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఔషధాలు వాడాల్సి ఉంటుంది. ⇔ గుండె జబ్బులు : హార్ట్ ఫెయిల్యూర్, పడుకుంటే దగ్గు రావడం, ఆయాసం, గుండెదడ, చాతీనొప్పి వంటివి కూడా కనిపించవచ్చు. తెమడ రంగును బట్టి... తడి దగ్గులో వచ్చే తెమడ (కళ్లె) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. తెమడ రంగు... ⇔ ఎర్రగా ఉంటే... ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎర్రరంగు కళ్లె పడవచ్చు. అయితే ఇలా ఎర్రరంగు పడ్డప్పుడల్లా అది క్యాన్సర్కు సూచన అని అందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా కనిపించేవాళ్లలోనూ క్యాన్సర్ ఉండేవారి శాతం చాలా తక్కువ. ⇔ నల్లగా ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. ఫ్యాక్టరీలకు, గనులకు దగ్గరగా ఉండేవారిలో నల్లరంగు కళ్లె కనిపించవచ్చు. చికిత్స: ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు తగ్గడానికి చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక ఉపశమనంగా దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. ఒకవేళ సమస్య ముదిరితే అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే దగ్గు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. హెల్త్ క్విజ్ 1 మూత్రపిండాల్లోని రాళ్లను, ఇలా రాళ్లు ఏర్పడే ప్రక్రియను వైద్య పరిభాషలో ఏమంటారు? 2. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చికిత్స ఎలా చేస్తారు? 3. పైవిధంగా చేసే చికిత్స ప్రక్రియ పేరు ఏమిటి? 4. రాయిని బ్లాస్ట్ చేసినప్పుడు మూత్రనాళంలో స్టెంట్ ఎందుకు వేస్తారు? 5. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా చూసుకోడానికి చేయాల్సిన అత్యంత ప్రధానమైన నివారణ చర్య ఏమిటి? జవాబులు : 1. రీనల్ క్యాల్క్యులీ అనీ, నెఫ్రోలిథియాసిస్ అనీ అంటారు. 2. లేజర్, అల్ట్రాసోనిక్ ప్రక్రియ ద్వారా రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయిపోయేలా చేస్తారు. 3. నాన్ ఇన్వేజివ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్డబ్ల్యుల్) 4. మూత్ర విసర్జన ప్రక్రియలో ఈ రాతి పలుకులు- మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం గోడలకు ఒరుసుకుపోకుండా నివారించాలి కాబట్టి స్టెంట్ను వేస్తారు. 5. నీళ్లు ఎక్కువగా తాగాలి. -
అలర్జీ పూర్తిగా తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?- సత్యనారాయణ, ఆదిలాబాద్ అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. వాటికి వాడే కొన్ని మందులివి... యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్ : ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్ : మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్ : ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్సాల్ : వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందుల్ని రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ గాల్బ్లాడర్లో రాళ్ళు... పరిష్కారం చెప్పండి! గ్యాస్ట్రో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు కొన్నాళ్ల నుంచి కడుపు మధ్యభాగం నుంచి పైభాగం వరకు అంటు గుండెలో మంటగా ఉంటోంది. కడుపులో ఉబ్బరంగానూ, గ్యాస్ నిండినట్లుగానూ, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఇంటి దగ్గర ఒక జనరల్ ఫిజీషియన్ను కలిసి మందులు వాడాను. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అప్పుడప్పుడు వాంతులు కూడా అయ్యాయి. మళ్లీ డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు నిర్వహించి, గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కిడ్నీలో రాళ్ల గురించి విన్నాను. కానీ ఈ గాల్బ్లాడర్ రాళ్లేంటి? అవి ప్రమాదకరమా? మందులు వాడితే సరిపోతుందా? శాశ్వత పరిష్కారం కోసం నేను ఎవరిని సంప్రదించిలో దయచేసి సలహా ఇవ్వండి. - చంద్రశేఖర్, విజయవాడ గాల్బ్లాడర్ అంటే పిత్తాశయం అని అర్థం. ఇది మన కాలేయం (లివర్)తో పాటుగా ఉండే ముఖ్యమైన అవయవం. మనం తినే ఆహారం ద్వారా లివర్ ఉత్పత్తి చేసే పైత్యరసాన్ని స్టోర్ చేస్తూ చిన్న పేగుకు సరఫరా చేస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే వాటిని చిన్న చిన్న పరిమాణంలో ఉండేలా విడదీస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వును గాల్బ్లాడర్ తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు అవి అలాగే పేరుకుపోయి రాళ్లలో ఏర్పడి పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్తో పాటు మనలోని జీన్స్, ఊబకాయం, మనం వాడే పెయిన్కిల్లర్స్ లేదా మహిళలు పెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ వల్ల కూడా ఈ సమస్యకు కొన్ని ప్రధాన కారణాలు. డయాబెటిస్, ఊబకాయం, జీర్ణ సమస్యతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలో మాదిరిగా ఇవి రాళ్లు కావు. మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలు ఒక ఉండలాగా ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన పిత్తవాహికకు అడ్డు తగిలి నొప్పిని కలిగిస్తాయి. ఆ నొప్పి కలిగే వరకూ అవి మన శరీరంలో ఏర్పడిన విషయం కూడా మనకు తెలియదు. ఇక మీ విషయానికి వస్తే... ఇవి మందులతో తగ్గవు. తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అశ్రద్ధ చేస్తే గాల్బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. కాబట్టి పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసుకొని అందుకు తగ్గ చికిత్స చేస్తే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ యు.దత్తారామ్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్పేట, హైదరాబాద్ -
తుమ్ము వేగం...!
ఈ చలికాలంలో అలర్జీ వల్ల తుమ్ములు చాలా సాధారణం. తుమ్ము వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే తుంపర్లు గంటకు 160 కి.మీ. (దాదాపు గంటకు వంద మైళ్లు) వేగంతో ప్రయణిస్తాయి.ఒకసారి తుమ్మినప్పుడు ఆ క్షణ కాలంలోనే కనీసం నోటి నుంచి లక్ష జీవులు బయటకు వెలువడతాయి. అందుకే మనం లాంగ్ స్లీవ్స్ దుస్తులు ధరించి ఉంటే... తుమ్మే సమయంలో మోచేతి మడత వద్ద ఉండే ఆ లాంగ్ స్లీవ్స్ను మన నోటికి అడ్డుగా ఉండేలా జాగ్రత్త పడాలి. -
చిన్నప్పట్నుంచీ అలర్జీ.. తగ్గేదెలా?
నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? - అనిల్కుమార్, నిజామాబాద్ అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్: మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్: ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. ⇒ పైన పేర్కొన్న మందులన్నీ హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. -
డస్ట్ మైట్స్తో ఆరోగ్యం దుమ్ము దుమ్ము!
