Annamalai
-
అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యాడు!
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ప్రభుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్రదాయానికి తమిళులు చరమగీతం పాడి మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే విజయ్వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగిన ద్రవిడ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేత అన్నామలై ముందే పసిగట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది.“తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ తమిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామలై మద్దతుదారులు ఆయనకు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామలై.. సోమవారం ఎన్నికల ఫలితాల సమయానికి చెన్నైకు తిరిగి వచ్చినట్టు ఆమె మరో పోస్ట్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.బీజేపీ ఒంటరిగా పోటీచేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని అన్నామలై మద్దతుదారులు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రెండేళ్ల క్రితమే అన్నామలై పసిగట్టారని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామలై ముందుగానే గుర్తించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామలైని పక్కన పెట్టిందని ఆయన సానుభూతిపరులు అభిప్రాయపడ్డారు.పొత్తుతో చిత్తు'అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యారు' అన్నట్టుగా ఎక్స్లో పోస్టులు పెట్టారు. ''తమిళనాడు ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయారని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ఆయన మాటలను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు విజయ్ సాధించిన విజయంతో అన్నామలై మాటలు నిజమయ్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా కష్టపడి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజయ్ ఫలితం పొందారని మరొకరు అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పు చేసిందని ఎక్కువ మంది పేర్కొన్నారు.చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!రిస్క్ తీసుకోవాలి2024, ఫిబ్రవరి 16న జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా ప్యూర్ అలయెన్స్ గవర్నమెంట్ ఏర్పడబోతోంది. ఈ రెండేళ్లలో పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి క్షేత్రస్థాయిలో నాయకులకు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. వారం, పది రోజుల అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నామలై అప్పట్లో అన్నారు. பிப்ரவரி 16, 2024. சரியாக 2 வருடம் முன்பு அண்ணாமலை சொன்ன வார்த்தைகள் இன்று அச்சு பிசுறாமல் 200% அப்படியே நடந்துள்ளது.பாஜகவின் வெற்றியை தடுத்து, ரிஸ்க் எடுக்கவும் உழைக்கவும் பயந்து இன்று தமிழக பாஜகவை ஒழித்தது யார்? @annamalai_k 🙇🏻🔥🔥 pic.twitter.com/FTFJERVEX9— ᴋᴀʀᴛʜɪ (@TwitzKarthi) May 5, 2026 -
సంతోషంగా ఉంది: ఎన్నికల ఫలితాలపై అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నాయకుడు అన్నామలై తనదైన శైలిలో స్పందించారు. ధన, వారసత్వ రాజకీయాలకు తమ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారని.. మార్పునకు ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినందుకు తమిళనాడు ప్రజలకు నమస్కరించారు. ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్'లో సోమవారం పోస్ట్ పెట్టారు. ఓటర్ల అభిమానం పొందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్కు అభినందనలు తెలిపారు. ఓటమి పాలైన స్టాలిన్కు సానుభూతి ప్రకటించారు. మంచి రోజులు వస్తాయని బీజేపీ శ్రేణులకు భరోసాయిచ్చారు.''అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నమస్కరిస్తున్నాను. నా గడ్డపై ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పడం సంతోషంగా ఉంది. డబ్బుతో ఓట్లు కొనడాన్ని వ్యతిరేకించారు. వంశపారంపర్య రాజకీయాలను వద్దన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పునకు నాంది పలికారు. టీవీకే, విజయ్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆరంభానికి సిద్ధంగా ఉన్న మీకు దేవుడు తోడుగా ఉంటాడు.క్షేత్రస్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఓడిన వారు డీలా పడకుండా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. పరాజయం పాలైన స్టాలిన్, సీమాన్లకు సానుభూతి తెల్పుతున్నాను. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మంచి రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నానని తన పోస్ట్లో పేర్కొన్నారు. కాగా, ఎన్డీఏ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా అన్నామలై పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఇందు కోసం ఎన్నికల్లో పోటీకి సైతం ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయమని సూచించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి! -
కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. -
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ -
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే ఆయనను పోటీకి దూరంగా పెట్టారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ వదంతులను అన్నామలై కొట్టిపారేశారు. తానే పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్టు వెల్లడించారు.తనకు టికెట్ నిరాకరించలేదని, తనకు తానుగా పోటీకి దూరంగా ఉన్నట్టు అన్నామలై చెప్పారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి చాలా ముందే అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు నేనుగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుంద''ని ప్రశ్నించారు.అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని మీడియాలో ప్రచారం జరుగుతుండడంతోనే తాను స్పష్టత ఇస్తున్నానని అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు, ఎన్డీఏ అభ్యర్థుల ప్రచారం చేసేలా అనుమతి ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, గెలిచే సత్తా నాయకులనే అభ్యర్థులుగా ఎంపిక చేసిందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ మోసాలతో విసిగిపోయారని, ఈసారి ఎన్డీఏకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్అన్నామలై అలిగారా?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై హాట్టాపిక్గా మారారు. అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని కీలక స్థానాలను అన్నాడీఎంకే పార్టికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఇదే విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి పెత్తనం ఆయనను మరింత క్షోభకు గురిచేసిందని అన్నామలై సన్నిహితులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీకి ఆయనకు దూరంగా ఉన్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అలాంటిదేమి లేదని అన్నామలై చెబుతున్నారు. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
టీవీకే విజయ్పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఏంకే ముందుకు సాగుతోంది. మరోవైపు.. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.బీజేపీ నేత అన్నామలై.. తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు. తమిళనాడులోని జన్జెడ్ విజయ్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ, విజయ్కు రాజకీయ అనుభవం లేదు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేశారు. అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు. ఉదాహరణకు బీహార్నే తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు. ప్రజాదరణ కూడా కనిపించింది. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. అదే విధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు. 2026 ఎన్నికలు మార్పు కోసం జరిగే ఎన్నికలు. తమిళ ప్రజలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు. గత 12 సంవత్సరాలలో ఆయన క్రమంగా తన మార్కు చూపించారు అని అన్నారు.కార్తీ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా టీవీకే విజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి. గ్రౌండ్ లెవల్ యంత్రాంగం అవసరం. విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు. అలాగే, బీజేపీపై స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కిచెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందూత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.విజయ్ పోటీ ఎక్కడ?ఇదిలా ఉండగా.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘వి’తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలో ఉన్నాయి. -
ఉదయనిధికి అన్నామలై కౌంటర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ నాయకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. తన పదవికి ఉదయనిధి రాజీనామా చేయాలన్నారు. తమ పార్టీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను స్టాలిన్ సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు."అమిత్ మాలవీయకు సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి 48 గంటల క్రితం ఇచ్చిన తీర్పులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మత విశ్వాసాలపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జాతి నిర్మూలనకు దారితీసేలా ఉన్నాయన్నారు. తమిళనాడు పోలీసులు కనీసం ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. ఇది నిజంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే, ఆయన నుంచి రాజీనామా లేఖ తీసుకోవాల''ని అన్నామలై అన్నారు.చెన్నైలో మూడేళ్ల క్రితం ఈ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల్లా.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. దీన్ని మారణహోమానికి పిలుపుగా అమిత్ మాలవీయ (Amit Malviya) వర్ణించారు. దీంతో తమిళనాడు పోలీసులు ఆయనపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.కోర్టు తీర్పులను లెక్కచేయడం లేదుకోర్టు తీర్పులను స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని అన్నామలై తాజాగా ఆరోపించారు. తిరుప్పరంకుండ్రం కేసుతో సహా అనేక వివాదాల్లో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. మరో 50 రోజుల పాటు ప్రజలు డీఎంకే ప్రభుత్వ దారుణాలను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ''డీఎంకే, వామపక్ష పార్టీలు ఏ తీర్పును ఆమోదించవు. న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే.. వారు కులం, మతం ఉపయోగించి దుర్భాషలాడేందుకు ప్రయత్నిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పోరాడతాయని పేరుండేది. కానీ డీఎంకేతో చేతులు కలిపిన తర్వాత తోక పార్టీలుగా మారిపోయాయ''ని ధ్వజమెత్తారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేత -
అన్నామలై రాజకీయం – ముంబైలో దక్షిణాది వారికి చిక్కులు
ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లినఅన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.దీంతో ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే.. అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చారు.ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు.ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది. -
‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్?’
తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)ఇదిలా ఉంటే.. కరూర్ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్ను ఉద్దేశించినవేనన్న కామెంట్(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. ఇదీ చదవండి: విజయ్కు సపోర్ట్గా బీజేపీ, ఆ పార్టీ కూడా! -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
అన్నామలైకు చేదు అనుభవం, అయినా సరే..!
