Babies
-
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!
మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం. ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి. పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్లో డైపర్లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి. -
అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు
మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యతి్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధా్నహ్నం విజయవాడ నుంచి తీసుకు వచి్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
బాల భీముడు
నిర్మల్చైన్గేట్: సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. నిర్మల్లో 4.900 కిలోల బరువుతో శనివారం బాబు జన్మించాడు. సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన స్రవంతి శుక్రవారం ప్రసవం కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. హెచ్వోడీ డాక్టర్ సరోజ ఆధ్వర్యంలో డ్యూటీ డాక్టర్, నర్సులు సాధారణ స్రవంతికి సాధారణ ప్రసవం చేశారు. ప్రస్తుతము తల్లి, బాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. -
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
వండర్ఫుల్ టిప్స్ : బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప...ఓసారి ట్రై చేయండి..!
మన బామ్మల దగ్గర్నించి, ఇప్పటిదాకా వంటిట్లో గానీ, వంటల్లో గానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు కానీ చక్కటి ఇంటి చిట్కాలను, హోం రెమిడీస్ను ఫాలో అవుతూ ఉంటాం. నిజానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కూడా. మరి అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని మీ కోసం.. ⇒ కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు. ⇒ అగరబత్తిసుసితో ఇత్తడి పాత్రలు కడగడితే భలే శుభ్రపడతాయి. ⇒ కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ⇒ మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి. ⇒ బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలుంచితే త్వరగా పాడవ్వదు. ⇒ నిమ్మ చెక్క మీద ఉప్పు, మిరియాల పొడి చల్లి స్టౌ మీద ఉంచి, కొద్దిగా వేడి చేసి, ఆ రసాన్ని పిండుకొని తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం దొరుకుతుంది ⇒ నిమ్మ రసం, తేనె, గ్లిజరిన్లను సమపాళ్ళలో కలపాలి. రోజుకు మూడుసార్లు ఒక టీ స్పూను చొప్పున తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది ⇒ ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి తాగితే ఉపశమనం. ⇒ పిల్లలకు జలుబు చేసినపుడు, తులసి, అల్లం, నాలుగు వామ్ము ఆకులు వేసి మరిగించిన నీళ్లను తాగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ⇒ ముక్కు బాగా దిబ్బడ వేసినపుడు, పిల్లల్ని వెల్లకిలాకాకుండా, ఒక పక్కకు పడుకోబెట్టి, వీపు మీద బేబీ విక్స్ రాసి మెల్లిగా రుద్దితే తొందరగా నిద్ర పోతారు. -
బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!
నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా గుర్తు ఉంటాయి. సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి. ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి. ఉలక్కి పడి లేచి ..హమయ్య కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే.. కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్బర్గ్ ప్రకారం, శిశువు కలలో కనిపిస్తే కొత్త ప్రారంభానికి సూచిక. చేస్తున్న పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే సానుకూల సంకేతమని లోవెన్బర్గ్ చెప్పారు. ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు, అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్బర్గ్ వివరించాడు. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా! నిజానికి శతాబ్దాలుగా కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్ అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు కార్ల్ జంగ్ అంటాడు. కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఇంపల్షన్స్ మాత్రమే. ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్. -
బుజ్జి పాపాయిల కోసం.. వాళ్లకు నచ్చే విధంగా రుచికరమైన ఆహారం
ఇప్పుడిప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లిబుజ్జాయిలకి.. ఈ ప్యూరీ బ్లెండర్ బేబీ ఫుడ్ సప్లిమెంట్ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు నచ్చేవిధంగా.. మృదువుగా, రుచికరంగా ఆహారాన్ని ఉడికించి, పేస్ట్ చేస్తుంది. సాధారణంగా ఆపిల్, క్యారెట్, బీట్రూట్ వంటి పోషకాహారాలను కుక్ చేసి.. మెత్తగా క్రీమ్లా చేయడం చాలా సమయంతోనూ శ్రమతోనూ కూడిన పని. కానీ ఈ ఆటోమేటిక్ స్టీమింగ్ అండ్ బ్లెండింగ్ మేకర్ కొన్ని నిమిషాల్లోనే వేడివేడిగా ఆ క్రీమ్ని అందిస్తుంది. నాలుగు హైక్వాలిటీ బ్లేడ్స్తో వేగంగా పనిచేస్తుంది. ఈ మెషిన్స్లో చాలా రంగులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో చికెన్, ఫిష్ కూడా ఉడికించుకోవచ్చు. ముందుగా ఎడమవైపున్న వాటర్ ట్యాంక్లో వాటర్ నింపుకుని.. కుడివైపున ఆహారాన్ని వేసుకుని.. ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ మూత పక్కనే.. డిస్ప్లేలో ఆప్షన్స్ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
తూర్పు తీరం ఆడపడుచులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టింటిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమకారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరువాత సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగలగటం వాటి జ్ఞాపక శక్తికి నిదర్శనమంటారు. ఆలివ్ రిడ్లే శాస్త్రీయ నామం‘లెపిడోచెలిస్ ఒలివేసియా’.గ్రీన్ టర్టిల్, లెదర్ బ్యాగ్, గ్రీన్సీ టర్టిల్, హాక్చిల్సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూల నుంచి.. ఈ మూల వరకు ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపుతాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువాత ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడుపుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్లలు బయటకొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది. కళ్లు తెరిచిన పిల్లలను సూర్యుడు ఉదయించే వేళ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వెలుతురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలవైపు పరుగులు తీస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్ ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటికే 8వేల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. సమతుల్యతలో కీలకం కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరాన్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడికే వస్తాయి. సముద్రం జలాల్లో వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో వీటి పాత్ర కీలకం. సముద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్లను ఆలివ్ రిడ్లేలు ఆహారంగా తీసుకుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండటం, సముద్ర జలాలలో కాలుష్యం నివారించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. – ఎస్.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి. తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్ రిడ్లే తెలివితేటలు అమోఘం. -
గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు
కరోనా మహమ్మారికి సంబంధించి పలు కథనాలు విన్నాం. గానీ గర్భంలో ఉండగానే శిశువులు ఈ మహ్మమారి బారిన పడిన తొలి కేసును గుర్తించి వైద్యలు షాక్కి గురయ్యారు. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇలా జరిగిందని పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. గర్భంలో ఉండగానే కరోనా బారిన పడటంతో రెండు శిశువుల బ్రెయిన్ హేమరేజ్తో జన్మించినట్లు యూఎస్లోని వైద్యులు వెల్లడించారు. ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మియామి తన పీడియాట్రిక్స్ జర్నల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్తో బాధపడినట్లు తెలిపారు వైద్యులు. తర్వాత వారిలో సరైన విధుంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్ జాడలను గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన శిశువుకి పోస్ట్మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు. అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు పరిశోదకులు. అయితే గర్భధారణ సమయంలో డెల్టా వేరియంటే లేదా ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడితే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టం కాలేదని చెప్పారు పరిశోధకులు. ఇలా తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన తొలికేసు ఇదేనని మియామి విశ్వవిద్యాలయ గైనకాలజిస్టు మైఖేల్ పైడాసస్ చెబుతున్నారు. (చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!) -
Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం
అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..? తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్ భాషలో మిరాకిల్) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు. 10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. సిరియాలో బాలల దురవస్థ పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది. పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.! ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది... ► ప్రభుత్వాలు యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. ► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి. ► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. ► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. ► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం. ► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. చిన్నారులపై పడే ప్రభావాలు ► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు. ► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి. ► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్ ముప్పు! ► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నవ’ పారిజాతాలు
ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. గంపెడు సంతానం అంటుంటారు.. మాలీకి చెందిన 27 ఏళ్ల హలీమా విషయానికొస్తే.. గంపెడు సంతానమంటే.. తొమ్మిది మంది!! ఎందుకంటే.. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారందరూ ఆమె పిల్లలే(ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు).. పైగా.. వీరందరూ ఒకే కాన్పులో జన్మించారు!! ఒకరిద్దరికే ఆపసోపాలు పడుతున్న ఈ కాలంలో 9 మంది అంటే మాటలా.. గతేడాది మే 4న వీరు జన్మించారు. ఇప్పటివరకూ చరిత్రలో ఒకే కాన్పులో 9 మంది పుట్టిన ఘటనలు మూడుసార్లు మాత్రమే జరిగాయి.. అయితే.. అలా పుట్టినవారందరూ బతికి ఉండటం మాత్రం ఇదే తొలిసారి.. మొన్న మే 4న వీరందరూ తమ మొదటి పుట్టిన రోజును మొరాకోలోని కాసబ్లాంకాలో జరుపుకున్నారు. కాన్పు కోసం హలీమాను మాలీ ప్రభుత్వం మొరాకోకు తరలించింది. అప్పటి నుంచి ఆమె పిల్లలతో అక్కడే ఉంది. వీళ్లను చూసుకోవడానికి నర్సుల బృందాన్ని కూడా నియమించారు. ఈ ఖర్చులన్నీ మాలీ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నవ శిశువుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వీరందరి అక్క సౌదా(మొత్తంగా 10 మంది పిల్లలు), హలీమా భర్త ఖాదర్ మాలీ నుంచి వచ్చారు. ఖాదర్ మాలీ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇంతమంది పిల్లలు బతికిబట్టకట్టడం అంటే అంతా దేవుడి దయేనని ఈ సందర్భంగా ఖాదర్ అన్నారు. -
20 రోజుల పసికందుకి పెళ్లి. అఫ్గాన్లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు
పొత్తిళ్లలో పసిపాప... ఓ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. అవును 20 రోజుల ఈ పసికందుకు పెళ్లి చేసేశారు. అఫ్గాన్లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు. తాలిబన్ల వశమయ్యాక అఫ్గాన్ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చేయడానికి పనిలేదు. తినడానికి తిండి లేదు. పసిపిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఆకలి పేగుబంధాన్ని సైతం జయించేసింది. చేసేదేం లేక చిన్నారులను, పసికందులను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో విక్రయిస్తున్నారు. తమ దగ్గర ఉండి ఆకలితో చచ్చేకంటే... ఏదో ఒకచోట వాళ్లు బతికుంటే చాలంటున్నారు. ఈ బాలిక ఏడేళ్ల జోహ్రా. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటోంది. కానీ తనను కొనుక్కున్న వ్యక్తి వచ్చి ఎప్పుడు పట్టుకెళ్తాడోనన్న భయంతో బతుకుతోంది. తండ్రి రోజూవారి కూలీ. అంతకుముందు తినడానికి తిండైనా ఉండేది. కానీ అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఒక్క జోహ్రానే కాదు.. ఐదేళ్ల మరో కూతురినీ అమ్మేశాడు తండ్రి ఖాదిర్. చదవండఙ: మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక ఈమె పేరు నోరా. 8 ఏళ్లు. తండ్రి పేరు హలీమ్. మరో నెల రోజుల్లో నోరాను అమ్మేస్తానని హలీమ్ తన చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఉంచాడు. ఓ రూ. 80 వేలైనా వస్తాయని, కొన్ని రోజులకు తిండికి సరిపోతాయని చెబుతున్నాడు. ఆకలితో అల్లాడి చనిపోయేలా ఉన్నామని, ఇంకో దారి కనిపించట్లేదని బోరుమంటున్నాడు. అల్లాడుతున్న అఫ్గాన్.. అఫ్గనిస్తాన్లో ఇది ప్రతి పేదింటి కథ. ఆగస్టులో తాలిబాన్లు చేజిక్కించుకున్నాక అక్కడి పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉన్న అఫ్గాన్ సర్కారు ఆస్తులు, డబ్బులను ఆ దేశాలు ఫ్రీజ్ చేశాయి. ఆ దేశానికి అందే సాయమూ ఆగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పనులు లేకుండా పోయాయి. చాలా మందికి ఉద్యోగాలూ పోయాయి. ఎంతో మందికి జీతాలు కూడా ఆగిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. తిండి దొరకడమూ కష్టమైంది. దీనికితోడు ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పని కోసం, తిండి కోసం పేద ప్రజలు అల్లాడుతున్నారు. చదవండి: టైటానిక్ ఓడను చూడలనుకుంటున్నారా.. టికెట్ రూ.కోటి 87 లక్షలే చిన్నారి పెళ్లికూతుళ్లు.. పేదరికం పెరగడం, పనుల్లేకపోవడంతో ఆకలికి అల్లాడుతున్న తమ కుటుంబాలను చూడలేక చాలా మంది అఫ్గానీలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముతున్నారు. 20 రోజుల పిల్లల నుంచి 18 ఏళ్ల అమ్మాయిల వరకు ఎదురుకట్నం తీసుకొని పెళ్లి చేసుకునేందుకు ఇచ్చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే చిన్నారులను ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు కింద పిల్లల్ని అప్పజెప్పేస్తున్నారు. అద్దె కట్టలేదని ఓ వ్యక్తి 9 ఏళ్ల కూతురును ఇంటి యజమాని తీసుకెళ్లాడని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. వాయవ్య అఫ్గాన్లో ఓ వ్యక్తి తన ఐదుగురు పిల్లలకు తిండి పెట్టలేక మసీదు దగ్గర వదిలేశాడని తెలిపారు. మున్ముందు 97% మంది పేదరికంలోకి.. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు అఫ్గాన్లో అధికారికంగా పెళ్లి వయసు 16 ఏళ్లు. తాలిబన్లు రాకముందు కూడా దేశంలో బాల్య వివాహాలున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా ఇవి పెరిగిపోయాయి. మున్ముందు ఇవి రెండింతలయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 20 రోజుల పిల్లలను కూడా మున్ముందు పెళ్లి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసిందని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచంలో అతిదారుణమైన మానవ సంక్షోభాన్ని అఫ్గాన్ ఎదుర్కుంటోందని యునిసెఫ్ తెలిపింది. 2022 మధ్య కల్లా దేశంలోని 97 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మేమున్నామంటున్న యునిసెఫ్.. స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యం పంజరంలో బందీ అయిపోతోంది. పెళ్లి చేసుకున్న ఆ చిన్నారి బాలికలను పని వాళ్లుగా, బానిసలుగా చూస్తారు. ఆ పిల్లల, మహిళల కన్నీటి బాధలు చూసిన యునిసెఫ్ సాయానికి ముందుకొచ్చింది. అక్కడి ప్రజల కోసం ఇప్పటికే నగదు సాయం కార్యక్రమం మొదలు పెట్టామని వెల్లడించింది. ఇతర దేశాలూ సాయం చేయాలని కోరుతోంది. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దని మత పెద్దలకు చెబుతోంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
శిశువులపై శ్రీమతి కన్ను పడితే అంతే
మైసూరు: మైసూరు జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న శ్రీమతి అనే మహిళ బాగోతం బయటపడింది. ఎస్పీ చేతన్ గురువారం మీడియాతో మాట్లాడారు. నంజనగూడులో ఇటీవల ఒక చిన్నారి మిస్సయింది. పేద వితంతు మహిళ మూడు నెలల బిడ్డను శ్రీమతి అనే మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. ఈమె పేదలు, యాచకులను కలిసి మీ పిల్లలను తన వద్ద ఉన్న ఆశ్రమంలో చదివించి మంచిగా చూసుకుంటానని తీసుకుని వెళ్లి పిల్లలు లేనివారికి డబ్బులకు విక్రయించేది. ఇటీవల ఒక చిన్నారిని తీసుకెళ్లి రూ. 3 లక్షలకు అమ్మేసిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు శ్రీమతి కోసం గాలిస్తున్నారని, అతి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
వైరల్గా మారిన బాతు, పిల్లల దాగుడుమూతల వీడియో
చిన్నపిల్లలు దాగుడుమూతలు ఆడటం మనం చూసుంటాం. కాకపోతే ఈ వీడియోను చూస్తే మాత్రం.. ఈ ఆట కేవలం మనుషులకు మాత్రమే కాదు, బాతులు కూడా ఆడుకుంటాయా? అనిపిస్తుంది. అలాంటి ఫన్నీ వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. జంతువుల ఆటలు, సరదాగా చేసిన పనుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బాతు, తన పిల్లల వీడియో విషయానికి వస్తే.. 24 సెకన్ల నిడివ గల ఈ వీడియోలో.. నీటి కొలనులో ఉన్న బాతు పిల్లలు తన తల్లి దగ్గరికి వెళ్తుంటాయ్. అవి అలా దగ్గరకు వెళ్లిన ప్రతీసారి తల్లి బాతు తన పిల్లలకు కనపడకుండా నీటిలో మునిగి దాక్కుంటోంది. ఇలా మూడు సార్లు తన పిల్లలతో ఆ తల్లి బాతు ఆటలాడుతుంది. చూడటానికి అచ్చం మన పిల్లలు ఆడే హైడ్ అండ్ సీక్ లానే ఉన్న ఈ సరదా వీడిలో చాలా ఫన్నీగా ఉండడంతో సోషల్ మీడియా యూజర్లకు వీపరీతంగా నచ్చేసింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్తో దూసుకుపోతోంది. తన పిల్లలకు నీటిలో ఎలా మునగాలో తల్లి ట్రైనింగ్ ఇస్తుందని కొందరు, మనషుల నుంచి ఎలా తప్పించుకోవాలో తర్ఫీదునిస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాతృ దేవో భవ.. తల్లే తొలి గురువు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Mommy playing seek and hide.. 😅 pic.twitter.com/ewWivaghfa — Buitengebieden (@buitengebieden_) June 29, 2021 చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. -
కన్న తల్లికే షాక్.. ఒకే కాన్పులో 9 మంది సంతానం
మాలి: సాధారణంగా ఒకే కాన్పులో కవలలో , లేక ముగ్గురికి జన్మనిస్తేనే వింత అనుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా. ఈ ఘటన మాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాలికి చెందిన హలీమా సిస్సి (25) మంగళవారం 9 మందికి సంతానానికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆమెకు డెలివరీ చెయడానికి ఇద్దరు డాక్టర్లకు పైనే శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఒకే డెలివరీలో తొమ్మిది మంది పుట్టడంతో ఈ వార్త ఆ దేశ నాయకుల వరకు వెళ్లింది. ’పుట్టిన 9 మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి, తొమ్మిది పిల్లలు క్షేమంగానే ఉన్నారిని.. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సీబీ తెలిపారు. స్కానింగ్ సమయంలో ఎక్కువ మందికి సంతానం కలిగి ఉన్నానని డాక్టర్లు చెప్పారు. వారి అంచనా ప్రకారం బహుశా ఉంటే ఏడుగురు సంతానం ఉండొచ్చని ఆ మహిళ భావించిందట. కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది. ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం సిజేరియన్ ద్వారానే చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ( చదవండి: గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ ) -
రెండేళ్ల పరిచయం.. 105 మంది పిల్లలు కావాలి!
