Antarctica
-
భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!
సాహాసయాత్రలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్ ఎస్ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్ హార్న్ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. అంతేగాక ఈ మిషన్ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు. In persistent rains, Sea State 5, winds of 40kns (~75 kmph) and waves more than 5 metres, Lt Cdr Dilna K & Lt Cdr Roopa A, recorded their names in the annals of history by successfully crossing the #CapeHorn located at the southern tip of #SouthAmerica, while sailing on the third… pic.twitter.com/N1isyvHGMA— SpokespersonNavy (@indiannavy) February 15, 2025 (చదవండి: ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?) -
రూ. 31 లక్షలు ఖర్చుపెట్టి మరీ యూట్యూబర్ ప్రయోగం : ఎందుకో ఊహించలేరు
భూమి ఫ్లాట్గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.Lmao.Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun.""Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్నైట్ సన్ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు. "కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.ట్విస్ట్ ఏంటంటే...తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్గా ఉందని నమ్మే నలుగురు మిడ్నైట్ సన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు. ‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది. కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. -
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్గా నిలిచారు. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్లో పాల్గొన్న మారథాన్లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్డే (ప్రళయకాల) గ్లేసియర్గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం
నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్ అరుదైన ఘనత సాధించింది. అతి పెద్ద ప్యాసింజర్ విమానం బోయింగ్ 787ను అంటార్కిటికాలోని "బ్లూ ఐస్ రన్వే"పై సురక్షితంగా ల్యాండ్ చేసింది. నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం అంటార్కిటికాలోని ట్రోల్ ఎయిర్ఫీల్డ్లో దిగింది. 330 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల భారీ ఎయిర్క్రాఫ్ట్ అంటార్కిటికా ఖండానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. "నార్స్కి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. అంటార్కిటికాలో ల్యాండ్ అయిన మొట్టమొదటి బోయింగ్ 787 డ్రీమ్లైనర్. ఈ ఘనతతో నార్స్ ఓ మైలురాయిని చేరింది. ఇందుకు మేము గర్వంగా భావిస్తున్నాము" అని ఎయిర్లైన్స్ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. "ట్రోల్ ఎయిర్ఫీల్డ్లో దిగిన అతిపెద్ద విమానం. దీంతో ఒకేసారి ఎక్కువ మందిని అంటార్కిటికాకు తీసుకెళ్లగలమని భావిస్తున్నాం.' అని డైరెక్టర్ కెమిల్లా బ్రెక్కే చెప్పారు. ల్యాండింగ్కు సంబంధించిన వీడియోను జత చేస్తూ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ట్వీట్ చేసింది. Largest aircraft ever to land on #TrollAirfield! "This demonstrates our capability of performing more effective flight operations to #Antarctica by carrying a larger scientific/logistics crew, more cargo with a smaller environmental footprint", says NPI-director, Camilla Brekke, pic.twitter.com/7vjsSw0gPI — Norsk Polarinstitutt // Norwegian Polar Institute (@NorskPolar) November 16, 2023 అంటార్కిటికాలోని క్వీన్ మౌడ్ ల్యాండ్లోని రిమోట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్కు అవసరమైన పరిశోధన పరికరాలు, శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ఎయిర్లైన్ డ్రీమ్లైనర్ లక్ష్యం. అంటార్కిటిక్ అన్వేషణకు అవసరమైన 12 టన్నుల పరిశోధన పరికరాలను విమానంలో తీసుకెళ్లారు. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సహా మొత్తం 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో విమానం ల్యాండ్ చేయడం సవాలుతో కూడి ఉంటుంది. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్లో ఇంజినీర్గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్పోల్లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్పోల్కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్పోల్కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్పోల్లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికా కరిగిపోతోంది!
పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు! అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ విల్ హాబ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ తీరాలన్నీ మునకే! ♦ అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. ♦ పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్హసన్ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! ♦ పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్డే గ్లేసియర్’గా పిలుస్తారు! ♦ గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట రెండు వంతులు ఏ మాత్రం మంచు లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! ♦అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! ♦ దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. మున్ముందు మరింత ముప్పే! సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్స్కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ కుండబద్దలు కొట్టారు. అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్ వారి్మంగ్తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. కోల్కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ♦ సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. విశేషాలు... ♦ సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! ♦ అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ♦ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. -
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్బెర్గ్లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ప్రపంచ శిఖరాగ్రాలపై ‘నవరత్నాలు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలపై రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాల’ జెండాను విశాఖపట్నం యువకుడు భూపతిరాజు అన్మిష్వర్మ ఎగురవేశాడు. మార్షల్స్లో ప్రపంచ పతకాలు సాధించిన అన్మిష్వర్మ 2020 నుంచి ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించాడు. గత రెండేళ్లలో ఆఫ్రికాలోని కిలిమంజారో, సౌత్ అమెరికాలోని అకాంకోగోవా, నేపాల్లోని ఎవరెస్ట్, యూరప్లోని ఎల్బ్రూస్, నార్త్ అమెరికాలోని డెనాలి, ఆస్ట్రేలియాలోని కొసియస్కో పర్వతాలను అధిరోహించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల జెండాను ఎగురవేశాడు. తాజాగా ఈ ఏడాది జనవరి 22న అంటార్కిటాలోని విన్షన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాల జెండాను ఎగురవేశాడు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకుగాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపే బ్యానర్లను ప్రదర్శించాడు. లండన్, చెక్ రిపబ్లిక్, అమెరికాకు చెందిన ముగ్గురు పర్వతారోహకులతో కలిసి అన్మిష్వర్మ ఈ పర్వతాన్ని అధిరోహించాడు. అన్మిష్వర్మ తండ్రి వేణుగోపాలరాజు మిలటరీలో పనిచేశారు. తల్లి సత్యవేణి గృహిణి. విశాఖపట్నంలోని బిట్స్ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేసిన అన్మిష్వర్మ ఇప్పటివరకు దేశానికి రెండు ప్రపంచ పతకాలను అందించాడు. తాజాగా ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. -
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెపలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్కు చేరుకున్నారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్ 7వ తేదీన యూరప్లోని ఎల్బ్రోస్ పర్వతాలను ఎక్కారు. -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
మంచు ఖండం అంటార్కిటికాలో పాగా వేసేందుకు అర్జెంటీనా, చిలీ మాస్టర్ ప్లాన్..!
అంటార్కిటికా అంటేనే మంచు ఖండం.. మైనస్ ఉష్ణోగ్రతలు.. కాసేపు బయట ఉంటే మనుషులూ గడ్డకట్టుకుపోయేంత దుర్భర వాతావరణం. అలాంటి అంటార్కిటికాలో ఇప్పటివరకు 11 మంది పిల్లలు పుట్టారు. భేషుగ్గా బతికేస్తున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉన్నవి పరిశోధనా కేంద్రాలే.. భూమ్మీద అన్ని ఖండాలు మనుషులతో నిండి ఉన్నా.. ఒక్క అంటార్కిటికాలో ఎలాంటి శాశ్వత నివాసాల్లేవు. కొన్నిదేశాలు వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్లిష్టమైన వాతావరణం కారణంగా.. ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలానికే తిరిగి వచ్చేస్తుంటారు. వేరే వాళ్లు వెళ్తుంటారు. అంతేతప్ప అంటార్కిటికాలో మానవ శాశ్వత నివాసాలేమీ లేవు. అంటార్కిటికా తమదేనంటూ.. నిజానికి అంటార్కిటికా ఖండం ఏ దేశానికీ చెందినది కాదు. కానీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, యూకే వంటి పలు దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమవేనంటూ వాటికవే ప్రకటించుకున్నాయి. దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఏమీ లేదు. మంచు ఖండంలోని ఏ ప్రాంతంలోకి ఏ దేశమైనా వెళ్లి పరిశోధనా కేంద్రాలు పెట్టుకోవచ్చు. శాస్త్రవేత్తలు, సిబ్బంది వెళ్లవచ్చు. అయినా కొన్ని దేశాలు వెనక్కి తగ్గలేదు. మిగతా దేశాలతో పోలిస్తే మంచు ఖండానికి దగ్గరగా ఉన్న చిలీ, అర్జెంటీనా, యూకేలు (ఫాక్లాండ్ దీవులు) అంటార్కిటికాపై ఎక్కువ దృష్టిపెట్టాయి. ఈ మూడు దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతం చాలావరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరి ‘పోరు’తో.. 1970వ దశకంలో అర్జెంటీనా పాలకుడు జార్జ్ రఫీల్ విడెలా, చిలీ అధినేత అగస్టో పినోచెట్ ఇద్దరూ అంటార్కిటికాలోని ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. అంటార్కిటికాలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని, జీవించడం చాలా కష్టం. అందుకే తెలివిగా చిత్రమైన ప్లాన్ వేశారు. తమ పౌరులు జన్మించిన ప్రాంతం తమదేనని చెప్పుకొనేందుకు వీలవుతుందని భావించారు. ఇందుకోసం అంటార్కిటికాలో తమ దేశవాసులు పిల్లల్ని కనే ఏర్పాట్లు చేశారు. క్లిష్టమైనా.. అంతా సేఫ్.. అంటార్కిటికాలో అసలే అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు. రాకపోకలు చాలా కష్టం.. డెలివరీ సమయంలో ఏదైనా తేడా వస్తే అవసరమైన వైద్య సదుపాయాలూ ఉండవు. అయినా ఆ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరగడం, పుట్టిన 11 మంది శిశువులు ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం గమనార్హం. 1978 జనవరిలో ‘తొలి’ జననం! 1977 మొదట్లో చిలీ అధినేత పినోచెట్ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తమ దేశ పరిశోధన కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి.. ఆయా ప్రాంతాలు తమవేనని ప్రకటించారు. ►మరోవైపు అర్జెంటీనా అదే ఏడాది చివరిలో సిల్వియా మొరెల్లో డి పాల్మా అనే ఏడు నెలల గర్భిణిని అంటార్కిటికాలోని తమ ఎస్పరాంజా బేస్కు పంపింది. ఆమె 1978 జనవరి 7న ప్రసవించింది. ఇదే అంటార్కిటికా ఖండంలో తొలి శిశువు జననం. ►చిలీ అయితే మరో అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లయిన జంటను అంటార్కిటికాలోని తమ బేస్కు పంపింది. వారు అక్కడే కాపురం చేసి, పిల్లలను కన్నారు. ►తర్వాత కూడా ఇది కొనసాగింది. ఇరుదేశాలు పెళ్లయిన జంటలు, గర్భిణులను అంటార్కిటికాలోని తమ బేస్లకు తరలించాయి. ఇలా కొన్నేళ్లలో మొత్తంగా 11 మంది అంటార్కిటికాలో పుట్టారు. ►అయితే అర్జెంటీనా, చిలీల ప్రయత్నాలను ప్రపంచ దేశాలు తప్పుపట్టడం, మంచు ఖండంపై ఏ దేశానికీ హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా అంటార్కిటికాలో ఇలా పిల్లలను కనేలా చేయడం వంటి ప్రయత్నాలు చేయలేదు. -
అతిపెద్ద ఐస్బర్గ్ అంతర్ధానం!
వాషింగ్టన్: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్బర్గ్ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్బర్గ్ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్బర్గ్లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్బర్గ్ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్ హార్న్కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవులు, ఎలిఫెంట్ దీవులకు మధ్యలోని డ్రేక్ పాసేజీలో ఉంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్బర్గ్లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్ ప్రవాహాలు డ్రేక్ పాసేజ్ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే?
