BSEB
-
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్లో ఓవర్నైట్ ట్రేడ్లో మిక్స్డ్ ఫలితాలు వెలువరించాయి. దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్యూఎస్,ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
బీఎస్ఈ సీఈవోగా సుందరరామన్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛేంజీ ఎన్ఎస్ఈకి తరలి వెళ్లారు. దీంతో ఎన్ఎస్ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్ఈ అత్యున్నత పదవిని ఆఫర్ చేసింది. -
సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఆద్యంతం లాభ, నష్టాల మధ్య కదలాడిన స్టాక్ సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 61,294 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,233 వద్ద నిలిచింది. ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. ఒక దశలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే చివరి గంట కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 93 పాయింట్ల నష్టంతో 61,075 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 339 పాయింట్ల పరిధిలో 61,004 వద్ద కనిష్టాన్ని, 61,344 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 18,163 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 18,150 – 18,252 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. కమోడిటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22%, స్మాల్ క్యాప్ సూచీ 0.18 శాతం పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.628 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.351 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. డాలర్ మారకంలో 22 పైసలు పతనమై 83.00 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జొమాటో సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ రాజీనామాతో కంపెనీ షేరు 2 శాతం నష్టపోయి రూ.58.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నాలుగుశాతానికి పైగా నష్టపోయి రూ.57.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► స్వల్ప శ్రేణి ట్రేడింగ్లోనూ బీమా కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 4.50%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 4%, ఎల్ఐసీ 3.50%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రెండుశాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్డీటీవీ వాటాదారులకు జోష్ ఎన్డీటీవీ వాటాదారులకు బోనస్లాంటి వార్త. ఇటీవలే ఎన్డీటీవీని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్.. మీడియా సంస్థ వాటాదారులకు షేరుకి రూ. 48.65 చొప్పున అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. ఓపెన్ ఆఫర్లో భాగంగా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5 మధ్య షేర్లను టెండర్ చేసిన ఎన్డీటీవీ వాటాదారులకు తాజా చెల్లింపు వర్తించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై వెనువెంటనే లాభాల్లో పయనించాయి. ఉదయం 9.48గంటల సమయంలో సెన్సెక్స్ 15పాయింట్ల లాభంతో 61182 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 4 పాయింట్ల అత్యంత స్వల్ప లాభంతో 18202 వద్ద కొనసాగుతుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా,బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్,కోల్ ఇండియా, బ్రిటానియా,టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
కొత్త ఏడాది లాభాల బోణీ
ముంబై : దేశీయ స్టాక్ సూచీలు కొత్త ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ సోమవారం 327 పాయింట్లు బలపడి 61,168 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 18,200 పాయింట్లు చేరువలో 18,197 వద్ద నిలిచింది. నూతన సంవత్సరం నేపథ్యంలో పలు దేశాల స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా సూచీలు ఉదయం ప్లాట్గా ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలుత కాస్త తడిబడినా.., మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా లాభాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 61,222 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు బలపడి 18,215 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. గతేడాది చివరి నెల డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆటో కంపెనీల అమ్మకాలు అంచనాలకు తగ్గట్టు నమోదయ్యాయి. కొత్త వ్యాపారాల ఆర్డర్లలతో తయారీ రంగ పీఎంఐ సూచీ 13 నెలల గరిష్టానికి చేరుకుంది. ఈ సానుకూల పరిణామాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, విద్యుత్ రంగాల షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, మిడ్ క్యాప్ సూచీ అరశాతం లాభపడ్డాయి. సూచీలు అరశాతం ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లో రూ.1.47 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.213 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.743 కోట్ల షేర్లు కొన్నారు. కొత్త ఏడాది సందర్భంగా జపాన్, సింగపూర్, హాంగ్కాంగ్, థాయిలాండ్, చైనా, బ్రిటన్తో పాటు అమెరికా మార్కెట్లు పని చేయలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణతో డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 82.78 స్థాయి వద్ద స్థిరపడింది. ‘దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వొచ్చనే అంచనాలతో పాటు బడ్జెట్పై ఆశలతో రానున్న రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా రాణించవచ్చు. నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,250 పాయింట్లను ఛేదించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 18,100 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► డిమాండ్ పెంచేందుకు చైనా ఎగుమతుల సుంకాన్ని పెంచడంతో పాటు కోవిడ్ ఆంక్షల ఎత్తివేతతో మెటల్ షేర్లు మెరిశాయి. సెయిల్, హిందుస్థాన్ కాపర్, మొయిల్, జేఎస్ఎల్, టాటా స్టీల్ షేర్లు 8% నుంచి 7% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, వేదాంత, రత్నమణి మెటల్స్, జిందాల్ స్టీల్, ఏపియల్ అపోలో షేర్లు, హిందుస్థాన్ జింక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు 4–1% చొప్పు న రాణించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇంట్రాడేలో 3% ఎగసి 6907 స్థాయి వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ► రెండోరోజు నాటికి షా పాలీమర్స్ ఐపీఓ 2.37 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 1.33 లక్షల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ► ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నాట్కో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, ఫైజర్, లారస్ ల్యాబ్స్ సన్ ఫార్మా షేర్లు 1.50% నుంచి ఒకశాతం నష్టపోయాయి. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది ప్రారంభ రోజు ఫ్లాటుగా ట్రేడింగ్ను మొదలు పెట్టాయి. నిఫ్టీ 18100 పాయింట్లకు పైకి ఎగబాకింది.సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 60,959 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కానీ కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 60798 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ అత్యల్పంగా 9 పాయింట్లు నష్టాలవైపు పయనమవుతున్నాయి. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎస్బీఐలు నష్టాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్,ఓఎన్జీసీ,బీపీసీఎల్ షేర్లు లాభాల వైపు మొగ్గుచూపుతున్నాయి. -
2022కు నష్టాలతో వీడ్కోలు
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ 2022 ఏడాదిని నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్లు ఏడాది చివరి ట్రేడింగ్ రోజు కావడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. మాంద్యం భయాలు తెరపైకి వస్తున్న తరుణంలో కొత్త ఏడాది అవుట్లుక్పై ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో శుక్రవారం ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 61,329 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 18,259 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో క్రమంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా చివరి గంటలో బ్యాంకింగ్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60,841 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86 పాయింట్లు పతనమై 18,105 వద్ద నిలిచింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, రియల్టీ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,951 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,266 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 82.73 స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో దేశీ కరెన్సీ డాలర్ మారకంలో ఏకంగా 11.36% (844 పైసలు) క్షీణించింది. స్టాక్ మార్కెట్కు కలిసిరాని 2022... స్టాక్ మార్కెట్కు ఈ ఏడాది(2022) కలిసిరాలేదు. గతేడాది(2021) ఏకంగా 22% రాబడినిచ్చిన దలాల్ స్ట్రీట్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో కేవలం నాలుగున్నర శాతం స్వల్పలాభంతో సరిపెట్టింది. సెన్సెక్స్ 2,586 పాయింట్లు (4.44%), నిఫ్టీ 751 పాయింట్లు(4.32%) చొప్పున ఆర్జించాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం హెచ్చరికల భయాలు మార్కెట్ ఆస్థిరతకు కారణమయ్యాయి. ఇదే ఏడాదిలో స్టాక్ మార్కెట్లో రూ.16.45 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన సెన్సెక్స్ 63,583 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,888 పాయింట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫిబ్రవరి 15న అత్యధికంగా లాభపడగా.. ఫిబ్రవరి 24న అత్యధిక నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీగా ర్యాలీ చేయగా, ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లిస్టింగ్ రోజే ఎలీన్ ఎలక్ట్రానిక్స్ డీలా ఎలీన్ ఎలక్ట్రానిక్స్ షేరు లిస్టింగ్ రోజే నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.247)తో పోలిస్తే ఒకటిన్నర శాతం నష్టంతో రూ.244 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో ఎనిమిదిన్నర శాతం క్షీణించి రూ.226 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆఖరికి 8% నష్టంతో రూ.228 వద్ద స్థిరపడింది. క్రాఫ్ట్మెన్ ఆటోమిషన్ షేరు 14% ర్యాలీ చేసి రూ.3710 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. డాక్టర్ యాక్సిన్ ఇండియాను రూ.375 కోట్లకు చేజిక్కించుకోవడంతో ఈ షేరుకు డిమాండ్ లభించింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ జరగడంతో 8% శాతం లాభంతో రూ.3,507 వద్ద స్థిరపడింది. హరియాణాలో రూ.624 కోట్ల రోడ్డు ప్రాజెక్ట్ దక్కడంతో హెజీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ 7% బలపడి రూ.616 వద్ద స్థిరపడింది. -
డాలర్పై ఒత్తిడి.. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు
ఈ ఏడాది ట్రేడింగ్ చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో చమురు దిగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో డాలర్పై ఒత్తిడి పెరిగింది. డాలర్ విలువ స్థిరంగా కొనసాగుతుండగా రూపాయి పుంజుకుంది. దీనికి తోడు మదుపర్లు ఫ్యూచర్స్ - ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ఒప్పందాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయి. వెరసి శుక్రవారం ఉదయం 10 .30 గంటల సమయానికి దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు లాభ పడి 61265 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 18233 వద్ద ట్రేడింగ్ను కంటిన్యూ చేస్తుంది. హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎథేర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఏసియేషన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్..కొనసాగుతున్న లాభాల పరంపర
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలను గడించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఊగిలాటతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. అయితే చివరి గంటలో టెలికం, బ్యాంకింగ్, మెటల్ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల గడువు గురువారం ముగిస్తుండటంతో ట్రేడర్లు తమ పొజిషన్లను షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో ధరలు క్షీణించడం మార్కెట్కు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 732 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 224 పాయింట్లు లాభపడి 61,134 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 237 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసేసరికి 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్లను విక్రయించాయి. చైనా బీజింగ్లో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ అంతంతే ఆర్థిక సేవల ప్లాట్ఫాం కెఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.366)తో పోలిస్తే ఒకశాతం ప్రీమియంతో రూ.369 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.372 వద్ద గరిష్టాన్ని, రూ.351 కనిష్టాన్ని తాకింది. చివరికి అరశాతం నష్టంతో రూ.364 వద్ద స్థిరపడింది. -
స్టాక్ మార్కెట్లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు
కోవిడ్ భయాలతో అమ్మకాల ఒత్తిడికి లోనైన దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారం ప్రారంభంతో క్రిస్మస్ పండుగ తర్వాత రోజు స్టాక్ మార్కెట్లో శాంటాక్లాజ్ ర్యాలీతో లాభాలు గడించాయి. ఆ మరుసటి రోజు అంటే ఇవాళ కోవిడ్తో పాటు ఇతర అంతర్జాతీయ అంశాలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మంగళవారం ఉదయం 10.30గంటల సమయానికి లాభానష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 60593 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 18027 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ, టాటా కాన్స్, హెచ్యూఎల్, బ్రిటానియా, యూపీఎల్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. గతవారం చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. అయితే ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 258 పాయింట్ల స్వల్పలాభంతో 60103 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 17883 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక హెచ్యూఎల్,నెస్లే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్, ఎయిర్టెల్, టాటా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఇండస్ఎండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో పుంజుకుంటున్నాయి. -
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్-19, భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వారంలో వరుస నాలుగో రోజు జాతీయ, అంతర్జాతయ స్థాయిలో నెలకొన్న ప్రతికూల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపును కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మదుపర్లు వాల్ స్ట్రీట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఏసియన్ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. చైనాలో కరోనా విజృంభిస్తోంది. కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7(BF.7) కారణమని నిపుణులు అభిప్రాయం చేస్తున్నారు. దీనికి తోడు ఈ కొత్త 4 వేరియంట్ కేసులు భారత్లో నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ను వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోతున్నాయి. శుక్రవారం ఉదయం 10.5గంటల సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లతో భారీగా నష్టపోయి 60288 వద్ద.. నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 17959 వద్ద కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కోవిడ్ -19 వ్యాప్తి వార్తల నేపథ్యంలో దివిస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
రెపోరేట్లు పెంచిన ఆర్బీఐ, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. రెపోరేట్ల పెంపు, కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తోపాటు 8న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయి 62441 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 18575 వద్ద కొనసాగుతుంది. ఇక బజాజ్ ఫిన్ సర్వ్,ఎన్టీపీసీ, టాటా మోటార్స్,యూపీఎల్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాతుంటే.. బీపీసీఎల్,లార్సెన్, హెచ్యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా కాన్స్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
రూపాయి పతనం, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 208 పాయింట్లు క్షీణించి 62,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 58 పాయింట్ల వెనకడుగుతో 18,643 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 445 పాయింట్లు పతనమై 62,390ను తాకగా.. నిఫ్టీ 123 పాయింట్లు నీరసించి 18,578 దిగువకు చేరింది. చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లు బలహీనపడటం, రూపాయి పతనం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ 1.5 శాతం నష్టపోగా.. మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 1.25 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, ఐషర్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ 3–1.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్లో అదానీ, హెచ్యూఎల్, నెస్లే, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్, యాక్సిస్, పవర్గ్రిడ్, గ్రాసిమ్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ 2.5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి. చిన్న షేర్లు సైతం..: మార్కెట్ల బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,936 నష్టపోగా.. 1,563 పుంజుకున్నాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 635 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 559 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. సోమవారం సైతం ఎఫ్పీఐలు రూ. 1,139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. స్టాక్ హైలైట్స్ ► రానున్న ఐదేళ్లలో అమ్మకాలను మూడు రెట్లు పెంచుకునే ప్రణాళికలు ప్రకటించడంతో వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ షేరు 6 శాతం జంప్చేసింది. రూ. 782 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 815ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ► విభిన్న సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ అంశంపై వారాంతాన సమావేశంకానున్నట్లు వెల్లడించడంతో ఆస్ట్రా మైక్రోవేవ్ షేరు 5 శాతం జంప్చేసింది. రూ. 322 వద్ద ముగిసింది. తొలుత రూ. 329ను సైతం దాటింది. ► ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఐవోసీ నుంచి రూ. 343 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టును పొందడంతో అయాన్ ఎక్సే్ఛంజ్ (ఇండియా) షేరు 2.4 శాతం బలపడి రూ. 2,975 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,988 వద్ద సరికొత్త గరిష్టాన్ని సాధించింది. ► సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై శుక్రవారం సమావేశంకానున్నట్లు పేర్కొనడంతో బజాజ్ కన్జూమర్ షేరు తొలుత 5 శాతం జంప్చేసి రూ. 185కు చేరింది. చివరికి 1.6 శాతం లాభంతో రూ. 178 వద్ద ముగిసింది. -
రంకెలేస్తున్న బుల్..లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు
జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఫెడ్ సీఈవో జాన్ విలియన్సన్ చేసిన వ్యాఖ్యలు, డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి పతనం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పదినెలల కనిష్టానికి దిగిరావడంతో దేశీయంగా మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం 11గంటలకు సెన్సెక్స్ 315 పాయింట్ల లాభపడి 62822 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 18656 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక హెచ్యూఎల్, హిందాల్కో, నెస్లా, బ్రిటానియా,సిప్లా, హీరోమోటోకార్ప్,టాటా స్టీల్, ఐటీసీ, టైటాన్ కంపెనీ, ఐసిఐసిఐ, అపోలో హాస్పటిల్, జేఎస్డ్ల్యూస్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్,ఇండస్ ఇండ్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. -
పెట్టుబడులు పెట్టొచ్చా?ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి!
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పరిమిత శ్రేణికి లోబడే ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల తీరును అనుసరించే వీలుందంటున్నారు. ఇదే వారంలో ఐదు కంపెనీల షేర్లు ఎక్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.., గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కమోడిటీ ధరలు దిగిరావడం, కేంద్ర బ్యాంకులు సరళతర ద్రవ్య విధాన వైఖరితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ మరింత పెరగొచ్చు. నిఫ్టీ కీలకమైన తక్షణ మద్దతు 18,300 స్థాయిని నిలుపుకోగలిగింది. కొనుగోళ్లు కొనసాగితే 18,400–18,450 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే 18,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో గతవారంలో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ప్రపంచ పరిణామాలు యూరో జోన్ సెప్టెంబర్ కరెంట్ ఖాతా లోటు డేటా రేపు(మంగళవారం) విడుదల అవుతుంది. యూఎస్, బ్రిటన్, యూరో జోన్ దేశాల నవంబర్ తయారీ, సేవా రంగ డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. మరుసటి రోజున గురువారం(ఈ నెల 24న) అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ విడుదల అవుతాయి. ఈ సందర్భంగా ఫెడ్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(జూలై 28న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరత్వంతో పాటు వృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందనే సానుకూల అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నవంబర్లో ఇప్పటి వరకు(1–17 తేదీల మధ్య) రూ.30,385 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నందున రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శించవచ్చు. ఇదే సమయంలో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ స్టాకులు ఆకర్షణీయమైన ధరల వద్ద లభ్యమవుతున్న తరుణంలో ఎఫ్ఐఐలు ఈ దేశాల వైపు మెగ్గుచూపవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
10.4 కోట్లకు డీమ్యాట్ అకౌంట్లు
దేశంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడి దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ మార్గాల్లో పెట్టు బడులు పెట్టిన మదుపర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వెరసీ ఈ అక్టోబర్ నెలకి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య వార్షిక (ఏడాది) ప్రాతిపదికన 41 శాతం పెరిగి 10.4 కోట్లకు చేరినట్లు మోతీలాల్ ఓస్వల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. అయితే ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థికమాంద్యం వంటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా గత కొద్ది నెలలుగా డీమ్యాట్ అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని ఓస్వల్ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో 26 లక్షలు అకౌంట్లను ఓపెన్ చేయగా ..సెప్టెంబరులో 20 లక్షలు, అక్టోబరు 18 లక్షలకు తగ్గాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరులో కొత్త ఖాతాల సంఖ్య 36 లక్షలుగా ఉన్నాయి. -
దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ అదిరెన్
ముంబై: ఆర్థిక అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడంతో దలాల్ స్ట్రీట్లో బుల్ పరుగులు తీసింది. రూపాయి అనూహ్య రికవరీ, విదేశీ కొనుగోళ్లు ర్యాలీకి మద్దతునిచ్చాయని ట్రేడర్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, రియల్టీ షేర్లు రాణించడంతో బెంచ్మార్క్ సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు బలపడి 18,350 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఇరు సూచీలకిది గరిష్ట ముగింపు స్థాయి కావడం విశేషం. నాస్డాక్ ఇండెక్స్ ఏడున్నర శాతం ర్యాలీ చేయడంతో ఐటీ షేర్లకు భారీ గిరాకీ నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,958 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.616 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ మూడుశాతం ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.2.87 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.284.46 లక్షల కోట్లకు చేరింది. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. లాభాలు ఇందుకే అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదవడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఎఫ్ఐఐలు ఈ నవంబర్ ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటంతో ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయిదోరోజూ రూపీ పరుగు రూపాయి పరుగు అయిదోరోజూ కొనసాగింది. డాలర్ మారకంలో 62 పైసలు బలపడి 80.78 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ద్రవ్యోల్బణం భారీగా దిగిరావడం, డాలర్ ఇండెక్స్ బలహీనత దేశీయ కరెన్సీ ర్యాలీకి మద్దతుగా నిలిచినట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిఫెన్స్ ఏరోస్పేస్ రంగానికి చెందిన డీసీఎక్స్ సిస్టమ్స్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.207)తో పోలిస్తే 38 శాతం ప్రీమియంతో రూ.286 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 55% ర్యాలీ చేసి రూ.320 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 49శాతం లాభంతో రూ.309 వద్ద స్థిరపడింది. ►హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు వరుసగా 6%, ఐదుశాతం చొప్పున లాభపడ్డాయి. ►సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత జొమాటో షేరు 14 శాతం లాభపడి రూ.72.80 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మొత్తం 3.19 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
సూచీలకు రెండోరోజూ నష్టాలు