ఆమె వయసు 23. ఆయనకు 56. ఆమె తన ఆరేళ్ల కూతుర్ని వెంటపెట్టుకుని నల్ల సముద్ర తీర ప్రాంతంలో విహారానికి వెళ్లినప్పుడు తొలిసారి ఆయన్ని చూసింది. ఆయన తనను చూసి ‘హాయ్’ అన్నప్పుడు ఆ కళ్లలో తనపై కనిపించిన ప్రేమను చూసింది. ఆమె సింగిల్ మదర్. ఆయన పెళ్లయిన పెద్ద మనిషి. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ‘ఏదైనా కోరుకో హృదయేశ్వరీ..’ అని భార్యకు వరమిచ్చాడు భర్త. ఆయన బిలియనీర్. అందుకు వరం ఇవ్వడం కాదు. ఆమె మీద ఆయనకు ఉన్న ప్రేమ అంతకన్నా సంపన్నమైనది! ‘‘నాకు 105 మంది పిల్లలు కావాలి..’’ అందామె! దానర్థం.. ‘‘నిన్నే కోరుకున్నా.. నీ ప్రతి రూపాలే నాకు నూటా అయిదు కావాలి’’ అని. గత ఏడాదిలో వాళ్లకు పది మంది పిల్లలు పుట్టారు. మిగతా పిల్లల్ని కొంత గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకుంటుందట ఆమె. ఇక్కడ చూడండి.. పిల్లల్లో పిల్లలా కలిసిపోయి ఆ తల్లి ఎలా నవ్వులు చిందిస్తోందో!! ఆ ఇరవై మూడేళ్ల అమ్మాయి పేరు క్రిస్టీనా ఆజ్టర్క్. ఇక నుంచి క్రిస్టీనా అందాం. రష్యన్ తను. మాస్కోలో ఉండేది. ఆ యాభై ఆరేళ్ల పెద్దాయన పేరు గాలిప్ ఆజ్టర్క్. ఇక నుంచి గాలిప్ అందాం. జార్జియా తనది. ఒకప్పుడు రష్యన్ భూభాగం. ఇప్పుడు ప్రత్యేక దేశం. ఆ దేశంలోని నల్ల సముద్ర తీరప్రాంతమైన బటూమీ పట్టణంలో ఉంటారు ఆయన. ట్రావెల్ మేగ్నెట్. కనుక మిలియనీర్. దేవుడు ఎలా కలుపుతాడో చూడండి. ఇద్దర్నీ కలిపాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు బటూమీలో ఉంటున్నారు. భర్త ఎక్కడుంటే అక్కడే కదా భార్య ఉండేది. అందుకే మాస్కో నుంచి తన ఆరేళ్ల కూతురు వికాతో పాటు గాలిప్ దగ్గరికి వచ్చేసింది క్రిస్టీనా. ఇప్పటి వరకు ఇదంతా ఒక మామూలు విషయం. లోకంలో అనేకం ఉంటాయి.. ‘నువ్వాదరిని, నేనీదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనుకునే జంటలు. వీళ్ల స్టోరీ ప్రత్యేకమైనది. ఆసక్తి కలిగించేది. అయితే స్టోరీ మొత్తం చదివినా సమాధానం లభించని రెండు ప్రశ్నలైతే మీకు మిగిలిపోతాయి. క్రిస్టీనాకు పదిహేడేళ్ల వయసుకే పుట్టిన కూతురు ‘వికా’ కు తండ్రి ఎవరన్నది, గాలిప్ భార్యా బిడ్డలు ఎవరన్నది. ఈ దంపతులు ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు కనుక అడిగి బలవంత పెట్టడం మర్యాద కాదు. ప్రస్తుతం అయితే వీళ్లకు పదిమంది పిల్లలు! వికా తో కలిపి పదకొండు మంది. ఇక కథలోకి వెళ్దాం. పిల్లల్లో ఒకరిగా క్రిస్టీనా క్రిస్టీనాకు, గాలిప్కు పరిచయం అయింది రెండేళ్ల క్రితమే. కూతుర్ని తీసుకుని మాస్కో నుంచి నల్ల సముద్రానికి విహారానికి వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న ఆ ఇసుకలో వారి చూపులు కలిశాయి. ‘నాకనిపించిందీ.. తను నా కోసమే పుట్టింది’ అని ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు గాలిప్. ఇక క్రిస్టీనా అయితే ‘ఆయనలో తెలియని ఆకర్షణ ఏదో నన్ను ఆయన వైపు లాగేసింది’ అంటారు. కాబట్టి.. వయసును పక్కన పెట్టి చూస్తే వీళ్లు చూడచక్కని జంట. ఆయనకు ఆస్తులు, అంతస్తులు, ఇంకా అలాంటివేవో కోట్ల కొద్దీ ఉన్నాయి. కానీ క్రిస్టీనా.. ‘నిన్నే కోరుకున్నా’ అన్నారు. ‘నన్ను సరే, ఏదైనా కోరుకో’ అన్నారు ఆయన. దేవుడు వరం ఇస్తానంటే మొహమాటపడాలి. భర్త వరం ఇస్తానంటే ఎగిరి భుజంపై కూర్చోడానికి వెనకాముందూ చూడక్కర్లేదు. ‘నీలాంటి పిల్లలు కావాలి. వంద మంది కావాలి. వంద మంది కాదు. వందా ఐదు మంది’ అంది క్రిస్టీనా. ‘ఓ బేబీ’ అని మురిసిపోయారు గాలిప్. ‘అదేం లెక్కా.. వన్నాట్ వైఫ్’ అని ఆయనేం ఆశ్చర్యపోలేదు. ‘ఓకే.. ప్లాన్ చేద్దాం’ అన్నారు. ప్లాన్ చేస్తే అయ్యే పనా! అయినా ప్లాన్ చేశారాయన. పదిమంది సరోగేట్ మదర్స్ని వెదికి రెండేళ్ల వ్యవధిలో పదిమంది బిడ్డల్ని ఆమె చేతికి అందించాడు. అండం ఆమెది. శుక్రకణం అతడిది. గర్భం వేరే స్త్రీది. ఇప్పుడా ఇల్లు క్రిస్టీనా సొంత కూతురు విగాతో, పాటు గాలిప్తో కలిగిన పది మంది శిశువుల కేరింతలతో బెలూన్లు ఎగురుతున్నట్లుగా కళకళలాడుతోంది. మొదటి బిడ్డ ముస్తాఫా 2020 మార్చి 10 పుట్టాడు. పదో బిడ్డ ఒలీవియా 2021 జనవరి 16 న పుట్టింది. మరి క్రిస్టీనా కోరుకున్న వరంలోని మిగతా 95 మంది మాటేమిటి! ‘కాస్త ఆగుతాను’ అంటోంది క్రిస్టీనా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ. మొదటైతే.. ‘ఏడాదికో బిడ్డను కంటాను..’ అని పట్టింది. క్రిస్టీనా. గాలిప్ ఒప్పుకోలేదు. ‘మన బిడ్డలే కదా నీకు కావలసిందీ’ అని సరోగసీ ఐడియా చెప్పారు. పిల్లల కోసం కొని పెట్టిన పుస్తకాలతో క్రిస్టీనా, ∙భర్తతో క్రిస్టీనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయా చొప్పున పదిమంది ఆయాలు ఉన్నారు! వాళ్లందరి సంరక్షణను వారికే అప్పగించింది క్రిస్టీనా. అయితే తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. అందరికీ ఒకటే నిద్ర టైమ్. రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు. అలా వారికి అలవాటు చేయించింది. శిశువుల్లో కవలలు, ఒకే పోలికలు ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. ‘హూ ఈజ్ హూ..’ అన్నది పేర్లతో చెప్పేస్తుంది క్రిస్టీనా. ‘వంద మంది పిల్లలైనా కనిపెట్టేస్తాను’ అని నవ్వుతూ అంటోంది తను. ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటోంది. ‘పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడం తేలికైన సంగతి కాదు. ఈ పది మందీ కొంచెం పెద్దయ్యాకే మరికొంత మంది పిల్లల కోసం ప్రయత్నిస్తాను’’అంటోంది. ఆరేళ్ల కూతురుకి కూడా ఆ పిల్లల చిన్నచిన్న పనులు అప్పజెబుతోంది. ఇక పిల్లలకు ఏం చదివి వినిపించాలి, ఏ వేళకు వారికి ఏ పని చేయాలి అనేవి క్రిస్టీనానే ఆయాలకు చెబుతంటుంది. ఏడుస్తున్న పిల్లల్ని మాత్రం ఆయాలను ఎత్తుకోనివ్వదు. తనే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. ఫుడ్డు కూడా గ్రాముల్లోనే. ఒక గ్రాము తక్కువా కాదు. ఒక గ్రాము ఎక్కువా కాదు. ఆయాలకు ఇంకొక పని కూడా ఉంది. తడిసిన డయపర్లను ఫొటో తీయడం. ఆ తడి కలర్ని బట్టి బిడ్డల ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది క్రిస్టీనా. ప్రతి శిశువుకూ ఒక డైరీ ఉంటుంది. అందులో ఆ శిశువు వివరాలన్నీ ఏ రోజుకారోజు ఆయాలు నోట్ చేస్తుంటారు. వాళ్లేం తిన్నారు, ఎంత తిన్నారు, ఎన్ని గంటలకు నిద్రలోకి ఒరిగిపోయారు, తిరిగి ఎన్ని గంటలకు నిద్ర లేచారు. మధ్యతో ఎన్నిసార్లు మేల్కొన్నారు.. ఇలా ప్రతి వివరమూ ఉంటుంది. ఇటీవల క్రిస్టీనా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘మా ఇల్లు నందనవనం, ప్రశాంత నిలయం. నేనూ నా భర్త ఇంట్లో సినిమాలు, కార్టూన్ షోలు చూస్తాం. పిల్లలకు పెట్టం గానీ మేమిద్దరం జంక్ఫుడ్ తింటాం.. (ఆ ఆరేళ్ల పిల్లకు కొద్దిగా పెడతారేమో!), బ్యాక్గామన్ గేమ్ ఆడతాం.. ఇంకా పిల్లలందరితో కలిసి వాకింగ్ చేస్తాం..’’ అని షేర్ చేసుకున్నారు. నిజంగా పంచుకుంటే పెరిగే సంతోషమే ఇది. పిల్లలు, పిల్లల్లాంటి పెద్దలు ఎక్కడున్నా వారి ప్రేమ వెలుగులు భూగోళమంతా ప్రసరిస్తూ ఉంటాయి. -
కవలలను ఎత్తుకెళ్లిన కోతులు.. ఆతర్వాత ఏం చేశాయంటే..
