Dinesh chandimal
-
SL vs Aus: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.తొలిరోజే తొమ్మిది వికెట్లుఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్రఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
శ్రీలంకతో రెండో టెస్ట్.. ఆసీస్ బౌలర్ల విజృంభణ.. హెడ్ వెరైటీ సెలబ్రేషన్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్కు జతగా లహీరు కుమార (0) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్ అయ్యారు.pic.twitter.com/IRsGEkTBll— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025హెడ్ వినూత్న సంబురాలుఈ మ్యాచ్లో కమిందు మెండిస్ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.కాగా, రెండు టెస్ట్లు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
SL vs NZ: సెంచరీలతో కదం తొక్కిన శ్రీలంక బ్యాటర్లు
Sri Lanka vs New Zealand, 2nd Test Day 2 Score Final Update: న్యూజిలాండ్తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలిరోజు దినేశ్ చండీమల్ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో కమిందు మెండిస్ (250 బంతుల్లో 182 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్లు), కుశాల్ మెండిస్ (149 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ను 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్నైట్ స్కోరు 306/3తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన లంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్ (185 బంతుల్లో 88; 7 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి నిష్క్రమించాడు. దీంతో తొలి సెషన్ ఆరంభంలోనే 328 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలింది. ఈ దశలో మరో ఓవర్నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ కు జతయిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (80 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో పర్యాటక బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జట్టు స్కోరు 400 మైలురాయి దాటాక ఎట్టకేలకు తొలిసెషన్ ముగిసే దశలో ధనంజయను ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు. అరుదైన రికార్డుఅతను అవుటైన 402 స్కోరువద్దే లంచ్ బ్రేక్కు వెళ్లారు. కుశాల్ మెండిస్ క్రీజులోకి రాగా... రెండో సెషన్ మొదలైన కాసేపటికే కమిందు మిండిస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.అరంగేట్రం చేసిన టెస్టు నుంచి ఇప్పటివరకు (తాజా 8వ టెస్టు) ప్రతి మ్యాచ్లో సెంచరీ, లేదంటే అర్ధసెంచరీ చేసిన బ్యాటర్గా ఘనతకెక్కాడు. మరోవైపు అతనికి జతయిన కుశాల్ కూడా కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో రెండో సెషన్ అసాంతం కష్టపడినా వికెట్ తీయలేకపోయింది. 519/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. 602/5 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ఆ తర్వాత మొదలైన మూడో సెషన్లోనూ ఈ జోడీ క్రీజు వదలకపోవడంతో పాటు పరుగుల్ని అవలీలగా సాధించింది. కమిందు 150 పరుగులు పూర్తి చేసుకోగా... కుశాల్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 602/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. కుశాల్, కమిందు ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్కు సరిగ్గా 200 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 580 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం మూడో రోజు మొదలైంది. కాగా తొలి టెస్టులోశ్రీలంక కివీస్ను 63 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్లకు నో ప్లేస్..! -
న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్
శ్రీలంక వెటరన్ బ్యాటర్ దినేశ్ చండీమల్ టెస్ట్ క్రికెట్లో రెండేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో చండీమల్ ఎట్టకేలకు సెంచరీ మార్కు తాకాడు. చండీమల్ 2022, మేలో చివరిసారిగా (బంగ్లాదేశ్పై) టెస్ట్ల్లో మూడంకెల స్కోర్ చేశాడు. చండీమల్కు ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. చండీమల్ సెంచరీ చేసిన తొమ్మిదో దేశం న్యూజిలాండ్. చండీమల్ తన కెరీర్లో ఇప్పటివరకు తొమ్మిది వేర్వేరు దేశాలపై (బంగ్లాదేశ్పై 5, భారత్పై 2, ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్పై 2, ఇంగ్లండ్పై 1, ఆఫ్ఘనిస్తాన్పై 1, ఐర్లాండ్పై 1, పాకిస్తాన్పై 1, న్యూజిలాండ్పై 1) 16 సెంచరీలు చేశాడు. కాగా, న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే (46) ఔట్ కాగా.. చండీమల్ (106), ఏంజెలో మాథ్యూస్ (35) క్రీజ్లో ఉన్నారు. నిస్సంక వికెట్ సౌథీకి దక్కగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్మైర్ -
న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. రాణించిన కరుణరత్నే, చండీమల్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రాణించిన కరుణరత్నే, చండీమల్కరుణరత్నే (83), చండీమల్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్కు గట్టి పునాది పడింది. పథుమ్ నిస్సంక (2) ఆదిలోనే ఔటైనా వీరిద్దరు రెండో వికెట్కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్ (34), ధనంజయ డిసిల్వ (34) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్ తక్కువ స్కోర్కే (13) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టిన విలియమ్ ఓరూర్కీ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అజాజ్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.లీడ్ సాధించిన న్యూజిలాండ్అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 340 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీ.. ఐదేసిన రూర్కీకమిందు మెండిస్ సెంచరీతో (114) కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేయగలిగింది. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. నిస్సంక (27), చండీమల్ (30), మాథ్యూస్లకు (36) మంచి స్టార్ట్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. కెరీర్లో రెండో టెస్ట్ ఆడుతున్న రూర్కీ ఐదు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా -
చెలరేగిన చండీమాల్.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో ఇవాళ (జులై 9) రసవత్తర సమరం జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో జాఫ్నా కింగ్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని క్యాండీ ఫాల్కన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. పథుమ్ నిస్సంక శతక్కొట్టండతో (59 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.జాఫ్నా ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం 225 పరుగుల భారీ లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. దినేశ్ చండీమాల్ (37 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కమిందు మెండిస్ (36 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) బ్యాట్ను పని చెప్పారు. ఫలితంగా క్యాండీ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది. -
52 బంతుల్లో శతక్కొట్టిన లంక ఓపెనర్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో మూడో సెంచరీ (టిమ్ సీఫర్ట్, కుశాల్ పెరీరా) నమోదైంది. క్యాండీ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ పథుమ్ నిస్సంక సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక మెరుపు శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది.52 బంతుల్లోనే శతక్కొట్టిన నిస్సంకనిస్సంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్గా 59 బంతులు ఎదుర్కొన్న నిస్సంక 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో జాఫ్నా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జాఫ్నా ఇన్నింగ్స్లో నిస్సంక, రొస్సో మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. కుశాల్ మెండిస్ 26, అవిష్క ఫెర్నాండో 16, కెప్టెన్ చరిత్ అసలంక 2, అజ్మతుల్లా 1, వనుజ సహన్ 0 పరుగులకే ఔటయ్యారు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో క్యాండీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఆండ్రీ ఫ్లెచర్ (13), మొహమ్మద్ హరీస్ (25) ఔట్ కాగా.. చండీమాల్తో (32 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) పాటు కమిందు మెండిస్ (16) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో క్యాండీ గెలవాలంటే 48 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది. -
5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వచ్చీ రావడంతోనే సెంచరీ, మొత్తం నలుగురు..!
