court verdict
-
క్షణికావేశం.. జీవితం కన్నీటిమయం (ఫొటోలు)
-
సీబీఐ వల్లే ఇలా జరిగింది.. కోర్టు తీర్పు సంతృప్తిగా లేదు: మమతా బెనర్జీ
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో తాము.. దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాము. కోర్టు తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని వెల్లడించారు.ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టులపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. మేమంతా దోషి సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ, కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నాం. ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారు. సీబీఐ కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా పోలీసులు శాయశక్తులా ప్రయత్నించేవారు. బాధితురాలికా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జీవిత ఖైతు చిన్న శిక్ష వంటిది. ఇలాంటి నేరస్థులను తప్పకుండా ఉరితీయాలి’ అని డిమాండ్ చేశారు. VIDEO | RG Kar rape and murder case: Here's what West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) said on Sealdah Court sentencing convict Sanjoy Roy to life term till death. "We have been demanding death sentence to the convict since Day 1 and we are still demanding the… pic.twitter.com/DdJBpJoZ4H— Press Trust of India (@PTI_News) January 20, 2025ఇదిలా ఉండగా.. ఆర్జీకర్ వైద్యుర్యాలి కేసులో తీర్పును వెల్లడిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసు అని.. అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇక, శనివారం న్యాయస్థానం సంజయ్ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే, దోషికి జీవిత ఖైదు విధించడమే కాకుండగా.. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. సంజయ్కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: కోల్కత్తా కేసు వివరాలు ఇలా.. -
ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడుఇలాన్మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.పిటిషన్ తోసిపుచ్చిన కోర్టుడెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్ను తోసిపుచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..మస్క్ ఏమన్నారంటే..డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది. -
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష..
సంగారెడ్డి జోన్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్లోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్ (61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్ 16న ఆదిత్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ పోలీస్స్టేషన్ ఎస్ఐ రవీందర్రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్షీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఎస్పీ అభినందించారు. -
థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. ‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్బన్ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. -
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
అతనికి ఉరే సరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్కుమార్ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు...హైదరాబాద్లోని అల్కాపురి టౌన్షిప్లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.నేరం అంగీకరించిన నిందితుడుచిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం -
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు
-
ఫైబర్ నెట్ స్కామ్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
-
Live : చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారానికి వాయిదా
Updates.. 07:00 PM చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న లోకేష్.. సూటిగా అడిగిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నారు. నిజంగా అవినీతి జరగలేదని కానీ, చంద్రబాబు తప్పు చేయలేకపోయారని గానీ సూటిగా చెప్పలేకపోతున్నారు. చాలా ప్రశ్నలకు నీళ్లు నమలడం, రొడ్డకొట్టుడు పాత ఆరోపణలు చేయడం తప్ప అసలు కేసు మూలాల్లోకి వెళ్లడం లేదు. మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. ఇండియాటుడే : షెల్ కంపెనీలకు నిధులు తరలిపోయాయన్న అభియోగంపై ఏమంటారు? లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్ పథకం మాది కాదు, గుజరాత్ నుంచి మేం కాపీ కొట్టామంతే. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. మా పాత్ర ఏమీ లేదు. ఇండియాటుడే : ఇక్కడ పథకం కాదు, ఏపీలో మీ హాయంలో నిధులు షెల్ కంపెనీలకు తరలించారన్నారన్న ఆరోపణలకు ఏమంటారు? లోకేష్ : 2021లో FIR నమోదయింది. చాలా మందిని విచారించారు. మనీ లాండరింగ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు IT, ED నోటీసులు వచ్చాయి ఇండియాటుడే : మనీ లాండరింగ్ జరగలేదని మీరంటున్నారు, మరి కేంద్ర సంస్థలు నోటీసులెందుకు ఇచ్చాయి? కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారంటారా? లోకేష్ : అవును, కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారు. డబ్బులు తరలించారంటున్నారు కానీ ప్రూవ్ చేయలేదు. చంద్రబాబుకు చేరాయని కానీ, నాకు చేరాయని కానీ నిరూపించలేకపోయారు. ఇండియాటుడే : ఈడీ దర్యాప్తు చేస్తోంది కదా? అంతే కాదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని YSRCP చాలా కేసుల గురించి చెబుతోంది? ఆధారాలు చూపిస్తోంది కదా? లోకేష్ : నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఉంది. మాపై అమరావతి, ఫైబర్గ్రిడ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ మాపై ఎలాంటి ఆరోపణలను నిరూపించలేకపోయింది. ఇండియాటుడే : ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది ? రెండు పార్టీల మధ్య వైరంగానా? లోకేష్ : చాలా చెప్పారు, చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ, నిరూపించలేదు ఇండియాటుడే : చంద్రబాబు ఇంకొన్నాళ్లు జైల్లో ఉంటే మీ పార్టీ ఏం చేయబోతుంది? సానుభూతి కోసం మీరు ప్రయత్నిస్తారా? లోకేష్ : తెలుగుదేశం ఎన్నో సవాళ్లను చూసింది. ఎన్టీఆర్ను అప్పుడు ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. నిజంగా లోకేష్ నిజాయతీగా మాట్లాడే వ్యక్తి అయితే, చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్కు వచ్చిన ఇన్కమ్టాక్స్ నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? రెండు వేల కోట్ల మొత్తం మనీ లాండరింగ్ అయిందన్న నోటీసుల మీద నోరెందుకు మెదపలేదు? తమపై రాజకీయ కక్ష అంటున్నారు కానీ.. మరి రాజధాని పేరిట జరిగిన భూకుంభకోణంలో కరకట్ట ఇంటి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు జరిగిన స్కాం గురించి ఎందుకు వివరించలేదు? అని వైఎస్సార్సిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తాత ఎన్టీఆర్ను ఇందిరాగాంధీ పదవి నుంచి తప్పించారని చెప్పిన లోకేష్.. అదే నోటితో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి తన తండ్రి చంద్రబాబు పదవి లాక్కున్నారని చెప్పి ఉంటే మరింత నిజాయతీగా ఉండేదంటున్నారు. 05:54 PM ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు 04:47 PM మౌనంగా వెళ్లిపోయిన లూథ్రా ► చంద్రబాబుతో ముగిసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్ ► దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ ► బయటకు వచ్చాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన లూథ్రా 03:46 PM రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న లూథ్రా ► చంద్రబాబుతో మూలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు లాయర్ సిద్ధార్థ లూథ్రా చేరుకున్నారు. ► మరికాసేపట్లో చంద్రబాబుతో లూథ్రా భేటీ ► చంద్రబాబు భద్రత రిత్యా.. కారును బయటే నిలిపివేయాలని జైలు అధికారుల సూచన ► అధికారుల సూచన మేరకు కారు బయటే ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లిన లూథ్రా ► ములాఖత్కు బయల్దేరే ముందు బాబు కుటుంబ సభ్యులతో లాయర్ లూథ్రా భేటీ 03:21 PM జైలు వద్ద భారీ భద్రత ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు ► జైలు లోపలా.. బయటా సెక్యూరిటీ పెంపు ► ఉన్న సీసీ కెమెరాకు అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు ► చంద్రబాబు భద్రతను నిత్యం పర్యవేక్షిస్తున్న జైలు శాఖ ఉన్నతాధికారులు 03:09 PM కాసేపట్లో చంద్రబాబుతో లాయర్ లూథ్రా భేటీ ► న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ► స్కిల్ స్కామ్ లో ముద్దాయి చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో భేటీ కానున్న లూథ్రా ►ములాఖత్కు ముందు.. కాసేపటి కిందట గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన లూథ్రా ► చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు పిటిషన్ల విచారణ వాయిదా పడడంతో ఏం తోచని స్టేజ్లో బాబు లాయర్లు! 03:03 PM చంద్రబాబుతో పవన్ ములాఖత్? ► నారా చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ వెళ్లనున్నట్లు సమాచారం ► సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాబుతో ములాఖత్ అయ్యే ఛాన్స్! ► బాబుతో పవన్ ములాఖత్పై జైలు అధికారుల నుంచి రావాల్సిన స్పష్టత 01:31 PM టీడీపీ ముఖ్య నేతలతో భువనేశ్వరి భేటీ ► రాజమండ్రిలో తొలిసారి పార్టీ నాయకులతో సమావేశమైన భువనేశ్వరి ► చంద్రబాబు కేసు పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► పార్టీ పరిస్థితితో పాటు లీగల్గా ఏర్పడిన ఇబ్బందులను భువనేశ్వరీకి వివరించిన లీడర్లు ► చట్టపరంగా అన్ని ఆధారాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరణ 01:03 PM ► విజయవాడ: ఏసీబీ కోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు ► కస్టడీ పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందన్న అధికారులు ► హైకోర్టు ఉత్తర్వులు అందాకే తదుపరి ఆదేశాలన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 12:33 PM ► అక్రమ నిర్బంధం, గృహ నిర్బంధాలంటూ హైకోర్టులో టిడిపి పిటిషన్ ► పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ► పిటిషనర్ తరఫున వాదించిన లాయర్ యలమంజుల బాలాజీ ► ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు ► రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు 12:12 PM ► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో లోకేష్ ఎడతెగని మంతనాలు ► సోమిరెడ్డి, అయ్యన్నపాత్రుడు, కనకమేడలతో లోకేష్ సుదీర్ఘ చర్చలు ► లీగల్ అంశాల పై లోకేశ్ తో మాట్లాడిన అడ్వొకేట్ లక్ష్మినారాయణ ► చంద్రబాబు చేసిన అవినీతికి పక్కాగా ఆధారాలున్నాయంటున్న బాబు లీగల్ టీం ► ఇప్పుడున్న పరిస్థితుల్లో కిం కర్తవ్యం అంటూ లోకేష్ చర్చలు ► చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తే.. ఎవరు నాయకత్వమని పార్టీలో చర్చ 11:42 AM ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్లో సకల సౌకర్యాలు ► చంద్రబాబు గదిలో ఒక హాస్పిటల్ బెడ్, ఫ్యాన్, టీవీ, ► చంద్రబాబు ఐదు ఛానల్స్ చూసే అవకాశం ► న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచిన అధికారులు ► స్నానానికి ప్రతిరోజు రెండు బకెట్ల వేడి నీళ్లు అందిస్తోన్న జైలు సిబ్బంది ► నిబంధనల మేరకు ఇంటి నుంచి భోజనం, అల్పాహారం ► భోజనాన్ని పరీక్షలు చేసిన అనంతరం చంద్రబాబుకు ఇస్తోన్న జైలు సిబ్బంది 11:42 AM ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరిన ACB ► కస్టడీ కోసం అవినీతి నిరోధక శాఖ ACB ప్రయత్నాలు ► రాజమండ్రి జైలు నుంచి పిటి వారెంటు మీద బాబును కస్టడీ తీసుకునేందుకు ఏర్పాట్లు ► ఈ విషయంలో ఇప్పటికే ACB కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు ► ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A6గా లోకేష్ ► క్విడ్ ప్రో కో జరిగిందని ఇప్పటికే కావాల్సినన్ని ఆధారాలు సేకరించిన ACB 11:40 AM ► రాజమండ్రి జైలులో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తనిఖీలు ► స్నేహ బ్లాక్ను పరిశీలించిన కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ► చంద్రబాబుకు కోర్టు ఆదేశాల మేరకు అందుతున్న వసతులపై జైళ్ల శాఖ డీఐజీ ఆరా 11:35 AM ► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ► CID నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ కౌంటర్ దాఖలు చేయాలని CIDకి ఆదేశం ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన హైకోర్టు ► ఇన్నర్ రింగ్రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 19కి వాయిదా. 11:30 AM ► హైకోర్టులో వాదనల సందర్భంగా ఆసక్తికర చర్చ ► అర్జంటుగా పిటిషన్పై వాదనలు వినాలన్న బాబు లాయర్ లుథ్రా ► గతంలో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేశానన్న హైకోర్టు జడ్జి ► మీకేమైనా అభ్యంతరాలుంటే కేసును వేరే బెంచ్కు మారుస్తామన్న న్యాయమూర్తి ► అలాంటిదేమి లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవన్న బాబు లాయర్ సిద్ధార్థ్ లుథ్రా ► ఒక కేసులో కౌంటర్ కూడా దాఖలు కాకుండా వాదనలు ఎలా వినాలన్న హైకోర్టు న్యాయమూర్తి ► కౌంటర్ దాఖలు అనంతరం పూర్తి వాదనలు వింటానని చెప్పిన జడ్జి ► మంగళవారం వరకు పిటిషన్పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 11:20 AM ► 17A సెక్షన్పై వాదనలు వినిపిస్తానంటూ పట్టుబట్టిన సిద్దార్థ్లుథ్రా ► బాబు అరెస్ట్పై గవర్నర్ అనుమతి కావాల్సిందేనంటూ జడ్జికి విజ్ఞప్తి ► ముందు CID నుంచి కౌంటర్ పిటిషన్ దాఖలు కానివ్వాలని సూచించిన హైకోర్టు న్యాయమూర్తి ► CID తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన AAG పొన్నవోలు సుధాకర్రెడ్డి ► కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలన్న AAG ► కౌంటర్ దాఖలు తర్వాత పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు ► ఈ నెల 19వరకు పిటిషన్ను వాయిదా వేసిన హైకోర్టు ► అప్పటివరకు ACB కోర్టు కస్టడీ పిటిషన్పై నిర్ణయానికి రావొద్దన్న హైకోర్టు 11:15 AM ► క్వాష్ పిటిషన్ను హైకోర్టు వాయిదా వేయడంతో నీరుగారిపోయిన బాబు లాయర్లు ► చంద్రబాబు కేసు కోసం హైకోర్టులో భారీగా మోహరించిన 20 మంది టాప్ లాయర్లు ► ఢిల్లీ నుంచి వచ్చిన సిద్దార్థ్ లుథ్రా & కో ► పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తోన్న చంద్రబాబు లాయర్ల బృందం ► ఏసీబీ కోర్టులో పిటిషన్లు, హైకోర్టులో పిటిషన్లు ► ఢిల్లీలో మరింత మంది సీనియర్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు 11:15 AM ► క్వాష్ పిటిషన్ను ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► ఈనెల 18 వరకు కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం ► తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18 వరకు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశం ► తాజాగా హైకోర్టు ఆదేశాలతో మంగళవారం వరకు కస్టడీ పిటిషన్ వాయిదా 11:10 AM ► ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు దక్కని అత్యవసర ఊరట ► క్వాష్ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా 10:50 AM ► చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ. ► వాదనలు వినిపిస్తున్న ఇరు పక్షాల న్యాయవాదులు. 10: 35 AM ► రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ముద్దాయి చంద్రబాబు. ఆయన భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. బాబు భద్రతకు సంబంధించిన వివరాలు హోం సెక్రటరీ వద్ద తీసుకున్నాం. బాబుకు పూర్తి భద్రత కల్పించామని ఏసీబీ కోర్టుకు తెలిపాం. - ఏజీ శ్రీరామ్. 10:15 AM ► చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్పై కొనసాగుతున్న ఉత్కంఠ. ► పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. ► క్వాష్ పిటిషన్ రూపంలో నిన్న హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. ► చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ► అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. విచారణ నేటికి వాయిదా. ► నేడు క్వాష్ పిటిషన్తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో ముందస్తు బెయిల్పై వాదనలు. ► క్వాష్ పిటిషన్పై విచారణ సాకుతో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీయాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆలోచన?. ► మరోవైపు నందిగామలో ఓ న్యాయవాదిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు న్యాయవాదుల విధుల బహిష్కరణకి పిలుపునిచ్చిన బెజవాడ బార్ అసోషియేషన్. ► న్యాయవాదుల విధుల బహిష్కరణతో విజయవాడలోని జిల్లా కోర్టులు బంద్. ► నేడు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. 9.00 am నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు ► విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నందిగామ బార్ అసోసియేషన్. సంఘీభావం తెలిపిన బెజవాడ బార్ అసోసియేషన్. ► చంద్రబాబును కస్టడీకి కొరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ. ► బీబీఏ విధులు బహిష్కరణ పిలుపుతో విచారణ జరుగుతుందా.. వాయిదా పడుతుందా అని పిటిషనర్లలో సందిగ్ధం. 8.45 am సానుభూతి కోసం నారా భువనేశ్వరి ఆరోపణలు.. ► చంద్రబాబు కుటుంబసభ్యులు కోరిన అన్ని సదుపాయాలు జైలులో కల్పిస్తున్నారు. ఇంకా ఏవైనా సదుపాయాలు కావాలంటే జైలు అధికారులను కోరవచ్చు లేదా కోర్టులో పిటిషన్ వేయవచ్చు. న్యాయవ్యవస్థపై టీడీపీ, వాళ్ల మద్దతుదారులు ఆరోపణలు చేయడం దారుణం. న్యాయ వ్యవస్థను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటాం? - వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి 8:10 AM రాజమండ్రి జైలులో చంద్రబాబు దినచర్య.. ► మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చంద్రబాబు నిద్రలోకి వెళ్లాడు. ఉదయం నిద్రలేచి వాకింగ్, మెడిటేషన్ చేసిన చంద్రబాబు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివిన బాబు. ► స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. నేడు చంద్రబాబును టీడీపీ సీనియర్ నేతలు కలిసే అవకాశం. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ACB కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు నేటికి వాయిదా పడ్డాయి. చంద్రబాబు లాయర్లు ఈ పిటిషన్పై ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. ► అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిస్టింగ్లో ఈ పిటిషన్ మెన్షన్ చేసి ఉంది. ఈ స్కాంలో ఏ1గా చంద్రబాబు పేరు ఉన్న సంగతి తెలిసిందే. నేడు కోర్టులో వాదనలు.. ► ACB కోర్టు - చంద్రబాబు కస్టడీ కోరుతూ CID పిటిషన్ ► హైకోర్టు - స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ క్వాష్తో పాటు హైకోర్టులో మరో రెండు! ► స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయడం, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను సస్పెండ్ చేయడం, ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ ► క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో A1 గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ ► అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్ ► చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయిన విషయం తెలిసిందే.దీంతో, ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. యూపీ కోర్టు కీలక తీర్పు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ హత్రాస్లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్కుష్ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు. చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్.. -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
ఇక మహిళలకు ఆయుధాలు ఇవ్వాలేమో!: స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: రేప్ కేసుల్లో తాజా కోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు ‘‘దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశాజనక ధోరణి కొనసాగితే.. ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు’’.. అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదని ఆమె ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఓ దోషికి విధించిన శిక్షను 25 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో పాటు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు, ఢిల్లీలో సంచలనం రేపిన ఓ అత్యాచారం, హత్యకేసులో దోషులకు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఈవిధంగా స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపైనా ఆమె గతంలో ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. If this trend of Judicial let-downs continue, it may be time to allow women of this country the Right to bear Arms ! 'Justice and Law cannot be two different things'. #shameful pic.twitter.com/JUrWKq2frY — Smita Sabharwal (@SmitaSabharwal) November 8, 2022 -
జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు
లక్నో: జ్ఞాన్వాపీ కేసులో హిందువుల పిటిషన్ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్ను తిరస్కరించింది. జ్ఞాన్వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట -
సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష
తిరువనంతపురం: అత్యాచారం కేసులో కేరళలోని పతనంతిట్టా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లకుపైగా లైంగిక దాడికి పాల్పడిన 41 ఏళ్ల మానవ మృగానికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. నిందితుడు మరో మూడేళ్లు జైలులో ఉండాలని పోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఓ వ్యక్తికి విధించిన గరిష్ఠ శిక్షగా అధికారులు తెలిపారు. 2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల పాటు 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు 2021, మార్చి 20న తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నందన్ పీఆర్ అలియాస్ బాబు బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు, వారి ఇంటిలోనే ఉండటంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ‘బాధితుల తరఫున పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకేట్ జాసన్ మాథ్యూ వాదనలు వినిపించారు. సాక్షుల వాంగ్మూలం, మెడికల్ రికార్డులు, ఇతర ఆధారాలు ప్రాసిక్యూషన్కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. తిరువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ హరిలాల్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది’ అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి -
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం
లక్నో: జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఇదీ కేసు.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. చదవండి: ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం -
అమ్మకానికి విజయ్మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్
లిక్కర్ కింగ్ విజయ్మాల్యాకి లండన్ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకు లోన్లు చెల్లించని కారణంగా ఇంటిని జప్తు చేయోచ్చుంటూ గతంలో వచ్చిన తీర్పుపై ఆయనకు ఊపశమనం లభించింది. విజయ్ మాల్యా కుటుంబానికి లండన్లోని కార్న్వాల్లో విలాసవంతమైన భవనం ఉంది. విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యాతో పాటు కొడుకు సిద్ధార్థ్ మాల్యా అక్కడ నివసిస్తున్నారు. గతంలో స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్ల నుంచి తీసుకున్న రుణాన్ని విజయ్ మాల్యా సకాలంలో చెల్లించలేదు. దీంతో అప్పు కింద మాల్యా కుటుంబం నివిస్తున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ అప్పిచ్చిన సంస్థలు కోర్టును ఆశ్రయయించాయి. అనేక వాయిదాల్లో విచారణ జరిగిన తర్వాత ‘ విజయ్ మాల్యా తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని.. అప్పిచ్చిన సంస్థలు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ ’ కోర్టు తీర్పు ఇచ్చింది. స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్ల దగ్గర తీసుకున్న అప్పులను మాల్యా ఫ్యామిలీ ట్రస్టు నిధుల నుంచి చెల్లిస్తానని, తన ఇంటి జప్తును ఆపాలంటూ తిరిగి కోర్టును ఆశ్రయించాడు విజయ్మాల్యా. అయితే గతంలో ఈ తరహాలోనే అనేక హామీలు ఇచ్చి వాటిని నేరవేర్చలేదని. కాబట్టి తన అప్పులను ట్రస్టు ద్వారా తీరుస్తానంటూ ఇచ్చే హామీని తోసిపుచ్చాలంటూ అప్పులు ఇచ్చిన సంస్థలు న్యాయస్థానం ముందు వాదించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ట్రస్ ద్వారా అప్పులు చెల్లించడం చట్ట విరుద్ధమైమీ కాదంటూ 2022 మార్చి 4న తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు లండన్ ఇంటిని బ్యాంకులు స్వాధీనం చేసుకునే పని ఆగి పోయింది. వృద్ధురాలైన తల్లితో లండన్లో ప్రవాస జీవితం గడుపుతున్న మాల్యాకు తాజా తీర్పు గొప్ప ఉపశమనం కలిగించింది. చదవండి: విజయ్మాల్యాకు భారీ షాక్! లండన్ నివాసం నుంచి గెట్ అవుట్ ? -
రోడ్డున పడ్డ విజయ్మాల్యా.. ఉన్న ఇళ్లు కూడా పాయే!
London High Court Verdict Vijay Mallya: ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా వార్తల్లో నిలుస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్మాల్యా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో లండన్లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లు ఖాళీ చేయండి స్విట్జర్లాండ్కు చెందిన యూబీఎస్కు 20.4 మిలియన్ బ్రిటన్ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్ హై కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ కేసు వాయిదాలు పడుతూ వస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్లోని రిజెంట్ పార్క్లో ఉన్న కార్న్వాల్ టెర్రస్ లగ్జరీ అపార్ట్మెంట్ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్ హై కోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది. అప్పీల్కి అవకాశం లేదు లండన్ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు. వేరే బెంచ్కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు. చివరి ప్రయత్నం లండన్లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్మెంట్లో అతని కొడుకు సిద్ధార్థ్మాల్యా (34)తో పాటు విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. ఈ వయస్సులో ఇప్పటికిప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని... కనీసం మానవతా దృక్పథంతో విజయ్మాల్యా తల్లి వయస్సుని పరిగణలోకి తీసుకునైనా తీర్పు ఇవ్వాలంటూ మాల్యా తరఫున న్యాయవాదులు కోరారు. కానీ విజయ్ మాల్యాకి ఊరట లభించలేదు. వాళ్లు ఊరుకోలేదు భారత్ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి, బ్రిటన్కు విజయ్మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్హౌస్లు, లగ్జరీ యాచ్లే ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది. చదవండి: అమ్మకానికి విజయ్మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ అక్కడే ఉంటారేమో విజయ్మాల్యా హవా నడిచినప్పుడు అందమైన మోడళ్లతో బీచ్లలో లగ్జరీ యాచ్లలో గడిపేవారు, వేలం పాటలో ఖరీదైన, యాంటిక్ వస్తువులను దక్కించుకున్నారు. ఫార్ములా వన్ టీమ్ని కొనుగోలు చేశారు. తన ఫార్ములా వన్ టీమ్ ఏస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కుటుంబానికి సంబంధించిన రెండు ఇళ్లను విజయ్మాల్యా ఆ రోజుల్లో కొనుగోలు చేశారు. అవి ఇంగ్లండ్లోని టెవిన్, హెర్డ్ఫోర్షైర్లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్మాల్యా తన మకాం ఇక్కడికే మార్చే అవకాశం ఉంది. చేతులెత్తిసినట్టేనా ? వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్మాల్యా గడిచిన ఐదేళ్లుగా అనేక కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం లాయర్ల ఫీజులు చెల్లించేందుకు ఆయన ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీడియా కంట పడిన ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కాగా లండన్ ఇంటిని కాపాడుకోలేకపోవడం విజయ్మాల్యాకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముందు ముందు న్యాయస్థానాల్లో ఆయన పోరాటం ఎంత వరకు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! -
ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
బన్సీలాల్పేట్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా విధించింది. బుధవారం పోక్సో కేసు ప్రత్యేక జడ్జి జి.ప్రేమలత ఈ మేరకు తీర్పునిచ్చారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్రావు కథనం ప్రకారం..2017 సంవత్సరంలో కవాడిగూడ సింగాడికుంటకు చెందిన ఆకుల రాము(29) గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా...బాలిక గర్భం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఇన్స్పెక్టర్ ఎ. సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ వస్తున్నది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. నాటి ఇన్స్పెక్టర్, నేటి డీఎస్పీ ఎ.సంజీవరావు బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రాసిక్యూషన్ ముందు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశామన్నారు. బాలికకు జన్మించిన పసికందు మృతిచెందాడని, పసివాడి డీఎన్ఏ సేకరించి నిందితుడి డీఎన్ఏతో పోల్చి..పక్కా ఆధారాలు సేకరించి ప్రాసిక్యూషన్ ముందు నిరూపించామన్నారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
‘గిరిజనులకు అన్యాయం జరగనివ్వం’
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా వాకబు చేశారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు వచ్చేలా 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జీవో నెంబర్.3 ను జారీ చేశారన్నారు. (‘ఆయన చెప్పిందే నిజమైంది’) అయితే ఈ జీవో ఆధారంగా ఏజెన్సీ ఏరియాలోని టీచర్ల నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం జీవో నెంబర్.3ను కొట్టి వేసిందని వివరించారు. ఈ తీర్పు నేపథ్యంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఏ చర్యలు తీసుకోవాలనే విషయంగా న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ వివరాలు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి, వారు సూచించిన విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తుందని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. (‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు) -
