Enumerators
-
సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లపై దాడులు
నగరంలోని పంజాగుట్టలో కుటుంబ ఆర్థిక గణన సర్వే కోసం ఇంటికి వచ్చి వివరాలు అడిగిన ఎన్యూమరేటర్కు సమాచారం అందించేందుకు నిరాకరించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలాంటి ఘటనలు మాస్ ఏరియాలో కాకుండా క్లాస్ ఏరియాలో ఎదురు కావడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షి, హైదరాబాద్: నగరంలో కుటుంబ ఆర్థిక గణన సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వివరాలు అందించేందుకు కొందరు సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దాడులకు సైతం పాల్పడుతున్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు నగరంలో ఏడో ఆర్థిక గణన సర్వే మూణ్నెల్లుగా కొనసాగుతోంది. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. దీని ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ కుటుంబాల తలసరి ఆదాయాల లెక్క తేలనుంది. 11.4 లక్షల కుటుంబాల సర్వే పూర్తి.. ⇔ నగరంలో ఇప్పటి వరకు సుమారు 11.4 లక్షల కుటుంబాల గణన పూర్తయ్యింది. అందులో 10,28,462 నివాస గృహాలు, 64,694 వాణిజ్య దుకాణాలు, 10,917 ఇతరత్రా సముదాయాల సర్వే పూర్తయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇔ హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసిన అధికారులు ఆర్థిక గణన సర్వే కోసం సుమారు 1,394 ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపారు. 196 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో మొత్తం 266 యూనిట్లుగా విభజించగా ఇప్పటి వరకు 134 యూనిట్లు పూర్తి చేశారు. మార్చి 31నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 30 అంశాలపై .. ⇔ నగరంలో కుటుంబ ఆర్థిక గణన సుమారు 30 అంశాలపై కొనసాగుతోంది. ప్రతి కుటుంబం జీవనశైలి, నివాసాలు, ఆర్థిక వనరులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారు. ప్రతి కుటుంబంనుంచి సేకరించిన వివరాలను అక్కడికక్కడే ఎన్యూమరేటర్ మొబైల్ యాప్లో పొందుపరుస్తున్నారు. ⇔ ఎన్యూమరేటర్లకు జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేసేలా సులభతరంగా వీటిని రూపొందించారు. ⇔ సర్వే రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్నా వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ⇔ నార్మల్ హౌస్హోల్డ్, సెమీ నార్మల్ హౌస్హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఆర్థిక గణన కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ ద్వారా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా మేనేజర్లు శివారెడ్డి, గౌతం ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. సర్వేకు సహకరించండి.. కుటుంబ ఆర్థిక గణన సర్వేకు సహకరించాలి. భవిష్యత్తులో బహుళ ప్రయోజనకారిగా ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది. ఇబ్బందేమీ ఉండదు. - డాక్టర్ ఎన్.సురేందర్, జిల్లా ప్రణాళిక అధికారి -
హైదరాబాద్లో వన్ మిలియన్ డిజిటల్ సర్వేలు
సాక్షి, హైదరాబాద్: యువతకు డిజిటల్ లిటరసీపై అవగాహన కల్పిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరిచిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) మరో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడో ఆర్థిక సర్వే(డిజిటల్)లో ఎన్యూమరేటర్లుగా దాదాపు ఐదారువేల మందికి అవకాశం కల్పించబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ని ‘టీటా’ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల విడుదల చేసి సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనుబంధ సంస్థ డిజిథాన్తో కలిసి ‘సీఎస్సీ’ ఈ సర్వేను నిర్వహిస్తున్నదని తెలిపారు. సర్వేలో భాగంగా పది లక్షల నివాసాలకు వాలంటీర్లు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 573 ఇన్వెస్టిగేటర్ యూనిట్లు ఉన్నాయని, ఒక్కో యూనిట్కు పది మంది వరకు ఎన్యూమరేటర్లు అవసరమని ఆయన వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు bit.ly/censussurvey వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని సందీప్ చెప్పారు. ఈ డిజిటల్ సర్వేను సీఎస్సీ హైదరాబాద్ విభాగం మేనేజర్ పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని వివరాలకు కార్యాలయ వేళల్లో 6300368705/ 9542809069/ 7989702090/ 9948185053 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఎన్పీఆర్ అమలుకు రంగం సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరణ, జనాభా గణన, గృహ ఆస్తుల వివరాల సేకరణ (హౌస్ లిస్టింగ్)కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం శిక్షణ ఇచ్చి నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరించనున్నారు. ‘మీరు, మీ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం ఏమిటి?.. మీరు భారతీయులేనా? మీ ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ ఏమిటి?. మీకు చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా పెళ్లైందా లేక సహజీవనం చేస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన రుజువులను ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే ఎన్యూమరేటర్లు తీసుకోనున్నారు. అయితే సర్వేకు వచ్చినప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్యూమరేటర్లు కుటుంబ పెద్దను కోరనున్నట్లు ఎన్పీఆర్–2020 యూజర్ మాన్యువల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పౌరసత్వ చట్టం–1955, పౌరసత్వ నిబంధనలు–2013 కింద ఎన్పీఆర్కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశ పౌరులతోపాటు దేశంలో నివాసముంటున్న విదేశీయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించనుంది. ఎన్పీఆర్ కింద అడిగే ప్రశ్నలు.... 1. ఎన్పీఆర్ బుక్లెట్పై ముద్రించిన పేరు సరైనదేనా? (ఒకవేళ తప్పులుంటే పేరును బుక్లెట్లో సరిచేస్తారు. ప్రతి వ్యక్తి పేరును కరెక్టుగా నమోదు చేయడం కీలకమని ఎన్పీఆర్ నియమావళి పేర్కొంటోంది) 2. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎంత మంది? (కుటుంబ సభ్యులు ఎవరైనా వలస వెళ్లినా, చనిపోయినా నమోదు చేసుకుంటారు) 3. కుటుంబ పెద్దతో ఇతర సభ్యుల బంధుత్వం. 4. పురుషులా.. మహిళలా లేక ఇతరులా? 5. వివాహ స్థితిగతులు. (అవివాహితులు, వివాహితులు, వితంతువు/భార్య చనిపోయిన వ్యక్తి, విడిపోయిన వారు, విడాకులు పొందిన వారు వంటి వివరాలు సేకరిస్తారు. రెండోసారి పెళ్లి చేసుకున్నా లేక సహజీవనం చేస్తున్నా పెళ్లయిన వ్యక్తుల కిందే లెక్కగట్టనున్నారు) 6. కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ ఏమిటి? (తప్పుగా ఉంటే సరిచేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ పుట్టిన తేదీ, నెల వివరాలు అందించలేని స్థితిలో ఉంటే కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్లో పుట్టిన తేదీ కీలకం. ఒకవేళ పుట్టిన తేదీ సమాచారం అందించలేని పరిస్థితిలో ఉంటే సంబంధిత వ్యక్తుల స్కూల్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డు, పాస్పోర్టు, ఇతర పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని సేకరిస్తారు. అవి కూడా లేకపోతే సభ్యుల జాతక చక్రాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. జాతకచక్రం కూడా లేకుంటే ఎన్యూమరేటర్లే వయసును అంచనా వేసి నమోదు చేసుకోనున్నారు) - కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే తెలిసి ఉంటే పుట్టిన తేదీని అంచనా వేసేందుకు ఎన్యూమరేటర్లు పలు ప్రశ్నలు అడగనున్నారు. వర్షాకాలంలో పుట్టారా లేదా తర్వాత? పుట్టిన నెలలో దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ వంటి ఏమైనా పండుగలు వచ్చాయా? గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు వచ్చాయా? వంటి ప్రశ్నలను సంధించడం ద్వారా పుట్టిన తేదీని అంచనా వేయనున్నారు. - పుట్టిన తేదీ, సంవత్సరం రెండూ తెలియని పక్షంలో ఎప్పుడు పుట్టారో తెలుసుకోవడానికి దేశ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల ఆధారంగా వ్యక్తుల వయసును ఎన్యూమరేటర్లు అంచనా వేయనున్నారు. తొలి ప్రపంచ యుద్ధం (1914–18), దండి యాత్ర (1930), క్విట్ ఇండియా ఉద్యమం (1942), స్వాతంత్య్ర దినోత్సవం (1947), చైనాతో యుద్ధం (1962), పాకిస్తాన్తో యుద్ధం (1965), బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం (1971), ఏసియాడ్ క్రీడలు (1982), భారత్ తొలి క్రికెట్ ప్రపంచకప్ విజయం (1983) సాధించినప్పుడు పుట్టారా? అని అడిగి తెలుసుకోనున్నారు. 7. మీరు పుట్టిన ప్రాంతం ఏమిటి? (దేశంలో పుడితే రాష్ట్రం, జిల్లా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది) 8. మీ జాతీయత ఏమిటి? భారతీయులేనా? (మీరు పాస్పోర్టు నంబర్ స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించనున్నారు) 9. మీ విద్యార్హతలు ఏమిటి? (ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, 1–12 తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ డిప్లొమా, టీటీసీ, ఇతర డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీజీ ఆపై, సరైన విద్య లేని, నిరక్షరాస్యులా? వంటి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు) 10. మీ వృత్తి ఏమిటి? (వ్యవసాయం, రోజుకూలీ, స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగి యజమాని, ప్రైవేటు ఉద్యోగి, డొమెస్టిక్ హెల్పర్, నాన్ వర్కరా? అని అరా తీయనున్నారు) 11. తల్లి మాతృ భాష ఏమిటి? 12. మీ శాశ్వత చిరునామా చెప్పండి 13. ప్రస్తుత చిరునామాలో ఓ సభ్యుడు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాడా? (ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు? అంతకు ముందు ఎక్కడ ఉన్నాడో తెలపాలి) 14. తండ్రి, తల్లి, భాగస్వామి వివరాలు (తల్లిదండ్రుల గణన ఈ ఇంట్లో జరగని పక్షంలో వారి పేర్లు, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. భాగస్వామి అయితే కేవలం పేరు మాత్రమే రాస్తారు. అదే ఇంట్లో తల్లిదండ్రులు, భాగస్వామి గణన నిర్వహిస్తే వారి పేర్లు, దేశం/విదేశంలో పుట్టిన ప్రాంతం, పుట్టిన తేదీ వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ వివరాలు రూఢీ కాకపోతే సంబంధిత కాలమ్లో ‘–’అని పెడతారు. 15. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు అందుబాటులో ఉంటే తీసుకుంటారు. జనాభా గణనకు అర్హులైన వారు.. - ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యక్తులు. - జనాభా గణన నిర్వహించే సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇంటి సాధారణ నివాసితులు. - ఇంటి సాధారణ నివాసితులై ఉండి ఎన్యూమరేటర్ సందర్శనకు వచ్చిన సమయంలో ఇంట్లో లేని వ్యక్తులు జనాభా గణన ముగిసేలోగా తిరిగి వస్తే వారి వివరాలను సైతం సేకరించనున్నారు. - సందర్శకులు, పనిమనుషులు, అద్దెకు ఉండే వ్యక్తులు, డ్రైవర్లు లేదా అలాంటి వ్యక్తులు ఓ గృహ పరివారంతో కలసి ఉండటంతోపాటు పైన పేర్కొన్న మూడు అర్హతలను కలిగి ఉంటే వారి వివరాలను సైతం సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్–2010 ఆధారంగా... దేశంలో నివాసముంటున్న ప్రజలందరికీ సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్ను తొలిసారిగా 2010లో తయారు చేశారు. జనగణన–2011 కార్యక్రమంలో భాగంగా 2010లో నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్పీఆర్ డేటాను రూపొందించారు. ఆ వివరాలతో ‘ఎన్పీఆర్ డేటా బుక్లెట్’ను ముద్రించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్ద నుంచి జనాభా గణనతోపాటు ఎన్పీఆర్కు సంబంధించి తాజా సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్పీఆర్ బుక్లెట్స్లో సంబంధిత కుటుంబం/వ్యక్తులకు సంబంధించి ముద్రించి ఉన్న సమాచారాన్ని సరిపోల్చి చూడనున్నారు. ఇందుకు అవసరమైతే ఆధార్, ఓటర్ ఐడీ కార్డు వంటి రుజువులను చూపాలని కోరనున్నారు. పాత ఎన్పీఆర్ డేటాబేస్లో ఎవైనా తప్పులుంటే సరిచేయడంతోపాటు అవసరమైన కొత్త సమాచారాన్ని నమోదు చేసుకోనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా పాత ఎన్పీఆర్ డేటాబేస్లో ఉన్న కుటుంబాల్లో కొత్త సభ్యులున్నట్లుగానీ, కొత్త కుటుంబాలున్నట్లుగానీ గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లకు ‘ఖాళీ ఎన్పీఆర్ ఫారాలను’కేంద్రం అందించనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన ఎన్పీఆర్ బుక్లెట్లో ఆ కుటుంబానికి సంబంధించిన కొత్త సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు అవసరమైన ఖాళీ పేజీలుంటే అదే బుక్లెట్లో నమోదు చేయనున్నారు. - కుటుంబలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ఎన్పీఆర్ డేటాబేస్ను నవీకరిస్తారు. - నవీకరించిన ఎన్పీఆర్ డేటాబేస్ను కుటుంబ పెద్దకు చూపించడంతోపాటు బుక్లెట్పై అతడి/ఆమె సంతకం/వేలిముద్రను సేకరించనున్నారు. - కుటుంబ సభ్యుల పేర్లు, సంఖ్య, ఇతర అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది అని ఎన్పీఆర్ నిబంధనలు పేర్కొంటున్నాయి. - ఒకే గృహంలో నివాసముంటూ ఉమ్మడి కిచెన్పై ఆధారపడిన రక్తసంబంధికులతోపాటు ఏ సంబంధం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను ‘సాధారణ గృహాల’విభాగం కింద స్వీకరించనున్నారు. - బోర్డింగ్ గృహాలు, మెస్లు, హాస్టళ్లు, హోటళ్లు, రెస్క్యూ గృహాలు, అబ్జర్వేషన్ హోంలు, బెగ్గర్ హోంలు, జైళ్లు, ఆశ్రమాలు, వద్ధాశ్రమాలు, బాల గృహాలు, అనాథాశ్రమాలు వంటి భవనాల్లో నివాసముండే ఏ బంధుత్వం లేని వ్యక్తుల ఎన్పీఆర్ డేటాను వ్యవస్థాగత గృహాల విభాగం కింద సమీకరించనున్నారు. - ఎన్పీఆర్ బుక్లెట్పై రాష్ట్రం/జిల్లా/తహసీల్/తాలుకా/పోలీస్ స్టేషన్/డివిజన్ బ్లాక్/సర్కిల్ బ్లాక్/మండలం/పట్టణం/గ్రామం పేర్లతో వాటికి సంబంధించిన కోడ్లు ముద్రించి ఉండనున్నాయి. వార్డు, హౌస్హోల్డ్ బ్లాక్ నంబర్, సబ్బ్లాక్ నంబర్, పిన్కోడ్ వంటి వివరాలు సైతం ఉండనున్నాయి. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
ఎన్యూమరేటర్ సస్పెన్షన్
► స్మార్ట్ పల్స్ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం ►విజయనగరం మున్సిపాలిటీలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే తుది దశకు చేరుకుందని, ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని ప్రజలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ వివేక్యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని పలుప్రత్యేక శిబిరాల్లో చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిధిలో గల లంకాపట్నం ఆది ఆంధ్ర మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్ను పరిశీలించారు. అక్కడ సర్వే కోసం ప్రజలెవ్వరు రాకపోగా... నియమించిన ఇద్దరు ఎన్యూమరేటర్లలో విధులకు గైర్హాజరైన త్రినాథ్ను విధుల నుంచి సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ ఇంజినీర్ను ఆదేశించారు. అదేవిధంగా 10వ వార్డులోని ఆదిభట్ల నారాయణ దాసు పురపాలక ప్రాథమిక పాఠశాలలో, 20వ వార్డులోని జొన్నగుడ్డి వినాయకనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ను పరిశీలించారు. ఈ సందర్భంగా 20 వ వార్డకు కేటారుుంచిన ఇద్దరు ఎన్యూమరేటర్లు 209 మందిని సర్వే చేయాల్సి ఉండగా.. మరో 94మంది సర్వే పరిధిలోకి రావాల్సి ఉన్నట్లు వివరించారు. తరువాత 30 వ వార్డు పరిధిలోని కంటోన్మెంట్ హిందూమున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్ను పరిశీలించారు. సర్వే చేపడుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో సర్వే పరిధిలోకి రాకుండా మిగిలిపోరుున వారి కోసం ఈనెల 19 నుంచి 23వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ కార్యాలయాలతో పాటు పట్టణ పరిధిలో వార్డు పోలింగ్ బూత్లలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారంతా విధిగా వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెనుక మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, విజయనగరం తహసీల్దార్ శ్రీనివాసరావు, టౌన్ప్లానింగ్ అధికారి శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ముగిసిన ప్రజాసాధికార సర్వే
- బుధవారం సాయంత్రంలోగా సర్వే ముగిసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసాధికార సర్వే ముగిసింది. మండలాలు, ఎన్యూమరేషన్ బ్లాక్ల వారీగా మొత్తం జనాభా ఎంత, ఎంత మందిని సర్వే చేశారు, ఎంత మందిని సర్వే చేయలేదు, ఇందులో మరణించినవారు, వలస వెళ్లినవారు, సర్వే పరిధిలోకి రానివారు, సర్వేకు దూరంగా ఉన్నవారు తదితర వివరాలను తెలియజేస్తూ సర్వే ముగించినట్లు బుధవారం సాయంత్రంలోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లు ముందుగా ఈ విధమైన సర్టిపికెట్లు తహసీల్దారుకు ఇవ్వాలి. దీనిని బట్టి తహసీల్దార్లు సర్వే ముగిసినట్లు సర్టిపికెట్ ఇవ్వాల్సి ఉంది. అర్బన్ ప్రాంతాల్లో ఈ నెలాఖరుతో సర్వేను ముగించే అవకాశం ఉంది. డిసెంబరు నుంచి సర్వే నివేదిక ప్రకారం పథకాలు అమలవుతాయి. -
ఎన్యూమరేటర్లపై దాడి
నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లపై నెల్లూరు బాలాజీనగర్ ప్రజలు కొందరు దాడి చేశారని, దీంతో సర్వే నిలిపివేశామని బాధితులు శుక్రవారం జేసీ ఇంతియాజ్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్వీఆర్సీ శేఖర్రావు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారను. బాలజీనగర్లో సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఐడీ పత్రాలు చూపించండని, కులం చెప్పమని స్థానికులను అడిగితే మీకేందుకు చెప్పాలని ప్రజలు సిబ్బందిని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. దీంతో సర్వే చేయడానికి ఎన్యూమరేటర్ల భయపడుతున్నారన్నారు. సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను పొగోట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎన్యూమరేటర్లకు తెలిపారు. సర్వే నిలిపివేయకుండా కొనసాగించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. -
నగరంలో రెండు సర్వేలు..