2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 386/4 ఓవర్నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించి, 591/6 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలు బాదగా.. రెండో రోజు దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) శతక్కొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించగా.. టెస్ట్ల్లో శ్రీలంక ఈ ఫీట్ను సాధించడం ఇది నాలుగోసారి. కాగా, ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన సదీరా సమరవిక్రమ ఓ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత లంక టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సమరవిక్రమ.. వచ్చీరాగానే శతకం బాదాడు. ఈ మ్యాచ్కు ముందు 4 టెస్ట్లు ఆడి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో జట్టులో చోటు కోల్పోయిన సమర.. ఐర్లాండ్తో తొలి టెస్ట్లో 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తొలి సెంచరీ నమోదు చేశాడు. సనత్ జయసూర్య, ఏంజెలో మాథ్యూస్ సరసన చండీమాల్.. రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన దినేశ్ చండీమాల్, కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేసి లంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సరసన చేరాడు. టెస్ట్ల్లో లంక తరఫున జయసూర్యతో పాటు ఏంజెలో మాథ్యూస్ కూడా 14 సెంచరీలు బాదారు. తొలి రోజే కెప్టెన్ దిముత్ కరుణరత్నే కెరీర్లో 15వ సెంచరీ నమోదు చేసి, జయసూర్య, మాథ్యూస్ల రికార్డును అధిగమించాడు. శ్రీలంక తరఫున టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16), కరుణరత్నే (15) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత జయసూర్య, మాథ్యూస్లతో కలిసి చండీమాల్ ఏడో ప్లేస్లో ఉన్నాడు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. రెండో రోజు లంచ్ తర్వాత లంక ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్నోయింది. అనంతరం అదే ఓవర్లో రెండో వికెట్ కూడా కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ ముర్రే కొమిన్స్ (0), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (4) ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 35/2గా ఉంది. -
తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో టెస్ట్పై పట్టుబిగిస్తున్న లంకేయులు
తొలి టెస్ట్లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్లో అజేయ శతకంతో పాక్ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: సూపర్ ఫామ్ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి -
సూపర్ ఫామ్ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి
గాలే వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (జులై 24) ప్రారంభమైన రెండో టెస్ట్లో లంక బ్యాటర్లు సత్తా చాటారు. కుశాల్ మెండిస్ (3) మినహా టాపార్డర్ మొత్తం రాణించడంతో తొలి రోజు శీలంకదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ప్రభావం నామమాత్రంగా ఉండటంతో లంక బ్యాటర్లు సత్తా చాటారు. Dinesh Chandimal scores his 4th consecutive fifty in Tests. What a purple patch he's having, just been too good. pic.twitter.com/b1mDrKM6ev — Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2022 ఓపెనర్లు ఒషాడో ఫెర్నాండో (50), దిముత్ కరుణరత్నే (40) తొలి వికెట్కు 92 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన శతక టెస్ట్ల వీరుడు ఏంజెలో మాథ్యూస్ (42), ధనంజయ డిసిల్వా (33) ఓ మోస్తరుగా రాణించారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్లో ఉన్న దినేశ్ చండీమల్ (80) వరుసగా నాలుగో ఇన్నింగ్స్లోనూ (206*, 76, 94*, 80) హాఫ్ సెంచరీ బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట చివరి సెషన్లో వికెట్కీపర్ నిరోషన్ డిక్వెల్లా (42 నాటౌట్) మెరుపు వేగంతో పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డిక్వెల్లాకు జతగా దునిత్ వెల్లాలగే (6) క్రీజ్లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, నౌమాన్ అలీ, యాసిర్ షా తలో వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్ను అఘా సల్మాన్ రనౌట్ చేశాడు. చదవండి: టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్రౌండర్ -
షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం
శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో పర్యాటక పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) అజేయమైన శతకంతో పాక్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోని వెళ్లింది. లంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 222/3 స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. అబ్దుల్లా షఫిక్ (406 బంతుల్లో 160; 7 ఫోర్లు, సిక్సర్).. మహ్మద్ నవాజ్ (34 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్) సహకారంతో పాక్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో చండీమాల్ (76) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు, నసీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీ (119) సహకారంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులు చేసి ఆలౌటైంది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్కు దారుణంగా దెబ్బకొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని లంక మొత్తంగా 342 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్ మొదట్లో తడబడినప్పటికీ షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) ఆదుకున్నారు. వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ (40) కూడా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఔటైనా షఫీక్ టెయింలెండర్ల సహకారంతో పాక్ను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/135) రాణించాడు. చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
రాణించిన మెండీస్,చండిమాల్.. శ్రీలంక స్కోర్: 329/9
గాలె: పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవర్నైట్ స్కోరు 36/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. దాంతో లంక ఓవరాల్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది. ఇక చండీమాల్(86 బ్యాటింగ్),జయసూర్య(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా అంతకుమందు లంక బ్యాటర్లు కుశాల్ మెండీస్(76),ఫెర్నాండో(64), పరుగులతో రాణించారు. ఇక పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 5 వికెట్లు పడగొట్టగా..యాసిర్ షా మూడు, హాసన్ అలీ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: Ben Stokes: ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం! -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక
శ్రీలంక, పాకిస్తాన్ మధ్య గాలేలో శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 66.1 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ చండిమాల్ (115 బంతుల్లో 76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మహీశ్ తీక్షణ (38), ఒషాదా ఫెర్నాండో (35) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు తీశారు. అయితే వెంటనే కోలుకున్న లంక ప్రత్యర్థిని దెబ్బ తీసింది. ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. షఫీఖ్ (13), ఇమామ్ (2) వెనుదిరగ్గా... ప్రస్తుతం అజహర్ అలీ (3), బాబర్ ఆజమ్ (1) క్రీజ్లో ఉన్నారు. చదవండి: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్ చండీమాల్ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్ మెండిస్ (2/47), మహీశ్ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 10 wicket haul on a debut ✔️Best figures by a Sri Lankan on a debut ✔️Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 For his brilliant performance, Dinesh Chandimal has been named the Player of the Series 👏#SLvAUS pic.twitter.com/VZIIFDSNF1— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 జయసూర్య స్పిన్ మాయాజాలం ధాటికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. 431/6 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! -
SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా ద్విశతకం నమోదు చేశాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో భాగంగా చండిమాల్ 206 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 326 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో చండిమాల్కు ఇది మొదటి ద్విశతకం. సిక్సర్తో ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇక చండిమాల్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక 554 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఈ నేపథ్యంలో చండిమాల్పై సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి సూర్యకుమార్ యాదవ్.. ఈరోజు చండిమాల్.. వేర్వేరు ఫార్మాట్లు.. వేర్వేరు శైలి.. కానీ ఎంతో ఆసక్తిగా మ్యాచ్ను తిలకించేలా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు’’ అంటూ ఇండియా- ఇంగ్లండ్ మూడో టీ20, ఆసీస్-లంక టెస్టు మ్యాచ్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇతర ఆటగాళ్లు, నెటిజన్లు సైతం చండిమాల్ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ పర్యాటక ఆసీస్ సొంతం కాగా.. వన్డే సిరీస్ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్లో లంక గట్టిపోటీనిస్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో భాగంగా నాలుగో రోజు ఆటలో లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్: ఆస్ట్రేలియా- బ్యాటింగ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 364-10 (110 ఓవర్లు) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 554-10 (181 ఓవర్లు) ఆసీస్ రెండో ఇన్నింగ్స్: ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 151-10 (41 ఓవర్లు) చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... Dinesh Chandimal has torn strips off the Aussie attack, scoring an unbeaten 206* - bringing up his double century with two huge sixes, one of which ended up on the streets of Galle 🇱🇰🏏 LATEST 👉 https://t.co/pOShHsRakQ pic.twitter.com/AuBg6KpuIR — Telegraph Sport (@telegraph_sport) July 11, 2022 Dinesh Chandimal Completed his 200 with a Sixxxx #SLvAUS 🇱🇰#Dineshchandimal #lka #SLC #LKA pic.twitter.com/QXZHncw1fX — Talk True With ME (@TalkTrueWithME) July 11, 2022 -
చండీ'క'మాల్ శతకం.. ఆసీస్పై లంక పైచేయి
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక పైచేయి సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ అజేయ శతకంతో (118) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 67 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. చండీమాల్తో పాటు రమేశ్ మెండిస్ (7) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో చండీమాల్ కాకుండా మరో నలుగురు హాఫ్సెంచరీలు సాధించారు. 💯Dinesh Chandimal brings up his 13th Test hundred, reaching the mark in 195 balls 🙌#SLvAUS pic.twitter.com/zLiBKUylBI— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 10, 2022 కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు శ్రీలంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, మిచెల్ స్వెప్సన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్ను తిప్పేశాడు. చదవండి: టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..! -
ఏ ముహుర్తానా సిరీస్ ప్రారంభమయిందో.. ఇషాన్ కిషన్ తలకు గాయం
ఏ ముహుర్తానా టీమిండియా, శ్రీలంక సిరీస్ ప్రారంభమైందో తెలియదు కానీ ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్లు దూరమయ్యారు. తొలి టి20 తర్వాత రుతురాజ్ కూడా గాయంతో వైదొలిగాడు. తాజాగా టీమిండియా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ రెండో టి20 మ్యాచ్లో గాయపడ్డాడు. టీమిండియా బ్యాటింగ్ సమయంలోనే ఇషాన్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో లాహిరు కుమారా 147. 6 కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్కు బలంగా తగిలింది. క్రీజు నుంచి పక్కకు వెళ్లిన ఇషాన్ హెల్మెల్ తీసిన తలను చూసుకున్నాడు. ఇంతలో ఫిజియో వచ్చి ఇషాన్ను పరిశీలించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో మ్యాచ్లో కంటిన్యూ అయ్యాడు. ఇక ఈ యువ ఓపెనర్ 16 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్లో ఔటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఇషాన్ కిషన్ను హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగిలిందా లేక సాధారణమేనా అన్న కోణంలో సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితం ఆదివారం రానుంది. ఇప్పటికైతే ఇషాన్ బాగానే ఉన్నాడని.. అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ శుభమ్ తెలిపారు. చదవండి: Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ మూడో టి20 ఆడేది అనుమానంగా మారింది. అతను ఆడకపోతే రోహిత్తో కలిసి మయాంక్ అగర్వాల్ మూడో టి20లో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమల్ గాయం బారిన పడ్డాడు. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ సందర్భంగా చండిమల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో చండిమల్ కూడా కంగ్రా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వేలికి స్కానింగ్ నిర్వహించామని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మెరుపులతో 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా క్లీన్స్వీప్పై కన్నేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్గా రోహిత్ శర్మ కొత్త రికార్డు Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్లకు సాధ్యం కాలేదు pic.twitter.com/QhV1bsmuLC — Sports Hustle (@SportsHustle3) February 26, 2022 -
రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు
1st T20 IND Vs SL: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో టి20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్లో పెద్దగా అవకాశం రానప్పటికి.. బౌలింగ్లో జడ్డూ తన మార్క్ను చూపించాడు. 4 ఓవర్లు వేసిన జడేజా 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 10 పరుగులు చేసిన వికెట్ కీపర్ చండిమల్ను ఔట్ చేసిన జడేజా 'అల్లుఅర్జున్ 'పుష్ప''ను అనుకరించాడు. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. జడేజా తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే(మై జూకేకా నహీ) అనడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుష్ప సినిమా వచ్చి మూడు నెలల కావొస్తున్నా.. దాని ఇంపాక్ట్ మాత్రం ఇప్పటికి పోవడం లేదు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. చదవండి: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే' Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్లకు సాధ్యం కాలేదు Ravindra Jadeja be like:- Jhukega nahi saala #IndianCricketTeam #IndvsSL #CricketLive #GAMEDAY pic.twitter.com/Sbl7H2Pdbn — Rutuja Umale (@rutuja_umale) February 24, 2022 -