పురపాలికల్లో కానరాని ఎన్నికల సందడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి తగ్గింది. రెండు నెలల క్రితం పురపాలికల్లో నెలకొన్న ఎన్నికల హడావిడి ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు. అన్నీ వదులుకుని ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకు ‘పుర’ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. సాక్షి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జూన్, జూలైలో చేపట్టిన వార్డుల పునర్విభజన.. కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారంటూ ఒకరి తర్వాత మరొకరు మొత్తం 13మున్సిపాలిటీల నుంచి ఆశావహులు, రాజకీయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందిన ఫిర్యాదులు.. అధికారుల తప్పిదాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తప్పులన్నీ సరి దిద్ది.. ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వమూ పలుమార్లు ఎన్నికల నిర్వహణపై చేపట్టిన కసరత్తుపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ వివరణ విన్న హైకోర్టు ఇప్పటి వరకు ప్రక్రియపై సంతృప్తి చెందలేదు. ఎన్నికల నిర్వహణపై తుది తీర్పును కూడా ప్రకటించలేదు. దీంతో హైకోర్టు తీర్పు వస్తుంది.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశావాహులు, పార్టీలు రెండు నెలల తరబడి ఉత్కంఠతో ఎదురుచూశారు. ఇంత వరకు వెలువడని హైకోర్టు తీర్పు.. ఎన్నికల నిర్వహణపై నీలినీడల్ని చూసి ఎన్నికల్లో పోటీపై ఆశలు వదులుకున్నారు. అవకాశం వస్తే పార్టీ గుర్తు మీద.. లేకుంటే స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో తమ తమ పనుల్ని వదిలేసి వార్డుల్లో ప్రచారానికి తెరలేపిన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ సొంత పనులపై దృష్టిసారించారు. ఇటు అదే స్థాయిలో స్పందించిన రాజకీయ పార్టీల ప్రభావమూ మున్సిపాలిటీల్లో ఇప్పుడు తగ్గింది. నెలన్నర రోజుల క్రితం వార్డుల వారీగా అభ్యర్థుల అన్వేషణపై దృష్టిపెట్టిన అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ ప్రక్రియను నిలిపేశారు. గత పాలకవర్గంలో కౌన్సిల్లో ఉన్న బలాబలాలు లెక్కలేసుకోవడంతో పాటు ఈ సారి ఆయా ‘పుర’ పీఠాలు దక్కించుకునే విధంగా వ్యూహాలకు పదునుపెట్టిన నేతలు కోర్టు తీర్పు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన విధి విధానాలు, అంశాలపై చర్చించుకున్న నాయకులకూ నిరీక్షణ తప్పడం లేదు. 13 పురాల్లో ఎన్నికపై స్టే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీలున్నాయి. ఇందులో అచ్చంపేట మున్సిపాలిటీకి మార్చి 6, 2016న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది. బాదేపల్లి మున్సిపాలిటీ ఇప్పటికీ గ్రామ పంచాయతీలో కొనసాగుతోంది. దీంతో అచ్చంపేట, బాదేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. కాగా.. వార్డుల పునర్విభజన... కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రి యలో అక్రమాలు జరిగాయంటూ మహబూబ్నగర్, భూత్పూర్, కోస్గి, మక్తల్, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, గద్వాల, అయిజ, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు ఆశావాహులు, పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో మొత్తం ఎన్నికల నిర్వహణకు బ్రేక్పడింది. ఎదురుచూస్తున్న.. నా పేరు ఆనంద్గౌడ్, మాది మహబూబ్నగర్ పట్టణం లోని 12వ వార్డు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న. పన్నెండేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్న. మున్సిపల్ పాలక మండలి పదవి కాలం పూర్తి అయినప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చూసున్న. కచ్చితంగా వార్డు రిజర్వేషన్ నాకే అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఉన్న. ఆరు నెలల నుంచి పనులన్నీ మానేసి.. వార్డుల్లో అందరినీ కలుస్తున్న. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై స్టే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి..నెల రోజుల నుంని మళ్లీ నా పనిలో నిమగ్నమయ్యాను. ఎన్నికలపై స్టే ఉన్న పురపాలికలు మహబూబ్నగర్ భూత్పూర్ కోస్గి మక్తల్ ఆత్మకూరు అమరచింత కొత్తకోట పెబ్బేరు వనపర్తి గద్వాల అయిజ కల్వకుర్తి కొల్లాపూర్ -
గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఆ నలుగురు నిర్దోషులని ప్రకటించింది. ఇతర ఏవైనా కేసుల్లో వీళ్ల అవసరం లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాలిబాటకు సంబంధించిన వివాదంలో గుంటూరు జిల్లా, తంగేడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గాదెరిపల్లె సుభాని, పెదజాన్, మౌలాలి, మహ్మద్ కత్తితో పొడిచి చంపారన్న ఆరోపణలపై దాచేపల్లి పోలీసులు 2011లో కేసు నమోదు చేశారు. 2012లో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన గురజాల పదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. సుభాని తదితరులు సైదాను హత్య చేశారని నిర్ధారిస్తూ 2018లో మరణశిక్ష విధించింది. అదే సమయంలో మరణశిక్ష పడ్డ దోషులు నలుగురు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.సురేశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హతుడిని ఈ నలుగురు వ్యక్తులు చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరన్నారు. అరుదైన, హేయమైన కేసుల్లోనే మరణశిక్ష విధిస్తారని నివేదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మరణశిక్ష విధించదగ్గ కేసు కాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మృతుడు సైదాతో ఆ నలుగురు వ్యక్తులకు ఏవో వివాదాలు ఉన్నంత మాత్రాన అతనిని వారే హత్య చేశారని చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదంది. గురజాల కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. -
కేవిన్ జోసెఫ్ కేసులో సంచలన తీర్పు
కొట్టాయం: కేరళలో దుమారం రేపిన దళిత క్రిస్టియన్ కేవిన్ పీ జోసెఫ్ (24) హత్య కేసులో స్థానిక కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది ‘పరువు హత్య’అని తేల్చిచెప్పిన కోర్టు ఈ కేసులో 10మందిని దోషులుగా నిర్ధారించింది. దోషులలో కేవిన్ భార్య సోదరుడు కూడా ఉన్నాడు. వీరికి శనివారం శిక్షలు ఖరారు చేయనున్నారు. 2018 మే 24న కేవిన్ నీను చాకో (20)ను కొట్టాయంలో పెళ్లాడారు. అయితే, కేవిన్ దళితుడు కావడంతో ఈ పెళ్లిని నీను కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. పెళ్లయిన రెండురోజులకే ఓ గ్యాంగ్ కేవిన్ను, అతని స్నేహితుడు అనీష్ను ఎత్తుకెళ్లారు. నీను కుటుంబం, ముఖ్యంగా నీను సోదరుడు స్యాను చాకో ఈ కిడ్నాప్ వెనుక ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అనీష్ను ఆ గ్యాంగ్ విడిచిపెట్టినప్పటికీ.. ఆ మరునాడు కేవిన్ మృతదేహం కొల్లాం జిల్లాలోని థెన్మలా వద్ద కాలువలో దొరికింది. కేవిన్ బలవంతంగా నీళ్లలో ముంచి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కేవిన్ కిడ్నాప్పై నీను, కేవిన్ కుటుంబం పదేపదే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విచారణలో వెలుగుచూసింది. స్యాను చాకోతోపాటు మరో పదిమందిని మర్డర్ (302), కిడ్నాపింగ్ (364ఏ), క్రిమినల్ కుట్ర (120 బీ) తదితర సెక్షన్ల కింద న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో నీనూ తండ్రిని, మరో ముగ్గురు నిందితులను ఆధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. -
ఉత్కంఠ వీడేనా?
కోర్టు తీర్పుపై టెన్షన్...టెన్షన్..పురపాలక ఎన్నికల చిక్కుముడి వీడటం లేదు. హై కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. తాజాగా సోమవారం జరగాల్సిన విచారణ మరోసారి మంగళవారానికి వాయిదా పడింది. ఆశావహుల్లో రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలంటూ కోర్టుకు వెళ్లడంతో పురపోరుకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించాలని ఓటరు జాబితా, వార్డుల విభజన సరి చేశామంటూ ప్రభుత్వం తరఫున నివేదికను ఈ నెల 9వ తేదీన కోర్టుకు అందజేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సాక్షి, దుబ్బాక: మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన మార్పులు చేశామని ప్రభుత్వం కోర్టుకు నివేదించడంతో తుది తీర్పునను ఈ నెల 13 తేదీకి వాయిదా వేశారు. మళ్లీ 13న విచారణ జరగకుండానే నేటికి వాయిదా పడింది. జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ మున్సిపాల్టిల్లో ఓటరు జాబితాతో తప్పుల తడకగా ఉన్నాయని, చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడం, వార్డుల విభజన సక్రమంగా జరుగలేదంటూ పలు కారణాలతో పలువురు హై కోర్టును ఆశ్రయించడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పై స్టే విధించింది. ప్రభుత్వం అందజేసిన నివేదికతోనైనా దుబ్బాక, గజ్వేల్ మున్సిపోల్స్కి లైన్ క్లియర్ అయ్యేనా..? అని ఎదరుచూస్తున్నారు. జులై నెలలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉండగా ఆగస్టు వచ్చినా ఆ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికలపై నేడు హై కోర్టు తీర్పు రాజకీయ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎదురు చూపులకు తెరపడేనా... మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎన్నికలపై విచారణను కోర్టు వాయిదా వేయడం 6 వ తేదీన జరుగాల్సిన వాదనలు 9వ తేదీకి మళ్లీ 13కు చివరగా నిన్న మళ్లీ 14 వ తేదీ(నేటికి) వాయిదా వేయడం జరిగింది. దీంతో మళ్లీ ఈ రోజైనా కోర్టు తీర్పు స్పష్టం అవుతుందో..? లేక మళ్లీ వాయిదా పడుతుందో? తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటికే పలు పర్యాయాలు ఎన్నికలపై తీర్పు వస్తుందని ఎదురుచూసి వేసారిపోయిన రాజకీయ పార్టీల నాయకులు, ఆశవాహులు నేడు ఖచ్చితంగా తీర్పు వెలువడతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అందరిలోను కోర్టు తీర్పుపై టెన్షన్...టెన్షన్... మున్సిపల్ ఎన్నికలపై నేడు హై కోర్టులో తీర్పు వెలువడే అవకాశాలు ఉండడంతో రాజకీయ పార్టీల నాయకుల్లో..పోటీ చేసే ఆలోచనలో ఉన్న ఆశవాహుల్లో కోర్టు తీర్పుపై టెన్షన్ నెలకొంది.వరుస వాయిదాలు పడుతు రావడం ఇటీవలనే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఏలాంటి తప్పులు లేకుండా సరిచేసిన నివేదికలు కోర్టుకు సమర్పించడంతో నేడు ఖచ్చితంగా తీర్పు వెలువడుతుందనే ఆశిస్తున్నారు.ఎక్కడ చూసిన మున్సిపల్ ఎన్నికల తీర్పుపైననే జోరుగా చర్చలు జరుగుతుండడం కనిపిస్తుంది. అలాగే నేటి తీర్పు దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీల ఎన్నికలకు క్లియరెన్స్ వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ధీమాలో ఆశావహులు... కోర్టు తీర్పు ఎన్నికలకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో రాజకీయపార్టీల నాయకులు, ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన, ఓటర్ల గణన, కుల ఓటర్ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల నిర్దారణ, పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణను ఇచ్చారు. కేవలం వార్డుల, చైర్మన్ల రిజర్వేషన్ల అంశం మాత్రమే తేలాల్సి ఉంది. జులై చివరి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఊహించారు. ఈ క్రమంలోనే పలువురు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు హడావుడి ఎన్నికలు ఎందుకు అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఏదేమైనా నేడు హై కోర్టు తీర్పు ఏం వస్తుంద అన్న టెన్షన్ తో చాల మంది ఆశావహులు నిద్రకూడ సక్రమంగా పోని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు. మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయా..? మళ్లీ వాయిదా పడుతాయా? అన్న విషయం నేడు స్పష్టం కానుంది. -
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్ జీవకోన క్రాంతినగర్కు చెందిన కుసునూరు చరణ్కుమార్కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉండేవారు. చరణ్కుమార్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్కుమార్ క్రైమ్ పోలీసు స్టేషన్ సమీపంలో వెంబడించాడు. తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్ క్లబ్ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్డ్రింక్స్లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్ వార్డన్కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్కుమార్ బాధిత యువతికి ఫోన్చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్కుమార్పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