బీజేపీ నేత, తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్కు హాజరైన ఆయన నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు. తీరా ఆ యువకుడు ఆ రాష్ట్ర మంత్రి కొడుకు కావడం గమనార్హం.తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తనయుడు సూర్య రాజా బాలు చేసిన పని ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. మాజీ ఐపీఎస్ అన్నామలై నుంచి మెడల్ను నిరాకరించాడు. తమిళనాడు 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు అన్నామలై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతల మెడలో మెడల్స్ వేస్తుండగా.. సూర్య అందుకు ఒప్పుకోలేదు. అన్నామలై నుంచి దూరందూరంగా జరిగాడు. ఆపై అన్నామలై నుంచి చేత్తో ఆ మెడల్ను తీసుకున్నాడు.அசிங்கப்பட்டான் ஆடு மேய்ப்பன் @annamalai_k pic.twitter.com/19l5XerZfH— ஜோக்கர் ᵖʰᵒᵉⁿⁱˣ (@lahudapandi) August 25, 2025అయితే ఈ పరిణామంపై అన్నామలై ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. బాలును దగ్గరికి తీసుకుని సక్సెస్ కావాలంటూ అభినందించి ఫొటో దిగారు. ఆపై ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్కు హాజరైన మీడియా నుంచి ఆయనకు వైరల్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దానికి అన్నామలై స్పందిస్తూ.. నేత అనేవాడు ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉండాలిగానీ ద్వేషంతో కాదు అని బుదులిచ్చారు. బాలుకు విజయాలు కలగాలి అంటూ మరోసారి ఆశీర్వదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. సింగంగా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఈమధ్యే ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ నిత్యం ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు.మొన్నీమధ్యే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. తిరునెల్వేలిలో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కాగా.. ఆయన నుంచి కాకుండా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నుంచి ఓ యువతి పట్టా అందుకుంది. డీఎంకే నేత ఎం రాజన్ తనయ జీన్ జోసెఫ్గా తేలింది. గవర్నర్ తమిళ భాషకు, తమిళనాడుకు వ్యతిరేకి అని.. పైగా వైస్ చాన్సలర్ తమిళనాడుకు ఎంతో చేశారని.. అందుకే ఆయన నుంచి పట్టా తీసుకున్నానని జీన్ తెలిపింది. -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
తొలిసారి స్పందించిన అన్నామలై
-
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
కోయంబత్తూర్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025 -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
LKG విద్యార్థి Phd హోల్డర్కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
ఉదయనిధి సవాల్.. అన్నామలై సై
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పుడే సవాళ్ల పర్వం మొదలైంది. యువనేతలు ఉదయనిధి స్టాలిన్, అన్నామలై (annamalai) పరస్పరం సవాళ్లు విసురుకోవడం తమిళ రాజకీయాల్లో (Tamil Politics) హాట్టాపిక్గా మారింది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపిస్తూ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడిస్తామన్న అన్నామలైకు ఉదయనిధి బహిరంగ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్టు అన్నామలై ప్రకటించారు.చైన్నెలోని షెనాయ్నగర్లో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డీఎంకే యువనేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin) పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వంపై కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. అందరికీ అన్ని లక్ష్యంగా సాగుతున్న సీఎం స్టాలిన్పై (CM Stalin) నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులో విద్య, ఉపాధికి అడ్డంకులు సృష్టించే విధంగా కేంద్రం సైతం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీబీఎస్ఈ విద్యా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.తన ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించిన అన్నామలైకు ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అన్నాసాలైలోకి అడుగు పెట్టమనండి అంటూ వ్యాఖ్యానించారు. ‘తొలుత అన్నా అరివాలయం అన్నారు. ఇప్పుడు మా ఇల్లు ముట్టడిస్తామంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటా.. ధైర్యం ఉంటే రమ్మనండి’ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు.అన్నాసాలైలో ఎక్కడికి రావాలి?ఉదయనిధి స్టాలిన్ సవాల్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. సేలంలో బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ‘ధైర్యం ఉంటే అన్నాసాలైకు రావాలని ఉదయనిధి అన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. చైన్నెలోని అన్నాసాలైలో ఎక్కడికి రావాలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను చెప్పమనండి. స్థలం, రోజు, సమయం చెబితే అక్కడికి ఒంటరి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.క్షీణించిన శాంతిభద్రతలుకాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని అన్నామలై ఆరోపించారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సర్క్యులర్ ద్వారా వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అసత్యాలు కట్టిపెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ డీఎంకే ప్రచారం మొదలెట్టగా, ‘గెట్ అవుట్ స్టాలిన్’ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.చదవండి: మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? -
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్
చెన్నై: అటు బీజేపీ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk— K.Annamalai (@annamalai_k) February 21, 2025 ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్కు కేంద్రమంత్రి కౌంటర్ -
విమానంలో సీటు వివాదం.. డీఎంకే ఎంపీVsఅన్నామలై
చెన్నై:తమిళనాడులో ఎయిర్ఇండియా విమానంలో సీటుపై రాజకీయం వేడెక్కింది. విమాన సీటు విషయంలో డీఎంకే,బీజేపీ మధ్య విమర్శల బాణాలు దూసుకెళ్లాయి. డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా వారు ఆమె బిజినెస్ క్లాసు సీటును రద్దు చేసి ఎకానమి సీటు కేటాయించారు. ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఒక ఎంపీకే విమానంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన విమాన టికెట్ తరగతిని ఎలా తగ్గిస్తారని ట్వీట్లో నిలదీశారు. దీనికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. ఎంపీ తంగపాండియన్కు అలా జరగాల్సింది కాదని అంటూనే ఆమెపై విమర్శలు గుప్పించారు.Absolutely unacceptable from @airindia! I had booked a Business Class seat on an Air India flight from Delhi to Chennai (A1540- 9.20pm) this evening (13.02.2025). Without any prior notice or explanation, the seat was downgraded. This is not just about me—if a MP can be treated… pic.twitter.com/wAqNkwwBBp— தமிழச்சி (@ThamizhachiTh) February 13, 2025 కేవలం విమానంలో టికెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు..డీఎంకే పాలనలో ప్రజల స్థాయి తగ్గిపోయిందని గుర్తుచేశారు. ఒక ఎంపీని నా పరిస్థితే ఇలా ఉంటే అని మాట్లాడడం మీ అధికార దర్పాన్ని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని సూచిస్తోందని మరో ‘ఎక్స్’ పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4— K.Annamalai (@annamalai_k) February 14, 2025 -
అన్నామలైకే మళ్లీ ఛాన్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైకు మళ్లీ ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రంలో తుది దశకు చేరిన విషయం తెలిసిందే. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధిష్టానం ఆమోదంతో జాబితా వెలువడాల్సి ఉంది. ఆ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవుల ప్రక్రియ సాగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విస్తృతంగాఅ న్నామలై పర్యటిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేతో వైర్యం పెట్టుకోవడం ఇతర బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారంలో సీనియర్ నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఈనెల 17వ తేది జరగబోతోంది. అధ్యక్ష ఎంపికకు నియంచిన కమిటీ బాధ్యతల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఈసారి అధ్యక్ష పదవి రేసులో మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ సైతం రేసులో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే వారు సుముఖంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతం దిశగా అన్నామలై పరుగులు తీస్తుండడం, అధిష్టానం మద్దతు పాటూ రాష్ట్రంలో కేడర్ అంతా ఆయన వైపు చూస్తుండడంతో మరోమారు అన్నామలై అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయం అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG— ANI (@ANI) December 26, 2024 ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి.. -
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్స్టార్నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.ఏదైనా జరగొచ్చు..అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.బలమైన కూటమి ఏర్పాటు చేస్తాంఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.ఈసారి అటువంటి పొరపాటు చేయంలోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు. -
రాజకీయాల కన్నా.. ఉద్యోగమే మిన్న
సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకో సమస్య.. తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది కనిపెట్టేయవచ్చ అని అన్నారు. చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్ గేర్లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘అన్నామలై’కు మంత్రి పదవి దక్కేనా?
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్రంలో మంత్రి పదవి దక్కేనా అన్న చర్చ ఊపందుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి అన్నామలై కీలక పాత్రనే పోషించారు. గతంలో 3 శాతం మేరకు ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్ను తాజా ఎన్నికల ద్వారా 11 శాతానికి చేర్చారు. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో తమిళనాడులో బలమైన కూటమి ఏర్పాటు చేశారు. అయితే, డీఎంకే కూటమి హవా ముందు అందరూ ఓటమి పాలయ్యారు. ఓడినా తమిళనాడులో తమ బలం పెరిగిందన్న ధీమా బీజేపీ వర్గాల్లో నెలకొంది. ఇదే విషయాన్ని శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రకటించారు. తమిళనాడులో బలం పెరిగిందని, రాబోయే రోజుల్లో పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ బలోపేతంలో అన్నామలై పనితీరు ప్రధాన కారణం అన్న విషయాన్ని ఇప్పటికే బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈదృష్ట్యా, కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కేనా? అని ఆయన మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ మురుగన్కు కొత్త ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించారు. ఇదే తరహాలో ప్రస్తుతం పార్టీ బలోపేతానికి వీరోచితంగా శ్రమించిన, శ్రమిస్తున్న అన్నామలైకు కేంద్రంలో గుర్తింపు కల్పించేలా మంత్రి పదవి కేటాయించేనా అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో అన్నామలై వ్యాఖ్యల తీరుతోనే అన్నాడీఎంకేకు దూరమయ్యామని, కలిసి కట్టుగా పోటీచేసి ఉంటే కనీస స్థానాలలో విజయకేతనం ఎగుర వేసి ఉంటామని పలువురు బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు
చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకేలు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల మొదటి దశలో పోలింగ్లో భాగంగా అన్నామలై కరూర్లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే నుంచి గణపతి పి.రాజ్కుమార్, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులో బీజేపీ వ్యక్తి తమను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఒక్కరినైనా తీసుకురాగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నామలై సవాలు విసిరారు. బీజేపీ సొంతంగా 25 శాతం దాటుతుందని, సీట్ల సంఖ్య కూడా రెండంకెల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఈ రోజు నేను నా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించాను. దేశంలోని ప్రతి పౌరునికి ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో పనిచేసే ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ పౌరులు ప్రజాస్వామ్యాన్ని పని చేసేలా చేస్తారు. మంచి వ్యక్తులు, పాలనపై ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చూపిస్తారని మాకు నమ్మకం ఉంది. తమిళనాడు ప్రజలు చరిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతారు” అని అన్నామలై పేర్కొన్నారు. -
TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్ లేదు: అన్నామలై
చెన్నై:తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్కుమార్ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
TN: అన్నామలైపై దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఒక జోకర్ అని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ‘అన్నామలై ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీట్ పరీక్షను వ్యతిరేకించాడు. ఇప్పుడు నీట్ను సమర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన తనకు హిందీ రాదన్నాడు. ఇప్పుడేమో హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్నామలై లాంటి వాడు కావాలి. అతను మంచి వినోదం పంచే వ్యక్తి. ప్లీజ్ అన్నామలై కంటిన్యూ’ అని మారన్ ఎద్దేవా చేశారు. కాగా, అన్నామలైని ఉద్దేశించి ఇటీవల దయానిధి మారన్ ఓ నేషనల్ టీవీలో చేసిన జోకర్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడం గమనార్హం. అన్నామలైపై మారన్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే క్యారెక్టర్ను తెలియజేస్తున్నాయని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని ఈ గ్యారెంటీలు ఇవ్వగలరా.. మోదీకి స్టాలిన్ సవాల్ -
అన్నామలై Vs కమల్: తమిళనాట రసవత్తర రాజకీయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్పూర్కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur. Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC — Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024 కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్పూర్ను భారత్కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
దేశ ప్రధానులు వాళ్లే.. బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు..