♦ ఎన్యూమరేటర్లకు సహకరించండి ♦ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత పౌరుల జాతీయ రిజిస్టరు తయారీలో మొదటి అంకమైన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కోసం జరుగుతున్న ఇంటింటి సర్వేలో సిబ్బందికి తగిన విధంగా సహకరించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు కోరే వ్యక్తుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన స్థలం, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, వృత్తి, జాతీయత, చిరునామా తదితర వివరాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వే జరుగనుంది. 19.71 లక్షల ఓటర్ల పునః పరిశీలన.. ఓటర్ల తుది జాబితా మే 31న విడుదల చేయనున్నందున స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ కింద ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా చిరునామా మారినవారు, మరణించిన వారు, డూప్లికేట్లను జాబితాలోంచి తొలగిస్తారు. మే 15 వరకు మార్పుచేర్పులతో కూడిన తుది జాబితాను రూపొందించి, 31వ తేదీన వెలువరిస్తారు. గతంలో జాబితాలోంచి తొలగించిన 19.71 లక్షలమంది ఓటర్లకు సంబంధించిన వివరాలను పునః పరిశీలిస్తారు. మృతులు, చిరునామా మారిన వారు, అనర్హులు తదితరులను గుర్తిస్తారు. అర్హులుంటే జాబితాలో చేరుస్తారు. ఇందుకుగాను బూత్లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. అనర్హులను తొలగించేందుకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు నోటీసులు జారీ చేస్తారు. మే 10లోగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులు, జాబితాలో పేరు స్పెల్లింగ్లలో పొరపాట్లు తదితరమైన వాటికి సంబంధించి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. 15వ తేదీలోగా అనర్హులను, చిరునామా మారినవారి పేర్లు తొలగిస్తారు. 18న అనుబంధ జాబితా రూపొందిస్తారు. 20 తేదీన జాబితాను ప్రచురిస్తారు. 21 వ తేదీనాటికి ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. 23వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మే 31న ఓటర్ల తుది జాబితాను వెలువరిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లకు వచ్చే బూత్లెవెల్ అధికారులకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాబితా లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని, అర్హులైన వారు జాబితాలో పేర్లు లేకుంటే నమోదు చేయించుకోవాలని, చిరునామా మార్పులు, ఫొటోలు, పేర్లలో పొరపాట్లు దొర్లినా సవరించుకోవచ్చునని సూచించారు. -
‘సర్వే’త్రా ఫిర్యాదుల వెల్లువ
ఘట్కేసర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. సర్వేరోజు రాత్రి 9 గంటలకు వరకు కూడా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు క్లస్టర్ అధికారుల ముందు నిరసనలు తెలిపారు. సర్వే సజావుగా సాగిందనుకున్న అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై పరిశీలిస్తున్నారు. మండలంలో 72,961 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లకు అప్పగించారు. 68,593 కుటుంబాల సర్వే పూర్తితో 104.31 శాతం నమోదు అయిందని, 4,368 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తహసీల్దార్ విష్ణువర్ధన్రెడ్డి ప్రకటించారు. నివేదికలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తోంది. సర్వే రోజు రాత్రి వేలాది మంది తమ ఇళ్లకు నంబర్లు వేయలేదని తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. నమోదు కాని ఇళ్లు తేలిందిలా..! ఇంటింటి సర్వే 104.31 శాతం పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నా ఇంకా మిగిలిన ఇళ్లు ఎక్కడివన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి నంబర్లను కేటాయించే సమయంలో ఇంట్లో ఉన్న అన్ని కుటుంబాలకు విడిగా నంబర్లు ఇవ్వకపోవడం, అద్దెకున్న వారి వివరాలను ఇంటి యజమానులు తెలపకపోవడం, ఎన్యూమరేటర్ల దగ్గర నమోదు పత్రాలు లేకపోవడంతోనే గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ సిబ్బంది నంబర్లు కేటాయించే సమయంలో ఇంటికి ఒక నంబర్ను ఇవ్వగా సర్వే రోజు మాత్రం అదే ఇంట్లో పెళ్లి అయిన ప్రతి జంట విడిగా నమోదు చేయించుకున్నారు. దీంతో ఇళ్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎన్యూమరేటర్ల దగ్గర ఉన్న నమోదు పత్రాలు కూడా అయిపోయాయి. ఎన్యూమరేటర్లు తిరుగు ముఖం పట్టడంతో చాలా ఇళ్లు మిగిలిపోవడానికి కారణమైనట్లు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి నమోదు కాని ఇళ్లు సుమారు 2 వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి సర్వే చేపట్టి అందరినీ పరిగణలోకి తీసుకుని కుటుంబ వివరాలను నమోదుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో ఫిర్యాదు చేయండి... సర్వేలో పేర్లు నమోదు కాని వారు తమతమ పంచాయతీ కారాలయాల్లో ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఒక్క బోడుప్పల్ పంచాయతీ పరిధిలోనే సుమారు 800లకు పైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 4వేల కుటుంబాలు సర్వే కాకుండా మిగిలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
సర్వే తీరిలా..
సాక్షి, సిటీబ్యూరో/నెట్వర్క్: మలక్పేట్లోని ఓల్డ్మలక్పేట్, శంకర్నగర్, మూసారంబాగ్, అజంపుర, సైదాబాద్, అక్బర్బాగ్, యాకుత్పురా ఐఎస్సదన్, మాదన్నపేట్లోని కొన్ని కాలనీలకు ఎన్యూమరేటర్లు రాలేదు. దీంతో శంకర్నగర్ , శ్రీసాయినగర్, ఐఎస్సదన్లలో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. నమూనా పత్రాలను తగులబెట్టారు. శంకర్నగర్, ఓల్డ్మలక్పేట్ తదితర ప్రాంతాల్లో సర్వే పత్రాలు అయిపోవడంతో కిరాయి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాల నమోదుకు ఎన్యూమరేటర్లు నిరాకరించారు. హయత్నగర్ డివిజన్లోని శుభోదయ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. హస్తినాపురం సెంట్రల్ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో కాలనీవాసులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సర్వే పుస్తకాలు తెచ్చుకుని వారే సర్వే సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు. మన్సూరాబాద్ డివిజన్ బండ్లగూడ రాజీవ్ స్వగృహలో 500 కుటుంబాలు నివసిస్తున్నా, అక్కడికి ఎన్యూమరేటర్లు రాలేదు. కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఫారాలు తెచ్చుకుని నింపి అధికారులకు అందజేశారు. కొన్ని ఇళ్ళకు ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. ఇంతకుముందు ఇచ్చిన చెక్లిస్ట్ల ఆధారంగానే దరఖాస్తులు నింపుకున్నారు. కనీసం ఇంటి యజమానుల సంతకాలు కూడా తీసుకోలేదు. సర్వే హైలెట్స్..ముషీరాబాద్: ఎన్యూమరేటర్ల కోసం జనం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. అడిక్మెట్, ముషీరాబాద్, కవాడిగూడ, దోమల్గూడ, భాగ్లింగంపల్లి డివిజన్ల పరిధిలో సుమారు 80 శాతం సర్వే జరిగినట్లు అధికారుల అంచనా. భోలక్పూర్ డివిజన్లో సర్వే అధ్వానంగా జరిగింది. 13 మంది ఎన్యూమరేటర్లు, మరో 164 మంది సహాయ ఎన్యూమరేటర్లు సర్వే విధులకు డుమ్మా కొట్టారు. తమ వీధుల్లోకి ఎవరూ రాకపోవడంతో జనం అయోమయానికి గురయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఎంపీలు నంది ఎల్లయ్య, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, పీసీసీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డిలు వివరాలు నమోదు చేసుకున్నారు. అంబర్పేట్: అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో సర్వేపై అయోమయం నెలకొంది. పాతనల్లకుంట మేదర్బస్తీలో ఎన్యూమరేటర్లు ఒకే చోట కూర్చుని సర్వే ఫారాలు నింపడంతో స్థానికులు వారి చుట్టూ గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా వివరాలు నమోదు చేసుకున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేటలోని ప్రేమ్ నగర్, పటేల్నగర్, చెన్నారెడ్డినగర్, బాపు నగర్, ఎంసీహెచ్కాలనీ తదితర ప్రాంతాలలో సాయంత్రం వరకూ సర్వే సిబ్బంది రాకపోవడంతో జనమంతా వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. బర్కత్పురలోని తన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి పూర్తి వివరాలను అందజేసి సర్వే పత్రంపై సంతకం చేశారు. గోల్నాక డివిజన్లోని ఖాద్రిబాగ్లో సగం ఇళ్లలో సర్వే చేపట్టిన సిబ్బంది తమ దగ్గర ఉన్న సర్వే పుస్తకాలు అయిపోయాయని చెప్పి చేతులెత్తేశారు. అక్కడి కొన్ని ఇళ్లలో సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. అన్నపూర్ణనగర్, మారుతీ నగర్, శాంతినగర్, అంబేద్కర్నగర్ తదితర బస్తీలలో సర్వే జరుగలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అబిడ్స్: సుల్తాన్బజార్, జాంబాగ్, గౌలీగుడ, ఉస్మాన్గంజ్, మాలకుంట ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాకపోవడంతో అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని స్థానికులు ముట్టడించారు. మంగళవారం రాత్రి అబిడ్స్లోని 8వ సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది జీహెచ్ఎంసీ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ డౌన్డౌన్ అంటూ, కేసీఆర్ డౌన్డౌన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సర్వే సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహించిన కురుమ బస్తీ వాసులు నమూనా సర్వే ఫారాలను తగులబెట్టారు. ఎన్యూమరేటర్తో అసభ్య ప్రవర్తన తార్నాక : ఎన్యూమరేషన్ కోసం వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి ద్వంద్వార్థాలతో మాట్లాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. రామంతాపూర్లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది. తీవ్రమనస్తాపానికి గురైన బాధితురాలు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. దీంతో మునిసిపల్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకొచ్చి విచారిస్తున్నారు. -
భోజనం ఎలా.. ఇళ్లకు వెళ్లేదెలా?
కీసర:వారంతా విద్యార్థులు.. సమగ్ర సర్వేలో స్వచ్ఛందగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వే చేశారు. వారికి మధ్యాహ్నం భోజన వసతి కల్పించిన అధికారులు సర్వే ముగిశాక వారిని విస్మరించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. రాత్రివేళ తాము ఇంటికి ఎలా చేరుకోవాలి.. భోజనం ఎక్కడ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ.. మండలంలోని అహ్మద్గూడ గ్రామంలో ఆందోళనకు దిగారు. సమగ్ర సర్వే కోసం తామంతా స్వచ్ఛందంగా తరలి వచ్చామని.. తమ కోసం ఆలోచించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ బృందాన్ని ప్రభుత్వ అధికారులను వినియోగించుకునే ప్రభుత్వం వారికి సకల ఏర్పాట్లు చేస్తుందని వారికంటే తక్కువ తామేం చేశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో విద్యార్థినులు చాలా మంది ఉన్నారని ... వారి పరిస్థితి ఏంటని అన్నారు. తమ నిరసనపై స్థానిక అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎన్యూమరేటర్లను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తామన్నారు. -
సమగ్ర సర్వేకు ఫారాల కొరత
పరిగి: సమగ్ర కుటుంబ సర్వేకు ఫారాల కొరత ఏర్పడింది. వారం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తున్నా సర్వే రోజున గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా సర్వే ఫారాల కొరతతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే కోసం ముందుగా ఇళ్లకు నంబర్లు సక్రమంగా వేయకపోవటంతో ఈ వివాదం తలెత్తింది. ప్రధానంగా ఈ సమస్య అన్ని గ్రామాల్లోనూ కనిపించినప్పటికీ పరిగి పట్టణంతో పాటు పరిగి అనుబంధ గ్రామమైన మల్లెమోనిగూడలో గ్రామస్తులు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. మల్లెమోనిగూడలో ఏకంగా రోడ్లపైకి వచ్చి అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇంట్లో ఐదారు కుటుంబాలు ఉండగా సరైన సమాచారం తీసుకోకుండా ఒక నంబర్ మాత్రమే వేశారు. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు అందజేశారు. లిస్టులో లేని ఇళ్లను సర్వే చేసేందుకు నిరాకరించటంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషుద్దీన్ తదితరులు మల్లెమోనిగూడను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం స్పందించిన అధికారులు అదనంగా ఫారాలు పంపించి అందరి ఇళ్లు సర్వే చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. ఇదే సమయంలో అదనంగా 1500 సర్వే ఫారాలు జిరాక్స్ తీయించి పరిగితో పాటు కొరత ఉన్న మండల పరిధిలోని గ్రామాలకు పంపించారు. -
సర్వే సక్సెస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతమైంది. మంగళవారం ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించాల్సి ఉండడంతో అధికారగణం అంతా తెల్లవారుజాము నుంచే విధుల్లో తలమునకలైంది. ఉదయం 6 గంటల కల్లా మండల కేంద్రాలకు హాజరైన సిబ్బంది..అల్పాహారం ముగించుకుని సర్వేకు ఉపక్రమించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైన సర్వే ప్రక్రియ.. రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 7.89 లక్షల కుటుంబాలున్నట్లు భావించినయంత్రాంగం..రాత్రి వరకు 7.17 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ.. వారి వివరాలు సేకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తంగా 27,675 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 90 శాతం జనాభా నుంచి వివరాలు సేకరించారు. జిల్లాలో అధికంగా మర్పల్లి మండలంలో 97.41 శాతం కుటుంబాల వివరాలు సేకరించారు. ఆతర్వాత యాలాల మండలంలో 89.14 శాతం, ఇబ్రహీంపట్నంలో 88.9 శాతం, తాండూరు గ్రామీణంలో 88.89 శాతం వివరాలు సేకరించి అగ్రభాగంలో నిలిచాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ గ్రామంలో అతి తక్కువగా 65.25 శాతం వివరాలు నమోదు కాగా, హయత్నగర్ గ్రామీణంలో 66.91 శాతం సర్వే పూర్తయింది. అక్కడక్కడా అయోమయం.. గందరగోళం కొన్నిచోట్ల సర్వే ప్రక్రియ గందరగోళంగా మారింది. ఒకే గృహంలో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ.. కేవలం ఒకరి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. తాండూరులో ఏకంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే గృహాల నమోదులో భాగంగా వేసిన నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలపడంతో కొంత అయోమయం నెలకొంది. సర్వేలో ప్రధానాంశాలివీ... సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాకు చెందిన ప్రముఖుల ఇళ్ళను ఎన్యూమరేటర్లు సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జె.ఎం లింగ్డో, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. తాండూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కిరాయిదారులను రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన ఓనర్లు మంగళవారం హడావుడిగా ఇళ్లకు చేరి సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో నిన్నటివరకు ఇక్కడే నివాసమున్న కిరాయిదారుల వివరాలు రికార్డు చేయలేదు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఎన్యూమరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో స్థానికులు రూట్ఆఫీసర్ను నిలదీశారు. ఈక్రమంలో వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో సదరు అధికారిణి తాను సర్వే చేయలేనంటూ మున్సిపల్ కమిషనర్కు రిపోర్టు చేశారు. పరిగిలో స్థానికంగా నివాసం ఉండని పలువురు.. మంగళవారం ఉదయం కల్లా వారి సొంతింటి ముందు హాజరై ఎన్యూమరేటర్లకు వివరాలిచ్చారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చిన కుల్కచర్ల మండలం ఆలుగడ్డతాండా వాసి పాముకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా మోమిన్పేట మండలంలో బూర్గుపల్లితాండా వాసి రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందాడు. హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులు వారి ఇళ్లను కిరాయికిచ్చారు. తాజాగా సర్వే నేపథ్యంలో వారిని హడావుడిగా ఖాళీ చేయించిన ఓనర్లు.. వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫలితంగా కిరాయిదారుల వివరాలు రికార్డులోకి రాలేదు. -
సర్వే..‘ఘన’ గణ
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే-2014లో భాగంగా గ్రేటర్ నగరం కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా.. ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ సహకరించని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి స్పందించారు. విధులు మానుకొని ఇళ్లవద్దే వేచి చూస్తూ ఎన్యూమరేటర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. రాత్రి 10 గం టల వరకు కూడా సర్వే జరిగినప్పటికీ.. ఇంకా చాలామంది నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. గతంలోని కర్ఫ్యూలను, బంద్లను మరిపిస్తూ నగరం బోసిపోయింది. గ్రేటర్లో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా.. ప్రస్తుతమది 20.24 లక్షలకు చేరి ఉండవచ్చునని అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేకపోయారు. వెళ్లినప్రాంతాల్లో వారికప్పగించిన కుటుంబాల కంటే లెక్కకుమిక్కిలిగా కుటుంబాలు కనిపించడంతో శక్తికి మించి పనిచేశారు. పెరిగిన రద్దీతో మరోవైపు ఒకే చోట కూర్చొని సర్వే ఫారాలు నింపారు. రాత్రి 10.30 గంటల వరకు 15.35 లక్షల కుటుంబాల సర్వే జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. బుధవారం కానీ.. పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి లేదు. మిగిలిపోయిన ప్రక్రియను బుధవారం ముగించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ సూచించారు. ఎవరెంతగా శ్రమించినా ప్రజాస్పందన ముందు నిందలపాలు కాక తప్పలేదు. ఫారాలు అందలేదని.. ఎన్యూమరేటర్లు రాలేదనే ఫిర్యాదుల వరద ఆగలేదు. సర్వే ముగిశాక అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా పాల్గొన్నవారికి చాలాచోట్ల రెమ్యునరేషన్ అందలేదంటూ ఘర్షణలు.. గందరగోళాలు చోటుచేసుకున్నాయి.నిర్బంధాలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో కొందరు సర్వే ఫారాలు నోడల్అధికారులకు అందజేయకుండా ఇళ్లకు తీసుకువెళ్లారు. ఒకే రోజు సర్వే కావడంతో తమ వివరాలు నమోదు కాావేమోననే అందోళన పలువురిలో కనిపించింది. జీహెచ్ఎంసీ చేసిన ప్రీవిజిటల్లు.. శిక్షణలు తగిన ఫలితాన్నిచ్చినప్పటికీ ఊహించని స్పందనతో చేసిన ఏర్పాట్లు సరిపోలేదు.దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శల వర్షం గుప్పించారు. సర్వే జరగని ఇళ్లు.. తాళాలు వేసిన ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించి.. తదుపరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. కుటుంబాల సంఖ్యకు సరిపోని సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలు అందించేందుకు ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చినా.. అందరి వివరాలూ సేకరించేందుకు సిబ్బంది సరిపోలేదు. లెక్కకుమిక్కిలిగా ఉన్న కుటుంబాలు.. జనాభాకు సరిపడా లేని ఎన్యూమరేటర్లతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ వివరాలు తీసుకోవాలంటూ రాత్రి పొద్దుపోయేంతదాకా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో సవాల్గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని కమిషనర్ సోమేశ్కుమార్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 15.24 లక్షల కుటుంబాలు ఉండగా, రాత్రి 8 గంటల వరకు 15.5 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. ఎన్నో బృందాలు రాత్రి 9.30 గంటల వరకూ సర్వే నిర్వహించినందున బుధవారం కానీ పూర్తి వివరాలు అందే పరిస్థితి లేదని చెప్పారు. పూర్తి సహకారమందించిన నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, సిబ్బందికి కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మిగిలినపోయిన ఇళ్లతో పాటు తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి విషయంలో వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సర్వేలో భాగంగా ఇంకా మిగిలిపోయిన పనులేవైనా ఉంటే బుధవారం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారన్నారు. -
వలస జీవుల తంటాలు
మోర్తాడ్:మోర్తాడ్ మండలం తొర్తికి చెందిన పోచయ్య ఉపాధి కోసం ముంబాయిలో ఉంటున్నాడు. సమగ్ర సర్వే కోసం రెండు రోజుల కింద స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే, స్థానికంగా నివాసం ఉండటం లేదం టూ ఆయన వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు స్పష్టం చేశారు. దోంచందకు చెందిన సంజీవ్కుమార్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నిజామాబాద్లో నివాసం ఉంటున్నాడు. సర్వేలో వివరాలను న మోదు చేయించుకునేందుకు కుటుంబం సహా స్వగ్రామానికి వచ్చారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న వా రి వివరాలు సేకరించడానికి తమకు ఇబ్బంది లేదని, నిజామాబాద్లో ఉంటున్నవారి వివరాలను మాత్రం ఇక్కడ సేకరించమని సర్వే బృందం తేల్చి చెప్పింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా మంది నిరాశకు గురయ్యారు. ఎవరూ పట్టించుకోక సర్వే కోసం ఎన్నో తంటాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వా రి కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక ముంబాయి, పూణే, భీవండితోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లిన తెలంగాణవాసులు సర్వే కోసం సొంత ఊళ్లకు వస్తే వివరాలను న మోదు చేయక పోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం చో టు చేసుకుంది. తమ వివరాలను నమోదు చేయడం లేదంటూ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినా ఫలితం లే కపోయింది. అందుబాటులో ఉన్న అధికారులకు ఫో న్ చేస్తే వారు విసుక్కున్నారు. కొందరు అధికారులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో జనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్టిక్కర్ల గొడవ సర్వే నిర్వహించడానికి గుర్తింపు కోసం స్టిక్కర్లను అతికించారు. కొన్ని ఇళ్లకు అతికించలేదు. స్టిక్కర్లతో సంబంధం లేకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా, స్టిక్కర్లు లేని కారణంగా ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలను సర్వే బృందం నమోదు చేయలేదు. స్టిక్కర్లు అతికించిన రోజున సిబ్బంది నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే సర్వే రోజున వివరాలను సేకరించారు. సర్వే విధివిధానాలు అర్థం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వేపై ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రచారం చేసినా సర్వేలోని ఆంశాలు, వివరాలు సేకరించిన తీరుతో జనంలో అపోహలు మరింత ఎక్కువయ్యాయి. -