అలర్జీస్ అలర్జీలతో బాధపడుతూ దానికి కారణమైన అంశాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఆ అలర్జీని కలిగించే అంశాల్లో ఒకటైన డస్ట్మైట్ ‘పక్కలో బల్లెం’లా మన పక్కనే ఉండవచ్చు. మన తలగడలోనే నివసిస్తూ ఉండవచ్చు. మన కార్పెట్లలో ఉండవచ్చు. అవి నేరుగా నీళ్లు తాగలేవు. అయితే వాటి మనుగడ కోసం నీరు కావాలి. అందుకే తమ ముందు కాళ్ల వద్ద ఉండే ఒక రకం గ్రంథుల ద్వారా వాతావరణంలోని తేమను స్వీకరిస్తుంటాయి. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్మైట్స్ ఉండవచ్చు. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్మైట్స్ ఉంటాయి. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని అనుకుంటారు. కానీ దుమ్ములోని ఈ డస్ట్మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అందునా అవి విసర్జించే విసర్జకాల కారణంగా కూడా అలర్జీ కలుగుతుంటుంది. ఒక్కో డస్ట్మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. -
ఉంగరం తొడిగే వేలు నల్లబారుతోంది!
డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను గత పదేళ్లుగా కుడి చేతి వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తున్నాను. కానీ గత మూడు నెలల నుంచి ఉంగరం ధరించే చోట చర్మం నల్లబడుతోంది. ఆ ప్రాంతంలో కాస్త దురదగా, మంటగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రాజేశ్వరి, ఆదిలాబాద్ ఏదైనా వస్తువుతో మన చర్మం ఆనుకుంటున్నప్పుడు ఏ సమయంలోనైనా అక్కడ ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య ఎదురుకావచ్చు. బహుశా మీకు కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటుంది. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ కనిపిస్తోంది. లేదా మీ ఉంగరంలోని ఇతర లోహాలు (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా అందించవచ్చు. 1) మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. 2) మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. 3) చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. 4) మీ ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ నాలుగు జాగ్రత్తల తర్వాత కూడా మీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ను సంప్రదించండి. ఒకసారి నా చిన్నతనంలో నా చేతుల మీద (అరచేతుల వెనక భాగంపై) వేడివేడి గంజి ఒలికింది. గంజి ఒలికిన చోట చర్మం గట్టిబారి కదుములు కట్టింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. నాకు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. నా చేతుల మీద ఉన్న ఈ కదుములు కాస్మటిక్గా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏదైనా చికిత్స ద్వారా వీటిని తొలగించగలమా? - సలీమా, కర్నూలు మీరు చెప్పినట్లుగా వేడి ద్రవాలు చర్మం మీద పడినప్పుడు తీవ్రమైన గాయాలను కలగజేస్తాయి. అయితే తక్షణమే చికిత్స అందితే మీరు చెప్పిన మచ్చలు, కదుములు మిగలకుండా చికిత్స అందించవచ్చు. ఇక మీ విషయంలో ఈ కిందివిధంగా చికిత్స చేయవచ్చు. 1. మీ చర్మంపై కదుములు ఉన్న ప్రాంతంలో రోజుకు రెండుసార్లు సిలికాన్ జెల్ రాయాలి. 2. మీకు శాశ్వత పరిష్కారం కోసం ప్లాస్టిక్ సర్జన్ను సంప్రదించవచ్చు. వారు ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ నుంచే సేకరించి కదుములు ఉన్నచోట గ్రాఫ్టింగ్ చేస్తారు. 3. కదుములు ఉన్న తీవ్రతను బట్టి ఫ్రాక్షనల్ లేజర్ లాంటి లేజర్ చికిత్స కూడా చేయవచ్చు. దీనివల్ల కదుములు తొలగిపోయి, ఆ ప్రాంతంలో కొలాజెన్ వృద్ధి అవుతుంది. మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ కాళ్ల వాపులు వస్తున్నాయి... ప్రమాదమా? నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నాకు 48 ఏళ్లు. గత 12 ఏళ్లుగా షుగర్ ఉంది. ఈ మధ్య ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. రక్తం పరీక్ష చేయించగా క్రియాటినిన్ 10 మి.గ్రా., యూరియా 28 మి.గ్రా. ఉన్నది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ త్రీ ప్లస్ అని తెలిపారు. నాకు ఉన్న ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలకు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? - నిరంజన్రావు, ఖమ్మం మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు యూరిన్లో ప్రోటీన్ ఎక్కువగా పోతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మీరు మొట్టమొదట ఒక అంశాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఇది షుగర్ వల్ల వచ్చిన సమస్యా లేక ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతోందా అనేది మొదట పరీక్ష చేయించుకోండి. మీ యూరిన్లో అధికంగా రక్తం పోవడానికి షుగర్ ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. తినక ముందు 110 మి.గ్రా. లోపు, తిన్న తర్వాత 160 మి.గ్రా. లోపు ఉండేటట్లు చూసుకోవాలి. బీపీ 115 / 75 లోపల ఉండేలా చూసుకోవాలి. ఇది కాకుండా ఉప్పును బాగా తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. పెయిన్ కిల్లర్లు సొంతంగా వాడకూడదు. నా వయసు 37 ఏళ్లు. నాకు తరచూ మూత్ర విసర్జన సమయంలో మంట వస్తోంది. మాటిమాటికీ జ్వరం కూడా వస్తోంది. మందులు వాడుతున్నప్పుడు తగ్గుతోంది కానీ మందులు మానేయగానే మళ్లీ అదే పరిస్థితి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్రావు, నల్లగొండ మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉన్నట్లయితే దాని వల్ల ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే ముందుగా ఒకసారి షుగర్ పరీక్షలు చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి మూత్ర విసర్జక వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయా అని కూడా చూడాలి. ఇక యాంటీ బయాటిక్ కోర్సు పూర్తిగా వాడకపోయినా ఇన్ఫెక్షన్ పదేపదే తిరగబెట్టవచ్చు. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం రెండు, మూడు లీటర్ల నీళ్లు తాగండి. మూత్రవిసర్జన ఫీలింగ్ కలగగానే ఎక్కువసేపు వేచిచూడకుండా వెంటనే విసర్జనకు వెళ్లండి. నా వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆకలి బాగా తగ్గిపోయింది. డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. వాటిలో క్రియాటినిన్ ఎక్కువగా పోతోందని చెప్పి, డాక్టర్ స్కానింగ్ తీయించారు.అందులో కిడ్నీ సైజు బాగా తగ్గింది అని చెప్పారు. ప్రస్తుతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఐదో దశలో ఉన్నాననీ, కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కిడ్నీ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? కిడ్నీ మార్చుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? - రవికుమార్, నేలకొండపల్లి మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు కిడ్నీ మార్పిడి ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం. మీ తోడబుట్టినవాళ్లు లేదా మీ భార్య వంటి దగ్గరి సంబంధీకుల నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. కిడ్నీ మార్పిడి చేయించుకునే ముందు దాతకు అన్ని రకాల పరీక్షలు చేయించి, కిడ్నీదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి సమస్యలు లేకపోతేనే వారి నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. ఇక పేషెంట్కు దాత ఎంత దగ్గరి బంధువైతే అంత మంచిది. కిడ్నీ మార్పిడి తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాత అందుబాటులో లేకుంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, కెడావర్ దాతల కోసం రిజిష్టర్ చేయించుకోవాలి. బ్రెయిన్డెత్ అయిన సందర్భాల్లో వాళ్ల దగ్గర కిడ్నీ దొరికితే అది మీకు అమర్చుతారు. -