అక్కడి జలపాతాన్ని చూస్తే, అక్కడేదో రక్తపాతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఎర్రని రక్తధారల్లా నీరు ఉరకలేస్తూ ఉంటుంది. చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నీటి మధ్య వెడల్పాటి నెత్తుటి చారికలా కనిపిస్తుంది. ఈ రక్తజలపాతం అంటార్కిటికాలో ఉంది. టేలర్ వ్యాలీ వరకు విమానంలో చేరుకుని, ఇక్కడకు పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అంటార్కిటికా మంచుకొండల మీదుగా ఈ జలపాతం ఉరుకుతున్న దృశ్యం సందర్శకులను గగుర్పాటుకు గురిచేస్తుంది. అరుదైన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఔత్సాహిక పర్వతారోహకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి నీటిలో ఇనుము సాంద్రత ఎక్కువగా ఉండి, ఆ ఇనుము ఉప్పునీటి కారణంగా తుప్పుపట్టడం వల్ల జలపాతం మధ్యలో నీరు ఎర్రగా మారుతోందని అలాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలపాతాన్ని చూడటానికి ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు అనుకూలమైన కాలం. ఈ కాలంలోనే సాహస ప్రవృత్తిగల పర్యాటకులు దేశ దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. చదవండి: VenkampalliL: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్ను తినేసే కృత్రిమ ఎంజైమ్లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్ను తినేసే ఎంజైమ్ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్సెప్టర్కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా
సాక్షి, హైదరాబాద్: పర్యా వరణ హితాన్ని కోరుతూ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ, కర్బన ఉద్ఘారాలు తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా వలంటీర్కు స్థానం దక్కింది. పర్యావరణ మార్పులపై 35 దేశాలకు చెందిన 150 మంది సభ్యుల బృందం చేపట్టిన అధ్యయనంలో భాగంగా గ్రీన్ఇండియా అంటార్కిటికాకు ప్రయాణించింది. ఫౌండేషన్–2041 నెలకొల్పి పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్ను అక్కడ గ్రీన్ ఇండియా వాలంటీర్ కలిశారు. తమ ఉద్యమం తీరును వివరించారు. దీన్ని ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అభినందించారు. -
20 లక్షల ఏళ్లుగా వాన పడలే.. ఎక్కడో తెలుసా!
భూమ్మీద వందలు, వేల ఏళ్లుగా వాన అనేదే లేకుండా, పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఏముందీ.. ఏ సహారా ఎడారో, మరో ఎడారో అయి ఉంటుందిలే అనిపిస్తోందా? అస్సలు కాదు.. ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి ‘కరువు’ ప్రాంతం ఉంది. చలితో గజగజ వణికిపోతున్న ఈ శీతాకాలంలో.. ఆ చలి ఖండంలోని చిత్రమైన ప్రాంతం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మంచు మధ్య ‘కరువు’! భూమి దక్షిణ ధ్రువంలో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉండటం గమనార్హం. మంచును కొండలు పట్టేసి.. నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే. అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి ఎగుస్తాయి. అక్కడి అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటినే ‘కాటబాటిక్ విండ్స్’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. ఉప్పునీటి సరస్సులతో.. డ్రైవ్యాలీస్గా పిలిచే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలా ఉప్పునీటి సరస్సులు ఉండటం మరో వింత కూడా. అక్కడక్కడా ‘మమ్మీ’లు కూడా.. సమీపంలోని సముద్రం నుంచో, మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్లోకి వచ్చిన సీల్ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు పెద్దగా చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు. రెండోస్థానంలో అటకామా ఎడారి అంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే అది తక్కువ. -
లెక్కచేయలేదు.. లెక్కచెప్పింది..
మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు... లెక్కచేయలేదు. ఎముకలు కొరికే అత్యంత చల్లటి గాలులు... లెక్కచేయలేదు. వేల మైళ్ల ప్రయాణంలో తోడు ఎవరూ ఉండరు... లెక్కచేయలేదు. 40 రోజుల్లో అంటార్కిటికా దక్షిణ ధ్రువ యాత్రను ఒంటరిగా పూర్తి చేసి లెక్క చెప్పింది ‘700 మైళ్లు ప్రయాణించాను’ అని. ‘నేను గాజు పైకప్పును పగులకొట్టాలనుకోలేదు, దానిని మిలియన్ల ముక్కలు చేయాలనుకున్నాను’ అని సగర్వంగా చాటింది. మొక్కవోని ధైర్యంతో వజ్రంలా మెరిసింది. ‘సైనికుల దృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ చాందీ’ అంటూ బ్రిటిష్ ఆర్మీ ఆమెకు అభినందనలు తెలియజేసింది. బ్రిటిష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ అంటార్కిటికా దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ప్రయాణించిన భార త సంతతికి చెందిన తొలి మహిళ. ఆమె యాత్ర కిందటేడాది నవంబర్లో ప్రారంభమై 700 మైళ్లు అంటే సుమారు 1,127 కిలోమీటర్లు 40 రోజుల పాటు కొనసాగింది. మొన్నటి సోమవారం తన లైవ్ బ్లాగ్లో చరిత్ర సృష్టించిన ఘనతను ప్రకటించింది. తెలియని ప్రపంచంలోకి... 32 ఏళ్ల కెప్టెన్ హర్ప్రీత్ చాందీ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో గాలి వేగంతో పోరాడుతూ, తనకు అవసరమైనవన్నీ ఉంచిన స్లెడ్జ్ను లాగుతూ దక్షిణ ధ్రువంలో వందల మైళ్లు ప్రయాణించింది. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. ప్రస్తుతం చాలా భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటిది, ఇక్కడ ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టం. నేను విజేతగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆమె బ్లాగులో రాసింది. సరిహద్దులను దాటాలి ‘ఈ యాత్ర సాధారణమైనది కాదు, ఎంతో పెద్దది, ఊహకు కూడా అందనిది. ప్రజలు తమ సరిహద్దులను దాటడానికి తమని తాము నమ్మాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడానికే నా ఈ ప్రయాణం. మీరు నన్ను తిరుగుబాటుదారుని అని ముద్ర వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాలలో ఈ సాహసం ‘వద్దు’ అనే నాకు చాలా మంది చెప్పారు. ‘సాధారణం అనిపించే పనిని మాత్రమే చేయండి’ అన్నారు. కానీ, నేను నాదైన సాధారణాన్ని సృష్టిస్తాను’ అని చాందీ చెప్పారు. గాజు కప్పును పగలకొట్టేద్దాం తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఆమె తన ట్రెక్ లైవ్ ట్రాకింగ్ మ్యాప్ను అప్లోడ్ చేసింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో పోస్ట్ చేస్తూనే ఉంది. ‘40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో సోలో సాహస యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్ చివరి పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది. ‘మీకు కావల్సిన దేనినైనా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దానిని మిలియన్ ముక్కలుగా బద్దలు కొట్టాలనుకుంటున్నాను’ అని దృఢంగా వెలిబుచ్చిన పదాలు మన అందరినీ ఆలోచింపజేస్తాయి. వెడ్డింగ్ ప్లాన్ ఆమె తన సాహసయాత్రకు బయలుదేరే ముందు ఆర్మీ రిజర్విస్ట్ డేవిడ్ జర్మాన్తో నిశ్చితార్థం అయ్యింది. ఇంగ్లండ్కు తిరిగి వచ్చాక వివాహ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని చలిలోనే ఉపయోగించుకుంది. ఈ నెలాఖరులో ఆమె దక్షిణ ధ్రువం నుండి తిరిగి వచ్చాక ఈ జంట చిలీలో తిరిగి కలుస్తారని భావిస్తున్నారు. పోలార్ ప్రీత్ అంటూ అంతా పిలుచుకునే ప్రీత్ చాందీ వాయవ్య ఇంగ్లండ్లోని మెడికల్ రెజిమెంట్లో భాగంగా సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్గానూ శిక్షణ ఇస్తుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా. లండన్లోని క్వీన్ మెరీస్ యూనివర్శిటీలో పార్ట్టైమ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్ౖసైజ్ మెడిసిన్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేస్తోంది. స్లెడ్జ్కి ప్రత్యామ్నాయంగా పోలార్ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ శిక్షణ తీసుకుంది. స్లెడ్జ్లో కావల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్పోల్ మొత్తం ఇదే ప్రయాణం కొనసాగించింది. -
గ్లోబల్ ‘వార్నింగ్’.. మాయమైపోయిన మంచు!
ఈ చిత్రాలు చూడండి. పై చిత్రంలో కొండలు కనబడట్లేదు కానీ కింది చిత్రంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఆహ్లాదంగా, చూడముచ్చటగా ఉందనిపిస్తోంది కదా. చూడముచ్చట పక్కనబెడితే మున్ముందు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి ఇవి. పై చిత్రాన్ని దాదాపు 100 ఏళ్ల కిందట ఆర్కిటిక్లో తీశారు. అప్పుడు కొండలు కనబడనంతగా మంచు పేరుకుపోయి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఆనవాళ్లు కూడా లేవు. కొన్నేళ్లుగా పెరుగుతున్న భూతాపం వల్లే ఈ మంచంతా మాయమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్..) -
28 ట్రిలియన్ టన్నుల మంచు మాయం
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్ఞాలలో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరగే వేగం పెరిగిందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగేదని, 2017నాటికి ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ టన్నులకు చేరిందని ఈ అధ్యయనం తెలిపింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచు వేగంగా కరగడం కారణంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే వన్యప్రాణులకు నివాసంగా ఉండే సహజ ఆవాసాలను తుడిచిపెట్టే ప్రమాదం ఉంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ పతనానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా దారుణ పరిణామాలన్నీ క్రమంగా ప్రత్యక్షమవుతున్నాయి. అధ్యయనంలో వాతావరణంలో, మహాసముద్రాలలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుందని తెలుస్తుంది. -
అక్కడ తప్ప.. అంతా ‘కరోనా కల్లోల్లం’
న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) బాధితులు లక్షకు సమీపిస్తున్నారు. 2019, డిసెంబర్ 31వ తేదీన చైనాలో తొలి కేసు బయట పడగా, నేటికి ఒక్క అంటార్కిటికా మినహా ప్రతి ఖండానికి వైరస్ విస్తరించింది. భారత్లో రెండు కేసులు, అమెరికాలో 88 కేసులు నమోదవడం తాజా పరిణామం. మానవాళి సాధారణ జన జీవనంపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: హమ్మయ్య.. అతనికి వైరస్ లేదు) చైనా తర్వాత ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్ దేశాలను ఈ వైరస్ ఇప్పుడు ఎక్కువగా భయపెడుతోంది. ఇరాన్లో 1501 మంది వైరస్ బారిన పడగా 66 మంది మరణించారు. ఇటలీలో 1500 కేసులు నమోదు కాగా, 34 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 4,200 కేసులు నమోదుకాగా, 28 మంది మరణించారు. కొరియాలోని సియోల్ సహా పలు నగరాల్లోని పలు ఉత్పాదక కంపెనీలను మూసి వేశారు. ఇతర ఆఫీసులను మూసివేసి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించారు. బహిరంగ స్థలాల్లో ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. ఇటలీలో దేశవ్యాప్తంగా చర్చిల్లో ప్రార్థనలను అనుమతించడం లేదు. ప్రేక్షకులు లేకుండా సాకర్ పోటీలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పట్టణాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇటలీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలైన మిలన్లోని డ్యూమో, నవోనాలోని పియజ్జా, రోమ్లోని కలోసియంలో మాత్రం కొద్దిగా జన సంచారం కనిపిస్తోంది. ఫ్రాన్స్లో 178 కోవిడ్ కేసులు నమోదుకాగా నలుగురు చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్లోని లవ్రీ మ్యూజియంను మూసివేశారు. మ్యూజియంకు చెందిన 2300 మంది ఉద్యోగులు సెలవులపై ఇళ్లకు వెళ్లిపోయారు. మార్చి చివరలో జరగాల్సిన ‘పారిస్ బుక్ ఫేర్’ను రద్దు చేశారు. అవసరమైతే దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించేందుకు జపాన్ కొత్త చట్టం తీసుకొచ్చింది. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలను మూసివేసే అధికారం ఈ చట్టం కింద దేశ ప్రధానికి లభించింది. జపాన్లో 979 కేసులు నమోదుకాగా 18 మంది మరణించారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ఇప్పటి వరకు 81 వేల వైరస్ బాధితులు నమోదుకాగా, వారిలో 2,912 మంది మరణించారు. ఆ దేశంలో వైరస్ను నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. అయినప్పటికీ ఒక్క సోమవారం నాడే 220 కొత్త కేసులు నమోదు కావడం విచారకరం. (కరోనా అలర్ట్: ‘అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు’) -
భయం గొలిపే ఎరుపు రంగు మంచు!