ఓపెనర్గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు
కొలంబొ: శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టీ20లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మక్రమ్ 48 పరుగులతో ఆకట్టుకోవడం.. ఓపెనర్లు డికాక్ 36 పరుగులు, హెండ్రిక్స్ 38 పరుగులుతో రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా.. చమీరా, తీక్షణ, దాసున్ షనక తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Pak Vs NZ: ఆ సిరీస్లో నో డీఆర్ఎస్.. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దినేష్ చండిమల్ (66 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్లు తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక పరుగులు చేయలేకపోయింది. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు జరిగిన వన్డే సిరీస్ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: India Tour Of South Africa: ఈసారైనా నెగ్గుకొచ్చేనా..? -
బెయిర్ స్టో ప్రతీకారం.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: క్రికెట్ను జెంటిల్మెన్ గేమ్గా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆటలో వివాదాలు.. స్లెడ్జింగ్లు సాధారణంగా మారిపోయాయి. ఆటలో సందర్భంగా ఒక్కోసారి జరిగే సంఘటనలు ఫన్నీగా ఉంటూనే సిరీయస్గా కనిపిస్తాయి. తాజాగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మ్యాచ్లో తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. తాను అవుటవ్వడానికి కారణమైన ఆటగాడిని వదిలేసి మరొక ఆటగాడిపై స్లెడ్జింగ్కు దిగి అతని ఔట్కు కారణమయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో జానీ బెయిర్ స్టోపై లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా స్లెడ్జింగ్కు దిగాడు. 'ఇండియా టూర్కు ఎంపిక కాలేకపోయావు.. కానీ ఐపీఎల్ ఆడేందుకు మాత్రం వెళ్తావు.. కేవలం డబ్బుల కోసమే ఆడతావా అంటూ' ట్రోల్ చేశాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్ స్టో 28 పరుగుల వద్ద క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. స్లెడ్జింగ్కు దిగి తనను అవుట్ చేశారన్న కోపంతో ఉన్న బెయిర్ స్టో అనువైన సమయం కోసం వేచి చూశాడు. చదవండి: 'గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది' Bairstow: Come on Chandi, throw your wicket away! Chandimal: Say less ❤️#SLvENG pic.twitter.com/znPUZrkWBA — sonali (@samtanisonali1) January 25, 2021 ఈ దశలో లంక రెండో ఇన్నింగ్స్లో భాగంగా 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ దినేష్ చండిమల్ను టార్గెట్ చేస్తూ బెయిర్ స్టో స్లెడ్జింగ్కు దిగాడు. 'కమాన్ చండీ.. నీ వికెట్ను త్వరగా పోగొట్టుకొని పెవిలియన్కు వెళ్లిపో అంటూ' పేర్కొన్నాడు. అండర్సన్ వేసిన బంతిని చండిమల్ గాల్లోకి లేపగా.. లాంగాఫ్లో ఉన్న జాక్ లీచ్ వెనుకకు పరిగెడుతూ అద్భుతక్యాచ్ అందుకున్నాడు. దీంతో చండిమల్ నిరాశగా క్రీజను వదిలిపెట్టి పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయగా.. వైరల్గా మారాయి. చదవండి: మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే 'బెయిర్ స్టో ప్రతీకారం బాగానే ఉంది.. కానీ వేరొక క్రికెటర్ బలి కావడం బాధగా అనిపించిందని కొందరు పేర్కొంటే.. దెబ్బకు దెబ్బ తీయడం అంటే ఇదే అంటూ' మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో వైట్వాష్ చేసింది. Dickwella’s sledge work against bairstow 😂😂 “ Dropped from the India tour, but going to play the ipl, playing for cash only “ 😂😂 pic.twitter.com/d5zw36ij3h — rizwan (@rizwan68301915) January 24, 2021 -
చండిమాల్పై వేటు
కొలంబో: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ వరకు శ్రీలంక కెప్టెన్గా వ్యవహరించిన దినేశ్ చండిమాల్కు తర్వాతి సిరీస్కు జట్టులోనే చోటు లభించలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్లో పాల్గొనే లంక జట్టులో చండిమాల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ సిరీస్కు దిముత్ కరుణరత్నే కెప్టెన్గా వ్యవహరిస్తాడు. 0–2తో లంక ఓడిన సిరీస్లో చండిమాల్ వరుసగా 5, 0, 15, 4 స్కోర్లు చేశాడు. దాంతో దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్లోకి రావాలని అతనికి సెలక్టర్లు తేల్చి చెప్పారు. మరోవైపు సఫారీ పర్యటనకు నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చారు. బ్యాట్స్మెన్లు ఏంజెలో పెరీరా, ఒషాడా ఫెర్నాండోలతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా, పేస్ బౌలర్ మొహమ్మద్ షిరాజ్లకు తొలిసారి అవకాశం లభించింది. ఈ సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి డర్బన్లో తొలి టెస్టు జరుగుతుంది. -
కెప్టెన్సీ నుంచి మాథ్యూస్కు ఉద్వాసన
కొలంబో: ఆసియా కప్లో పేలవ ప్రదర్శన కనబరిచిన శ్రీలంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్పై వేటు పడింది. వన్డే, టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి మాథ్యూస్ను తప్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దుబాయ్, అబుదాబిల్లో జరుగుతున్న ఆసియా కప్లో లంక అనూహ్యంగా తక్కువ ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన కోసం అతని స్థానంలో దినేశ్ చండిమాల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే అతను టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఇక మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత రెండేళ్లలోనే లంక బోర్డు వన్డేల్లో ఆరు మంది కెప్టెన్లను మార్చింది. టెస్టుల్లో, టి20ల్లో నలుగురు చొప్పున కెప్టెన్లను మార్చింది. వన్డేల్లో అసలు స్థిరమైన నాయకత్వమే లేకుండా తరంగ, మాథ్యూస్, కపుగెడెర, మలింగ, తిసారా పెరీరా, చండిమాల్లను తరచూ మార్చేసింది. బలిపశువును చేశారు... ఆసియా కప్ వైఫల్యానికి తనను ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేయడం అన్యాయమని మాథ్యూస్ ఆరోపించాడు. ఆ టోర్నీలో అంతా విఫలమైనపుడు తాను మాత్రం చేయగలిగేదేమి లేదని అన్నాడు. తాజా పరిస్థితులపై కలత చెందానని రిటైర్మెంట్ ప్రకటిస్తానని బోర్డును ఉద్దేశించి హెచ్చరించాడు. -
ఆసియాకప్: శ్రీలంకకు ఎదురుదెబ్బ
కొలంబో: ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఆసియా కప్కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. దేశవాళీ టోర్నీలో వేలికి అయిన గాయం నుంచి ఇంకా చండిమాల్ పూర్తిగా కోలుకోలేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. దాంతో అతడి స్థానంలో నిరోషన్ డిక్వెలా చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్లో దినేశ్ చండీమాల్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక తరుపున చండిమాల్ ఇప్పటివరకు 32.69 యావరేజితో 3000కుపైగా పరుగులు చేశాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో చండిమాల్పై ఆరు మ్యాచ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. దాంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో చండిమాల్ చోటు కోల్పోయాడు. అయితే ఆసియాకప్లో పాల్గొనే జట్టులో చండిమాల్కు స్థానం కల్పించినప్పటికీ, చివరి నిమిషంలో గాయం కారణంగా అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఆ జట్టు మెడికల్ టీమ్ తేల్చిచెప్పింది. దాంతో ఆసియాకప్కు చండిమాల్ దూరం కాగా, స్టాండ్ బైగా ఉన్న డిక్వెల్లా 16 మంది సభ్యులతో కూడిన బృందంలో చోటు దక్కింది. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ ప్రారంభం కానుంది. -
శ్రీలంక కెప్టెన్కు ఐసీసీ భారీ షాక్!
శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. చండిమాల్తో పాటు కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలపై నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధాన్ని విధించింది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఐసీసీ ప్రతినిధి హాన్ మైఖెల్ బెలాఫ్ తెలిపారు. ఈ ముగ్గురు 8 సస్పెన్షన్ పాయింట్లు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో తీవ్రంగా పరిగణించామని ఐసీసీ ప్రకటించింది. ఈ నిషేధంతో దినేష్ చండిమాల్, కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలు దక్షిణాఫ్రికాతో జరగనున్న 4 వన్డేలు, 2 టెస్టుల నుంచి వీరిని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సెయింట్ లూసియాలో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో ఆట ఆరంభంలో మైదానంలోకి రాకుండా సమయం వృథా చేశారని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరోజు ఆట రెండున్నర గంటలపాటు ఆలస్యమైందని తెలిపారు. దాంతో పాటుగా ఇటీవల విండీస్తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు తేలిందని రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. -
4 గంటల విచారణ.. చండిమాల్కు చుక్కెదురు
గ్రాస్ ఐలెట్: తనపై విధించిన టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ను సవాల్ చేసిన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్కు చుక్కెదురైంది. ఈ మేరకు మిచెల్ బెలాఫ్ నేతృత్వలోని ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్ను కొట్టేసింది. శుక్రవారం నాలుగు గంటల పాటు చండిమాల్ను విచారించిన తర్వాత సదరు జ్యుడిషియల్ కమిషన్ అతని అప్పీల్లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. దాంతో చండిమాల్కు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్తో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా యథావిధిగా అమలవుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చండిమాల్ సస్పెన్షన్పై ఎటువంటి మార్పు లేకపోవడంతో వెస్టిండీస్తో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు అతను దూరం కానున్నాడు. విండీస్తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని వాదించిన చండిమాల్.. రిఫరీ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లాడు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్ను తిరస్కరించింది. కెప్టెన్గా లక్మల్.. ట్యాంపరింగ్ కారణంగా లంక రెగ్యులర్ కెప్టెన్ చండిమాల్ విండీస్తో మూడో టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో అతని స్థానంలో లక్మల్ను సారథిగా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూడో టెస్ట మ్యాచ్కు లక్మల్ను కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని ఎస్ఎల్సీ ఓ ప్రకటనలో తెలిపింది. విండీస్తో టెస్టు మ్యాచ్కు వెటరన్ రంగనా హెరాత్ను కెప్టెన్గా నియమించాలని ఎస్ఎల్సీ తొలుత భావించినా, అతను గాయం కారణంగా ఆఖరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో చండిమాల్ స్థానంలో సీమర్ లక్మల్ను కెప్టెన్గా నియమించారు. -
సస్పెన్షన్పై చండిమాల్ అప్పీల్
గ్రాస్ ఐలెట్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్పై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు చండిమాల్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. వెస్టిండీస్తో రెండో టెస్టులో చండిమాల్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో అతనిపై టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను వెస్టిండీస్తో మూడో టెస్టుకు దూరం కానున్నాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి చండిమాల్ అప్పీలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కూడా మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్నే సమర్థించారు. రిఫరీ అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో చండిమాల్ ఐసీసీకి అప్పీలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బాల్ ట్యాంపరింగ్; మరో క్రికెటర్పై నిషేధం
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక జట్టుకు ‘ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్’(ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్పై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. దీంతో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్కు చండిమాల్ దూరం కానున్నాడు. గత శనివారం సెయింట్ లూసియా టెస్టు మ్యాచ్లో భాగంగా శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్లో చండీమాల్ బాల్ కండీషన్ మార్చడానికి ప్రయత్నించాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దాంతో వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించిన ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను చండిమాల్ అతిక్రమించాడని నిర్ధారించి ఈ చర్యలు తీసుకుంది. -
లంకకు భారీ షాక్.. చండిమాల్పై నిషేధం
కొలంబో: శ్రీలంక కెప్టెన్ చండిమాల్పై రెండు టీ20ల నిషేధం విధించింది ఐసీసీ. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చండిమాల్పై ఈ చర్య తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని.. దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు. ఐసీసీ నిబంధన 2.5.2 ప్రకారం మ్యాచ్లో రెండు ఓవర్లు ఆలస్యమైతే ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. మూడు ఓవర్లు ఆలస్యమైతే ఫీజులో 20 శాతం కోత పడుతుంది. అదే సమయంలో కెప్టెన్కు పనిష్మెంట్గా రెండు 2 సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. ఇది ఓ టెస్ట్, లేక రెండు వన్డేలు, లేక రెండు టీ20ల నిషేధానికి సమానమని క్రిస్ బ్రాడ్ తెలిపారు. దీంతో ఈ నెల 12న భారత్, 16న బంగ్లాదేశ్తో జరగనున్న టీ20లకు దూరం కానున్నాడు. లంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. బంగ్లా ఆటగాళ్లకూ ‘కోత’ పడింది! బంగ్లాదేశ్ కెప్టెన్ మమ్మదుల్లాకు సైతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నిబంధన 2.5.1 ప్రకారం బంగ్లా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మహ్మదుల్లా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు రిఫరీ క్రిస్ బ్రాడ్ వివరించారు. ఏడాదిలోగా మరోసారి టీ20ల్లో స్లో ఓవర్ రేటు నమోదైతే మహ్మదుల్లా మ్యాచ్ నిషేధానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. BREAKING: Dinesh Chandimal has been suspended for two T20Is, after being found guilty of a serious over-rate offence in Saturday's match against Bangladesh.https://t.co/MyS6idOCZY pic.twitter.com/MK1SyxmWhy — ICC (@ICC) 11 March 2018 -
అదొక అత్యుత్తమ ఇన్నింగ్స్: చండిమాల్
కొలంబో:తమ నుంచి విజయాన్ని దూరం చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముష్పికర్ రహీమ్పై శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాము నిర్దేశించిన భారీ లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ముష్పికర్ ఆడిన తీరు నిజంగా అద్భుతమని కొనియాడాడు. తాను చూసిన ముష్పికర్ ఇన్నింగ్స్ల్లో ఇదే అత్యుత్తమం అంటూ చండిమాల్ ప్రశంసించాడు. ' ముష్పికర్ అసాధారణ రీతిలో ఆడాడు. నేను చూసిన ముష్పికర్ ఇన్నింగ్స్ల్లో ఇదే తొలి స్థానంలో ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ముష్పికర్ మాకు విజయాన్ని దూరం చేశాడు. మిగతా బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు' అని చండిమాల్ తెలిపాడు. ఈ మ్యాచ్ను మంచి క్రికెట్ గేమ్గా అభివర్ణించిన చండిమాల్.. తమ బ్యాటింగ్ తీరు అమోఘంగా ఉందన్నాడు. కాగా, బౌలింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. వచ్చే మ్యాచ్లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేసిన చండిమాల్.. తదుపరి గేమ్లో పక్కా ప్రణాళికల్ని అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు. ఇక తొలి ఆరు ఓవర్లలోపే స్నిన్నర్ అకిల దనంజయకు బౌలింగ్ ఇవ్వడాన్ని చండిమాల్ సమర్ధించుకున్నాడు. తమ జట్టులో అతనొక స్టార్ బౌలర్ అని, గత కొంతకాలం నుంచి నిలకడగా బౌలింగ్ చేయడం వల్లే ముందుగా బౌలింగ్ ఇచ్చామన్నాడు. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముష్పికర్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 72 పరుగులు సాధించి బంగ్లాదేశ్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
చండిమాల్కు ఉద్వాసన
న్యూఢిల్లీ:భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి కాపాడిన శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. ఈ మేరకు మంగళవారం వన్డే సిరీస్కు ప్రకటించిన లంక జట్టు నుంచి చండిమాల్కు ఉద్వాసన పలికారు. భారత్తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో చండిమాల్ 164 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరిదైన మూడో టెస్టులో లంకేయులు కష్టాల్లో పడ్డ సమయంలో చండిమాల్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే భారత్తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్లో మాత్రం చండిమల్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ప్రధానంగా వన్డే సిరీస్కు సంబంధించి లంక సెలక్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన చండిమాల్కు మొండిచేయే ఎదురైంది. కాగా, ఆల్ రౌండర్ ఆసేలే గుణరత్నే, ఓపెనింగ్ ఆటగాడు దనుష్క గుణతిలకా తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్తో వన్డే సిరీస్కు లంక జట్టు ఇదే.. తిషారా పెరీరా(కెప్టెన్), ఉపుల్ తరంగా, దనుష్క గుణతిలకా, డిక్వెల్లా, సదీరా సమరవిక్రమా, లహిరు తిరుమన్నే, మాథ్యూస్, గుణరత్నే, చతురంగా డిసిల్వా, అకిలా దనంజయ, వాండార్సే, దిష్కమంత చమీరా, సురంగా లక్మల్, నువాన్ ప్రదీప్ -
మా గేమ్ ప్లాన్ అదే: లంక కెప్టెన్
కోల్కతా : భారతగడ్డ మీద టీమిండియాపై ఒక్క టెస్ట్ కూడా నెగ్గని శ్రీలంక ఈ సిరీస్లోనైనా కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ నెగ్గి బోణీ కొట్టాలని భావిస్తోంది. నేడు తొలి టెస్ట్ నేపథ్యంలో లంక కెప్టెన్ చండిమాల్ తమ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడాడు. 'భారత్ లాంటి పటిష్ట జట్టుతో వారి గడ్డపై ఆడటం మాకు నిజంగా పెద్ద సవాల్. అందుకే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును ఎదుర్కోని, వారి దూకుడుకు ముకుతాడు వేయడానికి ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగనున్నాం. అయితే 20 భారత వికెట్లు తీస్తేనే మ్యాచ్ మా సొంతమవుతుంది. ఐదు రోజులు సుదీర్ఘంగా బ్యాటింగ్, బౌలింగ్లలో రాణించినా, ఫీల్డింగ్లోనూ అద్బుత ప్రదర్శన చేస్తేనే భారత్ లాంటి జట్టుపై విజయం సాధ్యం. అబుదాబీలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ పిచ్లకు, భారత పిచ్లకు సంబంధమే ఉండదు. ఈడెన్ పిచ్ నిన్న చూశాం. పచ్చికతో ఉన్నా చాలా హార్డ్గా ఉంది. ఏ జట్టు సీమర్లు రాణిస్తే.. వారిదే పైచేయి అవుతుందని' లంక కెప్టెన్ చండిమాల్ అభిప్రాయపడ్డాడు. అయితే కోల్కతాలో వర్షం కారణంగా లంచ్ సమయానికి కూడా టాస్ వేయలేదు. -
భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్..
సాక్షి, హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ తొలిమ్యాచ్ నవంబర్16న ఈడెన్గార్డెన్స్లో ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం భారత్లో పర్యటించిన లంక మూడు టెస్టుల సిరీస్లో భాగంగా 0-2తో సీరీస్ను కోల్పోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో లంకలో పర్యటించిన భారత్ టెస్టు, వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్చేసింది. ఇక ఎకైక టీ20లో కూడా విజయం భారత్నే వరించింది. అయితే ఈ సిరీస్ అనంతరం లంక మంచి ప్రదర్శనతో పాక్పై టెస్ట్ సిరీస్ నెగ్గింది. దీంతో భారత్లో జరిగే మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు రసవత్తరంగా సాగనున్నాయి. ♦ టెస్టు షెడ్యూల్ తొలి టెస్టు: నవంబర్ 16 నుంచి 20 వరకు; వేదిక: ఈడేన్ గార్డెన్స్, కోల్కతా రెండో టెస్టు: నవంబర్ 24 నుంచి 28 వరకు; వేదిక: వీసీఏ స్టేడియం, జమ్తా, నాగ్పూర్ మూడో టెస్టు: డిసెంబర్ 2 నుంచి 6 వరకు ; వేదిక: ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ ♦ వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: డిసెంబర్ 10; వేదిక: హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల రెండో వన్డే: డిసెంబర్ 13; వేదిక పీసీఏ స్టేడియం, మోహాలీ, చంఢీఘర్ మూడో వన్డే: డెసెంబర్ 17; వేదిక ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్టణం ♦ టీ20 సిరీస్ షెడ్యూల్: తొలి టీ20: డిసెంబర్ 20; బారాబతి స్టేడియం, కటక్ రెండో టీ20: డిసెంబర్ 22; హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ మూడో టీ20: డిసెంబర్ 24: వాంఖడే స్టేడియం, ముంబై ♦ జట్లు: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, విజయ్, శిఖర్ ధావన్, చతేశ్వర పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్శర్మ శీల్రంక: దినేశ్ చండిమల్( కెప్టెన్), డిక్వెల్లా, లాహిరు గామెజ్, కరుణరత్నే, మాథ్యూస్, సదీరా సమరవిక్రమా, దసన్ శనకా, లాహీరు తిరుమణ్నే, ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో, రంగనా హెరాత్, సురంగ లక్మల్, దిర్లువన్ పెరేరా, లక్షణ్ సందకన్, రోషన్ సిల్వా -
మంత్రగత్తె ఆశీర్వాదం తీసుకున్నారా?
న్యూఢిల్లీ: ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంక 2-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో యూఏఈలో పాక్ పై సిరీస్ గెలిచిన తొలి జట్టుగా లంక చరిత్ర కెక్కింది. అయితే ఈ సిరీస్ గెలవడానికి మంత్రగత్తె ఆశీర్వాదమే కారణమంటూ మొత్తం పర్యటన ముగిసిన తరువాత లంక కెప్టెన్ చండిమాల్ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యాడు. అదే నిజమైతే.. ఆపై జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు గెలవలేదంటూ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సైతం ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే భారత పర్యటనకు లంక జట్టు వచ్చిన తరుణంలో చండిమాల్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. 'టీమిండియాపై సిరీస్ గెలవడానికి మంత్రగత్తె అశీస్సులు తీసుకున్నారా?' అంటూ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు చండిమాల్ బిక్కమొహం వేశాడు. ఆ ప్రశ్నకు ఏమి చెప్పాలా అని చండిమాల్ సతమతం అవుతుండగా పక్కనే ఉన్న జట్టు మేనేజర్ అసంక గురుసిన్షా దానికి ముగింపు ఇచ్చాడు. 'అందరిలానే మాకు కొ్న్ని నమ్మకాలున్నాయి. కానీ అంతిమంగా మైదానంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టుదే విజయం'అని సర్దిచెప్పుకున్నాడు. -
'మేము క్షుద్రపూజల వల్ల ఓడిపోలేదు'
అబుదాబి:ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను గెలవడానికి క్షుద్రపూజలే కారణమని శ్రీలంక కెప్టెన్ చండీమాల్ వ్యాఖ్యలపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మండిపడ్డాడ్డు. తమ పేలవమైన బ్యాటింగ్ కారణంగానే లంకేయులతో జరిగిన టెస్టు సిరీస్ ను ఓడిపోయామని, అంతేతప్పా ఇక్కడ క్షుద్రపూజలకు అవకాశమే లేదంటూ విమర్శించాడు. ఒకవేళ లంకేయులు క్షుద్రపూజల కారణంగా టెస్టు సిరీస్ ను గెలిస్తే, ఆ తరువాత జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు ఓడిపోయారంటూ చండీమాల్ కు ప్రశ్నలు కురిపించాడు. 'మేము క్షుద్రపూజల వల్ల టెస్టు సిరీస్ ను ఓడిపోలేదు. మా ఓటమికి మేము సరిగా ఆడకపోవడమే. ఎవరో మంత్రగాళ్ల వల్ల మాపై లంక టెస్టు సిరీస్ ను గెలిస్తే.. మరి వన్డే, టీ 20 సిరీస్ లో వారు ఎందుకు చిత్తుగా ఓడిపోయారు' అని సర్ఫరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తరహా విధానాలకు క్రికెట్ కు ముడిపెట్టడం సరికాదని పాకిస్తాన్ మాజీ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు. ఇలా అయితే ఇక క్రికెట్ మ్యాచ్ ల్లో విజయాల్ని క్షుద్రపూజలే నిర్ణయిస్తామో అంటూ చురకలంటించాడు. క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం! -
క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం!