ముంబై: ఫెడ్ వడ్డీరేట్లను నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఈక్విటీ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు తలెత్తడంతో సూచీలు రెండో రోజూ డీలాపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనత సెంటిమెంట్పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా ఆటో, ఫైనాన్స్, ఇంధన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 419 పాయింట్లు నష్టపోయి 60,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు పతనమై 18,028 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం చతికిలపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.36 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.967 కోట్ల షేర్లను అమ్మేశారు. ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకున్న రూపాయి ఏడు పైసలు స్వల్పంగా బలపడి 81.40 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ రెండు రోజుల్లో 571 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.1 లక్షల కోట్లు సంపద కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.281.60 లక్షల కోట్లకు దిగివచ్చింది. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్లు అమెరికా అక్టోబర్ వినియోగ ధరల(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆర్థికవేత్తల అంచనా(8%)ల కంటే తక్కువగా 7.7 శాతానికి దిగివచ్చిందని (గురువారం రాత్రి) కార్మిక శాఖ వెల్లడించింది. పరుగులు తీస్తున్న ధరలు నెమ్మదించడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా యూఎస్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలైన డోజోన్ 3%, ఎస్అండ్పీ 3.50%, నాస్డాక్ ఏకంగా ఐదుశాతం లాభంతో కదలాడుతున్నాయి. ట్రేడింగ్లో 18 వేల దిగువకు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 509 పాయింట్ల నష్టంతో 60,524 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు క్షీణించి 18,044 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కీలక రంగాల్లో తలెత్తిన అమ్మకాలతో సూచీలు ఏ దశలో కోలుకోలేకపోయాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 609 పాయింట్లు పతనమై 60,425 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17,969 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటన మరుసటి రోజు టాటా మోటార్స్ షేరు డీలాపడింది. బీఎస్ఈలో 5 శాతం నష్టపోయి రూ.412 వద్ద నిలిచింది. ► లిస్టింగ్ తరువాత లాకిన్ పీరియడ్ ముగియడంతో నైకా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ కొత్త తరం టెక్ షేరు చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.188 వద్ద నిలిచింది. -
ఫస్ట్మెరీడియన్ ఐపీవోకు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ ఫస్ట్మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర లభించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 18న అబ్జర్వేషన్ లెటర్ అందినట్లు సంస్థ తెలిపింది. ఈ లెటర్ను పబ్లిక్ ఇష్యూకు గ్రీన్ సిగ్నల్గా పరిగణిస్తారు. ఐపీవో ద్వారా ఫస్ట్మెరీడియన్ రూ. 800 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 50 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, మిగతా రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించనున్నారు. ప్రాస్పెక్టస్ ముసాయిదా ప్రకారం ప్రమోటర్ అయిన మ్యాన్పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ రూ. 665 కోట్ల షేర్లు, ప్రస్తుత వాటాదారులు న్యూ లేన్ ట్రేడింగ్ రూ. 45 కోట్లు, సీడ్త్రీ ట్రేడింగ్ రూ. 40 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా వచ్చే నిధులను రుణాలు తీర్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 2018లో ఏర్పడిన ఫస్ట్మెరీడియన్కు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా. ఫోన్పే, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైనవి క్లయింట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 శాఖలు ఉండగా, 75 పైగా నగరాల్లో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,110 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
మూరత్ ట్రేడింగ్ చేస్తే..ఏడాదంతా స్టాక్ మార్కెట్లో తిరుగుండదు
దేశీయ స్టాక్ మార్కెట్లో మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యింది. దీపావళి పర్వదినం సందర్భంగా ట్రేడింగ్ చేస్తే .. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందనేది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగా ప్రతి ఏడాది స్టాక్ ఎక్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయి. ఈ ట్రేడింగ్ గంట సేపు కొనసాగుతుండగా.. ఆ సమయంలో కనీసం ఒక్క స్టాకైనా కొనుక్కోవాలని ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. చదవండి👉 పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్ఝున్వాలా! సంపదకు, ధనానికి మూలం అయిన లక్ష్మీదేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు ట్రేడింగ్ చేయడం వల్ల ధనంతో ఇల్లు కళకళలాడుతుందనేది గట్టి నమ్మకం. మూరత్ ట్రేడింగ్ ప్రారంభంతో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు ఇన్వెస్టర్లు పరిగణిస్తారు. కాబట్టే భారత దేశ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్టాక్ ఎక్ఛేంజీలు కార్యకలాపాలు జరగకపోయినా ఈ మూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయి. చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్లో రాకేష్ ఝున్ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? అందుకే మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ కూడా ‘మూరతత్’ పేరుతో 6.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు జరుగుతాయి. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత గుజరాతీలు ఈ మూరత్ ట్రేడింగ్లో లాంగ్ టర్మ్లో లాభాలు తెచ్చే పెట్టే స్టాక్స్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేస్తుంటారు. అలాగే వాళ్ల నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని, మూరత్ ట్రేడింగ్ సమయంలో కొన్ని స్టాక్స్ భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 రాకేశ్ ఝున్ఝున్వాలా భలే సరదా మనిషి! -
అంతర్జాతీయ మార్కెట్ల అండ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతానికి పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లకు డిమాండ్ లభించింది. సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 57,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు బలపడి 17,186 వద్ద నిలిచింది. ఆటో, మీడియా, మెటల్, రియల్టీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టోకు ధరల సూచీ వరుసగా నాలుగో నెలా దిగిరావడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. నలభై ఏళ్ల గరిష్టానికి ఎగబాకిన ద్రవ్యోల్బణాన్ని విస్మరిస్తూ.., షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో గురువారం అమెరికా మార్కెట్లు రెండుశాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా(+2%), యూరప్(+1.50%)తో సహా భారత మార్కెట్లు ఇక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,011 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు క్షీణించి 82.32 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో గత రెండు వారాలుగా మార్కెట్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. త్వరలో ఈ దశ ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుత ఒడిదుడుకుల పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన రంగాలు, షేర్లపై దృష్టి సారిస్తూ నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి. క్యూ2 ఆర్థిక ఫలితాలు, పండుగ సీజన్ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ప్రకటనతో ఇన్ఫోసిస్ షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో నాలుగు శాతం లాభపడి రూ.1,474 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో ఐదుశాతానికి పైగా ర్యాలీ చేసి రూ.1,494 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎక్సే్చంజీలో 5.20 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.22,879 కోట్లు పెరిగి రూ.6.20 లక్షల కోట్లకు చేరింది. ►ఈ క్యూ2లో రికార్డు స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడంతో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ షేరు నాలుగు శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.130 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ. 132 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
ఈ ప్రకటనలు నమ్మొద్దు.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరిక
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఎయిమర్స్ ట్రేడర్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘సురజ్ మౌర్య అనే వ్యక్తి ఎయిమర్స్ ట్రేడర్ పేరుతో టెలిగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టి మోసవద్దు. దీనికి ఎక్ఛేంజీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో ఈ ఆగస్టులో రియల్ ట్రేడర్, గ్రో స్టాక్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్లను సైతం స్టాక్ ఎక్ఛేంజీ నిషేధించింది. -
ఢమాల్ స్ట్రీట్.. 17వేల దిగువకు నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 844 పాయింట్లు పతనమై 57,147 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257 పాయింట్లు క్షీణించి కీలకమైన 17వేల స్థాయి దిగువన 16,984 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 షేర్లకు గానూ యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, ఐటీ, కన్జూమర్ షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.61%, 1.47 శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4612 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2431 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు 2–3%, యూరప్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. రోజంతా నష్టాల్లోనే.. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 58,004 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 17,256 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకు మొగ్గుచూపాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు పతనమై 57,050 వద్ద నిఫ్టీ 291 పాయింట్లు క్షీణించి 16,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే... ఆరునెలల్లో ఆర్థిక మాంద్యం తప్పదని జేపీ మోర్గాన్ సీఈఓ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలవడంతో సెంటిమెంట్ దెబ్బతింది. రష్యా – ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. డాలర్ ఇండెక్స్ 113 స్థాయిపైకి చేరుకోవడంతో భారత కరెన్సీ బలహీనపడటం ఈక్విటీలపై మరింత ఒత్తిడి పెరిగింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆస్థిరతలకు తాజాగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తోడవ్వడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకొనేందుకు వెనుకాడారు. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, యూఎస్ ఫెడ్ మినిట్స్ విడుదల ముందు అప్రమత్తత చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున మార్కెట్లు కొంతకాలం ఒత్తిళ్లకు లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ క్యూ2 మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.., ఐటీ దిగ్గజం టీసీఎస్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయి రూ.3,069 వద్ద ముగిసింది. ♦ బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 4.3 ల క్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.270 లక్షల కోట్ల దిగువకు చేరింది. ♦అమెరికా ఆధారిత రూట్ వన్ హెడ్జ్ ఫండ్ మంగళవారం ఇండస్ ఇండ్కు చెందిన 1.20 కోట్ల ఈక్విటీ షేర్లను(1.54% వాటా) ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది. ఈ ♦ లావాదేవీ విలువ రూ. 1,401 కోట్లుగా ఉంది. ఇండస్ ఇండ్ షేరు 4% నష్టపోయి రూ.1,165 వద్ద స్థిరపడింది. -
బుల్ను పడేసిన బేర్..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణించడం, ఉక్రెయిన్–రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్లను పెంచొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 57800 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ సైతం 60 పాయింట్లు నష్ట పోయి 17180 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 10) నుంచి దేశీ ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. సోమవారం టీసీఎస్ క్యూ2 ఫలితాల్ని విడుదల చేయగా...విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఈక్విటీ మార్కెట్లో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి టెక్ కంపెనీల షేర్లు లాభాల వైపు పరుగులు తీస్తున్నాయి. వీటితోపాటు అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఆల్ట్రా టెక్ సిమెంట్, లార్సెన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అపోలో హాస్పిటల్, ఎథేర్ మోటార్స్, దివిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. -
మార్కెట్లో కొనసాగిన నష్టాలు
ముంబై: ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, మరో విడత యూఎస్ ఫెడ్ రేట్లను పెంచొచ్చన్న భయాలతో అంతర్జాతీయంగా బేరిష్ సంకేతాలు నెలకొన్నాయి. ఇవి మన మన మార్కెట్లపైనా ప్రభావం చూపించాయి. దీంతో ఇన్వెస్టర్లలో రిస్క్ ధోరణి తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి డాలర్ మారకంతో రూపాయి మరో కొత్త కనిష్టానికి చేరడం కూడా ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలో గరిష్టం నుంచి 800 పాయింట్లు పడిపోయింది. చివరికి 200 పాయింట్ల నష్టానికి (0.34 శాతం) పరిమితమై 57,991 వద్ద క్లోజయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 74 పాయింట్లు నష్టపోయి (0.43 శాతం) 17,241 వద్ద ముగిసింది. ►ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా నష్టాలను ఎదుర్కొన్నాయి. ►యాక్సిస్, టీసీఎస్, మారుతీ, విప్రో, ఇ న్ఫీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ లాభపడ్డాయి. ►సెన్సెక్స్ 30 కంపెనీల్లో 19 నష్టాల్లో ముగియడం ప్రతికూల సెంటిమెంట్ను తెలియజేస్తోంది. ►బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.87 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.58 శాతం చొప్పున నష్టపోయాయి. -