రాష్ట్రాల మధ్య భాషా సమస్యలు
మన దేశంలోని అన్ని వ్యవస్థలు ఇంగ్లిష్ భాషని ఎక్కువగా ఉపయోగిస్తు న్నాయి. ఒక వ్యక్తి చాలా భాషలు నేర్చుకున్నప్పటికీ తన మాతృ భాషకి ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకమైనది. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల భాషని అధికార భాషగా అమలు చేసుకునే సౌకర్యాన్ని మన రాజ్యాంగం కల్పించింది. అందుకని తెలుగుని అధికార భాషగా ఉమ్మడి రాష్ట్రం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించింది. ప్రభుత్వ, న్యాయపాలనలో తెలుగుని ఎక్కువగా వాడటంవల్ల పాలన ప్రజలకి చేరువవు తుంది. తెలుగులో తీర్పులతో బాటూ, తెలుగులో న్యాయ శాస్త్రానికి సంబంధించి ఓ యాభై పుస్తకాలు రాశాను. తెలుగులో న్యాయపాలన దిశగా అవసర మైనంత కృషి జరగడంలేదని గొంతు చించుకున్న వ్యక్తుల్లో నేనూ ఉన్నాను. కింది కోర్టుల్లో మాతృ భాషలో న్యాయపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తీర్పులని పై కోర్టుల్లో సవాలు చేసినప్పుడు వాటికి ఇంగ్లిష్ అను వాదం పంపించాల్సిన అవసరం ఉంది. మరో రకంగా చెప్పాలంటే మనకి కూడా ఓ దేశ భాష అవసరం అయిపోయింది. ఆ స్థానాన్ని హిందీ భాష కాకుండా ఇంగ్లిష్ ఆక్రమించింది. హైకోర్టుల్లో సుప్రీం కోర్టుల్లో వివిధ భాషలకి చెందిన న్యాయమూర్తులు ఉంటారు. అందుకని దేశ భాష అవసరం అయి పోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో న్యాయపాలన, ప్రభుత్వ పాలన ఇంగ్లిష్లోనే ఎక్కువగా జరుగు తుంది. హిందీ రాష్ట్రాల్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాలన, న్యాయ పాలన వాళ్ల భాషల్లో జరుగుతుంది. చాలా మంచి పరిణామం. అయితే నేర న్యాయ వ్యవస్థ పాలన వాళ్ల భాషలోనే జరగడంవల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి. భీమా, కోరేగావ్ కేసులో చాలామంది వ్యక్తులని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మన రాష్ట్రం లోనూ ఆ కేసుకి సంబంధించి ప్రముఖ కవి వరవర రావుని పోలీసులు అరెస్టు చేసి టాన్సిట్ వారంట్ కోసం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజ రుపరిచారు. ఆ తరువాత ఆయన్ని పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అప్పటికి సుప్రీంకోర్టు వాళ్లని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఆయనని మళ్లీ హైదరాబాద్ తీసుకునివచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ అరెస్టుకి భాషకి సంబం ధం ఉంది. వీవీని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు, వాళ్లు హైదరాబాద్ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలో ఉన్నాయి. ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి రిమాండ్ రిపోర్టుని ఇవ్వాలి. అది ఇతర భాషల్లో ఉంటే దాని ఇంగ్లిష్ అనువాదాన్ని ఇవ్వాలి. ఈ కేసులో మేజిస్ట్రేట్కి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలోనే ఉన్నాయి. ఆ మెజిస్ట్రేట్కి మరాఠీ రాదు. వాటి తర్జుమాని నాకు ఫలానా వాళ్లు చేశారన్న నోట్ కూడా మేజిస్ట్రేట్ చేయ లేదు. కానీ వీవీని రిమాండ్ చేసి çపుణే కోర్టులో హాజరుపరచమని ఆదేశాలు జారీ చేశారు. ఎవరినైనా రిమాండ్ చేసే ముందు అతనిపైన ఆరోపించిన నేరా లకి గట్టి ఆధారాలు ఉన్నాయా లేదా అని మేజిస్ట్రేట్ చూడాలి. ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడే రిమాం డ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిట్ రిమాండ్కి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ విధంగా చేయనప్పుడు ఆ రిమాండ్ చట్ట వ్యతిరేకమవుతుంది. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం, ఇతర భాషల్లో డాక్యుమెంట్స్ ఉండి, ఆ భాష ఆ మేజి స్ట్రేట్కి తెలియనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా హైకోర్టు నిర్దేశించకపోవడం బాధ కలిగించే అంశం. ఇదే కేసులో గౌతమ్ నవలఖాని కూడా పోలీ సులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ ట్రాన్సిట్ రిమాండ్ని రద్దు చేసింది. ప్రజల భాషలో న్యాయపాలన జరగడం అత్యంత అవశ్యం. అయితే పై కోర్టులకి కేసు వెళ్లిన ప్పుడు అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు చేసి నప్పుడు అవసరమైన చర్యలని పోలీసులు, ఇతర అధికారులు తీసుకోవా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భీమా, కోరేగావ్ కేసులో భాషవల్ల ఉత్పన్న మైన సమస్యవల్ల ప్రజల భాషలో పరిపాలన అవసరం లేదు. దేశీ భాష ఇంగ్లిష్లో జరగాలని అనడం సమంజసమా? న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, కార్యకలా పాలు, తీర్పులు ప్రజల భాషలో కాకుండా, వారికి అర్థంకాని భాషలో జరిగినప్పుడు ఆ వ్యవస్థపట్ల వారికి నమ్మకం సడలిపోతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు, అరెస్టులు చేస్తున్న ప్పుడు అక్కడి ప్రజల భాషలో లేదా దేశ భాషలో జరగాలి. అలా జరగనప్పుడు న్యాయవ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థలమీద విశ్వాసం ఉంటే అవకాశం లేదు. భాష మన అస్తిత్వానికి చిహ్నం. భాషవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలని అధిగమించాలి తప్ప, ప్రజల భాషలో న్యాయపాలన జరగకూడదనీ అను కోవడం సమంజసం కాదు. (నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం) వ్యాసకర్త : మంగారి రాజేందర్ (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) మొబైల్ : 94404 83001 -
తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్
-
భానుకిరణ్కు యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్/చంచల్గూడ: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానును న్యాయస్థానం దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భాను ప్రైవేటు గన్మన్ మన్మోహన్సింగ్ బదౌరియాను సైతం దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఐదేళ్ల జైలు విధించింది. వారితోపాటు నిందితులుగా ఉన్న మరో నలుగురిని నిర్ధోషులుగా తేల్చింది. భానుకిరణ్కు ఐపీసీ సెక్షన్ 307 కింద యావజ్జీవ కారాగారంతోపాటు రూ. 20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిషేధిత ఆయుధాలను ఉపయోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. సూరి హత్య విషయం గురిం చి రహస్యంగా ఉంచినందుకు భాను గన్మన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం... అతనికి ఐపీసీ సెక్షన్ 212 కింద ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 201 కింద మరో ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. దోషులు ఏకకాలంలో శిక్షలను అనుభవించాలని ఆమె తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న కాలాన్ని మినహాయించాలన్నారు. నిందితులుగా ఉన్న శూలం సుబ్బయ్య, బోయ వెంకట హరిబాబు, ఆవుల వెంకటరమణ, కటిక వంశీధర్రెడ్డిలను నిర్ధోషులుగా తేల్చిన న్యాయమూర్తి... వారిపై అభియోగాలను సీఐడీ రుజువు చేయలేకపోయింద న్నారు. దోషులు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. గత ఆరున్నరేళ్లుగా భానుకిరణ్ చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉండగా మన్మోహన్ ఎనిమిదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2011లో హత్య.. 2012లో అరెస్ట్... మద్దెలచెర్వు సూరి 2011 జనవరి 3న సాయంత్రం తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్ చేతిలో హత్య కు గురయ్యారు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసఫ్గూడ ప్రాంతానికి రాగా నే తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో సూరిని కాల్చి చంపి పరారయ్యాడు. ఈ హత్యపై తొలుత బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా ఆ తరువాత కేసు సీసీఎస్కు అక్కడి నుంచి సీఐడీకి బదిలీ అయింది. దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. భాను పరారీలో కావటంతో అతన్ని పక్కనపెట్టి మిగిలిన వారిపై చార్జిïషీట్ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు 2012 ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్ను అరెస్టు చేసి మరో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఐడీ 150 మందిని సాకు‡్ష్యలుగా పేర్కొనగా విచారణలో 92 మందినే విచారించారు. 56 మంది సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. సూరి అనుచరుడిగా భా ను అన్ని ఆర్థిక లావాదేవీలను చూసే వాడని, సూరి తో భానుకున్న అంతర్గత శతృత్వం, ఇతర నిందితులతో భానుకున్న సాన్నిహిత్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్ శిక్షల ఖరారు ముందు న్యాయస్థానం భానుకిరణ్, మన్మోహన్లను ఏదైనా ఉంటే చెప్పుకోవాలని సూచించింది. దీనికి భానుకిరణ్ స్పందిస్తూ తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తనకు శిక్ష విధించే ముందు సానుభూతితో తన కేసును పరిశీలించాలని కోరారు. మన్మోహన్సింగ్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే తీర్పు వెలువడేటప్పటికే మన్మోహన్ శిక్షాకాలం పూర్తి కావడంతో రాత్రి 8 గంటలకు అతన్ని చంచల్గూడ జైలు నుంచి విడుదల చేశారు. కోర్టు తీర్పుతో భానుకిరణ్ కలత చెందినట్లు తెలుస్తోంది. దోషులు.. నిందితులు.. అభియోగాలు ఏ1 భానుకిరణ్ : ఐపీసీ సెక్షన్లు 302, 120బి, 302 రెడ్విత్ 34, 304 రెడ్విత్ 109, 212, 201, ఆయుధ చట్టం సెక్షన్ 27(2) ఏ2 మన్మోహన్సింగ్ : ఐపీసీ సెక్షన్లు 120బి, 109 ఏ3 శూలం సుబ్బయ్య : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1బీ) ఏ4 బోయ వెంకట హరిబాబు : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212 ఏ5 ఆవుల వెంకటరమణ : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212, ఏ6 కటిక వంశీధర్రెడ్డి : 120ఎ, 34, 109, 212 -
నేడే మద్దెలచెర్వు సూరి హత్య కేసులో తీర్పు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2011, జనవరి 3న సూరి, అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధు జూబ్లీహిల్స్ నుంచి సనత్నగర్ వెళ్తుండగా నవోదయ కాలనీ సమీపంలో సూరిపై పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపి హతమార్చారు. కేసులో ప్రధాన నిందితుడిగా భానుకిరణ్ అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉం టున్నాడు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఫోరెన్సిక్ ఆ«ధారాలతోపాటు డ్రైవర్ మధు వాంగ్మూలం ఆధారంగా వాదిస్తోంది. భానుకిరణే సూరిని హత్యచేశాడని, పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపిస్తోంది. -
ఆ కారణంతో జాబ్లోంచి తీసేశారు..