సర్వే సక్సెస్
ప్రగతినగర్ : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతంగా జరిగిందని కలెక్టర్ రొనాల్డ్రాస్ తెలిపారు. ప్రగతిభవన్లో ఆయన రాత్రి విలేకరులతో మాట్లాడా రు. బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు, అర్హులందరికీ ప్రభుత్వ, సంక్షేమ పథకాలను అందించేందుకు చేపట్టిన సర్వే ఊరురా పండుగలా సాగిందన్నారు. గ్రామాలు, మండలాలలో సాయంత్రం ఆరు గం టల వరకు వంద శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సి పాలిటీలలో ఏడు గంటల వరకు సర్వే పూర్తి అయిందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం అక్కడక్కడా పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దామని తెలి పారు. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నందున, కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నం దున అక్కడక్కడ స్టిక్కర్ల కోసం ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. మధ్యాహ్నం ఈ సమస్యను గుర్తించి తిరిగి 600 మంది ఎన్యూమరేటర్లను ఆయా డివిజన్ల పరి ధికి పంపించామన్నారు. మహారాష్ట్ర, బీవండీ, పూణె, ముంబాయి, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో ప్రీ స్టిక్కర్ల కొరత ఏర్పడిందన్నారు. ఇంటి యజమానులు కొందరు కేవలం ఒక్క స్టిక్కరు మాత్ర మే వేయించుకున్నారని, అద్దెకు ఉన్న వారి వివరాల ను దాచి ఉంచారని పేర్కొన్నారు. జిల్లాలో 6,95,205 కుటుంబాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి రావడంతో మంగళవారం ఉదయానికి అవి7.10 లక్షలకు చేరుకున్నాయన్నారు. సర్వే పూర్తి డాటాను 13 ప్రాంతాలలో ఆన్లైన్ ద్వారా సీడింగ్ చేయనున్నామన్నారు. వీటి కోసం హై స్పీడ్ సాఫ్ట్ వేర్తో కూడిన రెండు వేల కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు సంబంధించిన పూర్తి డాటాను ఈ నెల 31లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వేను జిల్లా ప్రత్యేక అధికారి జనార్దన్రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నాని కలెక్టర్ వివరించారు. -
సమగ్ర సర్వేలోసకల జనులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉదయం పది గంటల వరకు సర్వే 22 శా తంగా నమోదైంది. అప్పటి వరకు మందకొడి గా సాగిన సర్వే ఆ తర్వాత వేగం పుంజుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు 5,63,275 కుటుంబాలు (81శాతం) తమ వివరాలను నమోదు చేయించుకున్నాయి. కలెక్టర్ రొనాల్డ్రాస్ అదనంగా మరో 600 మంది ఎన్యూమరేటర్లను ప్రత్యేకంగా రంగంలోకి దింపడంతో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యానికి చేరుకుంది. అయితే, జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తమ పేర్లు లేవని, తమ ఇంటికి స్టిక్కర్లు వేయలేదని, స్టిక్కర్లు వేసినా ఎన్యూమరేటర్లు వివరా లు నమోదు చేయలేదని ప్రజలు ఆందోళనకు దిగారు. ఎలుపుగొండ ఎంపీడీఓ రవీశ్వర్గౌడ్, కామారెడ్డి మున్సిపల్ క మిషనర్ బాలోజీ నాయక్ తదితరులను నిర్బంధించారు. ఎడపల్లిలో నిర్బంధించిన ఎన్యూమరేటర్లను ఉన్నతాధికారులు విడిపించారు. చెదురు మదురు సంఘటనలు మినహా సర్వే ప్రశాంతంగా ముగిసింది. సర్వే సందర్భంగా జిల్లా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూరు, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ తదితర పట్టణాలలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి ఉంచారు. వాహనాలు తిరగలేదు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్ల వద్దనే ఉండి వ్యవసాయ శాఖ మంత్రి పరిగి శ్రీనివాస్రెడ్డి ఆయన స్వగ్రామం బాన్సువాడ నియోజకవర్గం పోచారంలో పేరు నమోదు చేయించుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూరు మండలం సిర్పూరులో వివరాలు నమోదు చేసుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ పాంగ్రా పరిధిలోని బ్యాంకు కాలనీలో వివరాలు నమోదు చేసుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే అహ్మద్ షకీల్, ఆయన కుటుంబసభ్యులు 35 వార్డులో నమోదు చేసుకున్నారు. నవీపేట మండలం సిరాన్పల్లికి చెందిన మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి ఇంటికి తాళం ఉంది. ఆయన హైదరాబాద్లో సర్వేలో పాల్గొన్నారని సమాచారం. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూర్ మండలం బస్వాపూర్లో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డోన్గాంలో, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మహమ్మద్నగ ర్లో వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే జాబితాలో పేర్లు లేవని నిరసనలు జిల్లా అంతటా సర్వే సందడి...పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. దూరం ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు స్వగ్రామాలకు చేరుకుని సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదని, సర్వే జాబితాలో తమ పేర్లు లేవని నిరసన వ్యక్తం చేశారు. రెంజల్ మండలం నీలా, ఈరన్నగుట్ట తదితర గ్రామాలలో ప్రజలు గ్రామ పంచాయతీలను ముట్టడించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నమోదు చేస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. మాచారెడ్డి మండలం ఎలుపుగొండలో ఎంపీడీఓ రవీశ్వర్గౌడ్తోపాటు ఐ దుగురు సాక్షరభారత్ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో వారు గ్రామ పంచాయతీలోకి వెళ్లి త లుపులు వేసుకున్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్లో, పరారీ లో ఉన్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ధనుల వెంకట్రాములు సర్వే కోసం వచ్చి పోలీసులకు చిక్కాడు. కుటుంబాల సంఖ్య కొత్తగా చేరిన వారితో 7.10 లక్షలకు పెరిగిందని, కొద్దిగా ఆలస్యం జరిగినా నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశామని కలెక్టర్ రొనాల్డ్రాస్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు బుధవారం సెలవు ప్రకటించారు. -
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
శ్రీరాంపూర్ : సమగ్ర కుటుంబ సర్వేతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సర్వే సందర్భంగా కార్మికులు ఇంటి వద్దే ఉండాలని యాజమాన్యం మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. దీంతో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో మైనింగ్ ఆపరేషన్స్ నిలిచాయి. భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. జిల్లా పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు. ఈ రీజియన్ పరిధిలో మొత్తం 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో సుమారు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రీజియన్లోని గనుల్లో ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి సుమారు 30 వేల టన్నులు ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వేతో ఈ ఉత్పత్తిని సింగరేణి నష్టపోయింది. తద్వారా సుమారు రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లింది. వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతో కంపెనీపై రూ.3 కోట్ల వేతన భారం పడింది. కాగా, రీజియన్ నుంచి సుమారు 1500 మంది ఉద్యోగులను కంపెనీ ఎన్యూమరేటర్లుగా పంపింది. మొదటిసారి.. సింగరేణిలో మొదటి సారిగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా ఇచ్చే సెలవును యాజమాన్యం ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇవ్వడం ఇదే ప్రథమం. సర్వే కోసం కార్మికులు చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఇతర ప్రాంతాల కార్మికులు, అధికారులు స్వస్థలాలకు తరలివెళ్లారు. సమ్మె వాతావరణం.. కార్మికులు రాక గనులపై సమ్మె వాతావరణం కనిపిం చింది. మ్యాన్రైడింగ్, టబ్బులు, తట్టాచెమ్మస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గుపెళ్ల కూడా బయటికి రా లేదు. గనుల ముందు ఉన్న హోటళ్లూ మూసి ఉన్నా యి. సెక్యూరిటీ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు వంటి అత్యవసర సిబ్బంది కొందరే విధుల్లో ఉన్నారు. ఓసీపీల్లోనూ ఓవర్బర్డెన్ మట్టి పనులు నిలిచిపోయాయి. సీహెచ్పీలు, డిపార్ట్మెంట్లు, వర్క్షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లారీలు ఉత్పత్తి లేక యార్డుకే పరిమితమయ్యాయి. ఇబ్బంది పడ్డ కార్మికులు..... సర్వే సందర్భంగా కార్మికుల్లో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ కొందరు బినామీ పేర్లతో కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత సర్వేలో ఏ పేరు చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు కొ నుక్కొని చేస్తున్నవారు, వేరే కులంతో పనిచేస్తున్నవారు ఇక్కట్లకు గురయ్యారు. అంతేకాకుండా కొత్తగా క్వార్టర్లు వచ్చినవారు, క్వార్టర్లు మారినవారు పాత అడ్రస్ వద్దకు వెళ్లి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంటి నంబర్ కుదరకపోవడం, ఎన్యూమరేటర్ల వద్ద పాత పేర్లు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. క్వార్టర్కు ఒకే నంబర్ ఇవ్వడం, ఇంటి మొత్తాన్ని ఒకే యూనిట్గా రాసుకోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. -
నంబర్లు లేవు.. నమోదు చేయలేదు..
బెల్లంపల్లి : అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్లంపల్లిలో కొన్ని కుటుంబాలు మంగళవారం కుటుంబ, ఆర్థిక, సామాజిక సమగ్ర సర్వేకు నోచుకోలేదు. ఎన్యూమరేటర్లు సదరు ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోలేదు. అధికారుల తప్పిదానికి తాము బలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వ వార్డు కాల్టెక్స్ ఏరియాలో 30 ఏళ్ల పైబడి నుంచి కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాసరి ఓదమ్మ, దాసరి జ్యోతి, గరిగ నాగరాజు, గరిగ నాగమణి, గరిగ వెంటేశ్వర్రావు, గరిగ వెంకటేశ్వరమ్మ, గరిగ శివ, గరిగ శోభ, కుడుపూడి నాగరాజు, కుడుపూడి రమాదేవి, ఉమామహేశ్వరి, అనుషాదేవి వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిలో కొందరికి సొంత గృహాలు ఉండగా.. మరికొందరు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరందరికి రేషన్, ఆధార్కార్డులు ఉన్నా సదరు వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లకు నంబర్లు వేయలేదు. దీంతో సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు వివరాల నమోదుకు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని సభ్యులు కోరినా ఎన్యూమరేటర్లు అంగీకరించలేదు. తమకు కేటాయించిన పేర్లు, ఇళ్ల నంబర్ల ఆధారంగానే సర్వే చేస్తామని తేల్చి చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 25వ వార్డులో.. 25వ వార్డులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక ఇంట్లో రెండు కుటుంబాలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఆ ఇంటికి ఒక సంఖ్య మాత్రమే వేయడం వల్ల మరో కుటుంబం వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు నిరాకరించారు. దీంతో వాగ్వాదం జరిగింది. వార్డు పరిధిలోని హన్మాన్బస్తీకి చెందిన పలువురు తాము నివసిస్తున్న ఇళ్లను పరిశీలించి బై నంబర్లు వేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న సూపర్వైజర్ లలిత అక్కడికి చేరుకోవడంతో ఆమెతో బస్తీ ప్రజలు వాగ్వివాదానికి దిగారు. సూపర్వైజర్ తన వద్ద ఉన్న కుటుంబ సర్వే కాపీలను ఎన్యూమరేటర్లకు ఇచ్చి సర్వే చేయాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. తాళ్లగురిజాలలో.. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామంలో కొందరు ఎస్టీల ఇళ్లకు సర్వేనంబర్లు వేయకపోవడంతో సదరు కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగలేదు. గ్రామంలోని నాయిని పెద్దులు, గొలిశెట్టి మల్లు, గొలి శెట్టి ఎల్లరాజు, నాయిని బక్కు, గొలిశెట్టి వెంకటేశ్, పల్లె లింగమ్మ, మంతెన నర్సయ్య, పల్లెకుర్తి లింగమ్మ తదితరులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎన్యూమరేటర్లు పేర్లు నమోదు చేసుకోలేదు. చివరికి మండల విద్యాధికారి డి.శ్రీధర్స్వామి అక్కడికి వచ్చి అదనపు సర్వే కాపీలను తెప్పించి వివరాలు నమోదు చేయిస్తామని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
సర్వే సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చిన్నచిన్న ఒడిదుడుకులు మినహా సజావుగా సాగింది. సర్వేకు విశేష స్పందన లభించింది. ప్రజలు కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారు. కుటుంబ యజమానితోపాటు, కుటుంబ సభ్యులు అంతా ఇంటి వద్దే ఉండి ఎన్యూమరేటర్కు ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ వివరాలు తెలిపారు. పట్టణవాసులు వివరాలు నమోదు చేసుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లగా పట్టణాలు బోసిపోయాయి. పల్లెలు ప్రజలతో కళకళలాడాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనాలు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్నగర్, బెల్లంపల్లి తదితర పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు బోసిపోయాయి. రాత్రి వరకూ కొనసాగిన సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే రాత్రి 11 గంటలు దాటే వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు 83.33 శాతం కుటుంబాల్లో సర్వే పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు 92 శాతం సర్వే పూర్తికాగా, సర్వే ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 99 శాతం కుటుంబాలను సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 7.89 లక్షల కుటుంబాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ మేరకు సర్వే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తన స్వగ్రామం జైనథ్ మండలం దీపాయిగూడలో తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఉట్నూర్ , మంచిర్యాల డివిజన్లలో పర్యటించి సర్వే తీరును పర్యవేక్షించారు. సర్వేలో ముందున్న గిరిజనం మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీ ఏరియాల్లోనే అత్యధికంగా ఎన్యూమరేషన్ నమోదు కావడం గమనార్హం. గోండు, కొలాం, మన్నేవార్ తదితర గిరిజన తెగల గిరిజనులు ఉత్సాహంగా తమ కుటుంబాల వివరాలను నమోదు చేసుకున్నారు. మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్లో సాయంత్రం ఆరు గంటల వరకే 90 శాతం కుటుంబాల సర్వే పూర్తయిందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. బోసిపోయిన బొగ్గుబావులు సింగరేణి కార్మికులతో సందడిగా ఉండే బొగ్గు బావులు బోసిపోయాయి. కేవలం కార్మికుల సమ్మె చేస్తున్నప్పుడు మాత్రమే నిలిచిపోయే బొగ్గు ఉత్పత్తి, ఇప్పుడు ప్రభుత్వమే సెలవు ప్రకటించడంతో గనులు ఒకరోజు మూతపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిందని, ఈ ఉత్పత్తి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుందని సింగరేణి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో సుమారు రూ.3 కోట్ల భారం పడుతుందని అధికారులు తెలిపారు. బాసరలో ఘననీయంగా తగ్గిన భక్తుల రద్దీ నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. వేకువజామున అమ్మవారికి అభిషేకం నిర్వహించిన పూజారులు సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు తమ నివాసాలకు వెళ్లిపోయారు. పలుచోట్ల ఆటంకాలు..ఆలస్యంగా ప్రారంభం... సర్వే ముందస్తు ఏర్పాట్లలో జరిగిన పొరపాట్ల కారణంగా జిల్లాలో పలుచోట్ల సర్వేకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లకు ఇంటి నంబర్లు దొరకక ఇబ్బంది పడ్డారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉన్నట్లు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు చెప్పడంతో ఒక్కో ఎన్యూమరేటర్ అదనంగా 5 నుంచి 15 కుటుంబాలను సర్వే నిర్వహించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల మండలంలో పలువురు తమ పేర్లు ప్రాథమిక సర్వే లిస్టులో లేవని, దీంతో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడం లేదని తహశీల్దార్, ఎంపీడీవోల దృష్టికి తీసుకురావడంతో వారు సంబంధిత ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. సర్వే చేసిన కొందరు ఎన్యూమరేటర్కు అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా వివరాలు నమోదు చేశారని పలు గ్రామాల వాసులు ఆరోపించారు. బోథ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్యూమరేటర్లు సర్వే ఆలస్యంగా ప్రారంభించారు. బోథ్ మండల కేంద్రంలోని ఏడో వార్డులో కొన్ని ఇళ్లకు అధికారులు నంబర్లు వేయకపోవడంతో సర్వే సాయంత్రం వరకు నిర్వహించలేదు. అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. తాంసి మండలం కప్పర్లలో ఒకే బ్లాక్ను ఇద్దరు ఎన్యూమరేటర్లకు కేటాయించారు. దీంతో గందరగోళానికి దారి తీసింది. బెల్లంపల్లిలోని కాల్టెక్స్, హన్మాన్బస్తీ 26వ వార్డులోనూ పలువురి ఇళ్లకు సీ నంబర్లు వేయకపోవడం వల్ల పలువురు ఆందోళన నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు కల్పించుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తాళ్లగురిజాల గ్రామంలో పలువురు ఎస్టీల ఇళ్లకు సీ నంబర్లు వేయలేదు. మరికొన్ని ఇళ్లకు బై నంబర్లు కూడా వేయకపోవడంతో ఎస్టీల పేర్లు, వివరాలు ఎన్యూమరేటర్లు నమోదు చేసుకోలేదు. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్లో ఒకే బ్లాక్ను ముగ్గురు ఎన్యూమరేటర్లకు విధులు అప్పగించడంలో రెండు గంటలు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. నిర్మల్ పట్టణంలో 97 మంది ఎన్యూమరేటర్లు సర్వే విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో అధికారులు స్పందించి ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శిక్షణ ఇప్పించి సర్వేకు పంపించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. ఆసిఫాబాద్లోని రావులవాడ, పెషాజీనగర్, రాజంపేట్, వాంకిడి మండలం కమ్మాల తదితర చోట్ల ఇంటి నంబర్లు దొరక్క సర్వేకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడగా, స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖానాపూర్లో కొన్ని గృహాలకు ముందస్తు నంబర్లు వేయకపోవడంతో ఇంటి యజమానులు ఆందోళనకు దిగారు. అధికారులకు విషయం తెలుసుకుని ఈ గృహాల్లో సర్వే చేశారు. సర్వేను కరెంటు కోతలు వదలడం లేదు. ఎన్యూమరేటర్లు ఒక్కో గ్రామంలో రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించారు. పూర్తి చేసిన ఫారాలను ఖానాపూర్ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కరెంటు లేకపోవడంతో ఫారాలను సెల్, టార్చిలైట్ వెలుతురులో అధికారులకు అందజేశారు. కొందరు బుధవారం ఉదయం ఇస్తామని వెళ్లిపోయారు. భైంసా పట్టణంలోని సంతోష్నగర్, సిద్దార్థనగర్లలో ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ముథోల్ మండలంలో సర్వే కోసం గ్రామాలకు ఎన్యూమరేటర్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు ఎన్యూమరేటర్లకు గాయాలయ్యాయి. కాగజ్నగర్ విద్యుత్ సబ్స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తి పట్టణంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్వేకు ఆటంకం కలిగింది. -
ఎన్యూమరేటర్ల నిర్బంధం
పెనుబల్లి: పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సుమారు 150 కుటుంబాలకు సర్వే నిర్వహించలేదు. దీంతో అందరికీ సర్వే పూర్తి చేసిన తర్వాతే ఎన్యూమరేటర్లు బయటకు వెళ్లాలంటూ గ్రామస్తులు వారిని మంగళవారం రాత్రి నిర్బంధించారు. అధికారుల నిర్లక్ష్యంతో కొందరి ఇళ్లకు అసలు స్టిక్కర్లు వేయలేదని, మరికొందరి ఇళ్లలో ఒకరి కంటే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ వారిని గుర్తించలేదని స్థానికులు ఆందోళనకు దిగారు. అందరినీ సర్వే చేసేంతవరకు కదలనీయబోమని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వీఎం బంజర్ ఎస్సై బి. పరుశురాం ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అందరి వివరాలు సేకరించిన తర్వాతే ఎన్యూమరేటర్లు వెళ్తారని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకూ గ్రామంలో సర్వే కొనసాగుతూనే ఉంది. -
మద్యం మత్తులో ఎన్యూమరేటర్
టేకులపల్లి : సమగ్ర కుటుంబ సర్వే చేయాల్సి ఎన్యూమరేటర్ మద్యం మత్తులో విధులకు డుమ్మా కొట్టిన సంఘటన టేకులపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సంపత్నగర్లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడికి 13వ బ్లాక్ బద్దుతండాలో ఎన్యూమరేటర్గా విధులు కేటాయించారు. సోమవారం రాత్రి అతను మిగిలిన వారితో కలిసి సర్వే సామగ్రిని సరి చూసుకున్నాడు. సంబంధిత పత్రాలు, బుక్లెట్ తీసుకున్నారు. కానీ అతను స్వగ్రామానికి వెళ్లకుండా బోడురోడ్డు సెంటర్లో ఉన్న పాత హీరోహోండా షోరూం వద్ద మద్యం తాగి రోడ్డు పక్కనే పడుకున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు సామగ్రి పంపిణీ కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా అతను వెళ్లలేదు. తిరిగి మద్యం తాగి అక్కడే పడుకున్నాడు. ఉదయం 7.30 నిమిషాల వరకు కూడా కేంద్రానికి వెళ్లలేదు. స్థానికులు అతనిని గమనించి అధికారులు సమాచారం అందించారు. దీంతో అతని స్థానంలో వెంటనే శకుంతల అనే వైద్యశాఖ ఉద్యోగిని ఎన్యూమరేటర్గా పంపించారు. ఈ విషయమై తహశీల్దార్ రమాదేవి వివరణ కోరగా ఉపాధ్యాయుడు కేంద్రానికి రాలేదని, రిపోర్టు కూడా చేయలేదని అన్నారు. అయితే ఆ వ్యక్తి మంగళవారం రాత్రి కూడా రోడ్డు పక్కనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
అ‘సమగ్ర’ సర్వే..!