వేసవి హీట్తో పాటు దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాడీవేడి రాజకీయం నడుస్తోంది. ఎలక్షన్ సమయం కాబట్టి ఒక పార్టీ నేత మరో పార్టీ నేతపై విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జనరేషన్. ఏ మూలకు చీమ చిట్టుకుమన్నా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దీంతో, సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తారు. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !! And another BJP leader from South says Mahatma Gandhi was our PM !! Where did all these people graduate from? 😁 — KTR (@KTRBRS) April 5, 2024 ఇక, ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రౌత్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశ మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు వివాదాస్పందగా మారాయి. ఈ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ వీరంతా ఎక్కడ చదువుకున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. Whatsapp University students😁👇 Subhash Chandra Bose was the first Prime Minister of India - BJP candidate Kangana Ranaut. Mahatma Gandhi was out Prime Minister - BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez — Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024 -
కచ్ఛాతీవు రగడ.. భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. దేశ భద్రత ఏమాతం పట్టించుకోకుండా, స్పృహలేకుండా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దీంతో మరోసారి కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం తెరమీదికి వచ్చింది. తాజాగా కచ్ఛాతీవు ద్వీపం విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహార్లాల్ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విమర్శలు చేశారు.కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ మీడియాతో మాట్లాడారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించి 1974లో పార్లమెంట్లో మాజీ కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి స్వరణ్ సింగ్ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘స్వేచ్ఛ, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో ఇరుదేశాల మధ్య మత్స్యకారుల వేట, నేవిగేషన్ హక్కులను పొందినట్లుగానే భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సమానంగా పొందుతాయి’అని అప్పటి కేంద్రమంత్రి చెప్పినట్లు జైశంకర్ మీడియాకు వివరించారు. ఇలా జరిగిన రెండు ఏళ్లలో అప్పటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీలకం సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య 1974 ఈ ఒప్పందం జరిగితే.. 1976లో అమల్లోకి వచ్చిందన్నారు. అప్పుడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6184 భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారు. 1175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్ చేశారని జైశంకర్ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదేవిషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాదానం ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదని.. ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక.. కచ్ఛాతీవు ద్వీపం ఒప్పందానికి సంబంధించిన వివరాల కోసం తమిళాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ పిటిషన్ వేయటంతో దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ కాంగ్రెస్ విమర్శలు చేయటంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి విమర్శలుపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకొని 111ప్రాంతాలు బంగ్లాకు,55 ప్రాంతాలు భారత్త్ పరస్పరం బదిలీ చేసుకున్న విషయం మర్చి పోయాయా? 1974లో జరిగింది కూడా అచ్చం అలాంటి ఒప్పందమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎమిటీ కచ్ఛాతీవు కథాకమామిషు? కచ్ఛాతీవు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఉన్న 163 ఎకరాల అతి చిన్న ద్వీపం. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా ఆధీనంలో ఉండేది. బ్రిటిష్వారి రాకతో శ్రీలంక, భారత్ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్రం పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగటంతో అది తమదంటే తమదని శ్రీలంక, భారత్ ప్రకటించుకున్నాయి. చదవండి: కచ్ఛాతీవు ద్వీపం.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు -
TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్ 28)రాత్రి కరూర్లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో కరూర్ నుంచి పోటీ చేశారు. సెంథిల్ బాలాజీ భయంతోనే ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు. గతంలో కరూర్ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ రాజీనామా -
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్ రాజు మిమ్మల్ని కమల్ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత స్థాయి. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్ప్యాడ్ నిర్మాణానికి శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా ప్రకటనలో చైనా జెండా ముద్రించటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
సీఎం ఎంకే స్టాలిన్కు ఆ అధికారంలేదు : అన్నమలై
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 'సీఏఏ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు అధికారాలు లేవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. స్టాలిన్ రాజకీయంగా సీఏఏని వ్యతిరేకించినప్పటికీ, తమిళనాడులో కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి వ్యతిరేకంగా అతను అధికారికంగా తీసుకోలేరు. సీఏఏ సంబంధిత నిబంధనలను అమలు చేయకూడదని నిర్ణయించే రాజ్యాంగం ప్రకారం అతనికి ఎటువంటి అధికారం లేదని అన్నామలై నొక్కిచెప్పారు. కీలక వ్యాఖ్యలు పౌరసత్వ (సవరణ) చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాన్ని అమలు చేయదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘సిఏఏ అనవసరం. రద్దు చేయాలి. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయడానికి మేము ఏ విధంగానూ అనుమతించము. భారతదేశాన్ని ప్రభావితం చేసే ఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చోటు ఇవ్వదని నేను తమిళనాడు ప్రజలకు స్పష్టం చేస్తున్నాను అని తెలిపారు. -
రవిశంకర్ గురూజీని కలిసిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ - ఫోటోలు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కోసం బీజేపీ నాకు కొంత బాధ్యతను అప్పగించిందని, తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అన్నామలై కోయంబత్తూరులో గురుదేవ్ రవిశంకర్ ఆశీస్సులు పొందే అవకాశం లభించిందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. కోయంబత్తూరులో ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ హోలిస్టిక్ సొసైటీ' కోసం గురుదేవ్ చొరవ చాలా ముఖ్యమైందని అన్నారు. గురుదేవ్ రవిశంకర్ గురూజీని అన్నామలై కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గురూజీ అన్నామలైను సత్కరించడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. It was a divine morning to have had the opportunity to seek the blessings of Gurudev Sri Sri Ravi Shankar avl in Coimbatore today. Gurudev’s initiative for a ‘Drug-Free India for a holistic society’ in Coimbatore comes at a very important & appropriate time! pic.twitter.com/BYJ2OARdAr — K.Annamalai (@annamalai_k) March 3, 2024 -
అమ్మ ఒడి ‘హాయిగా’... గున్న ఏనుగు సాక్షిగా..!
చెన్నై: తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్లో తప్పిపోయిన గున్న ఏనుగును తల్లి చెంతకు చేర్చారు. తల్లిని కలిసిన అనంతరం చిన్న ఏనుగు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది. ఈ దృశ్యాలను అటవీ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు సోషల్ మీడియాలో పంచుకోగా.. విశేష స్పందనలు వచ్చాయి. గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చినందుకు అటవీ అధికారులకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. అటవీ సిబ్బందికి నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల్లోనైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని కొనియాడారు. When a picture is worth a million words ❤️ the rescued baby elephant after uniting with the mother takes an afternoon nap in her mother's comforting arms before moving again with the big herd. Picture taken by Forest field staff somewhere in Anamalai Tiger reserve who are keeping… https://t.co/EedfkKjLHj pic.twitter.com/ttqafSudyM — Supriya Sahu IAS (@supriyasahuias) January 2, 2024 ఇదీ చదవండి: Ram Mandir: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
'బీజేపీతో, అన్నాడీఎంకే పొత్తు ఉండదు'
చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్ సోమవారం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్గా పాలన చేస్తూ.. -
గవర్నర్కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్భవన్లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తమిళనాడు గవర్నర్పై బీజేపీ చీఫ్ అసంతృప్తి!