పుణె : హెచ్ఐవీ గురించి ఎన్నో కోట్లు పెట్టి ప్రచారాలు, వాణిజ్య ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. హెచ్ఐవీ సోకిందని ఓ వ్యక్తిని దూరంపెట్టకూడదని పదేపదే చూపిస్తున్నారు. కానీ ఇదే కారణాన్ని చూపుతూ ఓ మహిళను ఉద్యోగంలోంచి తీసేసింది ఓ సంస్థ. అయితే ఈ సంఘటన 2015లో జరిగింది. పుణెకు చెందిన మహిళ.. తన అవసరాల కోసం మెడికల్ క్లెయిమ్కు తాను పనిచేస్తున్న కంపెనీకి దరఖాస్తు చేసుకోగా.. అందులో తనకు హెచ్ఐవీ ఉందని తేలింది. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఆమెను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేసింది. అయితే ఈ వ్యాధి తనకు తన భర్త వల్ల వచ్చిందని, తన భర్త కూడా మరణించాడని, ఇంట్లో వారు కూడా దగ్గరకు రానివ్వడంలేదని, తనకు ఉద్యోగం అవసరమని వాపోయింది. అయినా కంపెనీ యజమానులు వినిపించుకోకుండా.. రాజీనామా చేయాల్సిందే అని ఒత్తిడి చేశారు. అయితే దీనిపై కోర్టులో కేసు వేసిన ఆ మహిళకు మూడేళ్ల తరువాత న్యాయం జరిగింది. హెచ్ఐవీ ఉందన్న కారణంతో ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం సరికాదని.. సదరు కంపెనీపై న్యాయస్థానం మండిపడింది. మళ్లీ తనను ఎప్పటిలాగే ఉద్యోగంలో చేర్చుకోవాలని, ఈ మూడేళ్ల జీతభత్యాలు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. -
జంట పేలుళ్ల కేసు.. మరో నిందితుడు దోషే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. చదవండి: ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు -
ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గోకుల్చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది అమాయ కుల మరణాలకు దారితీసిన ఇండియన్ ము జాహిదీన్ ఉగ్ర ఘాతుకంపై ఎట్టకేలకు తీర్పు వెలు వడింది. పోలీసులు అరెస్టు చేసిన ఐదు గురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మ హ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను న్యాయ స్థానం మంగళవారం దోషులుగా నిర్ధారించిం ది. వారిద్దరూ నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, పేలుడు పదారా ్థల నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం తదితర వాటి కింద సయీద్, చౌదరిలను దోషులుగా పేర్కొంది. అయితే మరో ఇద్దరు నిందితులైన సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్లు పేలుళ్లకు పాల్పడినట్లు నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్ధోషులు గా ప్రకటించింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాసరా వు మంగళవారం తీర్పు నిచ్చారు. దోషులకు ఈ నెల 10న శిక్షలు ఖరారు చేస్తామని, నిందితులకు సహకరించిన తారీఖ్ అంజూమ్ ఎహసాస్ విషయంలోనూ ఆ రోజునే నిర్ణయం వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాలరీత్యా నిందితుల ను ఉంచిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేక కోర్టు గదిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా తీర్పును కూడా అక్కడి నుంచే జడ్జి వెలువరిం చారు. మీడియా ప్రతినిధులకు కోర్టులోకి అనుమతి లేకపోవడంతో తీర్పు పూర్తి పాఠం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. కేసు విచారణలో సుమారు 170 మంది సాక్షుల వాంగ్మూలాల ను న్యాయస్థానం నమోదు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన ఇండియ న్ ముజాహిదీన్ వ్యవ స్థాపకుడు రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్లు పేలుడు జరిగినప్పటి నుంచీ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు పాకిస్తాన్లో ఆశ్ర యం పొందుతున్నారు. దోషులకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరాలని ప్రాసి క్యూషన్ నిర్ణయించింది. ఈ కేసులో న్యాయ స్థానం ఇద్దరు నిందితులను నిర్దోషు లుగా ప్రకటించడంపై బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సరికాదని, ట్రయల్ కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో కేసు మూతబడ లేదని, బాధిత కుటుంబాలకూ న్యాయం జరగలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు... జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్ల 11 రోజుల తర్వాత తీర్పు రాజధానిలోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో జంట పేలుళ్లు జరిగి మంగళవారానికి 11 ఏళ్ల 11 రోజులైంది. ఈ కేసులో కోర్టు తీర్పు మంగళవారం వెలువడిన నేపథ్యంలో ఉగ్ర ఘాతుకం చోటుచేసుకున్నప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా... 25-08-07 రాత్రి 7–7.30 గంటల మధ్య గోకుల్చాట్, లుంబినీ పార్కులో పేలిన బాంబులు. దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద పేలని బాంబు స్వాధీనం. ఈ పేలుళ్లపై అదే రోజు సైఫాబాద్, సుల్తాన్ బజార్, మలక్పేట పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు. 27-08-07 ఉగ్రవాద పేలుళ్ల కేసులు కావడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని సిట్కు బదిలీ. నాడు లుంబినీ పార్కులో ఉన్న నాసిక్కు చెందిన అమృతవాహిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రం విడుదల. 15-09-08 2007 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులో నిందితుల షెల్టర్ గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. జామియానగర్లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతి, ముగ్గురు అరెస్ట్. ఈ ఉదంతంతో కదిలిన ఐఎం డొంక. 06-10-08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం. మొత్తం ఐఎం గుట్టు విప్పిన ముంబై క్రైమ్ బ్రాంచ్. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో దాదాపు 20 మంది అరెస్ట్. వారిలోనే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు నిందితులు ఉండటంతో సిట్ పోలీసుల దర్యాప్తు కొలిక్కి. పీటీ వారెంట్పై నిందితుల తరలింపు, విచారణకు సిట్ ప్రయత్నాలు ప్రారంభం. 30-11-08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తర్వాత అధికారిక దర్యాప్తు ప్రారంభం. జంట పేలుళ్ల ఉదంతంతోపాటు పేలని బాంబుపై సిట్లో నమోదైన మూడు కేసులు ఈ విభాగానికి బదిలీ. 01-02-09 జంట పేలుళ్ల కేసులో నిందితులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పీటీ వారెంట్పై ముంబై నుంచి హైదరాబాద్కు... 09-02-09 కేసు దర్యాప్తులో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహణ. లుంబినీ పార్కులో బాంబు పెట్టిన అనీఖ్, హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను గుర్తించిన సాక్షులు. 25-03-09 కేసులోని ఇతర నిందితులైన ఐఎం సహ వ్యవస్థాపకుడు సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్ పీటీ వారంట్పై హైదరాబాద్ తీసుకొచ్చిన ఆక్టోపస్. 15/28-05-09, 20-06-09 కేసులో ఆక్టోపస్ అధికారుల కీలక ఆధారాల సేకరణ. లుంబినీ పార్కులో పేలుడుకు సంబంధించి 2009 మే 15న, పేలని బాంబుపై అదే నెల 28న, గోకుల్చాట్ పేలుడు ఉదంతానికి సంబంధించి అదే ఏడాది జూన్ 20న నాంపల్లి కోర్టులో చార్జిషీట్ల దాఖలు. 03-02-2012 జంట పేలుళ్లకు నిధులు అందించిన తారీఖ్ అంజుమ్ హసన్ను దుబా య్ నుంచి డిపోర్టేషన్పై తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు. పీటీ వారంట్పై సిటీకి తరలించిన సీఐ సెల్ అధికారులు. అనుబంధ చార్జ్షీట్ దాఖలు. 07-08-2018 చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో (నాంపల్లి కోర్టు అనుమతితో) కేసుల విచారణ పూర్తి. 04-09-2018 మూడు కేసుల్లో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో అనీఖ్, అక్బర్లపై నేరం నిరూపణ. సాదిఖ్, ఫారూఖ్లపై వీగిపోయిన అభియోగాలు. నాలుగో చార్జ్షీట్లో నిందితుడైన తారీఖ్ దోషా కాదా అనే విషయంతో పాటు అనీఖ్, అక్బర్లకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు. -
లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. -
ధిక్కరణ’పై నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు తీర్పును అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై హైకోర్టు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి, సంపత్కుమార్ను శాసన సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చారు. తీర్పును అమ లు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ శివశంకరరావు మరోసారి విచారణ జరిపి కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశామని, తీర్పుపై స్టే కోరు తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశా మని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వివరించారు. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఇద్దరు కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారని కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాది తెలిపారు. జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. -