ఆ మందులు వాడుతున్నారా.. కాస్త జాగ్రత్త!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఆర్నెల్లుగా మెడ, చెవుల వద్ద దురద వస్తోంది. నేను రోల్డ్గోల్డ్ ఆభరణాలు ధరించడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ రాస్తున్నా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు డర్మటైటిస్ అనేది ఒక చర్మవ్యాధి. శరీరంలో పేరుకుపోయి విషపదార్థాలు దీనికి కారణాలు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. కాంటాక్ట్ డర్మటైటిస్: ఈ రకం చర్మవ్యాధిలో చర్మం గులాబీ లేదా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. రబ్బరు తొడుగులు లేదా ఆభరణాలు, నికెల్/కోబాల్ట్ వంటి లోహాల వల్ల ఈ తరహా అలర్జీ కలుగుతుంది. జుట్టురంగులు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల కూడా ఇది రావచ్చు. నుములార్ డర్మటైటిస్: ఈ తరహా చర్మవ్యాధిలో నాణెం ఆకృతిలో ఎరుపు మచ్చలు వస్తాయి. ఇవి సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. దీర్ఘకాలిక చర్మ ఇన్ఫెక్షన్ను ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపురంగులోకి మారడం, కమిలినట్లు కావడం, కొద్దిగా పొరలుగా తయారు కావడం కనిపిస్తాయి. ఎగ్జిమా బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపురంగులోకి మారి, ఆ తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. అవి క్రమంగా నీటిపొక్కులగా కూడా మారవచ్చు. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ముఖం, నెత్తి మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. దీని తీవ్రతవల్ల జుట్టు రాలవచ్చు. కారణాలు: డర్మటైటిస్కు చాలా కారణాలు ఉంటాయి. అవి... కొన్ని రకాల మందులు జుట్టుకు వాడే రంగులు జంతు చర్మాలతో తయారయ్యే వస్తువులు రోల్డ్గోల్డ్ నగలు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. చికిత్స: డర్మటైటిస్కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్, వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా తగ్గుతుంది. - డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 60. ఏడాది క్రితం బై-పాస్ ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి, రక్తం పలచగా ఉండటానికి డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయితే రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయని కొందరు మిత్రులు చెప్పారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తప్రసరణ త్వరగా ఆగదని అంటున్నారు. ఈ విషయంపై నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. జనార్దన్, చిత్తూరు గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గుండె పంపింగ్ సరిగా లేకపోతే ఆపరేషన్ కంటే ముందుగా బీటా బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ వంటి మందులతో గుండె పంపింగ్ను సరిచేయవచ్చు. రక్తాన్ని పలచబార్చే మందుల్లో ప్లేట్లెట్స్ కణాల మీద ప్రభావం చూపేవీ, రక్తం గడ్డ (క్లాట్) మీద ప్రభావం చూపేవీ రెండు రకాలు ఉంటాయి. యాంటీప్లేట్లెట్ (యాస్పిరిన్, క్లోపెడోగ్రెల్) వల్ల రక్తస్రావం అయ్యే అవకాశాలు తక్కువ. కానీ యాంటీకోయాగ్యులెంట్స్ మీద ఉంటే మాత్రం (ఎసిట్రోమ్, వార్ఫేరిన్ ఇచ్చినట్లయితే) అప్పుడు రక్తస్రావం కాకుండా, దెబ్బలేమి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మందులు వాడే వారిలో రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా కారణం వల్ల రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్ను సంప్రదించాలి. అంతేకాకుండా ‘ఐఎన్ఆర్’ను 2 నుంచి 3 మధ్యలో ఉంచుకోవాలి. నాకు ఐదు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. తక్షణం హాస్పిటల్ వెళ్లాం. అక్కడ హార్ట్ ఎటాక్ అని చెప్పి యాంజియోగ్రామ్ చేసి, స్టెంట్ అమర్చారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఇప్పుడు నేను అన్ని పనులూ చేసుకోవచ్చా? మందులు ఎన్ని రోజులు వాడవలసి ఉంటుందో వివరించండి? - శ్రీనివాసరావు, కొత్తగూడెం ఇప్పుడు మీ హార్ట్ పంపింగ్ ప్రక్రియ అంతా నార్మల్గానే ఉందని మీ లేఖలోని వివరాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి గుండెజబ్బు రాకముందు మీరు ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని ఆహారనియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మంచిది. ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ మాత్రలు తప్పనిసరిగా ఒక ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వాడాలి. అవేగాక స్టాటిన్స్ వంటి మందులు జీవితాంతం వాడాలి. కాబట్టి వాటిని మీ కార్డియాలజిస్ట్ సూచించిన మోతాదులో వాడుతుంటే ఇకపై మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొత్త జనరేషన్ స్టెంట్ల మన్నిక ఎక్కువ కాబట్టి తిరిగిపూడుకుపోతాయనే భయం లేదు. - డాక్టర్ సి. రఘు కార్డియాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్ అమీర్పేట, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. మరో 3 - 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పుడు సమస్యల్లా ఇలా వైవాహిక జీవితాన్ని వాయిదా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే విషయంలో ఏమైనా సమస్యలు వస్తాయా? నాలో అండం ఉత్పత్తి కావడం, వాటి పనితీరులో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? దయచేసి వివరంగా చెప్పండి. - సునంద, హైదరాబాద్ సంతాన సాఫల్యం విషయంలో వయసు చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల ఉత్పత్తి, వాటి నాణ్యత తగ్గుతుంటుంది. పైగా మీరు పెళ్లి చేసుకోవాలన్న సమయానికి మీ రుతుక్రమం కూడా ఆగిపోయే వయసు వస్తుంది. ఆ సమయంలో గర్భధారణ అవకాశాలు తగ్గవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 38 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు మీ అండాల సామర్థ్యాన్ని తెలుసుకోడానికి చాలా మంచి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మీ ఒవేరియన్ సమర్థతను కొన్ని రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులలో త్వరగా మెనోపాజ్ వచ్చే మెడికల్ చరిత్ర ఉంటే మీకూ రుతుస్రావం త్వరగా ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఫైబ్రాయిడ్స్, ట్యూబ్లకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డయాబెటిస్, హైబీపీ వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇవన్నీ గర్భధారణతో పాటు, గర్భస్రావాలనూ పెంచవచ్చు. పైగా పెద్ద వయసులో నెల తప్పిన వాళ్లలో పిండంలో క్రోమోజోముల సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికం అవుతుంటాయి. పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కెరియన్ ప్లానింగ్కూ, కుటుంబ జీవితానికీ సమతౌల్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా ఫెర్టిలిటీ నిపుణులతో చర్చించి, వారి నుంచి సలహాలూ, సూచనలు తీసుకోండి. మీ అండాలను భద్రపరిచేలా అవకాశాలను పరిశీలించి, వారు మీకు సరైన రీతిలో మార్గనిర్దేశనం చేస్తారు. - డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ నాకు చలికాలం రాగానే ముక్కులో దురదగా ఉండటం, తుమ్ములు చాలాసేపు రావడం, తుమ్ములు ఆగిన వెంటనే కాసేపు ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్ను కలిస్తే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. అంటే ఏమిటి? హోమియోలో దీనికి వైద్యం ఉందా? - వెంకటేశ్, నిర్మల్ చలికాలం అనగానే గుర్తుకు వచ్చేవి అలర్జీ సమస్యలు. ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ ఎక్కువగా బాధిస్తుంది. ప్రతి ఏడాదీ చలికాలం అనగానే చాలా మంది తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటారు. చల్లటినీరు, శీతల పానియాలు తాగకుండా ఉన్నప్పటికీ, ఇతర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అలర్జిక్ రైనైటిస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతారు. అలర్జిక్ రైనైటిస్ అంటే: ఇది ఒక వ్యక్తి అలర్జిక్ కారకాలకు గురైనప్పుడు ముక్కలోని శ్లేష్మపొర వాపునకు గురై ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్లలోనూ అంగిలిలో దురద, చికాకు, నిద్రలేమి, మగతగా ఉండటం, స్వల్పజ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి. కారణాలు: వాతావరణ మార్పు, ముఖ్యంగా శీతకాలం, దుమ్ము, ధూళియ ఘాటైన వాసనలు, మస్కిటో రెపెలెంట్స్, పెంపుడు జంతువులు - వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి, శీతల పానియాలు, ఐస్క్రీముల వంటివి అలర్జిక్ రైనైటిస్కు కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, ఐజీఈ యాంటీబాడీస్ పరీక్షల వంటి వాటితో వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతనూ అంచనా వేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి కూల్డ్రింక్స్, పడని వస్తువులకు, ఘాటైన వాసనలుకు దూరంగా ఉండాలి ఇంటి పరిసరాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడినుంచి దూరంగా ఉండాలి. హోమియోలో చికిత్స: హోమియోలో అలర్జిక్ రైనైటిస్ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ప్రక్రియ ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతారు. తమకు సరిపడని ఆహారాలు తీసుకున్నా, వాతావరణంలోకి వెళ్లినా తట్టుకునేలా వ్యక్తులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతారు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నా భార్య వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా వేచిచూస్తున్నా సంతానం లేదు. ఇద్దరమూ డాక్టర్ను కలిసి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాం. సంతాన సాఫల్యం కోసం వారు సూచించిన మందులు తీసుకుంటున్నాం. నా ఫ్రెండ్స్లో ఒకరికి ఐసీఎస్ఐ ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్యం పొందినట్లు తెలుసుకున్నాను. మేము గతంలో ఐవీఎఫ్ గురించి విని ఉన్నాం. కానీ ఐసీఎస్ఐ అంటే ఏమిటో తెలియదు. మేము కూడా ఐసీఎస్ఐ ప్రక్రియను అవలంబించవచ్చా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీనివాస్, ఏలూరు మీరు ఏ వైద్య పరీక్షలు చేయించుకున్నారు, వాటి ఫలితాలు ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాతే మీ ఇద్దరి పరిస్థితిని అంచనా వేసి, దానికి అనుగుణంగా, మీరు ఏ ప్రక్రియను అనుసరిస్తే మంచిదో చెప్పగలం. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనే ప్రక్రియను సంక్షిప్తంగా ‘ఐసీఎస్ఐ’ అంటారు. ఈ ప్రక్రియలో భార్యకు కొన్నాళ్ల పాటు రోజూ హార్మోన్ ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. ఆమెలోని గర్భసంచి పొర, అండాలు సైజ్ బాగా పెరిగాక వెంటనే... ఆమె నుంచి అండాలను సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీన్ని ఆమెకు సాధారణ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. ఇందుకోసం ఆమె కొన్ని గంటల పాటు హాస్పిటల్లో ఉండాలి. అండాలను సేకరించాక వాటి సంఖ్య, నాణ్యత తెలుస్తాయి. ఆ తర్వాత భర్త నుంచి వీర్య సేకరణతో పాటు దీని నాణ్యత నిర్ధారణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వీర్య కణాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా అండం కాస్తా పిండంగా మారుతుంది. ఇది జరిగిన మూడో రోజున గానీ లేదా ఐదో రోజున గానీ ఆ పిండాన్ని గర్భసంచి (యుటెరస్) లో అమరుస్తాం. సాధారణంగా వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకూ, ఐవీఎఫ్ ప్రక్రియ విఫలమవుతున్న వారికి ఐసీఎస్ఐ ప్రక్రియ ఉపయోగంగా ఉంటుంది. అండాన్ని రూపొందించాక ఇక మిగతా ప్రక్రియ ఐవీఎఫ్ లాగే ఉంటుంది. అయితే ల్యాబ్లో నిర్వహించే కొన్ని ప్రక్రియలు కాస్త వేరుగా ఉంటాయి. ఐవీఎఫ్ అనే ప్రక్రియ అండం ప్రయాణం చేసే ట్యూబ్లలో లోపాలు ఉన్నవారికి, ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి, సంతాన సాఫల్యంలో నిర్దిష్టంగా తెలియని ఇబ్బందులు ఉన్నవారికి, అండాల సంఖ్య తక్కువగా ఉన్నవారికి, ప్రీ ఇప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకున్న వారికి ఐవీఎఫ్ను సూచిస్తాం. ఇక మీ విషయంలో మీ ఇద్దరినీ ఒకసారి పరీక్షించి, మీ రిపోర్టులను చూసి, మీకు అనువైన పద్ధతేమిటో నిర్ణయించవచ్చు. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా వారి వయసు 50 ఏళ్లు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ-డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండుళ్లుగా నరకయాతన పడుతున్నారు. ‘హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్ప్లాంట్’ అంటే ఏమిటి? దయచేసి దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి. - సుధారాణి, కాకినాడ గుండెపనితీరు పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్డెడ్కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు. అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ పి.వి. నరేశ్కుమార్, సీనియర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియో థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వాటర్ ఎలర్జీ...
మెడి క్షనరీ ఈ జబ్బు ఉన్నవాళ్లు నీళ్లు అంటేనే అలర్జీ. వీళ్ల ఒంటిమీద నీళ్లు పడితే అవి చర్మంపై దద్దుర్లు పుట్టిస్తాయి. అవి దురదను కలిగిస్తాయి. చాలా అరుదుగా కనిపించే ఈ జబ్బు పేరే ‘వాటర్ అలర్జీ’! వైద్యపరిభాషలో దీన్ని ‘అక్వాజెనిక్ అర్టికేరియా’ అంటారు. మొదట నీళ్లలోని క్లోరిన్ లేదా ఫ్లోరిన్ వంటి రసాయనాల వల్ల ఇలా చర్మంపై అలర్జీ వస్తుందేమోనని అనుమానిస్తారు. కానీ స్విమ్మింగ్పూల్లో దిగడం వంటి పనుల తర్వాత ఒంటి మీద రాష్ రావడం వంటి చర్యల వల్ల అది నీళ్ల వల్లనే అని నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతానికి వ్యాధికి అంతగా మందులు అందుబాటులో లేవు. -
గుట్కా తింటే... మౌత్ క్యాన్సర్..?
హోమియో కౌన్సెలింగ్ వర్షాకాలం వచ్చిందంటే చాలు... మా ఇంటిల్లిపాదికీ బయటికెళ్లాలంటే భయమే. తుమ్ములూ దగ్గులే కాదు, ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో అయినా మా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటారా? - కె. లక్ష్మి, అమరావతి వర్షాకాలం వచ్చిందంటే అతిసార, ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం, మలేరియాలు వ్యాపించడం సర్వసాధారణం. కారణం... బ్యాక్టీరియా, ఇంటికీటకాలు, ఫంగస్ల వంటివి వర్షాకాలంలో విజృంభించేస్తాయి గనక. కొన్ని జాగ్రత్తలతోపాటు అవసరమైనప్పుడు వైద్యచికిత్సలు కూడా తీసుకుంటే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలర్జిక్ రైనటిస్: వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు, ముక్కు దురదగా ఉండటం వంటివి ఇందులో కనిపిస్తాయి. సాధారణ జలుబు కాదని తేలిపోతే అది అలర్జీ సమస్యేననే నిర్ధారణకు రావచ్చు. గాలిలో ఉండే కొన్నిరకాల పదార్థాల కారణంగా ముక్కులోపలి కణజాలంలో వాపు రావడం ఇందులోని సమస్య. పొగ, దుమ్ము, కాలుష్యాలు, గాలిలో ఉండే ఉన్ని వంటివి మరికొన్ని అంశాలు. జాగ్రత్తలు: అలర్జిక్ రైనైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో సెన్సిటివిటీని తగ్గించుకునేలా శిక్షణ పొందాలి. చాలాకాలంగా వాడకంలో లేని ఉన్నిదుస్తుల వంటి వాటిని ధరించడానికి ముందు తప్పనిసరిగా ఉతికి మంచి ఎండలో ఆరేయాలి. చలివాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్డ్రింక్స్, చల్లటివస్తువులు తీసుకోకూడదు. అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి ఉంటే తగ్గించుకోవాలి. హోమియో చికిత్స: అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా వ్యాధి నివారణ అయేలా చేయొచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. ఆస్తమా: ఇది ఊపిరితిత్తుల్లో వాయునాళాల్లో వచ్చే దీర్ఘకాలిక సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జన్ల వల్ల వస్తుంది. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలే ఎక్కువ అయినప్పటికీ వర్షాకాలంలో వచ్చే ఆస్తమా ఒకరకమైన అలర్జిక్ ఆస్తమా. పుప్పొడి, జంతువుల వెంట్రుకలు, డస్ట్మైట్స్ వంటి వాటి వల్ల కూడా వస్తుంది. ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో ఆర్సెనిక్ ఆల్బ్, ఇపికాక్, నైనట్రమ్ సల్ఫ్, కాలికార్బ్, కాల్కేరియా కార్బ్ వంటి మందులు వాడటం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయొచ్చు. ఈ మందుల వాడకం వల్ల ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు కూడా. క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను పదిహేనేళ్లుగా గుట్కా తింటున్నాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. ఒక నెలరోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి. - జి.ఆర్.ఆర్., హైదరాబాద్ గుట్కాలు/పొగాకు నమిలేవారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్ను ప్రేరేపిస్తాయి. అంటే చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలోని ఏ భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందో రాయలేదు. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే అది క్యాన్సర్ కాస్త ముదిరిన దశను సూచిస్తోంది. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరుతెరవడం కష్టమవుతుంది. దాంతో క్యాన్సర్ కూడా కొంచెం ముదిరినట్లు అర్థం. వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ-కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా నమలడం మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. సుమారు ఎనిమిది నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్నే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పండి. - బాలకృష్ణ, ఖమ్మం మీరు రాసిన లక్షణాలు బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. నా వయసు 36 ఏళ్లు. గత ఏడాది కాలంగా తరచూ కడుపునొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే ఎండోస్కోపీ చేయించి, గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆయన రాసిన మందులను క్రమం తప్పకుండా వాడాను. ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? దీని నివారణ మార్గం చెప్పగలరు. - గిరిప్రసాద్, కాకినాడ గ్యాస్ట్రైటిస్ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రోజూ ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం, తరచూ పెయిన్కిల్లర్స్ వాడటం, సమయానికి భోజనం చేయడకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య ఎక్కవగా వస్తుంటుంది. మీకు మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. పెయిన్కిల్లర్స్ వాడుతుంటే డాక్టర్ను సంప్రదించాకే, వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోండి. వ్యాధి లక్షణాలు బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరోసారి మీ డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పండి. -
జుట్టుపై పట్టు!
మనమేమీ పెద్దగా ప్రయాస పడకుండా, శ్రమపడకుండా, ఖర్చు పెట్టకుండా పెద్ద దాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉపయోగించే నానుడి ‘కొండకు వెంట్రుకను కట్టాం. వస్తే కొండ... పోతే వెంట్రుక’. ఈ మాట బట్టతల ఉన్నవారు రాసి ఉండరని మా సందేహం. అసలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయాలే కావు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. అలాంటి జుట్టుకు హాని చేసే అంశాలు, వాటి నుంచి కురులను కాపాడుకునే పద్ధతులివి... విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగ వంటి కాలుష్యాలతో పాటు గాలిలో చెల్లా చెదురై ఉండే ధూళి కణాలు (సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్)... ఇవన్నీ తొలుత చర్మానికి హాని చేస్తున్నాయి. దాంతో చర్మంపై నాటుకుని ఉండే వెంట్రుకలూ వీటి ప్రభావానికి గురవుతున్నాయి. ఈ కాలుష్యాలు మేనిచర్మాన్ని అలర్జీకి గురిచేస్తాయి. ఆ అలర్జీలు వెంట్రుకలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. మన చర్మంపై నిత్యం తేమ ఉంటుంది. కానీ కాలుష్యాల వల్ల ఆ తేమ కాస్తా పొడిబారిపోయి చర్మం ఎండిపోయినట్లుగా, పగుళ్లుబారినట్లుగా (స్కేలీ)గా అవుతుంది. ఒక్కోసారి కాలుష్యాల ప్రభావం తీవ్రంగా ఉంటే చర్మం ఎర్రబారడం, దురదలు రావడం కూడా ఉంటుంది. ఈ కాలుష్య ప్రభావానికి చర్మం ఎంతగా గురవుతుందో, వెంట్రుకలూ అంతే గురవుతాయి. వెంట్రుకలు రాలిపోవడం అన్నది కాలుష్యం వల్ల జరిగే చాలా సాధారణ ప్రక్రియ. అందుకే ఇలా వెంట్రుకలు రాలిపోవడం అన్నది నగరీకరణ, పారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్నచోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుండటం మన అనుభవంలోకి వచ్చే విషయమే. కాలుష్యం వల్ల వెంట్రుక బలహీనపడుతుంది. ఫలితంగా అది తేలిగ్గా తెగిపోతుంది. వెంట్రుకకు సహజంగా ఉండే మెరుపు తగ్గుతుంది. ఇక దీనికి ఈ వేసవి లాంటి సీజన్లలో వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా తోడైతే శరీరానికి