లాభాలకు బ్రేక్, రోజంతా నేలచూపులకే పరిమితమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ల బలహీనతలతో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. అయితే తొలి సెషన్తోపాటు, చివరి సెషన్లలో నామమాత్రంగా కోలుకున్నాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 31 పాయింట్లు క్షీణించి 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 17 పాయింట్లు తక్కువగా 17,315 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 371 పాయింట్లు కోల్పోయి 57,851 వద్ద కనిష్టానికి చేరింది. చమురు దేశాల (ఒపెక్) సరఫరా కోతలతో క్రూడ్ ధరలు పెరిగాయి. ఇది రూపాయిని దెబ్బతీసింది. యూఎస్సహా విదేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టైటన్ జోరు: ఎన్ఎస్ఈలో ఐటీ, ఆయిల్, ఫార్మా రంగాలు 0.75 శాతం క్షీణించగా.. కన్జూమర్ డ్యూరబుల్స్ 1.3 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్ 5.3% జంప్చేయడం ఇందుకు సహకరించింది. ఇతర బ్లూచిప్స్లో పవర్గ్రిడ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, మారుతీ 1.5–1% మధ్య పుంజుకోగా.. టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ, టీసీఎస్, ఐషర్, సీఐఎల్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్ 2–1% మధ్య నష్టపోయాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సైతం లాభాల బాట పట్టాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్ల లాభంతో 58471 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 17402 వద్ద కొనసాగుతోంది. హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్,జేఎస్డబ్ల్యూ స్టీల్, లార్సెన్, హెచ్సీఎల్ టెక్,టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, సిప్లా, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివిస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
‘బుల్ రంకెలేసింది’.. రికార్డుల మోత మోగించింది..ఇన్వెస్టర్లకు లాభాల పంట
ప్రపంచవ్యాప్తంగా బలపడిన సెంటిమెంటుతో దేశీయంగానూ స్టాక్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 58,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను మరోసారి అధిగమించాయి. అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. దీంతో మిడ్ క్యాప్స్ సైతం హైజంప్ చేశాయి. ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగందుకోవడంతో దేశీయంగానూ బుల్ కదం తొక్కింది. సెన్సెక్స్ 1,277 పాయింట్లు పురోగమించి 58,065 వద్ద నిలిచింది. నిఫ్టీ 387 పాయింట్లు జంప్చేసి 17,274 వద్ద స్థిరపడింది. వెరసి ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 పాయింట్ల మైలురాళ్లను సులభంగా దాటేశాయ్. ప్రారంభంనుండీ ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు క్యూ కట్టడంతో మార్కెట్లు రోజంతా భారీ లాభాలతో సందడి చేశాయి. దీనికితోడు ముందురోజు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలు ఆపి కొనుగోళ్లు చేపట్టడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు చెప్పారు. అన్ని రంగాలూ లాభాల్లోనే... ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీ 3 శాతం పుంజుకోగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ ద్వయం, కోల్ ఇండియా, టీసీఎస్, యూపీఎల్, హీరోమోటో, జేఎస్డబ్ల్యూ, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎల్అండ్టీ, విప్రో, ఐటీసీ, యాక్సిస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ 5–3 శాతం మధ్య జంప్ చేశాయి. బ్లూచిప్స్లో కేవలం పవర్గ్రిడ్ 1 శాతం నీరసించగా.. డాక్టర్ రెడ్డీస్ స్వల్పంగా క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద ప్లస్... స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ కావడంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) భారీగా ఎగసింది. ఒక్క రోజులోనే దాదాపు రూ. 5,66,319 కోట్లు జమయ్యింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.2,73,92,740 కోట్లకు బలపడింది. బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 2.3% జంప్చేయగా, అన్ని రంగాలూ బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ 2.4–1.4% చొప్పున పుంజుకున్నాయి. వీటికితోడు మెటల్స్, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్, ఐటీ 3%స్థాయిలో లాభపడటం మార్కెట్ విలువకు దన్నునిచ్చింది. రూపాయి అప్ డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బలపడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్లో 20 పైసలు పుంజుకుని 81.62 వద్ద ముగిసింది. దేశీ ఈక్విటీలలో వరుసగా రెండో రోజు విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడిదారులుగా నిలవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంట్రాడేలో రూపాయి 81.36 వరకూ పుంజుకుంది. 81.66 వద్ద కనిష్టాన్ని తాకింది. విదేశీ మార్కెట్లో డాలరు ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయి 111.20కు చేరింది. యూఎస్ దూకుడు... ఒక్కసారిగా మారిన పరిస్థితులతో సోమవారం అమెరికా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. మంగళవారం ట్రేడింగ్లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లు సైతం 2.5–3% మధ్య ఎగశాయి. కేంద్ర బ్యాంకు ఆరోసారి వడ్డీ రేట్లను పెంచడం ద్వారా తొమ్మిదేళ్ల గరిష్టం 2.6%కి ప్రామాణిక రేట్లను చేర్చినప్పటికీ ఆస్ట్రేలియా స్టాక్ ఇండెక్స్ 4% జంప్ చేసింది. తాజా గణాంకాలు డాలరు ఇండెక్స్, ట్రెజరీ ఈల్డ్స్ను దెబ్బతీశాయి. ఫెడ్ ఇకపై వడ్డీ రేట్ల పెంపు అంశంలో నెమ్మదించవచ్చన్న తాజా అంచనాలు స్టాక్స్ సహా పసిడి, వెండి, చమురు, క్రిప్టో కరెన్సీలకు డిమాండును పెంచినట్లు విశ్లేషకులు వివరించారు. -
‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా
లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరులుగా పేరొందిన పలువురిని స్టాక్ మార్కెట్లు భారీగా ముంచేస్తున్నాయి. ఒక్క రోజులోనే 2 లక్షల కోట్లు పైగా సంపదను ఆవిరి చేశాయి. బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్లు ఒక్క రోజులోనే సుమారు 25 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్లలో అదానీ, ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీల షేర్లు పతనం కావడంతో ఈ భారీ మొత్తం నష్టపోయారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు క్రాష్ అవ్వడంతో అదానీ ఒక్కరోజులోనే సుమారు రూ.78,913 కోట్ల నష్టం వాటిల్లింది. ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం..ఎలాన్ మస్క్ సుమారు రూ.1.26లక్షల కోట్లు నష్టపోయినట్లు తేలింది. టెస్లా షేర్ల పతనంతో కార్ల తయారీ సంస్థ మార్కెట్ విలువ 71 బిలియన్ డాలర్లు క్షీణించిందని రాయిటర్స్ నివేదించింది. భారీ నష్టాలు ఉన్నప్పటికీ, మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, లూయిస్ విట్టన్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్, తరువాత అదానీ ప్రపంచంలోనే 4వ కుబేరుడిగా కొనసాగుతున్నారు. రోజుకు రూ.1612కోట్ల సంపాదన బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేగ గౌతమ్ అదానీ సంపద.. గత ఏడాది 116శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2022 జాబితా వెల్లడించిన విషయం తెలిసిందే. గత ఏడాది రోజుకు సగటున రూ.1612 కోట్లు అదానీ అర్జించారు. మొత్తంగా 10 లక్షల 94 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించారు. వేగంగా పెరుగుతోంది అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద అత్యంత వేగంగా పెరుగుతోంది. సరిగ్గా 10ఏళ్ల క్రితం ముఖేష్ అంబానీ సంపదలో 6వ వంతు సంపద కలిగిన అదానీ ఇప్పుడు ముఖేష్ ను దాటి చాలా ముందుకు వెళ్లారు. ప్రపంచ కుబేరుల్లో ఏకంగా రెండవ స్థానాన్ని సంపాదించుకున్నారు. రూ. 10.94 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. 2022 అచ్చిరాలేదు ఈ ఏడాది సంపన్నులకు చేదు జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఆరు నెలల వ్యవధిలో ప్రపంచ బిలయనీర్ల సంపద భారీగా తరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద ఈఏడాది ఆరంభం నుంచి 62 బిలియన్ డాలర్లకు తగ్గింది. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 63 బిలియన్ డాలర్లుకు కరిగిపోయింది. మెటా అధిపతి మార్క్ జుకర్ బెర్గ్ సంపద ఏకంగా సగానికి పైగా తగ్గింది. 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి 2022లో ఇప్పటి వరకు బిలియనీర్ల జాబితాలో తొలి 500మంది కుబేరుల సంపద 2022లో తొలి అర్ధ భాగంలో 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరయ్యింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్ధిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు భారీగా ఉద్దీపన పథకాల్ని ప్రకటించగా.. టెక్ సంస్థలు భారీగా లాభాల్ని అర్జించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల అధినేతల సంపద కూడా పెరిగింది. తాజాగా కోవిడ్ సంక్షోభం తగ్గుతుండడంతో ప్రభుత్వాలు ఉద్దీపనల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లను కూడా పెంచేందుకు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల షేర్లు కుదేలై కుబేరుల సంపద కరిగిపోతుంది. -
యూకే కీలక నిర్ణయం, భారీ లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
జాతీయ, అంతర్జాతీయ అనుకూల పరిస్థితులు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి. ముఖ్యంగా యూకే ప్రభుత్వం ధనికులపై భారీ పన్నులను తొలగించడానికి ఇటీవల ఓ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నింది. అయితే తాజాగా ఆ విధానాన్ని ఉపసహరించుకున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. వెరసీ మార్కెట్లలో ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.23 గంటల సమయానికి 1191 పాయింట్ల భారీ లాభంతో సెన్సెక్స్ 57960 వద్ద, నిఫ్టీ 349 పాయింట్ల లాభంతో 17236 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, లార్సెన్, ఎథేర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిం, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియాలు లాభాల్ని గడిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్స్ నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..పతనమైన బ్యాంకు షేర్లు
జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో అక్టోబరు నెలకు స్టాక్ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, అదే సమయంలో చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించవచ్చనే అంచనాలతో చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ఉదయం 10.20గంటల సమయానికి సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 56921 వద్ద నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 16962 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ,సిప్లా, సన్ఫార్మా, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్పొ,యూపీఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా, మారుతి సుజికీ, ఎథేర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, నెస్లే, టాకా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీఎసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం, స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నేడు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరుగుతుండగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.15గంటల సమయానికి సెన్సెక్స్ 63.83 పాయింట్ల లాభంతో 56488 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 16837 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం,అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 59138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17629 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. హిందాల్కో,జేఎస్డబ్ల్యూ స్టీల్,ఐసీఐసీఐ బ్యాంక్,అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెసీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అథేర్ మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి. -
ఫ్లాట్గా దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఆయా కార్పొరేట్ కంపెనీల వార్షిక ఫలితాలు , చమురు ధరలు దిగిరావడంతో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు సిద్ధమయ్యారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సెన్సెక్స్ అత్యంత స్వల్పంగా 10 పాయింట్లు నష్టపోయి 60287 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ కేవలం 3పాయింట్ల నష్టపోయి 39527పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక అదానీ పోర్ట్,టెక్ మహీంద్రా,లార్సెన్, కొటక్ మహీంద్రా,ఇన్ఫోసిస్,హెచ్సీఎల్ టెక్, విప్రో, ఎథేర్ మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, శ్రీరామ్ సిమెంట్,టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,హెడ్ఎఫ్సీ లైఫ్,అపోలో హాస్పటల్,కోల్ ఇండియా, సన్ ఫార్మా,బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందంటే?
ముంబై: హోల్సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్ట్రెండ్లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
మళ్లీ 59 వేల పైకి సెన్సెక్స్!
ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం ఒక శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 515 పాయింట్లు పెరిగి 59,333 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 తర్వాత ఈ సూచీ 59 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 124 పాయింట్లు బలపడి 17,659 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 503 పాయింట్లు పెరిగి 59,320 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 17,711 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. మార్కెట్ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో కొంత మేర లాభాలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,298 కోట్ల షేర్లను కొనడంతో పదోరోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.730 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో జపాన్, యూరప్లో బ్రిటన్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. లాభాలు ఎందుకంటే... అమెరికా జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే సమీక్షా సమావేశాల్లో కఠినతర ద్రవ్య పాలసీ వైఖరికి స్వస్తి పలుకుతూ.., వడ్డీరేట్లపై దూకుడు విధానాన్ని ప్రదర్శించకపోవచ్చనే ఆశావహ అంచనాలు మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు తగ్గడం, క్రూడ్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు పదోరోజూ దేశీయ ఈక్విటీలను కొనేందుకు మొగ్గుచూపడం తదితర అంశాలను నుంచీ సానుకూల సంకేతాలను అందాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦బ్యాంకింగ్ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకు రెండుశాతం పెరిగి రూ.866 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్ ముగిసే సరికి షేరు 1.5% లాభంతో రూ.859 వద్ద ముగిసింది. ♦జూన్ క్వార్టర్ ఫలితాలు మెప్పించడంతో కోల్ ఇండియా షేరు ఇంట్రాడేలో మూడుశాతం లాభపడి రూ.226 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. అనంతరం లాభాల స్వీకరణతో చివరికి అరశాతం స్వల్ప లాభపడి రూ.219 వద్ద స్థిరపడింది. ♦కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం రెండు రెట్లు వృద్ధి చెందడంతో ఐషర్ మోటార్స్ షేరు 3% పైగా రాణించి రూ.3261 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి అర శాతం లాభంతో రూ.3,175 వద్ద నిలిచింది. రూపాయి బలహీన ధోరణి... డాలర్ మారకంలో రూపాయి బలహీనత ధోరణిని ప్రతిబింబిస్తూ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ 37 పైసలు నష్టపోయి 79.62 వద్ద ముగిసింది. దేశంలోకి క్యాపిటల్ఇన్ఫ్లోస్, ఈక్విటీ మార్కెట్ల సానుకూలతలు ఉన్నా రూపాయి బలహీనపడ్డం గమనార్హం. -
వారం రోజుల్లో రూ.14 వేల కోట్ల కొనుగోళ్లు..ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే!
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలో స్టాక్ సూచీల స్థిరీకరణకు వీలుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని చెబుతున్నారు. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు కీలకమంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. చైనా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అమెరికా వైట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చేయడంతో ప్రపంచ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొహర్రం సందర్భంగా మంగళవారం(ఆగస్టు 9న) సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. ‘‘గడిచిన నెలన్నర రోజుల్లో సూచీలు 19% ర్యాలీ చేసిన నేపథ్యంలో మార్కెట్ ఓవర్బాట్ పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికీ సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉన్నందున సూచీల స్థిరీకరణకు వీలుంది. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీ అప్ట్రెండ్లో 17,500 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. కీలకమైన ఈ స్థాయిని అధిగమించగలిగే 17,800–17,900 శ్రేణిలో మరో నిరోధం ఎదురుకావొచ్చు. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17300–17180 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం., వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో గతవారంలో స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. ఐటీ, మెటల్, ఆటో, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 818 పాయింట్లు, నిఫ్టీ 239 పాయింట్లు లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా, చైనాలు బుధవారం(10న) జూలై ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఆర్థికంగా అగ్ర రాజ్యాలైన ఈ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మక, కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. ఇక దేశీయంగా.., జూలై నెల రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలతో పాటు జూన్ మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా శుక్రవారం(12న) విడుదల కానుంది. అదేరోజున ఆర్బీఐ ఆగస్టు ఐదో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూలై 29వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. చివరి దశకు క్యూ1 ఫలితాలు దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన ఘట్టం చివరి దశకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ ముందుగా నేడు ఎస్బీఐ, హెచ్సీఎల్, బీపీసీఎల్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 2,400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఐషన్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, దివీస్ ల్యాబ్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. వారం రోజుల్లో రూ.14 వేల కోట్ల కొనుగోళ్లు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు తొలివారంలో రూ.14,175 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, దేశీయ కార్పొరేట్ జూన్ క్వార్టర్ ఫలితాలు మెప్పించడం ఇందుకు కారణమని నిపుణులంటున్నారు. జూలైలో రూ.5 వేల కోట్ల విలువైన షేర్లను కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు(తొమ్మిది నెలల్లో) ఎఫ్పీఐలు దాదాపు రూ. 2.46 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. ‘‘రూపాయి రికవరీ, అందుబాటు ధరల వద్ద క్రూడాయిల్ లభ్యత తదితర అంశాల నేపథ్యంలో మరికొంతకాలం పాటు ఎఫ్ఐఐలు ధోరణి సానుకూలంగా ఉండొచ్చు’’ అని యస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు హితేశ్ జైన్ తెలిపారు. -
వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం!
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్ పిరియడ్ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి. లాకిన్ పిరియడ్ పూర్తయిన జులై 25న ఒక్కరోజే సుమారు వెయ్యికోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నష్టాల్ని బేరీజు వేసుకొని వాటి నుంచి బయటపడేందుకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జొమాటో సంస్థ జొమాటోతో పాటు బ్లింకింట్, హైపర్ ప్యూర్, ఫీడింగ్ ఇండియా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే వాటి నిర్వహణ కష్ట తరంగా మారాయి.నష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.ఈ క్రమంలో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎటర్నల్ పేరుతో జొమాటోతో పాటు బ్లింకింట్, హైపర్ ప్యూర్, ఫీడింగ్లను ఒకేతాటికింద తీసుకొని రానున్నారు. ఆ సంస్థలకు శాశ్వతంగా నలుగురు సీఈవోల్ని నియమించనునున్నారు. తద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేయడంతో, వ్యాపార నిర్వహణ, నష్టాల్ని నివారించవచ్చని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ 'నేను సీఈవోగా ఉన్న కంపెనీ నుంచి ఇతర సంస్థలకు సైతం సీఈవోల్ని నియమించబోతున్నాం. ఒకరికొకరు పోటీ పడుతూ ఒక సూపర్ టీమ్గా పని చేస్తారంటూ ' అభిప్రాయం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న నష్టాలు బీఎస్ఈలో జొమాటో స్టాక్స్ నష్టాల పరపరం కొనసాగుతుంది. గత శుక్రవారం బీఎస్ఈ మార్కెట్లో జొమాటో షేర్ రూ.46.80 వద్ద ముగిసింది. ఇక ఈ(సోమవారం) వారం ప్రారంభంలో సైతం నష్టాల్ని చవిచూశాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో 0.30శాతం నష్టపోయి రూ.46.50వద్ద ముగిసింది. -
మార్కెట్ ర్యాలీకి రిలయన్స్ దన్ను!