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సమగ్ర కుటుంబ సర్వే గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డివిజన్స్థాయి అధికారులు శ్రద్ధ చూపినప్పటికీ ప్రాథమిక సర్వేలో జరిగిన లోపాలు ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు ముందుగా అంగన్వాడీ కార్యకర్తలతో సర్వే చేయించారు. ఈ సర్వేను వీఆర్వోలు పర్యవేక్షించారు. గుర్తించిన ఇళ్లకు ప్రత్యేకంగా నంబర్లు కేటాయిస్తూ ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించారు. కానీ కొంత మంది సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం నిర్వహించిన సమగ్ర సర్వేలో సమస్య తలెత్తింది. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోనే వందల సంఖ్యలో ఇళ్లకు స్టిక్కర్లు అందించకపోవడమే ఇందుకు నిదర్శనం. స్టిక్కర్లు ఉంటేనే సర్వే చేస్తామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో స్టిక్కర్లు లేని ఇళ్లవారు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్లో అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఈ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో వివరాలు నమోదు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అంతా గందరగోళమే... స్టిక్కర్లు అంటించని ఇళ్ల వారు ఈ విషయాన్ని ఆర్డీఓ, తహశీల్దార్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. సర్వేలో ఏ ఒక్కరు కూడా వివరాలు నమోదు చేయించుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో వారి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కాలనీలో ముగ్గురు ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని కూడా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. అయితే భద్రాచలం పట్టణంలో సరైన రీతిలో సర్వే లేకపోవటంతో రాత్రి 9 గంటల వరకూ కూడా ఇది కొనసాగింది. మరోపక్క కొంత మంది ఇళ్లకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ ఎన్యూమరేటర్లు వారి వివరాలు నమోదు చేయలేదు. దీంతో చాలా మంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా కాలనీల్లోని వారే కొందరు స్వయంగా మిగిలిపోయిన వారి వివరాలతో జాబితా తయారు చేసి అధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటినీ మరిచారు : భద్రాచలం ఎమ్మెల్యే సున్న రాజయ్య భగవాన్దాస్ కాలనీలో ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యే ఇంటికి స్టిక్కరు అతికించలేదు. దీంతో ఆ కాలనీకి వెళ్లిన ఎన్యూమరేటర్ ఎమ్మెల్యే సమాచారం సేకరించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఈ విషయాన్ని నేరుగా ఆర్డీఓ అంజయ్య దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్పురం మండలం సున్నంవారిగూడెంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా భద్రాచలంలోని సొంత ఇంట్లో తాను ఉంటూ ప్రజాప్రతినిధిగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. దీంతో ఆర్డీఓ అంజయ్య అప్పటికప్పుడు ఓ ఎన్యూమరేటర్ను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో సర్వేను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఈఓ మాధవరావు, ఎన్యూమరేటర్ను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఆయన సమాచారాన్ని సేకరించారు. స్టిక్కరు అతికించకపోవటంతోనే ఇటువంటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే రాజయ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుందరయ్య కాలనీ వాసులు నిరశన : భద్రాచలం పట్టణంలోని సుందరయ్య కాలనీలో స్థిర నివాసులమైన తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడమే కాకుండా సర్వే కూడా చేయలేదని కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఆ కాలనీ వాసులు డిగ్రీ కళాశాలకు వచ్చి అధికారుల వద్ద నిరశన తెలిపారు. స్టిక్కర్లు అతికించపోవడంతో వివరాలు నమోదు చేయలేమని ఎన్యూమరేటర్లు చెప్పారని వార్డు సభ్యురాలు మంగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి వివరాలు కూడా సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సర్వే సమాప్తం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నో అపోహలు, అనుమానాలు, పుకార్లతో పాటు ఎంతో ఉత్సుకత, ఆసక్తిని రేకెత్తించిన సమగ్ర కుటుంబ సర్వే - 2014 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉద యం 7 గంటలకు ప్రారంభమైన సర్వే తొలుత మందకొడిగా సాగి, మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా 40 శా తమే పూర్తయిన సర్వే సాయంత్రం ఆరు గంటల సమయానికి 80 శాతానికి చేరింది. మొత్తం మీద 90 శాతానికి పైగానే జరిగిందని అధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేశారు. ఖమ్మం కార్పొరేషన్తోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో సర్వే అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సర్వేలో సామాన్య ప్రజానీకంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ పార్టీల నాయకులు, ఇతర ప్రముఖులు తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్కు తమ వివరాలు ఇచ్చేంతవరకు ప్రజలు బయటకు రాకపోవడం, చాలా మంది ఆదివారమే తమ స్వగ్రామాలకు వెళ్లడంతో ఖమ్మంతో పాటు పలు పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొంత జనసమ్మర్థం కనిపించింది. సర్వే సందర్భంగా ఎన్యూమరేట ర్లకు కేటాయించిన ఇంటి నంబర్లలో గందరగోళం ఏర్పడడంతో పాటు ఇళ్లు దొరక్కపోవడంతో నా నా అవస్తలు పడాల్సి వచ్చింది. ఎన్యూమరేటర్లకు చాలా చోట్ల భోజన వసతి కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక, సర్వే సందర్భంగా జిల్లా ప్రజానీకమంతా ఎదుర్కొన్న సమస్య ‘స్టిక్కరింగ్.’ స్టిక్కర్ ఉన్న కుటుంబానికి సంబంధించిన సమాచారమే తీసుకుంటామని ఎన్యూమరేటర్లు చెప్పడంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. తల్లాడ, బూర్గం పాడు, ఖమ్మం నగరం, రఘునాథపాలెం.. ఇలా మెజార్టీ మండలాల్లో ప్రజలు తహశీల్దార్, మున్సిపల్ అధికారుల చుట్టూ పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రజలు తాము సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అధికారుల హామీతో సర్వే కొనసాగింది. జిల్లాలో జరిగిన సర్వే కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి నీరబ్కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టర్తో కలిసి సర్వే ను సమీక్షించారు. ఇక, ప్రజల ఫిర్యాదులతో అధికారుల ఫోన్లు హోరెత్తిపోయాయి. జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నెంబర్లకే 300 కు పైగా ఫోన్లు వచ్చాయి. తహశీల్దార్లు, ఇతర అధికారుల ఫోన్లయితే లెక్కే లేదు. చిన్న చిన్న అవాం తరాల నడుమ సర్వే సమాప్తం కావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వే జరిగిన తీరిది.. ఇల్లెందులో ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదంటూ సర్వే సిబ్బంది, అధికారులతో పలువురు వాగ్వాదానికి దిగారు. మండలంలోని రాఘబోయినగూడెం ముల్కనూర్ గ్రామంలో మున్నూరుకాపు వారికి కుల ధ్రువీకరణ పత్రం ఉంటేనే వివరాలు నమోదు చేస్తామని సిబ్బంది చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జోనల్ అధికారి విద్యార్థుల సర్టిఫికెట్లలో ఎలా ఉంటే అలాగే నమోదు చేయాలని సూచించడంతో సర్వే కొనసాగింది. టేకులపల్లిలో ఒక ఎన్యూమరేటర్ మద్యం సేవించి హంగామా సృష్టించాడు. సంపత్నగర్లో సర్వే సిబ్బందిని దింపి టేకులపల్లికి వస్తున్న వాహనం ఒక బాలుడిని ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బయ్యారం మండలం ఇసుక మిది గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని, పోడు భూముల సాగు విషయంలో అటవీ అధికారుల వేధింపులపై చర్యలు తీసుకోవాలని సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చంద్రశేఖర్ జేసీతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. కామేపల్లిలోని 17 గ్రామపంచాయతీల్లో ఉదయం 8 గంటలకే సర్వే ప్రారంభమైంది. స్టిక్కర్లు అంటించని కుటుంబాలను మొబైల్ టీమ్ల ద్వారా సర్వే చేశారు. గార్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వే సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. వైరాలో కుటుంబాల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో స్టిక్కర్లు వేయలేదు. దీంతో అధికారులు మొబైల్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్యూమరేటర్లను పంపించి సర్వే నిర్వహించారు. కారేపల్లి మండలంలోని కారేపల్లి, గుంపెళ్ళగూడెం, భాగ్యనగర్తండా, బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, చీమలపాడు, పోలంపల్లి, పేరుపల్లి, గేటుకారేపల్లి, గిద్దెవారిగూడెం, విశ్వనాధపల్లి గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాలతో కలిపి సుమారు 80 మంది కు టుంబాలకు స్టిక్కరింగ్ వేయలేదనే కారణంతో ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహించలేదు. దీంతో తహశీల్దార్ మంగీలాల్ ముందు బాధిత కుటుంబాల వారు గోడు వెల్లబోసుకున్నారు. భాగ్యనగర్తండాలో సర్వేనిర్వహిస్తున్న ఎన్యూమరేటర్ నరసింహా చారి స్పృహ తప్పి కింద ప డిపోయారు. వాంతులు, విరేచనాలు కావడం తో గ్రామస్తులు కారేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. రిజ ర్వులో ఉన్న మరో ఎన్యూమరేటర్ను తహశీల్దార్ నియమించి సర్వేను పునఃప్రారంభించారు. కొణిజర్ల మండలంలో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది. తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడులో అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యంతో ఒక ఇంట్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటూ అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా ఒకే ఇంటి కింద నమోదు చేయడంతో తనికెళ్లలో ప్రజలు వీఆర్వో మహబూబ్ అలీ పై చేయి చేసుకోబోయారు. మండలంలో జరిగిన సర్వేను జిల్లా కలెక్టర్ ఇలంబరితి పరిశీలించారు. ఏన్కూరు మండలం రాజులపాలెంలో స్టిక్కర్లు పంపిణీ చేయలేదని గ్రామస్తులు సర్వేను అడ్డుకున్నారు. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ సర్వే జాబితాలో సుమారు 1500 కుటుంబాల పేర్లు గల్లంతు కావడంతో వారంతా తిరిగి తహశీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన అన్ని చోట్లా ఇదే సమస్య ఉత్పన్నం అయింది. సర్వేకు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు సిబ్బందిని, స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్థులను కూడా వినియోగించారు. పాల్వంచలో స్టిక్కర్లు, జాబితాలో పేర్లు లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేపట్టారు. మంచికంటినగర్, బోలోరిగూడెం, గట్టాయిగూడెం గ్రామాలలో ఐటీడీఏ పీవో దివ్య సర్వేను పరిశీలించారు. పాల్వంచలోని ప్రశాంత్నగర్లోని ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సర్వేను బహిష్కరిస్తున్నామని స్థానికులు ప్రకటించారు. కొత్తగూడెంలోని గాజులరాజంబస్తీ, హనుమాన్బస్తీ తదితర ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు స్టిక్కర్లు అంటించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. బర్మాక్యాంప్లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా 60 శాతం సర్వే కాకపోవడంతో అక్కడి ప్రజలు ఆర్డీవో అమయ్కుమార్కు ఫిర్యాదుచేశారు. బూర్గంపాడు మండలంలో చాలా ఇళ్లకు స్డిక్కర్లు అంటించకపోవడంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో తహశీల్దారు సారపాక లోని ఓప్రైవేటు పాఠశాలలో స్టిక్కర్లు లేని వారినందరినీ ఒకే దగ్గర ఉంచి సర్వే నిర్వహించారు. మణుగూరు మండలంలోనూ సర్వేలో కొంత గందరగోళం నెలకొంది. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా ఇండ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారంతా తహశీల్దారు కార్యాయలంలో ఆందోళన నిర్వహించారు. దీంతో తహశీల్దారు తక్షణమే మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి స్టిక్కర్లు లేని వారి సమాచారాన్ని సేకరించి తిరిగి వారి ఇండ్లలో సర్వే నిర్వహించారు. అశ్వాపురం, గుండాలలో సర్వే ప్రశాంతగా కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలో ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించినా.. మందకొడిగా సాగింది. ఎన్యూమరేటర్లకు ఏంచెపితే ఏమవుతుందోనని కొందరు వెనుకాడారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రక్రియ ఊపందుకుంది. కూసుమంచి మండలం పోచారంలో దాదాపు 150 కుటుంబాలకు స్టిక్కర్లు వేయకపోవడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు ఎన్యూమరేటర్లు తిరస్కరించారు. దీంతో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి కల్పించుకుని విషయాన్ని తహసీల్దార్ కిషోర్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆకుటుంబాలను సర్వే చేయాలని తెలిపారు. దీంతో స్పందించిన తహసీల్దార్ వెంటనే 150 ఫారాలు పంపించి గ్రామంలో అన్ని కుటుంబాలను సర్వే చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామ సర్పంచ్ బండి జగదీష్ కల్పించుకుని అన్ని కుటుంబాలను సర్వేలో చేర్చారు. తల్లాడ మండలం పినపాకలో సుమారు 50 ఇళ్లకుపైగా స్టిక్కర్లు అంటించలేదని గ్రామస్తులు సర్వేను బహిష్కరించటంతో అధికారులు అక్కడికి చేరుకుని స్టిక్కర్లు అంటించని వారిని కూడా సర్వే చేస్తామని హామీ ఇవ్వటంతో ఆ తర్వాత సహకరించారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో స్టిక్కర్లు అంటించలేదని ఎన్యూమరేటర్ను కొద్ది సేపు అడ్డుకున్నారు. బేతుపల్లిలో సైతం పేర్లు నమోదు కాలేదంటూ పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో మధిర డిప్యూటీ డీఈఓ బి.రాములు వారికి సర్దిచెప్పి పేర్లు నమోదు నమోదు చేసుకోవటంతో సర్వే సజావుగా సాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 4.30 గంటల నుంచి సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో స్టిక్కర్లు అంటించని, కొత్తగా నమోదు చేసుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొస్తే అక్కడికక్కడే నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎన్యూమరేటర్లకు సకాలంలో భోజనం అందించక పోవటంతో ఇబ్బంది పడ్డారు. డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు సత్తుపల్లిలోని సొంత అపార్ట్మెంట్లో కుటుంబ సర్వే సిబ్బంది వద్ద పేర్లు, వివరాలు నమోదు చేయించుకున్నారు. భద్రాచలం డివిజన్లో సర్వే ప్రశాంతంగా ముగిసింది. వాజేడు మండల కేంద్రంలో ఓ కుటుంబంలో పెండ్లి వేడుకలు ఉన్నాయనే కారణంతో వారి విజ్ఞప్తి మేరకు ఎన్యూమరేటర్ సోమవారం రాత్రే సర్వే చేశారు. భద్రాచలంలో వందల సంఖ్యలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించ లేదు. సర్వే సమయంలో ఇది వెలుగులోకి రావటంతో ఎన్యూమరేటర్లను అదనంగా ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరించారు. పట్టణంలో సుందరయ్య నగర్ కాలనీలోని 30 ఇండ్లు వారు స్టిక్కర్లు అంటించకపోవటంతో డి గ్రీ కళాశాలలోని కేంద్రానికి వచ్చి నిరసన తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య పట్టణంలో భగవాన్దాస్ కాలనీలోని తన ఇంటి వద్ద సర్వేలో సమాచారం అందజేశారు. ముంపు మండలాల్లో సర్వే జరగలేదు. అయితే ముంపులోనే పేర్కొన్న భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న రాజుపేట కాలనీ( ఇది లక్ష్మీదేవి పేట రెవెన్యూ గ్రామం) శ్రీరామనగర్ కాలనీ( ఇది పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం )లో సర్వే చేశారు. ఇక్కడ సర్వే ఉండ దని అధికారులు ముందుగా ప్రకటించినా.. మంగళవారం సర్వే చేశారు. మధిర మండలంలోని సిద్దినేనిగూడెం, మాటూ రు, సిరిపురం తదితర గ్రామాల్లో సర్వే పూర్తిస్థాయిలో జరగలేదు. ముఖ్యంగా కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించకపోవడంతో సర్వే సిబ్బంది ఆయా కుటుంబాలకు వెళ్లి సర్వే నిర్వహించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 8,9,10, 11 వార్డుల్లో పలు కుటుంబాలకు సర్వే నిర్వహించకపోవడంతో వారు నిరసన వ్యక్తంచేశారు. ఖమ్మం నగర శివారరులోని మమత ఆసుపత్రి ప్రాంతంలో కూల్చిన గుడిసెల ప్రాంతంలో వేసుకున్న గుడారాల్లో సర్వేలో అనేక ఇబ్బంది పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్, ప్రకాష్నగర్, చెరువుబజార్, ముస్తఫానగర్, రమణగుట్ట, వికాలాంగుల కాలనీ, రాపర్తినగర్, బీసీ కాలనీ కాల్వోడ్డు తదితర ప్రాంతాల్లో స్టిక్కరింగ్ ప్రక్రియ జరగక పోవడంతో స్థానికులు కొంత అందోళన గురైయ్యారు. స్టిక్కర్ల కోసం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలోని మీ సేవా కార్యాలయం ముందు బారులు తీరారు. దీంతో అధికారులు 10 గంటల సమయంలో ఇంటినెంబర్ల సీరిస్ ఆధారంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. -
సర్వేలో మహిళల సిగపట్లు
ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళల ఘర్షణ ఆ ఇంటిని వదిలేసిన ఎన్యూమరేటర్ పోలీస్స్టేషన్కు చేరిన పంచాయితీ పరకాల : సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్తో ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన సంఘటన పట్టణంలోని వెలమవాడలో మంగళవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని వెలమవాడకు చెందిన దగ్గు నర్సింగరావు ఎంబీబీఎస్ వైద్యుడు. పరకాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సునీతతో 1999లో వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చాయి. అదే సమయంలో నర్సింగరావు శ్రీశైలం సమీపంలోని సుండిపేటకు చెందిన వాణి(నూర్జహాన్)ను 2005లో మరో పెళ్లి చేసుకున్నాడు. అతడు అనారోగ్యంతో 2008లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్యలు సునీత, వాణి మధ్య తగాదా వచ్చి కోర్టుకెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు సమాచారం అందడతో వాణి సోమవారం రాత్రి పట్టణానికి చేరుకుంది. సర్వే కోసం వచ్చే సిబ్బంది కోసం మంగళవారం ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో 9-49 ఇంటినంబర్లో ఉంటున్న వారివద్దకు ఎన్యూమరేటర్ కేదారి వచ్చారు. ఆయన సమక్షంలోనే సునీత, వాణి.. ఆ ఇంటిపై నా పేరు రాయమంటే.. నా పేరు రాయమని ఘర్షణకు దిగారు. గంటల తరబడి ఇద్దరు పేరు కోసం పట్టుబట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారిద్దరిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. సునీత, వాణికి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవ పెట్టుకోవడం సరికాదని సూచించారు. కేసు విచారణలో ఉండగా మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదని, మరోసారి గొడవ జరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్యూమరేటర్ ఆ ఇంటిని మినహాయించి సర్వే కొనసాగించాడు. -
హమ్మయ్య!
