chariot
-
రామ రామ.. ఏమిటీ డ్రామా!.. బొక్కబోర్లా పడ్డ కూటమి
-
రామాలయంలో రథానికి నిప్పు
-
Bengaluru: కుప్పకూలిన 120 అడుగుల రథం
బెంగళూరు: బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్లో శనివారం(ఏప్రిల్ 6)జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా 120 అడుగుల ఎత్తున్న రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. హుస్కుర్ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలో ఈ ప్రమాదం జరిగింది. రథం కూలిపోయినపుడు అక్కడ వేలాది మంది భక్తులున్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి కిందపడిపోయింది. ఎత్తైన రథాల ఊరేగింపునకు హుస్కుర్ మడ్డురమ్మ టెంపుల్ చాలా పాపులర్. దశాబ్దం క్రితం ఈ గుడి వార్షికోత్సవంలో వందల రథాలను ఊరేగించేవారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి.. రంగు మారనున్న గరీబ్రథ్ -
వైజాగ్ కేంద్రంగా పాలన: ‘విశాఖ వందనం’ ప్రచార రథం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన రాజధానిగా విశాఖ వర్థిల్లాలని సంపత్ వినాయక దేవాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘విశాఖ వందనం’ ప్రచార రథాన్ని రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ ప్రారంభించారు. నేటి నుంచి పరిపాలన కేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న పరిపాలన సజావుగా సాగాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని లజపతిరాయ్ అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ ప్రజలందరితో కలిసి శనివారం నుంచి దశలవారీగా సర్వమత ప్రార్థనలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జేఏసీ తరఫున దేవాలయాలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఇటీవల తీర్మానించినట్లు వెల్లడించారు. -
అంతర్వేది రథం దగ్ధం కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం
కాకినాడ లీగల్: అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం ఇవ్వాలని కాకినాడ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పారు. ప్రమాదవశాత్తు రథం దగ్ధమైన కేసులో అంతర్వేది శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్ అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రూ.84 లక్షల పరిహారం, నష్టాల కింద రూ.15 లక్షలను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కోరారు. రథం ఘటన ప్రమాదం కాదంటూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదించారు. కాకినాడ కోర్టు పరధిలోకి ఈ కేసు రాదన్నారు. దీనిపై ఎండోమెంట్ ప్యానల్ న్యాయవాది జీవీ కృష్ణప్రకాష్ వాదిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును కాకినాడ కోర్టులోనే విచారించాలన్నారు. వాదోపవాదనల అనంతరం రూ.84 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేలు ఖర్చుల కింద 45 రోజుల్లోపు బీమా కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీకి 9 నుంచి సంక్రాంతి సెలవులు కర్నూలు(సెంట్రల్): స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్సీకి)కి ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్ కార్యదర్శి ఎస్.వెంకటరమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాత కేసుల వాయిదా, విచారణ, అత్యవసర కేసుల నిమిత్తం వెకేషన్ కోర్టులను నిర్వహిస్తారు. 9, 10, 11 తేదీల్లో కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, 12, 13 తేదీల్లో కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు నడుస్తుంది. 14, 15, 16 తేదీల్లో పూర్తి సెలవు ఉండగా.. 17వ తేదీన కమిషన్ నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు ఉంటుంది. 18వ తేదీ నుంచి యధాతథంగా హెచ్ఆర్సీ కార్యకలాపాలు జరుగుతాయి. ఇదీ చదవండి: TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! -
అయ్యా! బతికే ఉన్నాను అని వేడుకుంటున్న వృద్ధుడు: వీడియో వైరల్
ఒక వృద్ధుడికి తాను బతికే ఉన్నానని నిరూపించకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకోసం ఏకంగా పెళ్లికొడుకులా రథంలో ఊరేగుతూ వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకొంటున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే....హర్యానాలోని 102 ఏళ్ల వృద్ధుడు ప్రభ్తత్వ రికార్డులో చనిపోయినట్లు ఉంది. అతను రోహ్తక్ జిల్లాలోని గాంధ్రా గ్రామానికి చెందిన దులిచంద్ అనే వృద్ధుడు. ఆ వృద్ధుడు ప్లకార్డులు పట్టుకుని, మెడలో కరెన్సీ దండను ధరించి మానసరోవర్ నుంచి కెనాల్ రెస్ట్ హౌస్కి రథంపై ఊరేగుతూ....బతికే ఉన్నానని చెబుతున్నాడు. తాను మార్చిలో చివరిసారిగా వృద్ధాప్య ఫించన్ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయి ఉండటంతో తన ఫెన్షన్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. తన మనవడు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం కనిపించలేదని వాపోయాడు. ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇతర గుర్తింపు పత్రాలను చూపిస్తున్నాడు. అతను హర్యానా ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ని కలిని తన గోడును వినిపించారు. ఆయన ఆ వృద్ధుడికి తిరిగి ఫెన్షన్ పొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలా వృద్ధుల ఫించన్ని నిలిపి ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను సీఎంకి ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు నవీన్ జైహింద్ ఆ వృద్ధుడిని తీసుకుని బీజేపీ నాయకుడు మనీష గ్రోవర్ని కలిసి అతనికి రావాల్సిన ఫించన్ని ఇప్పించవలిసిందిగా కోరారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. हरियाणवी फिल्म, थारा फूफा जिन्दा है अभिनेता -दुलीचंद ज़िंदा ( 102 वर्षीय ) निर्माता निर्देशक, नवीन जयहिंद गीत संगीत, बेरोजगार बैंड पार्टी रोहतक कहानी-हरियाणा सरकार के कुछ अधिकारी जिन्होंने ज़िंदा दुलीचंद को मृत बता काट दी बुढ़ापा पेंशन @NaveenJaihind @DeependerSHooda pic.twitter.com/EtZVA4qvMh — Puspendra Singh Rajput हरियाणा अब तक (@psrajput75) September 8, 2022 (చదవండి: వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వైద్యురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు) -
కొండమీదరాయా.. గోవిందా
బుక్కరాయసముద్రం: గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా... బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది. కమనీయం... కల్యాణం రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా...గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పాత పంచాయతీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం సాయంత్రం వేళ పాత పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమై బ్రాహ్మణవీధి మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరింది. అనంతరం భక్తులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన కొండమీద వెంకటరమణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీవారు, దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
బసవా అని పిలిస్తే రథం దానంతటదే కదిలి వస్తుంది
రాయచూరురూరల్: దేవదుర్గ తాలూకా గబ్బూరులో కొలువైన బూదిబసవేశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులనుంచి పూజలందుకుంటున్నారు. స్వామివారిని తలుచుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు, పెళ్లి కానివారు ఈ ఆలయంలో నిద్రచేస్తుంటారు. నవాబ్, నిజామ్ల కాలం నుంచే స్వామివారు మహిమలు చూపేవారని భక్తులు చెబుతారు. రథోత్సవం రోజున లేచిరా బసవా అని ఐదుసార్లు పిలిస్తే రథం దానంతటకదే పది అడుగుల దూరం మేర కదిలి వస్తుంది. బూది బసవేశ్వర జాతర పదిరోజులపాటు జరుగుతుంది. భక్తులంతా ఈ పది రోజులూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. 13న జరిగే రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు. -
యాదాద్రిలో రథశాల చూశారా?