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై అక్కడి అధికార పక్షం డీఎంకే తీవ్రస్థాయిలో అసంతృప్తితో రగిలిపోతోంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన బాలజీ సెంథిల్ను ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మంత్రి పదవి నుంచి తొలగించడం.. అదీ న్యాయపరమైన చిక్కుల్ని తెచ్చిపెట్టే అంశం కావడంతో గవర్నర్ రవి వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత డీఎంకే రోజుకో రీతిలో గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారాయన. విల్లుపురంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో అన్నామలై పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో.. గవర్నర్ వ్యవహరశైలిపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘‘డీఎంకే సంధించే ప్రతీ ప్రశ్నకు గవర్నర్ రవి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అది ఆయన పని కాదు. ఎందుకంటే ఆయన రాజకీయనేత కాదు. గవర్నర్ ప్రతిదానికీ సమాధానం చెప్పుకుంటూ పోతే.. ఈ వ్యవహారానికి పుల్స్టాప్ పడుతుందా?. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపై ఆయన (రవి) రోజూ ప్రెస్మీట్లు పెడితే ఈ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఖచ్చితంగా అంగీకరించదు అని అన్నామలై వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమస్యలపై రోజూ మీడియాతో మాట్లాడతారని.. అలాంటప్పుడు తమిళనాడు గవర్నర్ అదే చేస్తే అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. దానికి అన్నామలై సమాధానమిస్తూ.. అలా జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించే వ్యక్తిని తానేనని, ఎందుకంటే గవర్నర్ అలా మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తే అధికార పక్షం అక్రమాలు బయట పడతాయన్నారు. కానీ.. గవర్నర్ అలా చేయకూడదనే తాను బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ‘‘గవర్నర్ ఉంది రాజకీయాలు చేయడానికి కాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. గవర్నర్ తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఒకప్పుడు.. గవర్నర్లు ఆరు నెలలు లేదంటే సంవత్సరానికి ఒకసారి వార్తాపత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం. అప్పుడది బాగానే ఉండేది. నేను ఇతర రాష్ట్రాల గవర్నర్లపై వ్యాఖ్యానించదలచుకోలేదు. ఎందుకంటే.. ఎవరి పని తీరు వారిది కాబట్టి. కానీ, తమిళనాడు విషయంలో అధికార డీఎంకే తప్పు చేసినప్పుడు.. ఆ పార్టీని బీజేపీ నేత విమర్శించడానికి.. ఓ గవర్నర్ విమర్శించడానికి తేడా ఉంటుంది కదా. అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రభుత్వాలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చు. అలా కాకుండా నాలాగే రోజూ ప్రెస్ మీట్ పెట్టడం మొదలుపెడితే గవర్నర్ అనే హోదాకి ఉన్న గౌరవం పోతుంది అని అన్నామలై చెప్పారు. ఇదీ చదవండి: మతతత్వ పార్టీలకు ప్రజాదరణ ఉండదు -
TN: ఎస్జీ సూర్య అరెస్ట్
చెనై: జాబ్ రాకెట్ కుంభకోణంలో డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేయడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. బాలాజీ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజకీయంగా ఎదుర్కోలేక.. త్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. మంత్రి అరెస్ట్ అనంతరం బీజేపీపై కౌంటర్ అటాక్కు దిగారు సీఎం స్టాలిన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జీ సూర్యను మదురై పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(a), 505 (1)(b), 505 (1)(c).. ఐటీ చట్టం 66(d) ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు అతన్ని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా మధురై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఎం) ఎంపీ సు వెంకటేశన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఎస్జీ సూర్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అధికారుల మాత్రం బీజేపీ నేత అరెస్టుకు గల సరైన కారణాన్ని వెల్లడించలేదు. విశ్వనాథన్ అనే కమ్యూనిస్ట్ కౌన్సిలర్ మలంతో నిండిన కాలువను శుభ్రం చేయమని పారిశుధ్య కార్మికుడిని బలవంతం చేశారని, ఫలితంగా అలెర్జీ కారణంగా కార్మికుడు మరణించాడని సూర్య ఆరోపించారు. ఈ మేరకు ఈ సంఘటనను తీవ్రంగా విమర్శిస్తూ ఎంపీ వెంకటేశన్కు రాసిన లేఖ రాశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ వేర్పాటువాద రాజకీయాలు ఆ మురికి గుంట కంటే హీనంగా కంపు కొడుతున్నాయి. మనిషిగా బ్రతకడానికి మార్గం కనుక్కోండి మిత్రమా’ అంటూ విశ్వనాథన్పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సూర్యను అరెస్ట్ చేసినట్లు సమాచారం చదవండి: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం సూర్య అరెస్ట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జి సూర్యను రాత్రికి రాత్రే అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది చట్ట విరుద్ధమన, సామాజిక సమస్యలపై డీఎంకే దాని కూటమి పార్టీ కమ్యూనిస్టు ద్వంద్వ వైఖరిని విమర్శించినందుకే అతన్ని అరెస్టు చేశారంటూ ట్విటర్లో ఆరోపించారు. తమ విమర్శలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి వారి గొంతులను మూయించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారిని అరెస్ట్ చేసే అప్రజాస్వామిక ధోరణి రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విమర్శలను ఎదుర్కోలేక బీజేపీ కార్యకర్తలను నిరంతరం అరెస్టు చేయడం నిరంకుశ పోకడకు నిదర్శనం. ఇలాంటి అణచివేతలతో కాషాయ శ్రేణులు వెనక్కి తగ్గరు. ప్రజల కోసం మా గొంతు ఎప్పుడూ ధైర్యంగా మోగుతుంది. ప్రశ్నించే గొంతులన్నింటినీ అణచివేయడానికి ప్రయత్నిస్తే ఎక్కువకాలం ప్రజాస్వామ్యంలో కొనసాగలేరనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి’ అని అన్నామలై ట్విటర్లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే నేత, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ ఇటీవల అరెస్ట్ చేసిన మూడు రోజులకే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బాలాజీని విమర్శించిన స్టాలిన్.. పాత వీడియో పోస్ట్ చేసిన అన్నామలై
చెన్నై: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రతీకార చర్యలకు బీజేపీ దిగుతోంది. విపక్షాలు మొదటి నుంచి బీజేపీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. అందుకు తగ్గట్లుగా తాజాగా తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం.. తదనంతర నాటకీయ పరిణామాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కౌంటర్కు దిగింది. బాలాజీని ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించిన స్టాలిన్.. ఆయన్ని బాధితుడిగా పేర్కొనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ వీడియో పోస్ట్ చేశాడు. గతంలో బాలాజీ అవినీతి విమర్శలు స్టాలిన్ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా స్వరం ఎందుకు మారిందంటూ స్టాలిన్ను నిలదీశాడు అన్నామలై. గతంలో క్యాష్ ఫర్ జాబ్ స్కామ్లో సెంథిల్ బాలాజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ టైంలో ఆయన డీఎంకేలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. స్టాలిన్ సహా డీఎంకే కీలక నేతలంతా బాలాజీని అవినీతిపరుడంటూ ఏకిపారేశారు ఆ టైంలో. ఇదే అన్నామలై సదరు వీడియో ద్వారా గుర్తు చేశాడు. కరూర్జిల్లాలో ఓ మంత్రి ఉన్నాడు. ఆయన పేరు సెంథిల్ బాలాజీ. కేబినెట్ ఇప్పటిదాకా 15సార్లు పునర్వ్యవస్థీకరణ అయ్యింది. కానీ, సెంథిల్ను మాత్రం కేబినెట్లో అలాగే కొనసాగించారు. ఆయనొక జూనియర్ మంత్రి. సీనియర్లను పక్కనపెట్టి మరీ ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. జయలలిత జైల్లో ఉన్న టైంలో.. ఆయన పేరు సీఎం పదవికి కూడా వినిపించింది. ఆయన, ఆయన సోదరుడు ఇద్దరూ జిల్లాను దోచుకునేందుకే ఉన్నారు.. ఇవీ స్టాలిన్ ఆ వీడియోలో చెప్పిన మాటలు. అయితే ఆ తర్వాత అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో పార్టీని వీడి.. 2018లో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పిన తర్వాత కూడా ఛాతిలో నొప్పి వచ్చేలా చిత్రహింసలకు గురిచేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏం సాధించాలనుకుంటోంది. కేసుకు అవసరమైన చట్టపరమైన విధానాలను ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మానవత్వం లేని విధంగా వ్యవహరించడం అవసరమా? బీజేపీ బెదరింపులకు డీఎంకే భయపడదు. 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ సెంథిల్ను కలిశాక ఓ ట్వీట్ చేశారు స్టాలిన్. ఇదిలా ఉంటే.. చెన్నై, కోయంబత్తూరు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో 18 గంటల తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసింది ఈడీ. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న టైంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేసి ఈ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. అయితే అరెస్ట్ సమయంలో ఆయన ఛాతీ నొప్పితో కుప్పకూలి స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఆయనకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు కూడా. விசாரணைக்கு முழு ஒத்துழைப்பு தருகிறேன் என்று சொன்ன பிறகும் அமைச்சர் செந்தில் பாலாஜிக்கு நெஞ்சு வலி ஏற்படும் வகையில் சித்ரவதை கொடுத்த அமலாக்கத்துறையின் நோக்கம் என்ன? வழக்கிற்குத் தேவையான சட்ட நடைமுறைகளை மீறி மனிதநேயமற்ற முறையில் அமலாக்கத்துறை அதிகாரிகள் நடந்து கொண்டிருப்பது… pic.twitter.com/D2EIs5vvWN — M.K.Stalin (@mkstalin) June 14, 2023 A gentle reminder to Thiru @mkstalin on what he spoke a few years back about the #CashForJobScam tainted Thiru Senthil Balaji. Are you going to refute this, Thiru @mkstalin? Why are you playing victim card today? https://t.co/ybFUtqrFov pic.twitter.com/c1YeCyhvFn — K.Annamalai (@annamalai_k) June 14, 2023 Netaji used to say “tum mujhe khoon do main tumhe Azadi doonga” These parties say “tum mujhe cash do main tumhe job doonga” The U turn of Stalin ji on corruption & cash-4-job scam isn’t surprising for those who have mastered art of 2G,3G corruption! https://t.co/fgIAqfpUof — Shehzad Jai Hind (@Shehzad_Ind) June 14, 2023 ఇదీ చదవండి: తమిళనాడు మంత్రి అరెస్ట్ సమయంలో జరిగింది ఇదే! -
అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్పై బీజేపీ మండిపడింది. అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు. ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు -
Annamalai: డీఎంకే ఫైల్స్తో చిక్కుల్లో బీజేపీ చీఫ్
చెన్నై: బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనున్నాడు. డీఎంకే ఫైల్స్తో రాజకీయ కాక రేపుతున్న ఆయన్ని కోర్టుకు లాగబోతోంది తమిళనాడు సర్కార్. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరువుకు భంగం కలిగించే విధంగా అన్నామలై యత్నిస్తున్నారంటూ ఆరోపణలకు దిగిన ప్రభుత్వం.. ఈ మేరకు ఇవాళ అన్నామలై మీద పరువు నష్టం దావా కూడా వేసింది. చెన్నై మెట్రో కాంట్రాక్ట్ కోసం 2011లో 200 కోట్ల ముడుపులను ఎంకే స్టాలిన్ అందుకున్నారంటూ.. అన్నామలై సంచలన ఆరోపణలకు దిగాడు. అంతేకాదు.. డీఎంకే నేతల ఆస్తుల విలువ 1.34 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని, అదంతా అవినీతి సొమ్మని, పైగా దుబాయ్కు చెందిన ఓ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా.. ఆ కంపెనీలో స్టాలిన్ కుటుంబ సభ్యులు రహస్య డైరెక్టర్లుగా ఉన్నారంటూ వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో డీఎంకే లీగల్ నోటీసులు కూడా పంపింది. అయినా ఆయన తగ్గట్లేదు. తమిళనాడు రాజకీయాలను డీఎంకే ఫైల్స్ పేరుతో అన్నామలై చేస్తున్న సోషల్ మీడియాలో పోస్టులు వేడెక్కిస్తున్నాయి. అందులోభాగంగా.. ఆర్థిక మంత్రి పళనివేళ్ థైగరాజన్ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ తమిళనాట పెను సంచలనంగా మారింది. స్వయానా సీఎం స్టాలిన్ తనయుడు, ఆయన అల్లుడు సబరీసన్లు ఏడాదికి 30 వేల కోట్లను అవినీతి మార్గంలో సంపాదించారంటూ అందులో పళనివేళ్.. వేరేవరికో చెబుతున్నట్లు ఉంది. అంతేకాదు ఐదు రోజులు గ్యాప్తో పళనివేళ్కు సంబంధించిన మరో ట్విటర్ ఆడియో క్లిప్ను సైతం విడుదల చేశాడు అన్నామలై. అయితే పళనివేళ్ సహా డీఎంకే నేతలంతా ఆ క్లిప్ ఎడిట్ చేసిందంటూ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ క్రమంలో విమర్శలతో పేట్రేగిపోతున్న అన్నామలై నోటికి తాళం వేయాలని డీఎంకే సర్కార్ భావించింది. అందుకే పరువు నష్టం దావా వేసింది. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎళన్గోవన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ తప్పు చేయకున్నా అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. అలాంటిది అన్నామలై లాంటి వాళ్లు అంతలా చేస్తున్నప్పుడు.. వాళ్ల మీద దావా వేయడానికి కారణం సరిపోతుంది కదా. అన్నామలైను శిక్షించేందుకు ఇదే మంచి సమయం అంటూ పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. డీఎంకే లీగల్ నోటీసులు పంపినా కూడా క్షమాణలు చెప్పడానికి అన్నామలై నిరాకరిస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్తున్నాడు. ఏప్రిల్ 14వ లేతఅన డీఎంకే నేతల ఆస్తులని పేర్కొంటూ ఓ పెద్ద లిస్ట్ను విడుదల చేశౠరాయన. అందులో స్టాలిన్ తనయుడు.. క్రీడా శాఖ మంత్రి ఉదయ్నిధి స్టాలిన్తో పాటు మరికొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నాయి. అయితే డీఎంకే ఇదంతా జోక్గా కొట్టిపారేసింది. ఇదీ చదవండి: త్వరలో చిన్నమ్మతో భేటీ -
దిగజారుడు నేతలకు పబ్లిసిటీ ఇవ్వం!.. అన్నామలైపై సీఎం పరోక్ష విమర్శలు
సాక్షి, చైన్నె: దిగజారుడు రాజకీయాలు చేసే వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తానుప్రజా సేవలో బిజీగా ఉన్నానని, అనాగరిక రాజకీయాలు చేసే వాళ్లను పట్టించుకోనని స్పష్టం చేశారు. మీలో ఒకడిని.. పేరిట సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వచ్చే ప్రశ్నలకు సీఎం ఎంకే స్టాలిన్ సమాధానాలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం పలువురు సంధించిన అనేక ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. ఈ సారి సమాధానాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందని పేర్కొంటూ, రెండేళ్ల పాలనలో అమల్లోకి తెచ్చిన కీలక పథకాలను, వాటి తీరు తెన్నులను వివరించారు. ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయని, అన్ని రంగాలలో తమిళనాడును నెంబర్ –1 చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నామని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సామాజిక న్యాయ రాజధాని.. తమిళనాడు స్వరం భారతదేశ వ్యాప్తంగా మారుమోగిందని, సామాజిక న్యాయానికి తమిళనాడు రాజధానిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కుల విషయంలో తగ్గేదే లేదన్నారు. రెండేళ్ల పాలన పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో మూడు వంతులకు పైగా హామీలను నెరవేర్చినట్లు వివరించారు. పదేళ్ల అన్నాడీఎంకే పాలన రూపంలో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దిగజారిందని, దీనిని తాము మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో విజయవంత మయ్యామన్నారు. అమిత్ షాపై ఆగ్రహం బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని సంతృప్తి పరిచేందుకు మరొకరిపై ద్వేషం పెంచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ దేశంలో హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలుగుతున్నారని పేర్కొన్నారు. ద్వేష పూరిత రాజకీయాల వైపుగా బీజేపీ ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారని పేర్కొన్నారు. చౌకబారు విమర్శలను పట్టించుకోం.. ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాలలలో జరుగుతున్న ఆడియో ప్రచారం గురించి సీఎం స్పందించారు. ఇప్పటికే మంత్రి రెండు సార్లు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా సేవలో తాను బిజీగా ఉన్నానని, చౌక బారు విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోదలచుకో లేదన్నారు. అన్నామలైను ఉద్దేశించే ఈ00 వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక దివంగత నేత కరుణానిధి శత జయంతి వేడుకలను ఈ ఏడాది పొడవున బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల విజ్ఞప్తులను అర్థం చేసుకోవడం, వారి గళానికి గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్లడం తన అభిమతంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, అవినీతి కేసుల్లో అందరినీ కచ్చితంగా కోర్టు బోనులో నిలబెడుతామన్నారు. -
తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం
తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్.. హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్ని ట్విట్టర్లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్లను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్ ఆధారంగా స్టాలిన్ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్ స్టాలిన్, అల్లుడు శబరీశన్ 30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్ల నియమాక విషయమై ఓ ప్రెవేట్ కంపెనీ స్టాలిన్కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్లో ఆరోపణలు వచ్చాయి. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వాయిస్తో నేరారోపణ చేసే కంటెంట్ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. (చదవండి: సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష) -
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా: అన్నాలై
అన్నాడీఎంకేతో ఇక కటీఫ్, ఆ పార్టీతో కూటమి పెట్టుకుంటే పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆయన అన్నాడీఎంకేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, కూటమి ఎవరెవరితో అని నిర్ణయించేది బీజేపీ కాదని, తాము మాత్రమే అని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నామలైపై ఎదురు దాడికి దిగారు. సాక్షి, చైన్నె: గత కొద్ది రోజులుగా పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు అవసరమా..? అనే అంశాన్ని అన్నాడీఎంకే ఇప్పటికే తీవ్రంగా చర్చిస్తోంది. అయితే, జాతీయ స్థాయి పార్టీ కావడంతో ఆచీ తూచీగా స్పందిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చైన్నెలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా మారాయనే ప్రచారం సాగుతోంది. వైరల్ అవుతున్న కటీఫ్ వ్యాఖ్యలు చైన్నెలో శనివారం జరిగిన పార్టీ కార్యాక్రమంలో అన్నామలై అన్నాడీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని చానళ్లలో జోరుగా ప్రచారం సాగింది. అందులోని అంశాల మేరకు వివరాలు... రానున్న లోక్ పసభ ఎన్నికలకు బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీకి విరాళాల సేకరణ గురించి నేతలకు ఈ సమావేశంలో అన్నామలై నాయకులకు హితబోధ చేశారు. పార్టీ బలోపేతం దిశగా సాగుదామని పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవ్వరెవ్వరికో శాలువలు కప్పి కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. ద్రవిడ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పొత్తు ఎవరితో అనే నిర్ణయం మనమే తీసుకుందామని, ఒంటరిగా వెళ్లినప్పుడే బీజేపీ బలం ఏమిటో ద్రవిడ పార్టీలకు తెలియజేయగలమని అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకుంటే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతానని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీనికి కలిసి అన్ని వివరాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు బిజీ బీజీగా ఉంటానని, ఈ సమయంలో పార్టీ కేడర్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. అయితే, కూటమి విషయంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, కూటమి విషయాన్ని నిర్ణయించాల్సింది పార్టీ రాష్ట్ర విభాగం కాదని, బీజేపీ అధిష్టానం అనే విషయాన్ని అన్నామలై గుర్తంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలోని కొందరు నేతలు అన్నామలై వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ సమావేశంలో జరిగిన చర్చ, అభిప్రాయాలు, వ్యాఖ్యలను బయటకు వెళ్లగక్కి ఎవరో రాజకీయం చేస్తున్నట్లుందని విమర్శించారు. దీటుగా స్పందించిన పళణివర్గం.. న్నామలై వ్యాఖ్యలకు అన్నాడీఎంకే వర్గాలు దీటుగా స్పందించాయి. అన్నాడీఎంకే సీనియర్లు జయకుమార్, ఓఎస్ మణియన్ పేర్కొంటూ. రాష్ట్రంలో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఇతర పార్టీలు ఉంటాయనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. ఎవరికి వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని, అలా పెట్టే ప్రసక్తి కూడా లేదని తేల్చిచెప్పారు. -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
తమిళనాట బిగ్ ట్విస్ట్.. బీజేపీకి షాక్ తప్పదా?