అవసరమైన పోషకాలు అందడం తగ్గి ఆ ప్రభావం వెంట్రుక మీద కూడా పడుతుంది. పైగా ఈ వేసవికాలంలో శరీరంలోని లవణాలు, పోషకాలు చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతుంటాయి. దాంతో వెంట్రుకలకు అందాల్సిన పోషకాలు, ఖనిజలవణాలు వంటివి వెంట్రుకలకు అందడం తగ్గిపోతుంది. పోషకాలు అందకపోవడంతో కురుల మెరుపు, నిగారింపు తగ్గిపోతాయి. దాంతో జుట్టు చింపిరిగా మారుతుంది. తేలిగ్గా విరిగి (తెగి-ఫ్రాజైల్)పోయేలా వెంట్రుక నిర్మాణంలో మార్పులు వస్తాయి. కాలుష్యాల వల్ల చుండ్రు పెరిగే అవకాశాలతో... దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన కొన్ని దుష్పరిణామాలు రావచ్చు. ఫలితంగా చుండ్రు వంటివి పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే కాలుష్యంతో చర్మంపై అలర్జీ పెరిగి, మాడుపైనున్న చర్మం పొట్టుగా (పొలుసులుగా) రాలే సమయంలో గోళ్లతో గీరినప్పుడు అది గోళ్లలో నల్లగా కనిపిస్తుంటుంది. వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటివి జరుగుతాయి. మహిళల్లో గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు. శారీరక ఒత్తిడితోనూ: నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటివ అంశాలు జుట్టు రాలిపోయేలా చేస్తాయి. దీన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. జుట్టును రాల్చే కొన్ని రకాల మందులు రకరకాల రుగ్మతలకు మందులు వాడే మందులు కొందరిలో జుట్టు రాల్చడం మామూలే. ఉదా: మొటిమల మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ యాంటీ డిప్రెసెంట్స్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు కీమోథెరపీ మందులు. మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ఇంటర్ఫెరాన్స్, వేగంగా మారిపోయే మూడ్స్ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు, స్టెరాయిడ్స్, థైరాయిడ్ మందులు... ఇవన్నీ జుట్టుపై ప్రభావం చూపేవే. ఇలా రాలే జుట్టును అరికట్టడం ఎలాగంటే... సాధారణంగా మందులు వాడటం మానేయగానే జుట్టు మళ్లీ రావచ్చు. జుట్టు రాలడం విపరీతంగా ఉంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం ద్వారా కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. డాక్టర్ మేఘనారెడ్డి కె. డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్ వెంట్రుకలను కాపాడుకునే సాధారణ పద్ధతులు... కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్జ్ వంటివి తొడుక్కోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆకుపచ్చని కూరలు, తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి. క్రమం తప్పకుండా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే జుట్టును మరీ ఎక్కువగా కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి. అలర్జెన్స్ నేరుగా వెంట్రుకలకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం చేయాలి. చుండ్రు సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి. మీరు రంగు వేసుకునేవారైతే అది మీకు సరిపడుతోందా లేదా అన్నది ముందుగానే పరిశీలించుకోవాలి. -
ఆక్వా ఎగుమతులపైయాంటీ బయోటిక్స్ దెబ్బ!
యాంటీ బయోటిక్స్ అంటే.. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల జీవన ప్రక్రియలో భాగంగా తయారయ్యే రసాయనిక పదార్థాలే యాంటీ బయోటిక్స్. ఈ రసాయానాలు మిగిలిన సూక్ష్మ జీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. యాంటీ బయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్న వారికి అలర్జీ, విష లక్షణాలు కనిపిస్తాయి. ఆహార నాళంలోని సూక్ష్మజీవుల్లో మార్పులు వచ్చి యాంటీ బయోటిక్స్ నిరోధక శక్తి కలిగిన కొత్త సూక్ష్మ జీవుల జాతులుగా మారే ప్రమాదం ఉంది. మనం తీసుకునే సముద్ర ఆహార ఉత్పత్తుల కణజాలంలో క్లోరాం ఫెనికాల్ అవశేషాలు ఎముక మూలుగ(బోన్మారో)కు హాని చేస్తాయి. రక్త హీనత కూడా ఏర్పడుతుంది. నైట్రో ఫ్యూరాన్ అవశేషాలు కేన్సర్కు దారితీస్తాయని పశోధనల్లో తేలింది. ఈ కారణాల నేపథ్యంలో సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు జల జీవుల పెంపకంలో యాంటీ బయోటిక్స్ను నిషేధించాయి. సురక్షితమైన రొయ్యల సాగుకు జాగ్రత్తలు యాంటీ బయోటిక్స్ అవశేషాలు కలిగిన రొయ్యల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, మందుల తయారీ సంస్థలు ఆక్వా పెంపక రంగంతో అనుబంధం ఉన్న వారు యాంటీ బయోటిక్స్ను నిబద్ధతతో వాడాలి. హేచరీల్లో రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ అన్ని జాతుల పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించి వాటిని పూర్తిగా నిర్మూలిస్తాయి. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల యాంటీ బయోటిక్స్ని తరచుగా వాడే సందర్భాల్లో వ్యాధికారక జీవుల జన్యువులు బయోటిక్స్ను నిరోధించే శక్తిని సంతరించుకుని తర్వాత సంతతులకు అందజేస్తాయి. ఈ ప్రక్రియలో ఏర్పడే కొత్త రకాల సూక్ష్మ జీవులను యాంటీ బయోటిక్స్ వాడినా నిర్మూలించలేం. చెరువుల్లో ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా యాంటీ బయోటిక్స్ వాడే అవసరం ఉండదు. ఆక్వా రైతులు ఇవి అనుసరిస్తే మేలు.. చెరువుల్లో రోగ నిరోధానికి, రోగ నిర్మూలనకు ఆహారంతో పాటు అందజేసే యాంటీ బయోటిక్స్ రొయ్యల శరీరంలో నిల్వ ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల యంటీబయోటిక్స వాడకంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను రైతులు తప్పనిసరిగా పాటించాలి. యాంటీ బయోటిక్స్ వాడిన చెరువుల్లో రొయ్యలను ఆహారంగా తీసుకునే వారికి కలిగే హానిని గుర్తించాలి. యాంటీ బయోటిక్స్ వాడకంలో నిర్ధేశించిన గరిష్ట పరిమితులు, విత్డ్రా సమయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. హేచరీ/రొయ్యల పెంపకంలో వాడే మందులో యాంటీ బయాటిక్స్ లేవనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. రైతులు వాడే మందులను అసలైన ప్యాకింగ్లోనే లేబుల్స్తో సహా ఉంచాలి. సాంకేతిక సలహాదారు ద్వారా చెరువుల్లో ఉపయోగించే మందుల ఉపయోగాలను తెలుసుకోవాలి. హేచరీల్లో/ఫారంలో వాడే మందుల వివరాలు, ఉపయోగించిన కారణాన్ని సాంకేతిక సలహాదారుతో నమోదు చేయించాలి. హేచరీ నుంచి తెచ్చిన పిల్లలను, వాటి పెంపకంలో వాడే ఆహారాన్ని తరచూ పరీక్ష చేయించి యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. పశువైద్యంలో వాడే మందులు విదేశాల నుంచి తెప్పించినప్పుడు అవి ఆక్వా కల్చర్లో వాడటానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తె లుసుకోవాలి. అవి ఏ దేశం నుంచి దిగమతి చేశారో గుర్తించి శానిటరీ సర్టిఫికెట్ తప్పనిసరిగా గమనించాలి. యాంటీ బయోటిక్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై తోటి రైతులకు కూడా అవగాహన కలిగించి వాడకాన్ని నియంత్రించాలి. రొయ్యల పెంపకం సమయంలో ఆక్వా కల్చర్ గ్రేడ్ మందులు, అనుమతించిన మందులును మాత్రమే పంపిణీ చేయాలని సదరు సంస్థలను రైతులు అడగాలి. యాంటీ బయోటిక్స్ వాడకం ఆపేసిన తర్వాత చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత 22 సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు 15 రోజులు, ఇంకా ఎక్కువగా ఉంటే 20 నుంచి 25 రోజుల తర్వాత పట్టుకోవాలి. శాస్త్రీయ సాంకేతిక సలహాల కోసం మత్స్యశాఖ అధికారులను తరచూ కలిసి వారి ఆదేశాలను పాటించాలి. - చినగంజాం -