►ఊపిరి పీల్చుకున్న జనం ►సమగ్ర సర్వే విజయవంతం ►88.79% కుటుంబాల నమోదు ►సిరిసిల్లలో అప్పులపై ఆందోళన ►రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సర్వే పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 8 గంటల వరకు జిల్లాలో 88.79 శాతం సర్వే పూర్తయినట్లు కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. అప్పటికే దాదాపు 45 మండలాల్లో 95 శాతం సర్వే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,12,724 కుటుంబాలుంటే 10,76,729 కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి పదకొండు గంటల వరకు అక్కడక్కడ సర్వే కొనసాగింది. ఎన్యూమరేటర్లు డుమ్మా కొట్టడం, ఫారాల కొరతతో చాలాచోట్ల సర్వే ఆలస్యంగా మొదలైంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 400 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాకపోవటంతో అధికారులు హడావుడి పడ్డారు. ప్రైవేటు కాలేజీల విద్యార్థులను సైతం రంగంలోకి దింపి మధ్యాహ్నం నుంచి సర్వే మొదలు పెట్టించారు. జగిత్యాల పట్టణంలో దాదాపు 500 ఇళ్లు సర్వేలో గల్లంతైనట్లు ఆలస్యంగా గుర్తించారు. అప్పటికప్పుడు అదనంగా ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపి సర్వేను మొదలుపెట్టారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా అక్కడ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పదకొండు గంటల వరకు అక్కడ సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న సర్వేలో అప్పుల వివరాలు సైతం నమోదు చేసుకోవాలని సిరిసిల్లలో దళితులు ఆందోళనకు దిగడంతో సర్వే రెండు గంటలపాటు నిలిచిపోయింది. సంజీవయ్యనగర్లో ఎన్యూమరేటర్లను అడ్డుకోవటంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కుటుంబ స్థితిగతుల కాలమ్లో అప్పుల వివరాల నమోదుకు అధికారులు అంగీకరించి.. ఎన్యూమరేటర్లకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయటంతో ఆందోళన సద్దుమణిగింది. -
ఆన్లైన్లో సర్వే సమాచారం
- అర్హులకే సంక్షేమ ఫలాలు - ప్రతిపక్షాల తీరు దారుణం - మంత్రి హరీష్రావు సిద్దిపేట టౌన్: తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వెల్లడించారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ, తహశీల్దార్, అన్ని ప్రభుత్వ శాఖల ఆఫీసులు, మీసేవ కేంద్రాలు, ఇంజనీరింగ్ కళాశాలలను సర్వే సమాచారం ఆన్లైన్లో నమోదు చేయడానికి వినియోగిస్తామన్నారు. ఎంత వేగంగా ఈ పని పూర్తిచేస్తే అంతే వేగంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి నిజమైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు, పింఛన్ తది తర పథకాలను అందించడం సర్వే లక్ష్యమన్నారు. దీనిని ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి, దుష్ర్పచారం చేసి అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాయని ఆరోపించారు. ప్రతిపక్షాల తీరు సరైనది కాదన్నారు. సంక్షేమ ఫలాలను అడ్డుకునే పార్టీల అడ్రస్లను ప్రజలు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. సర్కార్ సంక్షేమ పథకాలతో తమకు నూకలు చెల్లుతాయనే భయంతో కొన్ని పార్టీలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. సర్వేలో బ్యాంక్ ఖాతా నంబర్లు అడిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. నేరుగా సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 19 లక్షల మంది రైతులకు 465కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకి చేరడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడడం సరైంది కాదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ సర్వేను అమలు చేయడానికి ఆలోచిస్తున్నాయన్నారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని, మాటలకు పరిమితం కామని చేతలతోనే తమ పనులను చూపిస్తామని స్పష్టం చేశారు. సర్వేకు ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలకడం, పండుగలా మార్చడం తమ ప్రభుత్వంపై వారికున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. టీఏ, డీఏలు తీసుకోకుండా ఉద్యోగులు సర్వే చేయడం అభినందనీయమన్నారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తుంటే ఆనందబాష్పాలు రాల్చడం తమ పాలన పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు బాగుంటే ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో మంచి పథకాలను అమలు చేస్తే తాము కూడా వాటిని అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు. -
సర్వేకు చక్కటి స్పందన
వివరాలు నమోదు చేసుకున్న ఇన్చార్జి కలెక్టర్ - పట్టణంలో కర్ఫ్యూ మాదిరి వాతావరణం - నిర్మానుష్యంగా సంగారెడ్డి - స్వచ్ఛందంగా సినిమా హాళ్లు, - పెట్రోల్ బంకుల మూత సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సర్వే సందర్భంగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు సైతం తిరగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొని వివరాలను తెలియజేశారు. ఏఎస్పీ మధుమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు సంగారెడ్డిలో కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి సోమేశ్వర వాడలో పేర్లు నమోదు చేయించుకున్నారు. మాజీ ప్రభుత్వ విప్ జయప్రకాశ్రెడ్డి స్థానికంగా లేకపోవడంతో సర్వేలో పాల్గొనలేకపోయారు. మున్సిపల్ వైస్చైర్మన్ గోవర్దన్ నాయక్ సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను తెలియజేశారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ఇంటి నంబర్లు దొరకక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంజీరా నగర్లోని 7-8-686/4/6 నంబరు గల ఇంటిలో యజమాని రాజయ్య పేరు ఉందని 739వ ఎన్యూమరేటర్కు మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చారు. అదే ఇంటి నంబరు ప్రభుగౌడ్ పేరును మరో ఎన్యూమరేటర్కు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రశాంత్నగర్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు సర్వేలో పేర్లను నమోదు చేయించుకోగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. తమకు ఆధార్, ఓటరు కార్డుతో పాటు సొంత ఇల్లు ఉన్నందున ఇక్కడే నమోదు చేయించుకుంటామని చెప్పగా, స్థానికులు అడ్డుకొని తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి పేర్లను ఇక్కడ నమోదు చేయించవద్దని స్థానికులు అధికారులను కోరారు. సర్వేకు ముందుగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రీ సర్వే సమయంలో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సర్వే ఫారాలను తీసుకువచ్చిన సిబ్బందికి సర్వే చేసే రోజు వారి సంఖ్య పెరగడంతో ఫారాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైంది. సర్వేను ఇన్చార్జి కలెక్టర్ శరత్తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తహశీల్దార్ రాధాబాయి, మున్సిపల్ ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. పట్టణం నుంచి పల్లెలకు... సర్వేలో పాల్గొనేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పట్టణంలోని వివిధ పరిశ్రమలు, అడ్డా కూలీలు, వ్యాపార సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో పట్టణంలోని కొత్త సంగారెడ్డి ప్రాంతంలో మెజార్టీ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించింది. ఇంటి యజమానులు హైదరాబాద్లో స్థిరపడగా స్థానికంగా ఉన్న ఇండ్లను అద్దెకు ఇచ్చారు. అద్దెకుంటున్న వారు సైతం సర్వేలో పాల్గొనేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పట్టణంలోని పలు కాలనీలు జన సంచారం లేక వెలవెలబోయాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు సిద్దిపేట టౌన్: సర్వే సందర్భంగా తప్పుడు సమాచారమిస్తే తిప్పలు తప్పవని సర్వే మెదక్ స్పెషలాఫీసర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ బుర్ర వెంకటేశం, ఇన్చార్జి కలెక్టర్ శరత్ హెచ్చరించారు. సిద్దిపేట రెవెన్యూ గెస్ట్ హౌస్లో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. మన ఊరు- మన ప్రణాళిక పక్కాగా రూపొందించుకొని అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న స్పందన అభినందనీయమన్నారు. జిల్లాలో 8.48 లక్షల కుటుంబాలు ఉండగా 32 వేల మంది సిబ్బందిని సర్వే కోసం ఏర్పాటు చేశామన్నారు. సర్వే కన్నా ముందు ఇళ్ల సంఖ్యను లెక్కించామని, ఇందుకు అనుగుణంగా నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లను నియమించామని, రిజర్వ్లో సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని, సపోర్ట్ ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేశామని, సర్వేలో అవాంతరాలు చోటు చేసుకోకుండా వివిధ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు. అయితే కొందరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేర్వేరు కుటుంబాల పేరుతో నమోదు చేయించుకోవడంతో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. కుటుంబాల సంఖ్య కన్న 15 శాతం ఎక్కువ సర్వే ఫారాలను ఏర్పాటు చేసినప్పటికీ స్వల్ప కొరత ఏర్పడిందన్నారు. వెంటనే అదనపు సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని ఎంత రాత్రి అయినా సర్వేను పూర్తి చేస్తామని, అన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తామన్నారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేయాలో, ఎవరికి సంక్షేమ ఫలాలు అందించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రజలు కూడా పారదర్శకంగా ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. సమావేశంలో గడా స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి పాల్గొన్నారు. -
సర్వేలో అప్పుల కాలమ్ ఏదీ?
సమగ్ర కుటుంబ సర్వేకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సంజీవయ్య నగర్లో ఆటంకాలు ఎదురయ్యాయి. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన వాళ్లు సర్వే చేయడానికి వచ్చిన ఎన్యుమరేటర్లను అడ్డుకున్నారు. సర్వే జాబితాలో అప్పులకు సంబంధించిన వివరాలు నమోదు చేయడానికి కాలమ్ ఎందుకు పెట్టలేదని మండిపడ్డారు. మరోవైపు వరంగల్ నగరంలో ఇంటి నెంబర్లు దొరకక ఎన్యుమరేటర్లు ఇంకా రోడ్డు మీదే తిరుగుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఎన్యుమరేటర్లు ఒక్కొక్కళ్లకు భారీ సంఖ్యలో ఇళ్లు కేటాయించడంతో అన్ని ప్రాంతాలకు తిరగడం ఒక్క రోజులో పూర్తవుతుందా.. లేదా అని ఆందోళన చెందుతున్నారు. ముందు రెండు రోజులు స్టిక్కర్లు అతికించడం, పాంప్లెట్లు పంచడం, ఇళ్లు గుర్తించడం లాంటి పనులే సరిపోయాయని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీల్లో ఇళ్లు అక్కడక్కడ ఉన్నచోట్ల సమస్య అవుతోందని కొంతమంది ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. -
అ‘టెన్షన్’
ముకరంపుర : ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నలకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాలి. ఆధారం కోసం జిరాక్స్ పత్రాలు చూపితే సరిపోతుంది. ఎలాంటి పత్రాలు కూడా ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాలు మాత్రమే ఎన్యూమరేటర్లు రాసుకుంటారు. చెప్పిన వివరాలు రాసుకున్న తర్వాత వాటిని చదివి వినిపిస్తారు. ఆ తర్వాతే మీరు సంతకం చేయాలి. సర్వే ముగిసిన తర్వాత ఇంటి గోడపై ఇప్పటికే అతికించిన స్టిక్కర్పై సర్వే పూర్తయినట్లు ఎన్యూమరేటర్లు రాసి సంతకం చేస్తారు. కుటుంబంలో ఒకరుంటే చాలు.. ఎన్యూమరేటర్లు వచ్చినపుడు కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇంట్లో లేనివారికి సంబంధించిన ఏమైనా రుజువులు చూపించి వారి వివరాలు నమోదు చేయించవచ్చు. వంట గది ప్రామాణికం కాదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో ఉండే వంట గదులను ప్రామాణికంగా తీసుకోకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నమోదు చేస్తారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలైతే నివసిస్తున్నాయో.. ఆ కుటుంబాలన్నింటికీ వేర్వేరుగా ఇంటి నంబర్లు వేశారు. దీంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడంతో వంట గదులను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. వేసిన నంబర్ల ఆధారంగానే.. సర్వే సిబ్బంది ఇళ్లపై వేసిన నంబర్ల ఆధారంగానే వివరాలు నమోదు చేస్తారు. ఓటరు లిస్టు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఆధారంగా చెప్పిన వివరాలను నమోదు చేయరు. అద్దెగృహాల్లో ఉండే వారికి ‘బై’ నంబర్లు.. అద్దె గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించేందుకు అద్దెకు ఉంటున్న ఇళ్లకే ‘బై’ నంబర్లు వేశారు. బై నంబర్లు వేయకుంటే సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలు లేదా తహశీల్దార్లను సంప్రదించవచ్చు. రేషన్ కార్డు రద్దు కాకూడదనుకుంటే... ఒకచోట రేషన్కార్డు.. మరోచోట స్థిర, చరాస్తులు ఉన్నట్లయితే.. రేషన్కార్డు ఉన్న చోటనే సర్వేలో నమోదు చేసుకుంటే మంచిది. అప్పుడే రేషన్కార్డు రద్దు కాదు. స్థిర, చరాస్తులు ఉన్నచోట సర్వేలో పాల్గొంటే.. అప్పుడు కచ్చితంగా రేషన్కార్డు రద్దయ్యే అవకాశముంది. సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి.. వికలాంగులు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ సదరెం సర్టిఫికెట్ లేకున్నా వికలాంగుల వివరాలు నమోదు చేస్తారు. కానీ వికలాంగుల పెన్షన్ పొందడానికి సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి చేయనున్నారు. ఖాతా నంబరు చెబితే నష్టమేమీ లేదు.. కుటుంబ యజమాని తన బ్యాంకు అకౌంటు నంబరు చెప్పడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. అకౌంట్ నంబరు చెప్పడం.. చెప్పకపోవడం యజమాని ఇష్టమే. ప్రభుత్వం నుంచి పొందే లబ్దిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే అకౌంట్ నంబరు అడుగుతున్నారు (బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలు అడగరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్వే నమూనా పత్రాల్లో మాత్రం బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని ముద్రించారు). ఇతర ప్రాంతాలవారు రావాల్సిన పనిలేదు ఉపాధి కోసం దుబాయి, ముంబయి, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వెళ్లినవారు సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొంతగ్రామాలకు వచ్చి సర్వేలో నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతే అధికారులు మళ్లీ విచారణ చేపట్టి వారి పేర్లను తొలగిస్తారు. ఆదాయం ఎంతో చెబితే చాలు కుటుంబ ఆదాయం ఎంతో చెబితే చాలు. ఆదాయ మార్గాల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనాథలే.. తల్లిదండ్రులు లేని పిల్లలు తాతలు లేదా సమీప బందువుల వద్ద పెరుగుతున్నా వారిని అనాథలుగానే పరిగణిస్తారు. వీరితోపాటు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి వదిలేసినవారు, కొడుకులు లేదా కూతుళ్లు వదిలేసిన తల్లిదండ్రులను అనాథలుగానే పరిగణిస్తారు. సర్వే నుంచి వీరికి మినహాయింపు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను సర్వే నుంచి మినహాయించారు. అందుకు తగిన ఆధారాలను (అడ్మిషన్, ఫీజుల రశీదులు వగైరా) చూపిస్తే సర్వే పత్రంలో నమోదు చేస్తారు. గర్భిణులు, వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సర్వే నుంచి మినహాయించారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. సర్వే జరిగే రోజు ఇంటికి తాళం వేసి ఉంటే.. పొరుగువారి నుంచి ఆ కుటుంబ యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. అలాంటి ఇళ్లకు ప్రత్యేకంగా మార్కువేస్తారు. నకిలీ ఎన్యుమరేటర్లను నమ్మొద్దు.. సర్వే కోసం నియమించిన ఎన్యూమరేటర్లకు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపుకార్డు లేకుండా సర్వేకు వచ్చామని చెప్పేవారికి ఎలాంటి వివరాలూ చెప్పొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆస్తుల వివరాలు అడిగితే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. తప్పుడు సమాచారం చెప్పొద్దు.. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవాలే తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించే అవకాశముంది. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సమగ్రంగా చెబితేనే రేషన్కార్డులు, ఇళ్లు పెన్షన్లకు అర్హత పొందుతారు. ఇది రహస్య సమాచారం సమగ్ర సర్వే ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా రహస్యంగా ఉంటుంది. మూడోవ్యక్తికి కుటుంబ వివరాలు చెప్పరు. సర్వే ఫారం జిరాక్స్లను బయటకు ఇవ్వడానికి వీల్లేదు (ఇంటింటి సర్వేలో పాల్గొనడం అనేది ప్రజల ఇష్టంపై (ఐచ్ఛికం) ఆధారపడి ఉంటుందని, ఎలాంటి ఒత్తిడీ చేయరాదని ఇటీవల హైకోర్టు సూచించింది). -
‘సర్వే’కు వేళాయె..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే - 2014ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 8,59, 260 కుటుంబాలను సర్వే చేసేందుకు 28,642 మంది ఎన్యూమరేటర్లను (వీరికి అందనంగా మూడువేల సిబ్బందిని) నియమించారు. సిబ్బందికి తగిన వైద్యసౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. గ్రామాలు, కార్పొరేషన్, మున్సిపల్ వార్డులు కలిపి 758 ప్రాంతాల్లో సర్వే చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 30 కుటుంబాల వివరాలు సేకరించేంత వరకు కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లాలోని 46 మండలాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు చివరి నిమిషంలో దానిని 39 మండలాలకే పరిమితం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు కింద ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యే ఏడు మండలాలను సర్వే నుంచి మినహాయించారు. జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లోనే సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి సోమవారం అధికారికంగా ప్రకటించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని, తమకు సంబంధించిన అన్ని వివరాలూ ఎన్యూమరేటర్లకు చెప్పడం ద్వారా అధికారిక గణాంకాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సర్వేలో ఏ సమస్య తలెత్తినా..సందేహాలున్నా సంబంధిత తహశీల్దార్లకు ఫోన్ చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్రూంకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. అందరూ ఉండండి...అన్నీ చెప్పండి సర్వేలో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తే మంచిదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ సర్వే సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు కాదని, అర్హులైన అదనపు లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను వర్తింపజేయడం కోసమే అని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన గణాంకాలను సేకరించేందుకు మాత్రమేనని చెప్పారు. సర్వే కాగితాలను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐలుగా విభజించి ఉన్న తొమ్మిది విభాగాల సమాచారం మాత్రమే చెప్పాలని, అవసరమైతే వివరాలన్నీ చెప్పిన తర్వాత సర్వే కాగితాన్ని సరిచూసుకొని సంతకం పెట్టాలని అధికారులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలతో పాటు సర్వే కాగితంలో లేని ఏ ఇతర వివరాలనూ చెప్పాల్సిన అవసరం లేదని కూడా వారు చెపుతున్నారు. సర్వే వివరాలు చెపుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఉంటే మంచిదని, సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లకు ఎలాంటి రుజువులు ఇవ్వాల్సిన పనిలేదని, కేవలం కార్డులు చూపిస్తే చాలని చెపుతున్నారు. ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు... తదితర ఒరిజినల్ కార్డులను చూపించాలని, ఎలాంటి కాగితాలు ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన పనిలేదని చెపుతున్నారు. విద్యార్థులు, ఆసుపత్రులలో చేరిన వారు, సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. వారు లేకపోయినా వారి వివరాలను చెపితే సంబంధిత ఎన్యూమరేటర్లు నమెదు చేసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూముల వివరాలు చెప్పాలా? వద్దా? అనే సందేహం ప్రజల్లో ఉంది. భూములకు సంబంధించి కాగితాలుంటే వివరాలు చెపితే మంచిదని, చెప్పకపోయినా ఫర్వాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో వివరాలు చెప్పడం ద్వారా ఆ భూమిపై హక్కు రావడం గానీ, చెప్పకపోవడం వల్ల హక్కు కోల్పోవడం కానీ జరగదని అంటున్నారు. వృద్ధాశ్రమమో యూనిట్ జిల్లాలోని 39 మండలాల్లో ప్రజలందరి వివరాలు సేకరించేందుకు ఆవాసాల్లో నివాసముంటున్న వారి తో పాటు ఇతరుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వృద్ధాశ్రమాలు, జైళ్లు, పోలీసు క్యాంపుల్లో కూడా సర్వే జరపనున్నారు. వృద్ధాశ్రమాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లను నియమించి వృద్ధాశ్రమమో యూనిట్గా వివరాలు సేకరించనున్నారు. ఫ్లాట్ఫారంలపై నివసించే వారి వివరాలను కూడా సేకరిస్తారు. ఎవరి వివరాలనైనా సేకరించలేదని తెలిస్తే వెంటనే సంబంధిత తహశీల్దార్కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారని అధికారులు చెపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో వార్డుల వారీగా నియమించిన అధికారులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. మిగిలిన మున్సిపాలిటీలలో సంబంధిత కమిషనర్లకు ఫోన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూం నెంబర్కు ఫోన్ చేయాలి. ముంపులో లేదు.. పోలవరం ముంపు ప్రాంతాలు కూనవరం, వీఆర్పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం రూరల్, బూర్గంపాడులోని ఆరు గ్రామాలను సర్వే నుంచి మినహాయించారు. తొలుత ఈ మండలాల్లో సర్వే నిర్వహించాలని అధికారులు భావించారు. ఇప్పటికే ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్కు ఆమోదం రావడం, కొన్ని న్యాయపరమైన అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉండడం, ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఆ ఏడు మండలాలను కలుపుకునేందుకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడం, ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీచైర్పర్సన్ ఎన్నికలలో కూడా ఆయా మండలాలను మినహాయించడంతో చివరి నిమిషంలో ఈ మండలాలను సర్వే నుంచి తొలగించారు. స్టిక్కరింగ్ గందరగోళం సర్వేలో భాగంగా కుటుంబాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన స్టిక్కరింగ్ అంశం కొంతమేర గందరగోళానికి దారి తీసింది. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ సమస్య తలెత్తింది. వాస్తవానికి ఖమ్మంలో 55వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 95వేలకు పైగా స్టిక్కర్లు పంపిణీ చేసినా ఇంకా తమకు స్టిక్కర్లు రాలేదంటూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఖమ్మంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. వీలున్నంత మేర స్టిక్కర్ల పంపిణీ చేస్తున్నామని, కొన్ని కుటుం బాల్లో యజమానితో పాటు వారి పిల్లలు కూడా ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాలని స్టి క్కర్లు అడుగుతుండటంతో గందరగోళం ఏర్పడుతోందని అధికారులు చెపుతున్నారు. ఏ ఇం టినైనా పొయ్యి ప్రాతిపదికన కుటుంబాలుగా గుర్తిస్తామని, ఒకే ఇంటిలో రెండు పొయ్యిలుంటే రెండు కుటుంబాలుగా పరిగణిస్తారు. వెంటనే డాటా ఎంట్రీ.. ఈ సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత ఎన్యూమరేటర్లు ఆ కాగితాలను మండల కేంద్రాలకు తీసుకెళ్లి తహశీల్దార్కు అప్పగిస్తారు. ఈ కాగితాల్లో నిక్షిప్తమై ఉన్న సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేసేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని పలు కళాశాలల నుంచి మొత్తం రెండువేల కంప్యూటర్లను తీసుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎవరైనా డాటా ఎంట్రీకి ఆసక్తికనబరిస్తే..వారితో పాటు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వారిని డాటా ఎంట్రీకి వినియోగించుకుంటారు. ఈనెల 20న కళాశాలల వారీగా వివరాలు సేకరించి, 21న సూపర్వైజర్లకు శిక్షణ నిచ్చి, ఆ తర్వాత డాటా ఎంట్రీ చేసే వారికి శిక్షణనిస్తామని, ఈనెల 23 నుంచి డాటా ఎంట్రీ ప్రారంభం అవుతుందని అధికారులు చెపుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 20 డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు కనీసం నెలరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఆయా విభాగాల వారీగా తెలపాల్సిన వివరాలు... విభాగం (ఏ) : పేరు, చిరునామా విభాగం (బీ) : కుటుంబ వివరాలు, మతం, సామాజికవర్గం, రేషన్కార్డు ఉందా? ఉంటే ఎలాంటిది?బ్యాంకు ఖాతా ఉందా? వితంతువులు, విడిపోయిన వారు తదితర వివరాలు నమోదు చేస్తారు. విభాగం (సీ) : కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు, పుట్టిన తేదీ, విద్యార్హత, ఉపాధి పొందుతున్న మార్గాలు, ఆధార్ నంబర్, పెన్షన్ వివరాలు నమోదు చేస్తారు విభాగం (డీ) : ఇంటికి సంబంధించిన వివరాలు, స్వంత ఇల్లు ఉందా? లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా? స్వంత ఇళ్ళయితే పక్కా ఇళ్ళా? కాదా? మొత్తం గదులెన్ని? ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉన్నాయా?గతంలో హౌసింగ్ పథకంలో ఇల్లు పొంది ఉన్నారా? తదితర అంశాలుంటాయి. విభాగం (ఈ) : ఇంటికి ఉన్న విద్యుత్ సదుపాయానికి సంబంధించిన వివరాలు విభాగం (ఎఫ్) : వికలాంగులకు సంబంధించిన అంశాలు. ఎంత మంది ఉన్నారు. వారి వైకల్యం ఏమిటీ? సంబంధిత సర్టిఫికెట్ ఉందా? ఉంటే దాని నంబర్ను నమోదు చేసుకుంటారు. విభాగం (జీ) : కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేస్తారు. విభాగం (హెచ్) : వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఉంటాయి. భూమి వంశపారంపర్యంగా వచ్చిందా? కొనుగోలు చేసిందా? అసెన్డ్ భూమా? శిఖం పట్టానా? కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారా? విభాగం (ఐ) : పశు సంపదకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు, ఎడ్లు, కోళ్ళు, పందులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. విభాగం (జే) : స్థిర, చర ఆస్తులు వివరాలుంటాయి. ద్విచక్ర వాహనం, కారు, ఆటో, జీపు, బస్సు తదితర వాటితో పాటు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్, పొలం దున్నే యంత్రం, కల్టివేటర్లు తదితర వాటిని కూడా నమోదు చేస్తారు. -
సర్వేమయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు.. సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సర్వేలో భాగస్వామ్యం అయ్యేందుకు జిల్లా వాసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు స్వస్థలాలకు చేరుకున్నారు. సర్వే కోసం కుటుంబ సభ్యులంతా ఒకేచోటికి చేరడంతో అన్ని నివాసాల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం అన్ని రవాణా వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా సర్వేపైనే చర్చించుకుంటున్నారు. వివరాల నమోదు విషయంలో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫ్రొఫార్మాలు, ఇతర సర్వే సామగ్రీని సోమవారం పంపిణీ చేశారు. ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ పంపిణీ జరిగింది. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనున్న ఎన్యూమరేటర్లు సోమవారం సాయంత్రమే గ్రామాలకు బయలుదేరి వెళ్లగా, దగ్గర గ్రామాల్లో మంగళవారం ఉదయం బయలుదేరనున్నారు. సర్వే సిబ్బందిని, అధికారులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు జిల్లా వ్తాప్తంగా 1,797 వాహనాలను ఏర్పాటు చేశారు. సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, వివిధ వర్గాల ప్రజలకు ఆయా డివిజన్ పరిధిలో శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని వర్గాలకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించారు. సర్వే ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.అశోక్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 32,684 ఎన్యూమరేటర్లు.. 2,492 అధికారులు.. జిల్లాలో 7,89,613 కుటుంబాలు ఉన్నాయని గుర్తించారు. ఈ కుటుంబాలపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు 32,684 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 ఇళ్ల చొప్పున సర్వే చేసి వివరాలు సేకరించనున్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు, పకడ్బందీగా నిర్వహించేందుకు 2,492 అధికారులు, సిబ్బందిని నియమించారు. 866 గ్రామ పంచాయతీలలో సర్వే సక్రమంగా జరిగేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో విలేజ్ ప్లానింగ్ అధికారులుగా గుర్తించారు. ఒక్కో మండలానికి ఒక రిసోర్స్ పర్సన్ను, మున్సిపల్ పరిధిలో ఐదుగురు రిసోర్స్ పర్సన్ల చొప్పున నియమించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 295 మంది క్లస్టర్ అధికారులను నియమించారు. అలాగే 52 మండలాలు, ఏడు మున్సిపాలిటీలకు కలిపి ఒక్కొక్కరు చొప్పున 59 మంది అధికారులకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు మరో 1,213 అధికారులు, సిబ్బందిని అదనంగా నియమించారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఎన్యూమరేటర్లు విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానాల్లో సర్వే చేసేందుకు కొందరు ఎన్యూమరేటర్లను రిజర్వులో ఉంచారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 264 ఆర్టీసీ బస్సులు, 391 పాఠశాల బస్సులు, 296 జీపులు, 589 టాటా ఎసీ వాహనాలు, 229 ఆటోలు, 28 ట్రాక్టర్లు మొత్తం 1,797 వాహనాలు వినియోగిస్తున్నారు. ఇవీ అడుగుతారు.. కుటుంబ సర్వే చేసేందుకు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్యూమరేటర్ వద్ద 80 అంశాల ఫ్రొఫార్మా ఉంటుంది. ఈ ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి తిరిగి ప్రభుత్వానికి పంపిస్తారు. ఇందుకు గ్రామాల ప్రొఫార్మాలను కలెక్ట్ చేసేందుకు మండలాల్లో సర్వే రోజు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వే ఎన్యూమరేటర్కు ఆధార్ కార్డు (ఉన్నట్లైతే), వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పుస్తకం, బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, కులం, జనన ధ్రువీకరణపత్రం, విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు (మెమో, టీసీ వంటివి), వికలాంగుల ధ్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్), పట్టాదారు పాసు పుస్తకం, ఓటర్ ఐడీ, పాన్కార్డు, పెన్షనర్ల ఐడీతోపాటు రేషన్ కార్డు, సొంత ఇళ్లు వివరాలు అడుగుతారు. సర్వేలో అందరు వివరాలు నమోదు చేసుకునేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సర్వే అనంతరం గ్రామాధికారులు, సర్పంచ్లు క్రాస్చెకింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మండల ప్రత్యేక అధికారులు కూడా క్రాస్చెకింగ్ చేస్తారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ జగన్మోహన్ సందేశం ‘‘సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. సర్వేలో పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి. వివరాలు లేనట్లైతే లేనట్లుగా, ఉన్నట్లైతే ఉన్నట్లుగా మాత్రమే ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. ఈ సర్వేతో ప్రజలకు ఎలాంటి నష్టమూ కలగదు. సర్పంచ్లతోపాటు, వీఆర్వో నుంచి జిల్లాస్థాయి అధికారులు సర్వే చేస్తున్నారు. కుటుంబంలోని సభ్యులందరి పూర్తి వివరాలు చెబితేనే బాగుంటుంది. ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సర్వే కోసం మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు మీ కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలు చెబుతారని కోరుతున్నా.’’ కంట్రోల్ రూం ఏర్పాటు సర్వేపై సమగ్ర సమాచారం కోసం, సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వాసులు 08732-222302, 08732-222802, 08732-225529 నెంబర్లకు ఫొన్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్వే జనా సుఖినోభవంతు!
ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభం ఫిర్యాదులకు కాల్సెంటర్ 040-21 11 11 11 జిరాక్స్లు ఇవ్వనవసరం లేదు సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న మహాక్రతువుకు రెండు రోజుల ముందు నుంచే ప్రీ విజిట్లు నిర్వహించిన ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించారు. ఇంటింటికీ కరపత్రాలు.. అవి అందినట్లుగా స్టిక్కర్లు అతికించారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ వివిధ ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతుండడంతో జీహెచ్ఎంసీ కాల్సెంటర్లోని ఫోన్ లైన్లను 30 నుంచి 50కి పెంచారు. ఆదివారం 13.40 లక్షల ఇళ్లను సందర్శించిన సిబ్బంది .. 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. సాక్షి, సిటీబ్యూరో:సర్వేకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన క్షేత్ర స్థాయి పర్యటనలలో కొన్ని ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, అవసరానికి సరిపడా సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్యూమరేటర్లకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఏ ప్రాంతాల్లోనైనా సర్వే జరుగని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేలో సహకరించేందుకు సహాయ ఎన్యూమరేటర్లుగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారిని నియమించుకున్నప్పటికీ..ఎన్యూమరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సోమవారం ప్రీ విజిట్లకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సర్వేను సైతం పూర్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలు అందజేయడమే తప్ప.. జిరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి సర్వే ఫారాలను 25వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ప్రీ విజిట్లలో దృష్టికొచ్చిన అంశాలు.. అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు..ఏర్పాట్లు తదితర అంశాలను కమిషనర్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. పెరిగిన గృహాలు 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో దాదాపు 13 లక్షల ఇళ్లుండగా.. ఇటీవలి సర్వేలో 16.96 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లక్షల ఇళ్లు అదనంగా వచ్చినా ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిబ్బంది నియామకాలతోపాటు కరపత్రాలు.. స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రీ విజిట్లో 13.40 లక్షల ఇళ్ల సర్వే జరగ్గా, అందులో 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 21 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్ను అందజేశామని కమిషనర్ తెలిపారు. ఇంకా సరఫరా చేస్తున్నామన్నారు. 21,636 ఇళ్లకు తాళాలు ఇంటింటి సర్వేను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లిన వారూ తక్కువేమీలేరు. ఆదివారం నాటి సర్వేలో 21,636 ఇళ్లకు తాళాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఒక్క ఇల్లూ తప్పిపోకూడదనే.. గ్రేటర్ నగర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత భారీగా ఉండటంతో ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. మనుషులు చెట్లు కింద ఉన్నా, రోడ్డు పక్కన పొయ్యి ఉన్నా... వారి వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. ఇది మనుషులకు సంబంధించిన సర్వే తప్ప ఆస్తులకు సంబంధించినది కాదన్నారు. సంచార జాతుల వారి వివరాలూ నమోదు చేస్తామన్నారు. జిరాక్స్లతో పని లేదు ఎన్యూమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డు..ఆస్తిపన్ను నెంబరు(పీటీఐఎన్), బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వంటి వాటి నెంబర్లలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నాం తప్ప వాటిని సర్వేయర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్యూమరేటర్ల ధ్రువీకరణ కోసమే జిరాక్స్లు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ సూచన చేశామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలనడం వెనుక కూడా మరో కారణం లేదన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ప్రజల ఇష్టం .. బ్యాంకు ఖాతా నెంబరు తెలపాలా.. వద్దా అనేది ప్రజల నిర్ణయమేనని, బలవంతం లేదని కమిషనర్ చెప్పారు. ఇచ్చినా తగు భద్రత ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని భ రోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్కు 40 ఇళ్లు.. ఒక్కో ఎన్యూమరేటర్కు సర్వే చేయాల్సిన ఇళ్లు 40కి మించకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పనుల మీద వెళ్లినవారు.. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపితే చాలునన్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్... సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల డేటాబేస్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామన్నారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్లో ఏ పథకానికి ఏ వివరాలు అవసరమవుతాయో వాటిని వినియోగిస్తామన్నారు. బదిలీలైనప్పుడు, ఇల్లు మారినప్పుడు సవరించేందుకు వీలుగా డేటాబేస్లో మార్పులూ చేర్పులకు వీలుంటుందని కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. సర్వే కేవలం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఏపీఎల్ కుటుంబాలకూ పనికివచ్చేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే భవిష్యత్లో కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి, స్థానికతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సర్వేలో ఈ వివరాలు లేవని చెప్పారు. డేటా దుర్వినియోగం జరిగేందుకు ఆస్కారం లేదని, అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. సర్వేలో హిజ్రాల వివరాల నమోదుకూ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరంపర... ఆదివారం సాయంత్రం నుంచీ తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు రోజుకు సగటున 300 ఫిర్యాదులు అందేవి. ఆదివారం ఈసంఖ్య 5,616కు చేరింది. సోమవారం రాత్రి 8.40 గంటల వరకు 4776 ఫిర్యాదులు అందాయి. ఫోన్లు నిరంతరం బిజీగా ఉండటంతో చాలామందికి అసలు లైన్లే కలవలేదు. ఈ పరిస్థితిని గుర్తించి కాల్సెంటర్లోని 30 లైన్లకు తోడు అదనంగా మరో 20 లైన్లు పెంచారు. ప్రస్తుతం 50 లైన్లు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని..స్థానిక డిప్యూటీ కమిషనర్కు సైతం ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వెబ్సైట్ కంటే ఫోన్కాల్స్ ద్వారా త్వరితంగా చర్యలకు వీలవుతుంది. సర్వే పరిశీలనకోసం నోడల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాని విషయాన్ని నోడల్ ఆఫీసర్లకు సైతం తెలియజేయవచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలదే.. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు.. ఇతరత్రా సమాచారం తెలియజేయవచ్చా? లేదా అనేది అంతిమంగా ప్రజల నిర్ణయమేనని, ఏదీ కచ్చితం కాదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ పథకాలకు.. ఇతరత్రా అవసరాలకు సర్వే ద్వారా నమోదైన డేటా ఉండటం అవసరమన్నారు. ఉదాహరణకు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో వివరాలు ఉన్నాయోమో చూస్తారని, లేని పక్షంలో ఇబ్బంది ఎదురు కావచ్చన్నారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇస్తే మంచిదన్నారు. సర్వే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసు సహకారాన్ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 7500 మంది పోలీసులే ఎన్యూమరేటర్లుగా ఉన్నారని తెలిపారు. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాలేదని, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో.. మేయర్ వార్డులో సైతం చాలామంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదనగా.. అన్ని ప్రాంతాలకూ వస్తారని, రాని పక్షంలో కాల్సెంటర్, వెబ్సైట్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. సర్వే జరగకుండా మిగిలిపోయే ఇళ్లుంటే... పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి వాటి విషయంపై ఆలోచిస్తామన్నారు. తాళాలు ఉన్న వాటితో పాటు మిగిలిపోయిన ఇళ్ల విషయాలపైనా ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎన్యూమరేటర్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