ముంబై: చమురు శుద్ధి కంపెనీలపై కేంద్రం విధించిన విండ్ఫాల్ పన్ను విధింపు రద్దుతో నాలుగోరోజూ బుల్స్ పరుగులు తీశాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు ప్రారంభించడం, ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సెంటిమెంట్ను మరింత బలోపేతం చేశాయి. ఐటీ, ఇంధన, మెటల్ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్ 630 పాయింట్లు పెరిగి 55,398 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 180 పాయింట్లు బలపడి 16,521 వద్ద నిలిచింది. ఆటో, మీడియా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1781 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్ సూచీ ఒకశాతానికి ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.1.57 లక్షల కోట్లు పెరిగి రూ.258.12 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో నమోదైన ప్రతి పది కంపెనీ షేర్లలో ఏడు షేర్లు లాభపడ్డాయి. 150 స్టాకులు అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 22 షేర్లు, నిఫ్టీ–50 షేర్లలో 36 షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా సెన్సెక్స్ 718 పాయింట్ల లాభంతో 55,486 వద్ద, నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 16,563 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 862 పాయింట్లు బలపడి 55,630 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు దూసుకెళ్లి 16,588 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. మిడ్సెషన్ తర్వాత గరిష్టస్థాయిల వద్ద అమ్మకాలు జరగడంతో సూచీలు కొంతమేర లాభాలను కోల్పోయాయి. ♦కేంద్రం ఇటీవల ముడిచమురు సంస్థలపై విధించిన విండ్ఫాల్ పన్ను తగ్గించింది. ఇంధన ఎగుమతులపైనా ఎక్ఛేంజ్ సుంకాన్ని కుదించింది. ప్రభుత్వ తాజా సవరణలతో అధిక వెయిటేజీ రిలయన్స్ (2.50% అప్) ప్రభావంతో ఇంధన షేర్లన్నీ రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం లాభాల్లో రిలయన్స్ షేరు వాటాయే 165 పాయింట్లు కావడం విశేషం. ♦దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా మూడోరోజూ కొనుగోళ్లు చేపట్టడం సెంటిమెంట్ మరింత బలపరిచింది. గత నెలలో రూ.5,0203 కోట్ల షేర్లను అమ్మేసిన ఎఫ్ఐఐలు ఈ జూలైలో ఇప్పటివరకు(20 తేదీ) రూ.8,847 కోట్ల విక్రయాలకే పరిమితమయ్యారు. ♦కీలక కంపెనీల కార్పొరేట్ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు మూడువారాల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. చైనా కేంద్ర బ్యాంకు రుణాల ప్రామాణిక రేటును యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లు బుధవారం 2% లాభపడ్డాయి. మరిన్ని సంగతులు ♦విండ్ఫాల్ ట్యాక్స్ విధింపు కోత, మధ్యంతర డివిడెండ్ ప్రకటన అంశాలు వేదాంత షేరుకు డిమాండును పెంచాయి. బీఎస్ఈలో ఈ షేరు ఆరుశాతం పెరిగి రూ.253 వద్ద ముగిసింది. ♦జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నాలుగు నష్టంతో రూ.1,217 వద్ద నిలిచింది. ♦మార్కెట్ క్యాప్ విషయంలో ఎల్ఐసీ(రూ.4.35 లక్షల కోట్లు)ని ఎస్బీఐ (రూ.4.53 లక్షల కోట్లు) అధిగమించిన నేపథ్యంలో ఎస్బీఐ షేరు రెండుశాతం లాభపడి రూ.509 వద్ద స్థిరపడింది. -
నష్టాల్లోంచి లాభాల్లోకి,దేశీయ మార్కెట్లో..విదేశీ ఇన్వెస్టర్ల హవా!
ముంబై: బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. ఉదయం సెషన్లో 288 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 246 లాభంతో 54,768 వద్ద ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 62 పాయింట్ల లాభంతో 16,341 వద్ద నిలిచింది. ఇంధన, ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.976 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.101 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో కొత్త ఆల్టైమ్ కనిష్ట స్థాయి 80.05ను తాకింది. చివరికి 6 పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టంతో 54,251 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లను కోల్పోయి 16,187 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. అయితే, దేశీయ మార్కెట్లోని సానుకూలతల ప్రభావానికి తోడు బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్లు నెలకొనడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ... n అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ సెక్టార్పై కూడా విండ్ఫాల్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో గెయిల్, ఓఎన్జీసీ షేర్లు 2–3% నష్టపోయాయి. n గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చని పరిశ్రమ వర్గాల అంచనాలతో టీవీఎస్ మోటార్, ఐషర్ మోటార్స్ షేర్లు 1–2 శాతం లాభపడ్డాయి. -
మార్కెట్లకు బ్లూచిప్స్ దెబ్బ!
ముంబై: ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన డాలర్ ఇండెక్స్ దెబ్బకు సరికొత్త కనిష్టాలను తాకుతున్న రూపాయి దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. దీనికితోడు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ఫలితాల తదుపరి ఐటీ కౌంటర్లలో ఊపందుకున్న అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరిచాయి. వెరసి వరుసగా రెండో రోజు ఇండెక్సులు నష్టాలతో ప్రారంభమై చివరికి పతనమయ్యాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు క్షీణించి 53,887 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు కోల్పోయి 16,058 వద్ద స్థిరపడింది. ప్రధానంగా మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 54,000 పాయింట్ల దిగువన 53,825ను తాకింది. నిఫ్టీ కనిష్టంగా 16,031కు చేరింది. ఎన్టీపీసీ ఓకే..: ఎన్ఎస్ఈలో రియల్టీ(0.1%) మినహా అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ఆటో, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, హిందాల్కో, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, గ్రాసిమ్, టామో, నెస్లే, హెచ్సీఎల్ టెక్, బ్రిటానియా, యూపీఎల్, హెచ్యూఎల్, అల్ట్రాటెక్, కొటక్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఐసీఐసీఐ, మారుతీ 3.3–1.3 శాతం నష్టపోయాయి. ఎన్టీపీసీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4 శాతం బలపడింది. ప్రపంచ ఆర్థిక మందగమనం, కేంద్ర బ్యాంకుల కఠిన విధానాల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలోనూ సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79.6ను తాకడం దీనికి జత కలసినట్లు చెప్పారు. చిన్న షేర్లు వీక్..: మార్కెట్ల బాటలో చిన్న, మధ్యతరహా కౌంటర్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,871 నష్టపోగా.. 1,436 లాభపడ్డాయి. ఎఫ్పీఐల వెనకడుగు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐపీలు) మంగళవారం రూ. 1,566 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 141 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ♦ గత 8 రోజులుగా ర్యాలీ బాటలో ఉన్న మహీంద్రా ఫైనాన్షియల్ ఇంట్రాడేలో రూ. 207 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 8 రోజుల్లో 18 శాతం లాభపడింది. ♦ భారీ ఆర్డర్బుక్ నేపథ్యంలో టిటాగఢ్ వేగన్స్ రూ. 128 వద్ద 4ఏళ్ల గరిష్టానికి చేరింది. చివరికి 3.6 శాతం నష్టంతో రూ. 120 వద్ద ముగిసింది. -
నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు!
జాతీయ, అంతర్జాతీయ అంశాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం స్టాక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలను వెంటాడుతున్న మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు,పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు నివేదికలు వెలుగులోకి రావడం దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు కారణమయ్యాయి. వెరసీ బుధవారం మార్కెట్లు ప్రారంభంలో సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 53,486 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 15,898 వద్ద కొనసాగించింది. కానీ కొద్ది సేపటికే మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి. దీంతో ఉదయం 10.36గంటలకు సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టపోయి 53423 వద్ద..నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 15883 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, ఎథేర్ మోటార్స్,హెచ్యూఎల్, ఎంఅండ్ ఎం, బ్రిటానియా, హీరో మోటా కార్ప్, మారుతి సుజికీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్జీసీ, హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, జేఎస్డ్ల్యూ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
అదనపు పన్నుల ఎఫెక్ట్, ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు!
ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యంతో పాటు దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు, ఆయా కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని లాభాల వైపు మొగ్గుచూపడం..కొద్ది సేపటికే తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 10గంటల సమయానికి సెన్సెక్స్ 201 పాయింట్లు నష్టపోయి 52706 వద్ద నిఫ్టీ 75 పాయింట్ల పతనంతో 15676 వద్ద కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, హెచ్యూఎల్, హీరో మోటో కార్పొ, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్డ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, టీసీఎస్,సిప్లా, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎంఅండ్ ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
రిలయన్స్ అండ,స్టాక్ మార్కెట్లో లాభాల పరుగు!
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రాణించడంతో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలకు రెండురోజుల తర్వాత లాభాలొచ్చాయి. ఇటీవల దిద్దుబాటుకు లోనైన ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 437 పాయింట్లు పెరిగి 55,818 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్లు దూసుకెళ్లి 16,628 వద్ద నిలిచింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న తరహా షేర్లకు అధిక డిమాండ్ లభించడంతో బీఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆరశాతానికి పైగా లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.452 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.131 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి 77.60 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ‘‘జీఎస్టీ వసూళ్లు మే లో ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు అదే నెలలో తయారీ రంగం వృద్ధి కనబరచడంతో ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రికవరీ పట్ల మార్కెట్ వర్గాలకు విశ్వాసం నెలకొంది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం సెంటిమెంట్ను బలపరిచింది’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ట్రేడింగ్ నుంచీ స్థిరమైన కొనుగోళ్లు ఉదయం సెన్సెక్స్ ఒక పాయింటు లాభంతో 55,382 వద్ద 306 పాయింట్ల నష్టంతో 55,622 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల పతనంతో 16,482 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలుత కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తేరుకొని స్థిరంగా రాణించాయి. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్ 511 పాయింట్ల బలపడి 55,892 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు దూసుకెళ్లి 16,646 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ర్యాలీకి రిలయన్స్ దన్ను రిలయన్స్ షేరు మూడున్నర శాతం సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. సెన్సెక్స్ ఆర్జించిన 436 పాయింట్లలో ఈ షేరు వాటా 281 పాయింట్లు కావడం విశేషం. తన అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్(ఆర్బీఎల్).., బొమ్మల తయారీ ఇటాలియన్ కంపెనీ ప్లాస్టిక్ లెగ్నో ఎస్పీఏ ఇండియాతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో షేరుకు డిమాండ్ నెలకొంది. ఇంట్రాడేలో నాలుగు శాతం బలపడి ఆర్ఐఎల్ షేరు చివరికి మూడున్నర శాతం లాభంతో రూ.2,725 వద్ద ముగిసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►రుణాల్లో కూరుకుపోయిన తన అనుబంధ సంస్థ రిలిగేర్ ఫిన్వెస్ట్ వన్టైమ్ సెటిల్మెంట్ ఆఫర్కు రుణదాతలు ఆమోదం తెలపడంతో రిలిగేర్ ఎంటర్ప్రైజస్ షేరు 12% లాభపడి రూ.137 వద్ద ముగిసింది. ►సప్లై సమస్యలతో తన తొలి ఎలక్ట్రానిక్ వెహికల్(ఈవీ) లాంచింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో హీరో మోటోకార్ప్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,663 వద్ద స్థిరపడింది. ►అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పెంచడంతో డెల్హివరీ షేరు ఆరుశాతం లాభపడి రూ.570 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 15% ర్యాలీ చేసి రూ.617 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
నిఫ్టీ డౌన్, 25లక్షల షేర్లను అమ్మేసిన రాకేష్ ఝున్ఝున్వాలా!
ముంబై: ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమై 55,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 16,523 వద్ద నిలిచింది. జీడీపీతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించకపోవడం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడం, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. స్టాక్ సూచీలు జూన్ తొలి ట్రేడింగ్ సెషన్ను స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ 55,091 వద్ద కనిష్టాన్ని, 55,791 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 210 పాయింట్ల శ్రేణిలో 16,439 – 16,649 పరిధిలో ట్రేడైంది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలు కొంతమేర తగ్గాయి. చిన్న తరహా షేర్లలో ఎక్కువగా విక్రయాలు తలెత్తడంతో బీఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆరశాతానికి పైగా నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,930 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.984 కోట్ల షేర్లు కొన్నారు. ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలు వీడకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టస్థాయి నుంచి 20 పైసలు రికవరీ అయ్యి 77.51 స్థాయి వద్ద స్థిరపడింది. లిస్టింగ్ లాభాలన్నీ మాయం లిస్టింగ్ లాభాల్ని నిలుపుకోవడంలో ఈ–ముద్ర షేరు విఫలమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.256)తో పోలిస్తే ఆరుశాతం ప్రీమియంతో రూ.271 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% ఎగిసి రూ.279 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి ఒకశాతం స్వల్ప లాభంతో రూ.259 వద్ద స్థిరపడింది. మొత్తం 5.54 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,020 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా తన మొత్తం వాటా(7.1%)లో ఒకశాతం వాటా(25 లక్షల షేర్లు)ను విక్రయించడంతో డెల్టా కార్పొరేషన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.212 వద్ద స్థిరపడింది. ఒక దశలో 7% క్షీణించి రూ.202 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ►బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో హెచ్డీఎఫ్సీ షేరు ఒకశాతం లాభపడి రూ.2,329 వద్ద నిలిచింది. ►గోవా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని విక్రయించడంతో జువారీ ఆగ్రో షేరు ఏడుశాతం బలపడి రూ.148.25 వద్ద ముగిసింది. -
పెరిగిన ఇన్వెస్టర్ల సంపద! 3రోజుల్లో..రూ.10.19 లక్షల కోట్లు!
ముంబై: జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో స్టాక్ సూచీలు సోమవారం నెలరోజుల గరిష్టం వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 1,041 పాయింట్లు బలపడి 55,925 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 309 పాయింట్లు పెరిగి 16,661 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. సెన్సెక్స్ 30 షేర్లలో 4 షేర్లు.., నిఫ్టీ 50 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఐటీ, ఇంధన షేర్లకు భారీగా డిమాండ్ నెలకొంది. విస్తృతస్థాయి మార్కె ట్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు రెండుశాతానికి పైగా లాభపడ్డాయి. చాలా ట్రేడింగ్ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎఫ్ఐఐలు 502 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1524 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు మెరుగైన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు తోడు ఆశించిన స్థాయిలో స్థూల గణాంకాల నమోదుతో అమెరికా స్టాక్ మార్కెట్ల ఏడు వారాల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత వారంలో ఎస్అండ్పీ ఆరున్నర శాతం, నాస్డాక్ 2% ర్యాలీ చేశాయి. ఆర్థిక అగ్రరాజ్యం యూఎస్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం ఆసియా మార్కెట్లు రెండుశాతం, యూరప్ మార్కెట్లు ఒకశాతం బలపడ్డాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులను అనుసరిస్తున్న దేశీయ మార్కెట్కు ఈ అంశం కలిసొచ్చింది చైనాలో ఆంక్షల సడలింపు కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో చైనాలో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో బీజింగ్, షాంఘైలో అన్నిర కార్యకలాపాల నిర్వహణ వీలు కలిగింది. అలాగే లాక్డౌన్ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అధిక వెయిటేజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 4.50% – ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన పాయింట్లలో ఈ 5 షేర్ల వాటా 650 పాయిం ట్లు కావడం విశేషం. కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు ఇటీవల రూపాయి పతనంతో ఐటీ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. 3రోజులే, రూ.10.19 లక్షల కోట్లు గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 2,176 పాయింట్లు బలపడటంతో బీఎస్ఈలో రూ.10.19 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258.47 లక్షల కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2020 తర్వాత తొలిసారిగా గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా వారం రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడాయి. కానీ ఈ వారంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగిన నష్టాలకు స్టాక్ మార్కెట్లు చెక్ పెట్టాయి. దీంతో సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లుతో 0.34 శాతం పెరిగి 52,974 వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లతో 0.38 శాతం పెరిగి 15,842 వద్ద స్థిరపడింది. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్,ఎన్టీపీసీ,యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్ బీఐ, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలతో ముగియగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్,శ్రీ సిమెంట్, ఏసియన్ పెయింట్స్,ఐటీసీ, గ్రాసిం, దివిస్ ల్యాబ్స్,టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్ షేర్లు నష్టాల పాలయ్యాయి. -
అలెర్ట్ :ఈ వారంలో స్టాక్ మార్కెట్కు వరుస సెలవులు! ఎందుకంటే?
ముంబై: మూడురోజులే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం, ద్రవ్యోల్బణం అంశాలు స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. మహవీర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం, గుడ్ ఫ్రైడ్ సందర్భంగా శుక్రవారం ఎక్స్ఛేంజీలకు సెలవు. కావున ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానుంది. వెరండా లెర్నింగ్స్ సెల్యూషన్స్ షేర్లు నేడు., హరిఓం పైప్ ఇండస్ట్రీస్ షేర్లు ఎల్లుండి ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో గత వారంలో సెన్సెక్స్ గత వారం మొత్తంగా సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లను ఆర్జించాయి. ‘‘సంకేతాలు కన్సాలిడేషన్కు అనుకూలంగా ఉన్నాయి. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభ నేపథ్యంలో పలు షేర్లు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వొచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఈ వారంలోనూ కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 18,100 పాయింట్ల వద్ద కీలక నిరోధాన్ని చేధించాలి. ఒకవేళ అమ్మకాలు జరిగితే 17,600 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కార్పొరేట్ల ఫలితాల సందడి షురూ దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నేడు నాలుగో త్రైమాసికం(క్యూ4)తో పాటు పూర్తి ఏడాది (2020 – 21) గణాంకాలను ప్రకటించి స్టాక్ మార్కెట్లో ఆర్థిక ఫలితాల సందడిని షురూ చేయనుంది. ఇన్ఫోసిస్ బుధవారం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లు శనివారం తమ క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించున్నాయి. వీటితో పాటు అలోక్ ఇండస్ట్రీస్, బిర్లా టైర్స్, డెల్టా కార్ప్, అనంద్ రాఠీ వెల్త్, హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్, ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ సర్వీసెస్ గణాంకాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్వార్టర్ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి. అదేరోజున ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ డేటా వెలువడునుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గతవారంలో ఆర్బీఐ పాలసీ కమిటీ 2022–23 సంవత్సరానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతానికి పెంచింది. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడం కొంత ఆందోళనకరమైన అంశమని నిపుణులంటున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ ఆర్థిక అంశాలు మార్కెట్ గమనానికి కీలకమని వారంటున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సంక్షోభం ఉక్రెయిన్ రష్యా యుద్ధం 46వ రోజుకు చేరుకుంది. నెలన్నరైనా పోరు ఆగకపోవడం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కలవరపాటుకు గురిచేస్తోంది. రష్యా దళాలు రాజధాని కీవ్ నుంచి వెనుదిరిగినా.., తూర్పు ప్రాంతంలో దాడిని తీవ్రతరం చేసింది. యుద్దం ఆగేందుకు దౌత్య మార్గాలను వెతకడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఆరు సెషన్లలో రూ.7,707 కోట్ల విదేశీ నిధులు ఆరు నెలల వరుస విక్రయాలు తర్వాత ఈ ఏప్రిల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల తొలి ఆరు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.7,707 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఇటీవల కరెక్షన్లో భాగంగా దిగివచ్చిన షేర్లను ఎఫ్ఐఐలు కొంటున్నారని మార్నింగ్స్టార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిరతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం మారుతూ ఉంటుందన్నారు. -
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు, 60 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. శుక్రవారం సెన్సెక్స్ మార్కెట్ల ప్రారంభ సమయంలో 60,000 మార్క్ మైలురాయిని టచ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్ 50వేల మార్క్ను క్రాస్ చేయగా కేవలం ఆరునెలల్లో మరో 10 వేల పాయింట్లను టచ్ చేసి అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడుతున్నాయి. ఇక శుక్రవారం ఉదయం 9.44 గంటల సమయానికి సెన్సెక్స్ 319.68 పాయింట్ల లాభంతో 60,205 ట్రేడింగ్ చేయగా నిఫ్టీ 90.2 పాయింట్ల లాభంతో 17913 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్,ఇండస్ఇండ్ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్,హెచ్సీఎల్ టెక్,టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్,ఎన్టీపీసీ,టైటన్,బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?! -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. కాగా, మారుతి సుజికి,డీఆర్ఎల్,బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్,బాటా ఇండియా, గోద్రెజ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
ఇన్వెస్టర్ల అప్రమత్తత, ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఫైనాన్షియల్, టెలికాం స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడిల మధ్య గురువారం సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 55,990 వద్ద నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 16,656 వద్ద మిశ్రమ లాభాలతో ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. జైడుస్ వెల్ నెస్, అదానీ గ్రీన్, అదానీ గ్యాస్, శ్రీ రెన్,సుగ్, లక్ష్మీ మెషీన్,థర్మాక్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ షేర్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ అనుమతులు లభించడంతో పాటు జాక్సన్ హోల్ వార్షిక సమావేశం యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
మంగళవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు..రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం వంటి అంశాలు మార్కెట్పై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 10.50 స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మాస్ ఫిన్ సర్వీస్, డీసీఎం శ్రీరామ్, అపోలో హాస్పిటల్, eClerx సర్వీసెస్, పెట్రో నెట్ ఎల్ఎన్జీ స్టాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాల్లో స్కాక్ మార్కెట్, రికార్డ్ స్థాయిల్ని నమోదు చేసిన నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ఫలితాలతో వస్తుండటంతో పాటు జులైకి సంబంధించి అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్టుగా వార్తలు రావడంతో స్టాక్మార్కెట్ పుంజుకుంది. గురువారం ఉదయం మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీంతో బీఎస్సీ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి. 16,000 మార్క్ దాటినప్పటి నుంచి నిఫ్టీ లో బుల్ జోరు కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,641 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లన పొందుతూ ఉదయం 9:45 గంటల సమయంలో 77 పాయింట్లు లాభపడి 54,603 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 16,300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో కెమ్ప్లాస్ట్ సన్మార్ సబ్స్క్రిప్షన్కి ఇవాలే ఆఖరి రోజు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు, జోరును కొనసాగిస్తున్న బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బ్యాంక్,ఆటో,మెటర్ల షేర్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దేశీయ మార్కెట్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మార్కెట్లు ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరిగాయి. దీంతో బుధవారం మార్కెట్ 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 32.99 పాయింట్లతో(0.8%) 54,599.50 ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 20.20 పాయింట్లు (0.12%) పెరిగి 16,300 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది టాటాస్టీల్, ఎన్టీపీసీ, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజూకి లాభాల్లో ఉండగా టెక్ మహీంద్రా, సన్ఫార్మా, నెస్టల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కార్ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పోరేషన్ సబ్స్క్రిప్షన్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి, -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
న్యూఢిల్లీ: గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ రోజు సెన్సెక్స్ 53,044.01 పాయింట్ల వద్ద పైకి ఎగిసింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి కంటే ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి 33 పాయింట్లు పెరిగి నిఫ్టీ 15,886.75 పాయింట్లను నమోదు చేసింది. మార్కెట్లు ప్రారంభం కాగానే ఐటీ షేర్లు జోరందుకున్నాయి. 1.90పాయిట్లతో ఎల్ అండ్ టీ, 1.59శాతంతో హెచ్సీఎల్,1.67శాతంతో టెక్ మహీంద్రా,1.12శాతంతో విప్రో,రిలయన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ లాభాలతో కొనసాగుతుండగా బ్లూచిప్ స్టాక్స్ సైతం వాటితో పోటీ పడుతున్నాయి. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్షియల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. -
స్టాక్ ఎక్సేంజీలపై సెబీ కన్నెర్ర !