సాధారణంగా మంచు తెల్లగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు ఎర్రని రక్తం రంగులోకి మారింది. అది చూసేవారికి భయం గొలిపేలా ఉంది. ఈ ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద దర్శనమిచ్చింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారినట్టు తెలుస్తోంది. ఈ ఎరుపు రంగులో ఉన్న మంచుకు సంబంధించిన ఫోటోలను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘షాక్కు గురి చేసే విధంగా ఎరుపు రంగులోకి మారిన అంటార్కిటికా మంచు.. వాతావరణ మార్పులు అరిష్టం అనే సంకేతాన్ని ఇస్తోంది. మంచుతో నిండిన ఈ ఖండం చట్టూ వాతావరణం వేడెక్కుతోంది’ అంటూ కాప్షన్ పెట్టారు. ఈ చిత్రాలను ఉక్రెయిన్ దేశ విద్యా, విజ్ఞాన మంత్రిత్వ శాఖ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంటార్కిటికా ఖండంలోని మంచు.. వేసవి కాలం ఆరంభ సమయంలో మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఎరుపు రంగులో ఉన్న మంచు చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై ‘అంటార్కిటికాలో ‘బ్లడ్ ఫాల్స్’ అనే నది ఉంది. ఇది క్రమం తప్పకుండా ఎర్రటి ద్రవంతో ప్రవహిస్తోంది. తెల్లని మంచుకు రక్త స్రావం అవుతున్నట్లు కనిపిస్తోంది. అది చల్లగా ఉంటుందా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఎరుపు రంగులోకి మారుతున్న మంచు -
‘ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు’
నేడు(జనవరి 24) జాతీయ బాలికల దీనోత్సవం. ఈ సందర్భంగా పర్వీన్ కాస్వాన్ అనే అటవీ అధికారి ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో మంగళ మణి అనే మహిళా ఫొటోను షేర్ చేస్తూ ఆమె సాధించిన ఘనతను గుర్తు చేశారు. అటవీ అధికారి షేర్ చేసిన ఫొటోని మహిళా పేరు మంగళ మణి. ఇస్రో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త. మణి 2018లో అరుదైన ఘనతను సాధించారు. 56 ఏళ్ల వయసులో అంటార్కిటికా చలి ఖండంలో ఏడాదికి పైగా గడిపిన మొట్టమొదటి భారతీయ మహిళాగా చరిత్రాకెక్కారు. మొత్తం 23 మంది వెళ్లిన ఈ బృందంలో 22 మంది పురుషులు కాగా ఈమె ఒక్కరే మహిళా ఉండటం విశేషం. పర్వీన్ ‘మహిళా అయినా కూడా ఇంటికి ఎంత దూరంగా వెళ్లారో చూడండి!’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో లైక్లు రాగా, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘వావ్! ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. "Ladki hai, Ghar se kitna hi door jaegi". Mangala Mani recently became first Indian woman to live in Antarctica for 403 days. An ISRO scientist on expedition. On #NationalGirlChildDay lets recognise role played by such women in country's progress. Ladki padhao, aage badhao !! pic.twitter.com/FK1p6r8Dum — Parveen Kaswan, IFS (@ParveenKaswan) 24 January 2020 అత్యంత శీతల ఖండంగా పేరుగాంచిన అంటార్కిటికాలో 403 రోజులు గడిపిన భారతీయ మొదటి మహిళగా మంగళ మణి రికార్డు సృష్టించారు. ‘ఇంతటి ఘనతను సాధించిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తను ప్రత్యేక రోజు గుర్తు చేస్తూ ఇతరులలో స్పూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ ఫొటో షేర్ చేశాను’ అంటూ పర్వీన్ రాసుకొచ్చారు. అదేవిధంగా మంగళ మణి వంటి ఎంతోమంది స్త్రీలు దేశం గర్వించదగ్గ ఘనతలను సాధిస్తున్నారనే వాస్తవాన్ని కూడా ప్రతిఒక్కరూ గ్రహించాలని పేర్కొన్నారు. -
ముంచుతున్న మంచు!
లండన్ : చంద్రుడు కుంచించుకుపోతున్నాడం టూ ఇటీవలే ఓ వార్తను మనమంతా చదివాం. ఇప్పుడు భూమికీ అదే దుస్థితి దాపురిస్తోంది. అయితే చంద్రుడి మీద పరిస్థితికి అక్కడి ప్రకృతే కారణం కాగా... భూమికి ఈ దుస్థితి దాపురించడానికి మాత్రం మానవ చర్యలే కారణమవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల వినియోగం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వాయువులు వెరసి రోజురోజుకీ భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా ధృవ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు అంచనాలకు మించి పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ మంచు ఫలకాలు కరగడమే కారణం... గ్రీన్లాండ్ ద్వీపం సహా అంటార్కిటికా ఖండంలో ఉండే అతి భారీ మంచు ఫలకాలు వేగంగా కరుగుతుండడమే సముద్ర మట్టాలు పెరగడానికి కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్లో ప్రచురించారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతవాసులకు ముప్పు ఏర్పడడంతోపాటు పర్యావరణ వ్యవస్థకు నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలకు సంబంధించి శాస్త్రీయ అంచనాలు, ప్రణాళిక వ్యూహాలు, చర్యలు తదితర వివరాలు ఈ నివేదికలో వివరించారు. 2100 నాటికి... స్ట్రక్చర్డ్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ (ఎస్ఈజే) అనే పరిజ్ఞానం ఉపయోగించి గ్రీన్లాండ్, పశ్చిమ, తూర్పు అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు ఫలకాల పరిధిని అంచనా వేశారు. ఈ విషయమై బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జొనాథన్ బాంబర్ మాట్లాడుతూ... ‘ఈ పరిజ్ఞానంతో అంచనా వేస్తే.. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన పక్షంలో 2100 నాటికల్లా సముద్ర మట్టం రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 1.79 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి కోల్పోనున్నట్లు అంచనా. ఇందులో ఉపయోగకరమైన సాగు భూమి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 187 మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంద’ని బాంబర్ తెలిపారు. ఇది మానవాళికి తీవ్రమైన ముప్పేనని ఆయన విశ్లేషించారు. -
2070 నాటికి ఆ ఖండం పరిస్థితి
ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని అరుదైన లక్షణం విచాక్షణ శక్తి మానవుని సొంతం. మంచికి, చెడుకు మధ్య తేడా గుర్తించడం మానవునికే సాధ్యం. ఇంత అరుదైన సామార్ధ్యం ఉన్న మనిషి మాత్రం స్వార్ధపూరితంగా తయారయ్యాడు. అతని అత్యాశకు బలవుతున్నది వాతావరణం, జీవరాశి. వీటి గురించి శాస్త్రవేత్తలు గొంతు చించుకుని చెప్తున్న మనం మాత్రం తలకెక్కించుకోవటం లేదు. ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే గతి తప్పిన వాతావరణం, విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు, నిప్పులు చెరుగుతున్న భానుడు వెరసి తీవ్ర క్షామం, ఆకలి, దరిద్రం. వీటన్నింటిని నిత్యం చూస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే అతి త్వరలోనే మనిషి మనుగడ తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆందోళనకరంగా మారిన అంటార్కిటికా వాతావరణ పరిస్ధితులు. భూమి మీద ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా లేని వాతవారణంతో పాటు.. అరుదైన జీవరాశికి ఆవాసంగా ఉన్న ప్రాంతం ఇది. అలాంటిది ఇప్పుడు ఈ ఖండంలోని మంచు ఆందోళనకర రీతిలో కరిగిపోతుంది. కేవలం 1992 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 3 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిందని సాటిలైట్ పరిశీలనలో తెలింది. దక్షణ అంటర్కిటికా ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తల. గడిచిన శతాబ్ద కాలంలో మంచు మూడు రెట్ల అధికంగా కరుగుతూ ఏకంగా ఏడాదికి 159 బిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు. మంచే కదా.. కరగుండా ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సముద్రాలలో కలుస్తుంది. ఫలితంగా సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. గత పాతికేళ్ల నుంచి అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్ర జలాల స్థాయి దాదాపు 8 మిల్లి మీటర్లు పెరిగింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2070నాటికి అంటార్కిటికా పరిస్థితి ఏంటి..? అంటార్కిటికాలో కలిగే మార్పులు.. ప్రపంచపై ఉండే ప్రభావం వంటి అంశాల గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించారు. ఈ అంశాల గురించి ప్రముఖ బ్రిటీష్ జర్నల్ ‘నేచర్’లో వెల్లడించారు. అంతేకాక ప్రంపంచ ముందు రెండు పరిష్కారాలను కూడా ఉంచారు. వీటిలో ఒకటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పట్టించుకోకుండా, మన స్వార్ధ పూరిత చర్యలతో ప్రకృతిని మరింత నాశనం చేయడమా లేక ఇప్పటికైన మేల్కొని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి, పర్యావరణాన్ని కాపడడమా. ఈ రెండింటిలో మనిషి ఎంచుకునే దాని మీదనే అంటార్కిటిక భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటర్కిటికాయే ఎందుకు... భూమి మీద ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగిన వాటి ఫలతం మిగితా ప్రాంతాల్లో అంత త్వరగా కనిపించే అవకాశం ఉండదు. కానీ అంటార్కిటికా, దక్షిణ సముద్రంలో వచ్చే మార్పులు మాత్రం మానవాళి మీద చాలా త్వరగా ప్రభావం చూపుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు అధిక మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, మంచు శకలాలు కూడా త్వరగా కరుగుతాయి. ఫలితంగా ఇంతకాలం సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడుతున్న దక్షిణ సముద్రం అతి త్వరలోనే విపత్కర పరిస్థితులును ఎదుర్కొనున్నట్లు ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. తక్షణ కర్తవ్యం... భూమి మీద ముఖ్యమైన అంటార్కిటికా, దక్షిణ సముద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ‘అంటార్కిటికా ట్రీటి సిస్టం’ పర్యవేక్షిస్తుంది. ఇన్నాళ్లు అంటార్కిటికా బాధ్యతలను కాపాడిన ఈ సంస్థకు మారుతున్న పర్యావరణ పరిస్ధితుల నుంచి అంటార్కిటకాను కాపాడటం పెద్ద సవాలుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మంచు తిరోగమనం వల్ల సముద్ర జలాల ఆమ్లీకరణ పెరుగుతుంది. ఫలితంగా మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైత అంత త్వరగా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హానీ చేసే మానవ కార్యకలపాలను కూడా తగ్గించుకుంటే అంటార్కిటికాను మాత్రమే కాక ప్రపంచాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతాము. -
333 తిమింగలాలు ఊచకోత..
టోక్యో: బూడిద రంగు తిమింగలాలపై పరిశోధనల పేరుతో జపాన్ చేపట్టిన దుర్మార్గమైన సముద్ర వేటలో 333 తిమింగలాలు హతమయ్యాయి. జపాన్ ఊచకోత కోసిన 128 ఆడ తిమింగలాల్లో 122 గర్భంతో ఉన్నట్లు ఒక రిపోర్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దక్షిణ అంటార్కిటికా మహా సముద్రంలో పరిశోధనల పేరిట జపాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కాగా, 2014 మార్చిలో అంతర్జాతీయ న్యాయస్థానం జపాన్ చర్యలపై స్పందించింది. పరిశోధనల పేరుతో బూడిద రంగు తిమింగలాల విచ్చలవిడి వేటను నిలిపేయాలని ఆదేశించింది. తిమింగలాల వేటను వ్యాపార అవకాశంగా జపాన్ మారుస్తోందని కోర్టు ఆక్షేపించింది. ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 12 వారాల పాటు నిర్విరామంగా జపాన్ సముద్ర యాత్ర చేస్తుంది. అయితే, ఐసీజే ఉత్తర్వులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా జపాన్ తన వైఖరి మార్చుకుంది. ఏటా దాదాపు 900 పైగా తిమింగలాలను వేటాడే బదులు ఈ ఏడాది 333 తిమింగలాలకే పరిమితమైంది. బూడిద రంగు తిమింగలాల సంఖ్య, వాటి ప్రవర్తన, జీవ శాస్త్రీయ అధ్యయనం కోసం వేటాడుతున్నామనీ, తిమింగలాల వేట తమ సంస్కృతిలో భాగమని జపాన్ వాదిస్తోంది. కాగా, ఈ ఘటనపై తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతి యేటా జరిగే తంతేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. -
పొంచివున్న పెను ముప్పు
సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో ఈ భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలు రెండింటినీ ప్రత్యక్షంగా తిలకించి, రెండు ధ్రువరేఖలనూ దాటి, ఈ ప్రపంచాన్ని యుద్ధభేరీలతో వణికించగల వాతావరణపు పెనుమార్పుల సంకేతాల్ని దగ్గరగా వీక్షించిన ఒక శాంతి సాధకుని అనుభవాలివి. రాజా కార్తికేయ 2018 మార్చి ఏడు. భూమికి దక్షిణ ధ్రువం అంటార్కిటికాలో.. దక్షిణ మహాసముద్రంలో మా నౌక లంగరు వేసింది. ఒక కయాక్ (ఒక మనిషి పట్టే బోటు)లో నేను మంచు తివాసీలా గడ్డకట్టుకుపోయిన ఒక నదీ ముఖద్వారం కేసి వెళ్తున్నాను. చుట్టూ మంచు కొండలు.. సముద్రపు నీటి మీద తేలుతున్న మంచు దిమ్మలు.. అక్కడక్కడ మంచుదిబ్బల మీద పచార్లు చేస్తున్న పెంగ్విన్ పక్షులు.. నీటిపైకి వచ్చి గాలి నింపుకుంటున్న తిమింగలాలు.. మైనస్ 20 డిగ్రీల చలిలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా ఎత్తున వున్న నదీ ముఖద్వారం కేసి నా కయాక్లో వెళ్తుంటే.. అకస్మాత్తుగా కొన్నిమీటర్ల ఎత్తున గడ్డ కట్టిపోయివున్న నది నుండి 5–6 టన్నుల బరువుండే మంచుగడ్డ విడిపోయి, జారిపోతోంది! సంభ్రమంతో అటే చూస్తున్నాను. అది ఒక భారీ కంటైనర్లా వుంది. అలా జారిపోతూ సముద్రంలోకి పడిపోతోంది! అలా చూస్తుండగానే చెవులు బద్దలయ్యేలా నా పక్కన పిడుగు పడినంత శబ్దంతో ఆ మంచుగడ్డ ’ఢభీ’ మంటూ సముద్రపు జలాల్లో కూలిపోయింది. దాదాపు 30 మీటర్ల ఎత్తునుంచి మంచుగడ్డ కూలిపోయిన ఉద్ధృతానికి సముద్రపు కెరటాలు ఒక్కసారిగా 15–20 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి! అలా ఓ పెద్ద కెరటం నా కయాక్ వైపుకి విరుచుకుపడుతూంటే, కంగారుగా, హడావుడిగా నా బలంకొద్దీ కయాక్ దిశ మార్చి దూరంగా నడుపుకొచ్చేశాను.. అలా వచ్చేశాక, ’హమ్మయ్య’ అని ఊపిరిపీల్చుకున్నాను ఆ క్షణంలో! నౌకలోకి తిరిగి వచ్చాక రాబర్ట్ శ్వాన్తో నా అనుభూతిని పంచుకున్నాను. ఆయన మా అంటార్కిటికా అధ్యయన యాత్రకి తలపండిన సారథి. అంతకు ముందు 2017 జూలై నెలలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా వున్న స్వాల్బర్డ్కి వెళ్లాను. నార్వేలో మా దౌత్యాధికారుల సమావేశం ఒకటి జరిగింది. సమావేశం అయిపోగానే నేను ఉత్తర ధ్రువాన్ని చూడాలన్న తహతహకొద్దీ సెలవు తీసుకుని ’స్వాల్బర్డ్’కి విమానంలో వెళ్లాను. అక్కడ ఒక చేపల పడవని అద్దెకి మాట్లాడుకుని, ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా, స్వాల్బర్డ్కి ఉత్తరకొసన వున్న చిట్టచివరి జనావాసం నై–అలెసుండ్ చేరుకున్నాను. అక్కడున్న జనాభా అంతా కలిపి 30కి అటూ ఇటుగా వుంటారు. ఆ దీవిలో అక్కడక్కడ వున్న బడ్డీకొట్లలాంటి ఆవాసాల మధ్య నడుస్తుంటే, ఒకచోట హిందీ సినిమాగీతం వినిపించింది. ఆశ్చర్యంతో అక్కడున్న పసుపుపచ్చటి ఆవాసం ముందుకెళ్లి, తలుపుకొట్టాను. తలుపు తెరుచుకుంది. లోపలకు వెళ్లాక సంభ్రమంతో, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. అక్కడ ఇద్దరు సైంటిస్టులు పనిచేసుకుంటున్నారు. వాళ్లిద్దరూ భారతీయులు. అంటే, నేను అడుగుపెట్టిన ఆవాసం.. ఉత్తర ధ్రువంలో భారతదేశపు పరిశోధనా కేంద్రం ‘ధ్రువ్’. గ్లేసియర్పై ఐదు రోజులు అక్కడున్న అయిదు రోజుల్లో చాలాసార్లు గ్లేసియర్ (గడ్డకట్టిన హిమ సాగర జలాల) మీదకి వెళ్లాను. ఉత్తర ధ్రువంలో ఏం జరుగుతోందో అర్థంకావటానికి ఎక్కువకాలం పట్టలేదు. వాతావరణ మార్పు ప్రభావం భారత్ మీద ఎలా వుండవచ్చో తెలుసుకున్నాను. అది తెలిసిన దగ్గర్నుంచీ, నాలో ఏదో ఆందోళన. నేను పర్యావరణ పరిరక్షణ కార్యకర్తని కాను. కాని ఐక్యరాజ్యసమితి ఉద్యోగంలో భాగంగా శాంతి సాధన కృషిలో పాలుపంచుకునే నాకు ఈ వాతావరణ మార్పు అనే పెనుభూతం మానవ జీవితాలను మసకబారేలా చేస్తుందన్న భావన నిద్రపట్టనీయడంలేదు. స్వాల్బర్డ్ నుంచి తిరిగొచ్చిన దగ్గర్నుంచీ అదే భావన. భూతాపానికి కొలబద్దలు.. ఆర్కిటిక్, అంటార్కిటికా ధ్రువ ప్రాంతాల్లో సాగర జలాల మధ్యలో విస్తరించిన మంచు ఖండాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్న కొద్దీ నాకు అంటార్కిటికా కూడా వెళ్లి ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలన్న బలమైన కోరిక కలిగింది. ప్రయత్నించాను. రాబర్ట్ శ్వాన్ ఆధ్వర్యంలోని బృందంలో ఆ ఫిబ్రవరి, మార్చి మాసాల్లో అంటార్కిటికా వెళ్లేందుకు అవకాశం లభించింది. నౌకలో అంటార్కిటికాకు ఫిబ్రవరి 27న దక్షిణ అమెరికాలోని ఉషుఐయా పట్టణం నుంచి నౌకలో 80 మందితో మా అధ్యయన యాత్ర ప్రారంభమైంది. అల్లకల్లోలంగా వున్న డ్రేక్ ప్యాసేజీని దాటాం. మూడురోజుల తరువాత.. మొట్టమొదటి మంచు శిఖరాన్ని సముద్రంలో చూశాం. మార్చి 3న అంటార్కిటికా ధ్రువ రేఖ (సర్కిల్)ని దాటి, అంటార్కిటికా ద్వీపకల్పానికి పశ్చిమంగా ప్రయాణించాం. మధ్యమధ్యలో చిన్నచిన్న దీవుల్ని దాటుకుంటూ వెళ్తున్నాం. అంటార్కిటికాలో మనిషి చేసిన మనుగడ ప్రయోగాల తాలూకు చిహ్నాలు చాలా ఇక్కడ కనిపించాయి. 19వ శతాబ్దంలో ‘సీల్’ జంతువులను వేటాడటం కోసం ఉపయోగించిన బోట్ల తాలూకు అవశేషాలు.. మనుషులు జీవించి వదిలేసిన ఆవాసాల శిథిలాలు.. అర్జెంటీనా, చిలీ, బ్రిటన్ల స్థావరాలు ఈ ప్రాంతంలో ఇప్పటికీ వున్నాయి. మంచు దీవిలో వెచ్చదనం! మా అధ్యయన యాత్ర చివరి భాగం ’డిసెప్షన్’ దీవి మీద గడిచింది. అదొక పరమాద్భుత అనుభవం. అక్కడ ఉన్ని దుస్తులు ధరిస్తేనే గాని తట్టుకోలేనంత చలి. కాని, ఆ ’డిసెప్షన్’ దీవి మీద అడుగుపెట్టగానే వాతావరణం నులివెచ్చగా అనిపించింది. ఎక్కడిదీ వెచ్చదనం?ఆ దీవిలో ఒకప్పుడు బద్దలయిన అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహించిపోగా, ఆ అగ్నిపర్వతం వున్నచోట భూమి ఒక మూకుడు ఆకారంలో కిందికి కుంగిపోయింది. దాన్ని ఇంగ్లిషులో ’కాల్డెరా’ అంటారు. ఆ అగ్నిపర్వతం తాలూకు తాపం ఇప్పటికీ ఆ దీవిని వెచ్చగా వుంచుతోంది.ఆ ’కాల్డెరా’ అంచుకు వెళ్లి లోపలికి చూస్తున్నాను. కోరుకున్నట్లే ఈ భూమికున్న రెండు ధ్రువ రేఖలను దాటేశాను. ఈ రెండు ఖండాల్లోనూ గ్లేసియర్స్ బద్దలవుతూనే వున్నాయి. ఎంత దుర్విషయం! సముద్రంలో విరిగి పడే ప్రతి భారీ మంచు చరియ, గ్లేసియర్ ఖండం వల్ల సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. పెరిగే ప్రతి అంగుళపు సముద్రపు నీటి మట్టంవల్ల భూభాగం తగ్గుతుంది. పైగా అనూహ్యంగా సంభవించగల సముద్రపు ఆటుపోట్లు, దాని ప్రభావం మనకి భార త్లో వర్షపాతాల మీద పడటం, వేసవికాలాల్లో తాపం పెచ్చరిల్లిపోవటం, అనూహ్యమైన తుఫాన్ వర్షాలు సంభవించి పంటల్ని దెబ్బతీయటం, ఫలితంగా వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పెరగడం, సమాజంలో ఘర్షణలు పెంచడం ఇవే జరుగుతాయి. ఇన్ని అవాంఛనీయ పరిస్థి తులకి ప్రధాన కారణం వాతావరణ మార్పు. ఇది పెను ముప్పు. తాపీగా ’రాబోయే సంవత్సరాల్లో పరిష్కరిద్దాంలే’ అని ఉపేక్షించటానికి వీల్లేని అత్యవసర సమస్య ఇది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తెలుసుకొని అప్రమత్తం కాకపోతే ఈ తరానికీ, భవిష్యత్ తరాలకీ మిగిలే భవిష్యత్ దుఃఖమయం.(హైదరాబాద్కి చెందిన ఈ వ్యాసకర్త ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్త) కార్బన్ వ్యర్థవాయువులు వాతావరణంలో ప్రవేశిం చకుండా నిరోధించే చర్యలు తీసుకోవటం, అడవుల విస్తీర్ణం పెంచుకోవడం వంటివి యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఇది ఇప్పటికిప్పుడే ప్రారంభం కాలేదంటే ఈ భూగ్రహం మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకం కాగల రోజు ఎంతో దూరంలో లేనట్లే. -
పరి పరిశోధన
వర్టికల్ ఫార్మింగ్తో 30 రెట్లు ఎక్కువ దిగుబడి నేల అవసరం లేని నిట్టనిలువు వ్యవసాయం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాంగానీ.. ఇందులోనూ రికార్డులు బద్దలు కొట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోవరీ విషయాన్నే తీసుకోండి. ఈ సంస్థ అతితక్కువ స్థలం, నీరు, వనరులు వాడుకుని బోలెడన్ని ఆకు కూరలు పండించేందుకు రంగం సిద్ధం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరానికి పండించే దానికంటే బోవరీలో పండేది ఏకంగా 30 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకోవడం ద్వారా తాము 95 శాతం తక్కువ నీరు.. క్రిమికీటక నాశినులు, రసాయన ఎరువులు ఏవీ వాడకుండానే అధిక దిగుబడులు సాధిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకే రకమైన పంట కాకుండా ఏకకాలంలో దాదాపు వంద రకాల ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచడం ఇంకో విశేషం. ప్రత్యేకంగా తయారుచేసుకున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మొక్కలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానగరాలకు చేరువలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్ చేపట్టడం ద్వారా నగరవాసులకు తాజా ఆకుకూరలు దొరుకుతాయి. ఇందువల్ల రవాణా చేయవలసిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని బోవెరీ అంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ పంటలు న్యూయార్క్లోని ఫోరేజ్, హోల్సమ్ ఫుడ్స్ వంటి స్టోర్లలో లభ్యమవుతున్నాయి. పెంగ్విన్ల కాలనీ బయటపడింది... మంచుముద్ద అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ల కాలనీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ.. ఇందులో విశేషమేముంది? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అంతరించిపోతున్నాయని అనుకుంటున్న అడిలీ రకం పెంగ్విన్లు ఇక్కడ ఉండటం ఒక విశేషమైతే.. ఏకంగా 15 లక్షల ప్రాణులు ఉండటం ఇంకో విశేషం. వుడ్హోల్ ఓషన్రోఫిక్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లతో జరిపిన పరిశోధనల ద్వారా ఈ కొత్త కాలనీ గురించి ప్రపంచానికి తెలిసింది. డాంగర్ ద్వీపంలో ఉన్న ఈ కాలనీని ఇప్పటివరకూ మనుషులెవరూ సందర్శించలేదని.. బహుశా అందుకే ఆ ప్రాంతంలో పెంగ్విన్లు బాగా వృద్ధి చెందుతూండవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ హార్ట్ తెలిపారు. 1959లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ వీటి ఉనికి గురించి కొన్ని ఆనవాళ్లు కనిపించాయని, ఆ తరువాత డాంగర్ ద్వీపమున్న పశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్లు క్రమేపీ తగ్గిపోతూ వచ్చాయని హార్ట్ వివరించారు. దాదాపు ఏడు లక్షల జంటలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా ‘హార్ట్’ నిలిచింది అంటున్నారు. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, ఫ్రాన్స్లలోని ఇతర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. నిత్య యవ్వనం గుట్టు తెలిసింది... నిండు నూరేళ్లూ... ఎలాంటి జబ్బులు, ఇబ్బందులు లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గానీ.. సాధ్యమయ్యేదెలా? అంటున్నారా? అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఈ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. విషయం ఏమిటంటే.. మన క్రోమోజోమ్ల చివరన ఉండే టెలిమోర్లకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు. డీఎన్ఏ పోగుల్లోని కొన్ని భాగాలను టెలీమోర్లుగా మార్చేందుకు టెలిమరేస్ అనే ఎంజైమ్లు ఎలా పనిచేస్తాయో వీరు గుర్తించారు. సాధారణంగా మన శరీర కణాలు కొన్నిసార్లు విభజితమైన తరువాత మరణిస్తాయి. ఈ క్రమంలో క్రోమోజోమ్ల చివర ఉండే టెలీమోర్ల పొడవు తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే టెలిమోర్ల పొడవు నిర్దిష్ట స్థాయికంటే తక్కువ అవుతుందో అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే కణాలు.. వాటితోపాటు మనమూ వృద్ధులమవుతామన్నమాట. ఈ నేపథ్యంలో టెలీమోర్ల పొడవు తగ్గకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. టెలీమెరేస్లో క్రోమోజోమ్ చివరల్లో ఉండే టెలీమోర్లకు సంబంధించిన డీఎన్ఏ ముక్కలను కచ్చితంగా తయారు చేసేందుకు ఒక వ్యవస్థ ఉందని.. ఇది.. ఆ ఎంజైమ్ మొత్తం పనితీరునూ ప్రభావితం చేస్తోందని వీరు తెలుసుకున్నారు ఈ వ్యవస్థను నియంత్రించగలిగితే టెలీమోర్ల పొడవు తగ్గకుండా ఉంటుంది.. తద్వారా కణాలు.. మనమూ నిత్యయవ్వనంతో ఉండవచ్చునని అంచనా. -