చెన్నై: రసవత్తరంగా సాగుతున్న తమిళనాట రాజకీయంలో.. నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉంటుందా? గుడ్బై చెప్పేస్తుందా? అనేది తేలనుంది. ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక.. ఈ రెండు పార్టీల మధ్య రాజేసిన చిచ్చు ఏ క్షణాన అయినా ఉవ్వెత్తున్న ఎగసేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమిలో భాగమైన అన్నాడీఎంకే.. బీజేపీ ప్రాధాన్యత తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఎక్కడా మిత్రపక్ష బీజేపీ ప్రస్తావనగానీ, చివరికి నరేంద్ర మోదీ ఫొటోగానీ లేకుండా చూసుకుంది. అంతేకాదు ఎన్డీయే(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) బదులు.. నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరును హైలైట్ చేసింది. అయితే.. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. ‘సరైన బదులు ఇవ్వాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించగా.. వెంటనే కూటమి పేరును మార్చేస్తూ మరో ప్రకటన విడుదల అయ్యింది. కానీ, పోస్టర్లను మాత్రం సరిదిద్దలేదు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అయితే.. పోస్టర్ల పరిణామంపై అన్నాడీఎంకే నేత ఒకరు స్పందించారు. పళనిస్వామి బీజేపీకి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వదల్చుకున్నారు. తమిళనాడులో వాళ్ల(బీజేపీ) వాళ్ల స్థానం ఎక్కడ ఉందో గుర్తించాలి అని వ్యాఖ్యానించారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో.. బీజేపీకి ఉంది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం తామే అన్నచందాన వ్యవహరిస్తూ వస్తోంది బీజేపీ. గత ఏడాదిన్నర కాలంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. పైగా ఈపీఎస్-ఓపీఎస్ గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను అన్నాడీఎంకే తీవ్రంగా పరిగణించినట్లు స్పష్టమవుతోంది. సంకీర్ణ ధర్మాన్ని పక్కనపెడుతున్న కమలం పార్టీని.. దూరంగా పెట్టడమే మంచిదన్న యోచనలో రెండాకుల పార్టీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటికి తోడు.. దివంగత నేత జయలలిత గతంలో ఏనాడూ బీజేపీతో జట్టు కట్టాలని చూడలేదు. అయితే.. ఆమె మరణాంతరం పన్నీర్ సెల్వం-పళని స్వామి నేతృత్వంలో పార్టీ.. అమ్మ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి బీజేపీకి చేతులు కలిపింది. ఫలితంగా.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం చెందింది. బీజేపీతో ఉండడం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందనే భావనలో ఉంది అన్నాడీఎంకే. అందుకే నెమ్మదిగా దూరం జరగాలని యత్నిస్తోంది. ఇంతేకాదు.. కోర్టు తీర్పుతో పళనిస్వామి పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో అందుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఇప్పటికే బీజేపీ మద్ధతు కోరగా.. అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పళనిస్వామి ఈరోడ్(ఈస్ట్) ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన రాజకీయ బలం ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసును అభినందిస్తున్న పళనిస్వామి, తదితరులు ఇదిలా ఉంటే.. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ ఈవీకేఎస్ ఇలంగోవన్ తనయుడు తిరుమహాన్ ఈవెరా మరణంతో ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార డీఎంకే.. కాంగ్రెస్ దిగ్గజం ఈవీకేఎస్ ఇలంగోవన్ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి పేరును సైతం పరిశీలనలో ఉంచింది కూడా. ఈలోపు బీజేపీ మరో మిత్రపక్షం తమిళ్ మానిల కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేయగా.. ఇప్పుడు అన్నాడీంకే సైతం అభ్యర్థిని(అభ్యర్థులను.. ఈపీఎస్ వర్గం మాజీ ఎమ్మెల్యే తెన్నరసు , ఓపీఎస్ వర్గం సెంథిల్ మురుగన్) బరిలో దించడం బీజేపీకి మింగుడు పడనివ్వడం లేదు. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గుతుందా?.. ఒకవేళ.. అధిష్టానం సూచనలతో తమిళనాడు బీజేపీ ఉప ఎన్నిక కోసం నేడు అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం.. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు కథ కంచికి చేరినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాత్రం ఈ పరిణామాలపై భిన్నంగా స్పందించారు. అభ్యర్థి ఎంపిక మిత్రపక్షం చేసిన పొరపాటు చర్య. ఒకసారి సర్దకుంటే.. వాళ్లే పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మా మధ్య వైరానికి ఎలాంటి కారణం లేదు అని పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే గురువారం నాటి పరిణామాలే.. తమిళనాట రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. -
మహిళా ద్వేషికి జెడ్ కేటగిరీ భద్రతా?: గాయత్రి రఘురాం ఫైర్
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో మహిళలకు ఎక్కడ భద్రత ఉందో..? తాను తండ్రిగా భావించే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మహిళా నేత, సినీ నటి గాయత్రి రఘురాం వ్యాఖ్యానించారు. మహిళలను అవమాన పరిచే జోకర్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న విమర్శల గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మహిళ నేత, సినీ నటి గాయత్రి రఘురాం అధ్యక్షుడికి వ్యతిరేకంగా తరచూ తీవ్ర వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ వస్తున్నారు. తాజాగా అధ్యక్షుడు అన్నామలైకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ఇందులో తనను తీవ్రంగా అవమానపరిచి, అత్యంత నీచాతి నీచంగా తనతో వ్యవహరించిన అధ్యక్షుడికి జెడ్ కేటగిరీ భద్రత ఎందుకో..? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీలో మహిళ భద్రత సూపర్ అని ఎద్దేవా చేస్తూ, ప్రధాని నరేంద్రమోదీని తాను తండ్రిస్థానంలో చూస్తానని పేర్కొన్నారు. రాజకీయ జోకర్కు ఈ భద్రత అవసరమా..? అని విమర్శించారు. ఇలాంటి వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం శోచనీయమన్నారు. దూరంగా శాసన సభాపక్ష నేత.. అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ మద్దతు ఇచ్చారు. రామసేత వంతెనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై అందుకు భిన్నంగా మీడియాతో స్పందించారు. ఇది ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాలను ఈ విషయం స్పష్టం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తిరునల్వేలిలో జరిగిన సంక్రాంతి వేడుకలకు అన్నామలై హాజరైనా నయనార్ నాగేంద్రన్ దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. తిరునల్వేలి జిల్లాలో సీనియర్నేతగా నాగేంద్రన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారి తీసింది. -
తమిళనాడు: అన్నామలైకు జెడ్ కేటగిరి భద్రత
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్కేటగిరి భద్రతకు కేంద్రం ఆదేశించింది. ఆయనకు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులతో పాటు పది మంది సీఆర్పీఎఫ్ బృందంతో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. ఈయన కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ 2019లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. అయితే పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని రజనీకాంత్ విరమించుకోవడంతో వ్యవసాయం చేసుకుంటానని అన్నామలై ప్రకటించారు. చివరకు బీజేపీలో చేరారు. తొలుత కరూర్ జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయన్ను వరించింది. అప్పటి నుంచి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. సొంత పారీ్టలోనూ అన్నామలైకు వ్యతిరేకత ఉన్నా, వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. సీనియర్లందరిని పక్కన పెట్టి, యువతరానికి పెద్ద పీట వేస్తున్నారు. అధికార డీఎంకే, వారి మిత్రపక్షాలతో వైర్యం పెంచుకోవడమే కాకుండా నిత్యం మాటల తూటాలను పేల్చుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పరిణామాలతో భద్రత పెంపు ఇటీవల బీజేపీతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అన్నామలైకు భద్రత కల్పించాల్సిన అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించే విధంగా కేంద్రం శుక్రవారం ఆదేశించింది. ఆయనకు భద్రతగా ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయించింది. అలాగే, పది మంది సీఆర్పీఎఫ్ బృందం నిత్యం భద్రతా విధుల్లో ఉండబోతోంది. ఇకపై తుపాకీ నీడలో అన్నామలై పర్యటనలు జరగనున్నాయి. ఆయన భద్రతను కేంద్రం పర్యవేక్షించనుంది. -
'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్బై..