శ్వాసకోశ ఎలర్జీ సమస్యలకు హోమియో చికిత్స
శీతాకాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఎలర్జీ సమస్యలు. మన పరిసరాలలో లేదా మన ఇంట్లోనే ఇలాంటి ఎలర్జీలతో బాధపడేవారిని చూస్తూ ఉంటాం. శీతాకాలంలో వీరు చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల పిల్లలు స్కూల్కి వెళ్లకుండా, పెద్దవారైతే ఆఫీస్లకి వెళ్లలేక, దినచర్య లో ఇబ్బందులు ఎదుక్కొంటారు. ప్రతీ సంవత్సరం శీతాకాలం వస్తుంది అనగానే చాలామంది వారివారి ఆహారపు అలవాట్లను, జీవన విధానాలను మార్చుకుంటారు. చల్లని నీరు, శీతల పానీయాలు సేవించకుండా, ఇతరేతర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలర్జీ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురవుతారు. ‘ఎలర్జీ’ అంటే ఏంటి? మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యొక్క అసందర్భ ప్రతిచర్యను ‘ఎలర్జీ’ అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థానికి శరీరం సాధారణ స్థితి కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిక్రియను చూపడం. ఆ పదార్థాలను ‘ఎలర్జెంట్’ అని, ప్రతిచర్యను ‘ఎలర్జిక్ రియాక్షన్’ అని అంటారు. సర్వసాధారణంగా మనం చూసే శ్వాసకోశ ఎలర్జీలు ఎలర్జిక్ రైనైటిస్: ఎలర్జిక్ రైనైటిస్ అనగా ఒక వ్యక్తి, పైన తెలిపిన ఎలర్జిక్ కారకాలకు గురైనప్పుడు ముక్కులోని శ్లేష్మ పొర వాపునకు గురై ముక్కు నుండి నీరులాంటి ద్రవం కారటం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, కళ్లల్లో, అంగిలిలో దురద, చికాకు, నిద్రలేమి, మగతగా ఉండటం, స్వల్ప జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎలర్జిక్ సైనసైటిస్: సైనస్ అంటే ప్రతిమనిషి ముఖంలో కళ్ల కింద, ముక్కు పక్కల ఎముకలలో ఉండే సన్నని గాలి నిండిన ప్రాంతాలు. ఇవి మనం స్పష్టంగా మాట్లాడటానికి ఉపకరిస్తాయి. సైనస్లోని శ్లేష్మ పొర వాపునకు గురికావడాన్ని సైనసైటిస్ అంటాం. దీర్ఘకాలికంగా ఎలర్జిక్ రైనైటిస్తో బాధపడేవారు ఎలర్జిక్ సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా తలనొప్పి, చిరాకు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం, జ్వరం రావటం, చెవినొప్పి, ముఖం స్వల్పంగా వాపునకు గురై నొప్పి కలుగుతుంది. పోస్ట్ నాజల్ డ్రిప్. ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా: శరీరతత్వానికి సరిపడని ఎలర్జిన్లు గాలి ద్వారా శరీరంలోని శ్వాసనాళాలలోకి చేరినప్పుడు ప్రతిచర్యగా మన రోగనిరోధకశక్తి స్పందించి వివిధరకాల రసాయనాలు విడుదల చేసి శ్వాసనాళాలలోని శ్లేష్మపొర వాపునకు గురి అవుతాయి. దీనివల్ల శ్వాసనాళాలు సంకోచానికి గురై గాలి రవాణాకు ఆటంకం కలిగి... దగ్గు, ఆయాసం, ఛాతి బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, పిల్లికూతలు మొదలగు లక్షణాలు చూస్తాం. ఈ ఎలర్జిక్ ఆస్తమా వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇది ముఖ్యంగా పిల్లల్లో సర్వసాధారణంగా చూస్తాం. పైన తెలిపిన ఎలర్జిక్ కారకాల వల్ల ఆస్తమా వ్యాధి తీవ్రతరం కావచ్చు. కాబట్టి ఈ ఎలర్జిక్ కారకాలకు దూరంగా ఉండడం వల్ల దీనిని అదుపులో ఉంచవచ్చును. వ్యాధి నిర్థారణ పరీక్షలు: =సి.బి.పి, ఇ.ఎస్.ఆర్. =అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ (ఎ.ఇ.సి) =ఐజి. ఇ. యాంటిబాడీస్ ఎక్స్రే - పి.ఎన్.ఎస్. =సి.టి.స్కాన్ - పి.ఎన్.ఎస్. ఎక్స్రే - చెస్ట్ = స్పిరోమెట్రీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మొదలగు వ్యాధి నిర్థారణ పరీక్షల ద్వారా వ్యాధి త్రీవతను, ఇతర వ్యాధులను నిర్థారణ చేయవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: =దుమ్ము, ధూళి నుండి దూరంగా ఉండాలి = శీతలపానీయాలు, ఐస్క్రీమ్లు తినకూడదు = పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి = ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థినియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి. హోమియో చికిత్స మానవుడు ప్రకృతిని పరిశీలించి అనుకరించడం వల్ల వివిధరకాల విజ్ఞానశాస్త్రాలను కనుగొన్నాడు. అందులో హోమియోపతి కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రకృతి నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది (సిమిలియా - సిమిలిబస్ కురాంటర్). హోమియో వైద్యవిధానం ద్వారా అన్నిరకాల ఎలర్జిక్ సమస్యలను పూర్తిగా నయం చేయవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ఎలర్జీలకు సంబంధించిన వ్యాధినైనా అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ ద్వారా, అసమతుల్యతలకు గురైనటువంటి రోగనిరోధకశక్తిని సరిచేస్తారు. వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా తగ్గించడమే కాకుండా, పైన తెలిపిన ఎలర్జిక్ పదార్థాలకు సమర్థవంతంగా తట్టుకునేలా ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేసి అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. ఎలర్జీ కారకాలు =వాతావరణ మార్పు... ముఖ్యంగా శీతాకాలం =దుమ్ము, ధూళి = ఘాటైన వాసనలు, మస్కిటో రిపెలెంట్స్, వివిధ రకాలైన స్ప్రేలు = పెంపుడుజంతువులు, వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుండి వచ్చే పుప్పొడి రేణువులు (పార్థినియం హిస్టిరోఫోనికా) =శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్ = చాలామందిలో ఈ ఎలర్జీలు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. -
విమ్స్లో మందుల కొరత
బళ్లారి (తోరణగల్లు), న్యూస్లైన్ : వ్యాధి సోకి నీరసించి చికిత్స కోసం విమ్స్ ఆసుపత్రికి వస్తే సెలైన్ ఎక్కించడానికి నార్మల్ సెలైన్ (ఎన్ఎస్) బాటి ళ్లు లేవు. అమిత్రో మైసిన్, సిఫిక్సిమ్ కేప్సుల్స్, ఆంపిసిలిన్, టెట్రాసైక్లిన్ ఇంజక్షన్లు అసలే లేవు. కిడ్నీ సమస్యల నివారణకు వాడే ప్రూస్ మైడ్, అలర్జీకి వాడే లివోసిట్రజిన్ మాత్రలు మచ్చుకైనా కనిపించవు. ఇదీ పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి గాంచిన విమ్స్లోని పరిస్థితి. కర్ణాటక, సరిహద్దులోని రెండు జిల్లాల వాసులకు ఆరోగ్యప్రదాయినిగా ఖ్యాతికెక్కిన విమ్స్ ఆసుపత్రిలో మాత్రలు,సెలైన్ బాటిల్స్ కొరత వుండటంతో రోగులకు అవసరమైన మందులు, మాత్రలు,సెలైన్ బాటిల్స్ కోసం వైద్యులు ఆసుపత్రి బయట ఉన్న మందుల షాపులకు రాస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స దొరుకుతుందనే నమ్మకంతో విమ్స్కు వచ్చే నిరుపేద రోగులు మందులు, మాత్రలు, సెలైన్ కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తెచ్చుకొన్న డబ్బు కాస్త మందులు, మాత్రలకే అయిపోవడంతో మళ్లీ డబ్బు కోసం ఊరెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసుపత్రిలో మందుల కొరతపై విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులును న్యూస్లైన్ వివరణ కోరగా మందులు, మాత్రలు, సెలైన్ బాటిళ్ల సరఫరాకు సంబంధిత కంపెనీలకు ఆర్డర్ పెట్టామని, కంపెనీల సరఫరా జాప్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రోజుల క్రితం వరకు సిరంజ్లు కూడా కొరత ఉండేది. అయితే కంపెనీలపై ఒత్తిడి చేసి సిరంజ్లు, నీడిల్స్ తె ప్పించామన్నారు. మందుల సరఫరాకు కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంది. పాత టెండర్లనే కొనసాగిస్తుండటం వల్ల సరఫరా ఆలస్యమవుతోందన్నారు. సమస్య తీర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఈ నెలంతా చలే...