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని భద్రపరిచేందుకు కొండపై చేపట్టిన రథశాల నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయానికి పడమర, ఉత్తర రాజగోపురాల మధ్యలో వాయవ్య దిశలో రథశాలను ఆధ్యాత్మిక హంగులతో భక్తులకు కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. రథశాలకు దక్షిణం, ఉత్తర దిశల్లో గోపురం మాదిరిగా, కింది భాగంలో చక్రాలను నిర్మించారు. పై భాగంలో పసిడి వర్ణం కలిగిన ఏడు కలశాలతో పాటు మూడు వైపులా స్వామివారి రూపాలతో కూడిన విగ్రహాలను అమర్చారు. వెనుక భాగం పడమటి దిశలో శంకు, చక్ర, తిరునామాలు వీటికి ఇరువైపులా గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్లు.. తీర్చిదిద్దారు. లోపలిభాగంలో చిన్నచిన్న పనులు మినహా మొత్తం నిర్మాణం పూర్తయింది. -
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుక
-
అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ
-
రథం తరలిస్తుండగా విషాదం..ఇద్దరు మృతి
దామరగిద్ద/ నారాయణపేట: ఆలయానికి కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..దామగిద్ద మండలంలోని బాపన్పల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో వెంకటేశ్వర గుట్టపై పురాతన దేవాలయం ఉంది. భక్తులు ఈ ఏడాది రథోత్సవం కోసం కొత్త ఇనుప రథాన్ని చేయించారు. శుక్రవారం రథసప్తమి కావడంతో రథాన్ని గుడి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్వైర్లు రథం పైభాగానికి తగిలాయి. దీంతో 18 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిడ్డిమూతుల హన్మంతు (34), సంజనోళ్ల చంద్రప్ప(37) మృతి చెందారు. కృష్ణాపురం వెంకటప్ప అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
అల.. అంతర్వేదిలో.. కొంగొత్త 'రథ'సప్తమి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రథసప్తమి రోజున ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. సీఎం జగన్ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి రథాన్ని లాగే వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల్లోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని తయారు చేయించారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో నూతన రథాన్ని ప్రారంభించారు. స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ సీఎం వైఎస్ జగన్.. ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న రాజగోపురానికి నమస్కరిస్తూ.. గంటా మంటపం, ముఖ మంటపం మీదుగా అంతరాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 20 నుంచి రద్దు చేసిన అంతరాలయ దర్శనాన్ని.. ప్రస్తుతం కల్యాణోత్సవం సందర్భంగా సీఎం ద్వారా తిరిగి పునరుద్ధరించారు. అర్చకులు సీఎం జగన్ గోత్ర నామంతో అర్చన గావించారు. మంత్రపుష్ప సమర్పణ అనంతరం హారతిని సీఎం భక్తి భావంతో కళ్లకు అద్దుకుని నమస్కరించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి శ్రీనివాస్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, అర్చకులు శ్రీను తదితరులు ధ్వజ స్తంభం వద్ద ఉన్న సింహద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారి ఉపాలయంలోని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ♦ఆశీర్వచన మంటపం వద్ద అర్చకులు, వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. లక్ష్మీనరసింహ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అర్చకులు అందించిన స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్యమంత్రి స్వీకరించారు. ♦అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, నూతన రథం తయారీకి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిలకించారు. కొత్త రథం తయారీలో వినియోగించిన బస్తర్ టేకు సేకరణ మొదలు.. చివరలో సంప్రోక్షణ ప్రక్రియ వరకు ఆయా దశలకు సంబంధించిన ఫొటోలను ఆసక్తిగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన రథం తయారీని ప్రశంసించారు. ♦అనంతరం ఆలయానికి తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద నుంచి ఉన్న స్వామి వారి 38 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను దేవదాయ శాఖ కమిషనర్ అర్జున్రావు ముఖ్యమంత్రికి వివరించారు. హారతి తీసుకుని నమస్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి పసుపు, కుంకుమ పెట్టి.. కొబ్బరి కాయ కొట్టి.. ♦స్వామి సన్నిధి నుంచి పశ్చిమ రాజగోపురం ద్వారా సీఎం.. రథం వద్దకు చేరుకున్నారు. స్వయంగా పసుపు, కుంకుమలతో నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టారు. ఇతర భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. అనంతరం ఆలయానికి నలువైపులా ఉన్న భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు. ♦ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోష్, వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నృసింహుని రథానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: (మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..) (కోనసీమలో పల్లెపోరు) -
అంతర్వేదిలో నూతన రథం ప్రారంభోత్సవం
-
అంతర్వేది: నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం... అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. చదవండి: యోధులారా వందనం : సీఎం జగన్ మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు.. -
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం శుక్రవారం అంతర్వేదికి వస్తున్నారు. వైఎస్ జగన్ సుమారు గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు.. భక్తుల మనోభావాలకే సర్కారు పెద్దపీట రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. గతేడాది సెప్టెంబర్ 5న అర్థరాత్రి దాటాక అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతి పక్షాలు, కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కుట్రలకు తెరలేపాయి. కొత్త రథం లేకుండా ఫిబ్రవరిలో ఉత్సవాలు నిర్వహించడం అరిష్టమనే ప్రచారాన్ని కూడా చేశాయి. ఉద్యమాలు, నిరసన పేరుతో రాద్ధాతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించాయి. అయితే సంఘటన జరిగిన మరుక్షణమే సీఎం స్పందించారు. కొత్త రథం తోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరడంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంలో సైతం వైఎస్సార్సీపీ ఎంపీలు రథం దగ్థంపై సీబీఐ దర్యాప్తు విషయం ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. రూ.95 లక్షలతో కొత్త రథం అంతర్వేదిలో ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ రథం నిర్మాణాన్ని, పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్ టేకును రథం కోసం వినియోగించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి కొత్త రథం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్వేదిలో సీఎం పర్యటన ఇలా.. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (యోధులారా వందనం : సీఎం జగన్) -
రేపు అంతర్వేదికి సీఎం వైఎస్ జగన్
కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.30 నుంచి 11.35 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. 11.45 నుంచి 11.50 గంటల వరకూ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.50 గంటలకు వేద పండితుల నుంచి ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం స్వీకరిస్తారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. 12.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లి వెళతారు. హెలిప్యాడ్ పనుల పరిశీలన సఖినేటిపల్లి: పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో హెలిప్యాడ్ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్వేది పర్యటనకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద, పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ మాధవరెడ్డి, సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఇతర అధికారులతో సమీక్షించారు. పెట్రోలింగ్కు నాలుగు ఇంజిన్ బోట్లు సిద్ధం చేయాలని ఫిషరీస్ జేడీ పీవీ సత్యనారాయణకు ఎస్పీ సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గంలోని ప్రధాన కూడళ్లలో కచ్చితంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేక భద్రతా సిబ్బంది కోరారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గం, రథం వద్ద కార్యక్రమాలపై కూడా దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులతో ఎస్పీ, జేసీ సమీక్షించారు. సంబంధింత అంశాలను దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, అసిస్టెంట్ కమిషనర్ భద్రాజీ, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు వివరించారు. ఇదిలా ఉండగా తుది దశకు చేరుకున్న ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వామి సన్నిధిలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ లక్ష్మీరెడ్డి పూజలు నిర్వహించారు. మంత్రి వేణు సందర్శన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న స్వామి కల్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని.. పేదలపై భారం మోపలేం.. -