చెన్నై: తమిళ నటి గాయత్రి రఘురామ్ బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమళై సారథ్యంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సమాన హక్కులు లేవని ఆరోపించారు. భారమైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గాయత్రిని గతేడాది నవంబర్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నమళై. ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆమెను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని చెప్పారు. దీంతో రెండు నెలల తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. అనంతరం వరుస ట్వీట్లు చేశారు. హిందూ ధర్మం నా హృదయం, మనస్సాక్షిలో ఉంది. ఓ రాజకీయ పార్టీలో దీని కోసం వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. దీనికి బదులు గుడికి వెళ్లి దేవుడు, ధర్మం కోసం అన్వేషిస్తాన. భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. నాతోనూ ఉన్నాడు. న్యాయం ఆలస్యం చేస్తే, న్యాయాన్ని నిరాకరించినట్లే. అని గాయత్రి ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రజాప్రతినిధుల భావప్రకటన స్వేచ్ఛ.. కీలక తీర్పు -
బీజేపీ మహిళా లీడర్పై అసభ్యకర వ్యాఖ్యలు.. కాషాయ నేతపై వేటు
తమిళనాడుకు చెందిన బీజేపీ నేత.. తమ పార్టీకి చెందిన మహిళా నేతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా లైంగికంగా వేధించే కామెంట్స్ చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం సదరు నేతపై సీరియస్ అయ్యింది. బీజేపీ నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్ర ఓబీసీ విభాగం బీజేపీ నాయకుడు సూర్య శివ, ఆ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు డైసీ సరన్పై ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను నరికేందుకు గుండాలను పంపుతానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అనంతరం, ఆమె ప్రైవేట్ భాగాలు కోసి మెరీనా బీచ్లో పడేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా శృతిమించిపోయి ఆమెపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు కూడా చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహరంపై రంగంలోకి దిగిన బీజేపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వీరిద్దరినీ కమిటీ ముందుకు పిలిచి వారి మధ్య రాజీ కుదిర్చింది. ఈ క్రమంలోనే సూర్య శివకు షాకిచ్చింది. బీజేపీ క్రమ శిక్షణా చర్యల్లో భాగంగా సూర్య శివను ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, డీఎంకే సీనియర్ నేత, ఎంపీ తిరుచ్చి శివ కుమారుడే సూర్య శివ. ఇక, సూర్య శివ ఈ ఏడాది మేలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతలోనే ఇలా కామెంట్స్ చేయడంతో బీజేపీ వేటు వేసింది. అయితే, సస్పెండైన సూర్య శివ పార్టీ వాలంటీర్గా కొనసాగవచ్చని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సూచించారు. ఈ క్రమంలో శివ ప్రవర్తనలో మార్పు కనిపిస్తే తిరిగి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. Tamil Nadu BJP's OBC wing leader Surya Siva has been suspended from all party posts for 6 months. (@PramodMadhav6) #TamilNadu #News https://t.co/mGmymGzVZP — IndiaToday (@IndiaToday) November 25, 2022 -
బీజేపీలో చేరిన భారత తొలి మహిళా రేసర్
భారత తొలి మహిళా రేసింగ్ నేషనల్ ఛాంపియన్ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన అలీషా.. శనివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. బీజేపీ కుటుంబంలో చేరినందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర బీజేపీ బాస్ అన్నామలై కుప్పుస్వామి, అమర్ ప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు తాను పార్టీలో చేరానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. I’m happy to be apart of @BJP4TamilNadu family The reason I wanted to be apart of BJP is because of the recognition and respect @annamalai_kuppusamy sir and @amarprasadreddyofficial has 4me. I promise to do my best to uplift more women❤️🙏🏻 pic.twitter.com/ZP73A0So5p — Alisha abdullah (@alishaabdullah) September 3, 2022 తమ పిలుపు మేరకు అలీషా పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని కలిగించిందని.. అలీషా చేరిక తమిళనాడు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నామలై, అమర్ ప్రసాద్ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అలీషా.. పురుషాధిపత్యం కలిగిన రేసింగ్ క్రీడలో విశేషంగా రాణించి భారత తొలి నేషనల్ రేసింగ్ ఛాంపియన్గా నిలిచింది. Very happy to welcome a true sporting icon & fabulous competitive racer, Selvi @alishaabdullah to @BJP4TamilNadu today. An inspiring woman who had broken barriers in a sport dominated by men, she has left an indelible mark in her chosen racing career. (1/2) pic.twitter.com/TpNSjompVm — K.Annamalai (@annamalai_k) September 3, 2022 చదవండి: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం -
మహిళను కొట్టిన మంత్రి! రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి కేకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఓ మహిళను కొట్టారని ఆరోపిస్తూ ట్విట్టర్లో వీడియో షేర్ చేసింది బీజేపీ. పేదలు, మహిళలు అంటే అధికార డీఎంకేకు గౌరవం లేదని ధ్వజమెత్తింది. ప్రజలు డీఎంకేకు ఏమైనా బానిసలా అని ప్రశ్నించింది. మహిళను కొట్టిన మంత్రి 48 గంటల్లోగా రాజీనామా చేయాలని, లేదంటే ఆయన ఇల్లును దిగ్బంధిస్తామని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై హెచ్చరించారు. மக்கள் என்ன உங்கள் அடிமைகளா? விருதுநகர்,பாலவனத்தம் கிராமத்தில் தீர்வு தேடி வந்த ஏழைத்தாயை அடித்த @arivalayam அமைச்சர் KKSSR ராமச்சந்திரன் அடுத்த 48 மணி நேரத்திற்குள் அமைச்சர் பதவி விலக வேண்டும் அல்லது அவரது வீட்டை @BJP4TamilNadu முற்றுகையிடும் என்பதைத் தெரிவித்துக் கொள்கிறோம்! pic.twitter.com/iV4fyKLnXQ — K.Annamalai (@annamalai_k) July 12, 2022 అన్నామలై షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మరొకరితో మాట్లాడుతున్న ఆయన.. చేతిలో ఉన్న కాగితాలతో మహిళ తలపై కొట్టాడు. పలవనాథం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దీన్నే ఆధారంగా చూపిన బీజేపీ.. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించింది. అయితే మంత్రి రామచంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ మహిళ తనకు బంధువు అవుతుందని పేర్కొన్నారు. ఆమెను కొట్టలేదని, కాగితాలు మాత్రమే తాకాయని చెప్పారు. పింఛను సమస్య కోసమే ఆ మహిళ తనను కలిసేందుకు వచ్చిందని వివరించారు. దీన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
అన్నాడీఎంకేకు ఘోర అవమానం.. జోష్లో బీజేపీ!
తమిళనాడు అర్బన్ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం అగుపించింది. చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది(ఇప్పటికే ఒక స్థానం గెల్చుకుంది). #LocalBodyElections2022 - #Chennai Result updates! pic.twitter.com/dUqWp4h0G9 — Greater Chennai Corporation (@chennaicorp) February 22, 2022 ఇక ఈ ఫలితాలు బీజేపీలో జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే అయినా.. తమిళనాట పాగా వేయాలన్న ప్రయత్నాలకు కాస్తైనా మార్గం సుగమం అయ్యిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై స్పందిస్తూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్ని వర్ణించాడు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నాడు అన్నామలై. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై. -
నీట్ ఎగ్జామ్: బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి.. .రౌడీ షీటర్ అరెస్ట్!!
చెన్నై(తమిళనాడు): టీ నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్పై పెట్రోల్ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్ ఒక రౌడీ షీటర్ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా.. నీట్పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్పై రౌడీ షీట్ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్ డీసీపీ హరి చెబుతున్నారు. -
రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం
పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి. సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు. గత కొద్దిరోజులుగా.. తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. చర్చలు విఫలం.. కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది. తుది ఆఫర్గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు. తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు. -
సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం
చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే) 'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు. బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్పై వేటు) -
పదవుల పందేరం... ఆ జిల్లాల నేతలకు అవకాశాలు!