ముక్కలైన మరో అతి పెద్ద మంచు ఫలకం
వాషింగ్టన్ : ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటు చేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు. కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమవుతోంది. వచ్చే నూరేళ్లలో ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. మొన్నటికిమొన్న అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్–సి’ హిమపర్వతం నుంచి వేరుపడిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజాగా మరో అతి భారీ మంచు ఫలకం రెండు ముక్కలైన దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది. అంటార్కిటికాలో మంచు ఫలకాలు ముక్కలవుతున్న వరుస ఘటనలు పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వేరుపడిన మంచు ఫలకం గ్రీన్లాండ్ దేశంలో ప్రతి ఏటా కరుగుతున్న మంచుకు సమానమని నాసా పేర్కొంది. హిమ పర్వతం నుంచి వేరుపడిన మంచు ఫలకం కొట్టుకుపోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో ఓ హిమ పర్వతం నుంచి వేరుపడిన లార్సెన్-సి బరువు దాదాపు లక్ష టన్నుల కోట్లు. వైశాల్యంలో న్యూఢిల్లీ నగర పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని శాస్త్రవేత్తులు లెక్కగట్టారు కూడా. లార్సెన్–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్ల క్రితమే శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఏడాది జూన్లో ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిందని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. జులై నెలలో అది కూడా తెగిపోయింది. వరుసగా భారీ మంచు ఫలకలు ఖండాన్ని విడిపోతున్నందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలు మారిపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సముద్రమట్టం పెరిగే ప్రమాదం.. వరుసగా మంచు ఫలకలు ముక్కలై కరిగిపోతుండటం ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. విడిపోయిన ఫలకాలు అక్కడి నుంచి పెనువేగంతో ముందుకు కదులుతాయో లేక ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతాయో లేక క్రమేపీ శకలాలుగా విడిపోయి కరుగుతూ అంతరిస్తుందా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్థతి నెలకొంది. శాస్త్రవేత్తల అసలు ఆందోళనంతా హిమ ఫలకాలు తెగిపడుతున్నాయని కాదు. ఈ పరిణామాల పర్యవసానంగా పైనుంచి విరుచుకుపడే హిమనీ నదులు ముందుకు పోకుండా ఈ హిమ పర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కనబడినా హిమనీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సముద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. తాజా విరిగిన మంచు ఫలకం వల్ల సముద్ర మట్టం మూడు మిల్లీమీటర్ల పాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్–సి కి పక్కనుండే లార్సెన్–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది. ప్రమాదంలో పర్యావరణం.. లార్సెన్–ఏ, లార్సెన్–బి, లార్సెన్–సి వంటి హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమనీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఫ్లెమింగ్ పేరుతో ఉన్న హిమనీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు. కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగుతున్నంతకాలం అక్కడ యధాస్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్ పక్షుల ప్రాణాలు మంచులో శిథిలమైపోయాయి. -
భూమికి సమీపంగా ఉల్క
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా గురువారం ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్–స్టార్స్ టెలిస్కోప్ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది. భూమికి ఎంత దగ్గరగా... యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి–చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి. ‘ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చింది. ఈ శకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ..ఉల్కలను కనుగొనడం, అంతరిక్ష భద్రతకు ఏ మేరకు సిద్ధమై ఉన్నామనే దానికి దీన్ని సవాలుగా భావించవచ్చు’ అని జర్మనీలోని యూరోపియన్ అంతరిక్ష వ్యవహారాల కేంద్రం చీఫ్ రోల్ఫ్ డెన్సింగ్ చెబుతున్నారు. దాదాపు 6.5కోట్ల ఏళ్ల క్రితం మెక్సికో తీర ప్రాంతాన్ని ఓ ఉల్క ఢీకొట్టడంతో భూమిపై డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని, 2013లో రష్యాలోని ఛెల్యాబిన్స్క్పై 10 టన్నుల బరువున్న శకలం ముక్కలై పడటంతో వెయ్యి మంది గాయపడ్డ ఘటనను ఆయన గుర్తుచేశారు. ఎదుర్కోగలమా ? ‘భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్ ఇంపాక్ట్’ మిషన్ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి’ అని శాస్త్రవేత్త డెట్లెఫ్ చెప్పారు. ‘2012 టీసీ4’ భూమికి సమీపంగా వెళ్లినప్పుడు అంతర్జాతీయ గ్రహశకలాల హెచ్చరిక నెట్వర్క్లో ద్వారా ప్రపంచంలోని అబ్జర్వేటరీలు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేశాయి. – -
ముంచుకొస్తున్న మంచుముప్పు
సాక్షి, అమరావతి బ్యూరో: మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉండి మనం మంచు ఖండంగా పిలుచుకునేది.. అంటార్కిటికా. దీని అంచున వేలాడదీసినట్లు 44,200 చ.కి.మీ విస్తీర్ణంలో భారీ మంచు ద్వీపకల్పం ఉంది. దీన్ని లారెన్స్–సి అని వ్యవహరిస్తుంటారు. దీని నుంచి ఈ ఏడాది జూలైలో ఐస్బర్గ్ ఏ–68 అనే భారీ మంచు ఫలక బద్దలై విడిపోయింది. ఇది సముద్రంలో తేలియాడుతూ నిదానంగా కరుగుతోంది. ఇది 5800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంతటి వైశాల్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కలవరపడుతోంది. ఇంత భారీ మంచు ఫలక కరిగిపోతే సముద్ర జలాల మట్టం పెరిగిపోతుంది. సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుంది. తీర ప్రాంతాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఏకంగా కొన్ని ప్రాంతాల ఉనికే లేకుండా పోతుంది. అభివృద్ధి పేరిట విచక్షణ రహితంగా ప్రకృతిని విధ్వంసం చేయడం వల్లే ఇలా జరుగుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. కరుగుతున్న మంచు ఖండం అంటార్కిటికాలో మంచు ఫలకలు 10 వేల ఏళ్ల నుంచి స్థిరంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అడవుల నరికివేత, విపరీతమైన పారిశ్రామికీకరణ, వాయు కాలుష్యం, గ్రీన్హౌస్ ఎఫెక్ట్.. ఇలా అన్నీ తీవ్ర వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. దీంతో భూఉపరితల ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతోంది. ఇది అంటార్కిటికా ఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అర్ధ శతాబ్దం కిందట నుంచి అంటార్కిటికాలో మంచు ఫలకలు కరగడం ప్రారంభించాయి. ప్రతి ఏటా ఇలా జరగడం ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అంటార్కిటికా ఖండం నుంచి విడిపడిన భారీ మంచు ఫలకతో పెనుముప్పు ముంచుకొస్తోంది. పెనుముప్పు.. ఏదీ కనువిప్పు? మంచు ఫలకలు కరగడం వల్ల సముద్ర జలాల మట్టాలు పెరిగి పెను ఉపద్రవం ఏర్పడుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజెస్ (ఐపీపీసీ) హెచ్చరిస్తోంది. ఇప్పటికే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏటా సముద్ర జలాల మట్టం 3.40 మిల్లీ మీటర్లు పెరుగుతోంది. అంటే దాని దుష్పరిణామాలను ప్రపంచం ఎదుర్కొంటోంది. - మన రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడలలో సముద్రం ఏటా ముందుకు చొచ్చుకు వస్తుండటం తెలిసిందే. దీంతో విలువైన సారవంతమైన భూములు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ రెండు చోట్లే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 200 కి.మీ. తీర ప్రాంతం సముద్రం కోతకు గురవుతోంది. భూగర్భ జలాలు కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. ఇక పశ్చిమ తీరంలోనూ సముద్రం ముందుకు దూసుకొస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఏటా ప్రపంచంలో దాదాపు 2 లక్షల కి.మీ. తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. - సముద్ర జలాల నీటిమట్టం పెరిగితే భారీ వర్షాలు, తుపానులు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తాయి. తాజాగా అమెరికాలో హరికేన్ల ప్రళయం, మన దేశంలో ముంబై వంటి నగరాల్లో ఆకస్మిక భారీ వర్షాలు మొదలైనవి ఇందుకు సంకేతాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. - ఇదే పరిస్థితి కొనసాగితే భూమిపై కొన్ని ప్రాంతాల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో కొన్ని ప్రాంతాలు పూర్తిగా సముద్ర గర్భంలో కలసిపోయాయి. హిందూ మహా సముద్రంలో ఉన్న అతి చిన్న దేశం మాల్దీవుల ఉనికే ప్రమాదంలో పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ప్రత్యామ్నాయ దీవుల కోసం అన్వేషిస్తోంది కూడా. - ఎన్నో జీవజాతుల ఉనికి అంతర్ధానం అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. అంటే సముద్ర జలాల మట్టాలు పెరగడం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో స్పష్టమవుతోంది. గతంలో లారెన్స్– ఏ, బి వేల టన్నుల బరువుతో ఉన్న ఐస్బర్గ్ ఏ–68 భారీ మంచు ఫలక పూర్తిగా కరిగితే సముద్ర జలాల మట్టం ఏడాదికి అదనంగా 0.10 మిల్లీమీటర్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో 1995లో 2 వేల చ.కి.మీ వైశాల్యం కలిగిన లారెన్స్ –ఏ’ , 2002లో 3,250 చ.కి.మీ వైశాల్యం ఉన్న లారెన్స్–బి మంచు ఫలకలు వేరుపడి సముద్ర జలాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఏకంగా 5,800 చ.కిమీ. వైశాల్యం కలిగిన ఐస్బర్గ్–68 వేరవడంతో సముద్ర జలాల మట్టం మరింతగా పెరగనుంది. ఏటా పెరుగుతున్న 3.40 మిల్లీమీటర్లకు అదనంగా మరో 0.10 మిల్లీ మీటర్లు సముద్ర జలాల మట్టం పెరుగుతుందన్నమాట. ఇంతటితోనే ప్రమాదం ముగిసిపోలేదు. అంటార్కిటికా ఖండంలో లారెన్స్ సి’ని ఆనుకుని మరో భారీ మంచు ఫలక ఉంది. ఏకంగా 22,600 చ.కి.మీ. వైశాల్యం కలిగిన దీనికి ‘లారెన్స్ డి’ అని పేరు పెట్టారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఆ మంచు ఫలక కూడా త్వరలోనే వేరుపడి కరిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమతౌల్యం కాపాడటం సమష్టి బాధ్యత మంచు ఫలకల రూపంలో వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే సమష్టి కార్యాచరణ ప్రారంభించాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి కాలుష్య నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినవారమవుతాం. – మనోజ్ నలనాగుల, వాతావరణ శాస్త్రవేత్త -
సున్నా డిగ్రీల చలిలో.. ఒక్కటయ్యారు!