దుర్మార్గానికి సరైన శిక్ష
ఎనిమిదిన్నరేళ్లక్రితం విజయవాడ నగరంలో పదకొండేళ్ల చిన్నారి నాగవైష్ణవిని అపహరించి అత్యంత దుర్మార్గంగా హతమార్చిన మానవ మృగాలకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు గురువారం వెలువరించిన తీర్పు ఆ కుటుంబానికి మాత్రమే కాదు...హృదయమున్న ప్రతి ఒక్కరికీ సాంత్వన కలగజేస్తుంది. ఆ ఉదంతం గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆస్తిపాస్తుల కోసం మనుషులెంతకు తెగించగలరో, ఎలాంటి క్రౌర్యానికి ఒడిగట్టగలరో ఆ ఘటన నిరూపించింది. ఎంతో నాగరికంగా కనబడే ఈ సమాజంలో ఇటువంటివారు కూడా మసులుతుంటారా అని అందరూ విస్మయపడ్డారు. వైష్ణవి తన సోదరుడితో కలిసి కారులో బడికెళ్తుండగా దుండగులు ఆ కారును అడ్డగించి ఆమెను అపహరించారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన గురించి విని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ భయభ్రాంతులకు లోన య్యారు. ఆమెను ఏం చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో అని ప్రతి ఒక్కరూ ఆవేదనపడ్డారు. ఆమె కుటుంబసభ్యులతోపాటు అందరూ తల్లడిల్లారు. నిజానికి వైష్ణవితోపాటు ఆమె సోదరుణ్ణి కూడా అపహరించి హతమార్చాలని దుండగులు పథకం పన్నారు. కానీ అపహరణ యత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన డ్రైవర్తో వారు తలపడుతున్నప్పుడు బాలుడు అక్కడినుంచి తప్పించుకోగలిగాడు. వారు డ్రైవర్ను అక్కడికక్కడే హతమార్చి వైష్ణవిని అపహరించి గుంటూరు జిల్లాకు తీసు కుపోయారు. దారిలోనే ఆమెను హతమార్చి, ఆచూకీ సైతం అందకూడదని భావించి బాయిలర్లో బూడిదగా మార్చారు. ఎముకలు సైతం దొరకని పరిస్థితుల్లో వైష్ణవి చెవి పోగుల్లో ఉన్న వజ్రం కేసులో కీలక సాక్ష్యంగా మారింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా నేరగాళ్లు తప్పించుకోవడానికి వీల్లేకుండా చేశాయి. తన గారాలపట్టీ లేదన్న వార్త విన్న వెంటనే తండ్రి ప్రభాకర్ కన్నుమూశారు. ఇలా ఇద్దరి ప్రాణాలు తీసి, మరొకరి మరణానికి కారకులైన దుండ గులకు ఇన్నాళ్లకు శిక్ష పడింది. నేరాలు జరిగినప్పుడల్లా విస్మయపడటం, దుండగులకు కఠిన శిక్షలు పడాలని కోరడం సర్వసాధారణం. ఆ తర్వాత కొన్నాళ్లకే అది మరుగున పడిపోతుంది. ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. అక్కడే సమస్య మూలాలున్నాయి. సమాజం ఏమరుపాటుతో ఉన్నప్పుడు ఏ వ్యవస్థలూ చురుగ్గా, సక్రమంగా పనిచేయవు. నేరం జరిగినప్పుడు వెనువెంటనే పోలీసు యంత్రాంగం కదలడం, సమర్థవంతమైన దర్యాప్తు చేయడం, పకడ్బందీ సాక్ష్యాధారాలు సేక రించడం ముఖ్యం. వాటిని నివేదించాకే న్యాయస్థానాల్లో విచారణ మొదలవుతుంది. సాక్ష్యా ధారాల్లో లోపాలున్నప్పుడు న్యాయస్థానాలు కూడా నిస్సహాయమవుతాయి. విచారణలు నత్త నడకన సాగుతాయి. ఇప్పుడు వైష్ణవి విషాద ఉదంతంలో కూడా తీర్పు రావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. తన కుమార్తెను హతమార్చడంతోపాటు భర్త మరణానికి కారకులైనవారికి శిక్ష పడాలని ఎదురుచూసిన వైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ కేసు తీరుతెన్నులను చూస్తూ వచ్చిన ప్రభాకర్ సోదరుడు కూడా చనిపోయారు. వైష్ణవి విషాద ఉదంతంలో ఆమె తండ్రి తప్పిదం కూడా ఉంది. తన మొదటి భార్య సోదరుడు, వైష్ణవికి వరసకు మేనమామ అయిన వెంకటరావు తన ఆస్తిపై కన్నేసి రెండో భార్యపై కుట్రలు పన్నుతున్నాడని తెలిసినా ఆ సమస్యను కుటుంబ పరిధిలోనే సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘోర ఉదంతానికి ఆరేళ్ల ముందు ఇదే వెంకటరావు వైష్ణవిని అపహరించినప్పుడు ఆ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పరిష్కరించుకున్నాడు. రెండోసారి కూడా అలాగే చేయొచ్చునన్న భావనతో చివరి వరకూ అనుమానితులెవరో చెప్పలేదు. ఘటన జరిగిన మరుక్షణం ఆయన దుండగుల ఆనుపానులిచ్చి ఉంటే వైష్ణవిని పోలీసులు రక్షించగలిగేవారేమో. నేరాలకు గల మూలకారణాలను దుంపనాశనం చేయడం మనలాంటి సమాజంలో అసాధ్యం. ఎంత పకడ్బందీ నిఘా ఉన్నచోటైనా అవి తప్పవు. కానీ నేరం జరిగిన వెంటనే కదిలే యంత్రాంగం ఉన్నప్పుడు, సత్వరం శిక్షలు పడేలా చూసే సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్నప్పుడు వాటిని కనిష్ట స్థాయికి పరిమితం చేయడానికి వీలుంటుంది. డబ్బు, హోదా, పలుకుబడి వంటివి దర్యాప్తును ప్రభావితం చేసే దుస్థితి లేకుండా చూడాలి. నేర పరిశోధన చేసే యంత్రాంగానికి మందీమార్బలం తగినంతగా ఉండాలి. వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచాలి. దర్యాప్తులపై పటిష్టమైన పర్యవేక్షణ కూడా ముఖ్యం. ఇవన్నీ కొరవడినప్పుడు నేరాలు విజృంభిస్తాయి. నేరగాళ్లు రెచ్చిపోతారు. తమ కేమీ కాదన్న ధీమాతో ఉంటారు. అలాంటి ధీమా ఎవరిలోనూ ఏర్పడకుండా చూడటమే ప్రభు త్వాల కర్తవ్యం కావాలి. వెంటవెంటనే శిక్షలు పడుతుంటే నేరగాళ్ల వెన్నులో చలిపుడుతుంది. ఒక కేసులో పడే శిక్ష ఎందరినో అటువైపు మళ్లకుండా చేస్తుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో అది కరువవుతున్నది. దేశంలో పిల్లల అపహరణ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మొన్న మార్చిలో విడుదల చేసిన 2016నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. మొత్తంగా పిల్లల అపహరణ, వారిపై అత్యాచారాలు 2006–16 మధ్య 500 శాతం పెరిగాయని ఆ నివేదిక వివ రించింది. రికార్డులకెక్కని వాటిని కూడా కలుపుకుంటే ఈ నేరాల శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం నేరాల్లో పిల్లల పట్ల సాగే నేరాల సంఖ్యే అధికమని ఎన్సీఆర్బీ నివేదిక అంటున్నది. మహిళల పట్ల నేరాలు ఆ తర్వాతి స్థానంలో ఉంటున్నాయి. ప్రపంచంలో జరిగే అప హరణల్లో 10 శాతం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. వైష్ణవి కేసులో ఇప్పుడు వెలు వడింది కింది కోర్టు తీర్పే. శిక్షపడినవారు ఎటూ అప్పీల్కెళ్తారు. ఉన్నత న్యాయస్థానాల్లోనైనా సత్వరం విచారణలు పూర్తయి ఈ శిక్షలు ఖరారు కావాలని ఆశించాలి. -
కోర్టుతీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ఈతీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అమాయకులని ఇరికించిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కర్ణాటకలో బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల జిమ్మిక్కులు అక్కడి ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానంలో బెంగాల్, బెంగళూరుకు వెళ్లే సమయం ఉన్న కేసీఆర్కు అంబేద్కర్కు నివాళులు అర్పించే సమయం లేదా అని నిలదీశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కోర్టు తీర్పు; నిప్పులు చెరిగిన అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నూటికి నూరుపాళ్లూ అన్యాయమైనదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. సోమవారం తీర్పు వెలువడిన తర్వాత వరుస ట్వీట్లు చేసిన ఆయన.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), మోదీ సర్కారులపై నిప్పులుచెరిగారు. ‘‘మక్కా మసీదు పేలుళ్లలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏలు వ్యవహరించాయి. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినా, ఎన్ఐఏ సవాలు చేయలేదు. కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అది రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉంది’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు. (చదవండి: మక్కా మసీదు పేలుడు కేసు కొట్టివేత) -
అది చట్ట విరుద్దమని కోర్టు ఇదివరకే తీర్పిచ్చింది: దత్తాత్రేయ
హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని సుప్రీం కోర్ట్ ఇది వరకే తీర్పు ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ఖురాన్లో మహిళలు, పురుషులు సమానం అని ఉందని అన్నారు. ట్రిపుల్ తలాక్ 14 వందల సంవత్సరాల నుంచి సంప్రదాయంగా సాగుతోందని, ఆ విషయం మీద ముస్లిం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పేరు మీద ఎవరినీ జైలు పంపించే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సామాజిక న్యాయం మహిళలకు కావాలని అన్నారు. కాంగ్రెస్ ముస్లింల అభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని, కేవలం వారిని ఓటు బ్యాంక్గానే చూశాయని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన రోజు చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. అసద్ రాజకీయ ఉద్దేశం బీజేపీకి అంటగట్టడం సరైంది కాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో పాస్ అయినందుకు ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి నసీమా బీజేపీలో చేరారని చెప్పారు. 2018 సంవత్సరం బీజేపీకి ఉద్యమాల సంవత్సరం అన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు పోతుందని విమర్శించారు. -