చెన్నై: తమిళనాడులోని తంజాపూర్లో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి, అందులో ఒక పసి పాపను నీళ్లలో పడేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వరి అనే మహిళకు 8 రోజుల కిందట ఇద్దరు కవల పిల్లలు(అమ్మాయిలు) జన్మించారు. శనివారం ఇద్దరు శిశువులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వానర గుంపు ఇంటిపైకి చేరి, పెంకులు తొలగించి మరీ పసి బిడ్డలను ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన భువనేశ్వరి కేకలు వేయడంతో కోతుల గుంపు ఒక పాపను అక్కడే పడేసి వెళ్లి పోయింది. తల్లి ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు స్పందించి, ఇంటి పైకప్పుపై ఉన్న పడివున్న చిన్నారిని రక్షించారు. మరో పాప కోసం గాలిస్తుండగా సమీపంలోని నీటిలో చిన్నారి శవమై కనిపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ కేంద్రంగా పసికందుల విక్రయం
-
ఆస్పత్రి మాటున అరాచకం
సాక్షి, విశాఖపట్నం: వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన ముప్ఫై నాలుగేళ్ల వయసు గల మహిళ భర్త చనిపోయాడు. మరొకరితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఈ వ్యవహారం ఆశా కార్యకర్తలు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణకు తెలిసింది. ఇంకే ముంది వారు ఏజెంట్ అర్జిరామకృష్ణకు సమాచారం ఇచ్చారు. తర్వాత వీరు ముగ్గురూ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని నమ్మించారు. దీనికి సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆస్పత్రిలో సుందరమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారికి విక్రయించారు. చైల్డ్లైన్కు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం పొందేది. అక్కడ అంగన్వాడీ టీచర్ గుంటు సరోజిని ఆ మహిళ డెలివరీ విషయాన్ని తెలుసుకొని బిడ్డ విషయాన్ని అడిగింది. అందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అంగన్వాడీ టీచర్కు అనుమానం వచ్చి ఈ ఏడాది మార్చి 14న చైల్డ్లైన్కు సమాచారం అందించింది. దీనిపై చైల్డ్లైన్ సిబ్బంది విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకువచ్చారు. చైల్డ్లైన్ సిబ్బంది బేబీని శిశుగృహలో చేర్పించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప్రస్తుత కేసుతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి ముసుగులో పసిపిల్లల విక్రయాలు : సీపీ ఆర్కే మీనా చైల్డ్లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆర్కే మీనా చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో సీపీ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. పిల్లలను విక్రయిస్తున్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రతతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లను, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను, పసిబిడ్డను కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిపి 8 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ ఏ2, ఏ3లుగా, ఏజెంట్గా వ్యవహరించిన అర్జి రామకృష్ణను ఏ4గా, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను ఏ5గా, ఎండీ దగ్గర పనిచేస్తున్న లోపింటి చంద్రమోహన్ను ఏ6గా, పసికందును కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరిని ఏ7, ఏ8గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎండీపై ఇప్పటికే రెండు కేసులు డాక్టర్ పచ్చిపాల నమ్రత జిల్లా పరిషత్ ప్రాంతంలో సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్ను ప్రారంభించారు. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతాలో నాలుగు బ్రాంచ్లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునే వారు. ఆశా వర్కర్లనే ఆ బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రత తన నెట్వర్క్ను విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసిన వారు తల్లిదండ్రులుగా, తమ ఆస్పత్రిలోనే డెలివరీ అయిన విధంగా ఆ పసికందుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను సైతం ఇప్పిస్తూ వస్తున్నారు. ఇదే విధంగా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన మహిళను కూడా నమ్మించి మార్చి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆమె మగబిడ్డను జన్మనివ్వడంతో ఆ పసికందును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులకు విక్రయించారు. ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ పర్యవేక్షణలో మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, గాజువాక క్రైం సీఐ పి.సూర్యనారాయణ, హార్బర్ సీఐ ఎం.అవతారం, మహారాణిపేట ఎస్ఐ పి.రమేష్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. -
సృష్టి హాస్పటల్దే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ ప్రాంతంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నమ్రతను ఆమెకు సహకరించిన మరో వైద్యురాలు తిరుమల, ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ, పసికందును కొనుగోలు చేసిన తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. (ఆస్పత్రి మాటున అరాచకం) ► విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన జలుమూరి సుందరమ్మ(34) అనే మహిళకు భర్త చనిపోయాడు. మరొకరితో సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ► ఈ విషయం తెలుసుకున్న అదే మండలానికి చెందిన ఆశా కార్యకర్తలు, ఏజెంట్ అర్జి రామకృష్ణ సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు. ► సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్ సృష్టి హాస్పిటల్లో చేర్చగా.. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ► ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిన తరువాత ఆస్పత్రి ఎండీ నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్కు చెందిన దంపతులకు విక్రయించారు. ► సుందరమ్మ గర్భవతిగా ఉండగా వి.మాడుగుల మండలంలో ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందేది. అక్కడి అంగన్వాడీ టీచర్ సరోజినికి సుందరమ్మ బిడ్డ విషయమై అనుమానం వచ్చి మార్చి 14న చైల్డ్లైన్కు సమాచారం ఇచ్చింది. ► చైల్డ్లైన్ సిబ్బంది విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకొచ్చి శిశు గృహలో చేర్పించారు. ► అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పసికందుల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ► డాక్టర్ నమ్రతను కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో అరెస్ట్ చేశామని, ఏజెంట్ అర్జి రామకృష్ణ, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులతోపాటు ముఠాలో మిగిలిన నలుగురినీ అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ చెప్పారు. -
ఒకే కాన్పులో అయిదుగురు శిశువుల జననం
లక్నో : ఒకే కాన్పులో ఓ మహిళ అయిదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఆశ్చర్య సంఘటన గురువారం ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. సురత్గంజ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో అనిత అనే మహిళకు ఒకేసారి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ విషయంపై మహిళ భర్త కుందన్ మాట్లాడుతూ..తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారన్నారు. తమ కుటుంబంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ప్రస్తుతం వైద్యులు తన భార్యను బారబంకి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా మహిళకు ఇది రెండవ సంతానం. మొదటగా ఆమెకు ఓ కొడుకు జన్మించాడు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..) -
జపాన్ విమానాల్లో కొత్త ఫీచర్
టోక్యో : మనం బస్సులోగానీ రైళ్లోగానీ ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్లోని బేబీ ఏడ్చినా, అల్లరి చేసినా మనకు చికాగు వేస్తుంది. ఒక్కోసారి ఏమిటీ నరకం అని కూడా అనిపిస్తుంది. అలాంటి అనుభవం విమానంలోనే ఎదురైతే విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది అస్సలు తట్టుకోరు. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని కోరుకునే వారి కోసం జపాన్ ఎయిర్ లైన్స్ (జేఏఎల్) టిక్కెట్ల రిజర్వేషన్ బుకింగ్లో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. టిక్కెట్ బుకింగ్ అప్పుడు రెండేళ్ల లోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ ఓ పిల్లల ఐకాన్ కనిపిస్తుంది. దాంతో ఆ సీటును వదిలేసి ఖాళిగా ఉన్న సీట్లలో మనం ఎక్కడ కూర్చోవాలో ముందుగానే నిర్ణయించుకొని టిక్కెట్ బుక్చేసుకోవచ్చు. అందుకు ‘సీట్ అరెంజ్మెంట్’ చార్ట్ ఉపయోగపడుతుంది. అలాగే ఎనిమిది రోజుల బేబీ నుంచి రెండేళ్ల లోపు బేబీలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్’ చూపిన సీటునే ముందుగా బుక్ చేసుకోవాలి. పిల్లలను తీసుకొచ్చిన వారికి మాత్రం తలనొప్పులు తప్పవు. ఈ ఫీచర్ గురించి తెలుసుకున్న ప్రయాణికులు మాత్రం ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
డిజైనర్ బేబీ దుమారం!
మూడేళ్ల క్రితం తాము పిండంలో మార్పులు చేశామని చైనా ప్రకటించడం ఎంత సంచలనం సృష్టించిందో... తాజాగా డిజైనర్ బేబీల ప్రకటన కూడా అంతే స్థాయిలో వివాదం సృష్టిస్తోంది. జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ టెక్నాలజీని ఇలా డిజైనర్ బేబీల సృష్టికి అస్సలు వాడకూడదని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ తాజాగా చైనా శాస్త్రవేత్త హే జియాంకుయ్ పట్టించుకోకుండా ఇద్దరు చిన్నారులను పిండందశలో జీన్ ఎడిటింగ్ చేపట్టడం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల నుంచి హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకకుండా పిండంలోని డీఎన్ఏలో సీసీఆర్5 ప్రొటీన్ను తొలగించామని ప్రకటించి హే ఇప్పటికే కలకలం రేపారు. దీనిపై శాస్త్రవేత్తల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రయోగాల కారణంగా మరో శక్తిమంతమైన జాతి ఉద్భవించి మానవజాతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మెజారిటీ శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా నయంకాని వైరల్ వ్యాధులతో పాటు వారసత్వంగా సంక్రమించే రోగాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకునే కోణంలో ఈ ప్రయోగాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రయోగాలను గతంలోనే నిషేధించామని చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్పింగ్ తెలిపారు. వెయ్యి నైపుణ్యాల ప్రణాళిక... పదేళ్ల క్రితం చైనా ‘1000 టాలెంట్స్ ప్లాన్’ పేరుతో ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లో స్థిరపడి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న చైనీస్ సంతతి ప్రజలను ఆకర్షించి స్వదేశానికి రప్పించేలా ప్రణాళిక రచించింది. తద్వారా చైనాను అన్ని రంగాల్లో పరుగులు పెట్టించాలని కమ్యూనిస్ట్ అధినాయకత్వం భావించింది. ఇందులో భాగంగానే అమెరికాలో పనిచేస్తున్న డా.హే జియాంకుయ్ చైనాకు చేరుకుని బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేపట్టారు. అయితే క్రిస్పర్ సాంకేతికతతో హే చేసిన ప్రయోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డేవిడ్ బాల్టీమోర్ మాట్లాడుతూ..‘పిండం స్థాయిలో మార్పులు జరుగుతాయి కాబట్టి అవి భవిష్యత్తు తరాలకూ అందుతాయి. దీనివల్ల కొంతకాలం తరువాత ఇప్పటివరకూ ఉన్న జన్యు సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ టెక్నాలజీతో ప్రమాదాలూ లేకపోలేదు. జన్యుక్రమంలో చేసే మార్పులు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. జన్యు మార్పిడి లేదా జీన్ ఎడిటింగ్ సాయంతో కొన్ని రకాల వ్యాధులను నిరోధించగలిగినా.. అనూహ్యంగా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. హే చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరి శరీరంలో మానవుల కంటే భిన్నమైన కణాలు ఉన్నట్లుగా వెల్లడైంది. పిండం స్థాయిలో మార్పులు చేయడం ఖరీదైన వ్యవహారం కాబట్టి హెచ్ఐవీ వంటి వ్యాధులు ఎక్కువగా ఉండే పేద దేశాల్లో ఈ సాంకేతికతను వాడలేరు. అంతేకాదు. కొన్నితరాలపాటు ప్రభావం చూపగల ఇలాంటి చర్యలకు మనిషి గతంలో ఎన్నడూ పాల్పడలేదు’ అని తెలిపారు. అయితే ఈ భయాలను హే జియాంకుయ్ కొట్టిపారేస్తున్నారు. పారిశ్రామిక విప్లవం కారణంగా మానవజీవితంలో పెనుమార్పులు వచ్చాయనీ, అందుకు అనుగుణంగానే వ్యాధులు కూడా పెరిగాయని గుర్తుచేస్తున్నారు. వ్యాధికారక జన్యువులను సరిచేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం ద్వారా వచ్చే సమస్యలను అధిగమించి మెరుగైన జీవితం జీవించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రయోగానికి అనుమతి లేదు డా. హే జియాంకుయ్ చేపట్టిన జన్యువుల మార్పిడి ప్రయోగానికి తాము ఆమోదం తెలపలేదని చైనాలోని షెంజెన్ హార్మనీకేర్ విమెన్, చిల్డ్రన్ హాస్పిటల్ తెలిపింది. ఈ ప్రయోగ అనుమతి పత్రాలు ఫోర్జరీవి కావచ్చంది. మనిషి నైతికతను ఉల్లంఘించే ప్రయోగాలకు తాము వ్యతిరేకమని తెలిపింది. డా.హే చేపట్టిన ప్రయోగాన్ని ఖండిస్తూ చైనాకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు బహిరంగ లేఖను విడుదల చేశారు.అంతర్జాతీయంగా చైనా బయోమెడికల్ రంగానికి తలవంపు తెచ్చేలా డా.హే వ్యవహరిం చారన్నారు. భవిష్యత్లో ఇలాంటి వినాశకర ప్రయోగాలు జరగకుండా కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై చైనా శాస్త్ర,సాంకేతిక శాఖ సహాయమంత్రి జు నాన్పింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయోగాలను చైనాలో నిషేధించామని స్పష్టం చేశారు. 14 రోజుల వయస్సున్న పిండంలోని మూలకణాలపై పరిశోధనలు నిర్వహించేందుకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందన్నారు. -
హెల్దీ బేబీస్..
ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఆఫ్ ఉలవపాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆరోగ్య పోటీలు నిర్వహించగా 110 మంది పాల్గొన్నారు. పీడియాట్రిక్ వైద్యుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను సోమవారం ప్రకటించారు. బేబీ ఆఫ్ ఉలవపాడు మేల్ విభాగంలో దామతోటి శ్రావణ్ కుమార్, ఫిమేల్ విభాగంలో పల్లకి చేత్రప్రియ విజేతలుగా నిలిచారు. వైద్యశాల సూపరింటెండెంట్ శోభారాణి, బ్రహ్మయ్య బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో 11 మంది పిల్లలకు బహుమతులిచ్చారు. టీకాలు వేస్తున్న సమయం, బరువు, తల్లితండ్రుల ఆరోగ్య సూచనలు, పిల్లల ఆరోగ్యం ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు వైద్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కరీమ్.. విటమిన్ డ్రాప్స్ అందజేశారు. కార్యక్రమంలో దంతæ వైద్యులు సురేష్, యూనియన్ నాయకులు అల్తాఫ్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
అతని ఇంట్లో 111 పాము పిల్లలు
భువనేశ్వర్ : కొన్ని ఘటనలు మన చుట్టే జరుగుతున్న అవి బయటపడే వరకు కూడా మనకు తెలియదు. తాజాగా ఒరిస్సాలోని శ్యాంపూర్ గ్రామంలో జరిగిన సంఘటన ఇలాంటిదే. భుయాన్ అనే వ్యవసాయ కూలీ ఇంట్లో 111 పాము పిల్లలు శనివారం వెలుగుచూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు భయాందోళనకు గరైనారు. అయినప్పటికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని ఆ వింతను చూడసాగారు. అటవీ అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు అక్కడికి చేరుకుని 111 పాము పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అక్కడ 26 పగిలిన పాము గుడ్లు మాత్రమే కన్పించడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి పాముల గురించి వెతకడం ప్రారంభించారు. భుయాన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భుయాన్ ఇంట్లో నాలుగు అడుగుల ఎత్తు, రెండగుల వెడల్పుతో ఒక పాము పుట్ట ఉన్నప్పటికీ వారు దానికి పూజలు చేస్తుండేవారని తెలిసింది. అప్పుడప్పుడు పాములు కన్పించినప్పటికీ అవి తమకు హాని చేయలేదని భుయాన్ చెప్పాడు. అందులో ఎన్ని పాములున్నాయో తమకు తెలియదని ఆయన తెలిపాడు. పాముల సంరక్షకులు షేక్ మీర్జా మాట్లాడుతూ.. ‘శనివారం ఉదయం తనకు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లాను. నేను వెళ్లాకా అక్కడ రెండు పాము పిల్లల్ని నెలపై ఉండటం చూశాను. ఆ తర్వాత పుట్టను త్రవ్వగా పెద్ద మొత్తంలో పాము పిల్లలు బయటికొచ్చాయి. సాయంత్రం కూడా మరో రెండు నాగుపాము పిల్లలు బయటికొచ్చాయి. కానీ తల్లి పాముల అచూకీ మాత్రం కన్పించలేదు’ అని తెలిపారు. ఈ ఘటనపై మల్లిక్ అనే జంతు ప్రేమికుడు మాట్లాడుతూ.. ‘ఒక పాము సాధారణంగా 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది. దానిని పొదగడానికి 60 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. అలా చూస్తే.. ఇక్కడ ఎన్ని పాములు ఉన్నాయి.. ఉంటే అన్ని పాములు ఒకే సారి గుడ్లు పెట్టాయా.. అన్ని ఒకే సారి పొదిగాయా.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అక్కడ 26 పాము గుడ్ల అనవాళ్లు మాత్రమే లభించాయి. మిగిలిన పాము పిల్లలు ఏలా వచ్చాయి. అటవీ శాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు. అధికారులు మాత్రం అక్కడ దొరికిన పాము పిల్లల్ని జనవాసాలకు దూరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వెల్లడించారు. -
పాల మనసులు
ఆ పాపకు అమ్మ లేదు. వారంత అమ్మ అయ్యారు. నాన్న విడిచి పెట్టాడు. అక్కడి సిబ్బందే నాన్న అయ్యారు. అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు ముఖ్యం. వెచ్చని ఒడి ముఖ్యం. దగ్గరకు తీసుకునే భద్రత అవసరం. అవన్నీ వారే అయ్యారు. సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడిన వారి మనసులో ఉన్నది స్వచ్ఛమైన పాల వంటి కరుణ. కష్టాల కడలిలో ఉండాల్సిన పాపను పాల కడలిపై ఉంచినగొప్ప మనసులు వారివి. ఆసుపత్రికి అంటే చాలా సందర్భాల్లో నిర్లక్ష్యానికీ, నిర్దాక్షిణ్యానికి మారుపేరు అనే ప్రచారం ఉంది. కాని ఆ ఆసుపత్రి గురించి వింటే ముఖ్యంగా అందులోని ఆ విభాగం గురించి తెలుసుకుంటే కరుణ ఇంకా మనిషిలో మిగిలే ఉందనీ మానవత్వం సజీవంగా ఉందని తెలుసుకుంటాం. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలోని ‘స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్’ (ఎస్.ఎన్.సి.యు) గత సంవత్సరంగా ఒక పాపాయిని తన యూనిట్లో కంటికి రెప్పలా కాపాడుతోంది. పెంచి పెద్ద చేస్తోంది. ఊపిరి పోసి, ఉయ్యాలలూపి నేడు ప్రభుత్వానికి అపురూపంగా అప్పజెప్పనుంది. ఇది మానవత్వానికి మెచ్చుతునక. ఆ తల్లి ఆ బిడ్డ... ఏడాది క్రితం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అనురాధ కాన్పుకోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 2017 ఫిబ్రవరి 2న కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడశిశువులు. కాని ప్రిమెచ్యూర్ డెలివరీ కావడంతో శిశువులు తక్కువ బరువుతో జన్మించారు. మరుసటిరోజు ఒక ఆడశిశువు మరణించగా, మూడవ రోజున తల్లి కూడా రక్తస్రావంతో చనిపోయింది. ప్రాణంతో ఉన్న శిశువును తండ్రి విడిచి పెట్టి వెళ్లిపోయాడు. 900 గ్రాముల బరువుతో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న ఆ చిన్నారిని వేరే ఎక్కడైనా అయితే ఎలా చూసేవారో. కాని ఆ చిన్నారికి మాత్రం ఎస్.ఎన్.సి.యునే అన్నీ అయ్యింది. నవీనగా నామకరణం పాప ఆరునెలల వయసుకు మూడు కిలోల బరువుకు చేరుకుంది. ఆరునెలల తరువాత ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారిని శిశు గృహాలకు అప్పగించే అవకాశం ఉంటుంది. కానీ చిన్నారికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండటం ఒక కారణమైతే చిన్నారిపై పెంచుకున్న మరో కారణం కావడాన యూనిట్ నర్సులు, సిబ్బంది పాపను పంపించలేకపోయారు. అంతేకాదు చిన్నారికి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి నవీనగా నామకరణం చేశారు. డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి తొట్టెను ఏర్పాటు చేసి అందులో ఊపారు. అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. చిన్నారి నవీనకు ప్రతి రోజూ ఒకరు చొప్పున ఆహారం, కోడిగుడ్డును తీసుకువచ్చి అందజేస్తున్నారు. ప్రస్తుతం నవీన వయసు ఏడాది ప్రస్తుతం నవీనకు ఏడాది వయసు వచ్చింది. ఏడు కిలోల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. వాకర్లో యూనిట్ మొత్తం తిరుగుతుండటంతో సిబ్బంది ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయి. దాంతోపాపను ‘శిశుగృహ’కు అప్పగించడానికి ఏర్పాట్లు చేశారు. పాపతో అనుబంధం వల్ల ఇది కొంచెం బాధించే విషయమే అయినా పాప భవిష్యత్తు రీత్యా తప్పడం లేదని యూనిట్ నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య, వైద్యులు డాక్టర్ జిలాని, డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ వసుంధర, డాక్టర్ శ్రీకాంత్రెడ్డితో పాటు నర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. – ఆవుల లక్ష్మయ్య, సాక్షి ప్రతినిధి, నల్లగొండ టౌన్ తల్లి కంటే మిన్నగా... చిన్నారిని కాపాడుకోవడానికి రంగంలో దిగిన ఎస్.ఎన్.సి.యు సిబ్బంది పాపకు ఆధునిక వైద్యసేవలను అందించారు. 70 రోజులు కంటికి రెప్పలా కాపాడితే బరువు 1కిలో 200 గ్రాములకు వచ్చింది. చిన్నారికి డోనర్ ద్వారా సేకరించిన పాలు, ఫార్ములా ఫీడ్ను ఆహారంగా అందించారు. ఇక నెలలు నిండని, బరువు తక్కువ చిన్నారులకు ‘కంగారూ మదర్ కేర్’ (కేఎంసీ) పద్ధతిన ట్రీట్మెంట్ను అందించాలి. చిన్నారిని తల్లి ఎదపై బోర్లా పడుకోబెట్టుకుని వెచ్చదనాన్ని అందించే విధానాన్ని ‘కంగారూ మదర్కేర్ ట్రీట్మెంట్’ అంటారు. అయితే చిన్నారికి తల్లికాని, బంధువులుకాని లేకపోవడంతో అద్దెతల్లిని తీసుకున్నారు. చర్లపల్లికి చెందిన సరిత అనే మహిళ చిన్నారికి మూడు నెలల పాటు కేఎంసీ ట్రీట్మెంట్ను అందించి తన మానవత్వాన్ని చాటుకుంది. కేఎంసీకి అద్దెతల్లులను వినియోగించడం దేశ చరిత్రలోనే మొదటిదని యూనిట్ పేర్కొంటుంది. -
న్యూ ఇయర్ రోజు ఎంతమంది జన్మించారంటే..!
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కొత్త సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరం తొలిరోజు జన్మించిన శిశువుల సంఖ్యలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. 2018 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3,86,000 మంది పిల్లలు జన్మించినట్లు యూనైటెడ్ నేషన్స్ చిల్డన్స్ ఫండ్(యూనిసెఫ్) తన నివేదికలో వెల్లడించింది. ఇండియాలో జనవరి 1న దాదాపుగా 69,070 మంది పిల్లలు జన్మించారని యూనిసెఫ్ తెలిపింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జననాలలో సగానికిపైగా తొమ్మిది దేశాల్లోనే ఉన్నట్లు యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. ఇండియా తర్వాత చైనా(44,760), నైజీరియా(20,280), పాకిస్తాన్(14,910), ఇండోనేషియా(13,370), అమెరికా(11,280), కాంగో(9,400), ఇతియోపియా(9,020), బంగ్లాదేశ్(8,370)లు వరుసగా ఉన్నాయి. అంతేకాక 90% జననాలు వెనుకబడిన ప్రాంతాల్లో జరిగినట్లు ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జనవరి 1వ తేదీన జన్మించిన బిడ్డకు బెంగళూరు నగర్ మేయర్ సంపత్ కుమార్ రూ. 5 లక్షలు ఇస్తామని చేసిన ప్రకటన తెలిసిందే. -
‘టెన్’షన్ లేకుండా..
గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 2 గంటల్లో పది మందికి పురుడు పోసిన వైద్యులు కోల్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిపించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల మధ్యలో పదిమంది గర్భిణులకు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్ సూర్యశ్రీ, మరో గైనకాలజిస్ట్ వనితతోపాటు అనస్తీషియా డాక్టర్ ప్రియాంక కలసి పురుడుపోశారు. పుట్టిన వారిలో ఆరుగురు మగ శిశువులు, నలుగురు ఆడశిశువులు ఉన్నారు. వారికి అప్పటికప్పుడు పీడియాట్రిషన్ డాక్టర్ శిల్ప వైద్యం అందించారు. పది మంది బాలింతలతోపాటు పుట్టిన పది మంది శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ తెలిపారు. అయితే, అనుకోకుండా ఆపరేషన్లు జరిగాయని, రికార్డు కోసం చేయలేదని వెల్లడించారు. పదిమంది గర్భిణుల్లో ఐదుగురు గర్భిణులకు గతంలోనే పెద్ద ఆపరేషన్లు జరిగాయని, మిగిలిన వారికిS సాధారణ ప్రసవం జరిపేందుకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అందరికీ శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
నవజాత శిశు కేంద్రంలో ఆక్సిజన్ కొరత
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం ఆక్సిజన్ లేక పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన వెయ్యి గ్రాముల బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చడానికి తీసుకురాగా ఆక్సిజన్ సరఫరా లేక సదరు బాలికను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ అధికారుల సమన్వయలోపంతో సరైన వైద్య సేవలు అందటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
అమ్మపాలే అమృతం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 - 7 వరకు పసిపిల్లలకు అమ్మపాలే అమృతం. శిశువు పుట్టిన గంట సేపట్లోగా మొదట తల్లిపాలనే పట్టాలి. రెండేళ్ల వయసు వచ్చేంత వరకు పిల్లలకు తల్లిపాలే ప్రధాన పోషకాహారం. చిన్నారులకు కనీసం ఆరు నెలల వయసు వచ్చేంత వరకైనా తల్లిపాలు పట్టాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి రాని కాలంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అందరూ తల్లిపాలనే పట్టేవారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాక ఫ్యాషన్ల ప్రభావంలో పడి అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను చాలామంది తల్లులు పిల్లలకు ఫార్ములా పాలను అలవాటు చేయడం ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలు ఇదే ధోరణి కొనసాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకుని, తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృతంగా ప్రచారం సాగించడంతో ఇటీవలి కాలంలో మహిళలు తల్లిపాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఫార్ములా పాలపొడులను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘శిశువులకు తల్లిపాలే అత్యంత శ్రేష్ఠమైనవి’ అని తప్పనిసరిగా ముద్రించే పరిస్థితి అనివార్యంగా మారింది. శిశువులకు తల్లిపాలు పట్టడం ఇటు శిశువుల ఆరోగ్యానికీ, అటు తల్లుల ఆరోగ్యానికీ మంచిదని పలు వైద్య పరిశోధనల్లో రుజువవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇదీ పరిస్థితి శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలను మించినవేవీ లేవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం కూడా ఏదీ లేదు. తల్లిపాల ద్వారా శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల లోపు వయసున్న శిశువుల్లో దాదాపు 40 శాతం మంది తల్లిపాలు లభించక అల్లాడుతున్నారు. రోగనిరోధక శక్తి సన్నగిల్లి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల కొందరు శిశువులు నిష్కారణంగా కన్నుమూస్తున్నారు. ప్రపంచంలోని శిశువులందరికీ తల్లిపాలు అందే పరిస్థితే ఉన్నట్లయితే, ఏటా 8 లక్షల శిశుమరణాలను నివారించే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే, తల్లిపాల వినియోగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వెనుకబడిన దేశాలే ముందంజలో ఉన్నాయి. తల్లిపాల వినియోగంలో తొలి పది స్థానాల్లో నిలుస్తున్న దేశాలు, వాటి వివరాలు... తల్లిపాలను నిల్వచేయవచ్చు ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పట్టే అవకాశం దొరక్కపోవచ్చు. అలాంటి తల్లులు తమ పాలను బయటకు తీసి, ఫ్రిజ్లో భద్రపరచి ఉంచే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. తల్లిపాలను తేలికగా బయటకు తీసేందుకు పంపులు వంటి పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. ముందుగానే తీసి, నిల్వచేసిన తల్లిపాలను పిల్లలకు అవసరమైనప్పుడు పట్టవచ్చు. కొందరు తల్లులకు తగినంతగా పాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు దాతల నుంచి సేకరించిన తల్లిపాలను కూడా పిల్లలకు పట్టే పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. నెలలు నిండకుండా పుట్టిన వారికి తల్లిపాలు తగినంతగా అందకపోవచ్చు. అలాంటి వారికే కాకుండా, రకరకాల కారణాల వల్ల తల్లిపాలు అందని శిశువులకు తల్లిపాలు సరఫరా చేయడానికి ఇటీవల పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్) సంస్థ ఇటీవల తల్లిపాల ఏటీఎం ప్రారంభించింది. ‘అముదం తైప్పాల్ మయ్యమ్’ (ఏటీఎం) పేరిట ఏర్పాటు చేసిన ఈ తల్లిపాల నిల్వ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు తల్లిపాలు సరఫరా చేస్తోంది. తల్లిపాల గురించి అవీ ఇవీ...తల్లిపాలు చాలా విలువైనవి. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో కొందరు తల్లిపాలను అమ్ముతున్నారు. ఔన్సు తల్లిపాల ధర 4 డాలర్లు (సుమారు రూ.270) పలుకుతోంది. * తల్లిపాలు తాగే శిశువులు వందమందిలో ఉన్నా తమ తల్లిని ఇట్టే గుర్తుపడతారు. ఒకవేళ తల్లిని పోలిన మనిషి తమ తల్లి పక్కనే ఉన్నా, వాసన ఆధారంగా తమ తల్లిని గుర్తుపట్టేస్తారు. * పాలిచ్చే తల్లుల్లో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ సహజంగానే ఉత్పత్తవుతుంది. ఇది తల్లులే కాకుండా, వారి శిశువులు కూడా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండేందుకు దోహదపడుతుంది. * అమెరికాలో ఫ్యాషన్లు రాజ్యమేలిన 1960-70 దశకాల కాలంలో పాలిచ్చే తల్లుల సంఖ్య మరీ తక్కువగా... అంటే దాదాపు 20 శాతం మాత్రమే ఉండేది. తల్లిపాల ప్రాశస్త్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం సాగించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి చాలావరకు మెరుగుపడింది. * పిల్లలకు పాలు పట్టడం ద్వారా తల్లులకు వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. రోజులో అవసరమైనన్ని సార్లు పిల్లలకు పాలుపట్టడం వల్ల ఏడు మైళ్ల నడక సాగించినంత వ్యాయామం లభిస్తుంది. * పిల్లలకు పాలు పట్టే తల్లులకు తరచూ దాహం వేస్తూ ఉంటుంది. ఇది సహజమే. దాహం వేసినప్పుడల్లా పుష్కలంగా నీరు తాగుతుంటేనే పిల్లలకు కావలసినంత పాలు ఉత్పత్తవుతాయి. * తల్లిపాలలో ప్రధానంగా వే, కీసిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి. పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. -
స్వీట్ సిస్టర్స్
సాధారణంగా ఎవరికైనా కవలలు పుట్టడం గురించి తెలుసు.. మహా అయితే ముగ్గురు పుట్టడాన్ని కూడా చూసే ఉంటారు! కానీ కెనడాలో ఒక జంటకు ఏకంగా నలుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. నలుగురికి జన్మ ఇవ్వడం గూర్చి కూడా ఇది వరకే ఎక్కడో విన్నాం అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఇంతవరకు మీరు విని ఉండరు. కెనడాలోని బెతని, టిమ్ వెబ్ దంపతులకు జన్మించిన ఈ నలుగురు ఆడ శిశువులు ఒకే రూపంతో జన్మించారు. ఒకే కాన్పులో నలుగురు జన్మించడం అనేది 7,29,000 కేసుల్లో ఒకరికి సంభవిస్తుంది. కానీ ఇలా ఒకే రూపంతో నలుగురు శిశువులు జన్మించడం అనే విషయం మాత్రం 15 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట! ఇలా ఏంజిల్స్లా కనిపిస్తున్న ఈ సిస్టర్స్ పేర్లు అబిగలీ, మెకేలా, గ్రేస్, ఎమిలీ. వీరు ఈ ఏడాది మే లో జన్మించారు. ఈ ఫొటోషూట్ను మూడు గంటల పాటు జరపగా అంతసేపు ఈ నలుగురు నిద్రలోనే కదలకుండా ఉన్నారంటా! -
పిల్లలు లేరు కాబట్టే అందంగా ఉందట!
లాస్ఎంజల్స్: లేటు వయసులో తల్లవడం మూలంగా మహిళలు వయసు మీదపడినట్లు కనిపిస్తారంటోంది హాలీవుడ్ నటి క్లో సెవిన్. 41 ఏళ్ల ఈ భామను 'ఈ వయసులో కూడా మీరింత అందంగా కనిపించడానికి కారణం ఏంటి' అని అడిగితే.. తనకు ఇప్పటి వరకు పిల్లలు లేకపోవటమే తన అందానికి కారణం అని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన మహిళలు తల్లులయితే వారు మరీ వయసు మీద పడినట్లు కనిపిస్తారని చెప్పుకొచ్చింది. అయితే 20 లలో పిల్లల్ని కనడం అందంపై అంతగా ప్రభావం చూపదని, అందుకే ఎర్లీ ఏజ్లో పిల్లల్ని కనాలని ఫెమినిస్టు మేగజైన్తో మాట్లాడుతూ సలహా ఇచ్చింది 'ద బ్రౌన్ బన్నీ' హీరోయిన్. లేటు వయసులో పిల్లల్ని కనేవారిలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని అది వారి అందంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అంతేకాదు..'ఏమైనా 40 సంవత్సరాలు దాటిన తరువాత అందాన్ని కాపాడుకోవటం కష్టమే' అని చెప్పుకొచ్చింది. -
రెండు భాషలు మాట్లాడే పిల్లలు చురుగ్గా ఉంటారట!
న్యూయార్క్ రెండు భాషలు మాట్లాడే పిల్లలు సమస్యలను పరిష్కరించడంలో మంచి నేర్పును కలిగి ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. కుంటుంబంలో అనేక భాషలు మాట్లాటడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది ఒకటి కంటేఎక్కువ భావలు మాట్లాడే పిల్లలు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని, వేగంగా స్పందిస్తారని వాషింగ్టన్ యూనివర్శిటీకి కి చెందిన పరిశోధకులు తేల్చారు. ఈ క్రమంలో వారి మెదడు చురుకుగా పని చేస్తుందని చెప్పారు. మెదడు పనితీరు పై చేసిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 నెలల మాటలు నేర్చే సమయంలోనే వారి మెదడు లో ఈ మార్పులు చో్టుచేసుకుంటాయని యూనివర్సిటీకి చెందిన నాజా ఫర్జాన్ రెమిరెజ్ పేర్కొన్నారు. ఇంగ్లీష్-మాత్రమే పిల్లలు తో పోలిస్తే స్పానిష్-ఆంగ్ల భాష మాట్టాడే పిల్లల్లో బలమైన మెదడు స్పందనలు ధ్వనులను తాము గుర్తించామన్నారు ఒకే భాష మాట్లాడే కుంటుంబంలో కంటే ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లలు ఇతర విషయాలను తొందరగా నేర్చుకుంటారన్నారు. కొత్త విషయాలను వీరు వేగంగా గ్రహించ గల్గుతారని మరో శాస్త్రవేత్త కౌల్ చెప్పారు. అదే ఒక భాష మాట్లాడే కుంటుంబంలోని పిల్లలు భావాలు 6 నెలల వయస్సులోనే కుంచించుకు పోతాయన్నారు. 11 నెలల వయసు పసి ప్రాయంలో శిశువు మెదడు చుట్టుపక్కల వాతావరణంలో మాట్లాడే ఒకటి రెండు భాషలను నేర్చకునే సామర్థ్యం సమానంగా ఉంటుందని ఫెర్జాన్ రమేజ్ తెలిపారు. చిన్న పిల్లల్లో బహుళ భాషలు నేర్చుకునే సామర్ధ్యం మాత్రమే కాకుండా, అతి చిన్న వయసులోనే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సరైన సమయమని తమ పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ పరిశోధనలో మాగ్నెట్ ఎన్సెఫలోగ్రఫీ(ఎమ్ఈజీ) సాయంతో మెదడు స్పందనలు, నరాల పనితీరును తాము పరిశీలించామన్నారు. ఇంగ్లీష్, ఇంగ్లీష్, స్పానిష్ మాట్లడే వివిధ కుంటుంబాల్లోని 11నెలలు వయస్సుగల పిల్లలపై ఈ పరిశోధనను నిర్వహించామని తెలిపారు. డెవలప్ మెంటల్ సైన్సెస్ అనే జర్నల్ లో పరిశోధనా పత్రం పబ్లిష్ అయింది. -
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ పిల్లలు
చత్తీస్గఢ్లోని అంబికాపూర్లో మనితా సింగ్ అనే 25 ఏళ్ల గర్భవతి ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సిజేరియన్ అవసరం లేకుండా సహజసిద్ధంగా ఐదుగురుకి ఒకే కాన్పులో జన్మనివ్వడం తన కెరీర్లో ఇదే మొదటిసారని డాక్టర్ టెకమ్ తెలిపారు. కేవలం 26 వారాలకే తల్లి మనితా సింగ్కు శనివారం నొప్పులు రావడంతో అంబికాపూర్ అస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత అరగంటకు నలుగురు ఆడబిడ్డలను ప్రసవించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాము ఎప్పుడు స్కానింగ్ చేయించలేదని, కడుపులో ఒకే బిడ్డ పురుడుపోసుకుందని భావించామని తండ్రి మనిష్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓ బాబు పుట్టి పోయాడని, ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే దేవుడు ఏకంగా ఐదుగురు సంతానాన్ని ఒకేసారి ఇచ్చి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురు పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఐదుగురు బిడ్డలు ప్రిమెచ్యూర్గా పుట్టారని, వారంతా కిలోన్నర చొప్పున బరువున్నారని డాక్టర్లు తెలిపారు. వారంతా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారిలో ఎంతమంది బతుకుతారో చెప్పలేమని, అయితే ప్రతి బిడ్డను బ్రతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు తెలిపారు. -
'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్
ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఛాంబర్లో మహిళా ఎంపీలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు అనుమతించింది. తల్లులు తమ పిల్లలకు పని వేళల్లోనే షెడ్యూల్ ప్రకారం పాలివ్వచ్చని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్తో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇంతకు ముందు పార్లమెంట్ ఛాంబర్లోకి పిల్లలను అనుమతించేవారు కాదు. అయితే ఇప్పుడా ఆ చట్టంలో మార్పులు తెచ్చారు. ఒక్క మహిళా ఎంపీలే కాదు... తల్లిదండ్రులు ఇద్దరిలో పిల్లల సంరక్షణను చూసే ఎవరైనా పిల్లలను తమతోపాటు ఛాంబర్లోకి తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త ఉత్తర్వులు సభ్యులందరికీ వర్తించేలా అమల్లోకి తేనున్నారు. అయితే ఇక్కడి మొత్తం హౌస్లో 150 మంది సభ్యుల్లో 40 మంది మహిళలే ఉన్నారు. ద ఆడైనా, మగైనా పిలల సంరక్షణా బాధ్యత ఉన్నవారు పార్లమెంట్ నిర్వహణలో పాల్గొనలేకపోతారని, అందుకే ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లు సభాధ్యక్షుడు క్రిస్టోఫర్ పైన్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ నిర్ణయాన్నిస్వాగతించారు. గతేడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో ముగ్గురు సభ్యులు ఇంచుమించుగా ఒకేసారి మాతృత్వం పొందడంతో ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకోడానికి కారణంగా చెప్పొచ్చు. కాగా ఇటలీ మహిళ మెప్ లికా రొంజుల్లి 2010లో తన ఆరు వారాల బిడ్డను తీసుకొని ఓటింగ్లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె కుమార్తె ప్రతి చర్చలోనూ భాగమైంది. పనిచేసే చోటకి పిల్లలను అనుమతించే ఈ కొత్త చట్టాన్ని ఐరోపా సమాఖ్యలోని దేశాల్లో మొట్ట మొదటిగా ఆస్ట్రేలియా అమల్లోకి తెచ్చింది. -
ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు!