కొలంబో : ఆధునిక టెక్నాలజీతో మ్యాచ్లు మరింత రసవత్తరంగా మారుతున్నవేళ క్రికెట్ రంగంలో ఊహించని పిడుగు! ప్రత్యర్థిని ఓడించాలంటే సమర్థత, మెరుగైన ప్రాక్టీస్, నిలకడతనం కంటే మంత్రాలు, చేతబడులను నమ్ముకుంటున్నవైనం!! ఇటీవల పాకిస్తాన్పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఏమైంది? : శ్రీలంక- పాకిస్తాన్ జాతీయ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా(సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు) రెండు టెస్ట్లు, ఐదు వన్డే, మూడు టీ20 మ్యాచ్లు జరిగాయి. టెస్ట్ సిరీస్ను లంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పర్యటన ముగించుకుని లంక టీం మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమల్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. మంత్రగత్తె ఆశీర్వాదంతో.. : ‘‘క్రికెట్లో ఆటగాడికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాకిస్తాన్తో సిరీస్ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం’’ అని లంక సారధి చండీమల్ చెప్పారు. రెండు మ్యాచ్ల్లోనూ అతను శతకం, అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మంత్రాలతో మ్యాచ్లు గెలవొచ్చా? : చండీమల్ వ్యాఖ్యలపై యావత్ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. క్రికెట్లో క్షుద్రపూజలేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకవేళ మంత్రాలతో మ్యాచ్లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?’ అని ప్రశ్నిస్తున్నారు. పాక్తో టెస్ట్ సిరీస్ నెగ్గిన లంక.. 0-5తో వన్డే సిరీస్ను, 0-3 తో టీ20 సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
‘రెండు’లోనే ముగించాలని...
►సిరీస్ విజయంపై భారత్ కన్ను ►తీవ్ర ఒత్తిడిలో శ్రీలంక ►నేటి నుంచి రెండో టెస్టు ►తుది జట్టులోకి రాహుల్ కొద్ది రోజుల క్రితం టీమిండియా నంబర్వన్ టెస్టు జట్టు హోదాలోనే శ్రీలంకలో అడుగు పెట్టింది. భారత్ ఆటపై అపార నమ్మకం ఉన్నా... సొంతగడ్డపై శ్రీలంక మరీ ఇంత పేలవంగా ఆడి తలవంచుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ తొలి టెస్టులో ఆ జట్టు ప్రదర్శన ఇరు జట్ల మధ్య అంతరాన్ని భారీగా పెంచేసింది. అద్భుత ఫామ్లో ఉన్న టీమిండియాను లంక ఇక ముందు కూడా ఆపే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే వరుసగా రెండో పర్యటనలోనూ సిరీస్ భారత్ సొంతమవుతుంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టులో ఓడి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత బృందం సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు మన జట్టు మరింత పటిష్టంగా మారగా, శ్రీలంక జట్టు మాత్రం ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. పైగా కీలక ఆటగాళ్లు గాయపడటంతో తుది జట్టును ఎంచుకునే విషయంలో కూడా లంక తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. కొలంబో: శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ సిరీస్ విజయంపై దృష్టి పెట్టింది. నేటి నుంచి ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్ 304 పరుగుల తేడాతో గెలిచింది. అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుండగా... భారత జట్టులోకి లోకేశ్ రాహుల్ రావడం ఖాయమైంది. అందరూ ఫామ్లో... గాలే టెస్టులో భారత జట్టు టాప్–5 బ్యాట్స్మెన్ అంతా కనీసం అర్ధ సెంచరీ అయినా సాధించారు. వీరిలో ధావన్, పుజారా, కోహ్లి సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్లో భారత్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి 840 పరుగులను అతి వేగంగా 4.5 రన్రేట్తో సాధించింది. కాబట్టి బ్యాటింగ్ విషయంలో టీమిండియా ఏ రకంగా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే తుది జట్టులో ఒక కీలక మార్పు జరగనుంది. ఓపెనర్ ముకుంద్ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ఏడు ఇన్నింగ్స్లలో ఆరు అర్ధ సెంచరీలు చేసిన అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని రాక జట్టు బలాన్ని మరింత పెంచనుంది. బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్లో భారత జట్టులో అందరూ వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా కూడా తన తొలి మ్యాచ్లోనే ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ మూడో స్పిన్నర్ను ఆడించే ఆలోచన ఉంది. కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంటే పాండ్యా తప్పుకోవాల్సి రావచ్చు. ఓవరాల్గా దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత్ను నిలువరించాలంటే లంక తీవ్రంగా శ్రమించాలి. హెరాత్ ఆడతాడా? తొలి టెస్టులో పరాజయంతో పాటు కీలక ఆటగాళ్ల గాయాలు లంక మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీశాయి. గాయం కారణంగా ప్రధాన బ్యాట్స్మన్ అసెలా గుణరత్నే తప్పుకోవడం జట్టును బలహీనం చేసింది. అతని స్థానంలో తిరిమన్నె లేదా ధనంజయ డి సిల్వా బరిలోకి దిగుతారు. హెరాత్ గాయంతో గత టెస్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కే రాలేదు. అతని ఫిట్నెస్పై ఇంకా స్పష్టత లేకపోయినా... ఆడాలని లంక కోరుకుంటోంది. శ్రీలంక కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మలింద పుష్పకుమారకు తొలి టెస్టు ఆడే అవకాశం లభించవచ్చు. మరోవైపు కెప్టెన్, కీలక బ్యాట్స్మన్ చండిమాల్ తిరిగి రావడం మాత్రం ఊరటనిచ్చే అంశం. తొలి టెస్టులో ఘోర పరాభవంతో అన్ని వైపుల నుంచి జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లంక పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం తొలి టెస్టుతో పోలిస్తే ఇక్కడి పిచ్ పొడిగా ఉంది. రెండు రోజుల పాటు మంచి బ్యాటింగ్ చేయవచ్చు. మూడో రోజు నుంచి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే రోజుల్లో చిరుజల్లులకు అవకాశం ఉంది. ► 31 ఈ మ్యాచ్తో భారత్ తరఫున కనీసం 50 టెస్టులు ఆడిన 31వ క్రికెటర్గా పుజారా గుర్తింపు పొందనున్నాడు ►28 రాహుల్ తుది జట్టులోకి వస్తే కెప్టెన్గా తుది జట్టు విషయంలో కోహ్లి తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నట్లవుతుంది. ►వరుసగా 27 టెస్టుల్లో కనీసం ఒక్క ఆటగాడినైనా మార్చిన కోహ్లి... 28వ టెస్టులోనూ దానిని కొనసాగించనున్నాడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా/కుల్దీప్, ఉమేశ్, షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, ధనంజయ, పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్. ►ఉదయం గం. 10.00 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
శ్రీలంక క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు!
కొలంబో:ఇటీవల శ్రీలంక క్రికెట్ కెప్టెన్సీ పదవి నుంచి ఏంజెలో మాథ్యూస్ తప్పుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జింబాబ్వే తో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయిన తరువాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో శ్రీలంక క్రికెట్ లో ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎట్టకేలకు ఇద్దర్ని కెప్టెన్లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక టెస్టు కెప్టెన్ గా దినేష్ చండిమాల్ ను , వన్డే, ట్వంటీ 20(పరిమిత ఓవర్ల) కెప్టెన్ గా ఉపుల్ తరంగాను ఎంపిక చేసింది. ఈ మేరకు మాట్లాడిన చండిమాల్.. కెప్టెన్ గా మాథ్యూస్ తప్పుకోవడం తమ జట్టుకు లోటేనన్నాడు. శ్రీలంక జట్టును ముందుకు తీసుకెళ్లడంలో మాథ్యూస్ తన శక్తిమేర కృషి చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నుంచి మాథ్యూస్ జట్టులో సభ్యుడిగా ఉంటూ సేవలందిస్తాడని పేర్కొన్న చండిమాల్.. కెప్టెన్సీ అనేది ఈజీ జాబ్ కాదనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనన్నాడు. 2011టెస్టుల్లో అరంగేట్రం చేసిన చండిమాల్.. ఇప్పటివరకూ 36 టెస్టుల్లో 42.33 సగటుతో 2,540 పరుగులు చేశాడు. -
చండిమల్ సెంచరీ
లంక 338 ఆలౌట్ ∙బంగ్లా 214/5 కొలంబో: దినేశ్ చండిమల్ సెంచరీ (300 బంతుల్లో 138, 10 ఫోర్లు, ఓ సిక్సర్)తో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రీలంక 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 238/7తో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన లంక మరో 100 పరుగులు జత చేసి ఆలౌటైంది. చండిమల్ ఓపికగా బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కెప్టెన్ రంగన హెరాత్ (25), సురంగ లక్మల్ (35) అతనికి సహకరించారు. ముందుగా హెరాత్తో ఎనిమిదో వికెట్కు 55, లక్మల్తో తొమ్మిదో వికెట్కు 55 పరుగులు జోడించాడు. ఈక్రమంలో చండిమల్ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో లక్మల్ పోరాడడంతో లంక మరిన్ని పరగులు సాధించింది. బౌలర్లలో మెహ్దీ హసన్ మిరాజ్కు మూడు, సుభాశిష్ రాయ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షకీబల్ హసన్కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లా రెండోరోజు ఆటముగిసేసరికి 60 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. జట్టులో సౌమ్యాసర్కార్ (61) సిరీస్లో వరుసగా మూడో అర్ధసెంచరీని నమోదు చేశాడు. తమీమ్ ఇక్బాల్ (49), షబ్బీర్ రహ్మాన్ (42) ఫర్వాలేదనిపంచారు.తొలుత ఓపెనర్లు 95 పరుగుల జోడించి శుభారంభాన్నించ్చినా మిడిలార్డర్ బ్యాట్స్మన్ విఫలమవడంతో బంగ్లా త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో షకీబల్ హసన్ (18), ముష్ఫికుర్ రహీమ్ (2) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి కంటే బంగ్లా మరో 124 పరుగుల వెనుకంజలో ఉంది. లంక బౌలర్లలో సందకన్కు మూడు వికెట్లు దక్కాయి. -
ఐదు వన్డేల్లో నాలుగో హాఫ్ సెంచరీ..
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక యువ సంచలనం కుశాల్ మెండిస్ మరోసారి రాణించాడు. ఓ వైపు ఆసీస్ పేసర్ స్టార్క్, మరోవైపు స్పిన్నర్ లియాన్ 12 పరుగులకే లంక ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించగా కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు) చేశాడు. 27వ ఓవర్ చివరి బంతికి జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటై నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ అతడి వన్డే కెరీర్ లో ఇది ఐదవ అర్థ శతకం కాగా, చివరి ఐదు వన్డేల్లో ఇది నాలుగోది కావడంవిశేషం. ఇది అతడికి కేవలం 9వ వన్డే మాత్రమే. ఆసీస్ తో టెస్టు సిరీస్ లో అరంగేట్రంలోనే అదరగొట్టిన కుశాల్ వన్డే సిరీస్ లో జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 28 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. మరో బ్యాట్స్ మన్ చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. చివరి ఐదు వన్డేల్లో హాఫ్ సెంచరీలు నమోదుచేసిన చండిమల్ జంపా బౌలింగ్ లోనే వికెట్లు ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం మాథ్యూస్(7), డి సిల్వా(6) క్రీజులో ఉన్నారు. -
మలింగా దూరం:టీ20 కెప్టెన్గా చండీమాల్
క్రైస్ట్చర్చ్: త్వరలో న్యూజిలాండ్ తో జరుగనున్న ట్వంటీ 20 సిరీస్ కు దినేష్ చండీమాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న లషిత్ మలింగా ట్వంటీ 20 సిరీస్ కు దూరం కావడంతో అతని స్థానంలో కెప్టెన్గా చండీమాల్ను నియమించారు. అంతకుముందు 2013 లో తొలిసారి చండీమాల్ ట్వంటీ 20 కెప్టెన్ గా వ్యవహరించాడు. చండీమాల్ నేతృత్వంలోని శ్రీలంక 12 ట్వంటీ -20 మ్యాచ్ లు ఆడగా ఎనిమిదింట గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. చండీమాల్ కు మరోసారి ట్వంటీ 20 సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఇదిలాఉండగా మలింగా స్థానంలో బౌలర్గా సురంగా లక్మల్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్నఐదు వన్డేల సిరీస్లో 2-0 తేడాతో వెనుకబడి ఉన్న శ్రీలంకకు మలింగా లేకపోవడం ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. గత నవంబర్లో శ్రీలంకలో వెస్టిండీస్తో జరిగిన తొలి ట్వంటీ 20లో మలింగా చివరిసారి కన్పించాడు. -
చండీమల్ కట్టడికి టీమిండియా వ్యూహం
కొలంబో: శ్రీలంకతో తొలిటెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్పై దృష్టిసారిస్తోంది. గాలె టెస్టులో అజేయ సెంచరీ చేసి మ్యాచ్ మలుపు తిప్పిన లంక బ్యాట్స్మన్ దినేశ్ చండీమల్ను కట్టడి చేయడానికి వ్యూహం రచిస్తోంది. రెండో టెస్టులో చండీమల్ను ఎదుర్కొనేందుకు భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను బరిలో దింపాలని భావిస్తోంది. చండీమల్కు ఎలా బౌలింగ్ చేయాలన్న విషయంపై చర్చిస్తామని అమిత్ మిశ్రా చెప్పాడు. వీలైనంత తొందరగా అతన్ని అవుట్ చేయడానికి ప్రయత్నిస్తామని, అతనిపై బౌలింగ్ దాడి చేస్తామని అమిత్ అన్నాడు. తొలి టెస్టులో లంకకు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం ఎదురైనపుడు చండీమల్ (162 నాటౌట్) సూపర్ సెంచరీ చేసి ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లంక బౌలర్ హెరాత్ (7/48) చెలరేగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. గురువారం నుంచి భారత్, శ్రీలంకల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. -
చండీమల్ సెంచరీ
గాలె: భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్ మన్ దినేశ్ చండీమల్ సెంచరీ సాధించాడు. 100 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది నాలుగో సెంచరీ. ఇన్నింగ్స్ ఓటమి తప్పదనుకున్న తరుణంలో చండీమల్ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించాడు. కీలక భాగస్వామ్యాలతో టీమ్ ను ఆధిక్యం దిశగా తీసుకెళ్లాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న 6 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. సంగక్కర 40, మాథ్యాస్ 39, తిమిమన్నె 44 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఆరోన్ ఒక వికెట్ తీశాడు.