అంతర్వేది రధానికి ఫిబ్రవరి 13న సంప్రోక్షణ
సాక్షి, కాకినాడ: అంతర్వేదిలో నూతనంగా నిర్మించిన రధానికి ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామని ఆలయ అధికారులు వెల్లడించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విశాఖ శారదా పీఠాధిపతులను ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు సంప్రోక్షణ ప్రక్రియ చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఆగమానుసారం చేపట్టాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. కాగా, 62 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రధం గతేడాది సెప్టెంబర్ 6న అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
అంతర్వేది నూతన రథానికి ట్రయల్ రన్
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రంలో నూతన రథానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. రథాన్ని మలుపు తిప్పేందుకు అమర్చిన హైడ్రాలిక్ జాకీ సిస్టం, రథ చక్రాలకు అమర్చిన బ్రేక్ సిస్టంలను పరిశీలించేందుకు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ విచారణ వేశాక ప్రతిపక్షాల కుట్రలు భగ్నమవుతున్నాయని చెప్పారు. ఎవరెవరు కుట్రపూరిత ఆలోచనలో ఉన్నారు? ఆ కుట్రలు భగ్నమై ఎవరెవరు బయటపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఆలయాలపై దాడులు చేసినందుకు గాను ఫలితాన్ని అనుభవించే రోజు ప్రతిపక్షాలకు కచ్చితంగా వస్తుందని మంత్రి హెచ్చరించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణపై ప్రతిపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన రథం ట్రయల్ రన్ను అధికారులు ఆదివారం నిర్వహించారు. రథం బ్రేకులు, జాకీలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ సమయంలో నూతన రథాన్ని తయారు చేయించామని తెలిపారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ దేవుళ్లు, ఆలయాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విచారణను సీబిఐకి అప్పగించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే దేవాలయాల పై ప్రతిపక్షాలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ -
నరసన్న రథం రెడీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండున్నర నెలల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం రథానికి సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు చాలా బాగుందయ్యా! ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు. – మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం -
అంతర్వేది : నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలల క్రితం రథం దగ్ధమైన విషయం సంగతి విదితమే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. కొత్త రథం తయారీ పనులకు సెప్టెంబర్ 27న జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు. -
అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ తోనే రథం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. రథం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైతే బాగుంటుందన్నారు. నూతన రథాన్ని పాత షెడ్లో ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయిం తీసుకోలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. -
ఫిబ్రవరి 23న అంతర్వేదిలో ఉత్సవాలు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున రావు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి రథం నిర్మాణం పూర్తవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం ఫిబ్రవరి 23న వస్తుందని, ఆ రోజు నూతన రథంతో ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ మరియు ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి నూతన రథం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అధిక నాణ్యత గల బస్తర్ టేక్ వుడ్ను రథం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం) -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో దగ్ధమయిన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. తొలుత తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యేలు సతీష్, రాపాక వర ప్రసాదరావు హాజరయ్యారు. రథం నిర్మాణానికి ప్రభుత్వం రూ.95 లక్షలు కేటాయించింది. 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకు కలప రథం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. మూడు నెలల్లో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు. అచ్చం పాత రథాన్ని పోలినట్టే నూతన రధాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోజూ అవసరమైన మేరకు కార్మికులను ఏర్పాటు చేసుకుని నూతన రథాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి కల్లా రధాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై విచారణ జరుగుతోందని.. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ లోపు రథం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
-
శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు
-
శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. (చదవండి: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు) పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) -
‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు.. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. (‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’) వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్రోడ్లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని గుర్తుచేశారు. 2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడిన తర్వాత కరోనా వలన వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు ఏ రకంగా వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్రూమ్లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్రూమ్లో లేవన్నారు. పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి అమర్చే ప్రక్రియను బుధవారమే ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు మాట్లాడుతూ.. ‘పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీసులను దర్యాప్తు చేయాలి అని కోరాం. హిందువుల మనోభావాలు కాపాడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా?. గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న. విచారణలో దోషులు తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సారులు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్ జనగ్పై అపార నమ్మకం ఉంది.’ అన్నారు. 2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని దుర్గగుడి ఈవో సురేష్బాబు పేర్కొన్నారు. ‘స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు. అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము.’ అన్నారు. -
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సింహం ప్రతిమలు మాయం, మంత్రి పర్యటన
సాక్షి, విజయవాడ: బెజవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, సింహం ప్రతిమలు మాయమైనట్టు ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని తెలిపారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు
సాక్షి, అమరావతి: పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ అర్జునరావుతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని.. అప్పటిలోగా కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వివరించారు. అంతర్వేదిలో దర్శనాలు నిలుపుదల సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 20 వరకు అధికారులు దర్శనాలను నిలిపివేశారు. అంతర్వేది, పరిసర ప్రాంతాల్లో కరోనా ఉధృతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ సోమవారం తెలిపారు. స్వామి వారికి నిత్యం జరిగే కైంకర్యాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహిస్తారని చెప్పారు. చదవండి: టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మొద్దు -
ఏడంతస్తులు.. 41 అడుగుల ఎత్తుతో నిర్మాణం
సాక్షి, విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయాల మేరకు.. ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రాహ్మణ వీధి దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించామన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించామన్నారు. (చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?) ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తులుగా రూపొందిస్తున్నమని వెలంపల్లి తెలిపారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. రథశాల మరమ్మతుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు మంత్రి వెలంపల్లి. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘అంతర్వేది’పై సీబీఐ..