‘మాది’ ఎఫెక్ట్ .. = గణనీయంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు = రాత్రంతా చలి.. పగలంతా ఎండ = ప్రబలనున్న జలుబు, చర్మ వ్యాధులు = అలర్జీ, ఉబ్బసం వారికి ‘పొగమంచు’ గండం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో చలి పంజా విసిరింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాత్రి నుంచి తెల్లారి వరకు ఎముకలు కొరికే చలి, తర్వాత సాయంత్రం వరకు భగ భగ మండే ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెల్లారే సరికి పరుపులు, దిండ్లు దాదాపుగా నీటిలో తడిసినట్లు చల్లబడి పోతున్నాయి. స్వెటర్లు, మంకీ క్యాప్లు, జెర్కిన్లతో చలి పులి నుంచి కాచుకోవడానికి పౌరులు తలమునకలుగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల జలుబు, చర్మ రోగాలు అధికమవుతున్నాయి. ఉబ్బసంతో బాధ పడుతున్న వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా చలి కాలంలో ఉదయం పూట బాగా మంచు పడే అవకాశం ఉన్నందున, అలర్జీ, ఉబ్బసంలతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. చలి కాలంలో తలుపులు, కిటికీలను మూసి వేసి ఉన్నందు వల్ల శుభ్రమైన గాలి కొరతతో ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి విరుగుడుగా అప్పుడప్పుడు తలుపులు లేదా కిటికీలను తెరుస్తూ, మూస్తూ ఉండాలని సూచిస్తున్నారు. మరో వైపు బెంగాల్కు నైరుతిగా ఏర్పడిన ‘మాది’ తుఫాను కారణంగా చలి విపరీతమైంది. దీని ప్రభావం వల్ల పగటి ఉష్ణోగ్రత లు ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువై, రాత్రి ఉష్ణోగ్రతలు అదే విధంగా తగ్గుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశ మం మేఘావృత్తమై చలి గాలులు వీచాయి. ఇదం తా ‘మాది’ ప్రభావమేనని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది. -
దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. ***************** దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము. శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణాలు: వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్తో ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం పొగతాగటం దుమ్ము, ధూళిలో తిరగడం వలన ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ***************** కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు. ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. ************** పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
సైనసైటిస్కు ఆపరేషన్ లేకుండా... అలర్జీ, ఆస్తమాలకు హోమియో చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలోకి ఎలాంటి బయటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘ఇమ్యూనిటీ’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థాలు; బాక్టీరియా, వైరస్ ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంతమందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘హైపర్ సెన్సిటివిటీ’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి జలుబు చేసి. పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్లె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని; గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని; ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్లు మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాల్లో చర్మంపై పొక్కులు వస్తాయి. దీనిని ‘‘అలర్జిక్ డెర్మటైటస్’’ అని అంటారు. అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువమందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు, అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్ మరియు బ్రాంక్రియల్ ఆస్థ్మా, శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి - పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, ఫెర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. అలర్జీతో బాధపడేవారిలో ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు శరీరంలో, రక్తంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్-ఇ (ఐజ్ఛ) అనే యాంటీబాడీతో అలర్జీన్ కలవడం వలన హిస్టమిన్ విడుదలవుతుంది. దీని వలనే ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా వాడే యాంటీ-హిస్టమిన్ మందుల వలన వ్యాధి లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు కానీ శరీరంలోని ‘‘ఏటీపీ’’ తత్వాన్ని, వ్యాధి నిరోధక వ్యవస్థలోని సున్నితత్వాన్ని అవి తొలగించలేవు. కాబట్టి సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి సూచించే హోమియోపతి మందు వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఎంత దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ సమస్యలకైనా చక్కని ఉపశమనం పొందవచ్చు. చికిత్స సమయంలో ప్రాధమిక దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాతావరణం మార్పు ఉన్నప్పుడు, సంధికాలంలో, పుప్పొడి ఎక్కువగా విడుదలయ్యే సమయాలలో సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదు = దుమ్ములో వెళ్లేటప్పుడు విధిగా క్యాప్ మరియు మాస్క్ వాడాలి =ఇంట్లో గదులలో దుమ్ము, ధూళి క్రమంగా శుభ్రం చేయించుకోవాలి. =పెంపుడు జంతువులు ఉన్నట్లయితే ఇంటి బయట ఉంచడం మంచిది. =బెడ్ షీట్స్, పిల్లోకవర్స్ తరచుగా మారుస్తుండాలి. =ఇంటిలో తేమశాతం తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. =ఒత్తిడిని తగ్గించుకొని మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కొంత కాలం జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడినట్లైతే తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎదురైనా ఎలాంటి సమస్య ఉండదు. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...
మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా సాగడం లేదంటూ చెబుతోంది. డాక్టర్ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - విశాలాక్షి, అమరావతి మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ను రైనైటిస్గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండాను, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటిగాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమో షనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునో గ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్ తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్