లండన్: ప్రస్తుతకాలంలో పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతి, యువకులు ముచ్చటపడుతున్నారు. అలాంటి ఓ జంట ఏకంగా సున్నా డిగ్రీల చలి ఉన్న ప్రాంతంలో ఒక్కటే ఆశ్చర్యపర్చింది. బ్రిటన్కు చెందిన జూలీ బామ్, టామ్ సిల్వెస్టర్లు పోలార్ ఫీల్డ్ గైడ్స్(అంటార్కిటికాలో ఓ భాగం). కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఇరువురూ ప్రపంచంలోని సుందరప్రదేశాలను చుట్టేశారు కూడా. ఇక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. జూలీకి మంచు ప్రాంతాలు, కొండలు అంటే ప్రాణం. దాంతో అంటార్కిటికాలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో రెండు రోజుల పెళ్లి చేసుకోవాలని జంట ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని తమతో పాటు కలిసి బిట్రిష్ అంటార్కిటిక్ సర్వేస్(బీఏఎస్)లో పనిచేసే 18 మంది సహచరులకు తెలియజేశారు. అంటార్కిటికాలోని అడిలైడ్ ఐలాండ్ ప్రాంతంలో వివాహ ఏర్పాట్లు చేసిన సహచరులు ప్రేమికులను ఒక్కటి చేశారు. సున్నా డిగ్రీల చలిలో, అంటార్కిటికాలో పెళ్లి చేసుకోవాలనేది దేవుడు నిర్ణయించిందని జూలీ టెలిగ్రాఫ్ దినపత్రికతో పేర్కన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేదైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. అతికొద్దిమంది మేం ఒక్కటవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అలాంటిది భూమ్మీద ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం వివాహం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వరుడు టామ్ చెప్పారు. బ్రిటిష్ అంటార్కిటికాలో జరిగిన మొదటి వివాహం కూడా ఇదే కావడం గమనార్హం. -
దక్షిణ ధ్రువంలో కల్లోలం
ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటుచేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు. కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడు దలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమ వుతోంది. నూరేళ్లక్రితం ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్–సి’ హిమ పర్వతం నుంచి వేరుపడిందని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వైపరీత్యం గత మూడురోజుల్లో ఏదో ఒక సమయంలో చోటు చేసుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు లక్ష టన్నుల కోట్ల బరువుండే ఈ ఫలకం న్యూఢిల్లీ నగర వైశాల్యంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని లెక్కలు కడుతున్నారు. లార్సెన్–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్లక్రితమే శాస్త్రవేత్తలు గమనిం చారు. నెలక్రితం ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిం దని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. అది కూడా ఇప్పుడు తెగిపోయింది. ఇందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలే మారిపోవచ్చునంటున్నారు. ఈ ఫలకం అక్కడి నుంచి పెను వేగంతో ముందుకు కదులుతుందా, ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతుందా, క్రమేపీ శకలాలుగా విడివడి కరుగుతూ అంతరిస్తుందా అన్నది శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. అసలు వారి ఆందోళనంతా ఈ ఫలకం తెగిపడిందని కాదు. ఈ పరిణామం పర్యవసానంగా లార్సెన్–సి అస్తిత్వమే ప్రమాదంలో పడవచ్చునని వారు కలవర పడుతున్నారు. ఎందుకంటే పైనుంచి విరుచుకుపడే హిమానీ నదులు ముందుకు పోకుండా ఈ హిమపర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. ఇప్పుడు తాజాగా విరిగిపడిన ఫలకం కారణంగా లార్సెన్–సి ఎంతో కొంత బలహీనమవుతుంది. ఆ మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కన బడినా హిమానీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సము ద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. అలాంటి పెను ముప్పు ఏర్పడవచ్చునన్నదే శాస్త్రవేత్తల ఆందోళన. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్–సి కి పక్కనుండే లార్సెన్–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది. లార్సెన్–ఏ, లార్సెన్–బి, లార్సెన్–సి వగైరా హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమానీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నా వాటిల్లో ఫ్లెమింగ్ పేరుతో ఉన్న హిమానీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు. కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగు తున్నంతకాలం అక్కడ యధా స్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు లార్సెన్–సి మంచు పర్వతం నుంచి ఒక ఫలకం విడిపోయిన కారణంగా ఆ పర్వతానికేమవుతుందో, విడివడ్డ ఫలకం చివరకు ఏ రూపు తీసుకుంటుందో అంచనా వేయడానికైనా మరి కొన్నాళ్లు పడుతుంది. ఆ తర్వాతే దానివల్ల కలిగే పర్యవసానాలేమిట న్నది శాస్త్రవేత్తలు పరిశీలించగలుగుతారు. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్ పక్షులు నేలరాలాయి. ఇప్పుడు అంటార్కిటికాలో అతి పెద్ద మంచు ఫలకం విడివడ్డ సంగతిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఆక్వామోడిస్ ఉపగ్రహ పరికరం ద్వారానే శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యావణానికి ముప్పు ఏర్పడటమన్నది పనిలేని శాస్త్రవేత్తలు కల్పిస్తున్న కట్టుకథగా కొట్టిపారేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తాజా పరిణామం కళ్లు తెరిపించాలి. రెండేళ్లక్రితం పారిస్లో కుదిరిన పర్యావరణ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఈమధ్యే ట్రంప్ ప్రకటించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఉద్గారాలు భూగోళాన్ని నిప్పుల కొలి మిలా మారుస్తున్నాయని, దాన్నుంచి మానవాళి బయటపడటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎన్నేళ్లుగానో పర్యావరణవేత్తలు ఆందోళనపడ్డారు. ఆ విషయంలో ఏదోమేరకు అంగీకారం కుదిరిందన్న సంతోషం ట్రంప్ రాకతో ఆవిరైంది. అంటార్కిటికాలో జరిగిన ఉత్పాతం పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి దోహదపడితే మానవాళికి అంతమించిన చల్లని కబురుండదు. అది జరగాలని అందరం ఆశిద్దాం. -
దుబాయ్కు ఐస్బర్గ్ను లాక్కొచ్చేస్తాం..!
-
మంచు కొండ... హైలెస్సో హైలెస్సా!
ఒకపక్క భూగోళం మండిపోతోంది... ధ్రువ ప్రాంతాల్లోని మంచు మొత్తం కరగిపోతోంది అని ప్రపంచం అల్లల్లాడుతోందా? దీన్ని ఎలా తట్టుకోవాలో తెలియక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారా? ఎడారి దేశం దుబాయి దీంట్లోనూ ఓ అవకాశాన్ని వెతుక్కుంటోంది. ఎలాగూ అంటార్కిటికా ప్రాంతంలో భారీ సైజులో మంచుగడ్డలు విరిగిపడుతున్నాయి కదా. వాటిల్లో కొన్ని మేము తెచ్చేసుకుంటాం. ఎంచక్కా దుబాయి వద్ద వాటిని కరిగించి అమ్మేసుకుంటామని ఆలోచన చేస్తోంది దుబాయి నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ... ఇదంత ఈజీనా? అని ప్రశ్నించుకుంటే అసాధ్యమైతే కాదన్న సమాధానం వస్తుంది. కాకపోతే పర్యావరణవేత్తలు మొదలుకొని వివిధ దేశాల నుంచి వ్యతిరేకత మాత్రం ఖాయం. ఈ కంపెనీ ఎండీ అబ్దుల్లా సలేహీ ఐడియా ఏమిటంటే.. ఆస్ట్రేలియాకు దిగువన ఉన్న హార్ట్ ఐలాండ్కు భారీ సైజు నౌకలు పంపాలి. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచుఖండం తాలూకూ భారీసైజు ముక్కలు అక్కడ తేలియాడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల సైజులో ఉన్నవాటిని వదిలేసి.. కొంచెం చిన్న మంచుముక్కల చుట్టూ ఓ వల వేయడం.. నౌకకు కట్టేసి 9000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయి వరకూ లాక్కెళ్లడం. ఇదీ ప్లాన్. ఓ 2000 కోట్ల గ్యాలన్ల నీరున్న మంచుముక్కను ఇలా లాక్కు రావడం సాధ్యమేనని సలేహీ అంచనా. ఉత్తర ధ్రువం తాలూకా మంచును కరిగించి నార్వే ఇప్పటికే మంచి బిజినెస్ చేస్తోందని.. 750 మిల్లీలీటర్ల నీటికి రూ.6500 వసూలు చేస్తోందని, తామూ ఇలాంటి బిజినెస్ ప్లాన్తో ముందుకెళతామని అంటున్నాడు సలేహీ! మంచుముక్కను దుబాయి వరకూ లాక్కుని వచ్చేందుకు అయ్యే ఖర్చు రూ.3 వేల కోట్లకు మించదు. మంచుముక్కలో అధికభాగం నీటి అడుగునే ఉండటం వల్ల అది కరిగిపోయేదీ తక్కువే. అయితే అంటార్కిటికా ప్రాంతంలో మైనింగ్, మిలటరీ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా నిషేధం ఉండటం, ఆస్ట్రేలియా కూడా హార్ట్ ఐలాండ్ ప్రాంతంలోని ప్రకృతిని పరిరక్షించే లక్ష్యంతో నిషేధాజ్ఞలు అమలు చేస్తూండటం దుబాయి ప్లాన్కు అడ్డంకుల్లా కనిపిస్తున్నాయి. ఎలా అధిగమిస్తారో చూడాలి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!
వాషింగ్టన్: అంటార్కిటికాలోని ‘ఎర్ర జలపాతం’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. అక్కడి నీరు రక్తంలాగా ఎర్రటి రంగులో ప్రవహించడానికి కారణం ఆ నీటిలోని ఇనుము గాలితో కలవడమేనని వర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్బ్యాంక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు అంటార్కిటికాలోని ఈ ‘రక్త జలపాతాన్ని’ 1911లో గుర్తించారు. ఈ జలపాతం నీటిలోని ఇనుము గాలితో కలసినపుడు నీటి రంగు ఎరుపులోకి మారుతోందని, తద్వారా ఎరుపు రంగులో జలం ప్రవహిస్తోందని తమ పరిశోధనలో తేలిందని యూఏఎఫ్కు చెందిన క్రిస్టినా తెలిపారు. -
రికార్డు ఉష్ణోగ్రత... పరిశోధకుల ఆందోళన
ఓస్లో: వాతావరణ మార్పుల మూలంగా ధృవప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిశోధకులను కలవరపెడుతున్నాయి. ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసెర్చ్ సెంటర్ ఎస్పరాంజా బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాంతంలోని వాండా స్టేషన్లో1982 జనవరి 5న నమోదైన 15 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్డును ఇది అదిగమించింది. ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థలో ప్రముఖ పరిశోధకుడు మైఖేల్ స్పారో వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటికాలో ఉన్న మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంటార్కిటికాపై ఒంటరి ఆడపిల్ల!