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. సీబీఐతో విచారణ జరిపించండి : డీజీపీ లేఖ కాగా, రథం దగ్థం కేసును సీబీఐతో విచారణ జరపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ గురువారం లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ఈ లేఖ రాశారు. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే.. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. మంత్రులూ క్షేత్రస్థాయిలో పర్యటించి రథం దగ్థం సంఘటనపై సమీక్షించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. స్థానిక అధికారులూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాక.. ఆలయ ఈవో చక్రధరరావును సస్పెండ్ కూడా చేసింది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రూ.95లక్షలను మంజూరు కూడా చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే ఇన్ని చర్యలు స్పష్టంగా ఉన్నా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మత విద్వేషాల ముసుగులో రాజకీయంగా లబ్ధిపొందేందుకు, సర్కారుకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసే కుట్రలకు తెరలేపాయి. ‘సంక్షేమం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. నిజానికి అంతర్వేది రథం దగ్థం ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా నానాయాగీ చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు.. అన్ని రకాలుగా రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు ఇటీవలే టీటీడీ లెక్కల్నీ కాగ్ ఆడిట్ పరిధిలోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొన్ని దుష్టశక్తులు ఎప్పటికప్పుడు తమ వక్రబుద్ధిని ప్రదర్శించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేది దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం రాజకీయ పరిశీలకులు, మేధావులు, తటస్థులు తదితర అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. -
రథం చుట్టూ రాజకీయం!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అంతర్వేదిలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు. ఉండకూడదు కూడా. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు దిగితే..? రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే..? అది ప్రజాస్వామ్యమా? మతాల్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం... మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? అసలు అంతర్వేది ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరమేమైనా ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్ధాంతాలకు దిగాల్సిన అవసరం ఉందా? జరిగిన ఘటనల్ని చూస్తే ఎవరికి వారే ఓ స్థిరాభిప్రాయానికి రావచ్చు కూడా. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 5 అర్ధరాత్రి దాటాక ఆలయ రధం దగ్ధమయింది. కారణాలేంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడక మానవు కూడా!!. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. దీన్ని దురదృష్టకర, అవాంఛనీయమైన ఘటనగా వర్ణించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా ఆ పుణ్యక్షేత్రంలోని సంఘటనలకు బాధ్యుడైన ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెప్పేచర్యలు. ఎక్కడా తాత్సారానికి తావులేకుండా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం... విచారణలో దోషులెవరో తేలితే కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవుతోంది. దాపరికానికి తావే లేదు.. మొదటి నుంచీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం ముందే న్యాయ సమీక్షకు పంపించటమనేది చరిత్రాత్మకం. ఇటీవల టీటీడీ జమా ఖర్చుల్ని కాగ్ ఆడిట్ పరిధిలోకి తేవాలనుకోవటమూ మున్నెన్నడూ చూడనిదే. ఈ చిత్తశుద్ధే కొన్ని రాజకీయ పక్షాలకు మింగుడుపడటం లేదు. ఏ సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేస్తూ... ప్రభుత్వానికి పూస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాయి. తమ కుట్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రులను అడ్డుకుని రచ్చకు ప్రయత్నించటం... అదే వ్యక్తులు అక్కడికి కొద్ది దూరంలోని వేరొక మతానికి చెందిన ప్రార్థన మందిరంపై రాళ్లు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం ఈ కుట్రను స్పష్టంగా బయటపెట్టేవే. ఈ విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించేవారికి కలిగే సందేహమొక్కటే? ఇలాంటి చర్యల ద్వారా వీళ్లు సాధించాలనుకుంటున్నదేంటి? ఏం చేయాలని రాళ్లేశారు? అసలిలా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంతలా దిగజారుతారా? ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ధర్మమేనా? ఇది ప్రభుత్వ ధర్మాగ్రహం. విచారణలో బయటపడే దోషులు... మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్న కుట్రదారులు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే అనుకోవాలి!. చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం? -
ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం
సాక్షి, విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. (అంతర్వేది ఆలయ రథం దగ్ధం) హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్కు సవాల్ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు. రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
అంతర్వేది ఆలయ రథం దగ్ధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం/సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం శనివారం అర్ధరాత్రి దగ్ధమైంది. రథంపై ఏటా కల్యాణోత్సవాల తరువాత స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవోపేతంగా జరుగుతుంది. రథం దగ్ధం కావడంతో ఆదివారం భక్తులు ఆలయం వద్దకు చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న పెద్ద షెడ్లో ఉంచారు. రథం వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చేలోపే రథం ఆహుతైంది. తేనెపట్టు సేకరణ వల్లే..: రథం షెడ్డులో ఉన్న తేనెపట్టును సేకరించేందుకు కొందరు చేసిన యత్నం ఏకంగా రథం దగ్ధానికి కారణమైనట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రథం ఎత్తుతో సమానంగా షెడ్డును ఇక్కడ నిర్మించారు. ఏటా ఉత్సవాలు పూర్తయ్యాక ఈ షెడ్డులో రథాన్ని ఉంచుతారు. షెడ్డు ఒకవైపు తెరచి, మూడువైపుల మూసి ఉంటుంది. తెరచి ఉంచిన వైపు రథాన్ని తాటాకులతో కప్పి ఉంచుతారు. షెడ్డులో ఇటీవల తేనెపట్టులు పట్టాయి. తేనెను పట్టుకునేందుకు శనివారం రాత్రి కొందరు విఫలయత్నం చేశారు. 20 అడుగులున్న గెడ తెచ్చి, దానికి కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడాతో తేనెటీగలను చెదరగొట్టే యత్నం చేశారు. కాగడా ప్రమాదవశాత్తూ ఊడిపోయి, రథానికి ఒకవైపు ఉన్న తాటాకులపై పడింది. దీంతో మంటలు లేచాయి. ఈ మంటలకు రథం దగ్థమైంది. విజయవాడ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులకు దీనిపై ఆధారాలు లభించినట్లు తెలిసింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక, దేవదాయ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వెలంపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఘటనపై దేవదాయ కమిషనర్ అర్జునరావుతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. కొత్త రథం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్కు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ: డీజీపీ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం ప్రమాద ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. దీనిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏలూరు రేంజి డీఐజీ మోహన్రావు తెలిపారు. సఖినేటిపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఘటనలో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదన్నారు. -
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
-
అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యులు చేపడుతున్న దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ను విచారణ అధికారిగా నియమించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చర్యులు చేపట్టాలని దేవదాయ కమిషనర్కు మంత్రి సూచించారు. అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన అంతర్వేది ఘటన దురదృష్టకరం -స్వరూపానందేంద్ర రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి -స్వరూపానందేంద్ర దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి -స్వరూపానందేంద్ర హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది -స్వరూపానందేంద్ర నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి -స్వరూపానందేంద్ర -
ఎమ్మెల్యే బీసీ సోదరుల దౌర్జన్యం
కర్నూలు /బనగానపల్లె: ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరులు బీసీ రామ్నాథ్రెడ్డి, బీసీ రాజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. వారి అనుచరుడు శంకర్తో పాటు పలువురితో కలిసి వైఎస్సార్సీపీ ప్రచార రథం డ్రైవర్ గోరే బాషాపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథం ఎమ్మెల్యే బీసీ ఇంటికి సమీపంలోని పాతబస్టాండ్ మీదుగా వెళ్తుండగా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి ఆయన సోదరులు, అనుచరులు వచ్చి తనపై దాడి చేసినట్లు డ్రైవర్ గోరే బాషా తెలిపారు. ఈ సమయంలో కాటసాని రామిరెడ్డి ఇక్కడికి సమీపంలోని 101వ బూత్లో ఇంటింటా నవరత్నాల గురించి వివరిస్తున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాతబస్టాండ్లోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే బీసీకి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తేనే విరమిస్తామని వారు స్పష్టం చేశారు. ‘ఇక్కడికి వాహనం రాకూడదంటూ బీసీ సోదరులు నాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. చొక్కా చింపారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నాకు ఏమైనా అయితే ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత. ఆయన కుటుంబంతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ డ్రైవర్ గోరేబాషా ఎస్ఐ సత్యనారాయణతో వాపోయారు. దాడికి పాల్పడడం తప్పేనని, పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే డౌన్డౌన్’ అంటూ ర్యాలీగా పోలీసుస్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. కాటసాని ఆధ్వర్యంలో రాస్తారోకో తమ వాహన డ్రైవర్పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యక్రమా న్ని మధ్యలోనే ముగించి హుటాహుటిన పెట్రోల్ బంకు సర్కిల్కు వచ్చారు. అక్కడే కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. తరువాత పోలీసుస్టేషన్ లోపలకు వెళ్లి ఎస్ఐతో మాట్లాడారు. పట్టణంలో వారం రోజుల నుంచి రావాలి జగన్ –కావాలి జగన్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఓర్వలేకనే ఎమ్మెల్యే బీసీ సోదరులు ప్రచారరథం డ్రైవర్పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు బీసీ రామ్నాథ్రెడ్డి, బీసీ రాజారెడ్డితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. సీఐ లేదా డీఎస్పీ వచ్చి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సీఐ సురేష్కుమార్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వాహనంలో ఎదురుగా వచ్చిన ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి తమ పార్టీ కార్యకర్తలు జరిగిన ఘటన గురించి వివరించేందుకు యత్నించగా.. ఆయన వినకుండా గన్తో కాల్చివేస్తామంటూ బెదిరించారని తెలిపారు. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఉద్రిక్త వాతావరణం ఒక దశలో సీఐ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బీసీ వాహనంలో ఎదురు రాగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. బీసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలి డ్రైవర్ గోరేబాషాపై ఎమ్మెల్యే బీసీ సోదరులు వారి అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు, వారి అనుచరులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యాన్నీ చూపరాదు. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
కనుమరుగు కావడం సహజం!
అది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం. విజేతలైన వీరులు చివరి రోజు రాత్రి శత్రు శిబిరంలో విశ్రమించాలన్న ఆనాటి ఆచారం మేరకు పాండవులను వెంటబెట్టుకుని కౌరవుల శిబిరం వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. తరువాత కృష్ణుడు అర్జునుని ఉద్దేశించి, ‘‘అర్జునా! నీవు గాండీవాన్ని, ఇతర ఆయుధాలను తీసుకుని రథం నుంచి కిందికి దిగి దూరం వెళ్లు’’ అని ఆదేశించాడు. అర్జునుడు అణుమాత్రం సందేహించకుండా గాండీవం, ఇతర ఆయుధాలను తీసుకుని రథం దిగాడు. కృష్ణుడు కూడా ఇన్నాళ్లు సారథిగా తన చేతిలో ఉన్న చర్నాకోలను, గుర్రాల కళ్ళాలకు వేసే పగ్గాలను అక్కడే వదిలేసి రథం మీద నుంచి కిందికి ఎగిరి దూకాడు. కృష్ణుడు రథం నుంచి దూకిన మరుక్షణమే హనుమంతుడు నిలిచి ఉన్న ధ్వజ కేతనం అంతరిక్షంలోకి ఎగురుతూ పోయి అదృశ్యమైంది. పాండవులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే, రథంలో అగ్ని జ్వాలలు చెలరేగి, క్షణాల్లో రథం కాస్తా బూడిద కుప్పగా మిగిలింది. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు తట్టు్టకోలేకపోయాడు. ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికిచ్చిన కానుక ఆ రథం. అప్పటి నుంచి అర్జునునికి, ఆ రథానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. అలాంటి రథం దగ్ధం కావడంతో అర్జునుడు అప్రతిభుడయ్యాడు. అతి కష్టం మీద కన్నీటిని అపుకుంటూ, ‘‘కృష్ణా! ఎందుకిలా జరిగింది? శత్రు భీకరమైన ఈ రథం ఎందుకిలా ...’’ ఆ పై మాట్లాడాలంటే గొంతు పెగలలేదు అర్జునుడికి. కృష్ణుడు తన సహజశైలిలో చిరునవ్వు రువ్వాడు. ‘‘అర్జునా! ఇది అసామాన్యులైన భీష్మద్రోణాదులు, ఇతర వీరుల భయంకరాస్త్రాల ప్రభావానికి గురైంది. నేను సారథిగా ఉండి అన్ని అస్త్రాల శక్తిని అణచి ఉంచాను. నీవు సురక్షితంగా బయటపడ్డా్డవు. కథ ముగిసిపోయింది. చివరగా నేను దిగి పోగానే ఆ అస్త్రాల శక్తిని వదలడంతో అది కాలి దగ్ధమైంది. ఇక దానితో నీకు పని లేదు. నిర్దేశిత కార్యం కోసం వచ్చిన అవతార పురుషులు, వస్తువులు ఆ కార్యం పూర్తి కాగానే కనుమరుగు కావడం సహజం. ఆ కోవలోనే ఆ రథం తన కర్తవ్యాన్ని నిర్వహించి అదృశ్యమైంది. పుట్టిన ప్రతి జీవికి నిశ్చితమైన లక్ష్యం, కార్యకలాపాలు ఉంటాయి. తన లక్ష్యం సాధించుకున్న తర్వాత ఆ జీవితో ప్రపంచానికి గాని, ప్రపంచానికి ఆ జీవితో గానీ అవసరం ఉండదు. అప్పుడు భూమిని విడిచి వెళ్లిపోతాడు. లేకపోతే భూమికి భారమే కదా ఇక. కాబట్టి నీవు ఈ విషయాన్ని గుర్తుంచుకో. రథం కోసం దుఃఖించకు’’ అని ఊరడించాడు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవల్సిన నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
రథ సప్తమికి సిఫారసు లేఖలు రద్దు
సాక్షి, తిరుమల: ఈనెల 24న రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజున ఆర్జిత సేవలు, వృద్దులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేశామని, 25,26,27 తేదీలలో సిఫారసు లేఖలు రద్దు చేశామని, ప్రొటోకాల్ వారికి మాత్రమే విఐపి దర్శనాలు ఉంటాయని వివరించారు. రథసప్తమినాడు శ్రీవారు ఏడు వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతారని, ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చివరగా చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని ఆయన తెలిపారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రతి గ్యాలరీకి ఓ టిటిడి ఉద్యోగి, నాలుగు మాడ వీధుల్లో ఎనిమిదిమంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుండి టీటీడీ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని జేఈఓ స్పష్టం చేశారు. -
నమో చెన్నకేశవా..