ముంబై: స్టాక్ ఎక్సేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కన్నెర్ర చేసింది. ట్రేడింగ్ విషయంలో సాంకేతిక ఇబ్బందుల పేరుతో ఇన్వెస్టర్లను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. నాలుగు గంటలకు మించి టెక్నికల్ గ్లిచెస్ కొనసాగితే భారీగా జరిమానాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రంగంలోకి సెబీ నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో 2021 ఫిబ్రవరి 24న టెక్నికల్ ఇష్యూస్తో 4 గంటల పాటు ట్రేడింగ్ నిలిచి పోయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్స్, డిపాజిటరీలులకు కీలక ఆదేశాలు సెబీ జారీ చేసింది. టెక్నికల్ సమస్యలు తలెత్తితే రోజుకు కనిష్టంగా లక్ష రూపాయల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు జరిమానా విధిస్తామంది. అంతేకాదు ఎమ్ఐఐల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు(సీటీఓ)ల వార్షిక వేతనంలో 10 శాతం వరకు కోత పెడతామని తేల్చి చెప్పింది. టెక్నికల్ ఇష్యూస్పై సెబీ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ - ఒకటి లేదా ఎక్కువ కీలక వ్యవస్థల్లో టెక్నికల్ గ్లిచెస్ వస్తే 30 నిమిషాల్లోగా పరిష్కరించాలి. లేదంటే గంటలోగా దానిని ‘డిజాస్టర్’గా ప్రకటించాలి. - డిజాస్టర్ ప్రకటనను వెల్లడించడంలో ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల స్టాండలోన్ నికర లాభంలో సగటున 10 శాతం లేదా రూ.2 కోట్లు, ఇందులో ఏది ఎక్కువైతే దాని ప్రాతిపదికన అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులూ తమ వార్షిక వేతనంలో 10 శాతం చొప్పున చెల్లించాలి. - సంఘటన జరిగిన తర్వాత 75 నిమిషాల నుంచి 3 గంటల్లోపు సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. లేదంటే ఎమ్ఐఐలు రూ.50 లక్షలు జరిమాన చెల్లించాలి. మూడు గంటలకు మించి టెక్నికల్ అవాంతరాలు కొనసాగితే కోటి రూపాయల జరిమాన కట్టాలి. - సాంకేతిక సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిమాన. - 24 గంటల్లోగా జరిగిన ఘటనలపై ప్రాథమిక నివేదిక సమర్పించాలి. - సాంకేతిక అవాంతరానికి కారణాలను వెల్లడించే కాంప్రహెన్సివ్ రూట్కాజ్ అనాలసిస్(ఆర్సీఏ) నివేదికను 21 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆలసమ్యమైతే జరిమాన. - నిర్దేశించిన గడువులోగా నివేదికలు ఇవ్వకపోతే... ఆ తర్వాత వచ్చే ఒక్కో వర్కింగ్డేకు లక్ష రూపాయల వంతున అపరాధ రుసుము చెల్లించాలి. -
9% లాభంతో లిస్టైన మెట్రోపొలిస్ హెల్త్కేర్
న్యూఢిల్లీ: డయాగ్నస్టిక్ చెయిన్ మెట్రోపొలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ షేర్ లిస్టింగ్లో ఓ మోస్తరు లాభాలను సాధించింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర రూ.880తో పోల్చితే 9 శాతం లాభంతో రూ.960 వల్ల లిస్టయింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో రూ.981 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.చివరకు 9 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 6.13 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 72 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,815 కోట్లుగా ఉంది. ఇటీవలే రూ.887–880 ప్రైస్బాండ్తో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.1,200 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 6 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. మెట్రోపొలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ భారత్లో మూడవ అతిపెద్ద లిస్టెడ్ డయాగ్నస్టిక్ చెయిన్ కావడం గమనార్హం. -
5,872 కోట్ల ఐటీ డిమాండ్పై గ్రాసిమ్కు ఊరట
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి రూ.5,872.13 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్పై గ్రాసిమ్ ఇండస్ట్రీస్కు ఊరట లభించింది. రికవరీపై బొంబాయి హైకోర్ట్ స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తన సమాధానం కోసం ఐటీ శాఖ హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బీఎస్ఈకి పంపిన ఒక నోట్లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ విషయాన్ని తెలిపింది. 2016 గ్రూప్ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఆదిత్యా బిర్లా క్యాపిటల్లో షేర్లు కొన్ని గ్రాసిమ్కు లభించాయి. ఇందుకు సంబంధించి రూ.5,872.13 కోట్ల డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (వడ్డీసహా) చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి రెండు వారాల క్రితం సంస్థ నోటీసు అందుకుంది. దీనిని సవాలుచేస్తూ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. -
కొనసాగిన సుంకాల నష్టాలు
వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల పతనం ప్రభావం చూపడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దేశీయంగా నిశ్చయాత్మకమైన సంకేతాలేవీ లేకపోవడంతో అరకొరగా ఉన్న ఆరంభ లాభాలు కూడా ఆవిరయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, రూపాయి బలహీనత, చమురు ధరలపై ప్రభావం చూపించే కీలకమైన ఒపెక్ సమాశం నేడు(శుక్రవారం) జరగనుండడం...తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 35,432 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, వాహన, ఫార్మా, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. సుంకాల పోరులో తాజాగా భారత్ కూడా చేరింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 24 కోట్ల డాలర్ల విలువైన 30 రకాల వస్తువులపై భారత్ సుంకాలు విధించింది. బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన ఆర్బీఐ పాలసీ సమావేశ వివరాలు ఇన్వెస్టర్లను మరింతగా ఆందోళన పరిచాయి. క్రూడ్ ధరలు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో భారత్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయన్న ఆర్బీఐ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ ఆరంభంలో 132 పాయింట్లు లాభపడినప్పటికీ, ఆ తర్వాత 150 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద 282 పాయింట్ల రేంజ్లో కదలాడింది. వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదరడంతో స్టాక్ మార్కెట్పై ఒత్తిడి పెరుగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. రిలయన్స్ జోరు: స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజూ కొత్త గరిష్టాలకు చేరుతోంది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,032ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 1.2 శాతం లాభంతో రూ.1,032 వద్ద ముగిసింది. ఇది ఆల్ టైమ్ క్లోజింగ్ హై.గత ఏడాది కాలంలో ఈ షేర్ 45 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్కు కొత్త చైర్మన్గా గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సీఎమ్డీగా పనిచేసిన ఎమ్డీ మాల్యా నియమితులు కానున్నారన్న వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 1.4 శాతం లాభంతో రూ.298 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 2 శాతం నష్టంతో రెండేళ్ల కనిష్టానికి, రూ.122కు పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ సీఎమ్డీ అరెస్ట్ కారణంగా ఈ షేర్ ఇంట్రాడేలో 7 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 1.1 శాతం నష్టంతో రూ.13.31 వద్ద ముగిసింది. ఏడాది కనిష్టానికి సిమెంట్ షేర్లు డిమాండ్ పుంజుకోవడం మరింత ఆలశ్యం కావచ్చన్న అంచనాల కారణంగా సిమెంట్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, ఏసీసీ, జేకే సిమెంట్స్, శ్రీ సిమెంట్, ఇండియా సిమెంట్స్, పాణ్యం సిమెంట్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
విద్యార్థులలో 'ఆధార్' భయాలు!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన టాపర్ స్కామ్ ఉదంతం తర్వాత బిహార్ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేయాలని బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్(బీఎస్ఈబీ) నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా విద్యార్థుల ఆధార్ సంఖ్యను ఏదో విధంగా వారి వివరాలతో అనుసందానం చేయనున్నారు. మరోవైపు ఈ నిర్ణయంతో విద్యార్థులతో ఆధార్ భయం పట్టుకుంది. దాదాపు 58 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవు. టెన్త్, తొమ్మిదో తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థులకు, ఇంటర్ చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేని కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కూడా ఆలోచించి ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి విధానాన్ని అమలుచేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ నిలవనుంది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తమ ఆధార్ నంబర్ను నమోదు చేస్తే, ఒకే విద్యార్థి పేరుతో ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్లు జారీ అయ్యేందుకు ఆస్కారం ఉండదని బోర్డు పేర్కొంది. ఆధార్ నంబర్ రాసేందుకు ఓ ప్రత్యేక కాలమ్ ఉంటుందని బోర్డు సభ్యుడు ఆనంద్ కిషోర్ తెలిపారు.