సాహసం సంకల్పబలం ఉంటే భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావచ్చు. భూమిపై అతి ఎల్తైన శిఖరాన్ని ఎక్కి రావచ్చు. ఇంకా అలవికాని ఎన్నో సాహసాలను చేసి రావచ్చు. కానీ అంటార్కిటికా సముద్రాన్ని (ఇదే దక్షిణ మహాసముద్రం) చుట్టి రావాలంటే మాత్రం.. ఒక్క సంకల్పమే సరిపోదు. ధైర్యం ఉండాలి. తెగింపు ఉండాలి. ఎదురు తిరుగుతున్న గాలుల్ని లొంగదీసుకుని నౌకను ఒడుపుగా నడిపే నేర్పు ఉండాలి. అంటార్కిటికా.. భూగోళానికి దక్షిణంలో ఉంటుంది. ధృవప్రాంతం. నివురు గప్పిన నిప్పులా... మంచు కప్పిన ముప్పు అంటార్కిటికా. ఇక్కడ మనుషులు ఉండరు. ఉండలేరు. అంత చల్లగా ఉంటుంది. సీల్ చేపలు, పెంగ్విన్లు, పిచ్చిమొక్కలు తప్ప జీవం అన్నదే ఉండదు. జీవితంపై ఆశ ఉన్నవారు అటువైపు విహారానికైనా వెళ్లరు. వెళ్లినా మళ్లీ వస్తారో లేదో తెలియదు. అంతటి ప్రమాదకరమైన ఖండంలోని సముద్రాన్ని ఒంటరిగా, తోడెవరూ లేకుండా, మధ్యలో ఎక్కడా ఆగే పనిపెట్టుకోకుండా నిరవధికంగా 100 రోజులలో చుట్టి వచ్చేందుకు లీసా బ్లెయిర్ అనే అమ్మాయి గత సోమవారం ఆస్ట్రేలియా తీరప్రాంత పట్టణం ఆల్బెనీ నుంచి బయల్దేరింది! కేప్ ల్యూవెన్, కేప్ హార్న్, కేప్ అగలస్ మీదుగా అంటార్కిటికా ప్రయాణానికి లీసా రూట్ మ్యాప్ వేసుకున్నారు. ఇవి మూడూ అంటార్కిటికా సముద్రంలో అతి భయంకరమైన మంచు ప్రదేశాలు. వీటిని డీకొన్ని క్షణమే నావికుల అంతిమ క్షణం. ఆ నిగూఢమైన జల మార్గాలను మచ్చిక చేసుకోవడం కోసం 32 ఏళ్ల క్వీన్స్లాండ్ యువతి లీసా ఇప్పటికే నాలుగైదు సార్లు అంటార్కిటికాపై ‘ప్రయాణ సాధన’ చేశారు. నౌకలోని ఎలక్ట్రానిక్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోనని సరిచూసుకున్నారు. తనకు తానుగా నౌకను నడుపుకుంటూ లీసా ప్రయాణించబోయే దూరం 1,600 నాటికల్ మైళ్లు. ఫైబర్ గ్లాస్తో తయారైన ఆ నౌక.. విడిగా అన్ని నాణ్యతా ప్రమాణాలకు గట్టిగా నిలబడింది కానీ, ప్రయాణమార్గంలో అనూహ్యంగా ఎదరైయ్యే తాకిళ్లను తట్టుకోగలదా అని సందేహం. అయితే ‘ఆ మెళకువ అంతా లీసా చేతుల్లోనే ఉంది. ఆమె తనను, తన నౌకను ఊహించని కల్లోలాల నుంచి కాపాడుకోగలరు’ అని ఆమె నౌకా శిక్షకుడు రాన్ లిల్బర్న్ అంటున్నారు. అన్నట్టు లిసా జలయాత్ర చేస్తున్న నౌక పేరు ‘క్లైమేట్ ఛేంజ్ నౌ’. ప్రపంచ దేశాలలో వాతావరణ పరిరక్షణ స్మృహను కల్పించే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారట. ఇక లాసా బ్లెయిర్ తన యాత్రను విజయవంతంగా ముగించగలిగితే తిరిగి ఏప్రిల్ నాటికి ఆమె ఆల్బెనీ చేరుకుంటారు. అప్పుడామె ఒంటరిగా అంటార్కిటికా యాత్ర చేసివచ్చిన తొలిమహిళగా గుర్తింపు పొందుతారు. -
అంటార్కిటికా ఆదుకుంటుంది!
న్యూయార్క్: గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత నగరాలకు ప్రస్తుతం ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఫలితంగా అంటార్కిటికాలో హిమపాతం పెరిగి దాని ఫలితంగా సముద్ర మట్టాలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు. అంటార్కిటికాలో వాయు ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణంలో తేమశాతం పెరుగుతుంది. అంటే హిమఖండంలో మంచు పరిమాణం మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ వల్ల అంటార్కిటికా ఉపరితల ద్రవ్యరాశిలో గమనించదగ్గ మార్పులు వచ్చే ఆధారాలేవీ లభించలేదన్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీని కోసం అంటార్కిటికా ఖండానికి సంబంధించి చారిత్రక ఆధారాలు పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రయోగశాలలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి పరిశోధనలు చేశారు. -
అరుణ గ్రహంపై జీవాన్వేషకులకు చేదు వార్త
మాంట్రియల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లు ఉండే అవకాశాలున్నాయని భావిస్తూ ఇప్పటి వరకూ పరిశోధనలు నిర్వహిస్తున్న వారు ఇక ఆ ప్రయత్నాలను విరమించుకోవడమే మంచిదని కెనడా పరిశోధకులు చెబుతున్నారు. అరుణ గ్రహంపై ఉండే వాతావరణ పరిస్థితులకు దగ్గరగా ఉన్నటువంటి అంటార్కిటికాలోని అతిశీతల ప్రాంతంపై పరిశోధనలు జరిపిన మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ మేరకు ప్రకటించింది. అంటార్కిటికాలోని 'యూనివర్సిటీ వ్యాలీ' ప్రాంతంలో సుమారు నాలుగేళ్లుగా జరుపుతున్న పరిశోధనలో ఎలాంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లు దొరకలేదు. అరుణ గ్రహంపై జీవాన్వేషణ జరుపుతున్న వారికి ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే అని, అయితే.. అక్కడ జీవం ఉనికి ఉండే అవకాశాలు లేవని తెలుసుకోవడం కూడా ముఖ్యమైన అంశమే అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లిల్లీ వైట్ తెలిపారు. భూమిపై జీవించే జీవులకు అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్ లేదా మీథేన్ వాయువులను యూనివర్సిటీ వ్యాలీలో గుర్తించలేదని తెలిపారు. ఈ ఫలితాలతో అరుణ గ్రహంపై జీవం ఉండే అవకాశాలు లేవని వెల్లడవుతోందని స్పష్టం చేశారు. -
మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు..!
అక్కడ మంచు పెరుగుతోంది:నాసా గ్లోబల్ వార్మింగ్ పై గగ్గోలు పెట్టేవారు.. భూమికి వచ్చే ప్రమాదాల్లో మొదట చెప్పే ఉదాహరణ.. దృవాల వద్ద కరుగుతున్న మంచు, పెరుగుతున్న సముద్ర మట్టాలు. అయితే వీరికి సమాధానం కాదు కానీ.. ధృవాల వద్ద మంచు కరగటం లేదని నాసా తేల్చేసింది. పై పెచ్చు.. పెరుగుతోందట. ముఖ్యంగా అంటార్కిటికా ఖండంలో భారీగా మంచు నిల్వలు పేరుకుంటున్నాయని నాసా పరిశోధనలు స్పష్టం చేశాయి. నాసాకి చెందిన ఐస్, క్లౌడ్, అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ICESat) రాడార్ అల్టీ మీటర్ సాయంతో అంటార్కిటికా వద్ద మంచు పరిమాణం లెక్కగట్టినట్లు నాసా స్పేస్ సెంటర్ గ్లాసియోలజిస్ట్ జే జ్వాలీ వివరించారు. అంటార్కిటికా వద్ద పెద్ద మొత్తంలో మంచు పోగు పడుతోందని ఆయన అన్నారు. 2013లో ఇచ్చిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్ (IPCC)రిపోర్టులో ఈ విషయం స్పష్టం చేశారు. శాటిలైట్ అందించిన డేటా ఆధారంగా.. అధ్యయనం చేసిన శాస్త్ర వేత్తలు.. 1992 నుంచి 2001 మధ్య అంటార్కిటికా వద్ద ఏడాదికి 112 బిలియన్ టన్నుల మంచు పోగైందని పేర్కొన్నారు. కాగా.. తర్వాత ఐదేళ్లలో ఈ రేటు కాస్త తగ్గినా.. 2003 నుంచి 2008 వరకూ ఏడాదికి 82 బిలియన్ టన్నుల మంచు వచ్చి చేరిందని తెలిపారు. తమ అధ్యయనాల్లో వెస్ట్ అంటార్కిటికాలోని పైన్ ద్వీపం ప్రాంతంలో మంచు ఉత్సర్గ పెరుగుదల(మంచు కరగటం)నమోదైందని వివరించారు. కానీ ఈస్ట్ అంటార్కిటికా.. వెస్ట్ అంటార్కిటికాలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో తాము మంచు పెరగటాన్ని గమనించామని చెప్పారు. ఇది ఇతర ప్రాంతాల్లో మంచు నష్టాలను మించి ఉందని అన్నారు. కానీ.. అంటార్కిటికాలో మునుపటి మంచు గుట్టలను తిరిగి పొందేందుకు కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చని అభిప్పాయపడ్డారు. మంచు యుగం ముగిసిన తర్వాత ఈ ఖండం మీద వాయువుల ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగాయని తెలిపారు. దీని కారణంగా.. దృవాల వద్ద 50శాతం మంచు కరిగి పోయిందని వివరించారు. సుమారు 10వేల సంవత్సరాల నుంచి దృవాల వద్ద మంచు పోగు పడటం.. గట్టిపడటం మొదలైందని తెలిపారు. మంచు గట్టిపడటానికి శతాబ్దాల సమయం పట్టిందని అన్నారు. తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా లోతట్టు ప్రాంతాల్లో ఏటా 0.7 అంగుళాల మేర మంచు గుట్టలు పెరుగుతున్నాయని చెప్పారు. సముద్రమట్టాలు పెరిగేందుకు అంటార్కిటికా మంచు కారణం కాదని ఈపరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అయితే.. ఏటా సముద్ర మట్టాలు 0.27 మిల్లీ మీటర్ల పెరుగుదల నమోదు చేస్తున్నాయి. వీటికి వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందని అన్నారు. ఈ కారణం ఏంటో తేల్చడం ప్రస్తుతం సైంటిస్టుల ముందున్న పెద్ద సవాలని ఆయన అన్నారు. -
అంటార్కిటికా కొండకు భారత-అమెరికన్ పేరు
వాషింగ్టన్: భారత-అమెరికా శాస్త్రవేత్తను అమెరికా అరుదైన గౌరవంతో సత్కరించింది. అంటార్కిటికాలో ఓ పర్వతానికి ఆయన పేరు పెట్టింది. జంతు జనాభాకు సంబంధించి కీలక వివరాలు సేకరించడంతోపాటు అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని జెనిటిక్స్, సెల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ అఖౌరీ సిన్హాకు ఈ గౌరవం లభించింది. 1971-72లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అంటార్కిటికాలోని 990 మీటర్లు ఎతున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెడుతూ అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా కమిటీ, అమెరికా జియలాజికల్ సర్వేలు నిర్ణయం తీసుకున్నాయి. బెల్లింగ్షాసెన్, అమండ్సెన్ సముద్ర ప్రాంతాల్లో సీల్స్, వేల్స్, పక్షుల జనాభాపై అధ్యయనం చేసిన బృందంలో సిన్హా సభ్యుడు కావడంతో ఈ మేరకు ఆయన్ను సత్కరించారు. 1954లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ సాధించిన సిన్హా.. 1956లో పాట్నా యూనివర్సిటీ నుంచి జువాలజీలో ఎంఎస్సీ పూర్తిచేశారు. అనంతరం 1956 నుంచి 1961 జూలై వరకు రాంచీ కాలేజీలో జువాలజీ బోధించారు. తర్వాత అమెరికా వెళ్లారు. -
‘మంచు’కొస్తోంది...
అంటార్కిటికా.. భూగోళంపైనే అతిపెద్ద మంచుఖండం.. అన్ని ఖండాల కన్నా ఎతై ్తన ప్రాంతం.. కొన్ని శతాబ్దాల తర్వాత అయితే..? ఏమో.. ఈ మంచుఖండం చాలావరకూ సముద్రంలో కలిసిపోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం కొన్ని అడుగుల మేరకు పెరిగిపోవచ్చు.. తీరప్రాంత నగరాలకు ముంపు, తుపాన్ల ముప్పు తీవ్రం కావచ్చు.. ఎందుకు? ఏమిటి? ఎలా? తెలుసుకుందాం పదండి.. ధ్రువాల వద్ద మంచు కరిగిపోతోంది... ఇది మన చిన్నప్పటి నుంచీ వింటున్నమాటే. మంచు అన్నది కరిగిపోవడం సహజం కదా.. అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. అంటార్కిటికా ఇంతకుముందెన్నడూ లేనంత వేగంగా ఇప్పుడు కరిగిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కోతకు గురవుతోంది. అందుకే గత నెలరోజులుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు దక్షిణ ధ్రువంపై ఉన్న ఈ మంచుఖండం గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ జర్నళ్లు, ఐక్యరాజ్యసమితి ఐపీసీసీ, నాసా, ఈఎస్ఏ వంటి సంస్థలూ అంటార్కిటికాలో మంచు ఏటా ఎంతమేరకు కరిగిపోతోంది? భవిష్యత్తులో ఇదెంతవరకూ కొనసాగుతుంది? అన్న దానిపై శాటిలైట్లు, రాడార్లు, ఇతర రిమోట్ సెన్సింగ్ పద్దతుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అంచనాలతో ఇటీవలే నివేదికలు విడుదల చేశాయి. ఈ నివేదికలన్నీ తేల్చిందేంటంటే.. అంటార్కిటికాలో ముఖ్యంగా పశ్చిమ అంటార్కిటికాలో మంచుఫలకాలు తిరిగి ఎప్పటికీ కోలుకోలేనంత స్థాయిలో కరిగిపోతున్నాయి! ఆపలేని హిమ ప్రవాహం.. అంటార్కిటికాలోని పశ్చిమప్రాంతంలో ఆరు ముఖ్యమైన హిమానీనదాలు(గ్లేసియర్లు) ఉన్నాయి. వీటిలో పైన్ ఐల్యాండ్ గ్లేసియర్ ఒకటి. దీని నుంచి మంచుముక్కలు కొన్నేళ్లుగా గుట్టగుట్టలుగా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ గ్లేసియర్ నుంచి ఏకంగా 1,640 అడుగుల మందం, 12 మైళ్ల పొడవు, 20 మైళ్ల వెడల్పున్న ‘ఐస్ ఐల్యాండ్ బీ31’ అనే ఓ మంచు కొండే విడిపోయిందని.. అది క్రమంగా సముద్రం వైపుగా కదులుతోందని గతేడాది నాసా వెల్లడించింది. ధ్రువాల వద్ద మంచు ఫలకాలలో పగుళ్లు సాధారణమే అయినా.. ఇంత పెద్ద మంచు కొండలు విడిపోవడం అనేది అసాధారణమని నిపుణులు అంటున్నారు. పశ్చిమ అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతోందనడానికి ఇది సంకేతమని చెబుతున్నారు. అలాగే పశ్చిమ అంటార్కిటికాలోని గ్లేసియర్ల అడుగులు కూడా ఏటా 0.6 మైళ్ల మేరకు వేగంగా కోతకు గురవుతున్నట్లు ఇటీవలి అధ్యయనాల తర్వాతే వెలుగు చూసింది. గ్లేసియర్లు అడుగుల వద్ద కోతకు గురవడం అన్నది కూడా ఇంతకుముందెన్నడూ ఇంత వేగంగా జరగలేదు. ఉత్తరార్ధగోళంలోని గ్రీన్ల్యాండ్ కూడా కరుగుతోన్నా.. పశ్చిమ అంటార్కిటికా మాత్రమే చాలా వేగంగా కరుగుతోందంటున్నారు. 2010 నుంచే రెట్టింపు... క్రయోశాట్-2 శాటిలైట్ సమాచారాన్ని బట్టి చూస్తే.. పశ్చిమ అంటార్కిటికా మంచు ఫలకం ఏటా 160 బిలియన్ మెట్రిక్ టన్నుల మంచును కోల్పోతోందట. 2005-10నాటితో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువట. స్మిత్ గ్లేసియర్ ఏటా 30 అడుగుల వరకూ కుంగిపోతోందట. పశ్చిమ అంటార్కిటికాలో మంచు కరగడం వల్లే ఏటా 0.1 అంగుళాల చొప్పున సముద్రమట్టాలు పెరుగుతున్నాయట. ఇది చాలా తక్కువగానే కనిపిస్తున్నా.. కొన్నేళ్లలో గ్రీన్ల్యాండ్ గ్లేసియర్ కూడా కరగడం, ఇతర రకాలుగానూ నీరు సముద్రాల్లోకి చేరడాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమస్య పెద్దదతువుందని భావిస్తున్నారు. అంటార్కిటికా వేగంగా కరిగిపోతోంది సరే... ఏదోనాటికి ఆ మంచుఖండం మొత్తం మాయమవుతుందా..? అంటే కాకపోవచ్చు. కానీ ప్రస్తుత అంచనాలు చూస్తే మాత్రం మరో వెయ్యేళ్లలో దక్షిణ గోళంలో మంచుఖండం చాలావరకూ సముద్రంలో కలిసినా ఆశ్చర్యం లేదంటున్నారు. కరిగిపోతే ఏమవుతుంది..? ప్రపంచవ్యాప్తంగా 2005-10 మధ్యలో సముద్ర మట్టాలు పెరగడానికి పశ్చిమ అంటార్కిటికాలో ఉన్న ఆరు గ్లేసియర్లు కరగడమే 10 శాతం కారణమయ్యాయట. ఈ గ్లేసియర్లు ఇలాగే కరిగిపోతే గనక.. సముద్ర మట్టాలు వందేళ్లలోనే ఏకంగా 4 అడుగుల మేరకు పెరుగుతాయని అంచనా. అదేవిధంగా మొత్తం పశ్చిమ అంటార్కిటికాలోని మంచు ఫలకం కరిగిపోతే 10 నుంచి 15 అడుగుల మేరకు సముద్రమట్టాలు పెరుగుతాయని, ఫలితంగా తీరప్రాంతాలకు ముంపు, తుపానుల ముప్పు పెరుగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు 2012లో అమెరికాను అతలాకుతలం చేసిన శాండీ తుపాను సముద్రమట్టం ఒక అడుగు ఎక్కువగా ఉన్న చోట్లలోనే తీరాన్ని దాటి పెను విధ్వంసం సృష్టించింది. సముద్రమట్టం ఒక్క అడుగు పెరిగితేనే తుపాన్లకు ఎంత ఊతం లభిస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనంగా నిలిచింది. అదే భవిష్యత్తులో 10 నుంచి 15 అడుగులు పెరిగితే న్యూయార్క్, దక్షిణ ఫ్లోరిడా, వర్జీనియాలోని అనేక ప్రాంతాలు జలమయం అవుతాయి. వీటికి తోడు తీరప్రాంతాలకు తుపాన్ల ముప్పు ఎక్కువ అవుతుంది. ఒక్క అమెరికానే కాదు.. సింగపూర్, బంగ్లాదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఇతర లోతట్టు తీరప్రాంతాలన్నింటికీ ముప్పు పెరుగుతుంది. గ్రీన్హౌజ్ వాయువులే ప్రధాన కారణం... ధ్రువాల వద్ద మంచు కరగడానికి ప్రధానంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్)ని పెంచే గ్రీన్హౌజ్ వాయువులు పెరగడమే కారణమని పరిశోధకులు అంటున్నారు. అంటార్కిటికాపై గాలుల ప్రభావం పెరగడం వల్ల వేడి నీరు గ్లేసియర్ల అడుగుభాగాన్ని తాకడం పెరిగిందని, దీంతో గ్లేసియర్ల అడుగులు వేగంగా కోతకు గురవుతున్నాయని చెబుతున్నారు. భూతాపోన్నతి వల్ల భవిష్యత్తులో వే డినీటి ప్రవాహం మరింత పెరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా అంటార్కిటికాపై ఓజోన్ పొర కూడా క్షీణించడం వల్ల కూడా అక్కడ సముద్ర జలాలు వేడెక్కడంతోపాటు గాలి ప్రవాహంలో మార్పులు వచ్చాయట. పరిష్కారమెలా..? అంటార్కిటికాలో మంచు కరగడాన్ని ఎవరూ ఆపలేక పోయినా.. అక్కడ మంచు కరగడం అనేది ఎప్పటికప్పుడు గ్రీన్హౌజ్వాయువుల విడుదల స్థాయి, భూతాపోన్నతి పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గిస్తే గనక భూతాపోన్నతి తగ్గి భవిష్యత్తులో మంచు కరిగే వేగం తగ్గవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే సీవోటూ, ఇతర గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాల నియంత్రణకు ఇకనైనా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం చూడాలని చెబుతు న్నారు. గ్రీన్హౌజ్ వాయువుల నియంత్రణకు వచ్చే కొన్ని దశాబ్దాల్లో తీసుకునే చర్యలపైనే దక్షిణ గోళంపై మంచు ఖండం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. - హన్మిరెడ్డి యెద్దుల -
భూమి పైకొస్తోంది!
లండన్: అంటార్కిటికాలో మంచు అడుగున ఉన్న భూమి పైకి తన్నుకొస్తోంది.. అదీ 400 కిలోమీటర్ల లోతు నుంచి.. ఏడాదికి 15 మిల్లీమీటర్ల వేగంతో పైకి వస్తోంది.. అదికూడా మొత్తం అంటార్కిటికా ఖండం కాకుండా.. అక్కడక్కడా పైకి లేస్తూ ఉపరితలం రూపును మార్చేస్తోంది.. బ్రిటన్కు చెందిన న్యూకాజిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో దీనిని గుర్తించారు. ‘‘అంటార్కిటికా ఖండంపై కొన్ని కిలోమీటర్ల మందంతో కప్పి ఉన్న మంచు కారణంగా అక్కడి భూమి పైపొర లోనికి కుంగిపోయి ఉంది. భూమి వేడెక్కడం కారణంగా మంచు కరిగిపోతుండడంతో... ఒత్తిడి తగ్గి పైకి లేస్తోంది. అయితే భూమిపై మిగతా ప్రాంతాల్లోకన్నా.. అంటార్కిటికా ఖండం కింద భూమి పొర సాంద్రత తక్కువగా ఉండడం వల్ల ఇది మరింత వేగంగా జరుగుతోంది.’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రేస్ నీల్డ్ చెప్పారు. -
అంటార్కిటికాలో మైనస్ 93.2 డిగ్రీలు...
అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో మైనస్ 93.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భూమిపై అతిశీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో తాజాగా నమోదైన ఉష్ణోగ్రత గత రికార్డులను బద్దలుకొట్టింది. ఈ ప్రాంతంలో 1983లో రికార్డు స్థాయిలో మైనస్ 89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంతకంటే తక్కువగా 2010 ఆగస్టు 10న ఈ ప్రాంతంలో మైనస్ 93.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు జరిపిన తాజా విశ్లేషణలో వెల్లడైంది. వివిధ ఉపగ్రహ పరికరాల సాయంతో ఈ ప్రాంతంలో గడచిన 32 ఏళ్ల కాలంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ‘నాసా’ శాస్త్రవేత్తలు విశ్లేషించారు.