ధర్మవరం అర్బన్ : ధర్మవరంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది. జిల్లా నుంచే కాక కర్ణాటక, హైదరాబాద్, కర్నూలు, కడప తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ తేరుబజార్కు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి ఉదయం మడుగుతేరు, సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ మడుగు తేరు(రథోత్సవం)కు ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్డీఓ బాలానాయక్, జూనియర్ సివిల్ జడ్జి లీలావతి, మున్సిపల్ కమిషనర్ నాగమోహన్, వైస్చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీ వేణుగోపాల్రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు కలవల రామ్కుమార్, ఈఓ ఆనంద్, అయ్యప్పస్వామి సేవా కమిటీ అధ్యక్షుడు కలవల నాగరాజు తదితరులు మడుగుతేరు పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. వీరందరికీ ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు కండువాలతో సత్కరించారు. సాయంత్రం 6 గంటలకు ధూళోత్సవం నిర్వహించారు. -
అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు -
కనులపండువగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం
మడకశిర రూరల్: మండల పరిధిలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లేడుగుంటలో ఆంజినేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను భక్తులు గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ఉంచి హోమం, విశేష పూజలు జరిపారు. మధ్యాహ్నం వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈఓ శ్రీనివాసులు, సర్పంచుల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవానంద్, ఎస్ఐ మక్భూల్బాషా సిబ్బందితో గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఈఓ శ్రీనివాసులు, సర్పంచులు మహేశ్వర్రెడ్డి, భీమప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మరథోత్సవంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని రథాన్ని లాగారు. -
వైభవంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం
డీ.హీరేహాళ్ : మండల కేంద్రమైన డీ.హీరేహాళ్లోని నీలకంఠేశ్వరస్వామి రథోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారిని వెండి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవాన్ని ప్రారంభించడానికి మేళతాళాలతో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గ్రామ ప్రముఖులు దాదు సాబ్, సర్పంచ్ లక్ష్మీదేవి లను ఆహ్వానించారు. అనంతరం రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. శివనామస్మరణతో సాగిన రథోత్సవంలో నందికోళ్లతో చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శింగాడి జగదీష్, బోజరాజ్నాయక్, కరడి మల్లికార్జున, సింగాడి మంజునాథ, టీడీపీ నాయకులు మాకాసి వెంకటేశులు, నాగళ్లి రాజు, తిప్పేస్వామి, నరసింహులు తెలిపారు. -
ఉత్సవాలకు వాహనాలు కరువు !
ముచ్చటగా మూడే ! కనిపించని రోజుకో వాహనం ముందుకుసాగని తయారీ పనులు పట్టించుకోని అధికారులు వేములవాడ : తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన వేములవాడలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏటా రూ.70కోట్ల ఆదాయం వస్తున్న ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపునకు వాహనాలు కరువయ్యాయి. దేవీ, గణేశ్ నవరాత్రోత్సవాలు, రాజన్న బ్రహ్మోత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నా..రథాల తయారీలో నిర్లక్ష్యం వీడడం లేదు. నందివాహనం, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉండగా హంస, నెమలి, అశ్వవాహనాలను మాత్రమే ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. వాహనాలేవి? ప్రతి ఉత్సవంలో ఆలయంలోని శ్రీపార్వతీసమేత రాజరాజేశ్వరస్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో పెద్దసేవలపై ఊరేగిస్తుంటారు. రోజుకో వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించాల్సి ఉంటుంది. కానీ మూడే వాహనాలను వినియోగిస్తున్నారు. శనివారం పదకొండు రోజుల పాటు దేవినవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పదకొండు రోజులు మూడు వాహనాలతోనే గడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హంస, నెమలి, అశ్వవాహనాలనే ఉపయోగిస్తున్నారని మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నంది, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉన్నట్లు పూజల విభాగం సిబ్బంది చెప్పడం గమనార్హం. అటకెక్కిన వెండి వాహనాల తయారీ ఏటా నిర్వహించే ఉత్సవాలకు వెండి వాహనాలను తయారు చేయించాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి. నిత్యం ప్రత్యేక పూజల అనంతరం పురవీధుల్లో నిర్వహించే ఉత్సవాలకు సరైన వాహనాలు ఉపయోగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. తక్షణమే వెండి వాహనాలు తయారు చేయించాలని రాజన్న భక్తులు కోరుతున్నారు. గతంలో వెండి వాహనాల తయారీకి సంబంధించిన అంశంలో పలువురు కోర్టు చుట్టూ తిరగడం, కేసుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి అధికారుల్లో భయం రేకొల్పుతోంది. గతంలో వెండి సమకూర్చుకునే క్రమంలో ఈవో స్థాయి అధికారితోపాటు పది మంది వరకు కోర్టు చుట్టూ తిరిగారని, సీబీసీఐడీ విచారణకు వెళ్లి వచ్చారన్న భయం వెంటాడుతోంది. ప్రణాళికలు పంపడమే! ఉత్సవాల సమయంలో వాహనాల అంశం తెరపైకి రావడంతోనే దేవాదాయశాఖ కమిషనర్కు ప్రణాళికలు పంపడంతోనే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి ఏటా దాటవేసే ధోరణే కనిపిస్తుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వాహనాలను రిపేర్ చేయిస్తాం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్న క్రమంలో మరో రెండు వాహనాలు అవసరం ఉంటుంది. నంది, గరత్మంతుడి వాహనాలను రిపేర్ చేయిస్తాం. ఇక వెండి వాహనాల అంశం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాలతోనే వెండి వాహనాలు తయారు చేసేందుకు పనులు చేపడతాం. ప్రస్తుతం ఉత్సవాలకు మూడు వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం. – దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
వైకుంఠ రథం ధ్వంసం
మదనపల్లె:పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు. స్థానిక అవెన్యూ రోడ్డులో నిలిపిన వాహనం అద్దం పగలకొట్టాడు. వైకుంఠ రథంపై దాడి చేయడం తగదని నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. సొంత నిధులతో వాహనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో వాహనం టైరు చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. -
వైభవంగా రథోత్సవం
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వరోజు బుధవారం భక్తుల కోలాహాలం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా రథాన్ని శుభ్రపరిచి మామిడాకులు, రంగురంగుల పూలతో అలంకరించారు. కళశానికి పూజలునిర్వహించి రథం పైభాగాన అమర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి ఉత్సవమూర్తులను ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో రథంపైకి చేర్చారు. బూడిద గుమ్మడి కాయలను నాలుగు రథచక్రాల వద్ద ఉంచారు. వందల సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామస్మరణల మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ రథోత్సవంలో చెక్కభజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, ఆలయ ప్రతినిధి పల్లె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సాయినాథుడి రథోత్సవం
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని రైల్వేస్టేషన్ కాలనీలో గల శ్రీసాయిదత్తాశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మరో రథంలో శ్రీలక్ష్మినారాయణ ఉత్సవ విగ్రహాలను ఉంచారు. తడకమళ్ల బైపాస్ రోడ్డులోని నూనె సోమన్న కిరాణం షాపు వద్ద యాత్రను ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళలు కోలా టం ఆడారు. కార్యక్రమంలో కమిటీ ఉపా«ధ్యక్షుడు ప్రతాఫ్, ప్రధాన కార్యదర్శి నరేందర్, జగన్నాథరావు, మట్టయ్య, పందిరి సత్యనారాయణ, సోమన్న, జానకిరాముడు, వాసు, అశ్విన్మిత్ర, శివ తరుణ్, రవిశంకర్, రాజేష్, రఘు, చంద్రకాంత్, రవిలున్నారు. హనుమాన్పేటలో గల శ్రీసాయిబాబా ఆలయం నుంచి స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మంచుకొండ వెంకటేశ్వర్లు, విగ్రహాల సుధాకర్రావు, గంధం సైదులు, పెండ్యాల పద్మావతి, నాగరాజు, సీతమ్మ, చారి ఉన్నారు. -
నీ శరీరమే రథం
నచికేతోపాఖ్యానం ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెబుతున్నాడు. మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు. నచికేతుని దృఢదీక్షను మెచ్చుకుంటున్నాడు. ‘‘నాయనా! తమ పుణ్యకర్మఫలాన్ని ఆస్వాదిస్తూ, పరమాత్మకు నిలయమైన హృదయకుహరంలోని బుద్ధిని పొందగలిగిన వారు ఇద్దరు ఉన్నారు. బ్రహ్మవేత్తలు వారిని వెలుగునీడలు అంటారు. పంచయజ్ఞాలను మూడు నచికేతాగ్నులతో చేసిన గృహస్థులే వారు. గృహస్థాశ్రమం అంత గొప్పది. సంసార సాగరాన్ని దాటటానికి వ ంతెనగా ఉండే పరబ్రహ్మస్వరూపం అగ్ని. ఆ అగ్నికి నీ పేరు పెట్టాను. నాచికేతాగ్నిని గురించి అందరూ తెలుసుకోవాలి. చెబుతాను విను. నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవ డు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి. ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి.దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. ఆత్మవిద్యతో తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు. నచికేతా! అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది. సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి. నాయనా! ఆత్మకు శబ్దం (చెవి), స్పర్శ (చర్మం) రూపం (కన్ను), రసం (నాలుక) గంధం (ముక్కు) అనేవి ఉండవు. ఆత్మకు ఆది, అంతమూ ఉండదు. ఆత్మకన్నా గొప్పదీ, ఉన్నతమైనదీ, శాశ్వతమైనదీ లేదు. ఆత్మను సాక్షాత్కరింప చేసుకున్న వాడు మృత్యుముఖం నుండి బయటపడతాడు. నేను చెబుతున్న సనాతనమైన ఈ ఆత్మవిద్యకు నాచికేతోపాఖ్యానమని పేరుపెడుతున్నాను. దీనిని ఇతరులకు చెప్పినవారు, విన్నవారూ మేధావులై శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు. అతి రహస్యమైన ఈ బ్రహ్మవిద్యను విద్వత్ సభలలో, పితృదేవతల శ్రాద్ధకర్మలలో వినిపించేవారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. స్వయంభువు అయిన పరమాత్మ ప్రాణుల ఇంద్రియాలను దోషభూయిష్టంగా సృష్టించాడు. వాటికి బయట విషయాలపై ఉన్న ఆసక్తి అంతరాత్మపై ఉండదు. ధీరుడైనవాడు మాత్రమే తన దృష్టిని లోపలికి సారించి ఎంతో ప్రయత్నంతో అంతరాత్మను దర్శించి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. అజ్ఞానులు పసిపిల్లల్లాగా బాహ్యసుఖాలను కోరుకుంటారు. దానితో మృత్యుపాశానికి చిక్కుకుంటారు. జ్ఞానులు అనిత్యమైన లౌకిక సుఖాల మోసాన్ని తెలుసుకొని శాశ్వతమైన ఆత్మతత్వాన్ని కోరుకుంటారు. మృత్యువునుండి తప్పించుకొని అమృతత్వాన్ని పొందుతారు. నచికేతా! రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ అనే పంచేంద్రియ విషయాలను ఆత్మజ్ఞానంతో చూడగలిగినవాడు అన్నిటినీ తెలుసుకోగలుగుతాడు. ఆత్మవిద్యతో తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు. దానినే నువ్వు తె లుసుకోవాలనుకుంటున్నావు. నిద్రలో, మెలకువలో ఎప్పుడైనా దేనినైనా ఆత్మతో దర్శించగలిగినవాడికి దుఃఖం కలగదు. ఇంద్రియజన్యమైన జ్ఞానం దుఃఖ కారణం. జీవిత మాధుర్యానికీ, భూతభవిష్యాలకు ఆత్మయే అధిపతి అని తెలుసుకున్నవాడికి భయమూ, అసహ్యమూ ఉండవు. ఇదే ఆత్మతత్వం. మానవులారా! మేలుకోండి. నిద్రమత్తు వదిలించుకోండి. పొందవలసిన గొప్ప స్థితిని తెలుసుకోండి. పదునైన కత్తి అంచు మీద నడిచే దారి ఇది. ఈ దారిలో నడవడం చాలా కష్టం. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అజ్ఞానాలను వదిలించుకున్నవారే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని పెద్దలు చెబుతున్నారు - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
స్వర్ణ రథంపై శ్రీవారు
-
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
తిరుపతి కల్చరల్: శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుం డగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని లాగారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధ, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథ మండపంలో తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనసేవ వేడుకగా జరిగింది. రఘురాముడు సర్వాంగసుందరంగా అలంకారప్రియుడై అశ్వాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ తిరుపతి జేఈవో పోలాభాస్కర్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు. ఆనందభరితం జానపద భక్తి సంగీతం బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్కు చెందిన ఎద్దుల జంగిరెడ్డి నిర్వహించిన ‘రామన్న రాముడు కోదండరాముడు’ జానపద భక్తి గీతాలు శ్రోతలను ఆనందభరితుల్ని చేశాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికపై సాయంత్రం 6 నుంచి 8.30 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్ర పుష్కరిణి వేదికపై కళాకారులు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. నేడు కపిలతీర్థంలో చక్రస్నానం కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందు కోసం ఉదయం 6 గంటలకు స్వామివారు పల్లకిలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు. చక్రస్నానం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. -
ఘనంగా ఆదినారాయణ స్వామి రథోత్సవం