మోమిన్పేట: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు స్వచ్ఛందంగా వస్తున్న ఎన్యూమరేటర్లకు ఉద్యోగ సంఘాలు స్వాగతం పలుకనున్నాయి. ఈ మేరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేకు పలు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండ కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారు, ఆశా వర్కర్లు, సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడంపై ఉద్యోగ సంఘా లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
సర్వేమయం
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సమగ్ర సర్వేకు సిద్ధమైన జిల్లా యంత్రాంగం లెక్కించాల్సింది 10.66 లక్షల కుటుంబాలు విధుల్లో 42,850 మంది సిబ్బంది ఫారాలు భద్రపరిచేది ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 4నాటికి కంప్యూటరీకరణ పూర్తి ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న వారు సొంతూళ్లకు పయనమయ్యూరు. ఫలితంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు జనసంద్రంగా మారారుు. అదేవిధంగా సమగ్ర సర్వే కోసం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్యూమరేటర్లను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. పర్యవేక్షణకు అధికారులను నియమించింది. హన్మకొండఅర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19వ తేదీన నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బస్టాండ్, పాన్షాప్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా.. ఎవరిని పలకరించినా.. సర్వే ము చ్చటే. కాగా, మరో 24 గంటల్లో జరుగనున్న సర్వే కోసం జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగు లకు శిక్షణ, సామగ్రి తరలింపు, వాహనాల ఏర్పాటు, ఇళ్లు, కుటుంబాల గుర్తింపును పూర్తిచేశారు. ఇదిలా ఉండగా, సర్వే సామగ్రిని ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు తరలించారు. 10.66 లక్షల కుటుంబాల లెక్కింపు.. సర్వేను పురస్కరించుకుని అధికారులు ముందస్తు లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలుంటున్నాయ నే విషయాన్ని గుర్తించారు. కాగా, జిల్లాలో మొత్తం 10,66,175 కు టుంబాలున్నాయని అధికారుల ప్రాథమిక లెక్కల్లో తేలింది. అయితే పైన గుర్తించిన కుటుంబాల్లోని సభ్యుల వివరాలను మాత్రమే ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఇదిలా ఉండగా, సర్వే కోసం 42,850 మంది సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఒ క్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, సర్వేలో ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, ఇంజినీరింగ్, ఇతర కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోనున్నా రు. కాగా, అనుకోని పరిస్థితుల్లో ఎన్యూమరేటర్లు విధులకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయంగా మరొకరిని ఏర్పాటు చేసేందుకు శిక్షణ పొందిన 400 మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాకు వచ్చిన 45వేల బుక్లెట్స్.. సర్వే ప్రొఫార్మాకు సంబంధించిన 45,888 బుక్లెట్స్ ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. ఒక్కో బుక్ లెట్లో 30 కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు వీలుగా పేజీలు పొందుపరిచారు. కాగా, ఎన్యూమరేటర్లు మంగళవారం మండల కేంద్రాలకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వారిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో విధులు నిర్వహించే ప్రాంతాలకు తరలిస్తారు. ఇదిలా ఉండగా, ఎన్యూమరేటర్లకు అధికారులు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కిషన్ ఇప్పటికే ఒక్కో మండలానికి రూ.1.50 లక్షలు విడుదల చేశారు. ఇండోర్ స్డేడియంకు తరలింపు.. 19వ తేదీన సర్వే పూర్తి అయిన అనంతరం ఎన్యూమరేటర్లు సర్వే పత్రాలను మండలంలోని అధికారులకు అందజేస్తారు. అయితే అదే రోజు రాత్రి అక్కడి నుంచి హన్మకొండ ఇండోర్ స్టేడియానికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం 2100 కంప్యూటర్ల ద్వారా డాటా ఎంట్రీ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 4వ తేదీ నాటిని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారానికి రూ. 4 ఇవ్వనున్నారు. పల్లెలకు పయనం.. సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న వారు తమ సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో రైళ్లు, బస్సు లు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. నేడు సెలవు.. గ్రీవెన్స్ రద్దు సర్వేను పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిం చినట్లు కలెక్టర్ కిషన్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు, కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వేలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేయాలి. ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యులకు సంబంధించి తగిన రుజువులు చూపించాలి. సర్వేపై సందేహాలు ఉన్నవారు కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నంబర్ 18004252747కు ఫోన్ చేయొచ్చు., లేకుంటే కలెక్టర్ నంబర్ 9000114547కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించవచ్చు. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం ఎలాంటి పారితోషికం ఇవ్వదు. కేవలం వాహన సౌకర్యం, భోజన సదుపాయం కల్పిస్తుంది. ఎన్యూమరేషన్ విధులకు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హాజరుకావాలి. - సురేంద్రకరణ్, డీఆర్వో 700 మంది ఎన్యూమరేటర్లు కావాలి : డీఈఓ విద్యారణ్యపురి : జిల్లాలో ఈనెల 19వ తేదీన చేపట్టనున్న సర్వే కోసం ఇంకా 700 మంది ఎన్యూమరేటర్లు కావాలని డీఈఓ విజయ్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్లోని సీకేఎం, కేఎంసీ, గ్యాబ్రియల్ పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలో చేపట్టనున్న సర్వేకు 700మంది ఎన్యుమరేటర్లు అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు శిక్షణ తరగతులకు హాజరుకాని ప్రైవేటు ఉపాధ్యాయులు ఈనెల18వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ డైట్ కళాశాలలో, దేశాయిపేటలోని నాగార్జున స్కూల్లో, గ్యాబ్రియల్ స్కూల్లో జరిగే శిక్షణకు తరలిరావాలని ఆయన కోరారు. ఎన్యూమరేటర్ విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న సర్వే ఫారాలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల 18, 19న సెలవులు ప్రకటించామన్నారు. సర్వే విధులకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. -
జిల్లాలో అన్ని సంస్థలకూ రేపు సెలవు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు అంతా సిద్ధమైంది. జిల్లా అధికారులు ఈ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 8.75 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేయనున్నారు. దీనికి 32,204 మంది సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం అధికారికంగా సర్వే చేపడుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఆరోజు సెలవు ప్రకటించాయి. జిల్లావ్యాప్తంగా సర్వే చేయనున్న కుటుంబాలను యంత్రాంగం అధికారికంగా గుర్తించింది. మొత్తంమీద 8,75,970 కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వేకు సంబంధించి జిల్లాలో 758 గ్రామ పంచాయతీల పరిధిలో 778 మంది సూపర్వైజర్లు, 238 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను వివరాలు నమోదు చేయడానికి ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సర్వే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రారంభం కానుంది. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించబడిన, పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పోలవరం ముంపులోకి వెళ్లిన గ్రామాల్లో కూడా సర్వే చేయడానికి సిబ్బంది వెళ్తున్నారు. సర్వేకు వెళ్లే ఎన్యూమరేటర్లకు ఆయా మండల కేంద్రాల్లోనే సోమవారం సర్వే ఫామ్లు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో కుటుంబాల వారీగా ప్రభుత్వ స్టిక్కర్లు అంటించడంతో ఎన్ని కుటుంబాలున్నాయో అధికారికంగా తేలింది. వీటి ఆధారంగానే సర్వేను అధికారులు పకడ్బందీగా చేయించనున్నారు. సర్వం బంద్... సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వే జరిగే రోజును ప్రభుత్వం అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. కుటుంబాలుగాా నమోదైన వారు తప్పనిసరిగా సర్వే రోజు తమ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లకు వివరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే మంచిది. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆ కుటుంబ యజమాని ఇస్తే సరిపోతుంది. అలాగే ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను కూడా కుటుంబ యజమాని చెప్పాల్సి ఉంటుంది. సర్వేకు ఉన్న ప్రాధాన్యతతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్బంక్లు, సినిమాహాల్స్, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆరోజు మూతపడనున్నాయి. అలాగే సింగరేణి కార్మికులకు కూడా యాజమాన్యం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. సర్వే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. జిల్లా యంత్రాంగం రెడీ.. సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఈ సర్వేకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశారు. సర్వే ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సింది అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్యూమరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం నగరానికి సంబంధించిన సర్వే బాధ్యతలను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సర్వే ఎలా నిర్వహించాలనే దానిపై ఎన్యూమరేటర్లకు శిక్షణను ఇచ్చారు. అధికారికంగా ఎన్ని కుటుంబాలకు సర్వే నిర్వహించాలనే దానిపై కూడా అధికారులు ఒక అవగాహనకు రావడంతో ఆ మేరకు సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
అయోమయం
నిజామాబాద్ అర్బన్ : సమగ్ర సర్వే విధుల కేటాయింపులలో అ స్పష్టత నెలకొంది. సర్వే కోసం ఉద్యోగులను ఎంపిక చేయడం, వారికి ప్రాంతాలు కేటాయిం చడంలో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల తొమ్మిదిన మొదటిసారిగా ఉద్యోగులందరికీ కుటుంబ సమగ్ర సర్వేపై శిక్ష ణ ఇచ్చారు. రెండవ విడత శిక్షణ ఈ నెల 17న ఉంటుందని, అనంతరం విధులు కేటాయిస్తామని చెప్పారు. దీంతో ఉద్యోగులందరూ ఆది వారం రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి హా జరయ్యారు. నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి కా ర్యాలయ పరిపాలన అధికారి వరకు ఇందులో ఉన్నారు. ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. సర్వే ఒక్క రోజే ఉండటంతో సిబ్బంది కొరత లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, రెండవ విడత శిక్షణలో గందరగో ళం నెలకొంది. ఉద్యోగులు భారీ సంఖ్యలో రా వడంతో విధుల కేటాయింపులలో అధికారులు విఫలమయ్యారు. ఉద్యోగులు రాగానే మొదట ఓ రిజిష్టర్లో, శిక్షణ ముగిసిన అనంతరం విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరో రిజిస్టర్లో సంతకం చేసేందుకు ఏర్పాటు చేశా రు. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది శిక్షణకు హాజరైనట్టు మాత్రమే సంతకం చేశారు. రెండవ సంతకం చేయకపోవడంతో వారంతా గైర్హాజరయ్యారంటూ విధులు కేటాయించలేదు. దీంతో వారు ‘‘మా డ్యూటీ ఎక్క డ’’ అంటూ అధికారుల వెంట పడాల్సిన పరిస్థి తి ఏర్పడింది. ఇదీ పరిస్థితి నగరంలోని బాలికల ఐటీఐలో దాదాపు రెండు వందల మంది ఉద్యోగులకు ఎన్యూమరేటర్లు గా శిక్షణనిచ్చారు. ఆర్డర్లు అందజేయలేదు. దీంతో వీరంతా ఆందోళన చెందారు. ‘‘ఆర్డర్లు ఇస్తాం రమ్మన్నారు. తీరా మీరు గైర్హాజరు అ య్యారు, మెమోలు జారీ చేస్తామంటూ’’ అధికారులు హెచ్చరించారని మరి కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు విడతలు గా శిక్షణకు హాజరయిన తమకు మోమోలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జిల్లాలోని చాలా మండలాలలో ఇదే పరిస్థితి నెలకొందని సమా చారం. భిక్కనూర్, నందిపేట మండలాలలో, బాన్సువాడ డివిజన్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. భిక్కనూర్ మండల అధికారులైతే రాత్రి తొమ్మిది గంటలకు ఎన్యూమరేటర్లకు ఫోన్ చే స్తూ మీకు విధులు కేటాయించామని పేర్కొం టున్నారు. కానీ ఎక్కడ అనేది స్పష్టం చేయడం లేదు. ఫోన్ కోసం వేచి చూడాలని మాత్రం సూచించారు. దీంతో తమకు అసలు విధులు కేటాయిం చారో లేదో తెలియక, ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలనే అయోమయంలో పడ్డామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రం నుంచి చాలా మంది ఉద్యోగులు 50 కిలో మీటర్ల దూరం వరకు ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు. అకస్మాత్తుగా అధికారులు ఫోన్ చేస్తే ఎలా వెళ్లేదని కలవర పడుతున్నారు. -
ప్రీ-సర్వే... గందరగోళం
ముషీరాబాద్ జోన్ బృందం : తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ఆదిలోనే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో మొదటి రోజు ఇంటింటికీ వెళ్ళి సర్వే ఫారాలను అందించే క్రమంలోనే ఇలాంటి అడ్డంకులు ఎదురైతే 19వ తేదీన సర్వే పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా సర్వే ఫారాలు కావాల్సినన్ని అందించకపోవడం, సకాలంలో రాకపోవడం, ఇంటింటికీ అందించే స్టిక్కర్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్యూమరేటర్లకు కేటాయించిన అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజరు కావడంతో ఫారాల పంపిణీ నత్తనడకన సాగింది. మొదటిరోజు కేవలం సగం ఫారాలే పంపిణీ చేశారు. గాంధీనగర్లో 160మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజర్.. అసోసియేట్ ఎన్యూమరేటర్లు సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఈ రోజు హాజరు కావాల్సిన 160 మంది గైర్హజయ్యారని దీనివల్ల ఇబ్బందులు తప్పవని గాంధీనగర్ డివిజన్ 93-వార్డు సర్వే నోల్ అధికారి సుదర్శన్ తెలిపారు. సమగ్ర సర్వేకు డివిజన్ 93-వార్డులో 56 మంది ఎన్విరేటర్లు, 6గురు క్లస్టర్ ఇన్చార్జిలు ,40 మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో క్లస్టర్లకు, ఎన్యూమరేటర్లకు, అసోసియేట్ ఎన్యూమరేటర్లకు సర్వే బుక్స్ను, స్టిక్కర్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని అప్పుడే ఈ సర్వే విజయవంతం అవుతుందన్నారు. ఆరోరా కళాశాలకు చెందిన 160 మంది అసోసియేట్ క్లస్టర్లు రావాల్సి ఉండగా రాలేదన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్కు ఫోన్ చేసిన వారు ఏలాంటి స్పందన లేదన్నారు. దీనికి రేపు కూడా హజరు కాకపోతే ఇక్కడ నిర్వహించే సర్వే విజయవంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జీలు, ఎన్విరేటర్లు అనంతరాములు, విజయరావు, సుధాకర్, మంజులసింగ్, సాయినాథ్, రాజేష్, సదానంద్, వేణుగోపాల్రావు, పద్మశ్రీ పాల్గొన్నారు. 6 బస్తీలను వదిలేసిన ఎన్యూమరేటర్లు ఈ నెల 19వ తేదీన జరుగనున్న సమగ్ర సర్వేలో భాగంగా ఆదివారం ముషీరాబాద్, భోలక్పూర్ డివిజన్లల్లో నోడల్ అధికారి, క్లస్టర్లు, ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ వార్డు నెంబరు -91 విషయానికొస్తే ఆరుగురు క్లస్టర్లు, 58 మంది ఎన్జుమలేటర్లు , 190 మంది అసోసియేట్ ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఉదయం 7 గంటలకు వచ్చిన 58 ఎన్జుమలేటర్లు సహాయకులు సకాలంలో రాకపోవడంతో చాలాసేపు కమ్యూనిటీహాల్లోనే కూర్చున్నారు. దాదాపు 11 గంటల తర్వాత ప్రారంభమైనప్పటికి సరిపడా చెక్ లిస్టు పత్రాలు పరిపోకపోవడంతో సహాయకులు నచుడుకుంటూ కమ్యూనిటీహాల్ వద్దకు వచ్చి పత్రాలను తీసుకెళ్లారు. భోలక్పూర్లో... భోలక్పూర్లో 19 బస్తీలున్నప్పటికీ బ్యాంక్ కాలనీ, సంజీవయనగర్, టి.అంజయ్యనగర్, భోలక్పూర్ హౌస్, వెంకటేశ్వర్నగర్ తదితర బస్తీల్లో ఎన్జుమలేటర్లు అసలు తిరగలేదు. డివిజన్లో 67 మంది ఎన్యూమరేటర్లు, 5 గురు క్లస్టర్లు, 200మంది వరకు అసోసియేట్ ఎన్యూమరేటర్లు పాల్గొన్నప్పటికీ చాలా బస్తీల్లో పర్యటించకుండా, చాలా చోట్లల్లో స్టిక్కర్లు అతికించకుండా వదిలేశారు. ముస్లిం ఇళ్లల్లో కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికి ఒకే పత్రాన్ని ఇచ్చారు. ఉర్దూలో పత్రాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డ ముస్లింలు భోలక్పూర్లో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. అయితే చెక్లిస్టు పత్రాలు తెలుగు, ఇంగ్లీషులో మాత్రమే ఉన్నాయి. భోలక్పూర్లోని ముస్లిం బస్తీల్లో పర్యటించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన పత్రాలను చూసి చాలా మంది ముస్లింలు ఏమీ రాయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయారు. నోడల్ అధికారిపై కార్పొరేటర్ ఆగ్రహం భోలక్పూర్ డివిజన్లో చెక్లిస్టు పత్రాల పంపిణీ గందరగోళంగా మారింది. చాలా బస్తీలను వదిలేశారని, తన ఇంటికే ఇంకా రాలేదని స్థానిక కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ అన్నారు. అయితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న భోలక్పూర్లో చెక్లిస్టు పత్రాలు కేవలం ఇంగ్లీషు, తెలుగులో ఉండటం, ఉర్దూలో లేకపోవడం, ఆరు బస్తీలను వదిలేయడం పై కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ నోడల్ అధికారి అశ్వినికుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూలో పత్రాలు లేవని, ముస్లింల కోసం ఉర్దూలో తెప్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, జోనల్ కమిషనర్కు మెస్సేజ్ చేశామని కార్పొరేటర్ తెలిపారు. అంతేకాదు పత్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసీ, ఓసీ కులస్తులకే మాత్రం నమోదు చేసే విధంగా ఉందని, ముస్లింల కోసం ‘బీసీ’అని లేదని, బీసీ అని ఉంటే దాని పక్కనే ముస్లిందరం బీసీ (ఈ) అని నమోదు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. అడిక్మెట్ డివిజన్లోని అడిక్మెట్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన ఫారాల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 7 గంటలకు అధికారులు వచ్చినప్పటికీ సరిపడా ఫారాలు లేకపోవడంతో కొంతమంది ఎన్యూమరేటర్లు మధ్యాహ్నం రెండు తరువాత పంపిణీ చేయడానికి వెళ్ళారు. ఒక ఎన్యూమరేటర్కు 40 ఇళ్ళను కేటాయించగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉండటం, ఇంటి నెంబర్లు గుర్తించలేకపోవడంతో కొంతమంది 15 నుంచి 20 ఇళ్ళకు మాత్రమే ఫారాలను పంపిణీ చేశారు. వారికి ఇంటి నెంబర్లు కనుక్కోవడం కష్టతరమైంది. వారు స్థానికులు కాకపోవడం, మహిళా ఉద్యోగులు కావడంతో ఇబ్బందులెదురొన్నారు. ఇంటి నెంబర్ల ప్రకారం ఫారాలను అందజేయడంతో ఒక ఇంటినెంబరుపై ఒక అపార్ట్మెంట్ ఉండటం, అందులో నలబై యాభై ఫ్లాట్లు ఉండటంతో ధరఖాస్తు ఫారాలు లేక పంపిణీ జరగలేదు. పైగా తనకు కేవలం 40 ఇళ్ళనే కేటాయించారని, ఆపై కేటాయించిన వాటిని మాత్రం నేను సర్వే చేయమని ఎన్యూమరేటర్లు మొరాయించారు. అడిక్మెట్ డివిజన్లోని మార్క్స్ భవన్, మేడిబావి బస్తీ తదితర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివశిస్తున్నారు. అయితే వారికి తెలుగు ఫారాలు పంపిణీ చేయడంతో వాటిని ఎలా పూర్తి చేయాలో వారికి అర్థం కావడం లేదు. కవాడిగూడ డివిజన్లో కేటాయించిన ఎన్యూమరేటర్లకు సహాయక ఎన్యూమరేటర్లు సరైన సమయానికి రాకపోవడం కారణంగా సుమారు మూడు గంటలకు పైగా ఎన్యూమరేటర్లు ప్రీ-సర్వేను ప్రారంభించడం ఆలస్యమైంది. ఎన్యూమరేటర్లే స్థానికులను సహాయకులుగా అప్పగించిన పనిని పూర్తి చేశారు. ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కరపత్రాలు, స్టిక్కర్లు సరిపడా అందకపోవడంతో డివిజన్ వ్యాప్తంగా పూర్తి కావాల్సిన ప్రీ-సర్వే పూర్తి కాలేకపోయింది. కరపత్రాలు అధిక భాగం తెలుగులోనే ఉండటంతో ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మాట్లాడి, చదివే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం పూట ప్రీ-సర్వే పూర్తయిన తరువాత ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరే షన్ కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. -
సమగ్ర కుటుంబ సర్వేలో ఏముంది?
సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు. సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు... ► ఆధార్ కార్డు ► వాహన రిజిస్ట్రేషన్ కార్డు ► ఇంటి అసెస్మెంట్, ఇంటి పన్ను రశీదు ► కరెంట్ బిల్లు ► ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం ► బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం ► కులం, జనన ధ్రువీకరణ పత్రం ► విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి) ► వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్) ► వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు ► వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం ► ఓటర్ ఐడీకార్డు, పాన్కార్డు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. రేషన్కార్డు ప్రస్తావన లేదు ప్రభుత్వం బేస్లైన్ సర్వే చేపడుతుందనగానే రేషన్కార్డుల ఏరివేత కోసమే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే నిజానికి సర్వేలో ఎక్కడా రేషన్కార్డుకు సంబంధించిన వివరాలు అడగడం లేదు. బోగస్కార్డుల ఏరివేతకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, సర్వేతో రేషన్కార్డుకు ఎలాంటి సంబం ధం లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే బోగస్ కార్డులు ఉన్న వారు స్వచ్ఛందంగా వాటిని అధికారులకు అందజేయాలని కోరారు. లేదంటే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్డుల ఏరివేత చేపట్టి అనర్హులుగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంటికి నంబర్.. ప్రభుత్వ స్టిక్కర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేస్లైన్ ఇంటింటి సర్వేలో ఏ ఒక్క కుటుంబం, ఇల్లు తప్పిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సర్వే కోసం వెళ్లిన ప్రతీ ఇంట్లో సర్వే పూర్తికాగానే ఆ ఇంటికి ప్రభుత్వ చిహ్నంతో ఒక స్టిక్కర్ అతికించడంతో పాటు సర్వే సందర్భంగా కేటాయించే నంబరును గోడపై రాస్తారు. ప్రస్తుతం సర్వే ఫారంలో కేటాయించిన నంబరు ఆ కుటుంబానికి సంబంధించి శాశ్వత నంబరుగా(యూనిక్ నంబరు) కేటాయిస్తారు. మరిన్ని విషయాలు.. ఇంటివద్దే ఉండాలి : సర్వే రోజు కుటుంబ యజమాని సహా సభ్యులందరూ.. ఇంటివద్దనే అందుబాటులో ఉండి అధికారులకు పూర్తిసమాచారం అందజేసి సహకరించాలి. అవసరమైన వాటి కోసం సంబంధిత రుజువు పత్రాలు చూపిస్తే సరిపోతుంది. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉంటే ఆ వివరాలు కూడా సర్వేలో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి వద్ద లేనివారి కోసం : ఆస్పత్రుల్లోని ఇన్పేషెంట్లు, వారి సహాయకులు, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సర్వేలో మినహయింపు ఇచ్చారు. వారి వివరాలు కుటుంబ సభ్యులు నమోదు చేయించవచ్చు. అయితే స్థానికంగా లేని వారికి సంబంధించిన రుజువులు చూపాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో చేరిన కార్డు, హాస్టల్, కళాశాల అడ్మిషన్ కార్డు వంటివి చూపించాలి. రెండు కుటుంబాలు ఉంటే : ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఫారాలు విడిగా పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటున్నట్లయితే వారికి సంబంధించి రెండు ఫారాలు విడివిడిగా నమోదు చేసి, ఆ కుటుంబాలకు విడివిడిగా నంబర్లు కేటాయిస్తారు. సొంత ఇంట్లో అయితే మంచిది : ప్రజలు సాధ్యమైనంత వరకు తమ సొంత గ్రామాల్లోనే వివరాలు నమోదు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సర్వే సందర్భంగా అధికారులకు ఇచ్చే ఆధార్, ఇతర వివరాలు వేరే చిరునామాతో నమోదు చేసుకున్నవైనా ఇబ్బంది లేదంటున్నారు. ఆ రోజున ప్రభుత్వం సెలవు దినంగా కూడ ప్రకటించినందున సాధ్యమైనంత వరకు స్వగ్రామాల్లోని సొంత ఇంట్లోనే నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విభాగం-ఎ- గుర్తింపు వివరాలు ముందుగా ఎన్రోల్ మొంట్ బ్లాక్ నంబరు, నామమాత్రపు ఇంటి నంబరు, సర్వే ఫార్మాట్ నంబర్, జిల్లా పేరు, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ పేరు, మండలం, మునిసిపాలిటీ, ఆవాసం, వార్డు, డివిజన్ ఇంటి నంబరు, నివసిస్తున్న ప్రదేశం, వాడపేరు, కాలనీపేరు, ఇంటిలో ఉన్న కుటుంబాల సంఖ్య నమోదు చేసుకుంటారు. విభాగం-బి- కుటుంబం వివరాలు ఇందులో కుటుంబ యజమాని పేరు, ఇంటిపేరు, పూర్తి పేరు, తల్లి/తండ్రి/భర్త పేరు, కుటుంబంలోని సభ్యుల సంఖ్య, మతం, సామాజిక వర్గం, కులం, మాతృభాష, వంటగ్యాస్ కనెక్షన్ (ఉంది/లేదు), గ్యాస్ కంపెనీ పేరు, వినియోగదారుడి సంఖ్య, మొబైల్ ఫోన్ నంబరు, ఆదాయ పన్ను చెల్లించే కుటుంబమా(అవును/కాదు). అనాథలు ఉంటే వారి వివరాలు.. అనాథలు ఎక్కడ నివసిస్తున్నారు, అనాథ స్థితి, సంచార కుటుంబాలు, జాతులవారు అయితే వారికి శాశ్వత నివాసం వేరేచోట ఉందా(ఉంది/లేదు), గ్రామం, మండలం, జిల్లా పేరు, ఎంతకాలం నుంచి ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు. విభాగం-సి- నివాస స్థితి నివాస స్థితిలో ఇంటికప్పు రకం, గదుల సంఖ్య(వంటగది కాకుండా), ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా( ఉంది/లేదు), ఇంటి స్థలం ఎక్కడైనా ఉందా( ఉంది/లేదు), ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధిపొందారా(అవును/కాదు), ఇంటి నిర్మాణం జరిగిన సంవత్సరం, ఇంటికి మరుగుదొడ్డి, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఉందా..? విద్యుత్ మీటరు నంబరు. విభాగం-డి - కుటుంబ సభ్యుల వివరాలు ఈ విభాగంలో కుటుంబ యజమాని మొదలుకుని కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారు. యజమాని పేరు, సభ్యుల పేర్లు, యజమానితో గల సంబంధం, లింగము, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి, విద్యార్హతలు, విద్యార్థులైతే చదువు వివరాలు, బ్యాంక్, పోస్టాఫీస్ అకౌంట్, శాఖ పేరు, బ్యాంక్, బ్రాంచ్ పేరు, ఉద్యోగం(ఉన్నది/లేదు), ఉద్యోగం రకం, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్దారు, సామాజిక పింఛన్ దారు, ప్రధానమైన వృత్తి, మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉందా.. ఆధార్ కార్డు ఐడీ నంబరు వంటి వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. విభాగం- ఇ - వికలాంగుల వివరాలు ఇందులో వికలాంగుల పేరు, ఎలాంటి వైకల్యం ఉంది. సదరం సర్టిఫికెట్ ఉందా(ఉంది/లేదు), ఉన్నట్లయితే ఐడీ నంబరు, వైకల్య శాతం వంటి వివరాలు సర్వే అధికారులకు చెప్పాలి. విభాగం - ఎఫ్లో.. ఈ విభాగంలో కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పేరు, వ్యాధిరకం వంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ వివరాలు చెబితే సరి ► ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు ► కులం ► కుటుంబ సభ్యుల ఆధార్కార్డుల వివరాలు, నంబరు ► వంటగ్యాస్ కనెక్షన్ వివరాలు ► మొబైల్ నంబరు ► చదువుకున్న వారైతే వయసు ధ్రువీకరణ పత్రం ► బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా నంబర్లు ► ఉద్యోగులైతే ఉద్యోగం, జీతం వివరాలు ► పింఛన్ పొందుతున్న వారైతే అందుకు సంబంధించిన వివరాలు. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ చూపాల్సి ఉంటుంది ► విద్యుత్ కనెక్షన్ ఉంటే నంబరు తెలియజేయాలి ► కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వివరాలు చెప్పాలి ► తాత్కాలిక సంచార కుటుంబం అయితే ఆ వివరాలు ఇవ్వాలి ► 18ఏళ్లు నిండితే ఓటరు కార్డు వివరాలు అందజేయాలి సర్వే సమయంలో భూములు, వాహనాల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్లో వాటిని అమ్మాలనుకున్నా.. వారసులకు ఇవ్వాలనుకున్నా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారులు సర్వే కోసం వచ్చినప్పుడు ఇంటి యజమాని అందుబాటులో ఉండి వాస్తవ సమాచారం ఇవ్వాలి ఇచ్చే సమాచారంలో అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, సమాచారం పూర్తిగా వాస్తవమని చెబుతూ సంతకం చేయాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పత్రం సర్వే అధికారులు సర్వే ఫారంలో ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు ఉన్న ప్రొఫార్మాలో అడిగిన వివరాలకు సంబంధించి ఇంటి యజమాని/ కుటుంబ సభ్యులు అందజేసిన వివరాలన్నీ వాస్తవమేనని, ఒకవేళ తాము ఇచ్చిన సమాచారంలో తప్పులు/ అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తూ కుటుంబ యజమాని సంతకం/వేలిముద్ర దరఖాస్తు ఫారం చివరలో చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్యూమరేటర్, పర్యవేక్షణాధికారి ఫారం కింది భాగంలో వివరాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి హోదా, ఇతర వివరాలతో పాటు మొబైల్ నంబరు వేస్తారు. -
ఒక్క ఇల్లూ వదలొద్దు
- సర్వే రోజు వచ్చే కుటుంబమూ నమోదు - 100 శాతం లక్ష్యంగా సర్వే చేయండి - ప్రత్యేకాధికారి పార్థసారథి ముకరంపుర : ఒక్క ఇల్లు కూడా వదలకుండా 100 శాతం సర్వే పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్, సర్వే జిల్లా ప్రత్యేకాధికారి పార్థసారధి అన్నారు. మండల ప్రత్యేకాధికారులు సంబంధిత మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్వేపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకాధికారులు తమ మండలాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. నోషనల్ నంబర్లు వేసినప్పుడు తాళం వేసి ఉండి సర్వే రోజున కుటుంబసభ్యులు ఉన్నట్లయితే ఆ ఇంటికి నంబర్ వేసి సర్వేలో కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గస్థాయి అధికారులు, మండల ప్రత్యేకాధికారులు 17 నుంచి నియోజకవర్గాల్లో ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేకాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 18న రిపోర్టు చేయాల్సిందే : కలెక్టర్ ఎన్యుమరేట్లు 18న మధ్యాహ్నం 2 గంటల వరకు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరుకు రిపోర్టు చేయాలని కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య ఆదేశించారు. గ్రామంలో పర్యటించి అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. 19న ఉదయం 7 గంటలకు మొదటి ఇంటిలో సర్వే మొదలు పెట్టాలని చెప్పారు. సర్వే పూర్తయ్యాక అదే రోజు ఫారాలను సంబంధిత పర్యవేక్షకులకు అందజేయాలని ఆదేశించారు. 17న డీఆర్డీఏ పీడీ నుంచి సర్వే ఫారాలను ఆర్డీవోలు తీసుకుని తహశీల్దార్లకు అందజేయాలన్నారు. ఎన్యుమరేటర్లు తక్కువగా ఉంటే ప్రైవేట్ టీచర్లను, విద్యార్థులను సర్వే కోసం నియమించుకోవాలని సూచించారు. నోషనల్ నంబర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే సర్వే తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకాధికారి పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కుటుంబ సర్వే ఎన్యుమరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. వాస్తవ సమాచారం సేకరించాలన్నారు. సంక్షేమ పథకాల ప్రారంభానికి ప్రణాళికల కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సంచార జాతులు, అనాథల వివరాలు, భిక్షాటన చేసే వారి వివరాలు తప్పకుండా సేకరించాలన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సర్వే రోజున ఇళ్లలో ఉన్న వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకోవాలని, లేని వారి పేర్లు నమోదు చేయవద్దని చెప్పారు. 19న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల్లో 30 కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లాట్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ జయచందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,74,319 ఇళ్లు ఉండగా సర్వే కోసం నోషనల్ నంబర్ల ప్రకారం 11,80,254 ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 43,276 మంది ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయిందని 1356 గ్రామ పంచాయతీ సమన్వయ అధికారులను నియమించామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు రాంనగర్ : సమగ్ర సర్వే కోసం 18, 19 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య తెలిపారు. ఉపాధ్యాయులు ఈ నెల 18న వారివారి మండల కేంద్రాల్లో తహశీల్దార్కు రిపోర్టు చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన అన్ని బస్సులను వారి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సర్వేకు సహకరించాలి : ట్రస్మా జిల్లాలో జరిగే సమగ్ర సర్వేకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సహకరించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు కోరారు. పాఠశాలల బస్సులను మండల తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
సర్వేమయం
‘సర్వే’త్రా అదే చర్చ.. 19న జరిగే సమగ్ర సర్వేపై ఇంటా బయట ఇదే టాపిక్. అధికారులు ఏం అడుగుతారు?, ఏం చెప్పాలి?, ఎన్నో అనుమానాలు.. ఇంకొన్ని సందేహాలు.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేసేందుకు అధికారులే ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులు గడపగడపకూ రానున్నారు. గ్రేటర్ పరిధిలో సమగ్ర సర్వే కోసం జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్షమందిని సర్వే కోసం వినియోగిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేషన్ బ్లాక్కు ఇద్దరు ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ దాదాపు 30 ఇళ్లను సర్వేచేయాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 29 వేల మంది విధుల్లో పాల్గొననున్నారు. వీరికి సహాయకులుగా కళాశాలలకు చెందిన దాదాపు 70 వేల మంది విద్యార్థులను నియమించారు. దాదాపు 1,500 మంది క్లస్టర్ ఇన్చార్జీలుగా, 172 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా దాదాపు లక్షమంది సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొననున్నారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆది,సోమవారాల్లో నమూనా సర్వే, 19న ఒరిజినల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం వారు ఆదివారం నుంచే విధుల్లో చేరనున్నారు. పర్యవేక్షణ ఇలా.. గ్రేటర్లోని ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాక్కు ఇద్దరు ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్కు సహాయకులుగా నలుగురైదుగురు అసిస్టెంట్లు ఉంటారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా తీసుకున్నారు. ఎన్యూమరేటర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి, అత్యవసరంగా చర్యలు తీసుకునేందుకు పైస్థాయిలో నోడల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఇన్చార్జీలుంటారు. వీరి పనితీరును అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్ల పర్యవేక్షిస్తారు. వీరితోపాటు కమిషనర్ సైతం సర్వేతీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడతారు. సర్వేకు సహకరించండి.. గ్రేటర్లోని ప్రజలంతా 19న ఇళ్ల వద్ద ఉండి సర్వేకు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆది, సోమవారాలతోపాటు మంగళవారం కూడా ఎన్యూమరేటర్లు ఇళ్లకు వస్తారన్నారు. అనుమానాలను నివృత్తి చేయండి: సీపీఐ సాక్షి, సిటీబ్యూరో: సర్వేకు ఐదు రోజులు కేటారుయిం చాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీఐ కార్యదర్శి సుధాకర్ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేపై ప్రజలు భయూందోళనలు వ్యక్తమవుతున్నా నివృత్తి చేయులేక పోతున్నారని పేర్కొన్నారు. బోగస్ రేషన్ కార్డులు ఎత్తి వేయూలన్న ప్రభుత్వ నిర్ణయుం వుంచిదే అయినా ఈ సర్వేపై ప్రజల్లో ఎన్నో అనువూనాలు నెలకొన్నాయన్నారు. నేడు, రేపు నమూనా సర్వే.. ఆదివారం: ఎన్యూమరేటర్లు ఇంటింటికీ కరపత్రాలు, చెక్లిస్ట్లను పంపిణీ చేస్తారు. అవసరమైన సమాచారాన్ని సమకూర్చుకోవాలని సూచిస్తారు. స్టిక్కర్ను డోర్కు అంటిస్తారు. ఇంటిని సందర్శించినట్టుగా ఎన్యూమరేటర్లు ప్రీ విజిట్-1 గడిలో టిక్ చేస్తారు. సోమవారం: ఇంటింటికీ వెళ్లి అన్నీ సమకూర్చుకున్నదీ లేనిదీ విచారిస్తారు. ఆపై ప్రీ విజిట్-2 గడిపై టిక్ చేస్తారు. సంశయాలుంటే తీరుస్తారు. మంగళవారం: సమగ్ర సర్వే.. ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేస్తారు. ఆపై యజమాని సంతకాలతో కూడిన ఫారాలను స్వీకరిస్తారు. ఆదివారం సాయంత్రం 7 వరకు ఎవరి ఇంటికైనా ఎన్యూమరేటర్లు/సహాయ ఎన్యూమరేటర్లు రాకపోతే జీహెచ్ఎంసీ కాల్సెంటర్కు (040- 21 11 11 11) ఫోన్ చేయవచ్చు. దీంతో సోమవారం సదరు ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. కరపత్రాలపై, ఇళ్లకు అంటించే స్టిక్కర్పై ఎన్యూమరేటర్ ఫోన్ నంబరు ఉంటుంది. -
వాస్తవాలు చెప్పండి..
వర్ని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న సామాజిక కుటుంబ సర్వేపై ఎలాంటి భయాందోళనలు వద్దని, ఎన్యూమరేటర్లకు వాస్తవాలు తెలియజేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ సూచించారు. గురువారం మండలంలోని అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్వేపై నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలుత స్థానికులకు సర్వేపై ఎంత వరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు.అంశాల వారీగా చెప్పాల్సిన వివరాలు, ఎన్యూమరేటర్లకు చూపించాల్సి న ధ్రువపత్రాల గురించి వివరించారు. వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారం తమ వద్ద ఉందని, తప్పుగా చెబితే విచారణలో వెల్లడవుతుందన్నారు. ఆధార్ కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతా నంబర్ల ద్వారా లబ్ధిదారులు నేరుగా ప్రభుత్వ సబ్సిడీని, విద్యార్థులు స్కాలర్షిప్ను పొందవచ్చని సూచిం చారు. దళారుల సమస్య ఉండదన్నారు. గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఏజెన్సీలు పూర్తిజాబితాను అందచేశాయన్నారు. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్లు, రైతులు వ్యవసాయభూమి వివరాలు, ఏ సర్వే నంబరు ఎం త భూమి ఉందో పూర్తిగా చెప్పాల న్నారు. ఎన్యూమరేటర్లకు ధ్రువపత్రాలు ఇస్తే, వారు సంబంధించిన నంబర్ న మోదు చేసుకుని తిరిగి ఇచ్చేస్తారన్నారు. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్లు ఇవ్వాలనే ప్రచారం జరుగుతోందని పలువురు అ డుగగా, కలెక్టర్ పైవిధంగా చెప్పారు. 19న అందరూ ఇంట్లో ఉండాలి ఈ నెల 19న అందరు ఇంట్లో ఉండాలని, దూర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థుల గుర్తింపు పత్రాలు లేదా హాస్టల్ ఫీజు చెల్లింపు రశీదు తెచ్చుకోవాలని సూచించారు. వీ ఆర్ఏలు అందుబాటులో ఉండి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ఇళ్ల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేపై గ్రామస్తుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో గ్రామసర్పంచ్ రామాగౌడ్, ఉపసర్పంచ్ శంకర్, సింగిల్ విండో చైర్మన్ పత్తి రాము, బోధన్ ఆర్డీవో శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు. -
వికలాంగులు, అంధులకు ఎన్యుమరేటర్లుగా విధులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహణ ఏర్పాట్లలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సిన ఎన్యుమరేటర్ల ఎంపిక అస్తవ్యస్తంగా జరిగింది. వికలాంగులకు, ముఖ్యంగా చూపులేని వారికి కూడా ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేశారు. నామమాత్రంగా చదువు వచ్చే కొందరు నాలుగో తరగతి సిబ్బందికి కూడా ఈ విధులు అప్పగించారు. ఈ ఎన్యుమరేటర్లు ఒక్కో కుటుంబానికి సంబంధించి 80కిపైగా అంశాల సమాచారం సేకరించాలి. సమర్థవంతమైన ఎన్యుమరేటర్లు సర్వే చేస్తేనే సమగ్ర సమాచారం వస్తుంది. సర్వే పకడ్బందీగా జరుగుతుంది. కానీ సర్వేలో ఎంతో కీలకమైన ఈ ఎన్యుమరేటర్ల ఎంపిక ఇష్టారాజ్యంగా జరగడంతో సమగ్ర సర్వే ప్రశ్నార్థకంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 52 మండలాల పరిధిలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలో జిల్లాలో 6.96 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ సర్వే నిమిత్తం వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ముందస్తుగా సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు 7.47 లక్షల కుటుంబాలున్నట్లు తేలింది. ఈ సర్వేను నిర్వహించేందుకు అధికారులు 30,800 మంది ఎన్యుమరేటర్లను గుర్తించారు. అలాగే సుమారు 3 వేల మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్యుమరేటర్ల గుర్తింపులో అధికారుల నిర్లక్ష్యానికి పైన పేర్కొన్న ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ఎంపిక జరిగిందిలా.. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఈ సర్వే విధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు సిబ్బందిని కూడా ఈ సర్వేలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జాబితాను ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలందాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరు ఈ సర్వే విధులు సమర్థవంతంగా నిర్వహించగలరా? లేదా? అనే అంశాలేవీ పట్టించుకోకుండానే ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు, సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. ఈ జాబితా మేరకు రెవెన్యూ అధికారులు ఎన్యుమరేటర్లుగా గుర్తించారు. ఈ మేరకు శిక్షణ తరగతులకు రావాలని వారికి సర్వేకు సంబంధించిన లేఖలను పంపారు. ఈ సర్వేలో అనేక క్లిష్టమైన అంశాలుండటంతో అనేక మంది సిబ్బంది అవాక్కయ్యారు. తమ పరిస్థితులను వివరించడంతో అధికారులు నాలుక కరుచుని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్వే నుంచి మినహాయింపు ఇవ్వండి.. - వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వే విధుల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎల్.రాజసమయ్మ, ఎ.నారాయణలు పేర్కొన్నారు. అంగ వైకల్యంతో ఒకేరోజు 25 కుటుంబాలు తిరిగి సర్వే చేయడం ఇబ్బందిగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. -
సర్వేకి సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న గ్రేటర్లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక ఇంటింటి) సర్వేకు జీహెచ్ఎంసీ ప్రణాళికను సిద్ధం చేసింది. జనగణన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా దీన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఎన్యూమరేటర్లను నియమించనున్నారు. వీరి పనితీరును సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు వీరిపైన క్లస్టర్ సూపర్వైజర్లను..వారి పైన వార్డు సూపర్వైజర్లను నియమించాలని నిర్ణయించారు. వార్డు సూపర్వైజర్లే నోడల్ అధికారులుగానూ వ్యవహరించనున్నారు. వీరి వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించారు. నోడల్ ఆఫీసర్లపైన డిప్యూటీ కమిషనర్లు/అడిషనల్ కమిషనర్లు/ జోనల్ స్థాయి కమిషనర్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. వీరికి ఎప్పటికప్పుడు తగిన సూచనలిచ్చే బాధ్యతలను జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్వర్తిస్తారు. శుక్రవారం నుంచి వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25-30 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. మొత్తం 20వేల మంది ఎన్యూమరేటర్ల సేవలను వినియోగించుకుంటారు. వీరు తమకు సహాయకులుగా ఎన్జీఓలు, కళాశాల విద్యార్థులు తదితరులను నియమించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్కో ఎన్యూమరేటర్ ఐదుగురి వరకు నియమించుకోవచ్చు. వారికి తగిన శిక్షణనిచ్చి, సాయం తీసుకుంటారు. దాదాపు రెండువేల మంది క్లస్టర్ సూపర్వైజర్లుగా, 250 మంది నోడల్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి సైన్యం వస్తే వారి సేవలనూ వినియోగించుకుంటారు. ఎన్యూమరేటర్లు.. వారి సహాయకులు వెరసి దాదాపు లక్షమంది విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. సర్వే 19వ తేదీన అయినప్పటికీ, 18వ తేదీ నుంచే ఎన్యూమరేటర్లు తమ పని ప్రారంభించాలని నిర్దేశించారు. తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడం.. ప్రజలకు ముందస్తుగానే సమాచారం ఇవ్వడం తదితర పనులు చేయనున్నారు.ఈమేరకు సర్వేకు సంబంధించి వివిధ స్థాయిల్లోని అధికారులతో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లు గురువారం సమావేశం నిర్వహించారు. దీని నిర్వహణపై సూచనలిచ్చారు. -
19 నుంచి పకడ్బందీగా ఇంటింటి సర్వే
- 25 నుంచి 30 ఇళ్లను ఒక సెక్టార్గా చేయాలి - అధికారులు నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా.. - దళితుల భూ పంపిణీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ సిద్దిపేట రూరల్ : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఆయా శాఖల అధికారులచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలను సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 25 నుంచి 30 ఇళ్లను గ్రూపులుగా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్ను నియమించాలన్నారు. ఎన్యూమరేటర్లుగా పని చేయడానికి పోలీస్ సిబ్బందితో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్లదేన్నారు. ఈ కార్యక్రమం 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలన్నారు. ఇంటింటి సర్వేలో కుటుంబ సభ్యుల వాస్తవ పరిస్థితులకు మాత్రమే తెలియజేయాలన్నారు. ఆ ఒక్క రోజు ఏ అధికారి విధులకు హాజరుకాకపోయినా, సర్వేలో నిర్లక్ష్యం వహించినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే దళితుల భూ పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 9 గ్రామాల ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో 5 గ్రామాల్లో దళితులందరికీ భూములున్నట్లు గుర్తించామన్నారు. మరో నాలుగు గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూములేవని వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల సక్రమంగా గుర్తించాలని, గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పత్రికల్లో వచ్చినట్లయితే తహశీల్దార్, ఆర్ఐతో పాటు సంబంధిత అధికారులను సైతం సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. మొదటి దశలో కుటుంబానికి ఎలాంటి భూమిలేని వారిని గుర్తించి పంపిణీ చేస్తారని, రెండో దశలో కుటుంబానికి మూడు ఎకరాలకు తక్కువగా భూమి ఉన్న వారిని పంపిణీ చేస్తామని తెలిపారు. వీటికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎలాంటి ఆటంకాలు లేకుంటే ఆగస్టు 15న పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీఓ బాల్రాజు, తహశీల్దార్ ఎన్వై గిరితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.