వాళ్లిద్దరూ కవల పిల్లలు. కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏమింటంటే కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతానికి చెందిన మారిబెల్ వాలెన్షియా అనే మహిళ 2015 డిసెంబర్ నెలాఖరులో ఆస్పత్రిలో కాన్పు కోసం చేరారు. అక్కడ ఆమెకు 31వ తేదీ రాత్రి జేలిన్ అనే అమ్మాయి తొలుత పుట్టింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత.. అంటే, 2016 జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 12.02 నిమిషాలకు లూయిస్ అనే కొడుకు పుట్టాడు. దాంతో కవల అక్కాతమ్ముళ్లు ఇద్దరూ వేర్వేరు సంవత్సరాలలో పుట్టినట్లు అయ్యింది. ఇది చూసిన ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిజానికి వీళ్లిద్దరూ కూడా జనవరి నెలాఖరులోనే పుడతారని వైద్యులు భావించారు. కానీ అలా జరగకుండా తమ తల్లిదండ్రులకు ఆనందం మిగిల్చారు. ఈ కవలల తల్లి శాండియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్గా పనిచేస్తుంటే, ఆమె భర్త లూయిస్ యునైటెడ్ స్టేట్స్ నేవీలో డీజిల్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీళ్లకు ఇప్పటికే మూడేల్ల ఇసబెల్లా అనే కూతురు కూడా ఉంది. -
ఒకే కాన్పులో ముగ్గురు మృత శిశువులు
నేలకోట(చింతూరు) : ఓ మహిళకు ముగ్గురు మృత శిశువులు జన్మించిన సంఘటన నేలకోట గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన పైదా రంగమ్మకు సోమవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామంలోనే ప్రసవమై, ముగ్గురు మృత శిశువులు జన్మించారు. ఇద్ద రు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ అని ఆమె భర్త భద్రయ్య తెలిపాడు. మృత శిశువులను గ్రా మంలోనే పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ఆరోగ్యపరిస్థితి సరిగా లేకపోవడంతో రంగమ్మను నేలకోట నుంచి మోతుగూడెం వరకు నడిపించి, అక్కడినుంచి 108లో చింతూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాన్పు కాదు.. అబార్షన్ : డాక్టర్ అశోక్కుమార్ రంగమ్మ గర్భం దాల్చి 24 వారాలే కావడంతో సోమవారం ఆమెకు అబార్షన్ జరి గినట్టు చింతూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు అశోక్కుమార్ తెలిపారు. ఇటీవల రంగమ్మ ను పరీక్షించి, సూచనలు చేశానని చెప్పారు. 28 వారాలు దాటితే కాన్పు అయ్యే అవకాశం ఉందని, 24 వారాలే కావడంతో కచ్చితంగా అబార్షన్ జరిగి ఉంటుందని వివరించారు. గర్భంలో మరో బిడ్డ ఉందనే అనుమానంతో స్కానింగ్ కోసం భద్రాచలం పంపినట్టు తెలిపారు. పౌష్టికాహారం సక్రమంగా తినకపోవడంతో రంగమ్మకు అబార్షన్ జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. -
ఓ బాతు సాహసం
చెరువులో పిల్లలతో పాటు ఈదుతున్న ఓ బాతు.. తల్లి ప్రేమకు తార్కాణంగా నిలిచింది. భుజాలపై పిల్లల బాధ్యతను మోస్తూ.. ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది. తన పిల్లలన్నింటినీ తీసుకుని చెరువులో రయ్యిన ఈదుతూ పోవడం చూపరులను ఆకట్టుకుంది. ఓ ఫొటో గ్రాఫర్ కెమెరాను క్లిక్మనిపించేలా చేసింది. ఇంగ్లాండ్ రోచ్ డాలె.. లాంక్షైర్లో 16 పిల్లలతో ఓ బాతు.. చెరువును దాటడం సందర్శకులను ఆశ్చర్యపరచింది. అతి పెద్ద కుంటుంబాన్ని సాకడం అత్యంత కష్టమైన విషయం. అయితేనేం ఆ బాతు మాత్రం తల్లి ప్రేమకు హద్దులుండవని నిరూపించింది. తన 16 పిల్లలతో లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నించింది. ఆరు పిల్లలను వీపుపైన, మిగిలిన వాటిని ఒకదాని వెనుక ఒకటి ఉండేలా చూసుకుని.. కుటుంబంతో పాటు.. సునాయాసంగా చెరువు దాటింది. బాతు ప్రయత్నం సందర్శకులకు కనువిందు చేసింది. క్వీన్స్ పార్క్ హేవుడ్ లోని చెరువులో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసిన... 49 ఏళ్ళ మార్క్ క్రైమ్స్ తన కెమెరాలో బంధించాడు. ''బాతు వీపుపై మోస్తున్న పిల్లల సంఖ్య లెక్క పెట్టిన నేను నిజంగా నమ్మలేకపోయాను. అంత చిన్న ప్రాణానికి అది ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యపోయాను. నిజానికి బాతులు కెమెరాను చూస్తే పక్కకు వెళ్లిపోతాయి. ఫొటో తీసేవరకూ ఆగవు. అలాంటిది నా కెమెరాకు ఈ దృశ్యం చిక్కడం ఎంతో ఆనందంగా ఉంది'' అంటున్నాడు ఫొటోగ్రాఫర్ మార్క్ క్రైమ్స్. బాతులు సాధారణంగా 12 గుడ్లను పెడతాయని, ఈ బాతు 16 పిల్లలతో చాలా పెద్ద కుటుంబాన్ని సాకడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని మార్క్ అంటున్నాడు. -
మీ పాపకో పాస్వర్డ్ పెట్టండి!
పాపకు పాస్వర్డ్ పెట్టడమేంటి? పాపేమైనా కంప్యూటరా? మొబైల్ ఫోనా? అనేకదా మీరు అడుగుతోంది. నిజమే.. కంప్యూటర్లో మనకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే దానికో పాస్వర్డ్ పెడతాం. మరి కంటికి రెప్పలా చూసుకుంటున్న మన చిన్నారులు భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ అక్కరలేదా?... కాస్త కన్ఫ్యూ జింగ్గా ఉంది కదూ.. అయితే ఇది చదవండి...తూర్పుఢిల్లీలోని వివేకానందనగర్లోగల లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న రితిక వయసు 8 ఏళ్లు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు తల్లి స్వయంగా స్కూల్కు వచ్చి తీసుకెళ్లేది. ఒకరోజు ట్రాఫిక్జామ్ కావడంతో తల్లిరావడం ఆలస్యమైంది. దీంతో రితిక తల్లికోసం ఎదురుచూస్తూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. పాపదగ్గరికి వెళ్లి.. మీ అమ్మకు ఏదో అర్జంట్ పని ఉండడంవల్ల రాలేకపోయిందని, తీసుకురమ్మని తనను పంపిందని పాపతో చెప్పాడు. వెంటనే ఆ ‘పాప పాస్వర్డ్ ఏంటి?’ అని అడిగింది. దీంతో బిత్తరపోయిన కిడ్నాపర్ ఏం చెప్పాలో తోచక మమ్మీ పాస్వర్డ్ ఏమీ చెప్పలేదన్నాడు. దీంతో ఎదుటి వ్యక్తి తనను కిడ్నాప్ చేయడానికే వచ్చాడన్న అనుమానంతో రితిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడం, కిడ్నాపర్ను పోలీసులకు పట్టివ్వడం చకచకా జరిగిపోయాయి. రితిక తల్లి చేసిన ఓ చిన్న ఆలోచన పాపను కిడ్నాప్ కాకుండా కాపాడింది. సో.. ఇప్పుడు అర్థమైంది కదా.. పాపకు పాస్వర్డ్ ఎందుకో? -
మేం తక్కువా!
వాషింగ్టన్: అమెరికాలో ఏడాది వయసున్న చిన్నారులు సైతం నిత్యం ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని అల్పాదాయ, మైనారిటీ వర్గాలకు చెందిన 350 మంది చిన్నారుల (6 నెలలు-4 ఏళ్లు)పై సాగిన ఈ అధ్యయనంలో ఆదాయానికి సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మధ్య అంతరం తగ్గిపోతున్నట్లు స్పష్టమైంది. ఏడాది వయసున్న పిల్లలు, చిన్నారులకు అత్యంత ఇష్టమైనవి ట్యాబ్లెట్లేనని.. దాన్ని వారు రోజుకు సగటున 20 నిమిషాలకు పైగానే వినియోగిస్తున్నారని తేలింది. ఫిలడల్ఫియాలో ఓ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. సర్వే ప్రకారం.. 83 శాతం మందికి ట్యాబ్లెట్లు, 77 శాతం స్మార్ట్పోన్లు ఉన్నాయి. చిన్నారుల్లో మూడొంతుల మందికి సొంత మొబైల్ ఉంది. ఏడాది లోపు చిన్నారుల్లో పదిమందిలో నలుగురు, రెండేళ్ల వయసున్న చిన్నారుల్లో 77 శాతం ఎవరి సాయం లేకుండానే మొబైల్లో గేమ్స్ ఆడుతూ యాప్స్ వాడుతున్నారు. -
ఆడపిల్లగా పుట్టడమే తప్పా!
మహా పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం సమీపంలోని అంజనాద్రి నగర్లో మంగళవారం ఓ ఆడ పసికందు ప్రత్యక్షమైంది. కనీసం పురిటీ వాసన కూడా పోని 20 రోజుల పసికందును కనికరం లేకుండా వీధిపాలు చేశారు. పోషించే స్థాయి లేక భారమని వదిలించుకున్నారో, చీకటి పాపం వెంటాడుతుందనే భయపడ్డారో కనీసం పచ్చికూడా ఆరని ఆ పసికందును వీధికుక్కలపాలు చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆడపిల్ల కావడంతో వదిలివెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆ పసికందు తమ సంరక్షణలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.