చిలమత్తూరు (అనంతపురం): కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి సమీపంలో ఆదినారాయణ కొండపై వెలసిన శ్రీలక్ష్మీ ఆదినారాయణ స్వామి వారికి ఆదివారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సోమవారం రాత్రి స్వామి వారికి పూల పల్లకి సేవ జరగనుంది. దీంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఏటా మాఘ పౌర్ణమి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు స్వామి వారికి రథోత్సవం నిర్వహిస్తుంటారు. అక్కడ ఆది నారాయణ కొండ తాబేలు ఆకారంలో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అనంతపురం జిల్లా చిలమత్తూరుకు దగ్గరగా ఉంటుంది. -
వైభవం... రథోత్సవం
కడప కల్చరల్ : అడుగడుగునా గోవింద నామ స్మరణలు...భక్తజనంతో పోటెత్తిన మాడవీధులు.. దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా పూజలనంతరం స్వామిని రథంపైకొలువుదీర్చారు. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సాయంత్రం మూడు గంటలకు అర్చకులు, టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీతో తొలిపూజలు చేయించారు. ముత్యాల శేషయ్యపేరిట ప్రత్యేక పూజలు చేసి భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి రథాన్ని కదిలించారు. పాతకడప, దేవునికడప గ్రామ పెద్దల ప్రోత్సాహంతో యువకులు రథచక్రాల వెనుక భారీ దుంగలు ఉంచి సన్నలు తొక్కడంతో రథం ముందుకు కదిలింది. రథంపై అర్చకులు అడుగడుగునా భక్తులకు మంగళ హారతులిచ్చారు. రథం గొలుసులు లాగేందుకు పోటీలు పడ్డారు. రథోత్సవం సందర్భంగా దేవునికడప మాడ వీధులన్నీ జనమయంగా కనిపించాయి. దేవునికడప, పాతకడపతోపాటు సమీపంలోని పలు వీధులకు చెందిన భక్తులతోపాటు కడప నగరానికి చెందిన భక్తులు కూడా రథోత్సవానికి తరలి వచ్చారు. రథంపైగల బ్రహ్మదారు శిల్పం ముందు సప్తాశ్వాలు రథాన్ని ముందుకు నడుపుతున్నట్లు ఉండటంతో పదేపదే ఆ శిల్పంపై పూలు చల్లారు.రథ చక్రాల కింద మొక్కులు చెల్లింపుగా గుమ్మడికాయలు ఉంచారు. దేవునికడప చెరువు కట్టనుంచి పోలీసులు వాహనాలను నియంత్రించడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. రెండున్నర గంటల అనంతరం రథం తిరిగి యథాస్థానానికి చేరుకుంది. -
నీలకంఠుని రథోత్సవం.. భక్తజన పరవశం
ఎమ్మిగనూరు/టౌన్: హరోంహర.. భక్తజన సంరక్షక నామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణం మారుమ్రోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ.. మంగళవాయిద్యాల నడుమ సాగిన శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం భక్తజన సంద్రంగా మారింది. అశేష భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర సంబరం అంబరాన్నంటింది. బుధవారం సాయంత్రం 5.55 గంటలకు మొదలైన మహా రథోత్సవంలో 2లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో కొలువైన నీలకంఠునికి పురోహితులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం తేరుబజారు వరకు ఉత్సవమూర్తి ముక్కంటిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామిని పీఠంపై అధిష్టింపజేసి హోమం చేపట్టారు. పూర్ణకుంభంతో స్వామికి నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై అధిష్టింపజేసి హారతిపట్టారు. ఆ తర్వాత భక్తజనుల శివనామ స్మరణ నడుమ రథం కనులపండువగా ముందుకు కదిలింది. రథం లాగి స్వామి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవం శ్రీవూర్కండేయుస్వామి ఆలయుం వరకు చేరుకోగానే స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహారథాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ , గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రవూలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ ఎస్ఐ ఇంతియాజ్బాషా నేతృత్వంలో దాదాపు 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంలో ప్రవుుఖులు నీలకంఠేశ్వరస్వామి రథోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్గౌడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు వై.రుద్రగౌడ్, పార్థసారధిరెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, రమాకాంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణరెడ్డి, కోడుమూరు సర్పంచ్ సి.బి.లత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు, తిక్కారెడ్డి, పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠప్ప, మునిసిపల్ చైర్పర్సన్ సాయ సరస్వతి, వైస్ చైర్మన్ వైపీఎం కొండయ్యచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య, భీమిరెడ్డి, రెడ్డి పురుషోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కన్నుల పండువగా కోదండరాముని రథోత్సవం
తిరుపతి కల్చరల్, న్యూస్లైన్: తిరుపతిలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన శుక్రవారం రథోత్సవం క న్నుల పండువగా జరిగింది. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు సీతాల క్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను క నువిందు చేశారు. దీనికి ముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలుతీర్చారు. డప్పుల వాయిద్యాలు, భజన బృం దాల కోలాటాల నడుమ స్వామి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీరామ నామ స్మరణ చేస్తూ భ క్తితో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. నాలుగు మాడ వీధుల్లో రథం తిరిగి యథాస్థానానికి చేరాక ప్రబంధ వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు. సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు అర్చకులు రథమండ పం వద్ద తిరుమంజనం, ఆస్థానం ని ర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గం టల వరకు రఘురాముడి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, స్థానిక ఆలయాల డె ప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారు లు, భక్తులు పాల్గొన్నారు. భక్తి భావం నింపిన శ్రీరామపట్టాభిషేకం నాటకం మహతి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి ప్రదర్శించిన శ్రీరామపట్టాభిషేకం ప ద్యనాటకం భక్తి పారవశ్యంగా సాగిం ది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరి షత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం లో, శ్రీరామచంద్ర పుష్కరిణి కళా వేది కపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కడపకు చెందిన సవేరా ఆర్ట్స్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన శ్రీరామపట్టాభిషేకం పద్యనాటకం భక్తులను రంజిం పజేసింది. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దనున్న కళా వేదికపై నెల్లూరుకు చెందిన పి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యం లో పార్వతీపరమేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘రామాం జనేయ యుద్ధం’ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. నేడు చక్రస్నానం కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.40 గంటలకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 7.30 గంటలకు స్వామి వారు పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరుతారు. చక్రస్నానం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకుంటారు.