asteroid
-
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్క్రాఫ్ట్గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్క్రాఫ్ట్ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘2023 ఓజీ40’ : గ్రహశకలాన్ని గుర్తించిన బాలుడు
నాసా వారి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్మెట్లతో కలిసి పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్ మాలిక్ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నాడు.హార్డిన్ సిమన్స్ యూనివర్శిటికి చెందిన డాక్టర్ పాట్రిక్ మిల్లర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాకు చెందిన మాలిక్ ‘శివనాడర్ స్కూల్’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్ జియోగ్రాఫిక్లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు. ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్సైట్ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్ మాలిక్. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్ మాలిక్.చదవండి : కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్ -
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్యూ 3గ్రహశకలం 2018 ఎక్స్యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్కే 1గ్రహశకలం 2024 ఎక్స్కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ అని పేరుపెట్టారు. ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి.. అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 9 రెట్లు అధికం. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహ శకలాలలపై మరిన్ని పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకన్కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Space Rock: నెలల శిలరేడు!
ఇప్పటిదాకా అది కేవలం ఒక అంతరిక్ష శిలే. కానీ త్వరలో ఓ రెండు నెలల పాటు తాత్కాలికంగా ‘చందమామ’ హోదా పొందనుంది! ఎవరా బుల్లి చంద్రుడు? ఏమిటా విశేషాలు? చూద్దాం రండి... భూ కక్ష్యను సమీపిస్తున్న ఒక బుల్లి గ్రహశకలాన్ని సైంటిస్టులు తాజాగా గమనించారు. అది ఇంకొద్ది రోజుల్లో తాత్కాలికంగా భూమ్యాకర్షణ శక్తికి లోనవనుంది. సెప్టెంబర్ 29 నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశించి మన గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలు పెడుతుంది. దాని చక్కర్లు నవంబర్ 25 దాకా కొనసాగుతాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు వివరించారు. ఆ మీదట తిరిగి సౌర కక్ష్యలోకి ప్రవేశించి ఎప్పట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది.దక్షిణాఫ్రికాలోని నాసా అబ్జర్వేటరీ ద్వారా సైంటిస్టులు దీన్ని గత ఆగస్టు 7న గమనించారు. దీని వ్యాసం 37 అడుగులని అంచనా వేసినా 16 నుంచి 138 అడుగుల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బుల్లి తాత్కాలిక చంద్రున్ని 2024పీటీ5గా పిలుస్తున్నారు. భూ కక్ష్యలోకి దాని రాకపోకలను గురించిన సమాచారం అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాజా సంచికలో ప్రచురితమైంది. ఆ ప్రమాదమేమీ లేనట్టే... 65 అడుగుల వ్యాసంతో కూడిన ఇలాంటి గ్రహశకలమే ఒకటి 2013లో పెద్ద భయోత్పాతమే సృష్టించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలో చెలియాబిన్స్క్ ప్రాంతంలో ఒక్క ఉదుటున పేలిపోయింది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోíÙమాపై ప్రయోగించిన తొలి అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తిని, సూర్యున్ని తలదన్నేంతటి ప్రకాశాన్ని విడుదల చేసింది. దాని తాలూకు శకలాలు శరవేగంగా వచ్చి పడటంతో చెలియాబిన్స్్కలో ఏకంగా 7,000 పై చిలుకు భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. 1,000 మందికి పైగా గాయపడ్డారు. కానీ 29న భూ కక్ష్యలోకి ప్రవేశించనున్న 2024పీటీ5తో మాత్రం ప్రస్తుతం గానీ, కొద్ది దశాబ్దాల తర్వాత గానీ అలాంటి ముప్పేమీ ఉండబోదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. నవంబర్ 25న మన కక్ష్యను వీడిన మీదట అది చూస్తుండగానే భూమికి 42 లక్షల కిలోమీటర్ల దూరానికి లంఘించి సౌర కక్ష్యలోకి వెళ్లిపోనుందట. అనంతరం మళ్లీ 2055లో, ఆ తర్వాత 2084లోనూ ఈ బుల్లి జాబిల్లి భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందట. ఆ రెండుసార్లూ కొద్ది రోజుల పాటు మాత్రమే చక్కర్లు కొట్టి తన మాతృ కక్ష్యలోకి వెళ్లిపోతుందని సైంటిస్టులు వివరించారు. ప్రతి పదేళ్లలో ఒకట్రెండుసార్లు... ఇలాంటి బుల్లి చంద్రులు భూమిని పలకరించడం అరుదేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో 2020సీడీ3 అనే గ్రహశకలం ఇలాగే రెండు నెలల పాటు భూ కక్ష్యలోకి చొచ్చుకొచి్చంది. రెండు నెలల పాటు ప్రదక్షిణం చేసిన మీదట గుడ్బై చెప్పి వెళ్లిపోయింది. దశాబ్దానికి రెండు మూడుసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. కొద్ది రోజులు, వారాలు, మహా అయితే ఒకట్రెండు నెలలు కక్ష్యలో ప్రయాణించిన మీదట అవిఇలా పలాయనం చిత్తగిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం భూ కక్ష్యలోకి వచ్చిన మీదట కనీసం ఒకట్రెండు ప్రదక్షిణలైనా పూర్తి చేస్తాయి.అంటే ఒకట్రెండేళ్లపాటు భూ కక్ష్యలోనే కొనసాగుతాయి. అయితే ఇలాంటి ఉదంతాలు అరుదు. మహా అయితే 10 నుంచి 20 ఏళ్లలో ఒకసారి జరిగితే గొప్పే. అయితే, ‘‘ఏ సమయంలో చూసినా భూ కక్ష్యలో అత్యంత చిన్న గ్రహశకలాలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి మరీ పళ్లాలంత చిన్నవిగా ఉంటాయి గనుక వాటి ఉనికిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం’’ అని సౌరవ్యవస్థ నిపుణుడు రాబర్ట్ జేడిక్ తెలిపారు. అంతేకాదు, ‘‘2024పీటీ5 కనీసం 10 మీటర్ల కంటే పొడవుంటుందని దాదాపుగా తేలిపోయింది. కనుక ఇప్పటిదాకా సైంటిస్టుల దృష్టికి వచి్చన ‘తాత్కాలిక చందమామ’ల్లో ఇదే అతి పెద్దది’’ అని వివరించారు. అంత ఈజీ కాదు...గ్రహశకలాలు ఇలా తాత్కాలికంగా ఉపగ్రహం అవతారమెత్తడం అంత సులువు కాదు. అందుకు చాలా విషయాలు కలిసి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా భూమ్యాకర్షణ శక్తికి ఆకర్షితమయ్యేందుకు అవసరమైనంత వేగంతో, అవసరమైన దిశలో ప్రయాణిస్తూ ఉండాలి. అంతేగాక భూ కక్ష్యకు దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం కాస్త నెమ్మదిస్తూ రావాలి. ఇవన్నీ జరిగితే సదరు గ్రహశకలం దాని పరిమాణం, బరువుతో నిమిత్త లేకుండా భూ కక్ష్యలోకి వచ్చేస్తుంది. సాధారణంగా గంటకు 3,600 కి.మీ. వేగంతో భూమికి 45 లక్షల కిలోమీటర్ల భూమి సమీపానికి వచ్చే గ్రహశకలాలు ఇలా భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంటాయి.‘అర్జున’ పథం నుంచి...తాజాగా మనల్ని పలకరించనున్న 2024పీటీ5 గ్రహశకలం ఎక్కణ్నుంచి వస్తోందో తెలుసా? ‘అర్జున’ గ్రహశకల పథం నుంచి! అది అసంఖ్యాకమైన బుల్లి బుల్లి గ్రహశకలాలకు నిలయం. భూమి మాదిరిగానే అవి కూడా సూర్యుని చుట్టూ తమ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. ఇవేగాక అంగారకునికి, బృహస్పతికి మధ్యనుండే ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బుల్లి చంద్రులు వచ్చి భూమిని పలకరిస్తుంటాయి. 2024పీటీ5ను నిశితంగా పరిశీలించి వీలైనంత విస్తారంగా డేటాను సేకరించేందుకు సైంటిస్టులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్పెయిన్లోని కానరీ ద్వీపంలో ఉన్న రెండు భారీ టెలిస్కోపులను రెండు నెలల పాటు పూర్తిగా ఈ పని మీదే ఉండనున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం
-
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్తో కూడిన హార్పూన్ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
అమెరికా నుంచి భారత్ వరకు ముంచుకొస్తున్న ప్రమాదం.. నాసా హెచ్చరిక!
2046వ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును గ్రాండ్గా సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, విరమించుకోండి.. మీరు విన్నది నిజమే.. ఎందుకంటే.. ఆ రోజున ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందట. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ఈ మేరకు హెచ్చరించింది. మరి ఏమిటా గ్రహశకలం? ఎక్కడ పడే అవకాశముంది? ఎంత నష్టం జరుగుతుందనే వివరాలు మీకోసం.. ఒక భారీ గ్రహశకలం.. దాదాపు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొడితే డైనోసార్లు సహా 90శాతానికిపైగా జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత మరికొన్ని గ్రహశకలాలు వాటి స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడూ అలాంటి ప్రమాదం ముంచుకు వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. 2046 ఫిబ్ర వరి 14న సాయంత్రం 4.44 గంటల (ఈస్టర్న్ టైం)కు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని పేర్కొంది (భారత కాలమానం ప్రకారం.. ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గంటలకు). ఇటలీలోని పీసా టవర్(186 అడుగులు)కు కాస్త దగ్గరగా 165 అడుగుల పరిమాణంలో ఈ గ్రహ శకలం ఉందని తెలిపింది. కొన్ని వారాలుగా పరిశీలించాక.. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలాన్ని కొన్నివారాల క్రితమే గుర్తించారు. దాని ప్రయాణమార్గం, వేగం, ఇతర అంశాలను పరిశీలించిన ఓ ఇటాలియన్ ఆస్ట్రానమర్.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసాను అలర్ట్ చేశారు. తొలుత 1,200 చాన్సుల్లో ఒకసారి అది ఢీకొట్టవచ్చని భావించారు. నిశితంగా పరిశీలించాక.. 710 చాన్సుల్లో ఒకసారికి, తర్వాత 560 చాన్సుల్లో ఒకసారికి మార్చారు. అంటే ప్రమాద అవకాశం మరింత పెరుగుతోందన్న మాట. అమెరికా నుంచి భారత్ దాకా.. ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా ఎక్కడైనా పడొచ్చని నాసా అంచనా వేసింది. అమెరికాలోని హవాయి, లాస్ ఏంజిలిస్, వాషింగ్టన్ వంటి నగరాలూ ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొంది. నాసా అంచనా వేసిన మ్యాప్ ప్రకారం.. తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ థాయ్లాండ్, ఇండియా, గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. వీటికి ప్రమాదం తక్కువ. టొరినో స్కేల్పై లెవల్-1 వద్ద.. భూకంపాలను రిక్టర్ స్కేల్తో కొలిచినట్టే.. గ్రహశకలాలు ఢీకొట్టే ప్రమాదాన్ని టొరినో స్కేల్తో కొలుస్తారు. దాని పరిమాణం, వేగం, భూమికి ఎంత దగ్గరగా ప్రయాణిస్తుందనే అంశాల ఆధారంగా లెవల్ రేటింగ్ ఇస్తారు. ‘2023డీడబ్ల్యూ’తో ప్రమాదాన్ని లెవల్–1 వద్ద సూచించారు. మరింత కచి్చతమైన పరిశీలన తర్వాత స్థాయిని పెంచుతారు. లెవల్–3 దాటితే ప్రజల కు హెచ్చరికలు జారీ చేస్తారు. అంతుకుముందుతో పోలిస్తే.. 1908లో దాదాపు 160 అడుగుల గ్రహశకలం రష్యాలోని సైబీరియా గగనతలంలో ఐదారు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దీని ధాటికి సుమారు 2వేల చదరపు కిలోమీటర్లలో అడవి, జీవజాలం నాశనమైంది. జనావాసాలకు దూరంగా జరగడంతో మరణాలు నమోదు కాలేదు. కానీ ఆ పేలుడు తీవ్రత జపాన్లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు ఎక్కువని, నేరుగా భూమిని ఢీకొని ఉంటే భారీ విధ్వంసం జరిగేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. - ఇప్పుడు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం జనావాసాలు ఉన్నచోట ఢీకొంటే.. ఒక పెద్ద నగరమంత వైశాల్యంలో అంతా నామరూపాలు లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ We've been tracking a new asteroid named 2023 DW that has a very small chance of impacting Earth in 2046. Often when new objects are first discovered, it takes several weeks of data to reduce the uncertainties and adequately predict their orbits years into the future. (1/2) pic.twitter.com/SaLC0AUSdP — NASA Asteroid Watch (@AsteroidWatch) March 7, 2023 -
అత్యంత వేగంగా భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఇదే తొలిసారి!
కేప్ కెనావెరల్ (వాషింగ్టన్): బుల్లి గ్రహశకలమొకటి భూమికేసి అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఆ క్రమంలో మనకు అత్యంత సమీపానికి రానుందట. ఎంత దగ్గరికంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రానికి ఏకంగా 3,600 కిలోమీటర్ల సమీపానికి! అంటే అంతరిక్షంలో తిరుగుతున్న మన సమాచార ఉపగ్రహాల కంటే కూడా భూమికి పదింతలు సమీపానికి వచ్చి పడుతుందన్నమాట!! ఇది జరిగేదెప్పుడో తెలుసా? శుక్రవారం ఉదయం 5 గంటలకు 57 నిమిషాలకు! అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం దాదాపుగా లేనట్టేనని నాసా చెబుతోంది. ‘‘ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దాని మార్గం బాగా మారిపోతుంది. ఒకవేళ అది భూ వాతావరణంలోకి ప్రవేశించినా దాదాపుగా గాల్లోనే మండిపోతుంది’’ అంటోంది. మహా అయితే దాని ముక్కలు ప్రమాదరహితంగా భూమిపై పడితే పడొచ్చట. ఓ గ్రహశకలం భూమికి ఇంత సమీపానికి రావడం మనకు తెలిసి ఇదే తొలిసారని నాసా చెబుతోంది. -
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
Asteroid: మిస్సైల్ కంటే వేగంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
వాషింగ్టన్: భూమికి సమీపంగా రోజూ ఎన్నో గ్రహశకలాలు వెళ్తుంటాయి. కొత్తవాటిన్నెంటినో గుర్తిస్తుంటారు కూడా. అయితే.. భూమికి అత్యంత సమీపంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు చెబుతుంటారు. ఎందుకంటే వాటిలో ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి కాబట్టి. అలాగే.. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఓ భారీ గ్రహశకలం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 వైజీ5.. భూమి వైపు దూసుకొస్తోందట. డిసెంబర్ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా హెచ్చరిస్తోంది. గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. విశేషం ఏంటంటే.. ఆస్టరాయిడ్ 2022 వైజీ5ను డిసెంబర్ 24 తేదీనే గుర్తించింది నాసా. ఇది అపోలో గ్రూప్ గ్రహశకలాలకు చెందిందని, సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు, అందునా భూమిని ఢీ కొట్టే సంభావ్యత ఉన్న వాటిని దారి మళ్లించడం, లేదంటే అంతరిక్షంలోనే నాశనం చేసే ఉద్దేశ్యంతో ‘డార్ట్’ పేరిట ప్రయోగం చేపట్టి.. విజయం సాధించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే.. ముందస్తు హెచ్చరికలు, సమయం ఉంటేనే దూసుకొచ్చే వాటిని ఢీ కొట్టడానికి స్పేస్షిప్లను ప్రయోగించడానికి వీలవుతుంది. డార్ట్ బరువు 570 కేజీలు ఉంటుంది. వాస్తవానికి గ్రహశకలాలను, భూమి వైపు దూసుకొచ్చే మరేయితర వస్తువులను నాశనం చేయడం డార్ట్ ఉద్దేశం కాదు.. కేవలం దారి మళ్లించడం మాత్రమే లక్ష్యం. కానీ, ప్రయోగంలో శకలాలు నాశనం అవ్వొచ్చని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. మరోవైపు చైనా కూడా గ్రహశకలాలను నుంచి తమ భూభాగాల్ని, ఉపగ్రహాల్ని.. అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని రక్షించుకునేందుకు సొంతంగా ఇలాంటి రక్షణ వ్యవస్థను సిద్ధంగా చేసుకుంటోంది. 2025లో ప్రయోగాత్మకంగా గ్రహశకలాల మళ్లింపును పరీక్షించాలని భావిస్తోంది. -
అపూర్వ విజయమది
భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదమున్న గ్రహశకలాలను అంతరిక్షంలోనే ఢీకొట్టి దారి మళ్లించడం ద్వారా మనకు ముప్పు తప్పించే లక్ష్యంతో సెప్టెంబర్లో నాసా చేపట్టిన చరిత్రాత్మక డార్ట్ (డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్టన్) ప్రయోగం దిగ్విజయం కావడం తెలిసిందే. ఇందులో భాగంగా భూమికి ఏకంగా 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో డిడిమోస్ అనే పెద్ద గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తున్న డైమోర్ఫస్ అనే బుల్లి శకలాన్ని 570 కిలోల బరువున్న డార్ట్ ఉపగ్రహం గంటకు ఏకంగా 22,500 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ఆ ప్రయోగ ఫలితాలపై పలు కోణాల్లో అధ్యయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కీలక విషయాలు తాజాగా వెలుగు చూశాయి. ప్రయోగం ద్వారా డైమోర్ఫస్ కక్ష్యను మార్చడం సైంటిస్టుల ప్రధాన లక్ష్యం. అది వారు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా నెరవేరిందని తాజాగా తేలింది. డిడిమోస్ చుట్టూ దాని పరిభ్రమణ కాలం ఏకంగా 32 నిమిషాల మేరకు తగ్గిందని వెల్లడైంది. ‘‘అందుకే డార్ట్ ప్రయోగం మామూలు విజయం కాదు. ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఫలితమిచ్చింది’’ అని నాసా సైంటిస్టులు సంబరంగా చెబుతున్నారు. అంతేకాదు, డార్ట్ ఢీకొన్నప్పుడు దాని ఊహాతీత వేగపు ధాటికి డైమోర్ఫస్ నుంచి కనీసం 10 లక్షల కిలోల బరువైన ఉపరితల పదార్థాలు ముక్కచెక్కలుగా అంతరిక్షంలో దూసుకెళ్లాయట. అంతరిక్షంలో ఇలా ఒక వస్తువు ఢీకొనే వేగం వల్ల రెండో వస్తువుపై పడే ఒత్తిడిని ద్రవ్యవేగపు మార్పిడిగా పేర్కొంటారు. ‘‘డార్ట్ ప్రయోగం వల్ల జరిగిన ద్రవ్యవేగపు మార్పిడిని ‘బెటా’గా పిలుస్తాం. అర టన్ను బరువున్న ఏ వస్తువైనా గ్రహశకలం ఆకర్షణ శక్తికి లోబడి దానికేసి దూసుకెళ్తే జరిగే దానికంటే డార్ట్ ప్రయోగం వల్ల 3.6 రెట్లు ఎక్కువగా ద్రవ్యవేగపు మార్పిడి జరిగింది. డార్ట్ ప్రయాణించిన గంటకు 22,500 కిలోమీటర్ల వేగమే ఇందుకు కారణం’’ అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్కు చెందిన డార్ట్ మిషన్ సైంటిస్టు డాక్టర్ ఆండీ చెంగ్ వివరించారు. ‘‘ఈ ద్రవ్యవేగపు మార్పిడి ఎంత ఎక్కువగా ఉంటే గ్రహశకలాన్ని అంతగా దారి మళ్లించడం వీలవుతుంది. భూమిని నిజంగానే గ్రహశకలాల బారినుంచి కాపాడాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఇది చాలా కీలకంగా మారగలదు. డార్ట్ ప్రయోగం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిన అతి కీలక సమాచారమిది’’ అని ఆయన చెప్పారు. ‘‘అందుకే డార్ట్ ప్రయోగాన్ని ఊహకు కూడా అందనంతటి గొప్ప విజయంగా చెప్పాలి. దీనివల్ల గ్రహ శకలాల ముప్పును తప్పించేంత సామర్థ్యం మనకు ఇప్పటికిప్పుడే సమకూరిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ దిశగా మనం వేసిన అతి పెద్ద ముందడుగుగా మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు’’ అని నాసా డార్ట్ ప్రోగ్రాంలో కీలకంగా పని చేసిన సైంటిస్టు డాక్టర్ టామ్ స్టాట్లర్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనిపై స్పందించారు. 2022లో నాసా సాధించిన మూడు ఘన విజయా ల్లో డార్ట్ ప్రయోగం ఒకటంటూ ప్రశంసించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హంతక శకలం
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం. -
Planet killer: భూమి వైపుగా ప్రమాదకరమైన గ్రహశకలం!
భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను.. అంతరిక్షంలో ఉండగానే స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా ఢీ కొట్టించడం.. తద్వారా కుదిరితే కక్ష్య వేగం తగ్గించి దారిమళ్లించడం.. లేదంటే పూర్తిగా నాశనం చేయడం.. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసాకు ఇప్పుడు లక్ష్యాలుగా మారాయి. ఈ క్రమంలో.. డార్ట్(డబుల్ ఆస్టారాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) మిషన్ తెర మీదకు వచ్చింది కూడా. అయితే డార్ట్ మిషన్కు కూడా అంతుచిక్కకుండా ఓ గ్రహ శకలం.. భూమి వైపుగా దూసుకొస్తే ఎలా ఉంటుంది?.. ఈమధ్య.. ఓ నెల కిందట నాసా అంతరిక్ష లోతుల్లో ఓ ఆస్టరాయిడ్ను స్పేస్ క్రాఫ్ట్తో ఢీ కొట్టించడం ద్వారా విజయవంతంగా దారి మళ్లించింది. ఈలోపే మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించింది నాసా. భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉన్న మరో మూడు గ్రహశకలాలను గుర్తించిందట. అంతేకాదు.. సౌరవ్యవస్థ లోపలే అవి దాక్కుని ఉన్నాయని, వాటి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని నాసా ప్రకటించింది. ఈ మేరకు చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోప్కు అమర్చిన డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా ఈ మూడు గ్రహశకలాలను గుర్తించగలిగింది నాసా బృందం. మూడు గ్రహశకలాల్లో రెండు.. కిలోమీటర్ వెడల్పుతో ఉన్నాయి. మూడవది మాత్రం ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో ఉండి.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. అయితే.. సౌర వ్యవస్థ లోపలి భాగంలో అదీ భూమి, శుక్ర గ్రహం అర్బిట్ల మధ్య ఈ మూడు గ్రహ శకలాలు గుర్తించామని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టతరంగా మారిందని నాసా బృందం తెలిపింది. వీటిని 2022 AP7, 2021 LJ4, 2021 PH27గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 2022 ఏపీ7 ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో కిల్లర్ ప్లానెట్గా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా కిలోమీటర్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్ను కిల్లర్ ప్లానెట్గానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఇవి చేసే డ్యామేజ్ ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే.. గత ఎనిమిదేళ్లలో ఇంత ప్రమాదరకమైన గ్రహశకలాన్ని గుర్తించడం మళ్లీ ఇదే. ఇది ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా భూ కక్ష్యలోకి అడుగుపెడుతుందని.. భూమిని కచ్చితంగా ఢీకొట్టి తీరుతుందని అంచనా వేస్తున్నారు నాసా సైంటిస్టులు. మిగతా 2021 ఎల్జే4, 2021 పీహెచ్27 మాత్రం భూమార్గానికి దూరంగానే వెళ్లనున్నాయి. అయితే ప్రమాదకరమైన ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించడం, నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయడం కుదరదని నాసా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు, కానీ.. -
డిడిమోస్ ఢీ! గ్రహశకలానికి తోకలు! గుర్తించిన హబుల్ టెలిస్కోప్
గ్రహశకలాల కక్ష్యను మార్చి భూమికి వాటి ముప్పును తప్పించే లక్ష్యంతో నాసా నెల క్రితం డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) ఉపగ్రహంతో డిడిమోస్ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టించడం తెలిసిందే. ఫలితంగా డిడిమోస్ నుంచి బయటికి పొడుచుకొచ్చిన రెండు తోకలను హబుల్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దానిచుట్టూ కమ్ముకున్న ధూళి మేఘాలను కూడా గమనించింది. తోకలు పుట్టుకు రావడం అనూహ్యమని నాసా అంటోంది. వీటితో గ్రహశకలానికి ఏం సంబంధమో తేల్చే పనిలో ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్యలో డిడిమోస్ తిరిగే వేగంలో 32 నిమిషాల మేరకు మార్పు వచ్చినట్టు తేలింది! ఇలా మొత్తం 18 విశేషాలను హబుల్ ఇప్పటికి గుర్తించింది. -
NASA DART Mission: అసాధారణ విజయం
తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు వగైరాల నుంచి భూగోళాన్ని రక్షించే ప్రయత్నంలో పడిన తొలి అడుగు మంగళవారం విజయవంతం కావడం శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు, ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి గలవారందరికీ ఉత్సాహాన్నిచ్చింది. గత నవంబర్లో నాసా శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో ప్రయోగించిన ఉపగ్రహం అందించిన విజయం అసాధారణమైంది. అది అంతరిక్షంలో పది నెలలు ప్రయాణించడం, శాస్త్రవేత్తల ఆదేశాలకు అనుగుణంగా నిర్దేశిత కక్ష్యలో, నిర్దేశిత వేగంతో మునుముందుకు దూసుకుపోవడం, కాస్తయినా తేడా రాకుండా అత్యంత కచ్చితంగా వారు చెప్పిన చోటే, చెప్పిన సమయానికే డైమార్ఫస్ అనే ఫుట్బాల్ గ్రౌండంత సైజున్న ఒక గ్రహశకలాన్ని ఢీకొట్టడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. డిడిమోస్ అనే మరో గ్రహశకలం చుట్టూ ఈ డైమార్ఫస్ పరిభ్రమిస్తోంది. ఈ జంట శకలాల్లో సరిగ్గా డైమార్ఫస్ని శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకున్నారు. అంతరిక్షం నుంచి భూగోళానికి రాగల ముప్పు గురించిన భయాందోళనలు ఈనాటివి కాదు. 1908లో సైబీరియాలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచ ప్రజానీకాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. అక్కడి అటవీ ప్రాంతంలో గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, పెను విస్ఫోటనం సంభవించి క్షణకాలంలో 10 కిలోమీటర్ల మేర సర్వనాశనం కావడం మానవాళి మస్తిష్కంలో నమోదైన తొట్ట తొలి ఖగోళ సంబంధ భయానక ఉదంతం. మన పుడమికి ఎప్పటికైనా ముప్పుంటుందన్న ఆందోళనకు అంకురార్పణ పడింది అప్పుడే. ఆ తర్వాత ఏమంత చెప్పుకోదగ్గ ఉదంతాలు లేవు. కానీ 2013 ఫిబ్రవరిలో రష్యాలోనే యురల్ పర్వతశ్రేణి ప్రాంత పట్టణాలు ఆరింటిని చెల్యాబిన్స్క్ గ్రహశకలం వణికించింది. కేవలం 66 అడుగుల నిడివున్న ఈ గ్రహశకలం భూవాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమై, ఉల్కాపాతంగా ముట్టడించడంతో ఆ పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. గంటకు 69,000 కిలోమీటర్ల వేగంతో ఆ గ్రహశకలం వచ్చిందని అప్పట్లో శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమేమంటే అదే రోజు 2012 డీఏ 14 పేరుగల మరో గ్రహశకలం రాక కోసం నిరీక్షిస్తున్న శాస్త్రవేత్తలకు పిలవని పేరంటంలా వచ్చిపడిన ఈ గ్రహశకలం ఊపిరాడకుండా చేసింది. ఈ ఉల్కాపాతంలో పౌరులెవరూ మరణించకపోయినా దాని పెనుగర్జన ధాటికి ఇళ్ల కిటికీ అద్దాలు పగిలి 1,500 మంది గాయపడ్డారు. ఆరు పట్టణాల్లోనూ 7,200 ఇళ్లు దెబ్బతిన్నాయి. తోకచుక్కలూ, గ్రహశకలాల తాకిడికి గురికాని గ్రహాలు ఈ విశాల విశ్వంలో లేనేలేవు. అవి పెను విధ్వంసకారులే కావొచ్చుగానీ... కేవలం వాటి పుణ్యానే ఈ పుడమి తల్లి ఒడిలో జీవరాశి పురుడు పోసుకుంది. తోకచుక్కలో, పెను గ్రహశకలాలో తమ వెంట మోసుకొచ్చిన కీలకమైన కర్బన మిశ్రమాలూ, నీరూ జీవరాశి పుట్టుకకూ, వాటి అభివృద్ధికీ కారణమని శాస్త్రవేత్తలు చెబుతారు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిణామమే విశ్వంలో భూగోళానికి విలక్షణత తీసుకొచ్చింది. ఇదే మాదిరి ఉదంతం ఈ విశాల విశ్వంలో మరోచోట జరిగే అవకాశం లేకపోలేదన్న అంచనాతో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. వారి అంచనా నిరాధారమైంది కాదు. మన పాలపుంత లోనే దాదాపు 4,000 కోట్ల నక్షత్రాలున్నాయంటారు. ఇలాంటి తారామండలాలు ఈ విశ్వంలో వంద కోట్లు ఉంటాయని ఒక అంచనా. కనుక అచ్చం భూమిపై చోటుచేసుకున్న పరిణామం వంటిదే మరోచోట జరగకపోవచ్చని చెప్పడానికి లేదు. లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే ధూళి కణాలు మేఘాలై, ఆ మేఘాలు కాస్తా కోట్ల సంవత్సరాల్లో గ్రహాలుగా రూపాంతరం చెందడం సాధారణం. ఆ క్రమంలో కొన్ని శకలాలు విడివడి ఇతర గ్రహాలకు ముప్పు తెస్తూ ఉంటాయి. గురు గ్రహానికీ, అంగారకుడికీ మధ్య ఇలాంటివి అసంఖ్యాకం. ఆ కోణంలో మన భూగోళం సురక్షితమనే చెప్పాలి. అయితే ఇటీవల మనవైపుగా వచ్చిన గ్రహశకలాలు సంఖ్యాపరంగా కాస్త ఎక్కువే. అవి భూమికి లక్షలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నా శాస్త్రవేత్తల దృష్టిలో సమీపం నుంచి పోయే గ్రహశకలాల కిందే లెక్క. భూకక్ష్యకు నాలుగున్నర కోట్ల కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే గ్రహశకలాలను భూమికి సమీపంగా పోతున్నవాటిగా పరిగణిస్తారు. మన సౌర కుటుంబంలో మొత్తం ఆరు లక్షల గ్రహ శకలాలున్నాయని ఒక లెక్క. అందులో కనీసం 20,000 భూ సమీప వస్తువులు (నియో)–అంటే గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అందులో భూమికి ముప్పు తెచ్చిపెట్టేవి అతి తక్కువ. అయినా కూడా ఏమరుపాటు పనికిరాదన్నది వారి హెచ్చరిక. టెక్సాస్ నగరం నిడివిలో ఉండి భూగోళాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న గ్రహశకలంపై కొన్నేళ్లక్రితం వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఆర్మెగెడాన్’ను ఎవరూ మరిచిపోరు. శాస్త్రవేత్తలు సమష్టిగా కృషిచేసి ఆ గ్రహశకలం గర్భంలో అణుబాంబును ఉంచి దాన్ని పేల్చేయడం ఆ సినిమా ఇతివృత్తం. ఇప్పుడు డార్ట్ ప్రయోగం ఒక రకంగా అటువంటిదే. ఉపగ్రహాన్ని ఢీకొట్టించి దాని కక్ష్యను 1 శాతం తగ్గిస్తే దాని పరిభ్రమణ కాలాన్ని పది నిమిషాలు కుదించవచ్చని, దాంతో కక్ష్య స్వల్పంగా మారవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందో తెలియడానికి మరికొన్ని వారాలు పడు తుంది. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని విజయాలకు బాటలు పరుస్తుందని, భవిష్యత్తులో ధూర్త శకలాలను దారిమళ్లించి పుడమి తల్లిని రక్షించుకోవడం సాధ్యమేనని ఆశించాలి. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
అంతరిక్షంలో... ఆర్మగెడాన్!
1998లో వచ్చిన సూపర్హిట్ హాలీవుడ్ మూవీ ఆర్మగెడాన్ గుర్తుందా? భూమిని ఢీకొట్టేందుకు శరవేగంగా దూసుకొచ్చే గ్రహశకలం బారి నుంచి మానవాళిని కాపాడే ఇతివృత్తంతో రూపొందింది. అంతరిక్షంలో సోమవారం అచ్చంగా అలాంటి ప్రమాదమే ఒకటి జరగనుంది. కాకపోతే రివర్సులో! ఏడాది క్రితం నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఒకటి గంటకు ఏకంగా 24 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది! కాకపోతే, భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో జరగనున్న ఈ ప్రమాదం యాదృచ్చికం కాదు. నాసా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే! అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో నాసా తొలిసారిగా ఇలాంటి ప్రయోగానికి తెర తీసింది. ఈ ప్రయోగం అనుకున్నట్టుగా సఫలమైతే ఎప్పుడైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు ఎదురైతే దాన్ని తప్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. 32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో దాదాపు ఏడాది క్రితం నాసా ఈ డార్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా గత నవంబర్లో డార్ట్క్రాఫ్ట్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు) డైమోర్ఫస్ అనే ఓ బుల్లి గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. ఇది తనకన్నా పెద్దదైన డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ రెండు శకలాలూ సోమవారం భూమికి అత్యంత సమీపానికి, అంటే 108 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి రానున్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని నాసా యూట్యూబ్ చానళ్లో లైవ్లో చూడొచ్చు కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉపగ్రహం ఢీకొన్నాక గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూడొచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏం జరగనుంది? ► డైమోర్ఫస్ కేవలం 525 అడుగుల వెడల్పున్న బుల్లి గ్రహశకలం. ► డార్ట్క్రాఫ్ట్ గంటకు 24 వేల కి.మీ. బ్రహ్మాండమైన వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. ► తద్వారా డైమోర్ఫస్ తాలూకు వేగాన్ని కాస్త తగ్గించి దాని కక్ష్యలో కొద్దిగా మార్చడం ఈ ప్రయోగం ప్రధానోద్దేశం! ► డైమోర్ఫస్ కక్ష్యలో చోటుచేసుకునే మార్పును శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తారు. ► డైమోర్ఫస్ ప్రస్తుతం డిడిమోస్ గ్రహశకలం చుట్టూ 11 గంటల 55 సెకన్లకు ఒకసారి చొప్పున తిరుగుతోంది. ► డార్ట్క్రాఫ్ట్ ఢీకొట్టి ఆ వేగంలో కనీసం 73 సెకన్ల మార్పయినా వస్తే ప్రయోగం సక్సెస్ అయినట్టు. లాభమేమిటి? ► భూమిని ఢీకొట్టగల గ్రహశకలాల వంటివాటిని ముందే గుర్తించే పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే అలాంటి వాటిని ముందే ఏ డార్ట్క్రాఫ్ట్తోనో ఢీకొట్టించడం ద్వారా వాటి ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు. తద్వారా భూమి అంతరించిపోగల పెను ప్రమాదాన్ని తప్పించవచ్చు. ► నాసా నిర్వచనం ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే సమీపానికి వస్తే దానితో భూమికి డేంజరని భావిస్తారు. ► భూమికి సమీపంలో ఇప్పటిదాకా 27 వేలకు పైగా గ్రహశకలాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే వీటిలో మనకు ప్రమాదకరమైనవి లేవు. ► చివరగా, ఈ ప్రయోగంతో భూమికి వచ్చిన ముప్పేమీ లేదని నాసా భరోసా ఇస్తోంది! – సాక్షి, నేషనల్డెస్క్ -
ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి. ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు. -
నాసా అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!
ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీ1గా నామకరణం చేశారు. నాసా పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. నాసా 1994 పీసీ1 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించింది. దీనిని మొదట ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం 1 కి.మీ వ్యాసం కలిగి ఉంది. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. ఈ పెద్ద గ్రహశకలాన్ని రేపు టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే, నాసా దీనిని ట్రాక్ చేయడానికి ఒక లింకు కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. Near-Earth #asteroid 1994 PC1 (~1 km wide) is very well known and has been studied for decades by our #PlanetaryDefense experts. Rest assured, 1994 PC1 will safely fly past our planet 1.2 million miles away next Tues., Jan. 18. Track it yourself here: https://t.co/JMAPWiirZh pic.twitter.com/35pgUb1anq — NASA Asteroid Watch (@AsteroidWatch) January 12, 2022 (చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!) -
నాసా హెచ్చరిక.. భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం!
ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎత్తు ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం ఎత్తు న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండనుంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీగా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. నాసా తాజా సమాచారం ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం దాని పరిమాణం(సుమారు 3,280 అడుగులు) ఎక్కువగా ఉండటం, భూమికి దగ్గరగా వెళ్ళడం వల్ల నాసా దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తుంచింది. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. 2014 వైఈ15: ఇది 7 మీటర్ల వ్యాసం గల తోకచుక్క జనవరి 6న భూమికి 4.6 మిలియన్ మైళ్ల(7.4 మిలియన్ కిలోమీటర్లు) దూరం నుంచి వెళ్తుంది. 2020 ఎపీ1: ఈ గ్రహశకలం కేవలం 13 అడుగుల(4 మీ) వ్యాసం మాత్రమే ఉంటుంది. ఇది భూమికి జనవరి 7న 1.08 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. 2013 వైడీ48 గ్రహశకలం: ఈ నెలలో భూమికి దగ్గరగా వచ్చే అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది ఒకటి. జనవరి 11న భూమికి 3.48 మిలియన్ మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. నాసా ప్రకారం, ఇది సుమారు 340 అడుగుల(104 మీ) వెడల్పు ఉంది, ఇది బిగ్ బెన్ కంటే పెద్దదిగా చేస్తుంది. గ్రహాల గురుత్వాకర్షణ పుల్ ద్వారా గ్రహశకలాల కక్ష్య మార్గాలు కొన్ని సార్లు ప్రభావితమవుతాయి. ఇవి వాటి మార్గాలను మార్చడానికి కారణమవుతాయి. అందువల్లే, ఈ శకలాలు గతంలో భూమిని గుద్దుకోవడం లేదా భూమిని రాసుకుంటూ దూసుకుపోవడం జరిగింది అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. -
తాజ్మహల్ సైజులో గ్రహశకలం..! భూమి వైపుగా..!
A Massive Asteroid Rushing Towards Earth Orbital Path NASA Warns: తాజ్మహల్ సైజులో ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకల పరిమాణం లండన్లోని బిగ్ బెన్ గడియారం కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది. ఈ గ్రహశకలం తాజ్ మహల్తో పోల్చినట్లయితే సుమారు 240 అడుగుల ఎత్తును కల్గి ఉంది. ఈ గ్రహశకలానికి 1994 డబ్ల్యూ ఆర్12గా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని పాలోమార్ అబ్జర్వేటరీలో 1994లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త కరోలిన్ ఎస్. షూమేకర్ కనుగొన్నారు. భూమికి ఏమైనా నష్టం ఉందా..! 1994డబ్ల్యూఆర్12 గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేదని నాసా పేర్కొంది. 1994లో ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పుడు భూమి నుంచి సుమారు 3.8 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇది సోమవారం నవంబర్ 29న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకవేళ భూమిని ఢీకొడితే..! ఈ గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేనప్పటీకి ఒకవేళ భూమిని ఢీ కొడితే సుమారు 77 మెగాటన్నుల టీఎన్టీను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరం హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 3,333 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేయనుంది. చదవండి: నాసా డార్ట్ ప్రయోగం.. ఎలన్ మస్క్ ఆసక్తికర రీట్వీట్ -
డైనోసార్ల అంతానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!
విషయం ఎలాంటిదైనా తనకు లాభం చేకూరేది అయితే చాలానుకునే తత్వం ఎలన్ మస్క్ది. ఈ అపరకుబేరుడు స్పేస్ఎక్స్ కోసం అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డార్ట్ ప్రయోగంపై స్పందించాడు. భూగ్రహం వైపు దూసుకొస్తున్న అతిపెద్ద ఆస్టరాయిడ్ ఒకదానిని స్పేస్క్రాఫ్ట్తో ఢీకొట్టించాలన్న ప్రయత్నమే డార్ట్. భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం ఎలన్ మస్క్ Elon musk కే చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్9 రాకెట్ ద్వారా స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించింది నాసా. అయితే ఈ ప్రయోగంపై మస్క్ తన స్టయిల్లో స్పందించాడు. Avenge the dinosaurs!! https://t.co/knL2pFLGzF — Elon Musk (@elonmusk) November 25, 2021 ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ అంటూ నాసా ట్వీట్కు బదులిచ్చాడు ఎలన్ మస్క్. బిలియన్ల సంవత్సరాల క్రితం మెసోజోయిక్ Mesozoic Era యుగంలో ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టి డైనోసార్లు అంతరించిన విషయం తెలిసిందే కదా!. ఇప్పుడు ఆస్టరాయిడ్లను నాశనం చేసి డైనోసార్లకు బదులు ప్రతీకారం తీర్చుకోండనే ఉద్దేశంతో మస్క్ ట్వీటేశాడన్నమాట. ఈ ట్వీట్కు మస్క్ ఫాలోవర్స్ నుంచి హ్యూమర్తో కూడిన రిప్లైలు వస్తున్నాయి. చదవండి: రష్యా ఉల్కాపాత వినాశనం గుర్తుందా?.. డార్ట్ అందుకే! ఇదిలా ఉంటే డార్ట్ తన పని పూర్తి చేయడానికి ఏడాది.. అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు ఆస్టరాయిడ్ గనుక నాశనం అయితే.. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లను, ఉల్కలను డార్ట్ లాంటి మరిన్ని ప్రయోగాలతో దారి మళ్లించడమో, నాశనం చేయడమో చేస్తుంది నాసా. చదవండి: పిరికి డైనోసార్లు.. పక్కా వెజిటేరియన్! -
ఉల్కాపాతంతో పెనువిధ్వంసం.. రష్యాలో జరిగింది గుర్తుందిగా? రిపీట్ కాకూడదనే..
Nasa Dart Launch: అది ఫిబ్రవరి 15, 2013. రష్యాలో చలికావడంతో జనాలు దాదాపుగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పూర్తి సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాలకు సుమారు 9గంటల 20 నిమిషాల సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం. ఫైర్బాల్ లాంటి ఓ భారీ రూపం.. సూర్యుడి కంటే రెట్టింపు కాంతితో యూరల్ రీజియన్ వైపు దూసుకొస్తోంది. చెల్యాబిన్స్క్, కుర్గన్తో పాటు మరికొన్ని రీజియన్లలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో అనుకునేలోపే భారీ శబ్దంతో విధ్వంసం. అయితే.. అదృష్టవశాత్తూ అది నివాస ప్రాంతాల్లో పడలేదు. కానీ, దాని ప్రభావం వందల కిలోమీటర్ల పరిధిలో చూపించింది. భారీ పేలుడు, దట్టమైన దుమ్ము, ధూళి అలుముకోవడంతో పాటు గన్ పౌడర్ వాసనతో ఆ రేంజ్ మొత్తం కొన్ని రోజులపాటు గుప్పుమంటూనే ఉంది. ప్రజల హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. షిరోషిమా అణుబాంబు కంటే 30 రెట్లు కలిగి ఉందని తర్వాత నాసా గుర్తించింది. 54 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ ఉల్క.. 60 అడుగుల వెడల్పు, పదివేల టన్నుల బరువు ఉంది. 1908 టుంగుష్క ఈవెంట్ తర్వాత నమోదైన అతిపెద్ద ఘటన ఇదే. 1986లో గ్రేట్ మాడ్రిడ్ ఉల్కాపాతం ఘటనలో గాయపడిన వాళ్ల సంఖ్యతో పోలిస్తే.. చెల్యాబ్నిస్క్ ఘటనలో గాయపడిన వాళ్లే ఎక్కువ. ప్రాణ నష్టం లేకపోయినా.. సుమారు 1600 మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. విధ్వంసం తాలుకా ఆనవాలు ప్రస్తుతం ఆ ప్రాంతం కోలుకున్నా, ఏళ్లు గడుస్తున్నా.. ప్రాణ భయం ఇప్పటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అంతరిక్షం నుంచి ఎప్పుడు ఎటు నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉందో అనే ఆందోళన ప్రపంచం మొత్తం నెలకొంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి ఘటనలు తప్పించేందుకే నాసా ఇప్పుడు డార్ట్ను లాంఛ్ చేసింది. Asteroid Dimorphos: we're coming for you! Riding a @SpaceX Falcon 9 rocket, our #DARTMission blasted off at 1:21am EST (06:21 UTC), launching the world's first mission to test asteroid-deflecting technology. pic.twitter.com/FRj1hMyzgH — NASA (@NASA) November 24, 2021 గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా ఢీకొట్టే ఆలోచనే డార్ట్. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్. నాసా ఆధ్వర్యంలో Double Asteroid Redirection Test missionను(DART) నవంబర్ 24న(ఇవాళ) ప్రయోగించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని స్పేస్ స్టేషన్ నుంచి డార్ట్ను లాంఛ్ చేశారు. ఇందుకోసం ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించారు. Launch of the @SpaceX Falcon 9 carrying the DART spacecraft - starting a nearly one-year journey to crash into a distant asteroid as a test! Keep checking back for more images! #DARTMission #PlanetaryDefense More: https://t.co/SNUSFf9Ukq pic.twitter.com/qJmffF2wIo — NASA HQ PHOTO (@nasahqphoto) November 24, 2021 సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని, ఉల్కలను నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని గ్రహశకలాలు, ఉల్కల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. కానీ, వాటిని స్పేస్క్రాఫ్ట్తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) ఆస్టరాయిడ్.. దాని చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు).. ఈ రెండింటిని నాశనం చేయడమే డార్ట్ మిషన్ లక్ష్యం. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రమాదకరమైన గ్రహశకలాలు, ఉల్కాపాతాల నుంచి భూమికి జరిగే డ్యామేజ్ను తప్పించొచ్చనేది నాసా ఆలోచన. అయితే asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందని నాసా సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, వెబ్స్పెషల్ -
భూమికి దగ్గరగా గ్రహశకలం..! ముందుగా గుర్తించని శాస్త్రవేత్తలు..!
Scary Asteroid Shoots Past Earth Surprises NASA: కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమ్మీద నివసించిన డైనోసర్లు ఒక్కసారిగా కనుమరుగయ్యాయంటే...భారీ గ్రహశకలం భూమిని ఢీ కొట్టడంతో అవి పూర్తిగా అంతరించి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అంతరిక్షంలోని పలు గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు ఉంది. గ్రహశకలాలు భూమి దగ్గరగా దూసుకువస్తోనే ఉంటాయి. గురుగ్రహం గురుత్వాకర్షణ శక్తితో ఆస్టరాయిడ్ బెల్ట్లోని అనేక గ్రహశకలాలు భూమివైపుగా రావడంలేదు. కాగా కొన్ని అదుపు తప్పిన గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తోంటాయి. చదవండి: సత్యనాదెల్లా రాకతో..! నెంబర్ 1 స్థానం మైక్రోసాఫ్ట్ సొంతం..! భూమి వైపుగా దూసుకువస్తోన్న పలు గ్రహశకలాల గుర్తింపు, వాటి గమనాలపై రోదసీ శాస్త్రవేత్తలు ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉంటారు. తాజాగా శాస్తవేత్తలు కూడా గుర్తించని ఓ గ్రహశకలం అక్టోబర్ 24 ఆదివారం రోజున భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిపోయింది. ఆస్టరాయిడ్ 2021 యూఎ1 అనే గ్రహశకలం భూమికి సుమారు 3000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆస్టరాయిడ్ 2 మీటర్ల పరిమాణంలో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహశకలం భూమివైపుగా వస్తే అంటార్కిటికా దృవంపై పడేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిమాణంలో ఈ గ్రహశకలం చిన్నగా ఉన్నప్పటీకి..అది భూమిని తాకి ఉంటే ఎంతోకొంత ముప్పు వాటిల్లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు కంటపడలే...! భూమి వైపుగా దూసుకువచ్చే ఆస్టరాయిడ్స్పై నాసా శాస్త్రవేత్తలు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. భూమి వైపుకు వచ్చే అన్ని గ్రహశకలాలను ట్రాక్ చేస్తుంటారు. అయితే గత ఆదివారం భూమి వైపుగా దూసుకొచ్చిన ఆస్ట్రాయిడ్ 2021 యూఎ1 ను శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. కాగా అంతరిక్షంలోని గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేయడంలో తన అసమర్థతను నాసా అంగీకరించింది. ఈ గ్రహశకలం సూర్యుడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని గుర్తించలేకపోయారని ఖగోళ శాస్త్రవేత్త టోనీ డన్ చెప్పారు. ఈ గ్రహశకలం భూమిని దాటిన గమనాన్ని ట్విటర్లో షేర్ చేశారు. Newly-discovered #asteroid 2021 UA1 missed Antarctica by only 3000 km Sunday evening. It came from the daytime sky, so it was undiscoverable prior to closest approach.https://t.co/Y0zY7mAYue pic.twitter.com/R9VpMo2X9G — Tony Dunn (@tony873004) October 27, 2021 చదవండి: పేరు మార్చాడో లేదో...! ఏకంగా యాపిల్కే గురిపెట్టాడు..! -
ఆస్టరాయిడ్ ముప్పు.. నాసా స్కెచ్ వర్కవుట్ అయ్యేనా?
ఆస్టరాయిడ్ ఢీ కొడితే ఏం జరుగుతుంది?.. సర్వం నాశనం అవుతుంది. ఈ భూమ్మీద డైనోసార్ల అంతానికి కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎలాంటి విపత్తునైనా(సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని) ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో భూమి వైపు దూసుకొస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని నాశనం చేసేందుకు నాసా అదిరిపోయే స్కెచ్ అమలు చేయబోతోంది. సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని ఆస్టరాయిడ్ల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. అయితే ఓ భారీ గ్రహశకలం ఇప్పుడు భూమి దిశగా దూసుకువస్తోంది. అందుకే స్పేస్క్రాఫ్ట్తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు)ను నాశనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్కు నాసా పెట్టిన పేరు డార్ట్(Double Asteroid Redirection Test mission). నవంబర్ 24న స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా ఓ స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఈ స్పేస్క్రాఫ్ట్ను గ్రహశకలం మీదకు ప్రయోగించి నాశనం చేయాలన్నది నాసా ప్లాన్. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందనేది నాసా సైంటిస్టులు చెబుతున్న మాట. ఈ ‘ఆస్టరాయిడ్ మూన్’ను స్పేస్వాచ్ ప్రాజెక్టులో భాగంగా 1996లో ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన జోయ్ మోంటనీ మొదటగా గుర్తించారు. ☄️ #PlanetaryDefense at @NASA entails finding, tracking, and characterizing near-Earth #asteroids and objects. Here’s what we've found thus far. Our #DARTMission, launching this November, will also be our first test for planetary defense. Learn more at https://t.co/1wL4ifObpp pic.twitter.com/8JryeeWQjG — NASA Asteroid Watch (@AsteroidWatch) October 1, 2021 ఇది భూమిని కచ్చితంగా ఎప్పుడు ఢీ కొడుతుందో తెలియనప్పటికీ.. అది చేసే డ్యామేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుందనే సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకే దాన్ని అంతరిక్షంలోనే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా ప్రకటించింది. ఇది చదవండి: ఎనిమిదేళ్లకే పరిశోధన.. రికార్డుల్లోకి ఎక్కిన బుల్లి సైంటిస్ట్ -
దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..?
2021 ఎన్వై1 అనే గ్రహశకలం భూమి వైపుగా దూసుకువస్తోంది. ఈ గ్రహశకలం ఈ నెల సెప్టెంబర్ 22 న భూమికి అత్యంత సమీప దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వెల్లడించింది. 2021 ఎన్వై1 అత్యంత ప్రమాదం కల్గించే గ్రహశకలంగా నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం భూమి నుంచి 1,498,113 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా అంచనావేసింది. ప్రస్తుతం ఈ గ్రహశకలం గంటకు 33660 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకువస్తోంది. చదవండి: ఖగోళం ఖాతాలో మరో అద్భుతం.. చుక్కల దృశ్యాల్ని చూసి తీరాల్సిందే 2021 ఎన్వై1 గ్రహశకలం స్కూలు బస్సు పరిమాణంలో ఉందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలాన్ని అపోలో క్లాస్ ఆస్టరాయిడ్గా నాసా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. నాసా శాస్త్రవేత్తలు ఈ ఆస్టరాయిడ్ పరిమాణం సుమారు 0.127 కిమీ నుంచి 0.284 కిమీ వ్యాసంతో ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రహశకల గమనాన్ని నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఆస్టరాయిడ్ ప్రయాణిస్తోన్న నిర్ణీత కక్ష్యను సిములేషన్ ద్వారా నాసా పర్యవేక్షిస్తుంది. ఈ ఆస్టరాయిడ్ సూర్యుని చుట్టూ తిరిగి రావాడానికి సుమారు 1400 రోజులు పట్టనుంది. ఈ గ్రహశకలం మరో శతాబ్దం తరువాత భూమికి మరింత చేరువలో వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 2021 ఎన్వై1 గ్రహశకల గమనాన్ని 2021 జూన్ 12 నుంచి నాసా పర్యవేక్షిస్తుంది. కాగా ఈ గ్రహశకలం నుంచి భూమికి ప్రమాదం లేనప్పటికీ, అత్యంత ప్రమాదకర గ్రహశకల కేటాగిరీలో ఈ ఆస్టరాయిడ్ను నాసా వర్గీకరించింది. చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....! -
నేడు ఖగోళ అద్భుతం.. దూసుకెళ్లనున్న భారీ గ్రహశకలం
Asteroid 2016 AJ193 Speed To Earth: ‘భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాలు..’ చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, అంతరిక్ష పరిశోధకులకు మాత్రం ఇదో ఆసక్తికరమైన అంశం. కారణం.. విశ్వం ఆవిర్భావానికి, డైనోసార్ల శకం ముగియడానికి, గ్రహాల ఏర్పాటుకు, విశ్వంలోని ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్లతోనే ముడిపడి ఉందన్న థియరీకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల.. దూసుకొచ్చే ప్రతీదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడింది శాస్త్రవేత్తలకు. ఈ తరుణంలో.. భూమ్మీదకు వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్ను ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. 2016 ఏజే193గా పేరు పెట్టిన ఓ ఆస్టరాయిడ్.. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. నాసా అంచనాల ప్రకారం.. ఆగష్టు 21న(అంటే ఇవాళే) అది భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సుమారు కిలోమీటర్న్నర వెడల్పు ఉన్న శకలం.. అత్యంత ప్రమాదకరమైన శకలంగా నాసా గుర్తించింది. ఇది భూమిని ఢీకొడితే మాత్రం కచ్చితంగా భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారికి ఆ అవకాశాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేశారు. చదవండి: వందేళ్ల తర్వాత బెన్నూ ముప్పు! భూమికి దూరంగా (భూమి-చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి తొమ్మిది రెట్లు దూరంగా) ఈ శకలం వెళ్లనుంది. ఈ లెక్కన భూమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని టెలిస్కోప్ల ద్వారా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2063లో మరోసారి ఇది భూమికి దగ్గరగా రానుందని అంచనా వేస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది. -
అంతరిక్షంలో డబ్బుల కుప్ప.. 72 లక్షల కోట్ల కోట్లు..!
మనకు రెండెకరాలో, మూడెకరాలో భూమి ఉంది.. అందులో ఏ బంగారమో, ప్లాటినమో దొరికితే.. అమ్మో డబ్బులే డబ్బులు.. కోట్లకుకోట్లు వస్తాయి అంటారు కదా.. మరి అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’ అనే ఓ గ్రహశకలాన్ని భూమికి తెచ్చేసుకుంటే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా.. 72 లక్షల కోట్ల కోట్లు. 72 పక్కన 19 సున్నాలు పెట్టినంత డబ్బు. ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. మరి సైకీ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఈ ఆస్టరాయిడ్.. ఎంతో చిత్రం సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంది. ఇతర గ్రహాల తరహాలోనే అక్కడి కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఈ సైకీ. మామూలుగా ఆస్టరాయిడ్లు అంటే కొన్ని మీటర్ల నుంచి ఐదో, పదో కిలోమీటర్ల పెద్దవి దాకా ఉంటాయి. కానీ సైకీ ఆస్టరాయిడ్ చాలా పెద్దది. దీని వ్యాసం రెండు వందల కిలోమీటర్లు. అంటే మన చందమామ పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుంది. భూమికి సైకీకి మధ్య దూరం సుమారు 37 కోట్ల కిలోమీటర్లు. ‘సైకీ’ అంటే ఆత్మ దేవత! ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్ గస్పారిస్ 1852లోనే ఈ ఆస్టరాయిడ్ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దానికి పెట్టారు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఏమిటి దీని ప్రత్యేకత? సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సైకీ’ ఆస్టరాయిడ్ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేథరిన్ డిక్లీర్ చెప్పారు. దానిపై ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్ ఎల్కిన్స్ టాంటన్ అంచనా వేశారు. ఇది ఓ పెద్ద గ్రహం మధ్యభాగమా? సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలోని ఓ గ్రహం మధ్యభాగమే (కోర్) ఈ ఆస్టరాయిడ్ అని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఏర్పడినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో బరువుగా ఉండే ఇనుము, ఇతర లోహాలు ద్రవస్థితిలో గ్రహం మధ్యభాగం (కోర్)లోకి చేరుతాయి. మన భూమి, అంగారకుడు, ఇతర గ్రహాల మధ్యభాగంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర లోహాలు ఉంటాయి. అలాంటి ఓ గ్రహం వేరే గ్రహాన్నో, భారీ ఆస్టరాయిడ్నో ఢీకొని ముక్కలై ఉంటుందని.. దాని మధ్యభాగమే ‘సైకీ’ ఆస్టరాయిడ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిని పరిశీలించడం ద్వారా గ్రహాలు ఏర్పడినప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చని, కోర్ ఎలా ఏర్పడుతుంది, ఏమేం ఉంటాయన్నది గుర్తించవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాదే వ్యోమనౌక ప్రయాణం సైకీ ఆస్టరాయిడ్పై విస్తృతంగా పరిశోధన చేయడం కోసం నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకను పంపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో అమెరికాలోని ఫ్లారిడా నుంచి ఈ ‘సైకీ స్పేస్క్రాఫ్ట్’ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది సుమారు మూడున్నరేళ్లు ప్రయాణించి 2026లో సైకీని చేరుకుంటుంది. రెండేళ్లపాటు దానిచుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. -
7 గ్రహశకలాలను గుర్తించిన.. ఏడేళ్ల చిన్నారి
బ్రసిలియా: ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల గురించి పెద్దవాళ్లు కథలుగా చెబుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా వింటుంటారు. కానీ, పట్టుమని పదేళ్లు కూడా లేని నికోల్ పెద్ద పెద్ద వాళ్లకే అంతుపట్టని ఖగోళ రహస్యాలను విడమరచి చెబుతుంటే పెద్దలు ఆసక్తిగా వింటున్నారు. అత్యంత పిన్నవయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్తగా ఏడేళ్ల నికోల్ ఒలివేరాను నాసా ఇటీవల గుర్తించింది. నికోల్ ఏడు గ్రహశకలాలను కనుక్కున్నందుకుగాను సర్టిఫికెట్ ఇచ్చి మరీ తన గౌరవాన్ని చాటుకుంది. ఖగోళశాస్త్రంపై అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసాలిస్తున్న ఈ చిన్నారి బ్రెజిల్ వాసి. నికోల్ కిందటేడాది ఆస్టరాయిడ్ హంట్ సిటిజన్ సైన్స్ ప్రోగ్రామ్లో పాల్గొంది. ఈ కార్యక్రమాన్ని నాసా అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారంతో నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న నికోల్ 7 గ్రహ శకలాలను కనుక్కొంది. అందుకుగాను నాసా నుంచి సర్టిఫికెట్ అందుకుంది. రెండేళ్ల వయసులో.. ఆకాశంలో తళుక్కుమంటున్న నక్షత్రం కావాలని, తెచ్చివ్వమని తల్లిని అడిగింది నికోల్. కూతురిని సంతోషపెట్టడానికి నికోల్ తల్లి ఆమెకు నక్షత్రాల బొమ్మ ఒకటి తెచ్చి ఇచ్చింది. ఆ రోజు నుంచి నికోల్కు నక్షత్ర లోకం గురించి తెలుసుకోవడంలో ఆసక్తి మొదలైంది. ఇప్పుడు నికోల్ ఎన్నో స్కూళ్లు, ఇతర ఖగోళ ఉపన్యాసాలలో తన గళం వినిపించే స్థాయికి ఎదిగింది. ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యాసం ఇవ్వడానికి బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ నికోల్ను ఆహ్వానించింది. కరోనా కారణంగా నికోల్ ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నింటికీ ఆన్లైన్లో హాజరవుతోంది. -
భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్!
కొద్ది రోజుల క్రితమే సౌర తుపాన్ ముప్పు నుంచి తప్పించుకున్న భూమి వైపు తాజాగా తాజ్మహల్ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్న ఒక ఆస్టరాయిడ్ దూసుకొస్తుంది. '2008 జివో20' అనే ఈ గ్రహశకలం గంటకు 18,000 మైళ్ల వేగంతో భూమి వైపు రానుంది. అయితే, దీని గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. నాసా ప్రకారం ఈ గ్రహశకలం జూలై 24న భూమిని దాటుతుంది. అంతరిక్ష సంస్థ దీనిని అపోలో తరగతి గ్రహశకలంగా వర్గీకరించింది. ఇది ఒక స్టేడియం కంటే పెద్దదిగా లేదా తాజ్ మహల్ పరిమాణంతో పోలిస్తే మూడు రెట్లు పెద్దది. ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తున్నప్పటికి నాసా లెక్కల ప్రకారం.. ఇది భూమికి 0.04 ఏయు(ఖగోళ యూనిట్) దూరం నుంచి వెళ్లనుంది. అంటే భూమికి, ఆస్టరాయిడ్ కి మధ్య 3,718,232 మైళ్ల దూరం ఉంటుంది. సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం చంద్రుడు, భూమి నుంచి సుమారు 2,38,606 మైళ్ల దూరంలో ఉన్నాడు. ఈ ఆస్టరాయిడ్ 2008 జివో20 జులై 25న ఉదయం 3 గంటల (ఇండియన్ టైమ్ ప్రకారం)కు ఇది భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో అది భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, ఇది భూమికి దగ్గరగా వస్తున్న కారణంగా నాసా దీనిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గా ఇప్పటికీ వర్గీకరించింది. గ్రహశకలాలు అంటే ఏమిటి? నాసా ప్రకారం, గ్రహశకలాలు అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మిగిలిపోయిన రాతి అవశేషాలు. ప్రస్తుతం 1,097,106 గ్రహశకలాలు విశ్వంలో ఉన్నాయి. ఇవి ఉల్కల కంటే భిన్నంగా ఉంటాయి. గ్రహశకలం కదలికను గుర్తించే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపీఎల్) ప్రకారం, మన గ్రహం నుండి దూరం భూమి నుండి సూర్యుడికి దూరం కంటే 1.3 రెట్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక గ్రహశకలాన్ని ఒక నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (NEO)గా వర్గీకరిస్తారు. -
ఉన్నది రెండు అంగుళాలే.. దీని వెనుక పెద్ద కథే ఉంది
ఈ చిత్రంలో ఏదో ఓ బొగ్గు ముక్కలా కనిపిస్తున్నది చిన్నపాటి ఉల్క. ఉన్నది కేవలం రెండు అంగుళాలే.. కానీ శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది. ఎందుకో తెలుసా..? భూమ్మీద జీవం పుట్టుకను తేల్చేందుకు ఈ ఉల్క తోడ్పడనుంది మరి. సైన్స్ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉల్కను గుర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ వెంటాడి.. వేటాడి.. బ్రిటన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ధగధగా మెరుస్తూ భూమివైపు దూసుకొస్తున్న ఓ ఉల్క కనబడింది. సాధారణంగా చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోనే మండిపోతాయి. కాస్త పెద్దవి అయితేనే దాటుకుని వచ్చి నేలపై పడతాయి. ఈ ఉల్క కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రావడంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలా ఈ ఉల్క వించ్కోంబ్ ప్రాంతం దాకా వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇళ్లలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి.. ఉల్క ఎక్కడ పడిందీ సుమారుగా గుర్తించారు. తర్వాత ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలు, మరికొందరి సహాయంతో గాలించి.. ఓ ఇంటి ఆవరణలో ఒక ముక్కను, రెండు కిలోమీటర్ల దూరంలోని గొర్రెల ఫారంలో మరో ముక్కను గుర్తించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. జీవానికి ఆధారమైన అమైనో ఆమ్లాలతో.. బొగ్గు తరహాలో నల్లగా ఉన్న ఆ ఉల్కలను తీసుకెళ్లి పరిశోధన చేపట్టారు. అది చాలా ప్రత్యేకమైనదని గుర్తించి.. తాజాగా వివరాలను వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన ‘కార్బొనసియస్ కాండ్రైట్’రకానికి చెందిన ఉల్క అని, సుమారు 460 కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ ఉల్కలో.. జీవం పుట్టుకకు ఆధారమైన అమైనో ఆమ్లాలు, నీటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ‘‘సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడిన తొలినాళ్ల నాటి గ్రహ శకలం ఇది. దీనిని ఆనాటి పరిస్థితులను యథాతథంగా కాపాడుతున్న ‘టైం క్యాప్సూల్’అనుకోవచ్చు.భూమి, ఇతర గ్రహాల పుట్టుకకు సంబంధించిన విశేషాలను దీనిద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ధ్వని వేగానికి 40 రెట్ల వేగం.. అంటే గంటకు 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి.. మండిపోయింది..’’అని ఇంగ్లండ్ నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డాక్టర్ ఆష్లే కింగ్ వెల్లడించారు. ఇప్పుడున్న జీవజాలం భూమ్మీద పుట్టిందేనా? అంతరిక్షంలో మరోచోటి నుంచి ఇక్కడికి వచ్చిందా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా అన్నదానికీ ఈ ఉల్క సమాధానం చెప్పగలదని తెలిపారు. -
భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాద గ్రహశకలం!
సౌర వ్యవస్థలో గ్రహాలు, ఉపగ్రహాలతోపాటు ఎన్నో గ్రహశకలాలు (ఆస్టరాయిడ్స్) సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. అలాగే ఈ ఏడాది భూమికి దగ్గరగా రానున్న ఓ భారీ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2001 ఎఫ్వో32 అనే ఈ భారీ గ్రహశకలం ఈ ఏడాది మార్చి 21న భూమికి దగ్గరగా 1.25 మిలియన్ మైళ్ల (2 మిలియన్ కిలోమీటర్లు) సమీపంలోకి చేరుకుంటుందని నాసా వెల్లడించింది. అంతేకాకుండా, ఈ అతిపెద్ద గ్రహశకలాన్ని దగ్గరగా పరిశీలించి, అనేక విషయాలను కనుగొనడానికి నాసా సిద్ధమైంది. దీని గురించి ఇటీవల నాసా వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 2001 ఎఫ్వో32గా పిలువబడే ఈ భారీ గ్రహశకలాన్ని 20 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వ్యాసం సుమారు 3,000 అడుగులు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల ఇది భూమికి 1.25 మిలియన్ మైళ్ల కంటే దగ్గరగా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ దూరం భూమి నుంచి చంద్రుడికి మధ్య గల దూరానికి 5.25 రెట్లు అధికం అయినప్పటికీ దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటితో పోల్చితే ఈ 2001 ఎఫ్వో32 వేగం గంటకు 77,000 మైళ్లు అధికంగా ఉందని పేర్కొంటున్నారు. ఆస్టరాయిడ్స్ ఉపరితలంపై పడి పరావర్తనం చెందే సూర్యకాంతిని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు దాని పరిమాణాన్ని, దాని ఉపరితలంపై ఉండే ఖనిజాలు, వాటి రసాయన కూర్పులను గురించి తెలుసుకుంటారు. ఇటువంటి భారీ గ్రహశకలం భూమికి సమీపంగా రావడమనేది వాటి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం అని నాసా శాస్త్రవేత్త లాన్స్ బెన్నర్ అన్నారు. ఈ నెల 21న 2001 ఎఫ్వో32 గ్రహశకలం భూమికి సమీపంగా వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి ఇది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని, అక్కడ ఉన్న ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని ఆధునిక టెలిస్కోపులు, స్టార్ చార్టుల సహాయంతో పరిశీలించవచ్చన్నారు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాలలో 2001ఎఫ్వో32 లేదా అంతకుమించి పరిమాణం ఉన్న దాదాపు 95 శాతం గ్రహశకలాల జాబితా తయారు చేశామని, రాబోయే 100 సంవత్సరాలలో వాటిలో ఏ ఒక్కటీ భూమిని తాకే అవకాశం లేదని నాసా తెలిపింది. భూమిని తాకిన శకలం సుమారు వందేళ్ల క్రితం.. అంటే 1908, జూన్ 30న ఓ గ్రహశకలం సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో భూమిని తాకింది. ఇటీవలి ప్రపంచ చరిత్రలో భూమిపై పడ్డ ఆస్టరాయిడ్ ఇదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తుంగుస్కా ప్రాంతంలో ఆస్టరాయిడ్ దెబ్బకు భారీ ఎత్తున అడవి ధ్వంసమైంది. ఆ దెబ్బకు 830 చదరపు మైళ్లలోని 8 కోట్ల చెట్లు సర్వనాశనమయ్యాయి. అయితే ఇది ఇనప ఖనిజంతో కూడిన ఆస్టరాయిడ్ అని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని ఢీకొట్టిన తర్వాత అది మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని వారు చెబుతున్నారు. అయితే దీనికి భిన్నంగా మరికొంత మంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఆ ఆస్టరాయిడ్ మంచుతో కూడుకున్నదని, భూమిని ఢీకొట్టాక కరిగిపోయిందని చెబుతున్నారు. కాగా, ఆస్టరాయిడ్స్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో తుంగుస్కా ఘటన జరిగిన జూన్ 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే’గా 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. చదవండి: విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ? -
భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్
సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ప్రతిసారీ భూమికి మరింత దగ్గరగా వస్తూ భయపెడుతున్న అపోఫిస్.. ఈ నెల 5, 6 తేదీల్లో భూమికి సమీపంగా దూసుకు వెళ్లనుంది. కచ్చితంగా చెప్పాలంటే.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బాగా దగ్గరగా ప్రయాణిస్తుంది. మళ్లీ 2029లో, 2068లో భూమికి చాలా సమీపంలోకి వస్తుంది. ఆ టైంలో చంద్రుడిలా మెరిసిపోతూ ఆకాశంలో ప్రయాణించడాన్ని మనం చూడొచ్చు కూడా.. ఇలా దగ్గరగా దూసుకెళ్తున్న నేపథ్యంలో అపోఫిస్ను మరింత క్షుణ్నంగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆస్టరాయిడ్ వెళ్లే మార్గాన్ని, స్పీడ్ను, అది ప్రయాణించే టప్పుడు ఉండే పరిస్థితులు, దాని మీద భూమి ఆకర్షణ శక్తి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయడం ద్వారా.. భూమిని ఢీకొట్టే చాన్స్ ఎంత?, ఏ సమయంలో వస్తుంది, ఏ ప్రాంతంలో పడే చాన్స్ ఉందన్న వాటిని మరింత కచ్చితంగా అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. అంతేగాకుండా భవిష్యత్తులో ఆస్టరాయిడ్ల నుంచి భూమికి ఉండే ప్రమాదాలను గుర్తించేందుకు వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు. అపోఫిస్ను 2004 డిసెంబర్లో తొలిసారిగా గుర్తించారు. దీని పరిమాణం వెయ్యి అడుగులు.. అంటే సుమారు 300 మీటర్లు. ఈఫిల్ టవర్ అంత ఎత్తు అనుకోవచ్చు. భూమి పరిమాణంతో పోలిస్తే.. ఈ సైజు అత్యంత చిన్నగానే కనిపిస్తున్నా ఒకవేళ ఇది భూమిని ఢీకొడితే జరిగే విలయం చాలా పెద్దగానే ఉంటుంది. 2029లో మరోసారి భూమికి దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణిస్తుంది. అప్పుడు అది భూమిని ఢీకొట్టే అవకాశాలు 2.7 శాతం వరకు ఉన్నట్టు లెక్కలు వేశారు. తాజాగా దాని ప్రయాణాన్ని క్షుణ్నంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు 2029లో భూమికి 40 వేల కిలోమీటర్ల దూరం నుంచే ఆస్టరాయిడ్ దూసుకెళ్తుందని తేల్చారు. ఖగోళ దూరాల పరంగా చూస్తే ఇది చాలా తక్కువ దూరం. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు మూడు లక్షల కిలోమీటర్లు. అంటే అపోఫిస్ ఆస్టరాయిడ్.. చంద్రుడికి, భూమికి మధ్య నుంచే దూసుకెళ్తుందన్న మాట. అయితే అది ప్రయాణించే వేగం కారణంగా భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత 2036లోనూ ఈ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వెళ్తుంది. అయితే 2068వ సంవత్సరంలో ఈ ఆస్టరాయిడ్ భూమికి కేవలం 20 వేల కిలోమీటర్ల దూరం నుంచే ప్రయాణిస్తుందని.. ఒకవేళ ఆ టైంలో భూమి ఆకర్షణ శక్తికి లోనైతే భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అయితే ప్రస్తుతం తిరుగుతున్న ఆస్టరాయిడ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. 2185వ సంవత్సరం వరకు కూడా భూమికి ప్రమాదం ఏమీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఆస్టరాయిడ్ల నుంచి డిఫెన్స్ కోసం.. సౌర కుటుంబంలో కొన్ని వేల కోట్ల ఆస్టరాయిడ్లు ఉన్నాయి. అందులో చాలా వరకు అంగారకుడికి, గురు గ్రహానికి మధ్య పరిభ్రమిస్తున్నాయి. కొన్ని తోకచుక్కల తరహాలో సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. అలా ప్రయాణించే మార్గంలో ఇతర గ్రహాల కక్ష్యలను దాటుతూ వెళతాయి. గ్రహాలకు సమీపంగా వస్తాయి. ఆస్టరాయిడ్లలో కొన్ని మీటర్ల సైజు నుంచి కిలోమీటర్ల కొద్దీ పొడవున్నవి ఉంటాయి. భూమికి సమీపం నుంచి వెళ్లేవాటిలో కనీసం వంద మీటర్లు, ఆపై పరిమాణం ఉన్న ఆస్టరాయిడ్లను ప్రమాదకరమైనవిగా భావిస్తారు. ఏవైనా ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టే చాన్స్ ఉంటే.. వాటిపైకి క్షిపణులు, శాటిలైట్లు ప్రయోగించడం ద్వారా ముక్కలు చేయడం, లేదా కక్ష్యను మార్చి ప్రమాదాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదకర ఆస్టరాయిడ్లను పరిశీలించేందుకు అరిజోనా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ప్లానెటరీ డిఫెన్స్ సిస్టం’ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేశారు. -
మార్చిలో మరో యుగాంతం!
వాషింగ్టన్: భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది. మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్(పేరు:2001 ఎఫ్ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్ పలు ఎన్ఈఓ(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు. ఇలాంటివి అనేకం.. భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను ఎన్ఈఓలు అంటారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్ఈఓలను గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్ కాగా కొన్ని మాత్రం తోకచుక్కలు. ఈ 25వేల ఎన్ఈఓల్లో 2100 ఎన్ఈఓలను పొటన్షియల్లీ హజార్డియస్(ప్రమాదం కలిగించే శక్తి కలవి)గా వర్గీకరించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. అంతమాత్రాన ఇవన్నీ భూమిని తాకుతాయని కాదని, కానీ వీటిని పరిశీలిస్తూ ఉంటామని సెంటర్ ఫర్ ఎన్ఈఓ డైరెక్టర్ పాల్ చోడస్ చెప్పారు. ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని చెప్పారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఆస్టరాయిడ్ గంటకు 76,980 మైళ్ల వేగంతో పయనిస్తుంటుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దోవలో తను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్ తెలిపారు. కాబట్టి.. యుగాంతం జాతకాలు చెప్పేవాళ్లు ఇంకో కొత్త సంగతి చూసుకోవాల్సిందే! -
జేమ్స్ బాండ్కు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పెట్టింది. జేమ్స్బాండ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కానరీ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాండ్ జేమ్స్ బాండ్ అంటూ ఆయన పేరు దేశ విదేశాలలో మారుమ్రోగింది. అందుకే ఆయన గౌరవార్థం, ది నేమ్ ఆఫ్ ద రోజ్’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రనాయిడ్కు సీన్ కానరీ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది. సీన్ కానరీ 1979లో మీటియర్ (ఉల్కపాతం) అనే చిత్రంలో నటించారు. గ్రహశకలం, భూమిని ఢీకొట్టకుండా నాసా ఎలా కాపాడింది అనే నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కానరీ ముఖ్యపాత్ర పోషించారు. నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ను నియమించడానికి కంటే దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్రను పోషించారు అని నాసా సోమవారం తాను చేసిన ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదిలా వుండగా అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్కానరీ పేరును పెట్టింది. ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్గా ఉందని ఆ ఉల్క గురించి నాసా అభివర్ణించింది. లెమ్మన్ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా ఇటీవల తన ట్విటర్ ద్వారా షేర్ చేసింది. జేమ్స్ బాండ్గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సీన్ కానరీ 90 ఏళ్ల వయసులో అక్టోబర్ 31వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. Sir Sean Connery starred in the movie “Meteor” where he led NASA's efforts to defend Earth against an #asteroid impact threat...decades before @NASA appointed its first #PlanetaryDefense Officer! https://t.co/DVCBeRQLgQ — NASA Asteroid Watch (@AsteroidWatch) November 1, 2020 చదవండి: తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు -
బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా?
వాషింగ్టన్: స్కూల్ బస్సు సైజు భారీ గ్రహ శకలం ఒకటి భూమి దారిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురువారం అది భూమిని సురక్షితంగా దాటనుందని తెలిపారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహశకలం భూమికి 13 వేల మైళ్ల లోపల వస్తుందని.. ఇది భూమి చుట్టు ప్రదక్షిణ చేసే అనేక సమాచార ఉపగ్రహాల కన్నా చాలా తక్కువ లోతులో ఉందని తెలిపారు. ఇది గురువారం ఉదయం ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో భూమికి సమీపంగా వస్తుందన్నారు. గ్రహశకలం పరిమాణం 15-30 అడుగుల (4.5 మీటర్ల నుండి 9 మీటర్లు) మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉల్క ప్రమాణాల ప్రకారం, ఇది చిన్నదిగా పరిగణించబడుతుంది. (చదవండి: మాస్క్తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..!) ఈ గ్రహ శకలాలు ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సార్లు భూమి వాతావరణాన్ని తాకి కాలిపోతాయని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ తెలిపారు. ఈ చిన్న గ్రహశకలాలు 100 మిలియన్లు అక్కడ ఉండవచ్చని అంచనా వేశారు. ఈ గ్రహ శకలం తిరిగి 2041 ప్రాంతంలో భూమి సమీపంలోకి వస్తుందని తెలిపారు. -
జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్
వాషింగ్టన్: ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది. (ఐరాసకు ఇది పునర్జన్మ: మోదీ) 170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్ 2020ఎన్డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ ప్రమాదకర జోన్లో ప్రయాణిస్తుందని చెప్పింది. (నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం) 2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల వేగంతో, 2020ఎంఈ3 16 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించింది. 2016డీవై30 రెండు ఆస్టరాయిడ్లలో 15 అడుగుల వెడల్పుతో అతి పెద్దదని తెలిపింది. వీటి వల్ల భూమికి ఎలాంటి అపాయం జరగదని వివరించింది. -
ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా?
మరో కొన్ని రోజుల్లో నిజంగానే భూమి అంతం కాబోతుందా? గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో అపార నష్టం జరగబోతుందా? సోషల్మీడియాలో ఇప్పటికే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే... భారత కాలమానం ప్రకారం... సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహశకలం భూమివైపుగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. అప్పుడు భూమికి గ్రహశకలానికి మధ్య దూరం 44618 మైళ్లు ఉంటుంది. ఇప్పటివరకూ చాలా గ్రహశకలాలు భూమివైపు నుంచి వెళ్లిన వాటివల్ల జీవకోటికి ఎలాంటి నష్టమూ జరగలేదు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న గ్రహశకలం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే మిగతా గ్రహశకలాలు, చంద్రుని కంటే దూరంగా వెళ్లాయి. భూమికీ, చందమామకీ మధ్య దూరం 238855 మైళ్లు. ఈ గ్రహశకలం మాత్రం చందద్రుని కంటే దగ్గర నుంచి భూమి మీదగా వెళ్లబోతోంది. భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్గా నాసా పరిగణిస్తుంది. ఇవి తమ మార్గంలోవెళ్తూ వెళ్తూ, మధ్యలో ఏదైనా గ్రహం వస్తే... దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. దిశ మార్చుకొని, ఆ గ్రహంవైపు వెళ్తాయి. ఇక భూమి, చంద్రుల మధ్య నిరంతరం ఆకర్షణ శక్తి ఉంటుంది. దీని బట్టి చూస్తే మన భూమి ఆకర్షణ బలం అక్కడి వరకూ ఉంటుంది. ఈ గ్రహశకలం చందమామ కంటే దగ్గర భూమి వైపు నుంచి వెళ్తుంది కావున దీన్ని భూమి ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అంగారక, గురుగ్రహం మధ్య ఉండే గ్రహశకలాల్లో ఒకటి అయ్యిండవచ్చని నాసా భావిస్తోంది. అయితే ఈ గ్రహశకలం కనుక భూమిని ఢీకొడితే పెద్ద అనర్థమే జరుగుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన నాసా కొన్ని విషయాలను తెలిపింది. చదవండి: మాస్క్తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..! ఇలాంటి గ్రహశకలాలు భూమి, సూర్యుడి మధ్య భారీ కక్ష్యలో తిరుగుతుంటాయని నాసా తెలిపింది. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడం పూర్తైన ప్రతిసారీ ఈ గ్రహశకలాలు భూ కక్ష్యలోకి వచ్చి వెళ్తుంటాయని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇంతకీ ఈ గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందా అనే ప్రశ్నకు నాసా సమాధానమిస్తూ అలా జరగదని చెప్పింది. ఎందుకంటే, ఈ గ్రహశకలం భారీ సైజులో లేదనీ అందువల్ల దీన్ని ఆకర్షించేలోపే, ఇది భూ కక్ష్యను దాటి వేగంగా వెళ్లిపోతుందని నాసా వివరించింది. దీంతో ఇప్పటికే కరోనా కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లగా, ఇప్పుడు గ్రహశకలం రూపంలో మరో పెనుప్రమాదం పోల్చి ఉంది అని భయపడినవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: యుగాంతం కథ ఏంటి? -
మాస్క్తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..!
ఫేస్ మాస్క్ ధరించినట్లుగా కనిపిస్తున్న ఓ గ్రహశకలం ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దాదాపు మౌంట్ ఎవరెస్ట్లో సగపరిమాణం ఉన్న ఈ గ్రహశకలం ఫొటోలను నాసా శాస్త్రవేత్తల బృందం ట్విటర్లో శుక్రవారం షేర్ చేసింది. అత్యంత పెద్ద పరిమాణాన్ని కలిగిన గ్రహశకలం.. కనీసం 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచన వేస్తున్నారు. అయితే ఇది వచ్చేవారంలో భూమి నుంచి ఎగురనున్నట్లు కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. (కరోనా: చనిపోతానని తెలిసి.. భార్యను..!) ఈ ఫొటోను ‘#రాడార్టీం,@NAICobservatory శాస్త్రవేత్తల బృందం.. సరైనా రక్షణ చర్యలతో పరిశీలిస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని కనుగొన్నాము. దీనిని 1998 OR2 నాటి గ్రహశకలంగా గుర్తించాం. ఇది భూమీకి అత్యంత సమీపంలో ఉండి ముసుగును ధరించిన ఆకారంలో కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫొటోకు ఫేస్ మాస్క్ ధరించి ఉన్న సిబ్బంది ఫొటోలను జత చేసి షేర్ చేశారు. ప్యూర్టో రికోలోని అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ తీసిన ఈ ఫొటోలో గ్రహశకలం ఫేస్ మాస్క్ను ధరించినట్లు కనిపిస్తుండంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిఎన్ఎన్ న్యూస్ ప్రకారం.. 52768 (1998 OR2) అని పిలువబడే గ్రహశకలం మొట్టమొదట 1998లో గుర్తించబడింది. ఏప్రిల్ 29న ఇది భూమికి 3.9 మిలియన్ మైళ్ళ దూరంలో వెళుతుందని, ఇది భూమి, చంద్రుల మధ్య 16 రెట్లు దూరం కలిగి ఉంటుందని సమాచారం.(అప్పట్లో స్కైల్యాబ్.. ఇప్పుడు కరోనా!) #TeamRadar and the @NAICobservatory staff are taking the proper safety measures as we continue observations. This week we have been observing near-Earth asteroid 1998 OR2, which looks like it's wearing a mask! It's at least 1.5 km across and is passing 16 lunar distances away! pic.twitter.com/X2mQJCT2Qg — Arecibo Radar (@AreciboRadar) April 18, 2020 కాగా అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ ఇటీవల ఈ గ్రహశకలం చిత్రాన్ని తీసింది. అబ్జర్వేటరీలోని శాస్త్రవేత్తలు, టెలిస్కోప్ ఆపరేటర్ల బృందం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫేస్మాస్క్ ధరించి పనిచేస్తుండగా రాడార్ పంపిన ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది అచ్చం ఫేస్ మాస్క్ను ధరించినట్లు ఉండటంతో ఈ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా దాదాపు 500 అడుగుల మించిన పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం భూమి కక్ష్య నుంచి 5 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రమాదకరమైన గ్రహశకలమని కూడా చెప్పారు. అయితే ఇది భూమి సమీపంలో ఉన్నప్పటికీ భూమిని తాకే అవకాశం లేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
యుగాంతం కథ ఏంటి?
అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని అంటున్నారు. అయితే దీంట్లో వాస్తవమెంత..? ఇప్పుడే ఈ ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు కొంత మంది భూమి అంతం కాబోతోందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని నాసా పేర్కొంది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కనుక భూమిని తాకే అవకాశమే లేదని నాసా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని , వదంతులు నమ్మవద్దని సూచించింది. చదవండి: ఆస్టరాయిడ్ సమీపానికి నాసా నౌక 2004 సెప్టెంబర్లో టౌటాటిస్ అనే గ్రహశకలం భూమి నుంచి 4 లూనార్లతో దూసుకెళ్లింది. అయితే ఏప్రిల్ 19న భూమిని సమీపించబోయే గ్రహశకలం అంతకంటే పెద్దదని తెలుస్తోంది. కావాలనుకుంటే భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు సాయంతో ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని కూడా తెలిపింది. కాగా.. గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని మాత్రం నాసా స్పష్టం చేసింది. -
టిక్... టిక్... టిక్
ఓ గ్రహశకలం.. వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అప్పుడో.. ఇప్పుడో భూమిని తాకడం ఖాయం! ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.. ఇంతలోనే ఓ అద్భుతం జరిగింది.. భూమ్మీది నుంచి దూసుకెళ్లిన అంతరిక్ష నౌక.. ఆ గ్రహశకలాన్ని.. ఢీకొట్టింది! వెంటనే అది పటాపంచలైంది.. ఇదేదో సినిమా కథ అనుకునేరు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో మనం ప్రత్యక్షంగా చూడబోయే ఘటనే ఇది. భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందన్న వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. తీరా చూస్తే అవి భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిందని, లేదా కక్ష్యమార్గం మార్చుకుందని తెలియగానే ఊపిరి పీల్చుకుంటాం. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని తెలిస్తే.. ఏం చేయాలి.. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి.. రాకెట్లతో ఆ గ్రహశకలాన్ని పేల్చేస్తే సమస్య తీరిపోతుందా.. గ్రహశకలాన్ని ముక్కలుగా చేయాలా.. లేదా రాకెట్తో ఢీకొట్టిస్తే దాని దిశ మారిపోయి మనకు ప్రమాదం తప్పిపోతుందా.. ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లు సంయుక్తంగా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) అనే ప్రయోగాన్ని చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్లో ఓ గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టనున్నారు. దానికి ఒక ఏడాది ముందు చిన్న ఉపగ్రహంతో కూడిన అంతరిక్ష నౌక నింగిలోకి ఎగరనుంది. ఏమిటా గ్రహశకలం? ఈ ప్రయోగానికి ఎంచుకున్న గ్రహశకలం పేరు డిడైమోస్–బి. ఇది ఒకే గ్రహశకలం కాదు. రెండు శకలాలతో కూడిన వ్యవస్థ. అందులో చిన్నసైజులో ఉండే ‘బి’శకలాన్ని ఢీకొట్టాలన్నది ప్రణాళిక. భూమికి కొంచెం దూరంలోనే ఉండే ఈ వ్యవస్థలో ‘ఏ’శకలం 780 మీటర్ల వెడల్పు ఉంటే.. ‘బి’160 మీటర్లు మాత్రమే ఉంటుంది. 12 గంటలకోసారి ‘ఏ’చుట్టూ తిరుగుతుంది. పైగా డిడైమోస్ వ్యవస్థ భూమి వైపు దూసుకు రావట్లేదు కాబట్టి దీన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టించినా మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. జపాన్కు చెందిన హయబుస–2 అంతరిక్ష నౌక ఈ ఏడాది ఏప్రిల్లో రైగూ అనే గ్రహశకలాన్ని ఢీకొన్నప్పుడు తెలిసిన కొన్ని కొత్త సంగతులను పరీక్షించేందుకు ఈ తాజా ప్రయోగం ఉపయోగపడుతుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త నాన్సీ చాబోట్ అంటున్నారు. భవిష్యత్ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు డిడైమోస్ చాలా అనువైందని చెప్పారు. వేగాన్ని మారుస్తారు.. అంతే! సుమారు గంటకు 23,760 కిలోమీటర్ల వేగంతో అంతరిక్ష నౌక డిడైమోస్–బిని ఢీకొడుతుంది. అయినాసరే.. ఆ గ్రహశకలమేమీ ముక్కలు కాదు కానీ దాని వేగం స్వల్పంగా తగ్గుతుంది. అది కూడా సెకనుకు సెంటీమీటర్ వరకు మాత్రమే ఉంటుందని.. ఈ స్వల్ప మార్పుతోనే అది డిడైమోస్–ఏ చుట్టూ తిరిగే కాలంలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి చేటు తేగల గ్రహశకలాలను ఇలాగే నిరపాయకరంగా మార్చొచ్చా.. అనేది పరిశీలిస్తారు. ఇందుకు తగ్గట్లే ఢీకొనేందుకు కొన్ని క్షణాల ముందు ఓ చిన్న క్యూబ్శాట్ డార్ట్ నుంచి విడిపోయి.. ఫొటోలు తీసి మనకు పంపుతుంది. దాంతో పాటు 2023లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించే హెరా అనే అంతరిక్ష నౌక కూడా ఈ గ్రహశకలాన్ని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడమన్న ప్రయోగం విజయవంతమైందా.. లేదా అన్నది తెలుస్తుంది. ఏవి ప్రమాదకరం? అంతరిక్షం నుంచి దూసు కొచ్చే వేల గ్రహశకలాలతో భూమికి నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. చిన్న గ్రహశకలాలు భూ వాతావరణంలోకి చేరిన వెంటనే మండిపోతాయి. రోజూ ఇలాంటి చిన్న సైజు గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. పెద్దసైజువి మాత్రం కొంచెం అరుదు. ఒక అంచనా ప్రకారం కిలోమీటర్ కంటే ఎక్కువ సైజున్న గ్రహశకలాలు సుమారు 200 వరకు ఉండగా.. అన్ని సైజుల శకలాల సంఖ్య దాదాపు 2 వేలకు పైగానే ఉన్నాయి. 1999లో గుర్తించిన అపోలో (53319) 1999 జేఎం8 7 కిలోమీటర్ల వెడల్పుతో అతిపెద్ద గ్రహశకలం గా గుర్తింపు పొందింది. గ్రహశకలం 35 మీటర్ల కంటే పెద్ద సైజులో ఉండి.. భూమిని ఢీకొడితే ఒక నగరం స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. కిలోమీటర్ సైజున్నవి ఢీకొంటే ప్రాణ నష్టం ఒక దేశం లేదా ఖండం స్థాయిలో ఉంటుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే : ఎలన్ మస్క్
శాన్ఫ్రాన్సిస్కో: స్పేస్ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మానవాళికి భారీ ముప్పు ఏర్పడనుందంటూ ట్వీట్ చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత, శక్తిసామర్థ్యాలు మనకు లేవని పేర్కొన్నారు. త్వరలో భూమిని ఓ భారీ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒకరు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎలన్ మస్క్ ఈ అంచనాకు వచ్చారు. అపోఫిస్ అనే పేరుగల ఈ ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029న భూమిని ఢీకొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇటీవల సైంటిస్టులు వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఆఫ్ చావోస్’ అనే ఈజిప్టు దేవుని పేరు పెట్టారు. 1100 అడుగుల పొడవు గల ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడితే 15,000 వేల అణుబాంబుల శక్తి ఉత్పన్నమవుతుంది. భూమిపై పెనుమార్పులు సంభవిస్తాయి. అయితే దీనిపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రాయిడ్తో భూమికి వచ్చే పెద్ద ప్రమాదమేమీలేదని కొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది భూమికి కేవలం 23,363 మైళ్ల దూరంలో మాత్రమే వెళ్లనుంది. అయితే దీని గమనాన్ని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. 2029లో ఇది అత్యంత ప్రకాశవంతంగా.. కంటికి కనిపించేంత దగ్గరగా భూమి వాతావరణం మీదుగా ప్రయాణిస్తుంది. ఓ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘నిజంగా ఇది అద్భుత అవకాశం. ఈ ఆస్ట్రాయిడ్ను అందుకుంటే సైన్సు అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. దీనితో పాటు 5 నుంచి పది మీటర్ల పొడవుగల ఆస్ట్రాయిడ్లు కూడా ప్రయాణిస్తాయి’ అని తెలిపారు. ‘ప్రస్తుతానికి ఇది భూమిని ఢీకొట్టే అవకాశం స్వల్పమే. కానీ భవిష్యత్లో మనం ఊహించనంత వేగంగా భూమి మీదకు దూసుకు రావోచ్చు’అని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. -
గ్రహ శకలాలతో ముంచుకొస్తున్న పెనుఉత్పాతం
సాక్షి : హాలివుడ్ సినిమాలో చూపినట్లుగా మనం ముందే మేల్కొనకపోతే గ్రహశకలాలతో భూమికి ప్రమాదం రాబోతోందా? మొత్తం మానవ సమాజం తుడిచిపెట్టుకుపోయేంత విపత్తు మనకు ఈ గ్రహశకలాలతో ఎదురుకానుందా?.. అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మొత్తం నాలుగు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకపోయినా గ్రహశకలాల వల్ల విపత్తు తలెత్తే అవకాశం ఉండటంతో జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్ 30నే ఎంచుకోవడానికి కారణం ఈ రోజే అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టింది కనుక. 1908 సంవత్సరం రష్యాలోని టుంగ్సుకా ప్రాంతంలో వేల ఎకరాల అడవిని నాశనం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతానికి భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఈ నాలుగు గ్రహశకలాలకు 1979XB, అపోఫిస్, 2010RF12, 2000SG344 అని పేరు పెట్టారు. 1979xb గ్రహశకలం 900 మీటర్ల వ్యాసం గల ఈ గ్రహ శకలం మన భూగ్రహాన్ని ఢీకొడితే వినాశనమేనని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది గంటకు 70,000కిమి వేగంతో సౌర వ్యవస్థలో ప్రయాణిస్తుంటుంది. ప్రతి సెకనుకు 30 కిలోమీటర్లు భూమికి దగ్గరవుతూ భయపెడుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భూమికి ప్రమాదం తెచ్చే గ్రహశకలాల జాబితాలో దీనికి రెండవ స్థానం ఇచ్చింది. ఈ శతాబ్ధం మధ్యలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా, ఖగోళ నిపుణులు మాత్రం ఇది 2024లోపే భూవాతావరణంలోకి ప్రవేశించొచ్చని అనుమానిస్తున్నారు. అపోఫిస్ నాలుగు ఫుట్బాల్ మైదానాల పరిమాణం ఉన్న ఇది భూ కక్ష్యకు చాలా దగ్గరలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భూమికి 200 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ సెకన్కు 0.5 కిలోమీటర్ల చొప్పున భూమి దిశగా వస్తోంది. ఈ గ్రహ శకలం క్రమం తప్పకుండా భూ కక్ష్యలో వెళ్తుంది. తాజా రాడార్ సిగ్నల్ ప్రకారం ప్రకారం ఇది 2029లో భూమికి కేవలం 30,000 కి.మి చేరువకు వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మధ్యలో మన భూ కక్ష్య మీదుగా వెళ్తుంది. ఇక్కడ సంతోషకర విషయం ఏమంటే ఈసారి భూమికి 30 మిలియన్ కి.మి దూరంలో వెళ్లడం. ఇది గానీ భూమిని ఢీకొడితే 15,000 అణుబాంబుల శక్తి ఉత్పన్నం అవుతుంది. 2010 RF12 ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని సందేహాస్పద గ్రహశకలం ఇది. ఎర్త్ ఇంపాక్ట్ మానిటరింగ్ మరియు ఈఎస్ఏలు రెండింటిలోనూ దీన్ని ప్రమాదకర గ్రహశకలంగా నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం భూమికి 215 మిలియన్ కి.మి దూరంలో గంటకు 1,17,935 కి.మి వేగంతో ప్రయాణిస్తోంది. దీంతో ప్రమాదాన్ని ఈ శతాబ్దం చివరి వరకూ అంచనా వేయకపోయినా 500 టన్నుల బరువు, 7 మీటర్ల వ్యాసం గల ఇది భూమిని ఢీకొడితే 2013లో రష్యా పట్టణం చెల్యాబిస్క్పై ఉల్కపాతం పడినప్పుడు జరిగిన నష్టం కన్నా ఎక్కువే ఉంటుంది. అనుకోకుండా ఒక ఉల్కపాతం ఈ రష్యా నగరంపై పడి వేలాది భవనాలు దెబ్బతినడమే గాక వందల మంది గాయాలు పాలయ్యారు. 2010RF12 ఆగస్టు 13 2022లో భూమికి దగ్గరగా ప్రయాణిస్తుందని, అప్పుడు దీని భవిష్యత్ గమనాన్ని అంచనా వేయడానికి వీలుంటందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. 2000 Sg344 50 మీటర్ల వ్యాసం కలిగినా చాలా తక్కువ పరిమాణం ఉండటంతో ఇది కలిగించే ప్రమాదం కొంచెం తక్కువే. రష్యా పట్టణానికి కలిగిన నష్టంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇది భూమికి ప్రతి సెకనుకు 1.3 కి.మి చేరువ అవుతోంది. 2000 SG344 అనేది అటెన్ ఆస్టరాయిడ్స్ అని పిలువబడే ఒక సమూహంలో భాగం. ఈ సమూహంలోని గ్రహశకలాల కక్ష్యలు భూమి కక్ష్యకు చాలా దగ్గరగా ఉంటాయి. రాబోయే మూడు లేదా నాలుగు దశాబ్దాల్లో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. ఇంకా గుర్తించనివి.. మనకు ఇంకా తెలియని గ్రహశకలాలు చాలా ఉన్నాయి. ఇవి మనం గుర్తించక ముందే ఏ సెకను అయినా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చు. మన సాంకేతికత ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు రష్యా మీదకు వచ్చిన ఉల్కపాతాన్నిఅంచనా వేయలేకపోయాం. ఇది జపాన్పై 1945లో వేసిన అణుబాంబు కన్నా30 రెట్లు శక్తివంతమైంది. అలాగే డిసెంబరులో బేరింగ్ సముద్రంలో ఒక గ్రహశకలం పడింది. ఇది సముద్రంలో అణుబాంబు కన్నా10 రెట్లు శక్తివంతమైన అలజడిని రేపింది. గ్రహశకలాలతో మనకు ఏర్పడబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి గ్రహశకలాల ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పించడానికే జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ప్రకటించింది. -
ప్రతి ఒక్కరినీ బిలీనియర్గా మార్చే బంగారు గ్రహశకలం
సాక్షి : భూమిపై ప్రతి ఒక్కరినీ బిలీనియర్గా మార్చగల బంగారు గ్రహశకలాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనికి సైచీ-16 అని పేరు పెట్టారు. ఇది అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య, భూమికి 750 మిలియన్ కిలోమీటర్ల దూరంలో తిరుగుతోందని పేర్కొన్నారు. ఈ గ్రహశకలంలో లభించే బంగారం, నికెల్ను చూస్తే మతిపోవాల్సిందేనని, అయితే ఈ గ్రహశకలాన్నిఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. 2022 సంవత్సరానికంతా దీని కచ్చిత గమనాన్ని కనుగొంటామని నాసా ప్రకటించింది. ప్రపంచంలోనే అధిక బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ టైటాన్ ఆఫ్ గోల్డ్స్ అనిపించుకుంటున్న బడా కంపెనీలు భూమ్మీద భవిష్యత్ అవసరాలకోసం కావాల్సినంత బంగారాన్ని కచ్చితంగా ఉత్పత్తి చేయలేరు. రాబోయే దశాబ్దాలలో వీరు నిజమైన గోల్డ్ టైటాన్లుగా నిలబడాలంటే భూమిని వదిలిపెట్టి అంతరిక్షం వైపు చూడాల్సిందే. ఇటువంటి పరిస్థితులలో అనుకోని అదృష్టంలా బంగారు గ్రహశకలం సైచీ-16 కంటపడింది. 21 సెంచరీలో అంతరిక్షాన్ని సాధిస్తామా? మనం నిజంగానే బంగారాన్ని అంతరిక్షం నుంచి తీయగలమా ? మన దగ్గర అంత సాంకేతికత ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అయినా మున్ముందు ఈ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ అధ్యక్షుడు జాన్ జార్నెకీ. అంతరిక్షంలో మన ప్రయాణం సులువుగా సాగడానికి మహా అయితే ఓ 25 సంవత్సారాలు పట్టొచ్చు, అలాగే అంతరిక్షాన్ని కమర్శియల్గా ఉపయోగించుకోవడానికి మాత్రం 50 సంవత్సారలు ఆగాల్సిందేనని చెప్పారు. అంతరిక్షాన్ని అందుకోవడం రెండు కారణాల మీద ఆధారపడుతుంది. ఒకటి మన ఆర్థిక వెసులుబాటు, రెండు మన స్పేస్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ కావడం. అలాగే ఈ ప్రపంచంలో మనం కేవలం ఒంటరి కాదు. ఇంకా మనకు తెలియని ఎన్నో శక్తులు ఈ అంతరిక్షంలో ఆదిపత్యానికి అడ్డురావచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడ మనం చేస్తున్నదంతా గ్రౌండ్వర్క్ మాత్రమే. సరైన మౌళిక సదుపాయాలు ఉంటే కచ్చితంగా సాధించి తీరుతామని అంటున్నారు. తదుపరి పెట్టుబడుల కేంద్రం అంతరిక్షం సైచీ-16 గ్రహశకలాన్ని అందుకుంటే అంతరిక్షంలో బంగారు అన్వేషనకు ఇదే మొదటి దశ అవుతుంది. అలాగే భూమికి దగ్గరగా వెళ్లే గ్రహశకలాలలో కూడా ఇతర ఖనిజాలను వెలికితీయవచ్చు. ముఖ్యంగా అరుదైన లోహాల వనరులను కలిగి ఉన్న చంద్రుడు తదుపరి అంతరిక్ష మైనింగ్ కార్యకలాపాలకు ప్రధానకేంద్రం అవుతాడు. ఇప్పటికే అంతరిక్ష మైనింగ్ మార్కెట్ ఏర్పడింది. భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. మైనింగ్కు అనుగుణంగా స్పేస్క్రాఫ్ట్లను డిజైన్ చేయడంపై తలమునకలై ఉన్నారు. ఈ స్పేస్క్రాఫ్ట్ డిజైన్ సెగ్మెంట్లో ఖర్చు సగానికి సగం తగ్గితేనే అంతరిక్షంలో పెట్టుబడులకు బడా కంపెనీలు ముందుకు వస్తాయి. అంతరిక్ష మైనింగ్ అనేది 25-50 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా జరగొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పెట్టుబడులు కోసం అన్వేషణలు మొదలయ్యాయి. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం 350 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. 2040 నాటికి ఈ సంఖ్య 2.7 ట్రిలియన్స్కు చేరుకోవచ్చు. అయితే బడా కంపెనీలను ఈ దిశగా ఉత్సాహ పరిచి అడుగులు వేయడానికి సైచీ-16 మరింత కీలకంగా మారనుంది. మొదటి గోల్డ్ కింగ్ ఎవరు? ప్రపంచ శక్తిగా మారుతున్న చైనా ఈ దిశగా ముందే అడుగు వేసి ఉంటుంది. ఈ పోరులో ఆధిపత్యాన్ని సొంతం చేసుకునే దిశలో సైతం ముందుంది. సహజవనరుల కంపెనీలపై దానికున్న నియంత్రణ, విపరీతంగా పెరుగుతున్న ఆ దేశ సాంకేతిక అభివృద్ధి చైనాకు సానుకూల అంశాలు. అగ్రరాజ్యం అమెరికా మాత్రం తన ఆలోచనను చెప్పనప్పటికీ ప్రయత్నాలు చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే నాసాకు ప్రస్తుతం అంతరిక్ష అన్వేషణ, సైంటిఫిక్ మిషన్స్పైనే ఆలోచన ఉందని, చైనా మాత్రం అంతరిక్ష వాణిజ్య వ్యాపారంపై దీర్ఘకాల దృష్టితో ఉందని అభిప్రాయపడుతున్నారు. యూరపియన్ యూనియన్ కూడా ఈ రేసులో ఉంది. 2025 సంవత్సరానికంతా చంద్రునిపై మైనింగ్ మొదలు పెట్టాలని యూరోసన్ అనే దిగ్గజ గోల్డ్మైనింగ్ ఏజెన్సీతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అతి చిన్నదేశమైన లక్సెంబర్గ్లో అంతరిక్షంలో మైనింగ్కోసం ఏకంగా10 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. జపాన్కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ లూనార్ ఆర్బిట్ని 2020 సంవత్సరానికి సిద్ధం చెస్తోంది. ఏమైతేనేం ఎవరైతే బంగారానికి కొత్త దేవుళ్లు కావాలనుకుంటున్నారో వారే మొదట మన బంగారు గ్రహశకలం సైచీ-16ను అందుకుంటారు. -
రెడ్ స్నోమ్యాన్లా అల్టిమా టూ లే
వాషింగ్టన్: న్యూహారిజన్స్ అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను గురువారం నాసాకు పంపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్ ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా జనవరి 1న అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ను పంపిన సంగతి తెలిసిందే. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు. న్యూహారిజన్స్ అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్ హాఫ్కిన్స్ వర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) ట్వీట్ చేసింది. తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీ. సమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది. రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. -
ట్రాపిస్ట్–1 గ్రహాల్లో బోలెడంత నీరు!
ట్రాపిస్ట్ –1 పేరు గుర్తుందా? కొన్నేళ్ల క్రితం సౌరకుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహ వ్యవస్థ పేరిది. మొత్తం ఏడు గ్రహాలు ట్రాపిస్ట్–1 పేరుపెట్టిన ప్రత్యేక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి. వీటిల్లో కొన్నింటిపై నీరు ఉండేందుకు అవకాశం ఉందని అప్పట్లోనే అంచనాలు వేశారు. అయితే తాజా అంచనాలు మాత్రం నీరు కొంచెం ఉండటం కాదు.. మన సముద్రాల్లోని నీటి కంటే కనీసం 250 రెట్లు ఎక్కువ నీరు ఆ గ్రహాలపై ఉండే అవకాశముందని చెబుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నిధులతో జరుగుతున్న స్పెక్యులూస్ ప్రాజెక్టు శాస్త్రవేత్తలు ఈ తాజా అంచనాలను వెలువరించారు. ట్రాపిస్ట్–1 గ్రహ వ్యవస్థలో నక్షత్రానికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో దట్టమైన ఆవిరితో కూడిన వాతావరణం ఉంటుందని.. దూరంగా ఉన్న గ్రహాలు మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు మూడు గ్రహాల్లో ఉదజని వాయువు లేకపోవడాన్ని బట్టి వాటిపై జీవం ఉండే అవకాశాలు లేకపోలేదని అంచనా. రెండేళ్ల తరువాత నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ప్రయోగించబోయే అత్యాధునిక ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు’తో ఈ గ్రహ వ్యవస్థకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలుస్తాయని అంచనా. -
అంచనాలకు అందని ఆస్టరాయిడ్!
హూస్టన్: విశ్వంలో గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ గురించి సైంటిస్టులు ఎంతో ముందుగానే అంచనా వేస్తారు. అది ఎప్పుడు భూమిని దాటి వెళ్తుందన్న దానిపై ఓ స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మొన్న వీకెండ్లో ఓ ఫుట్బాల్ మైదానమంత సైజు ఉన్న ఆస్టరాయిడ్ భూమి పక్కగా వెళ్లిందని చాలా మందికి తెలియదు. నాసా శాస్త్రవేత్తలకే అది వచ్చే కొన్ని గంటల ముందు తెలిసింది. ఆరిజోనాలోని నాసా అబ్జర్వేటరీలో ఉన్న సైంటిస్టులు 21 గంటల ముందే అది భూమి వైపు దూసుకొస్తున్నదని గుర్తించారు. 2018 జీఈ3 అనే ఈ ఆస్టరాయిడ్ ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం ఆదివారం 12.11 గంటలకు భూమికి దగ్గరగా వచ్చినట్లు స్పేస్ డాట్ కామ్ వెబ్సైట్ వెల్లడించింది. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఇది 48–110 మీటర్ల వెడల్పు ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్ వెబ్సైట్ తెలిపింది. ఇది 1908లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పడిన ఆస్టరాయిడ్ కంటే 3.6 రెట్లు పెద్దది కావడం గమనార్హం. అప్పట్లో ఈ ఆస్టరాయిడ్ హిరోషిమాపై పడిన అటామిక్ బాంబ్ కంటే 185 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. -
భూమికి మరో ముప్పు!
భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలంపేరు బెన్నూ.. ఇది వంద అంతస్తుల భవనం కన్నా ఎక్కువ సైజు ఉంటుందని అంచనా. 2135లో భూమిని ఢీకొడుతుందని నాసా ఆధ్వర్యంలో పనిచేస్తున్న నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్(నియో) చెబుతోంది. ఇంత భారీ సైజున్న గ్రహశకలం భూమివైపు రావడం చాలా అరుదు. సుమారు 6 కోట్ల ఏళ్ల కింద రాక్షసబల్లులను అంతమొందించింది ఇలాంటి భారీ గ్రహశకలమే. అందుకే బెన్నూ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. దీని బరువు దాదాపు 7,900 కోట్ల కిలోలు. ఇది గనుక భూమిని ఢీకొంటే మనిషి అన్నవాడు ఉండబోడని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2135 డెడ్లైన్.. అంతరిక్షంలో కొన్ని చోట్ల భారీ సంఖ్యలో గ్రహశకలాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. కక్ష్య నుంచి బయటపడి ఇష్టారీతిగా తిరిగే కొన్ని గ్రహశకలాలు వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తుంటాయి. వీటిల్లో చాలా తక్కువ మాత్రమే భూమిని ఢీకొడతాయి. నియో అంచనా ప్రకారం 2135 సెప్టెంబర్ 25న బెన్నూ భూమిని ఢీకొట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో బెన్నూను ఎదుర్కొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకతో బెన్నూను ఢీకొట్టించాలని.. దీంతో అది దారితప్పి ముప్పు నుంచి భూమి బయటపడుతుందని అంచనా. అయితే అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడం కన్నా అణుబాంబుతో గ్రహశకలాన్ని పేల్చేయడం మేలని కొంతమంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బోలెడన్ని అంతరిక్ష నౌకలను గ్రహశకలం వైపు పంపితే.. ఒక్కోదాన్ని ఢీకొన్నప్పుడల్లా బెన్నూ వేగం తగ్గుతూ వస్తుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. గ్రహశకలం చిన్నదైతే ఢీకొట్టేందుకు చాలా సమయం ఉందని తెలిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు మొదటి పద్ధతి సరిపోతుందని లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీకి చెందిన డేవిడ్ డియర్బార్న్ అంటున్నారు. అయితే అణుబాంబులతో పేల్చేయడం మేలైన పని అని ఓ తాజా అధ్యయనంలో తేలింది. 8 టన్నుల హ్యామర్.. బెన్నూను అణుబాంబులతో పేల్చేసేందుకు అమెరికాకు చెందిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ (ఎన్ఎన్ఎస్ఏ) అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. హైపర్ వెలాసిటీ ఆస్టరాయిడ్ మిటిగేషన్ మిషన్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ (హ్యామర్) అని పిలుస్తున్న ఈ అంతరిక్ష నౌక దాదాపు 8.8 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. అధిక వేగంతో ప్రయాణిస్తూ బెన్నూను ఢీకొనడం ఒక పద్ధతి. లేదంటే అణుబాంబులను మోసుకెళ్లి ఆ గ్రహశకలంపై వాటిని పేల్చేయడం రెండో పద్ధతి. మొదటి పద్ధతిని పాటిస్తే ఎంత శక్తి పుడుతుందో తెలుసా? హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 80 వేల రెట్లు ఎక్కువ. ఈ భారీ శక్తి కాస్తా గ్రహశకలం దారిని మార్చేస్తుందని, తద్వారా అది భూమికి దూరంగా జరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. అయితే గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బెన్నూను దారి మళ్లించేందుకు ఇది సరిపోదని.. అణుబాంబులతో ముక్కలు చేయడమే కరెక్ట్ అని ఎన్ఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. – సాక్షి హైదరాబాద్ -
ఆ గ్రహశకలంతో ముప్పులేదు!
హ్యూస్టన్: ‘ఎటువంటి వదంతులను నమ్మొద్దు. ఫిబ్రవరి 4న భూమికి ఎటువంటి ముప్పులేద’ని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఓ పెద్ద ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తోంది. వచ్చే నెలలో భూమికి అత్యంత సమీపం నుంచి ఈ గ్రహశకలం వెళ్లిపోతుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. భూమి మీదున్న అతి పెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఈ ఆస్టరాయిడ్ పెద్దదట. దీనికి 2002 అఒ129గా పేరు పెట్టేశారు. ఫిబ్రవరి 4న భూమికి 26 లక్షల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహ శకలం వెళ్లనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత దూరం కూడా చాలా దగ్గరే అని నాసా చెబుతోంది. 1.1 కిలోమీటర్ల పొడువున్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశాలు లేవని, ఒకవేళ ఢీకొంటే.. అది భూమి మొత్తాన్ని కప్పేసేంత దుమ్ము ధూళిని వెదజల్లుతుందని, దీనివల్ల భూగ్రహం మొత్తం అంధకారమవుతుందని నాసా తెలిపింది. విశ్వంలో ఓ నిర్ణీత కక్ష్య లేకుండా తిరిగేవే ఈ గ్రహ శకలాలు. -
ఆకాశంలో పెద్ద చంద్రుడు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రపంచవ్యాప్తంగా మంగళవారం కూడా బ్లూ మూన్ కనువిందు చేసింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అతిపెద్ద చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు. నేడు, రేపు భూమికి దగ్గరగా ఉల్కలు.. బ్లూ మూన్తో పాటు బుధ, గురువారాల్లో మరో ఆవిష్కరణ చోటు చేసుకోనుంది. బుధ, గురువారాల్లో సప్తరుషి మండలం నుంచి ఉల్కాపాతం భూ వాతావరణానికి దగ్గరగా ప్రయాణించనున్నాయి. ఈ నెల 31న కూడా రెండో సారి బ్లూ మూన్ ఉండటంతో ఉల్కాపాతాల ప్రయాణం పెద్దగా కనిపించకపోవచ్చని సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకే నెలలో రెండు సార్లు బ్లూమూన్తో పాటు ఉల్కాపాతాల ప్రయాణం ఉండటంతో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాన్ని తెలియజేయవచ్చని జిల్లా సైన్స్ అ«ధికారి శరత్కృష్ణ తెలిపారు. -
దారి తప్పిన గ్రహశకలం
లండన్: మన సౌర కుటుంబం మీదుగా ఎర్రటి, పొడవాటి ఓ వస్తువు గతనెలలో దూసుకు పోయింది. అన్ని గ్రహశకలాల మాదిరిగానే ఇది కూడా సాధారణమైందని ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. అయితే అది వేరే నక్షత్ర సమూహం నుంచి వచ్చిన తొలి గ్రహశకలం అని వారి పరిశీలనలో తెలిసింది. గత నెలలో ఆకాశంలో ఏదో వస్తువు వెలుగుతూ వెళ్లినట్లు హవాయిలోని పాన్–స్టార్స్1 అనే టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత చిన్న పరిమాణంలో ఉండే సాధారణ గ్రహశకలం అని భావించినా.. ఆ తర్వాత దాని కచ్చితమైన కక్ష్యను గుర్తించగలిగారు. ఈ వస్తువు వేరే నక్షత్ర మండలం నుంచే వచ్చినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తొలుత ఆ వస్తువును తోకచుక్కగా భావించారు. అయితే సెప్టెంబర్లో తోకచుక్క వంటివేవీ సూర్యుడికి దగ్గరగా వెళ్లినట్లుగా ఎలాంటి గుర్తులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ తర్వాత ఆ వస్తువును వేరే నక్షత్ర మండలానికి చెందిన గ్రహశకలమని గుర్తించారు. దానికి ‘ఔమువామువా’అని పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 400 మీటర్ల పొడవుతో.. వెడల్పుతో పోల్చుకుంటే 10 రెట్ల పొడవుతో ఉంది. ఔమువామువా ఇప్పటికే సూర్యుడికి అతి దగ్గరి నుంచి వెళ్లిందని, అక్కడి నుంచి మన సౌర కుటుంబం దాటి వేరే నక్షత్ర మండలానికి వెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. భూమిని ఢీకొననున్న అపోఫిస్! కాలిఫోర్నియా: ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూ గ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు. -
భూమికి సమీపంగా ఉల్క
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా గురువారం ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్–స్టార్స్ టెలిస్కోప్ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది. భూమికి ఎంత దగ్గరగా... యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి–చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి. ‘ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చింది. ఈ శకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ..ఉల్కలను కనుగొనడం, అంతరిక్ష భద్రతకు ఏ మేరకు సిద్ధమై ఉన్నామనే దానికి దీన్ని సవాలుగా భావించవచ్చు’ అని జర్మనీలోని యూరోపియన్ అంతరిక్ష వ్యవహారాల కేంద్రం చీఫ్ రోల్ఫ్ డెన్సింగ్ చెబుతున్నారు. దాదాపు 6.5కోట్ల ఏళ్ల క్రితం మెక్సికో తీర ప్రాంతాన్ని ఓ ఉల్క ఢీకొట్టడంతో భూమిపై డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని, 2013లో రష్యాలోని ఛెల్యాబిన్స్క్పై 10 టన్నుల బరువున్న శకలం ముక్కలై పడటంతో వెయ్యి మంది గాయపడ్డ ఘటనను ఆయన గుర్తుచేశారు. ఎదుర్కోగలమా ? ‘భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్ ఇంపాక్ట్’ మిషన్ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి’ అని శాస్త్రవేత్త డెట్లెఫ్ చెప్పారు. ‘2012 టీసీ4’ భూమికి సమీపంగా వెళ్లినప్పుడు అంతర్జాతీయ గ్రహశకలాల హెచ్చరిక నెట్వర్క్లో ద్వారా ప్రపంచంలోని అబ్జర్వేటరీలు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేశాయి. – -
భూమికి తప్పిన ప్రమాదం
-
భూమికి తప్పిన ప్రమాదం
భూమికి ప్రమాదం తప్పిందా? భూమిని ఢీ కొట్టాల్సిన ఆస్టరాయిడ్.. పక్కకు తప్పుకుందా? పొరపాటున ఢీ కొడితే ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు తలెత్తేవి? ఆస్టరాయిడ్ భూమికి ఎంత దగ్గరగా వచ్చింది? వంటి వివరాలు తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవండి. వాషింగ్టన్ : భూమికి మరో ప్రమాదం తప్పింది. అంతరిక్షంలోని ఒక చిన్న గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు వేగంగా ప్రయాణిస్తోందని గతంలో ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ (ఐఏడబ్ల్యూఎన్) ప్రకటించింది. తాజాగా ఈ గ్రహశకలం తన దిశను మార్చుకుని.. భూమికి అత్యంత సమీపంనుంచి ప్రయాణిస్తోందని ఐఏడబ్ల్యూఎన్ పేర్కొంది. గ్రహశకలం ప్రయాణిస్తున్న వేగాన్ని అంచనా వేస్తే గురువారం ఉదయం 11.12 నిమిషాలకు భూమిని దాటుకుని ముందు వెళుతుందని ఆ సంస్థ తెలిపింది. ఆ సమయంలో ఆస్టరాయిడ్..భూమికి 42 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 2012 టీసీ4గా పేర్కొనే ఈ గ్రహశకలం.. సుమారు 15 నుంచి 30 మీటర్లు వ్యాసార్థంలో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిని దాటే సమయంలో అంటార్కిటికాకు అత్యంత సమీపం నుంచి వెళుతుందని వారు చెబుతున్నారు. గ్రహశకలాలను అధ్యయనం చేయడానికి ఇదొక మంచి అవకాశమని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్ను 2012లో హవాయిలోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్ నుంచి సైంటిస్టులు కనుగొన్నారు. ఈ అస్టరాయిడ్పై నాసా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. విశ్వంలోని ఒక గ్రహశకలం.. గురువారం ఉదయం భూమిని దాటుకుని ముందుకు ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ ప్రకటించింది. A small asteroid will safely fly by Earth on Oct 12. Our network of observatories & scientists will test tracking it https://t.co/8ISXusz06U pic.twitter.com/yafgR5LTE1 — NASA (@NASA) October 11, 2017 -
జీవం పుట్టుకకు దారేదీ?
భూమ్మీద జీవం ఎలా పుట్టింది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సముద్రపు అడుగున పుట్టిందని కొందరు. అగ్నిపర్వత బిలాల్లోంచి ఆవిర్భవించిందని ఇంకొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. సుమారు 370 నుంచి 450 కోట్ల ఏళ్ల కింద ఆకాశం నుంచి కొన్ని ఉల్కల ముక్కలు వెచ్చటి, చిన్నసైజు నీటి కుంటల్లోకి పడటం జీవం పుట్టుకకు కారణమైందని తాజాగా మెక్మాస్టర్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని మ్యాక్స్ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై సముద్రాల మధ్య ఖండాలు ఏర్పడుతున్న సమయంలోనే భూమ్మీద జీవం ఏర్పడింది. ఉల్కా శకలాలతో పాటు మౌలిక పోషకాలు చేరడంతో ముందుగా తనంతట తాను పునరుత్పత్తి చేసుకోగల ఆర్ఎన్ఏ ఏర్పడిందని.. ఇది తర్వాతి కాలంలో జీవం ఆవిర్భవానికి దారితీసిందని కె.డి.పియర్స్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రంతో పాటు భూగర్భ, రసాయ, జీవ శాస్త్రాలన్నింటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. వెచ్చటి కుంటల్లోని నీరు ఆవిరి కావడం, మళ్లీ నీరు చేరడం వంటి సహజ ప్రక్రియల వల్ల ఉల్కా శకలాల ద్వారా నీటిలోకి చేరిన రసాయనాలు ఒకదానితో ఒకటి బంధం ఏర్పరచుకునేందుకు వీలేర్పడిందని తెలిపారు. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని ఆర్ఎన్ఏలు పరిస రాల్లోని పోషకాలను గ్రహించి మరిన్ని ఆర్ఎన్ఏలను ఉత్పత్తి చేయగలిగాయన్నారు. -
‘బెన్ను’ వైపుగా నాసా అంతరిక్ష నౌక
ఏడాది తర్వాత నిర్ధిష్ట మార్గం వెంట ప్రయాణిస్తున్న ‘ఓసిరిస్–రెక్స్’ వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత అంతరిక్ష నౌక బెన్ను అనే గ్రహశకలం వైపు విజయవంతంగా దూసుకెళ్తోంది. సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహశకలం వైపు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ముందుకు వెళుతోంది. ఈ నౌక వచ్చే ఏడాది నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా వెల్లడించింది. ఓసిరిస్–రెక్స్ అనే ఈ నౌకను ఏడాది కిందే ప్రయోగించినా శుక్రవారమే వేరే గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని అందుకుంది. ఈ నౌక ఏడేళ్లు ప్రయాణించి తిరిగి భూమిని చేరుకుంటుందని, తన ప్రయాణంలో బెన్ను నుంచి నమూనాలను సేకరిస్తుందని నాసా పేర్కొంది. ఈ ప్రాచీన గ్రహశకలం నమూనాల ద్వారా 450 కోట్ల సంవత్సరాల కింద మన సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందన్న కీలక సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. దీన్ని ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి గతేడాది సెప్టెంబర్ 8న అట్లాస్ వీ 411 రాకెట్ ద్వారా ప్రయోగించారు. రాకెట్ ద్వారా దూసుకువెళ్లే శక్తిని అందించినా, తన కక్ష్యను మార్చుకునేందుకు మరింత శక్తి అవసరం ఉంటుందని నాసా వివరించింది. ఈ అంతరిక్ష నౌకకు చెందిన పరికరాలు మార్గమధ్యంలో భూమిని, చంద్రుడిని కూడా రెండు వారాల పాటు స్కాన్ చేస్తాయని వెల్లడించింది. -
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం
-
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం
దాదాపు 400 మీటర్ల వెడల్పున్న గ్రహశకలం ఒకటి భూమికి అతి దగ్గరగా దూసుకొస్తోంది. అది భూమికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పారు. సాధారణంగా చిన్న గ్రహశకలాలు మామూలుగానే భూమికి దగ్గరగా వస్తాయి. 2014 జె025 అనే ఈ గ్రహశకలాన్ని 2014 మేలో గుర్తించారు. ఇది మాత్రం 2004 నుంచి ఇప్పటి వరకు భూమికి దగ్గరగా వచ్చిన వాటిలో అతి పెద్దదని అంటున్నారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 4.6 రెట్ల దూరంలో ప్రయాణిస్తోంది. భూమికి సమీపంగా కేవలం కొన్ని సెకండ్ల పాటే ఉంటుందని, అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని నాసా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్కు చెందిన డేవీ ఫార్నోషియా చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా గ్రహశకలాలు ప్రయాణించే తీరును పరిశీలిస్తుండటంతో.. దాని మార్గాన్ని కచ్చితంగా అంచనా వేయగలమని ఆయన అన్నారు. దీన్ని మామూలు కంటితో చూసే అవకాశం మాత్రం ఉండదు. ఇంట్లో ఉన్న టెలిస్కోపులతో ఈరోజు, రేపు రెండు రాత్రుల పాటు చూసే అవకాశం స్కై వాచర్లకు ఉంటుంది. రాబోయే 500 సంవత్సరాల్లో ఇంత దగ్గరగా వచ్చే గ్రహశకలం ఇంకోటి ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంతకుముందు 2004 సంవత్సరంలో టౌటాటిస్ అనే గ్రహశకలం భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. -
భూమిని దాటనున్న భారీ ఉల్క!
వాషింగ్టన్: ఈ నెల 19న భారీ సైజున్న ఓ ఉల్క భూమిని దాటనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఇది భూమికి దాదాపు 18 లక్షల దూరం నుంచి వెళ్లిపోనుందని పేర్కొంది. ఇది భూమిని ఢీకొనే ప్రమాదం లేకపోయినా ఓ భారీ ఉల్క భూమికి ఇంత దగ్గరగా వెళ్లడం ఇదే ప్రథమం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని 2014 మేలో గుర్తించడం వల్ల దీనికి 2014 జేఓ25 అని నామకరణం చేశారు. ఈ ఉల్క దాదాపు 650 మీటర్ల పొడవు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ఉపరితలం చంద్రుడి ఉపరితలం కంటే రెట్టింపు ప్రకాశవంతంగా ఉందని చెబుతున్నారు. ఏప్రిల్ 19న అర్ధరాత్రి దీన్ని ఆకాశంలో చూడవచ్చట! చిన్న చిన్న ఉల్కలు మన భూమిని వారానికి పలుసార్లు దాటుతూ ఉంటాయి. దీని తర్వాత మరో పెద్ద ఉల్క 2027లో భూమిని దాటుతుందని అంచనా వేస్తున్నారు. 1999 ఏఎన్10 అనే పేరున్న ఉల్క భూమికి దాదాపు 3.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19నే పాన్ స్టార్స్ అనే తోకచుక్క కూడా భూమికి 17.5 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా రానుంది. ఆ తోకచుక్క భూమికి అంత దగ్గరగా రానుండటం కూడా ఇదే ప్రథమం. -
భూమికి చేరువగా వచ్చిన ఆస్టరాయిడ్
వాషింగ్టన్: వేరశనగ ఆకారంలోని ఓ ఆస్టరాయిడ్ గత వారాంతంలో భూమికి అత్యంత చేరువగా వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు గుర్తించారు. 1999 జేడీ6గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ జూలై 24న భూమికి 7.2 మిలియన్ కిలోమీటర్ల చేరువకు వచ్చిందని వారు తెలిపారు. ఈ దూరం భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 19రెట్లు ఎక్కువ. మరలా 2054లో ఒక ఆస్టరాయిడ్ భూమికి ఇంత చేరువగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్టరాయిడ్లను గుర్తించడానికి, వాటిని నుంచి భూమికి రక్షణ కల్పించడానికి నాసా ‘ఆస్టరాయిడ్ ట్రాకింగ్’ మిషన్ కృషి చేస్తోంది. -
మలాలాకు మరో అరుదైన గౌరవం
ఇస్లామాబాద్: అతి చిన్న వయసులో ప్రపంచ శాంతి నోబుల్ బహుమతి దక్కించుకున్న మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. కాలిఫోర్నియాలోని నాసా లోని ల్యాబ్ శాస్త్రజ్ఞులు 316201 అనే ఉల్కకు , బాలికా విద్య కోసం కృషిచేసిన మలాలా పేరును పెట్టారు. ఒక ఉల్కకు (ఆస్ట్రాయిడ్)మలాలా పేరు పెట్టడం చాలా గొప్ప విషయమని నాసా ఖగోళ శాస్త్రజ్ఙుడు ఎమీ మైంజర్ పేర్కొన్నారు. ఇంతకుముందు చాలామంది ఈ గౌరవం లభించినప్పటికీ మహిళల కోసం పనిచేసిన మహిళకు దక్కడం చాలా అరుదని ఆయన తెలిపారు. -
అంతరిక్ష పరిశోధనలకు.. ఆస్ట్రానమీ
అప్కమింగ్ కెరీర్: విశ్వం ఎలా ఏర్పడింది? దీనికి ఆది, అంతం ఎక్కడ? గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉద్భవించాయి? రాత్రిపూట మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, పాలపుంతలు, తోక చుక్కల మర్మమేంటి? మరో గ్రహంపై మానవ నివాసం సాధ్యం కావాలంటే ఏం చేయాలి?... తదితర విషయాలపై ఎవరికైనా ఆసక్తి ఉండడం సహజం. అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్న అనంతమైన విశ్వ రహస్యాలను తెలుసుకోవాలని మనిషి అనాదిగా కృషి చేస్తూనే ఉన్నాడు. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. అంతరిక్షంపై నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు ఈ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ అధికంగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి ఆస్ట్రానమీని కెరీర్గా మలచుకుంటే.. బంగారు భవిష్యత్తు సొంతమవడం ఖాయం. ఆస్ట్రానమీలో రెండు విభాగాలుంటాయి. అవి.. థియారెటికల్ ఆస్ట్రానమీ, అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ. అభ్యర్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాన్ని ఎంచుకోవచ్చు. ఆస్ట్రానమర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో తగిన పరిజ్ఞానం సంపాదిస్తే.. అబ్జర్వేటరీల్లో పరిశోధకులుగా, యూనివర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), స్పేస్ ఫిజిక్స్ ల్యాబోరేటరీస్ వంటి అత్యున్నత సంస్థల్లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మంచి అవకాశాలున్నాయి. ఆస్ట్రానమర్గా గుర్తింపు సాధించాలంటే.. ఫిజిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ను సొంతం చేసుకోవాలి. డేటా అనాలిసిస్పై గట్టి పట్టు ఉండాలి. నూతన శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలి. వేతనాలు: పరిశోధనా కేంద్రాల్లో రీసెర్చ్ వర్క్, కాలేజీ/యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ఆస్ట్రానమర్లకు ప్రారంభంలో నెలకు రూ.50 వేల దాకా వేతనం లభిస్తుంది. తర్వాత ఎక్స్పీరియెన్స్, సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్, బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత ఫిజిక్స్/ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదవాలి. అనంతరం పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే పరిశోధనా రంగంలో స్థిరపడొచ్చు. వర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. అస్ట్రానమీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్-పుణె వెబ్సైట్: http://www.iucaa.ernet.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.iiap.res.in/ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: http://www.rri.res.in/ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: http://www.du.ac.in/ యూనివర్సిటీ ఆఫ్ ముంబై వెబ్సైట్: http://www.mu.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-త్రివేండ్రం వెబ్సైట్: http://www.iist.ac.in/ పరిశోధనలకు సరైన ఎంపిక ‘‘విశ్వ రహస్యాల ఛేదనలో ఖగోళ శాస్త్రవేత్తలది కీలకపాత్ర. ఆస్ట్రానమీ అనగానే పాత సబ్జెక్టు అనే భావన రాదు. అది ఎప్పటికీ నిత్యనూతనం. అంతరిక్షంలో మానవాళి నివాసానికి అనువుగా ఉండే గ్రహాల అన్వేషణ. నక్షత్రాలు, గ్రహాల గమనం వంటి అంశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగినట్లుగానే ప్రభుత్వాలు పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి. అస్ట్రో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి భిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి పలు యూనివర్సిటీల్లో ఫెలోషిప్లు అందజేసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. అయితే పరిశోధనలతో కొత్త అంశాలను వెలికితీయాలనే ఉత్సుకత ఉన్న యువతకు ఆర్అండ్డీ విభాగంలో అవకాశాలు అపారం. బోధన రంగంలో స్థిరపడే వీలుంది. కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రానమీతో అవకాశాలు పుష్కలం’’ - డాక్టర్ ఎస్.ఎన్.హసన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ హెడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
దేవుడి సృష్టే
కాలిఫోర్నియా: ఈ ధరిత్రి దేవుడి సృష్టేనని నూటికి 40 మంది అమెరికన్లు విశ్వసిస్తున్నారు. గేలప్ తాజా పోల్ ప్రకారం ప్రతి పది మందిలో నలుగరు అమెరికన్లు ఈ భూమిని పది వేల సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించారని నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా, ఆస్టరాయిడ్ అనే వేయి అడుగుల ఉల్క ఒకటి రేపు భూమికి దగ్గరగా రానుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దగ్గరగా అంటే ఎంత దూరం అనుకున్నారు? భూమికి 1.25 మిలియన్ కిలో మీటర్ల దూరం నుంచి వెళుతుంది. ఈ ఉల్క గంటకు 50వేల 400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ఆస్టరాయిడ్కు ఒక మహానగరాన్ని నాశనంచేసే శక్తి ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.