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కొత్త అధ్యక్షుడు అన్నామలై నిమగ్నమై ఉన్నారు. 50 శాతం మేరకు పదవుల్లో మార్పులు తథ్యం అని కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్ర బీజేపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన ఎల్. మురుగన్ అనూహ్యంగా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆయన స్థానంలో పార్టీలో చేరిన నెలల వ్యవధిలో కొత్త అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై నియమితులయ్యారు. ఈ మేరకు తనదైన శైలిలో పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులు కీలకంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల కసరత్తుల్లో భాగంగా సోమవారం మరోమారు తొమ్మిది జిల్లాల నాయకులతో సమావేశానికి అన్నామలై నిర్ణయించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మేరకు గెలిచిన నియోజకవర్గాలైన తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, ఈరోడ్ జిల్లాలకు పార్టీ తరపున ఇన్నోవా కార్లను ఆదివారం పంపిణీ చేయడం విశేషం. పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించిన ఈ జిల్లాలకు చెందిన కొందరు నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: డీఎంకే నాయకుడి హత్య -
బీజేపీ బెస్ట్ అనిపిస్తా.. నమ్మకం నిలబెట్టుకుంటా: అన్నామలై
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నలుగురు సభ్యులతో బీజేపీ అడుగుపెట్టింది, రాబో యే రోజుల్లో పార్టీని తదుపరి ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కే అన్నామలై అన్నారు. తనపై ఎంతో విశ్వాసంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన పదవికి రాజీనామా చేసి గత ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో... పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఎల్ మురుగన్కు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో అన్నామలై నియమితులయ్యారు. పార్టీలో చేరిన కొద్దినెలలకే రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందిన అన్నామలై కేంద్రమంత్రి ఎల్ మురుగన్, బీజేపీ హైకమాండ్ తమిళనాడు ఇన్చార్జ్ సీటీ రవి, కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, సీనియర్ నేతలు హెచ్ రాజా, ఇలగణేశన్, బీజేపీ శాసనసభాపక్ష నేత నయనార్ నాగేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థుల మేలుకోరే నీట్ ప్రవేశపరీక్షను కేంద్రం అమలు చేస్తోంది. లక్షలు, కోట్ల రూపాయలు చెల్లించి వైద్య విద్యలో చేరే పరిస్థితి నుంచి తప్పించి మేలు చేసేందుకే నీట్ ప్రవేశపరీక్ష. పేద, గ్రామీణ విద్యార్థులకు నీట్ ఒక వరప్రసాదం. ఈ సత్యాన్ని ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రచారం చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ సరఫరాలో కేంద్రం సమభావం ప్రదర్శిస్తోంది. రాష్ట్రాలపై పక్షపాత వైఖరిని ప్రదర్శించడం లేదు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ సరఫరా సాగుతోందేగానీ వివక్ష లేదు’’ అని అన్నారు. తమిళనాడుకు అదనంగా వ్యాక్సిన్ కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. పొంగులేటి పుస్తకావిష్కరణ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడేళ్ల కాలంలో తమిళనాడుకు కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మేలుపై బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి తమిళ, ఇంగ్లిషు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని అన్నామలై చేతుల మీదుగా ఆవిష్కరించారు. -
‘ఆరు నెలల్లో చెప్పుచేతల్లోకి మీడియా!’.. తీవ్ర దుమారం
తమిళనాడు బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆరు నెలల్లోగా మీడియా మొత్తం పార్టీ చెప్పుచేతల్లోకి వచ్చేస్తోందని ఈ యువ నేత చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తోంది. చెన్నై: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. కాబట్టి, ఎవరూ బాధపడకండి. నిరాధారమైన వార్తలు ఎల్లకాలం మనల్ని ఇబ్బంది పెట్టలేవు. మన పార్టీ మాజీ అధ్యక్షుడు.. సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని మీడియా హౌజ్లు ఇక ఆయన కిందే ఉంటాయి. తప్పులు ఎల్లకాలం జరగవు. వాటితో ఎల్లకాలం మీరు రాజకీయాలు చేయలేరు’ అంటూ అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి సర్క్యూలేట్ అయ్యింది. అన్నామలైని పార్టీ ఛీప్గా నియమించాక.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి పార్టీ కేడర్తో చేరుకున్నాడు. కరోనా టైంలో ఈ టూర్ అధికారులకు పెద్ద తలనొప్పి అయ్యింది. దీంతో మీడియా హౌజ్లు ఈ యువ నేత పర్యటన మీద విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. అయితే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. రాబోయే ఆరు నెలల్లో మీడియా మన చేతికి వస్తుందని ఆ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు అన్నామలై. తమిళనాడు బీజేపీ ఛీఫ్గా పని చేసిన ఎల్ మురుగన్.. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో సమాచార ప్రసార మంత్రిగా(మినిస్టర్ ఆఫ్ స్టేట్-డిప్యూటీ హోదా)గా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యాన్ని ఊటంకిస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్నామలై. @BJP4TamilNadu new president @annamalai_k on taking control of the media in the state. During his first tour to reach chennai #Annamalai says his predecessor @Murugan_MoS was given the I and B portfolio only to take control of the media @TheWeekLive pic.twitter.com/VFL7rpaTpZ — Lakshmi Subramanian (@lakhinathan) July 15, 2021 ఇక ఈ కామెంట్లను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో త్యాగరాజన్ ఖండించాడు. అన్నామలైవి పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డాడు. మీడియా ఏ ఒక్క పార్టీ సొత్తో కాదని, ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు రావడంతో.. అన్నామలై స్పందించాడు. తాను ‘ఫేక్ న్యూస్ కట్టడి’, రాబోతున్న ఐటీ యాక్ట్ గురించి ఉద్దేశించి అలా మాట్లాడనని.. మీడియాను పార్టీ నియంత్రిస్తుందన్న కోణంలో తాను మాట్లాడలేదని అన్నామలై స్పష్టం చేశాడు. ట్విటర్ ట్రెండ్లో యువరక్తం తమిళనాడు కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై.. మెకానికల్ ఇంజినీరింగ్, లక్నో ఐఐఎంలో ఎంబీఏ చదివాడు. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన కర్ణాటకలో ఆయన విధులు నిర్వహించినప్పుడు ‘సింగం’గా పేరుండేది. 2018-19 టైంలో కీలక బాధ్యతలు చేపట్టాడు కూడా. అయితే అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరాడు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అయితే యువ రక్తం కావడం, జనాల్లో క్రేజ్ ఉండడంతో 37 ఏళ్లకే బీజేపీ అతన్ని పార్టీ ఛీఫ్గా నియమించింది. ఈయనకి ఉన్న క్రేజ్ ఎట్లాంటిదంటే.. ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ‘తమిళనాడు కోసం అన్నామలై’ #Annamali4TN హ్యాష్ట్యాగ్ ట్విటర్ టాప్లో కొనసాగుతోంది. -
కొండపై జారిపడ్డ హైదరాబాద్ యువకుడు
తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ మహాకొండపై హైదరాబాద్కు చెందిన యువకుడు కాలుజారి పడిపోయాడు. హైదరాబాద్కు చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు తరుణ్ (24) 8వ తేదీన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాడు. కందాశ్రమం దారిలో మహాకొండగా భావించే 2,666 అడుగుల ఎత్తుగల కొండపైకి ఎక్కాడు. అన్నామలై ప్రాంతంలో ప్రమాదవశాత్తూ కాలుజారి పల్లంలో పడిపోయాడు. ప్రమాదంలో తరుణ్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ నుంచి రాలేక.. 2 రాత్రులు, పగలు పూర్తిగా అక్కడే ఉండిపోయాడు. అనంతరం కాలు కొంత సహకరించడం, సెల్ఫోన్ సిగ్నల్ అందడంతో అక్కడ నుంచి హైదరాబాద్లోని కుటుంబీకులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్ పోలీసులు మంగళవారం సమాచారం అందజేశారు. 20 మంది పోలీసులు తరుణ్ను గాలించి మంగళవారం సాయంత్రం బయటకు తీసుకొచ్చారు. -
సినీ గేయ రచయిత అన్నామలై ఇకలేరు
తమిళసినిమా: ప్రముఖ యువ సినీ గీతరచయిత అన్నామలై(49)మంగళవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నై పచ్చైయప్పన్ కళాశాల విద్యార్థి అయిన ఈయన అదే కళాశాలో కవితలు, గీతాలపై ఎంఫిల్ చేశారు. పీహెచ్డీ కూడా చేస్తున్నారు. టీవీ సీరియల్స్తో గీతరచయితగా తన పయనాన్ని ప్రారంభించిన అన్నామలై 50 సీరయళ్లకుపైగా పాటలు రాశారు. పలు కవితలను, భక్తిగీతాలను రాసిన ఈయన 1992లో విడుదలైన పుదువయల్ చిత్రం ద్వారా సినీ గీతరచయితగా పరిచయం అయ్యారు. నాంజల్ కెన్నడీ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో తన తొలి పాటను మనో, చిత్ర పాడారు. అన్నామలై 60 చిత్రాలకు పైగా పాటలు రాశారు. అందులో పలు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అన్నామలైకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది విజయ్ నటించిన వేట్టైక్కారన్ చిత్రంలోని ఎన్ ఉచ్చిమండైయిల్ చురుంగుదు అనే పాట. ప్రస్తుతం 20 చిత్రాలకు పైగా పాటలు రాస్తున్న అన్నామలై హఠాన్మరణం తమిళ చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలే మరణించిన గీతరచయిత నా.ముత్తుకుమార్ దుఃఖఛాయలు వీడక ముందే గుండెల్ని పిండే మరణ వార్తను చిత్రపరిశ్రమ వినాల్సివచ్చింది. అన్నామలై మృతి తమిళ చిత్రపరిశ్రకు తీరని లోటే అవుతుంది. ప్రముఖ సంగీతదర్శకులందరితోనూ అన్నామలై పని చేశారు. అదే విధంగా ప్రముఖ కథానాయకులందరికి పాటలు రాశారు. స్థానిక హారింగ్టన్ రోడ్డులో నివహిస్తున్న అన్నామలై మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాలుగేళ్ల పాప ఉన్నారు. అన్నామలై అంత్యక్రియలు బుదవారం జరిగాయి. ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. -
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది. తమిళంలో సత్య, భాషా, అన్నామలై, తెలుగులో ప్రేమ, మాస్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేశ్ కృష్ణ మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ కోసం వన్య మిశ్రాను ఎంపిక చేశాం. ఇటీవల ఫోటో షూట్ జరిగింది. తాను స్వంత బ్యానర్ లో నిర్మించే చిత్రంలోని పాత్రకు ఖచ్చితంగా సరిపోయే ఎనర్జీ, టాలెంట్ వన్యలో ఉన్నాయని సురేశ్ కృష్ణ తెలిపారు. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కథానాయకుడిగా కనిపించనున్నారు.