కోర్టు తీర్పు కోసం వెయిటింగ్: త్రిష
ఇటీవల సినిమావాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అలాంటి పరిస్థితి నటి త్రిషకు తప్పలేదు. ఆదాయం తప్పుడు లెక్కల వ్యవహారంలో నటి త్రిష మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకెళితే నటి త్రిష 2010–11 సంవత్సరానికి గానూ తన ఆదాయం రూ.89 లక్షలుగా అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పారు. ఇది నమ్మశక్యంగా లేకపోవడంతో ఆదాయ శాఖ అధికారులు త్రిష ఆదాయం లెక్కలను నిగ్గదీశారు. త్రిష తదుపరి ఏడాదిలో నటించనున్న చిత్రాలకు అందుకున్న అడ్వాన్స్లను లెక్కల్లో చూపకపోవడాన్ని కనుగొన్న అధికారులు ఆమె ఆదాయం రూ.3.5కోట్లుగా తేల్చి అందుకు పన్ను వసూలు చేశారు. అంతటితో వదలకుండా త్రిష తప్పుడు లెక్కలు చూపినందుకుగానూ ఆమెపై రూ.1.15 కోట్ల జరిమానా చెల్లించాలంటూ కేసు నమోదు చేశారు. దీంతో త్రిష తనపై జరిమానా కేసు కొట్టివేయాల్సిదిగా ఆదాయపు శాఖ ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేశారు. దీ పరిశీలించిన ట్రిబ్యునల్ త్రిష మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించారు కాబట్టి ఆమెపై కేసును కొట్టేసింది. దీంతో ఆదాయ శాఖ అధికారులు త్రిషపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు ఇందిరాబెనర్జీ, సుందర్లు త్రిష కేసును విచారణకు స్వీకరించారు. అయితే ఈ కేసు వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. దీంతో హైకోర్టు తీర్పు కోసం త్రిష వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. -
గుజరాత్ అల్లర్ల కేసులో కీలక తీర్పు
గుజరాత్లో సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 24 మందిని అహ్మదాబాద్ కోర్టు దోషులుగా తేల్చింది. మరో 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. నాలుగుసార్లు బీజేపీ కార్పొరేటర్గా ఎన్నికైన కీలక నిందితుడు బిపిన్ పటేల్ను కూడా ఈ కేసులో నిర్దోషిగా విడిచిపెట్టారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజున గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో ఒక వర్గం లక్ష్యంగా దాడులు జరిగాయి సుమారు 20 వేల మంది ఆ ప్రాంతంపై దాడి చేశారు. దాంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. అప్పట్లో జరిగిన అల్లర్లలో దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టారు. ఎహసాన్ జాఫ్రీ లాంటివాళ్లను ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి మరీ నరికేసి, తగలబెట్టారు. పోలీసులకు, సీనియర్ నాయకులకు సాయం కోసం ఫోన్లు చేసినా ఎవరూ అప్పట్లో ఆ ఫోన్లు ఆన్సర్ చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశారు. వారిలో బీజేపీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు. ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ (77) ఈ కేసులో న్యాయం చేయాలంటూ ఇన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ, ఇతర మంత్రుల పాత్ర కూడా ఈ అల్లర్లలో ఉందని ఆమె ఆరోపించారు. దిగువకోర్టు వారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్లగా, సిట్ ఆధ్వర్యంలోనే కేసు దర్యాప్తు జరగాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. బాధితులను సజీవ దహనం చేశారనడానికి అక్కడ లభించిన 39 మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని సిట్ కోర్టులో తెలిపింది. పెట్రోలు క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా సంఘటన స్థలంలో ఉన్నాయని, దాన్నిబట్టి అక్కడ భారీస్థాయిలో మారణహోమం జరిగిందని చెప్పింది. చివరకు ఈ ఘటన జరిగిన సుమారు 15 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈ ఘటనపై తీర్పు వెల్లడించింది. -
47 మంది పోలీసులకు జీవితఖైదు
ఫిలిబిత్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. జూలై 12, 1991న సిక్కు యాత్రికుల బస్సును అడ్డుకున్న పోలీసులు వారిలో 10 మందిని నకిలీ ఎన్కౌంటర్ చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపామంటూ తర్వాతి రోజు పోలీసులు ప్రకటించారు. బస్సులోని కొందరిపై నేరచరిత్ర ఉందని, వాళ్ల చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయన్నారు. ఎన్కౌంటర్పై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. టైస్టుల్ని చంపితే వచ్చే అవార్డులు, గుర్తింపు కోసమే హత్యాకాండకు పోలీసులు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. సీబీఐ కథనం ప్రకారం, సిక్కు యాత్రికుల బస్సును కచ్లాపుల్ ఘాట్ వద్ద ఆపిన పోలీసులు 10 మంది పురుషులను బయటకు లాక్కొచ్చి వేరే వాహనంలోకి ఎక్కించారు. రాత్రి దాటాక అదనపు బలగాలు వచ్చిచేరాయి. 10 మందిని మూడు గ్రూపులుగా విభజించి అర్థరాత్రి సమయంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో వారిని కాల్చి చంపారు. పది మృతదేహాలకు అదే రోజు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అంత్యక్రియలు చేశారని సీబీఐ తన రిపోర్టులో తెలిపింది. మొత్తం 57మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 10 మంది విచారణ మధ్యలోనే మరణించారు. 47 మందిపై విచారణ జరిపి తీర్పు వెలువరించారు. -
మరి మా నాన్నను చంపిందెవరు?
ముంబై: 13 ఏళ్ల పాటు తన మదిలో మెదిలిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయంటూ 2002 హిట్ అండ్ రన్ కేసు బాధితుడు బాంబే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాను నిర్దోషిగా ప్రకటించడంపై ఆవేదన వెలిబుచ్చాడు. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నూరుల్లా ఖాన్ కుమారుడు ఫిరోజ్ షేక్(25) తన తండ్రిని ఎవరు చంపారన్న ప్రశ్నకు ఇప్పటికీ తనకు సమాధానం దొరకలేదని వాపోయాడు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రికి ఆత్మకు శాంతి కలగలేదంటూ షైక్ కన్నీరు పెట్టాడు. ఆయన (సల్మాన్) అమాయకుడైతే మరి తన తండ్రిని చంపింది ఎవరని ఫిరోజ్ ప్రశ్నిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాలంటే పడి చచ్చిపోయే తనకు, సల్మాన్ విడదల కావడంపై బాధ లేదన్నాడు. కానీ, తన తండ్రిని పొట్టన పెట్టుకుంది ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన సల్మాన్ ను క్షమిస్తాను.. కానీ నిజమేంటో సమాజానికి తెలియాలని కోరుతున్నాడు. కాగా 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఆనాటి ప్రమాదంలో తండ్రి నూరుల్లా ఖాన్ చనిపోవడతో ఫిరోజ్ షేక్ చదువు మానేసి కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. -
నాగాయలంకలో భారీ పోలీసు బందోబస్తు
కృష్ణా జిల్లా నాగాయలంక, ఎదురుమొండి పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మండలంలోని ఎదురుమొండిలో 2007లో అప్పటి ఎంపీపీ కన్నా జనార్దనరావు హత్యకు గురయ్యారు. ఆకేసు విచారణ పూర్తయిన తర్వాత నేటి సాయంత్రం దీనిపై బందరులోని జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా జనార్దన్ స్వగ్రామం ఎదురుమొండి, మండల కేంద్రం నాగాయలంకలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరగొచ్చనే అనుమానంతోనే ముందు జాగ్రత్తగాఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సీపీఐ రామకృష్ణకు వరంగల్ కోర్టు జైలు శిక్ష
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఆరుగురికి వరంగల్ కోర్టు జైలు శిక్ష విధించింది. 2012లో రైతు గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనతో ఆస్తినష్టం వాటిల్లిందని కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీజీపీ కేసులో సాయంత్రం 5 గంటలకు తీర్పు
క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీజీపీ దినేష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. తీర్పును సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. తన పదవీ కాలన్నీ ఏడాది పాటు పొడగించాలని కోరుతూ ఆయన హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. కాగా తనను మరో ఏడాది డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు.