AP Disha Act
-
‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’
సాక్షి, తాడేపల్లి: మహిళలకు సత్వర న్యాయం అందించడానికే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో, ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస చర్యలు లేవు. కానీ నేడు మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. దిశ చట్టాన్ని వక్రీకరించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.80కోట్లు కేటాయించారని.. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... సిబ్బంది నియమాకాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సుచరిత. (‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్ముఖ్) ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.80 లక్షల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని సుచరిత తెలిపారు. దిశ చట్టానికి 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేలకు పైగా మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశామన్నారు. దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుది రాక్షస గుణం.. ఆయన కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాబు అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా దళితుడిని నియమిస్తే అడ్డుకున్నారన్నారు సుచరిత. (ఏపీ.. ట్రెండ్ సెట్టర్!) విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తుంటే.. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. దళితులుగా ఏవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 82.5 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించామన్నారు. మొదటి బడ్జేట్లోనే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చామని తెలిపారు. భారత దేశంలోనే ఓ దళిత మహిళను హోంమంత్రి చేయాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ సీఎం జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను అమలు చేయలేదు.. కానీ సీఎం జగన్ ముందుగా డేట్ ప్రకటించి మరీ సంక్షమ పథకాలు అమలు చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నయన్నారు సుచరిత. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
-
గృహహింస: దిశ టీం 24 గంటలు పనిచేస్తుంది
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణకు ఏర్పాటు చేసిన వన్స్టాప్ సెంటర్లలో దిశ టీం 24 గంటలు పనిచేస్తుందని దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వన్స్టాప్ సంటర్ల నుంచే బాధితులకు నిపుణులైన ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందుతుందన్నారు. 24 గంటలు పోలీసుల సంరక్షణ, వసతి సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. (గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం) రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహళలకు వసతి, రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం ఉమెన్ హెల్స్లైన్ 181 రౌండ్ దీ క్తాక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో పోలీసు స్టేషన్లకు వెళ్లలేరని మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని దీపికా హెచ్చిరించారు. మహిళా రక్షణ కోసం దిశ సిబ్బంది 24 పనిచేస్తున్నారని, బాధిత మహిళల తక్షణ సహాయం కోసం ప్రతీ జిల్లాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని దీపికా పాటిల్ తెలిపారు. (గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ) జిల్లా పేరు డయల్ చేయాల్సిన నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 గంటూరు 9963190234 పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 విజయనగరం 8501914624 తూర్పుగోదావరి 9603231497 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797 చిత్తూరు 9959776697 వై.యస్.ఆర్ . కడప 8897723899 -
మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
సాక్షి, అమరావతి: 2020ని 'ఉమెన్ సేఫ్టీ ఇయర్’గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మరో 12 దిశ పోలీస్స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి దిశ పోలీస్స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీఎం లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకే ‘దిశ’ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మహిళా మిత్రలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలీస్స్టేషన్లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు రావాలంటే మహిళలు భయపడే రోజులు పోవాలన్నారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ‘దిశ’లో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని.. పూర్తిస్థాయి భద్రతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గతం కంటే ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి అందుబాటులో 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో నేటి నుంచి 18 దిశ పోలీస్స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ‘దిశ చట్టం’ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ అన్నారు. ‘దిశ ఎస్ ఓ ఎస్ యాప్’కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 122 కాల్స్ వచ్చాయని 37 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని తెలిపారు. తమ పొరుగు మహిళలు ఆపదలో ఉన్నారని పురుషుల నుంచి సైతం కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈచ్ ఫర్ ఈక్వల్’ అనే నినాదం ఇస్తున్నామని చెప్పారు. పొరుగు మహిళల కష్టాలు చూసి తోటి మహిళలు సైతం ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈవ్టీజర్ల బెడద తప్పింది.. వీక్లీ ఆఫ్తో వారంలో ఒక రోజు కుటుంబం అంతా కలిసే అవకాశం కలుగుతుందని ‘దిశ’ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్తో ఈవ్టీజర్ల బెడద చాలా వరకు తప్పిందని డీజీపీకి మహిళా మిత్రలు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో మహిళలు నిర్భయంగా ఉన్నారన్నారు. అఘాయిత్యాలు, వేధింపులకు చెక్ పెట్టడంతో మహిళల్లో భరోసా కనిపిస్తోందని తెలిపారు. ‘దిశ యాప్’పై విస్తృత ప్రచారం కల్పించి.. అధిక మంది డౌన్లోడ్ చేసుకునేవిధంగా కృషి చేయాలని డీజీపీని మహిళా మిత్రలు కోరారు. ఏలూరు: మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలో దిశ మహిళా పోలీస్టేషన్ను కలెక్టర్ ముత్యాలరాజు, డీఐజీ కేవీ మోహన్రావు, ఎస్పీ నవదీప్ సింగ్గ్రేవాల్ ప్రారంభించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు. -
ఏపీలో మరో 12 ‘దిశ’ పోలీస్స్టేషన్లు
సాక్షి, విజయవాడ: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని.. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. దిశ-2019 చారిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిందని.. రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దిశా చట్టానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్) మహిళా పీఎస్లు అప్గ్రేడ్.. ‘దిశ’ చట్టం అమలులో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులతో పాటు విశాఖ, తిరుపతిలో ‘దిశ’ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పీఎస్లను ‘దిశ’ ఉమెన్ పోలీస్స్టేషన్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ కు ఇరవై ఐదురోజుల్లో 86 క్రియాశీలక కాల్స్ వచ్చాయన్నారు. ఇరవై ఆరు కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. భర్త వేధింపులు,ఈవ్ టీజింగ్ మెసేజ్ లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘దిశ యాప్’ను రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. 14 వేల కాల్స్ వచ్చాయన్నారు. స్పందనలో 52 శాతం మహిళలు ఫిర్యాదు ఇవ్వడం మార్పుకు నిదర్శనమన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సైబర్ మిత్రా ఏర్పాటు చేసామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయన్నారు. సైబర్ మిత్రకు ‘9121211100’ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని డీజీపీ పేర్కొన్నారు. (దశ 'దిశ'లా స్పందన) -
‘దిశ చట్టం గురించి ప్రతి ఒక్కరికి వివరించాలి’
సాక్షి, కృష్ణా : మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ను మంగళవారం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్నాని, కొడాలి నాని, మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, రక్షణనిధి, వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్, నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. (‘దిశ యాప్’తో మహిళలకు రక్షణ: సుచరిత) చదవండి: కడప జైలులో దేశంలోనే తొలిసారిగా.. -
కామాంధునికి ‘దిశ’ బేడీలు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్నా కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడ్డాడు. డబ్బు, వస్తువులు ఆశ చూపి అభంశుభం తెలియని యువతులను మోసం చేశాడు. శృతిమించిన అతని చేష్టలతో విసిగిపోయిన భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. అతని బారి నుంచి ఓ విద్యార్థినిని కాపాడింది. కామాంధుడి చెర నుంచి విద్యార్థినిని రక్షించినందుకు మేరీ జెస్సికాను అందరూ అభినందించారు. వివరాలివీ.. - గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.అనిల్కుమార్ విజయవాడలో రైల్వే గార్డు. - మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి ఆడపిల్లలను వలలో వేసుకుంటాడు. వారి జీవితాలను నాశనం చేస్తాడు. - తన ఇంటి సమీపంలోనే డిగ్రీ చదివే ఓ విద్యార్థినికి మొబైల్ ఫోన్ ఆశ చూపి వశపరుచుకున్నాడు. ఏకాంతంలో ఉండగా తీసిన ఫొటోలను చూపి బెదిరించి తన కోరికలు తీర్చుకున్నాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా వారించింది. - అతనిలో మార్పు రాకపోవడంతో ఆ విద్యార్థిని కుటుంబాని అక్కడి నుంచి దూరంగా పంపేసింది. - అయినా అనిల్ ఆ విద్యార్థినిని వదలలేదు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తున్న విద్యార్థినిని బెదిరించి, హోటల్కు తీసుకువెళ్లేందుకు యత్నించాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా అక్కడికి చేరుకుంది. దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. - రెండు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనిల్కుమార్ను, విద్యార్థినిని పోలీస్ స్టేషన్కు తరలించారు. - ఆరు నెలలుగా అనిల్కుమార్ తనను ఏ విధంగా వేధిస్తున్నదీ విద్యార్థిని పోలీసులకు వివరించింది. - విద్యార్థిని ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం స్టేషన్ మహిళా ఎస్ఐ స్వాతి కేసు నమోదు చేశారు. అనంతరం కేసును తాడేపల్లి స్టేషన్కు బదిలీ చేశారు. - అనిల్కుమార్ను అరెస్టు చేశారు. -
దిశ కంట్రోల్ రూమ్: తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి
సాక్షి, విజయవాడ: దిశ కంట్రోల్ రూమ్లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మొదటి బ్యాచ్లో శిక్షణ పొందారు. దిశ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించాలి, సమాచారాన్ని దిశ ఎమర్జెన్సీ టీమ్లకు ఎలా చేరవేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. కీలక పాత్ర పోషించాలి : డీజీపీ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు సూచనలు చేశారు. దిశ కంట్రోల్ రూమ్, దిశ ఎస్ఓఎస్ అప్లికేషన్ ప్రాముఖ్యతను, ఆపదలో ఉన్న మహిళల్ని ఎలా రక్షించాలో ఆయన వివరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ విధులలో కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. ముఖ్యంగా మహిళల రక్షనే బాధ్యతగా భావించాలని, ఉద్యోగంలా కాకుండా సేవా గుణంతో బాధ్యతయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘రాజకీయ లబ్ధి కోసమే ఆ ఆరోపణలు’
సాక్షి, గుంటూరు: తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) రాష్ట్ర్రంలో మొత్తం 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘దిశ’ ఎస్ ఓ ఎస్ యాప్ ను కూడా రూపొందించామని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్ను ఉపయోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని.. కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పోలీస్ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. -
మహిళల భద్రతే సీఎం జగన్ మోదటి ప్రాధాన్యత
-
చట్టం 'దిశ'గా!
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణతోపాటు బాధితులకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్టరూపం కల్పించే చర్యలను ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందచేసింది. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడి, వేధింపులను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. నిర్భయ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం రుజువైతే దోషులకు ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. ఈ కేసుల దర్యాప్తు, విచారణ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రతిపాదించింది. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరిశిక్ష విధించేలా మార్పులు చేసింది. ఈ క్రమంలో త్వరితగతిన విచారణ, శిక్ష అమలులో వెసులుబాటు, ప్రత్యేక కోర్టులు, యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లు, కేంద్ర హోంశాఖ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది. దిశ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలను చట్టపరంగా, న్యాయపరంగా ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో మార్పులు, కొత్తవి రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం గత నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐపీసీ 1860, ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) 1973 చట్టాల్లో మార్పులు తెచ్చి కేసుల దర్యాప్తు, విచారణ, తీర్పు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే చట్టరూపం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును చట్ట రూపంలోకి తేవటంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు ప్రతిపాదించే సవరణలకు కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ఈ బిల్లును పరిశీలించి న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపింది. బిల్లును ఏ సబ్జెక్ట్ ప్రకారం ప్రతిపాదించారు? ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లకు సంబంధించి ఏ మార్పులు చేశారు? అనే కొన్ని ప్రాథమిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. దిశ బిల్లు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం. – దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
దిశ చట్టంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపెడుతున్నాయి
-
ఏపీ.. ట్రెండ్ సెట్టర్!
సాక్షి, అమరావతి: అనుసరించడం కాదు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాలను తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందని నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం తీసుకున్న అనేక సంచలన, సాహసోపేత నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతోపాటు వాటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధానంగా.. పాలనా వికేంద్రీకరణ, దిశ బిల్లు, పోలీస్ వీక్లీ ఆఫ్, స్పందన వంటి నిర్ణయాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. దశ‘దిశ’లా.. మహిళలు, బాలికల రక్షణకు దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన దిశ బిల్లు తరహాలో చట్టం తెచ్చేందుకు పలు రాష్ట్రాలు సీరియస్గా పరిశీలిస్తున్నాయి. ఏపీ తరహాలో దిశ బిల్లు తెస్తామంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం కూడా అమరావతికి వచ్చి ఏపీ కీలక అధికారులు, మంత్రులతో దిశ బిల్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిశ బిల్లు అద్భుత నిర్ణయమని ప్రశంసించారు కూడా. పాలనా వికేంద్రీకరణపై.. మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపి పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక కూడా తాజాగా ఇదే బాట పట్టడం గమనార్హం. ఇందులో భాగంగా అక్కడి యడియూరప్ప ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా. అక్కడ బెంగళూరుతోపాటు బెళగాలిలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని ఆ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప నడుస్తున్నారంటూ విద్యావంతులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా అనుసరిస్తూ కర్ణాటక సర్కారు కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఓ సంచలనం.. ఇక 24 గంటలు కష్టపడే పోలీసులకు వారంలో ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలనే ప్రతిపాదనను అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరో నిర్ణయాన్ని కూడా అనుసరించేందుకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగాదీనికి సంబంధించి వివరాలు కోరిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నివేదించారు. అపూర్వ ‘స్పందన’.. ప్రజల కష్టాలు తీర్చే ‘స్పందన’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్పందన అమలుచేస్తున్న తీరుతెన్నులపై కూడా అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. కాగా.. ఇటీవల గుజరాత్లోని వదోదరాలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్లో ఏపీ పోలీస్ స్టాల్లో ‘స్పందన’ అమలుతీరును అడిగి తెలుసుకుని ప్రశంసించారు. అంతేకాక.. దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రధాని కోరడం గమనార్హం. -
మీ ఫోన్లో దిశ యాప్ ఉందా?
-
సీఎం జగన్ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
-
‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్ముఖ్
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. సచివాలయం సీఎస్ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్స్టేషన్ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. (దిశ.. కొత్త దశ) దేశంలోనే మొదటిసారిగా.. దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు,మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు. (‘దిశ’ కాల్తో అర్ధరాత్రి బాలికకు రక్షణ ) చారిత్రాత్మకమైన బిల్లు.. బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వనిత తెలిపారు. కసరత్తు చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు. -
సీఎం జగన్ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ’చట్టం గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్ను కలిసి దిశా చట్టం గురించి అడిగి తెలుసుకుంది. (చదవండి :మహారాష్ట్రలో దిశ చట్టం!) ఈ సందర్భంగా సీఎం జగన్ ఆ బృందానికి దిశ చట్టం గురించి వివరించారు. సీఎం జగన్ను కలిసిన బృందంలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ముఖ్, డీజీపీ సుబోత్ కుమార్, అదనపు సీఎస్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీకి మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అధికారుల బృందం గురువారం వచ్చింది. దేశవ్యాప్తంగా అందరి మన్నలను పొందుతున్న దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, డీజీపీ సుబోత్కుమార్ జైశ్వాల్, అడిషనల్ చీఫ్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ఏపీకి చేరుకుంది. కాసేపట్లో ఏపీ హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, దిశ స్పెషల్ ఆఫీసర్లతో మహారాష్ట్ర బృందం భేటీ కానుంది. (దేశంలోనే తొలిసారిగా..) (మహారాష్ట్రలో దిశ చట్టం!) -
ఐపీఎస్ దీపికకు ఎస్పీగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక దిశ చట్టం పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికకు ఎస్పీగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ హోదాలో మంగళగిరి డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా దీపికను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా దిశ చట్టం అమలులో భాగంగా ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. (‘దిశ’ కాల్తో అర్ధరాత్రి బాలికకు రక్షణ) దిశ చట్టంలో ప్రత్యేకతలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం రేప్, గ్యాంగ్ రేప్లకు పాల్పడితే ఉరిశిక్ష చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్లో నమోదు చేస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆధునికీకరణ తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్లు దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్ఐ పోస్టులు మంజూరు బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ సౌకర్యం. -
దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. (చదవండి : ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్) ‘ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి సమాజంలో మహిళలకు, బాలికలను రక్షణ కరువైంది. ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా, మామయ్యాలా ఆలోచించి దిశ పోలీస్ స్టేషన్లను ప్రవేశ పెట్టారు. ఆడవాళ్లనే కాకుండా నాలాంటి పేద విద్యార్థులకు రక్షణ కల్పించారు. ఆడవాళ్లందరి తరపున మన మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, మన కర్నూలును న్యాయ రాజధానిగా ఎంచుకున్నందుకు మన మామయ్య గారికి మనమెంతో రుణపడి ఉండాలి’అని జ్యోతిర్మయి పేర్కొంది. చిన్నారి ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
‘దిశ’ కాల్తో అర్ధరాత్రి బాలికకు రక్షణ
గుమ్మఘట్ట: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ మారుమూల గ్రామాల్లో సైతం సకాలంలో సేవలను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ బాలిక అర్ధరాత్రి వేళ దిశ యాప్ ద్వారా రక్షణ పొందింది. స్థానిక ఎస్ఐ తిప్పయ్యనాయక్ తెలిపిన పూర్తి వివరాల మేరకు.. గుమ్మఘట్ట మండలంలోని 75–వీరాపురం తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఊరు ఊరంతా ఉత్సవంలో పాల్గొంది. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడారు. ఓ 16 ఏళ్ల బాలికకు నిద్ర వస్తోండడంతో రాత్రి 12:45 నిమిషాలకు పక్క వీధిలో ఉన్న ఇంటికి వెళ్లసాగింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన తిరుపాల్నాయక్ (21) అనే యువకుడు వెంటపడ్డాడు. కోరిక తీర్చాలని చెయ్యి పట్టుకున్నాడు. అమ్మాయి చెంప మీద కొట్టి గట్టిగా కేకలు పెట్టింది. వెంటనే తక్షణ సాయం కోసం ‘దిశ యాప్’కు మెసేజ్ చేసింది. ఆ లోపు అటువైపు ఇంటికి వెళ్తున్న బాలిక చిన్నాన్న ఈ ఘటనను గమనించి అక్కడికి చేరుకునేలోగా యువకుడు పరారయ్యాడు. విజయవాడ ‘దిశ’ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బాధితురాలి సమాచారం అందింది. అక్కడి నుంచి రాయదుర్గం రూరల్ సీఐ పి.రాజ, ఎస్ఐ తిప్పయ్యనాయక్లను ఎస్పీ అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మారుమూల గ్రామాల్లోని యువతులు కూడా ‘దిశ యాప్’ గురించి తెలుసుకోవడం వల్లే నిందితున్ని వెంటనే పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. -
అత్యాచార బాధితులకు వేగంగా సేవలు
వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతుంది. అయితే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఏ ఒక్కరూ.. ఎంతటి వారైనా సరే తప్పించుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన వైద్య పరీక్షలపై దృష్టి సారించింది. పక్కా ఆధారాలతో దోషులను కోర్టు బోనులో నిలిపేందుకు అత్యంత ప్రొఫెషనల్గా ముందుకు అడుగులు వేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టం రూపొందించిన తర్వాత అత్యాచార బాధితులకు వైద్య శాఖ తరఫున అందాల్సిన సేవలకు మరింత పదును పెంచారు. అర్ధరాత్రి, అపరాత్రి ఇలా ఏ సమయంలో వచ్చినా అలాంటి బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించడం, వారి స్టేట్మెంట్ రికార్డు చేయడం, పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి వాటిపై దృష్టి సారించారు. దీనికోసం 23 మంది గైనకాలజీ వైద్యులకు 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి బాధితులకు కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా తేలిన ఫలితాలే నిందితులకు శిక్ష పడేందుకు ఊతమిస్తాయి. అలాంటి నిర్ధారణ పరీక్షలు తారుమారు కాకుండా చూడటం, పకడ్బంధీగా రక్త పరీక్షలు నిర్వహించడంలో భాగంగా గైనకాలజిస్ట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 11 బోధనాసుపత్రులు ఉండగా, విజయవాడ ఆసుపత్రి నుంచి ముగ్గురు, మిగతా ఆసుపత్రుల నుంచి ఇద్ద్దరు చొప్పున మొత్తం 23 మంది వైద్యులకు శిక్షణ పూర్తయింది. ఈ బృందంలో ఫోరెన్సిక్ డాక్టర్లూ ఉంటారు. ‘దిశ’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బాధితులకు సత్వర న్యాయం అందించడంలోగానీ, నిందితులకు శిక్షలు వేయడంలో గానీ మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని, ఆ తరహాలో వైద్యులు పని చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు బోధనాసుపత్రుల్లో బాధితులకు సేవలందించడంలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని వైద్య విద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్ ‘సాక్షి’తో అన్నారు. పక్కాగా రికార్డుల నిర్వహణ ఇలా.. - నిర్ధారణ పరీక్షల ఫలితాల నివేదికలను గతంలో కొంత మంది నిందితులు తారుమారు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇకపై అలా జరగకుండా వైద్యులు రాత పూర్వకంగా ఇచ్చే నివేదికతో పాటు అవే అంశాలను ఎలక్ట్రానిక్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఈ నివేదికలను ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ తారుమారు చేయకుండా చూస్తారు. - బాధితులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య సేవలు అందించడంలో భాగంగా గైనకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్లు మూడు షిఫ్టులూ పని చేసేలా ఆదేశాలు. - బాధితులకు వైద్యం, నిర్ధారణా పరీక్షలు, నివేదికలపై తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. - ప్రతిరోజూ ఇలాంటి బాధితులకు అందుతున్న వైద్యం, కేసుల వివరాలు, నివేదికలపై పురోగతి, ఆ నివేదికలను పోలీసులకు సకాలంలో అందించడం.. తదితర విషయాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నోడల్ అధికారిగా డా.నీలిమను నియమించింది. - బోధనాసుపత్రుల్లో బాధితులకు వైద్యనిర్ధారణ పరీక్షలు అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలను అమర్చుతున్నారు. -
దిశ చట్టం రూపుదాల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. శుక్రవారం రాత్రి హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 9.40 గంటల నుంచి రాత్రి 10.20 వరకు దాదాపు 40 నిమిషాల పాటు రాష్ట్ర అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి. దిశ చట్టం కోసం చేయాల్సిందంతా చేశాం ‘మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. విచారణను వేగంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలోగా శిక్షలు విధించడానికి దిశ చట్టం తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశాం. అందువల్ల ఏపీ దిశా చట్టం త్వరిత గతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలి. శాసనమండలి రద్దును ఆమోదించాలి శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెచ్చిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖకు సూచించి ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదించేలా చూడాలి. ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలి పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉండిపోయాయి. ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యవస్థ సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నా.. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యం చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. హోంమంత్రిత్వ శాఖ రూ.253.40 కోట్ల అంచనా వ్యయంతో దీనిని 2017లో ఆమోదించింది. ఇందులో రూ.152 కోట్లు కేంద్ర వాటా కాగా, రూ.101.40 కోట్లు రాష్ట్ర వాటా. కానీ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో ఈ ప్రాజెక్టు మూత పడింది. ఈ విషయంలో చొరవ చూపి ఆదుకోవాలి. సీనియర్ అధికారులను కేటాయించండి శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రత కోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత కేడర్ సామర్థ్యం పెంచాలి. ఇందులో భాగంగా 79 సీనియర్ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో డిప్యుటేషన్పై పని చేసేందుకు వీలుగా డీఐజీ, ఐజీపీ, ఏడీజీపీ ర్యాంకుల్లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్ర పోలీసు విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున ఈ అంశాల పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలి. దీంతోపాటు స్టేట్ ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సెంట్రలైజ్డ్ డేటా సెంటర్, ఏపీ పోలీస్ అకాడమి ఏర్పాటుకు తగిన సహాయం చేయాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖపట్నం, జ్యుడిషియల్ కేపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ కేపిటల్గా అమరావతి కొనసాగేలా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయంలో అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం–2020కి కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. రెండు మూడు నెలల్లో ఇది చట్టంగా మారనుంది. ఈ దిశగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం మీకు తెలిసిందే. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రాజెక్టులకు సాయం ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలి. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం – చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగు పరచడానికి గోదావరి నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలి. ఆ మేరకు సంబంధిత శాఖలకు సిఫారసు చేయాలి. పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.838 కోట్లు ఆదా చేశాం. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,549 కోట్లుగా కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక కమిటీ 2019 ఫిబ్రవరిలో ఆమోదించింది. దీనికి సంబంధించిన పాలనా పరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సహాయ, పునరావాస వ్యయం రూ.3,200 కోట్ల నుంచి రూ.33,010 కోట్లకు పెరగడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వినియోగపత్రాలు అందజేసినప్పటికీ, ప్రభుత్వ సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆడిట్ చేసినప్పటికీ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జల వనరుల శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. గ్రాంట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ. 10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయితే గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు వస్తున్నా.. ఏపీకి రావడం లేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన ఏడు జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్ఖండ్ తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన జరిగిన తొలి ఏడాది 2014–15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటును భర్తీ చేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 సంవత్సర రెవిన్యూ లోటును రూ.22,949 గా కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. ఈ మేరకు నిధులు విడుదల చేయించాలి. రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేయగా.. ఇందులో రూ.1,000 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. ఇది 15వ ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన ఆదేశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమిత్ షాకు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నందిగం సురేష్ ఉన్నారు. మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చండి.. ఢిల్లీ తెలుగు పాత్రికేయుల వినతి ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందేలా మెడిక్లెయిమ్ కార్డులు సమకూర్చాలని ఢిల్లీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అక్రిడేటెడ్ తెలుగు జర్నలిస్టులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాని కలిసేందుకు ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రిని ఢిల్లీ తెలుగు పాత్రికేయులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వీరితో ఆత్మీయంగా మాట్లాడిన వైఎస్ జగన్.. ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. ఈ సౌకర్యాన్ని అందించే దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం శనివారం ఉదయం తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. -
ఏపీలో దిశ యాప్కి అనూహ్య స్పందన
-
6 నిమిషాల్లోనే అరెస్టు చేశాం: దీపికా పాటిల్
సాక్షి, విజయవాడ: మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్నకు అనూహ్య స్పందన లభిస్తోందని దిశ చట్టం పర్యవేక్షణ ప్రత్యేక ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్ అన్నారు. యాప్ ప్రారంభించిన నాలుగు రోజుల్లో 4, 105 మెసేజ్లు వచ్చాయని.. అందులో చాలా వరకు యాప్ను పరీక్షించేందుకు చేసినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని.. 38 ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బుధవారం దీపికా పాటిల్ మాట్లాడుతూ.. బస్సులో మహిళను వేధించిన కేసులో ఆరు నిమిషాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని 18 దిశా పోలీస్ స్టేషన్లను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. (6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు) ‘‘దిశా చట్టానికి రాజముద్ర పడే లోపు మహిళా రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. దిశా యాప్పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మహిళలల్లో చైతన్యం తీసుకువస్తాం. మహిళల పట్ల చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొంటాం. సోషల్ మీడియా వేధింపులపైనా ప్రత్యేక నిఘా పెట్టాం. మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా దిశా బృందం ముందుకు సాగుతుంది’’ అని దీపికా పాటిల్ పేర్కొన్నారు. -
భరోసా కల్పించిన దిశ యాప్..
-
6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు
తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ ‘దిశ యాప్’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. భరోసా కల్పించిన దిశ యాప్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రారంభించిన దిశ యాప్ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు. యాప్లోని ఎస్ఓఎస్ బటన్ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కె.బసవయ్య నాయక్పై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయడంతో క్రైమ్ నెంబర్ 52/2020 సెక్షన్ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పర్యవేక్షించారు. పోలీసులకు సీఎం జగన్ అభినందనలు దిశ యాప్ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ – బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ కానిస్టేబుల్ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. – త్రీటౌన్ ఎస్ఐ బీఎస్డీఆర్ ప్రసాద్, మరో కానిస్టేబుల్ టి.సతీష్ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. – బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్కి ఫోన్ చేయగా డయల్–100కి కాల్ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది. -
‘దిశ’ తప్పిన ‘పచ్చ’ రాజకీయం
సాక్షి, మహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను తు.చ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది స్థాయి వరకూ పాటిస్తున్నట్టుంది. మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ‘దిశ’ తొలి పోలీసు స్టేషన్ను రాజమహేంద్రవరం కేంద్రంగా శనివారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రయత్నాన్ని పార్టీలకతీతంగా అన్ని వర్గాలూ స్వాగతించాయి. కానీ ప్రచారం కోసం టీడీపీ రాజకీయ రంగు పులమడాన్ని ఆ పార్టీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గ’న్నట్టుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు ఇలా... గత డిసెంబరు 16న అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో మద్యం బ్రాండ్ల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై హేళన చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే నెల 17న స్పీకర్కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి ‘దిశ’ చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాజమహేంద్రవరంలోని ‘దిశ’ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు మౌనం...? గత ఏడాది డిసెంబరు 17న అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ సైబర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించి ఇప్పుడు ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో ఔచిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శనివారం దిశ పోలీసు స్టేషన్ ప్రారంభమైతే 48 గంటలు కూడా తిరగకుండానే ఇంత హఠాత్తుగా ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటంటున్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి 53 రోజులవుతోంది. ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోకుండా పార్టీ కార్యకర్తలతో దిశ పోలీసు స్టేషన్కు రావడమేమిటని అక్కడున్నవారే విసవిసలాడారు. మహిళా ఎమ్మెల్యేగా గైర్హాజరవుతూ... మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ పోలీసు స్టేషన్ను తన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక మహిళా ప్రతినిధి అయి ఉండి గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏమైనా పార్టీ కోణంలో చూసిందా అంటే అదీ లేదు. పోలీసు శాఖ నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులకు పంపించినట్టుగానే ఈ ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపించినా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేస్తూ...న్యాయం జరిగేలా చూసి... దిశ చట్టంపై మహిళల్లో నమ్మకం కలిగించాలని ఎలా కోరతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యారు. సమావేశానికి హాజరై చట్టంపై తన అభిప్రాయాన్ని తెలియజేసి ఉంటే మరింత హుందాగా ఉండేదంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నాయకులు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. 53 రోజుల కిందట జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ పరిధిలో ఉంది. దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష ఆరు నెలలుగా ఫేస్ బుక్లో అసభ్యంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చింది. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన మద్దుల రాజేశ్వరి 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకూ పోస్టింగ్లు ఉన్నాయంటున్నారు. ఫేస్ బుక్లలో 18 అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఏడాది కిందట జరిగిన సంఘటనపై ఒకటి, నెల కిందట జరిగిన సంఘటనపై మరొకటి ఫిర్యాదు చేశారు. ఈ మూడు ఫిర్యాదులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనివి కావు. అయినా న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటాం. జీరో ఎఫ్ఐఆర్ అనేది అత్యవసర సంఘటనలో మహిళల రక్షణ కోసం తీసుకుంటాం. మూడు సంఘటనలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావు. భారత దేశం మొత్తం దిశ చట్టం కోసం అభినందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, చట్టం అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలి. – లతామాధురి, అదనపు ఎస్పీ, రాజమహేంద్రవరం. -
వైఎస్ఆర్ జిల్లలో దిశ స్టేషన్ ప్రారంభం
-
సీఎం జగన్ నిర్ణయం చారిత్రాత్మకం
-
దిశ చట్టం దేశానికే రోల్ మోడల్
-
దిశ.. కొత్త దశ
-
దిశతో భరోసా
-
ఆడబిడ్డకు అండగా
-
దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, విజయవాడ: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు. సీఎం ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ నూతన ఒరవడికి అద్దం పట్టేలా రూపొందించటం జరిగిందన్నారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆధునిక హంగులతో దిశ పోలీస్స్టేషన్ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దిశ పీఎస్లో డీఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు ఎస్ఐలతో సహా 47 మంది సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.(ల్యాబ్స్ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్) -
విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రారంభోత్సవ తేదీ ఖరారైన వెంటనే విశాఖలో దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్నామని విశాఖ నగర సీపీ ఆర్కే మీనా తెలిపారు. శనివారం నగర కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో ’దిశ’ చట్టంపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయనతో పాటు డీసీపీ రంగారెడ్డి, పలువురు అధికారులు, మహిళ మిత్రలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే పోలీస్స్టేషన్ల ఏర్పాటు, వాహనాలు, కోర్టులు, పిపీలు, ఫోరెన్సిక్ ల్యాబ్ల కోసం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్) రాష్ట్రంలో తిరుపతి, విశాఖల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ‘డయల్ 100’ కూడా చురుగ్గా పనిచేస్తోందని.. ఫిర్యాదు అందిన వెంటనే 3 నుంచి 5 నిమిషాల్లో సిబ్బంది చేరుకుంటున్నారని చెప్పారు. విశాఖ లో ఇద్దరు డిఎస్పీలు, ఐదుగురు ఎస్ఐలు, ఆరుగురు హెచ్సీలు, 38 మంది మహిళా కాని స్టేబుళ్ల తో ‘దిశ’ పీఎస్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆధునాతన విదేశీ పరికరాలతో మార్చి చివరి నాటికి ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి వస్తోందన్నారు. ప్రస్తుతం కంట్రోల్ రూమ్లో అన్ని భాషలపైన అవగాహన కలిగిన సిబ్బంది ఉన్నారని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు. (మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: సుచరిత) -
మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: సుచరిత
సాక్షి, రాజమండ్రి : మహిళల భద్రత కోసమే దిశ చట్టం పనిచేస్తుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి వచ్చినదే దిశ చట్టం అని ఆమె తెలిపారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ చట్టంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిశ చట్టానికి సంబంధించిన యాప్ను ప్రారంభించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రులు విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజనీ, మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (వాటి కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్ ) హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది అని ప్రశంసించారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ చట్టం పట్ల ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే బాధితులకు న్యాయ జరిగేలా నిందితులకు శిక్ష పడుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం జగన్ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. చట్టం అమలులకు పోలీస్ విభాగాన్ని పటిష్టం చేశామన్నారు. ఇప్పటికే అవసరమైన సిబ్బంది, సాంకేతిక సహకారాన్ని అందించామని, మహిళల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకొచ్చిందన్నారు. కేవలం చట్టం చేయడమే కాకుండా అమలు చేయడంలో కూడా ముందున్నామన్నారు. మహిళల భద్రత, సంరక్షణే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ పోలీసులు దేశంలో ఆదర్శంగా ఉంటాని తెలిపారు. -
ల్యాబ్స్ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే దిశ చట్టం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని.. ముఖ్యంగా మహిళల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ యాప్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని సహా డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మద్యం సేవించి రాక్షసులుగా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. అయితే సినిమాల్లో చూపించినట్లుగా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. (కన్నీళ్లు తుడిచే ‘దిశ’గా..) ఫోరెన్సిక్ ల్యాబ్ల కోసం రూ. 31 కోట్లు.. ‘‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 7 రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి. ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా దిశ చట్టం తీసుకవచ్చాం. వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ రోజు రాజమండ్రిలో దిశ తొలి మహిళా పోలీసు స్టేషన్ను ప్రారంభించాం. మహిళల కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లు. డీఎస్పీ స్థాయి నేతృత్వంలో 47 మంది సిబ్బంది పనిచేస్తారు. 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 26 కోట్లు కేటాయిస్తున్నాం. హైకోర్టు అనుమతితో త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ల కోసం రూ. 31 కోట్లు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.( దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం.. దిశ చట్టంలో ప్రత్యేకతలు) అదే ప్రభుత్వ లక్ష్యం.. ‘‘ప్రతీ అడుగులోనూ అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటా. వారి పిల్లలకు మేనమామలా ఉంటా. 42 మంది లక్షల తల్లులకు అమ్మఒడి అందించాం. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. సున్నావడ్డీతో మహిళలకు రుణాలు. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచి అవతరించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని మహిళా సాధికారికతకై సర్కారు చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ తెలిపారు. -
సీఎం జగన్ మహిళల పక్షపాతి
-
మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం
-
24 గంటల పాటు అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్
-
రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
-
దిశ పోలీసు స్టేషన్ను ప్రారంభించిన సీఎం
-
‘దిశ’ పోలీసు స్టేషన్ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించాయి. దిశ చట్టంలో ప్రత్యేకతలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం రేప్, గ్యాంగ్ రేప్లకు పాల్పడితే ఉరిశిక్ష చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్లో నమోదు చేస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆధునికీకరణ తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్లు దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్ఐ పోస్టులు మంజూరు బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ సౌకర్యం. -
దిశా పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఈనెల 7న దిశా పోలీస్ స్టేషన్ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని ప్రవేశ పెట్టామని మంత్రి సుచరిత అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఏపీలోనే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దిశ చట్టం ద్వారా శిక్ష వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు దిశా చట్టం ప్రవేశ పెట్టేందుకు చూస్తున్నాయన్నారు. దిశా చట్టంపై కేంద్రం కొన్ని టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగిందని, అవి కూడా పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపామని హోంమంత్రి తెలిపారు. -
దిశ పోలీస్ స్టేషన్లు మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తాయి
-
మహారాష్ట్రలో దిశ చట్టం!
ముంబై: అత్యాచార దోషులకు తక్కువ సమయంలో శిక్ష విధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే అంశం పరిశీలిస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ సోమవారం చెప్పారు. త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్లో పర్యటించి దిశ చట్టం గురించి లోతుగా తెలుసుకుంటానని చెప్పారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలు జరిగిన మూడు వారాల్లోనే దోషికి శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వార్ధాలో మహిళకు నిప్పు పెట్టిన కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి త్వరలోనే దోషికి శిక్ష పడేలా చేస్తామని అనిల్ అన్నారు. నాగ్పడా ప్రాంతంలో కొందరు పోలీసుల అనుమతి లేకుండానే సీఏఏపై నిరసనలు చేస్తున్నారని చెప్పారు. సీఏఏ వల్ల పౌరసత్వం పోదని వారికి వివరించామని చెప్పారు. (‘దిశ’ ఆఫీసర్ ఎవరో తెలుసా?) -
దిశ ఆఫీసర్
గట్టి చట్టానికి గట్టి ఆఫీసర్.. కృతికా శుక్లా! ఎలా అప్పుడే గట్టి ఆఫీసర్ అని చెప్పడం?! మగవాళ్ల వేధింపులు ఎలా ఉంటాయో.. ఆడపిల్ల అనుభవించే వేదన ఎలా ఉంటుందో.. ఆమెకు తెలుసు. తనూ ఒకప్పుడు వెకిలి చూపులకు.. వికృతపు మాటలకు భయపడిన అమ్మాయే! ఇప్పుడా భయాన్ని పోగొట్టేందుకు దిశ చట్టం ఉంది. దుష్టశిక్షణకు స్వయంగా ఆమే డ్యూటీలో ఉంది! కృతిక జమ్మూ అండ్ కశ్మీర్ కేడర్ 2013 ఐఏఎస్ ఆఫీసర్. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ దిశ చట్టం – 2019’ అమలుకు ప్రత్యేకాధికారిగా ఇటీవలే నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో దిశ రూపకల్పన, అమలు ప్రణాళికల గురించి ఆమె మాట్లాడారు. వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు. డిస్టర్బ్ అయ్యేవాళ్లం ‘‘ఢిల్లీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిగా నేనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈవ్టీజింగ్ ఉండేది. బస్సు ప్రయాణంలో అసభ్యకరమైన చేష్టలు ఉండేవి. కొంచెం పరిచయం అయితే చాలు.. పిచ్చి పిచ్చి మెసేజ్లు వచ్చేవి. ఇలా ఉండేది హెరాస్మెంట్. హాస్టల్ దగ్గరికి కూడా అబ్బాయిలు వచ్చేవారు. దాంతో మేము మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్లం. మా సమస్యను చెప్పుకొనేందుకు అప్పట్లో మహిళా పోలీసులు ఉండేవాళ్లు కాదు. ట్రావెల్ చేసేటప్పుడు రక్షణగా ఉమెన్ వింగ్ ఉండేది కాదు. ఆపద సమయంలో ఆదుకొనేందుకు కనీసం హెల్ప్ నంబర్లు ఉండేవి కావు. ఏపీ ‘దిశ’ చట్టాన్ని రూపొందించేటప్పుడు నేను నా జీవితంలో పడిన ఆనాటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అలాంటి వేధింపులు ఇప్పటి అమ్మాయిలకు పునరావృతం కాకుండా, పురుషుల ప్రవర్తనలో సమూల మార్పులు తెచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించాం. నేను చదువుకునే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, అనుభవాలు ఈ చట్టం రూపకల్పనలో నాకెంతగానో తోడ్పడ్డాయి. ఇద్దరం అమ్మాయిలమే ‘‘మాది పంజాబ్లోని చండీగఢ్. పాఠశాల విద్య వరకు అక్కడే చదివాను. నాన్న మదన్లాల్ బాత్రాకి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ బ్రాంచ్ ఉండేది. అమ్మ హర్షా బాత్రా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్. చండీగఢ్లోనే పనిచేసేవారు. మేము ఇద్దరం అమ్మాయిలమే. మా చెల్లెలు రీచా బాత్రా ఇప్పుడు హైదరాబాద్లోని నొవారిటీస్లో మేనేజర్. స్కూల్ ఎడ్యుకేషన్ తరువాత మా మిగతా చదువులన్నీ ఢిల్లీలోనే సాగాయి. మేమిద్దరం అమ్మాయిలమే అయినప్పటికీ మా అమ్మ పట్టుదలతో మంచి చదువు చెప్పించాలని.. దూరమైనప్పటికీ మమ్మల్ని ఢిల్లీ పంపింది. నేను అక్కడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదివాను. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి చదువుకున్నాను. డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సంవత్సరానికి రూ. 15 లక్షలపైగా ప్యాకేజీ ఆఫర్ కూడా వచ్చింది. ఐఎఎస్కి కూడా మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ప్రిపేర్ అయ్యాను. ఐఎఏస్లో ఉద్యోగ సంతృప్తి మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అమ్మ చెప్పేవారు. పదిమంది పేదలకు మంచి చేసే భాగ్యం లభిస్తుందని అనేవారు. దాంతో నాకు ఐఏఎస్ చదవాలనే సంకల్పం బలంగా ఏర్పడింది. అమ్మ ఇచ్చిన ప్రేరణ, ప్రోత్సాహంతోనే నేను 23 ఏళ్లకే ఐఏఎస్ పాస్ అయ్యాను’’. కులాంతర వివాహం మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి. నా భర్త హిమాన్షు శుక్లాది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. మా ఐఏఎస్ ట్రైనింగ్ అయిన తరువాత పెద్దల అంగీకారంతో 2015 లో పెళ్లి చేసుకున్నాం. రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. హిమాన్షు నా పని ఒత్తిడి అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తుంటారు. ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. నేను గర్భిణిగా ఉన్నప్పుడు ఆయనే నా డైరెక్షన్తో వంట చేసేవారు. వడ్డించేవారు. ఇంటి పనిని కూడా షేర్ చేసుకుంటాం. ఒక్కోసారి నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆయనే బాబును సముదాయిస్తుంటారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్నీ చూసే మార్పు ఇంట్లోంచే మొదలవ్వాలి. ఇంటి పనంతా అమ్మాయిలదే అనే భావనను అబ్బాయిల్లో పోగొట్టి, వాళ్లకూ బాధ్యతల్ని అప్పగించాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చెయ్యడం నేర్పాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు గైడ్ చేయాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియజెప్పాలి. అమ్మాయిల్ని వేధిస్తే జరగబోయే పరిణామాలను కూడా వివరించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది’’ అని ముగించారు కృతికా శుక్లా. – ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు: గజ్జెల రాంగోపాల్ రెడ్డి తక్షణ స్పందన ‘దిశ’ చట్టానికి స్పెషల్ ఆఫీసర్గా నాకు బాధ్యతను అప్పగించడాన్ని మంచి అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలతో మార్పులు, చేర్పులు చేసి వారం వ్యవధిలోనే దిశ బిల్లును తయారు చేశాం. అది మా మొదటి విజయం. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏపీ సి.ఎం.జగన్మోహన్రెడ్డి ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం పోలీసుశాఖ, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఫోరెన్సిక్ సంస్థల సమన్వయంతో పని చేయబోతున్నాం. ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటాం. త్వరగా విచారణ దిశ చట్టం అమలు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టేశాం. ప్రతి జిల్లాలో దిశ ఉమెన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్టేషన్లో ఓ డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, సైబర్ ఎక్స్పర్ట్ ట్రైనర్, సపోర్టు స్టాఫ్ ఉంటారు. జీరో ఎఫ్ఐఆర్ సదుపాయం, బాధితురాలికి కౌన్సెలింగ్, వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి జిల్లాలో దిశ కోర్టును ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడులపైన వెంటనే విచారణ చేపడతాం. మహిళలకు ఈ చట్టం ఖచ్చితంగా భరోసా ఇస్తుందని నమ్ముతున్నాం. ఈ చట్టం ద్వారా మహిళలను చైతన్యం చేయబోతున్నాం. వివిధ బాధ్యతల్లో కృతిక ►డైరెక్టర్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ►మేనేజింగ్ డైరెక్టర్, ఏపీడబ్ల్యూసీఎఫ్సీ. ►మేనేజింగ్ డైరెక్టర్, జువెనైల్ వెల్ఫేర్. ►డైరెక్టర్, వెల్ఫేర్ ఆఫ్ రిఫరెండ్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ►మేనేజింగ్ డైరెక్టర్, డిఫరెంట్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, దిశ -
దిశా చట్టం అమలుకు సర్వం సన్నద్దం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక దిశా చట్టం అమలుకు సర్వం సన్నద్దం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకి అనుగుణంగా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు .రాష్ట్రంలోని మహిళా మిత్రలను ఇన్వెస్టిగేషన్ టీంలలో భాగస్వాములను చేసే కార్యక్రమానికి విజయవాడ నుంచి శ్రీకారం చుట్టారు. నిబద్దతతో పనిచేసి మహిళా సంరక్షణను కట్టుదిట్టం చేస్తామని దిశా స్పెషల్ అధికారి కృతికా శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘దిశా చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను చేపడతాం. మహిళామిత్రలతో పాటు గ్రామ సంరక్షణ మహిళా కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటుంది. జనవరి నెలాఖరుకు దిశా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అలాగే దిశా సెంటర్ల కోసం నియమించిన పోలీస్, వైద్య విభాగాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. వెలగపూడి, తిరుపతిలో ఈ నెల 17,18 తేదీల్లో శిక్షణ ఉంటుంది. వన్ స్టాప్ సెంటర్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెడతాం.’ అని తెలిపారు. దిశా స్పెషల్ ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకి అనుగుణంగా దిశా చట్టాన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పద్దెనిమిది దిశా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దిశా సెంటర్లు పని చేస్తాయి. ఈ చట్టంతో రాష్ట్రం లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పడబోతోంది. అన్నీ ఒకచోట కేంద్రీకృతం కానుండటంతో చట్టం అమలు సులభతరం కానుంది. జీరో ఎఫ్ఐఆర్ కేసుల నమోదులో, బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు. చదవండి: బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్ దిశ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన కృతికా శుక్లా ‘దిశా’ నిర్దేశం ఏపీ దిశ చట్టం: ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల నియామకం యావద్దేశానికీ... ఒక ‘దిశ’ -
బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం ప్రత్యేక అధికారిణిగా నియమితురాలైన దీపిక పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టవేస్తామని చెప్పారు. మహిళల సంరక్షణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. త్వరిత గతిన దర్యాప్తును పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దిశ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం -2019 అమలు కోసం కృతికా శుక్లా, దీపికాలను ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక 2014లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్పీగా ఉన్న దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. -
కృతికా శుక్లా ‘దిశా’ నిర్దేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు దిశా చట్ట పరిరక్షణ ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లా తెలిపారు. దిశా చట్టం విధి విధానాలపై ఆమె శుక్రవారం పదమూడు జిల్లాల అధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా చట్టాన్ని తీసుకు వచ్చారని, చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు. నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని కృతిక శుక్లా స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పథకాల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్ కిశోరి వికాసం పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే సెల్ఫ్ డిఫెన్స్పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇక దిశా చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర రావాల్సి ఉందని పేర్కొన్నారు.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్లోని ముఖ్యాంశాలివే..) కాగా మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ దిశ చట్టం-2019 అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో దిశా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి మాసాన్ని ‘దిశా’ నెలగా ప్రకటించి ముందుకు సాగుతున్నారు. ఇక దిశ చట్టం అమలుకు ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. -
ఏపీ దిశ చట్టం: ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకవచ్చిన చారిత్రాత్మక దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా దిశ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించి దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. -
అమలు దిశగా..
-
‘దిశ’ నిర్దేశం
దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించి, రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా చూడండి. ఈ చట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. వీలైనంత త్వరలో ఇవి పూర్తి కావాలి.– సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులతో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. న్యాయపరంగా, పోలీసుపరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొనగా వారం రోజుల్లోగా డబ్బును డిపాజిట్ చేయాలని చెప్పారు. 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లు రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడం.. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబుల్లో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ పేర్కొనగా.. ఇందుకోసం జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లోని మహిళా పోలీస్స్టేషన్లను అప్గ్రేడ్ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీ.. ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్న డీజీపీ ప్రతిపాదనలకు సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. ఈ పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. వన్ స్టాప్ సెంటర్లలో మహిళా ఎస్ఐ నియామకం ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ల (హింస, లైంగిక దాడులకు గురైన మహిళలను ఆదుకునేందుకు)ను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితోపాటు ఒక మహిళా ఎస్ఐని నియమించడానికి ఆమోదం తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్ సెంటర్, యాప్, వెబ్సైట్ల పనితీరును సమీక్షించారు. సురక్ష స్పందన యాప్ తయారు చేశామని, మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ వివరించారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్ చేయాలని, దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలపై దుష్ప్రచారం ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలా మంది పని చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘పేదల కోసం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నాం.. మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశలో పలు చర్యలు తీసుకున్నాం.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం.. పర్మిట్ రూమ్లను నిషేధించాం.. బెల్టుషాపులను ఏరివేశాం.. బార్ల సంఖ్యనూ తగ్గించాం.. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం..’ అని సీఎం అన్నారు. -
దిశ చట్టం: సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ను కూడా వెంటనే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైజాగ్, తిరుపతిల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా దిశ చట్టం అమలులో భాగంగా ప్రతీ కోర్టుకు సుమారు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని అధికారులు పేర్కొనడంతో.. ఈ మేరకు వారం రోజుల్లోగా అవసరమైన డబ్బును డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. (ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్లోని ముఖ్యాంశాలివే..) నోటిఫికేషన్ జారీ చేయండి... ఫోరెన్సిక్ ల్యాబ్లలో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతం సవాంగ్ సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా... జనవరి 1న నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్ స్టేషన్లలో 1 డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలను, నలుగురు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించగా... సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. అదే విధంగా ఈ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు అంగీకరించారు. ఈ సందర్భంగా... 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. వన్స్టాప్ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితో పాటు ఒక మహిళా ఎస్ఐని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కాల్సెంటర్, యాప్, వెబ్సైట్లపై సీఎం సమీక్ష వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్సెంటర్, యాప్, వెబ్సైట్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సురక్ష స్పందన యాప్ తయారు చేశామని డీజీపీ ముఖ్యమంత్రికి తెలిపారు. దీని ద్వారా మొత్తం 86 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఈ యాప్ను ప్రారంభిస్తామని.. 100,112 నంబర్లను దీనితో ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు. అయితే.. దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని సీఎం సూచించారు. ఇందుకు అసవరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా... దిశ చట్టం అమలు కోసం పోలీసు విభాగంలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించే ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా... 18 మహిళా పోలీసు స్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా ఆలోచన చేయాలన్నారు. దిశచట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని... వీలైనంత త్వరలో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు. దిశ చట్టం అమలు సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశ చర్యలు తీసుకున్నాం మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం పర్మిట్ రూమ్లను నిషేధించాం బెల్టుషాపులను ఏరివేశాం బార్ల సంఖ్యను తగ్గించాం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం దిశ చట్టం చేశాం.. కానీ అమలు కావడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు ఎవరూ కూడా మనల్ని వేలెత్తిచూపకూడదు ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలామంది పనిచేస్తున్నారు కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి పేదలకోసం మనం ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెడుతున్నాం -
దిశచట్టంలో బాగంగా ప్రతిజిల్లాలో ఫాస్ట్ట్రాక్ కోర్టు
-
దిశ చట్టం: ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు రూ.23 కోట్లు
సాక్షి, అమరావతి : దిశ చట్టం అమలుకు అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు కోసం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మూడు ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు 176 మంది సిబ్బంది నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. అదే విధంగా మహిళ స్టేషన్లను మరింతగా బలోపేతం చేస్తామని, సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు, సదుపాయాలకు పూర్తి నిధులు మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం ద్వారా సీఎం జగన్ ఒక అన్నలా మహిళలకు భరోసా కల్పించారని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని చట్టసభల్లో ఆమోదించిన తరువాత రాష్ట్రపతికి పంపించామని, అక్కడి నుంచి ఆమోదం రాగానే అమలు చేస్తామన్నారు. దిశ చట్టం అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. -
అత్యాచారాల నిరోధానికి ‘దిశా’ నిర్దేశం
యావత్ భార తదేశాన్ని నిర్భయ ఘటన తర్వాత మళ్లీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకున్న దిశ ఘటన. అమ్మాయిని పథకం ప్రకారం కదలనివ్వకుండా చేసి సామూహిక అత్యాచారం, ఆపై తగలబెట్టి హత్య చేసిన ఘటన ప్రజలందరికీ గల్లీ నుండి ఢిల్లీ దాకా వణుకు పుట్టించింది. అలాగే బాధితురాలికి న్యాయం చేయా లంటే నిందితులను చంపెయ్యాల్సిందే అని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అన్నారు, చివరకు అదే జరిగింది. కానీ నిందితులను చంపడం ద్వారా నేరాలు అరికట్టలేమన్నది విజ్ఞతతో ఆలోచించిన ప్పుడే తెలుస్తుంది. చాలామంది అరబ్ దేశాల్లో నేరం చేసిన వాళ్లను అక్కడికక్కడే చంపేస్తారని చెబుతుంటారు కానీ అలా చంపేసినా నేరాలు ఆగడం లేదన్న నిజాన్ని గమ నించాలి. అంతేకాకుండా ఆ దేశాలు ఇంకా రాజరికపు ఫ్యూడల్ వ్యవస్థల్లోనే ఉన్నాయి. భారతదేశం అలా కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్న ఫెడరల్ యూనిటరీ వ్యవస్థగా కొనసాగుతున్న దేశం అలాంట ప్పుడు ఓ ప్రజాస్వామ్య దేశాన్ని రాచరికపు దేశాలతో పోల్చలేము. కానీ విజ్ఞతతో ఆలోచించి నేరాలకు పాల్ప డిన వారిని విచారణ లేకుండా అనాగరి కంగా చంపడం సరైన పద్ధతి కాదని గ్రహించి చట్టాలను మార్చాలి. పౌరులను విద్యావంతులను చేసే దిశగా అడుగులు వేస్తే నేరాలను నిరోధిం చవచ్చు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తితో తమ రాష్ట్రానికంటూ ఇలాంటి నేరాలు తగ్గించాలనే స్ఫూర్తితో ‘దిశ’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఘటన తెలంగాణలో జరిగినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ రాష్ట్రంలో జరగకుండా కట్టడి చేయడానికి దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ సర్కారుకు జేజేలు. గణాంకాల ప్రకారం ఆడపిల్లలపై 2014లో 13,549 నేరాలు జరుగగా, వరుసగా 2015లో 13,088, 2016లో 13,948, 2017లో 14,696 ఘటనలు.. 2018లో 14,048 ఘటనలు చోటు చేసు కున్నాయి. ఇంకా ఈ నేరాల సంఖ్యను తగ్గించి సమస్యను పరిష్కరించే దిశగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 173, 309ని సవరించి, నేరం జరిగిన ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయడం పద్నాలుగు రోజుల్లో చార్జిషీట్, సాక్షుల విచారణ చేసి కేవలం మూడు వారాల్లో నిందితులకు శిక్ష ఖరారు చేసే దిశగా చట్ట సవరణ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే రేండేళ్ల శిక్షపడేలా, అత్యాచారాలకు మరణదండన పడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వెనువెంటనే శాసనసభ ఆమో దం హర్షించదగ్గది. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలలో సహితం అమలుచేస్తే మంచి ఫలితాలు ఇస్తుందన్న దాంట్లో అనుమానం లేదు. కేవలం శిక్షలు వేస్తామనడమే కాకుండా చిన్ననాటి నుండి ఉపయోగమైన ఇంగ్లిష్ మీడియం విద్యను పేద పిల్లలకు సహితం అందుబాటులోకి తేవడం, ప్రతి నేరం వెనుక మద్యం ఉత్ప్రేరకంగా ఉంటున్నం దున దశలవారీ మద్య నిషేధం బాలి కలకూ, మహిళలకూ శ్రీరామరక్షగా నిలు స్తుందనడంలో సందేహం లేదు. వ్యాసకర్త : అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
దిశా నిర్దేశం...
పౌరసత్వ చట్ట సవరణలు దేశాన్ని కుదిపేయడానికి కొద్ది రోజుల ముందు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్నగర్లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఈ దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహారాష్ట్ర కూడా ఈ తరహాలో చట్టం చేయాలని భావిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. -
దిశా నిర్దేశం
-
‘దిశ’ ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం కోరింది
సాక్షి, అమరావతి :అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరిందని.. చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ చట్టంపై తమను సంప్రదించిందని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించినట్టు స్పీకర్ చెప్పారు. దిశ చట్టాన్ని ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమని, ఈ చట్టంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చరిత్రాత్మక చట్టాలు చేశాం.. దిశ చట్టంపై అసెంబ్లీలో విపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వాలు మంచి చట్టాలను ప్రజల కోసం తయారు చేస్తాయన్నారు. జరుగుతున్న సంఘటనలన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. నిన్నగాక మొన్న ‘దిశ’ చట్టం వచ్చిందని.. ఎందుకు గాభరా పడుతున్నారంటూ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుని.. చట్టం వచ్చాక గుంటూరులో చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగాయని, ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ సోమవారమే వెళ్లి పరామర్శించామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్టు వివరించారు. -
చరిత్రాత్మక బిల్లులకు వేదిక
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బిల్లులకు వేదికైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమై 7 రోజుల పాటు జరిగిన ఈ సమాశాల్లో 22 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. జూలైలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశా ల్లో 19 బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 22 బిల్లులతో ఆ చరిత్రను తిరగరాసింది. చివరి రోజు మంగళ వారం రాజధాని అమరావతిపై గత చంద్రబాబు సర్కారు అవినీతిని, పక్షపాతాన్ని, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సహా ఎవరెవరు ఎంత భూమి కొన్నారనే విషయాలను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. ఆ తరువాత అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, అందులో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ, ముఖ్యమంత్రి సమాధానం తరువాత సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించని ప్రతిపక్షం ప్రజలకు సంబంధించిన ఏ అంశాల్లోను ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలను, సలహాలు ఇవ్వలేకపోయింది. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ బిల్లులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా ఇతర అంశాలను తీసుకువచ్చి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించిన యుద్ధాన్ని, చంద్రబాబు మళ్లీ యూటర్న్ ఎలా తీసుకున్నారనే విషయాన్ని సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఇక రాజధాని అమరావతిపై చంద్రబాబుకు గంటకు పైగా మాట్లాడే అవకాశం వచ్చింది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెపుతుండగా ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు తమ సభ్యులను పోడియం వద్దకు పంపి గొడవ చేయించారు. దీంతో వాస్తవాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్ద గొడవ చేస్తున్న తొమ్మిది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో చంద్రబాబుతో సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక, ఉల్లిపాయలు, ఇంగ్లిష్ మీడియం, మద్య నియంత్రణ, రైతులకు మద్దతు ధర, సాగునీటి ప్రాజెక్టులు, రివర్స్ టెండరింగ్ విధానం, గ్రామ, వార్డు సచివాలయాలు తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. ‘దిశ బిల్లు’పై దేశవ్యాప్త చర్చ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే.. 21 పని దినాల్లో విచారణ పూర్తి చేసి తిరుగులేని సాక్ష్యాలు ఉంటే మరణదండన విధించేలా ఈ సమావేశాల్లో తీసుకొచ్చిన దిశ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాగే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ మరో రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడంతో ఆ సంస్థ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే దశలవారీగా మద్య నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, విక్రయం, అక్రమంగా తయారు చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించేందుకు వీలుగా మరో రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ తెచ్చిన మరో కీలక బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదించారు. 48 గంటల పాటు అసెంబ్లీ సాక్షి, అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏడు పనిదినాల్లో 48 గంటల ఒక నిమిషం పాటు జరిగినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన స్పీకర్.. ప్రతిపక్షం చర్చలో పాల్గొనకుండా పదేపదే ఆటంకాలు కలి్పంచడం దురదృష్టకరమని, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నికార్సయిన చట్టం ‘దిశ’
ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల అత్యాచార బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది. కనుకనే ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతం పట్ల చలించి, దేశంలో అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని ప్రకటించారు. దానికి కొనసాగింపుగా అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను, కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. రాజకీయాలకు, నైతిక సూత్రాలకు, నైతికతకూ ఎలాంటి పొత్తూ పొంతనా కుదరదన్నది ఇటాలియన్ చాణక్యుడు మాకియవెల్లీ సూత్రం! కానీ ఆ సూత్రీకరణ అబద్ధమనీ, నైతిక సూత్రాలకు, నైతి కతకు బద్ధమై దేశ దిశాగతిని నిర్ణయించి ఆచరించే రాజకీయమే సిసలైన రాజకీయం. అలాంటి పాలకుడే నిజమైన ప్రజాసేవకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. ప్రజా బాహుళ్యాన్ని వేధిస్తున్న అనేక సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆగమేఘాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని ఆచరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. దేశంలో రాజ్యాంగ బద్ధత పేరిట గడచిన డెబ్భైఏళ్లలో వివిధ ప్రభుత్వాలు క్రిమినల్, పౌర సమస్యలపై రకరకాల చట్టాలు తీసుకొచ్చాయి. వాటికి విలువైన భాష్యాలను సుప్రీంకోర్టు పొందుపర్చి, అమలుకు సిద్ధం కావడమూ మనకు తెలుసు. కానీ పెక్కు సందర్భాల్లో నాటి పెట్టుబడి దోపిడీ వ్యవస్థలో వివిధ స్థాయిల్లో అధికార పీఠాలు అలంకరించిన రాజకీయ పాలక శక్తులు తమ లేదా తమ అనుయాయుల, వందిమాగధుల స్వార్థపూ రిత ప్రయోజనాల దృష్ట్యా వేలు, లక్షలాది మంది బాధిత కుటుం బాలకు న్యాయం అనేది పెక్కు సందర్భాలలో ఆలస్యం కావడమో లేదా దూరం కావడమో జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి బాబ్డే అన్యాయాలకు గురైనవారు, అత్యాచారాలకు, హత్య లకు బలైనవారి కుటుంబాలు సత్వర న్యాయాన్ని అప్పటికప్పుడు ఆశించలేరని న్యాయశాస్త్రపరిశీలనా పరిధుల దృష్ట్యా చెప్పి ఉండ వచ్చు. కానీ ఏళ్లూ పూళ్లూగా తీర్పులు వాయిదా పడుతూ పోవడం వల్ల బాధిత కుటుంబాల ఆవేదన చల్లారదు. అందుకే రాజ్యంగమూ, న్యాయ వ్యవస్థ సూత్రాలు కూడా తీర్పు ఆలస్యమైన కొద్దీ న్యాయం ఆలస్యమైనట్టే కాదు, న్యాయాన్నే బాధితులకు దూరం చేసినట్లుగా భావించాలని నిర్ద్వంద్వంగా చెప్పడమూ జరిగింది. అందుకే అత్యు న్నత న్యాయసూత్రాలు ఆధారంగా నిర్దేశించిన ఆలస్యమైన న్యాయం అక్కరకు రాని న్యాయంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దిశ దారుణ హత్యోదంతంపట్ల చలించి, ఇలాంటి ఘటనలు ఇకమీదట ఎక్కడా పునరావృతం కాకూడదని సంకల్పించారు. ఆ వెంటనే ఏపీ శాసనసభ ఆమోదానికి అత్యాచార ఘటనల నివారణకు రెండు ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర నేర నిరోధక చట్టాలకు రెండు సవరణ బిల్లులను చట్టాలుగా ప్రవేశపెట్టి ఆమోదించాల్సి వచ్చింది.ఈ బిల్లులకు దేశవ్యాపితంగా మద్దతు రావడానికి కారణం శిక్షా కాల పరిమితిని బాగా తగ్గించి, బాధితులకు తక్షణ న్యాయం సకాలంలో దక్కేలా చూడటం, అత్యాచారాలకు తలపడే వారిని నిరోధించగల న్యాయ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేసి సత్వర శిక్షలకు రంగాన్ని సిద్ధం చేయడం. ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ చొరవను హర్షించాయి. తెలంగాణలో దిశ హత్యోదంతం తర్వాత ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగడంవల్ల దిశ చట్టానికి ప్రాంతీయ హద్దులు చెరిగిపోయాయి. ఈ విస్తృతికి ప్రధాన కారణం.. దిశ ఘటనకు ఏమాత్రం తీసిపోని ‘నిర్భయ’ దారుణో దంతం 2012లో జరిగి నేటికి ఏడేళ్లయినా.. విచారణ ముగిసి, మరణ శిక్షలు పడినా, ఈరోజుదాకా కోర్టు తీర్పు ఆచరణలో అమలులోకి రాకపోవడమే. కాగా, ఆంధ్రప్రదేశ్ తాజా చట్టం మహిళలు, చిన్నా రులపట్ల వేధింపులు, అత్యాచార ఘటనలను తక్షణం పరిగణనలోకి తీసుకుని, అంత వేగంగానూ వాటిని విచారించి, శిక్షలు విధించేం దుకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు జిల్లా స్థాయిలో ఎక్కడి కక్కడ తక్షణం ఏర్పాటు చేసి న్యాయం చేకూర్చడం ఆంధ్రప్రదేశ్ నూతన చట్టం ప్రత్యేకత. అయితే ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారమే జరిగిందా అన్న ప్రశ్నకు ఆ అధికరణలో సమాధానం ఉంది: ‘ఏ పౌరుడిని జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం చేయకూడదు’ అని ఆ అధికరణం చెబుతున్నా ఆ వెంటనే అదే అధిక రణలో ‘చట్టం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి మాత్రమే’ అని కూడా ఉన్నందున, జగన్ ప్రభుత్వం ఆ గేటు దాటకుండానే దేశ దిశా గతికి త్వరితగతిన ‘దిశ చట్టం’ రూపొందించింది. అలాగని ఆంధ్ర ప్రదేశ్ చట్టం, వలస పాలనావశేషంగా మిగిలిపోయిన చట్టబద్ధ విచారణతో నిమిత్తం లేకుండా పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల (ఫేక్)ను మాత్రం అనుమతించదు. ఎందుకంటే, ‘ప్రకాష్ కడం వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా’ కేసులో సుప్రీంకోర్టు ‘ఎదురు కాల్పుల్లో చనిపోయారన్న పేరిట పోలీసులు జరిపే బూట కపు ఎన్కౌంటర్లు పచ్చి హత్యలు తప్ప మరొకటి కావ’ని అలాంటి బూటకపు హత్యలకు పాల్పడే పోలీసులకు మరణశిక్షలు విధించాలని, అలాంటి వాటిని ‘అసాధారణ కేసులలో అతి అసాధారణం’గా పేర్కొనాలని తీర్పు చెప్పింది. అంతేగాదు, గతంలో అలహాబాద్ హైకోర్టు విశిష్ట న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ ఎ.ఎన్.ముల్లా భారతదేశంలోని పోలీసులంత అరాచక శక్తులు, నేరస్తులు మరెవరూ ఉండరని చెప్పారు. ఆ మాటకొస్తే హైదరాబాద్లో ‘దిశ ఘోర హత్యా ఘటన’ సందర్భంలో కూడా నలుగురు నిందితులను విచారణకు పంపకుండా పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల్ని హతమార్చడం కూడా ‘ఫేక్ ఎన్కౌంటర్’గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ భావించారు (8.12.2019). అంతేగాదు, వ్యవస్థ ఇంత అధ్వానమైన దశకు చేరుకోవడానికి కారణం ఇటు పోలీసు శాఖల్లోనూ, అటు న్యాయ వ్యవస్థలోనూ తగినంత సిబ్బంది లేకపోవడమేనని ఇదే అనేక అరాచకాలకు కారణమవుతోందని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’ (2019) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక నేర న్యాయ వ్యవస్థపై వెచ్చించే బడ్జెట్ కేటాయింపులు హీనాతిహీనం. ఉదాహరణకు 2017 దాకా పోలీసింగ్ నిర్వహణకు అఖిల భారత స్థాయిలో తలసరి వెచ్చిస్తున్న ఖర్చు కేవలం రూ. 820. సరిగ్గా ఈ అస్తు బిస్తు పరిస్థితుల్లోనే నేర న్యాయ వ్యవస్థ క్రమంగా పోలీసు న్యాయ వ్యవస్థగా దిగజారుతోందని ‘సెంటర్ ఫర్ క్రిమి నాలజీ అండ్ జస్టిస్’ సంస్థకు చెందిన ‘ప్రయాస్’ ప్రాజెక్టు డైరెక్టర్ అయిన డాక్టర్ విజయ రాఘవన్ అభిప్రాయపడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల మధ్యనే.. దూసుకువచ్చిన జగన్ ప్రభుత్వ ‘దిశ చట్టం’ ‘నిర్భయ’ కేసు నిందితులపై శిక్ష ఖరారై అమలు జరపడంలో ఏడేళ్ల తర్వాతనైనా ఇప్పటికి సుప్రీంకోర్టు, ప్రభుత్వమూ వెంటనే కదలబారడానికి కారణమైందని మరవరాదు. అంతేగాదు, ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన యువతి దారుణ లైంగిక హత్యోదంతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేకి శిక్ష ఆగమేఘాలపై ఖరారు కావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘దిశ చట్టమే’ ఉద్దీపన శక్తిగా దివిటీ పట్టింది. ఈ సందర్భంగా మన వ్యవస్థలో ఉన్న మౌలిక సత్యాలను విజయ రాఘవన్ దాచుకోకుండా ఇలా వ్యక్తం చేశారు: ‘‘రానురానూ మన దేశంలోని సామాజిక వ్యవస్థా చట్రం కనుసన్నల్లో సామాన్య ప్రజలు సమాజంలో వర్గ, కుల, స్త్రీ పురుష వివక్ష, అసమానతల కారణంగా కునారిల్లిపోతున్నారు. ఇలా మన స్త్రీ–పురుషుల మధ్య వివక్ష చూపుతూ అసమ దృష్టితో వ్యవహరించినంత కాలం, స్త్రీలను భౌతికంగా కేవలం లైంగిక దృష్టితో చూసి, వేధించి వివక్షతో జరిపే హింసాకాండ ఒక అంటురోగంగా మనల్ని పీడిస్తూనే ఉంటుంది. కుల, వర్గ, అసమానతలు గొడ్డలి పెట్టుగా మారినందున హింసా ప్రవృత్తి మరింత పాశవిక రూపం దాల్చుతుంది. ఈ బెడదను తప్పించుకోవాలంటే శాశ్వత పరిష్కారంగా మరింత ఆదర్శవంత మైన సమ సమాజ వ్యవస్థను నిర్మించుకోగల సామాజిక సమీకరణ వైపుగా దృష్టి పెట్టాలి’’ అని హితవు పలుకుతున్నారు. అందుకే, అలాంటి ఉత్తమ సమాజ వ్యవస్థావతరణ వైపుగా పరిపూర్ణ బ్రతు కిచ్చే దిశగా కవి కుమారుడు సరికొత్త గీతా రచనను ఉద్దీపనగా అందించాడు: ‘‘ఓ! కూలీ, మాలీ, రైతూ గుడిసెలలో బతికేవాడా గంజినీళ్లతోనే కాలం గడిపేవాడా ఆకలికన్నూ! మానవుడా, తిరగబడేవాడా, ప్రశ్నించేవాడా అన్యాయాలకు ఆహుతి కావడానికైనా జంకనివాడా ఖైదీ, రౌడీ, ఖూనీకోర్, బేబీ– మానవుడా, ఓ మానవుడా!’’ వాడే! వాడే! ఆ ‘జగన్నా’ధ రథచక్రాల కోసం ఎదురుచూస్తున్న మానవుడు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రక్షణ కల్పించటమే ‘దిశ’ చట్టం ముఖ్య ఉద్దేశం
సాక్షి, అమరావతి: మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ’ చట్టం ముఖ్య ఉద్దేశమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ‘దిశ’ చట్టంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టంపై జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో ‘వర్క్ షాప్’ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ‘దిశ ’చట్టం ఉద్దేశమని.. వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్ట్ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు, డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిర్ణీత సమయంలో వయస్సు నిర్ధారణ, పోస్ట్ మార్టం, అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ సదుపాయం ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ వెల్లడించారు. విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ను మరింతగా పటిష్టపరచనున్నామని ఆయన తెలిపారు. అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ వర్క్షాప్లో అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు
-
చట్టం అమల్లోకి రాకముందే ఆరోపణలా?
సాక్షి, అమరావతి: దిశ చట్టంలో లోపలు ఉన్నాయని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే లోపాలున్నాయని ఆరోపించడం తగదని అన్నారు. సీనియర్ సభ్యులు కూడా మొదటిసారి ఎన్నికైన సభ్యుడిలా మాట్లాడం సరికాదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదన్నారు. ఇవాళ చట్టం తయారు చేశాక మరుసటి రోజు పొద్దున్నే అమల్లోకి వస్తుందా అని బుగ్గన ప్రశ్నించారు. ఈ అంశంలో స్పీకర్ తమ్మినేని సీతారం జోక్యం చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తుందని అన్నారు. జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది..ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయన్నారు. అవి ప్రజలకు చేరువ కావాలన్నారు. ప్రతిపక్షాల సూచనలను హోంమంత్రి నోట్ చేసుకుని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. -
చట్టం అమల్లోకి రాకముందే విమర్శలా
-
టీడీపీ సభ్యులపై సుచరిత ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన దిశ చట్టంపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చట్టం అమల్లోకి రాకముందే లోపాలున్నాయని ఆరోపించడం తగదన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దిశ చట్టంపై ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలపై సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కొరకే దిశ చట్టం రూపొందించినట్లు సభకు వివరించారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు కేసులు నమోదు చేయడంలేదనడం సరికాదన్నారు. వరకట్న హత్యల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి మేకతోటి సుచరిత సమాధానాలు ఇచ్చారు. మహిళలపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయన్న ప్రశ్నకు వివరంగా సమాధానమిచ్చారు. వరకట్న హత్యలు జూన్ లో 3, జులై 1, అగస్ట్ 3, సెప్టెంబర్ 2 అక్టోబర్ లో ఏమీ లేదు. వరకట్న మరణాలు జూన్లో 12, జులైలో 9, ఆగస్ట్ లో 8, సెప్టెంబర్ లో 9, అక్టోబర్ లో 10 మొత్తం 48 జరిగాయి. ఆత్మహత్యకు పురికొల్పడం జూన్ లో 38, జులైలో 29, ఆగస్ట్ లో 60, సెప్టెంబర్ లో 26, అక్టోబర్ లో 35 కేసులు నమోదయ్యాయి. వేధింపుల కేసులు జూన్ లో 690, జులై లో 906, ఆగస్ట్ లో 703, సెప్టెంబర్ లో 671, అక్టోబర్ లో 645 మొత్తం 3615 కేసులు నమోదయ్యాయి. మహిళల హత్యలు జూన్ లో 23, జులైలో 23, ఆగస్ట్ లో 18, సెప్టెంబర్ లో 18, అక్టోబర్ లో 27 మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. డీపీ చట్టం ద్వారా జూన్ లో 90 కేసులు, జులైలో 129, ఆగస్ట్ లో 88, సెప్టెంబర్ లో 81, అక్టోబర్ లో 92 మొత్తంగా 480 కేసులు నమోదయ్యాయి. అపహరించడం, బలవంతంగా ఎత్తుకుపోవడం జూన్ లో 76, జులైలో 75, ఆగస్టు లో 45, సెప్టెంబర్ లో 39, అక్టోబర్ లో 31 మొత్తం 266 కేసులు నమోదయ్యాయి. శీలభంగానికి సంబంధించి జూన్ లో 399, జులై లో 487, ఆగస్ట్ లో 416, సెప్టెంబర్ లో 423, అక్టోబర్లో 363 మొత్తం 2088 కేసులు నమోదయ్యాయి’ అని వివరించారు. -
దిశ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు
-
దిశ చట్టంపై ఒడిశా, ఢిల్లీ ఆసక్తి : స్పీకర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం దిశ చట్టాన్ని అమోదించిన సభకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. దిశ చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరినట్లు స్పీకర్ తెలిపారు. చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా చట్టం గురించి తమను సంప్రదించిందని స్పీకర్ తెలిపారు. దిశ చట్టం ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమన్నారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం చట్టంపై పలువురు సభ్యులు ప్రసంగించారు. మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. -
సాధికార శంఖారావం
ఈ డిసెంబర్ నెల ఎందుకో కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నది. వణికించే చలిగాలులు ఇంతవరకూ వీచిన దాఖలా లేదు. ఈసారి డిసెంబర్ మాసం రైతుల పాలిటి కరుణామయి లాగా కనిపిస్తున్నది. కల్లాల్లోని ఖరీఫ్ను–నాటేసుకుంటున్న రబీని కబళించే తుపాను దాడులకు తావీయలేదు. శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం నడుస్తున్న ఈ డిసెంబర్ నెల మహిమాన్వితమైన మాసంగా ఉత్తేజపరుస్తున్నది. సాధికారత కోసం, సమాన హక్కులకోసం స్వప్నిస్తున్న మహిళలకు, పేద వర్గాలకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ఖడ్గాలనూ, రక్షణ కవచాలను అంద జేసింది. శాసనసభ శీతాకాల సమావేశాలు ఒక విప్లవాత్మక బిల్లును ఆమోదించాయి. మరో విప్ల వాత్మక ప్రస్థానానికి అడ్డుగా నిలిచిన ముళ్లనూ, రాళ్లనూ ఏరివేశాయి. ఈ నేలనూ నింగినీ ఏలడా నికి ముందుకొస్తున్న మహిళల పాలిటి తోడేళ్లుగా దాపురించిన మృగాళ్లను గురి తప్పకుండా వేటాడే ఏపీ–దిశ చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించి సభ ఆమోదాన్ని తీసుకున్నది. పోటీ ప్రపం చంలో నెగ్గుకు రావడానికి ఒక దివ్యాస్త్రంలాగా ఉపయోగపడుతున్న అంశం ఇంగ్లిష్ మాధ్య మంలో విద్యాబోధన. ఆ దివ్యాస్త్రాన్ని పేద విద్యా ర్థులందరికీ ప్రసాదించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిర్మించాలని ఉవ్విళ్లూరిన ప్రతిపక్షం ప్రజా చైతన్యాన్ని చూసి వెనక డుగు వేసింది. ఈ అసెంబ్లీ చర్చల్లో ఇంగ్లిష్ మాధ్య మంపై తెల్లజెండా చూపించి సంపూర్ణమైన లొంగు బాటును బేషరతుగా ప్రకటించింది. మహిళల విద్యపై అప్రకటిత నిషేధం కొన సాగుతున్న రోజుల్లోనే, నూరేళ్లకు పూర్వం.. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ప్రశ్నిం చారు. నాటినుంచి నేటివరకు విద్యా– విజ్ఞాన రంగాల్లో మహిళల ప్రస్థానం జెట్ వేగంతో దూసు కొని వచ్చింది. ఎన్నోవిధాలుగా సామాజిక శృంఖ లాలలో బంధించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె జైత్రయాత్రను సంపూర్ణంగా అడ్డుకోలేక పోయారు. రైలింజన్లూ, యుద్ధ విమానాలు నడప డంతోపాటు అంతరిక్షయానం దాకా ఆకాశమే హద్దుగా పురోగమిస్తున్నది. ఈ దశలో, ప్రత్యేకించి మనదేశంలో నెలకొన్న దురదృష్టకర పరిస్థితి మహిళా సాధికారతకు ఆటంకాలు సృష్టిస్తున్నది. మహిళలపై జరుగుతున్న హింసా, అత్యాచారాలు మనదేశంలోనే ఎక్కువ. రెండేళ్ల కిందటి అధికారిక లెక్కల ప్రకారమే సగటున రోజుకు 90 అత్యా చారాలు జరుగుతున్నాయి. ఇది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అవుతున్న కేసుల సంఖ్య మాత్రమే. ఫిర్యాదు చేయకుండా తమలో తాము కుమిలి పోతున్న వారి సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. చదువుకునే చోట, పనిచేసే ఆఫీసులో, ఇంట్లో–ఇరుగుపొరుగులో, బంధు వర్గాల మధ్య, వీధుల్లో పోకిరీల నడుమ వేధిం పులు, వెక్కిరింతలతో మానసిక వేదనకు గురికాని మహిళల సంఖ్య బహు స్వల్పం. స్త్రీని సహచరిగా కాక, తక్కువగా చూసే మన సాంస్కృతిక వార సత్వ భావజాలం కారణంగా కొందరి మెదళ్లలో ‘మృగాళ్లు’ మొలుస్తున్నాయి. అలా మొలకెత్తిన మృగాళ్లకు కడుపునిండా మద్యంపోసి, కంటినిండా అశ్లీలం పోసి ఏపుగా పెంచుతున్నాము. అలా పెరి గిన తోడేళ్లు మానవ రూపం కప్పుకొని యథేచ్ఛగా మహిళలపై దాడులు చేయగలుగుతున్నాయి. గజా నికొక గాంధారీసుతుడు గాండ్రిస్తున్న నేలలో, విచ్చలవిడిగా కీచక సంతతి రెచ్చిపోతున్న వేళలో నిర్భీతిగా సంచరించే స్వేచ్ఛను మహిళ కోల్పోతు న్నది. ఆ స్వేచ్ఛ లేనినాడు మరిన్ని ఉన్నత శిఖరా లను అధిరోహించడం మహిళకు సాధ్యంకాదు. ఒక రకంగా మహిళా సాధికారతకు ఈ కీచక పర్వం ఆటంకంగా తయారైంది. తన పతి ప్రాణాలను అన్యాయంగా హరించారన్న కోపంతో యమ ధర్మరాజును నిలదీయడానికి బయల్దేరుతుంది సావిత్రి. యమపురిలోకి ప్రవేశించడానికి అడ్డుగా భయంకరమైన వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. సావిత్రి తన లక్ష్యాన్ని సాధించి పతిప్రాణాలను తిరిగి పొందాలంటే ఈ వైతరణీ సవాల్ను అధిగ మించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేటి మహిళ తన సాధికారతా లక్ష్యసాధన కోసం అత్యాచారాల రూపంలో జుగుప్సాకరంగా ప్రవహిస్తున్న వైతర ణిని దాటవలసి వున్నది. అదిగో, అలా దాట డానికి ఉపయోగపడే ఒక పడవను ఏపీ దిశ యాక్ట్ –2019 రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తయారు చేసింది. గతంలో ఇందుకోసమే కేంద్రం రూపొందించిన నిర్భయ చట్టం ఆచరణలో సత్ఫ లితాలు ఇవ్వని నేపథ్యంలో అందులోని లోపాలను పరిహరిస్తూ, కట్టుదిట్టంగా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలాగా ఈ బిల్లును ఏపీ ప్రభుత్వం తయారుచేసింది. యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన శంషాబాద్ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ పేరు మీద ఏపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. దుర్మార్గాలకు బలవుతున్న ఆడబిడ్డల పట్ల ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆలోచించి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇది అమలులోకి వచ్చిన తర్వాత అత్యాచారం ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలని ఆయన హెచ్చరించారు. దిశ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో ఏడు పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి. మరో 14 పని దినాల్లో కోర్టు విచారణ పూర్తికావాలి. దోషం నిరూపితమైతే తప్పనిసరిగా మరణదండనే. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్లో కొత్తగా 354 (ఎఫ్) సెక్షన్ను చేర్చారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ద్వారా మహిళలపై జరిగే వేధింపులపై కూడా కఠిన శిక్షలను ప్రతిపాదిస్తూ 354 (ఇ) సెక్షన్ను జోడించారు. ఈరకంగా ప్రతి పాదించిన సత్వర న్యాయం పూర్తిగా ఆచరణా త్మకం కావడానికి కూడా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇందుకోసం మరొక బిల్లును ప్రత్యే కంగా శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాల కేసులు విచారించడానికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటవుతుంది. ఈ కేసులు వేగంగా దర్యాప్తు చేయడానికి వీలుగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేస్తారు. వీటికోసమే ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తారు. స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు ఐపీసీలో సవరణలు చేసుకునే సౌకర్యం రాష్ట్రాలకు ఉన్నందువలన ఏపీ దిశ–2019 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంలో ఎటువంటి ఇబ్బంది వుండే అవకాశం లేదు. బిల్లుకు ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. మహిళా హక్కుల ఉద్యమ కారుల దగ్గర నుంచి సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థులు, యువతులు స్వాగతించారు. ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిం చారు. ఏపీ దిశ చట్టాన్ని దేశమంతటా అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. నిర్భయ తల్లి, దిశ తండ్రి రాష్ట్ర ప్రభుత్వ చర్యను కొనియాడారు. భారతదేశ మహిళా సాధి కారిత ఉద్యమ చరిత్రలో ఏపీ–దిశ యాక్ట్–2019 ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రిజర్వు చేసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై కూడా సభలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసివున్నప్పటికీ మరోసారి చర్చ జరగడానికి కారణం వున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే తడవుగా ప్రతిపక్ష క్యాంపు దీనికి వ్యతి రేకంగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించేటందుకు సన్నాహాలు చేసింది. తెలుగు భాషకు మరణ శాసనం రాస్తున్నారంటూ చంద్రబాబు–పవన్ కల్యాణ్లు విరుచుకుపడ్డారు. ఎల్లో మీడియాగా చలామణిలో వున్న రెండు పత్రికలు పతాక శీర్షిక లతో కృత్రిమ ఉద్యమానికి సమిధలు సమకూ ర్చాయి. ఈ వ్యవహారంపై పేద ప్రజానీకంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రైవేట్ పాఠ శాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న ధన వంతుల బిడ్డలతో తెలుగు మాధ్యమంలో చదువు కున్న తమ బిడ్డలు పోటీ పడలేకపోవడాన్ని ఈ తల్లిదండ్రులు అనుభవపూర్వకంగా తెలుసుకు న్నారు. ఇంగ్లిష్ నైపుణ్యం లేకుండా పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నెగ్గుకు రావడం కష్టం. తెలుగులో చదివిన విద్యార్థి ఉన్నత స్థానాలను చేరుకోవడానికి ఇది పెద్ద అవరోధంగా తయారైంది. అసమానుల మధ్య పోటీ ధర్మంకాదు, యుద్ధనీతి కూడా కాదు. విరథిపై రథి బాణం వేయడు. తన రథ చక్రం నేలలో దిగబడినప్పుడు కిందికి దిగి చక్రాన్ని పైకె త్తడానికి ప్రయత్నిస్తాడు కర్ణుడు. ఇదే అదనుగా బాణం ఎక్కుపెట్టిన అర్జునుడికి ఈ ధర్మాన్ని గుర్తుచేస్తాడు కర్ణుడు. బ్రాహ్మణేతరులకు తిరు మంత్రోపదేశం నిషి ద్ధమైన రోజులలో శ్రీరంగం గుడి గోపురమెక్కి అందరికీ వినిపించేలా గట్టిగా ఆ మంత్రాన్ని పఠించిన రామానుజాచార్యుల వారి విప్లవాత్మక చర్య వంటిది పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధన. పేదల సాధికారతకోసం ప్రభుత్వం సమ కూర్చిన దివ్యాస్త్రంగా ఇంగ్లిష్ మాధ్యమాన్ని వారు భావించారు. తెలుగు భాషాభిమానం పేరుతో ముందుకు తెచ్చిన మోసపూరిత వాదాలను పేద వర్గాల అనుకూల మేధావులు ప్రతి వాదాలతో తుత్తునియలు చేసి ప్రభుత్వానికి అండగా నిలి చారు. ఈ పరిణామాలతో బిత్తరపోయిన ఎల్లో సిండికేట్ తోకముడిచింది. ఈ సమావేశాల్లోనే ప్రతిపక్ష నేత తన అమ్ముల పొదిలోని యూ–టర్న్ బాణాన్ని మరోసారి ప్రయోగించాడు. తన ఖాతాలో ఇదివరకే వేసుకున్న హైదరాబాద్ నిర్మాణం, కంప్యూటర్ను కనిపెట్టడం, మొబైల్ ఫోన్ ఇన్వెన్షన్ వగైరాల సరసన ఇంగ్లిష్ మీడి యాన్ని కూడా చేర్చుకున్నారు. స్వల్పకాలిక సమావేశాలే అయినప్పటికీ, పేదలు, మహిళల తరఫున సాధికార శంఖారావం చేసిన సమావేశాలుగా ఇవి అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోతాయి. చరిత్రాత్మకమైన దిశ బిల్లును అడ్డుకోవడానికీ, ఇతర ముఖ్యమైన బిల్లులను పక్క దోవ పట్టించడానికి వాయిదా తీర్మానాలు పెట్ట డం, మార్షల్స్తో గొడవపడడం వగైరా పాత టెక్ని క్లనే ప్రతిపక్షం ఆశ్రయించింది. ఈ తరహా ‘ప్లే టు ది గ్యాలరీ’ వ్యూహాలకు కాలదోషం పట్టింది. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారు. తన వయసు డెబ్బయ్ సంవత్సరాలైనా, ఆలోచన ఇరవైరెండేనని ప్రతిపక్ష నేత ప్రకటించుకున్నారు. ఆ మాటలు ఆచరణాత్మకంగా నిరూపితం కావా లంటే అసెంబ్లీలో పాతకాలపు వీధినాటక ప్రద ర్శనలకు భరతవాక్యం చెప్పవలసి ఉంటుంది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
టోల్ఫ్రీకి ఫేక్ బెడద
దిశ ఘటన అనంతరం పెరిగిన కాల్స్ దిశ ఘటన తరువాత డయల్ 100, 112లకు కాల్స్ గణనీయంగా పెరిగాయి. వాటిలో ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో నిజమైన బాధితులకు ఫోన్లైన్లు బిజీ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. డయల్ 112కు ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) రెండు లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో లైను ద్వారా సెకనుకు 30 కాల్స్ చొప్పున రెండు లైన్లకు మొత్తం 60 కాల్స్ మాట్లాడవచ్చు. అంతకు మించి వచ్చే కాల్స్తో లైన్స్ బిజీ అని వస్తోంది. పెరిగిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సమస్యను అధిగమించేలా మరో రెండు పీఆర్ఐ లైన్లు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లలో కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నుంచి నేరుగా డయల్ 112కు ఎమర్జన్సీ కాల్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం లేని వారు ఫోన్లోని పవర్ బటన్ను మూడుసార్లు నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్లి కట్ అవుతుంది. అనంతరం వారిలొకేషన్ సమీపంలోని పోలీస్స్టేషన్కు వెళ్తుంది. వారు తిరిగి కాల్ చేసి సమస్య కనుక్కుంటారు. బేసిక్ మోడల్ ఫోన్ కీ ప్యాడ్లో 2 లేదా 9 అంకెను నొక్కి పెడితే డయల్ 112కు కాల్ వెళ్లిపోతోంది. ►టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. ►కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టోల్ఫ్రీ నెంబర్లకు పెద్దఎత్తున వస్తున్న ఫోన్కాల్స్తో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100, 112 నెంబర్లకు రోజూ లెక్కకు మిక్కిలి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో పోలీసులు పరిష్కరించదగ్గ అంశాలకు సంబంధించి కాల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగిలిన ఫిర్యాదులన్నీ టోల్ఫ్రీ నెంబర్ పనిచేస్తుందా? ఫిర్యాదులు తీసుకుంటున్నారా? సమాచారం కోసం, అవినీతిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ వివరాలు అందించాలి? అనే వివరాలు తెలుసుకునేందుకే చేయడం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫేక్ కాల్స్ బెడద పెరగడంతో అసలు ఆపదలో ఉన్నవారికి లైన్ కలవక ఇబ్బంది పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. –సాక్షి, అమరావతి సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టోల్ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళలు, ప్రజలు తమ సమస్యలను ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పిన అతి తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలను సది్వనియోగం చేసుకోవాలి. టోల్ఫ్రీ నెంబర్లపై అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం. –గౌతమ్ సవాంగ్, డీజీపీ అసలైన బాధితులు నష్టపోతారు టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసు సేవలు పొందే అవకాశం ఉంది. డయల్ 100, 112ను సద్వినియోగం చేసుకుంటేనే వాటి ఏర్పాటుకు సార్ధకత ఉంటుంది. దుర్వినియోగం చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం చేసినవారవుతాం. –ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి జాతీయ కమిషనర్ డిసెంబర్ 12న టోల్ఫ్రీ నెంబర్లకు నమోదైన ఫోన్కాల్స్విశ్లేషిస్తే ►16,207డయల్ 100కు వచ్చిన కాల్స్ ►533 వాటిలోపోలీసులు స్పందించదగినవి ►516 కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించినవి ►17 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులు 3.50లక్షలుడయల్ 112కు వచ్చిన కాల్స్ ►వాటిలో పోలీసులు స్పందించదగ్గవి1,779 ►కేసులు నమోదు చేసినవి2 ►రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు గత నెల 25న డయల్ 14400 నెంబర్ను ప్రారంభించారు ►డయల్ 14400కు తొలి రోజు వచి్చన కాల్స్ 5100 ►వాటిలో ఏసీబీకి వచి్చన ఫిర్యాదులు కేవలం 283 మాత్రమే -
‘దిశ’తో ఆడపడుచులకు అభయం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం ఆడపడుచులకు ఆభయమిచ్చేదిగా ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, విద్యార్థినులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ రక్షణకు భరోసా లభించిందని విద్యార్థినులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో ‘సాక్షి’ టీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చర్చావేదికలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళలు, యువతుల నుంచి ముక్కుపచ్చలారని ఆడ శిశువులు, వృద్ధురాళ్లపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్న ప్రస్తుత సమాజంలో దిశ చట్టం రక్షణ ఇస్తుందనే భరోసాను వ్యక్తం చేశారు. పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేస్తున్న అత్యాచారాలు, హత్యలు వంటి సంఘటనలను నిరోధించడానికి దిశ బిల్లు పూర్తిగా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం చట్టాల్లోని లొసుగుల వల్లేనని, కింది కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్ళే అవకాశం దోషులకు కల్పించడంవల్లే వారికి భయం లేకుండా పోయిందన్నారు. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకు రావడంతో వారి వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. కొత్తం చట్టం అమలులోకి వస్తే ఆడపడుచులు నిర్భయంగా ఉంటారన్నారు. దిశ çఘటనలో దోషులను ఎన్కౌంటర్ చేయడాన్ని ఎందరో మేధావులు స్వాగతించడం, మగవాళ్ల నుంచి కూడా ఈ దిశ చట్టానికి సంపూర్ణ మద్దతు లభిస్తుండడం సమాజంలో మార్పు ఎంత అవసరమో స్పష్టం చేస్తోందని అన్నారు. దోషులను శిక్షించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అసలైన నేరస్థులకే శిక్షపడేలా చూడాలని సూచించారు. ఈ చర్చా వేదికలో వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల మహిళా కన్వీనర్ శ్రీలక్ష్మి, న్యాయవాదులు అంబటి స్వర్ణలత, శ్రీలేఖ, తేతలి శశిధర్ రెడ్డి, పారిశ్రామికవేత్త కేకే గుప్తా, కళాశాల ప్రిన్సిపల్ మరియట్ట డిమెల్లో, యాంకర్ హిమబిందు పాల్గొన్నారు. -
దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్కు జేజేలు
సాక్షి, నెల్లూరు (వేదాయపాళెం): మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తీసుకురావడం ఎంతో శ్లాఘనీయమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నట్లు చెప్పారు. ఇలాంటి చట్టాన్ని అన్ని రాష్ట్రాలు తీసుకువచ్చి, అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నెల్లూరు వచ్చారు. అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో 21 రోజుల్లో నేరస్తులను శిక్షించడానికి ఏపీలో దిశ చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. -
దిశ చట్టం : హోంమంత్రి సుచరితతో స్పెషల్ డిబెట్..